వీక్షకులు
- 1,009,380 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.2 వ భాగం.2.6.23.
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.4v వ భాగం.1.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0 .1 వ భాగం.1.6.23.
- డా.ఉప్పలధడియం మొలిపించిన హైకూ’’ విత్తనం’’
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.4v వ భాగం.1.6.23.
- శ్రీ రంగ శతకం
- బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.11 వ చివరి భాగం.31.5.23.
- మురారి ఆనర్ఘ రఘవం. 3 వ భాగం.31. 5.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (502)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,077)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (516)
- సినిమా (375)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: June 2022
డా.కే.ఎన్.కేసరి గారి ముచ్చట్లు.3వ భాగం
డా.కే.ఎన్.కేసరి గారి ముచ్చట్లు.3వ భాగం
Posted in ఫేస్బుక్
Leave a comment
సహస్ర చంద్రదర్శనం, సరసభారతి సాహితీ పుష్కరోత్సవం తో వారం రోజులు సందడే సందడి –
సహస్ర చంద్రదర్శనం, సరసభారతి సాహితీ పుష్కరోత్సవం తో వారం రోజులు సందడే సందడి -3 జూన్ 20 కి ముందు పది రోజులక్రితం పామర్రు జిల్లా పరిషత్ హైస్కూల్ 1986-87 దవ తరగతి విద్యార్ధి నాయకుడు గ్లాడ్ స్టన్ ఫోన్ చేసి జూన్ 26 ఆదివారం ఉదయం 9 కి పామర్రు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయ … Continue reading
సహస్రచంద్రదర్శనం, సరసభారతి సాహితీ పుష్కరోత్సవం తో వారం రోజులు సందడే సందడి -1
సహస్రచంద్రదర్శనం, సరసభారతి సాహితీ పుష్కరోత్సవం తో వారం రోజులు సందడే సందడి -1 a అంటే తందానా ‘’అనటం హైదరాబాద్ లో ఉన్న మా అబ్బయిలు శాస్త్రి శర్మ ‘’ తలలు ఊపటం’’ తో నాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పింది కాదు .ఆలోచన అమ్మాయిది ,కర్తవ్య నిర్వహణ అబ్బాయిది .సాధారణంగా నేను ఒప్పుకోను .కానీ వయసు మీద పడుతోంది ,ఇదివరకైతే ‘’రయ్యి మంటూ’’ స్కూటర్ పై … Continue reading
సరస్వతీ సమర్చనం
సరస్వతీ సమర్చనం సరసమైన అక్షరాలపొందికతోరససమంచితమైన పదాల అల్లికలతోసహృదయ హృదయాలను వెలిగింపచేస్తూభాషా భారతికి సేవలందిస్తూరమణీయమైన రచనలతోతీరైన కావ్యముల ద్వారాఎందరోమహానుభావులనుపాఠకలోకానికి పరిచయంచేస్తూసరసభారతి సాహితీ సంస్థద్వారా“తెలుగులో మాట్లాడటం మనజన్మహక్కంటూ”మాతృభాషను మాతను మరువరాదంటూసరస్వతీ సమర్చనం చేస్తున్నపెద్దలు మాన్యులు శ్రీదుర్గాప్రసాద్ దంపతులుసహస్రచంద్రదర్శన వేడుకలేకాకశతవసంతాల పండుగనుజరుపుకోవాలనివారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలనుప్రసాదించాలని మనసారామనసారా ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను. డా.మైలవరపు లలితకుమారిగుంటూరు.9959510422.
సహస్ర చంద్రదర్శన సౌభాగ్య మహోత్సవ పద్య రత్నములు
సహస్ర చంద్రదర్శన సౌభాగ్య మహోత్సవ పద్య రత్నములు దైవతాశీస్సు!శ్రీ ‘సువర్చలాదేవి’తో స్థిరముగాను, పూర్వకాలాన ‘నుయ్యూరు’ పురమునందు,‘గబ్బిటాన్వయ’ పుణ్యంపు గరిమ మహిమ, తెలుప; స్థాపించుకొన్నట్టి దేవ ‘హనుమ’గుణధనమున వెలిగెడు నీ గొప్పవాని, శిష్టు, దుర్గాప్రసాదు నా శీర్వదించు! వేకువఝామునన్ గడగి వేదవిశేష సుమంత్ర శేముషిన్,చేకొని ‘యాంజనేయుని’కి సేవలుచేసిన పుణ్య భాగ్యమే,నీ కమనీయ గ్రాత్ర వరణీయమహీయ వదాన్యసూత్రమైసాకెనటంచు నెంచి, … Continue reading
Posted in పద్య రత్నములు
Leave a comment
ఇవాళ నా పుట్టిన రోజు
ఇవాళ నా పుట్టిన రోజు ఇవాళ 27-6-22 సోమవారం నా పుట్టిన రోజు .82 వెళ్లి 83 వచ్చిన సందర్భంగా సాహితీ బంధువులకు ,సాహిత్యాభిమానులకు ,హితులకు ,మిత్రులకు ,బంధువులకు ,కుటుంబ సభ్యులకు శుభ కామనలు. గబ్బిట దుర్గా ప్రసాద్ –
Posted in సమయం - సందర్భం
1 Comment
గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్ -2
గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్ -2 1757ప్లాసీ యుద్ధం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో తమపాలన మొదలు పెట్టేనాటికి తూర్పు భారతమంతా అరాచకంగా ఉంది .శాంతి భద్రతలు లేవు .ఇది 19వ శతాబ్ది ప్రారంభందాకా కొనసాగింది .డబ్బుకు న్యాయం అమ్ముడు పోయింది .బ్రిటిష్ వారికి జీతాలేక్కువ … Continue reading
గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన,అమృత బజార్ పత్రిక స్థాపకుడు , స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్ -1
గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన,అమృత బజార్ పత్రిక స్థాపకుడు , స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్ -1 సచ్చీంద్ర లాల్ ఘోష్ బెంగాలీ లో రాసిన దానికి శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ ‘’మోతీలాల్ ఘోష్ ‘’గా తెలుగు అనువాదం చేయగా, కేంద్ర సాహిత్య అకాడెమి1992లో పుస్తకంగా ప్రచురించింది .వెల-37 రూపాయలు .పుస్తకం ద్వితీయ ముద్రణ భాగ్యం … Continue reading
సరస భారతి సాహితీ పుష్కరోత్సవం ఫైనల్ ఆహ్వాన పత్రిక
సరస భారతి సాహితీ పుష్కరోత్సవం ఫైనల్ ఆహ్వాన పత్రిక .చివర ఇచ్చిన లింక్ ను గమనించండి
Posted in సరసభారతి ఉయ్యూరు
Leave a comment
శ్రీ మహమ్మద్ హుస్సేన్ రాసిన హరిహర నాథ శతకం -2(చివరి భాగం )
శ్రీ మహమ్మద్ హుస్సేన్ రాసిన హరిహర నాథ శతకం -2(చివరి భాగం ) ‘’శ్రీకరమై నీ నామము –ధీకరము నగణ్యపుణ్య దీప్తి కరమ్మై-లోకోత్తర శీలకర-మ్మై కావుట మమ్ము నెపుడు హరిహరనాథా ‘’అని కంద శతకం మొదలుపెట్టి మహమ్మద్ కవి .’’క౦దమ్ములు భక్తి రసా-నందంబులు ,నవ రసార్ద్ర నానాగుణమా –కందంబులువరశిల్పపు -టందంబులు స్వీకరింపు హరిహరనాథా ‘’అని ప్రార్ధించి … Continue reading
శ్రీ మతి కోనేరు కల్పన ‘’ఒకటి తక్కువ పదారు వన్నెలతో ‘’ చిన్నెలతో వినిపించిన తెలుగింటి’’ గుండె చప్పుళ్ళు ‘
శ్రీ మతి కోనేరు కల్పన ‘’ఒకటి తక్కువ పదారు వన్నెలతో ‘’ చిన్నెలతో వినిపించిన తెలుగింటి’’ గుండె చప్పుళ్ళు ‘’ శ్రీమతి కోనేరు కల్పన గారితో సుమారుపాతికేళ్ళకు పైగాసాహితీ అనుబంధం ఉంది .సరసభారతి ఆస్థానకవులలొ ఆమె కూడా ఒక మాణిక్యం .నిన్న నా సహస్ర చంద్ర మాసోత్సవానికి కుమారుడు, మనవడు లతో కలిసి వచ్చి మా … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
28 -అలంకారాభాస హాస్యం
28 -అలంకారాభాస హాస్యం సుమారు ఆరు నెలలక్రితం’’హేత్వాభాస హాస్యం ‘గురించి రాశాను .ఇవాళ ‘’అల౦కారా భాస హాస్యం ‘’గురించి తెలియజేస్తున్నాను .శరీరానికీ ,కావ్యానికీ అలంకారాలు అందం కోసమే .ఆమె ముఖం చంద్రుని వలే ఉంది అంటే ఉపమాలంకారం కానీ ఆమెముఖం సిబ్బి లాగా ఉంది అంటే మాత్రం అది ఉపమకు ఆభాసం .అలంకారం ఉచితమైనదిగా ఉదాత్త … Continue reading
శ్రీ మహమ్మద్ హుస్సేన్ రాసిన హరిహర నాథ శతకం -1
శ్రీ మహమ్మద్ హుస్సేన్ రాసిన హరిహర నాథ శతకం -1 పశ్చిమ గోదావరిజిల్లా భీమడోలు మండలం దొరసాని పాడు గ్రామానికి చెందిన టీచరు ,కవి మహమ్మద్ హుస్సేన్ గారు హరిహర నాథ శతకం రచించి ,1959లో ప్రచురించారు .ఈశతకానికి ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారు అభిప్రాయం రాస్తూ ‘’ఎలిమెంటరి స్కూల్ మాస్టర్ అయిన … Continue reading
విశ్వ పుత్రిక తోరూ దత్-11(చివరి భాగం )
విశ్వ పుత్రిక తోరూ దత్-11(చివరి భాగం ) ఇరవై ఏళ్ళు ఇంగ్లాండ్ యువరాజు రావటం వెళ్ళటం జరిగాక కలకత్తా నిస్తబ్ద౦గా ఉంది .తోరూ ఆయన్ను చాలాదగ్గరగా చూసి అందగాడు నీలికన్నుల వాడు తెలుపు బట్టతలా అని మేరీకి జాబు రాసింది .ఆయన్ను చూడటానికి కాశ్మీర్ రాజు 40లక్షల తలపాగాతో వచ్చి ,101కాశ్మీర్ శాలువలు ,నవరత్నాలు … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
సరసభారతి’’ పుష్కర కాల ప్రగతి ‘’ మరియు గబ్బిట దుర్గాప్రసాద్ సాహిత్య ప్రగతి (అందరి అవగాహన కోసం )
సరసభారతి’’ పుష్కర కాల ప్రగతి ‘’ మరియు గబ్బిటదుర్గాప్రసాద్ సాహిత్య ప్రగతి (అందరి అవగాహన కోసం ) సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు స్థాపన -24-11-2009 కార్యక్రమాలు 1-ప్రతి ఏటా ఉగాది కవి సమ్మేళనం ,ఆకవితలను 1-నవకవితా వసంతం 2-మా అక్కయ్య 3-మా అన్నయ్య 4-ఆదిత్య హృదయం 5-వసుధైక కుటుంబం పుస్తకాలుగా ప్రచురణ 2-ప్రముఖ కవిపండితులకు స్వర్గీయ … Continue reading
Posted in సరసభారతి ఉయ్యూరు
Leave a comment
విశ్వ పుత్రిక తోరూ దత్-10
విశ్వ పుత్రిక తోరూ దత్-10 ఒక్కత్తీ ఆరూ చనిపోయాక నెమ్మదిగా అందరూ చాలాకాలానికి మామూలు స్థితికి వచ్చారు .తోరూ మేరేకిఉత్తరాలు రాస్తూ ఇంగ్లాండ్ పై ప్రేమను చూపిస్తూనే ఉంది ఆమె తండ్రికి వర్డ్స్ వర్త్ కవి నివసించిన వెస్ట్ మోర్లాండ్ ,అక్కడి విండర్ మెర్ సరస్సు ,దగ్గర కేస్విన్ చాలా ఇష్టం .చదువులోనే ఎక్కువ కాలం … Continue reading
విశ్వ పుత్రిక తోరూ దత్-10స్వదేశాగమనం -2
విశ్వ పుత్రిక తోరూ దత్-10స్వదేశాగమనం -2రాం బగత్ లో ఉన్న పుస్తకాలన్నీ బాగ్ మరీ కి తరలించటం వలన తోరూకు చేతినిండా పుస్తకాలు దొరికాయి చదవటానికి .జీవితాలు ప్రశాంతంగా సాగుతున్నందున తాను అనేక పుస్తకాలు చదవగలిగానని తోరూ చెప్పింది .భోజనం టిఫిన్ టెన్నిస్ విహారాలకు సమయం బాగా తగ్గించి పుస్తకాలే చదివి పుస్తకాల పురుగుయింది .లండన్ … Continue reading
విశ్వ పుత్రిక తోరూ దత్-9
విశ్వ పుత్రిక తోరూ దత్-9 ఇంగ్లాండ్ లో తోరూ కుటుంబం -2 కేంబ్రిడ్జి లో దత్తు కుటుంబానికి మరో స్నేహితుడు క్లిఫర్డ్ పరిచయమయాడు .దత్తు తనకుటు౦బాన్ని కేం బ్రిడ్జి నుంచి సముద్ర తీరం లో ఉన్న సెంట్ లియోనార్డ్ కు మార్చాడు .చివరిదాకా అక్కడే ఉన్నారు .తోరూకు, తండ్రికి మాస్టర్ గిరాల్ద్ ఫ్రెంచ్ చెప్పేవాడు .ఆరూ … Continue reading
మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -302
మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -302 302-‘’ఎగిరి పొతే ఎంత బాగుంటుందో ‘’పాట ఫేం పాటల మాటల రచయిత –సాహితీ సాహితి పేరుతో తెలుగు సినిమారంగంలో గేయ రచయితగా, సంభాషణల రచయితగా చలామణీ అవుతున్న రచయిత అసలు పేరు చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి. ఇతడు కృష్ణా జిల్లా, మైలవరం మండలం, వెల్వడం గ్రామంలో జన్మించాడు. ఇతడు వెల్వడం గ్రామంలో ఎస్.ఎస్.సి, వరంగల్లులో ఇంటర్మీడియట్,నూజివీడులో డిగ్రీ చదివాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి స్నాతకోత్తర పట్టా పొందాడు. … Continue reading
విశ్వ పుత్రిక తోరూ దత్-8
విశ్వ పుత్రిక తోరూ దత్-8 ఇంగ్లాండ్ లో తోరూ కుటుంబం దత్తు కుటుంబం ఇంగ్లాండ్ లో లండన్ లోని చారింగ్ క్లాస్ హోటల్ లో ముందు బస చేసి ,తర్వాత బంధువు రమేష్ చందర్ మాట్లాడిఉన్చిన గ్రాస్ వెనర్ హోటల్ గదుల్లో ఉన్నారు .తర్వాత బ్రాండం లో అన్ని వసతులు ఉన్న ఇంట్లో చేరారు .సిడ్నీ … Continue reading
విశ్వ పుత్రిక తోరూ దత్-7
విశ్వ పుత్రిక తోరూ దత్-7 ఫ్రాన్స్ లో తోరూ గోవిన్ చందర్ కుటుంబం ముందు మార్సేల్స్ చేరి అక్కడి నుంచి నైస్ కు వెళ్ళింది .1870 వసంతం దాక అక్కడే ఉండి,స్కూల్ లో తొరూ ఆరూ చేరి ఫ్రెంచ్ చదివారు .కొన్ని నెలలతర్వాత తండ్రి ఇంటివద్దనే ష్వేయర్ అనే టీచర్ తో చదువు చెప్పించాడు .అప్పుడే … Continue reading
పామర్రు జిల్లాపరిషత్ హైస్కూల్ 1986-87 పదవతరగతి బాచ్ పూర్వ విద్యార్ధుల సమ్మేళనం ,గురు వందనం ఆహ్వానం
పామర్రు జిల్లాపరిషత్ హైస్కూ ల్ 1986-87 పదవతరగతి బాచ్ పూర్వ విద్యార్ధుల సమ్మేళనం ,గురు వందనం ఆహ్వానం
Posted in రచనలు
Leave a comment
విశ్వ పుత్రిక తోరూ దత్-6
విశ్వ పుత్రిక తోరూ దత్-6 తోరూ బాల్యం కలకత్తా మధ్యలో మాణిక్ తలావీధిలో రామబాగన్ లో తొరూ దత్ 4-3-1856 న పుట్టింది .పెద్ద వాడు అబ్జూ పుట్టి 14ఏళ్ళకు ,అక్క ఆరూ 1854లో పుట్టిన 20ఏళ్ళకే చనిపోయారు . .తొరూ 21ఏళ్ళు మాత్రమె బతికి 30-8-1877న మరణించింది .గోవిన్ దత్ కుటుంబమంతా కారన్ వాలీస్ … Continue reading
విశ్వ పుత్రిక తోరూ దత్-5
విశ్వ పుత్రిక తోరూ దత్-5 రాం బగాన్ లో దత్తు కుటుంబం మొదట్లో బెంగాల్ లోని బర్ద్వాన్ జిల్లా అజాపూర్ లో ఉండేవారు కాయస్తులు .నీలమణి దత్ 3-1-1757న జన్మించాడు .తన వ్యక్తిత్వం వలన అందరికి స్పూర్తి కలిగించాడు .ఆయన తండ్రి కొందరు కుటుంబ సభ్యులని బర్ద్వాన్ లోనే వదిలిపెట్టి కలకత్తా లోని రాం బాగాన్ … Continue reading
సరస భారతి 165వ కార్యక్రమం గా ‘’సాహితీ పుష్కర మహోత్సవం ‘’
సరస భారతి 165వ కార్యక్రమం గా ‘’సాహితీ పుష్కర మహోత్సవం ‘’(ఇదే ఫైనల్ ఇన్విటేషన్ –కొన్ని రోజుల తర్వాత దీనినే కార్డ్ సైజు లో కలర్ లో డిజైన్ చేసి పెడతాము .ఈ వాట్సాప్ ఇన్విటేషన్ నే అసలైన ఆహ్వానంగా భావించి అతిధులు ,సన్మానితులు ,కవులు అందరూవిచ్చేసి జయప్రదం చేయవలసినదిగా మనవి .)సాహితీ బంధువులకు శుభ … Continue reading
విశ్వ పుత్రిక తోరూ దత్-4
విశ్వ పుత్రిక తోరూ దత్-4మైకేల్ మధుసూదన దత్ హిందూకాలేజిలో చదివి ప్రిన్సిపాల్ రిచర్డ్సన్ కుప్రియశిష్యుడైనాడు .అంతకు ముందు కాశీప్రసాద్ ,రాజనారాయణ అక్కడే చదివారు .మధు 1883లో క్రైస్తవం తీసుకొని ,కొద్దికాలం కలకత్తా బిషప్ కాలేజిలో పని చేసి ,1849లో మద్రాస్ వెళ్ళాడు..మొదట్లో ఇంగ్లీష్ లో తర్వాత బెంగాలీలో రాసి కవిగా నాటకకర్త గా ప్రసిద్ధుడయ్యాడు .1876లో … Continue reading
విశ్వ పుత్రిక తోరూ దత్-3
విశ్వ పుత్రిక తోరూ దత్-3 బెంగాల్ వాతావరణం ఆంగ్లేయులు బెంగాల్ ను స్వాధీనం చేసుకొన్నప్పుడు జనం లో ప్రతిఘటన పెద్దగా కనిపించ లేదు .భావాల్లో ఆలోచనా విధానం లో మార్పులు రావాలని ఆ ప్రజ కోరారు .బెంగాల్ బ్రిటన్ తో పాటు సమాన హోదా పొందిందని భావించారు .భావ పునరుద్ధరణ కావాలన్నది అందరి కోరిక .’’ఆధునిక … Continue reading
విశ్వ పుత్రిక తోరూ దత్ -2
విశ్వ పుత్రిక తోరూ దత్ -2 ఎమిలీ బ్రాంటి కవిత్వం ,తొరూ కవిత్వం చదువుతుంటే మనలో రకరకాల అంచనాలు మొదలౌతాయి .ఆవూహలు తీర్మానాలు మనల్ని నిలవనివ్వవు కదిల్చి వేస్తాయి .బిరాన్జర్ రాసిన ‘’నా వ్యాపకం ‘’కవితను ఈమె అనువదించింది .నిజంగా అలాటిటి కవిత్వం రాసే సామర్ధ్యం తొరూ కు ఉంది –‘’అన్నిటా అతి తక్కువగా నిరసి౦పబడినదాన్ని … Continue reading
విశ్వ పుత్రిక తోరూ దత్ -1
విశ్వ పుత్రిక తోరూ దత్ -1 పద్మిని సేన్ గుప్త రాసిన పుస్తకానికి ఆచార్య నాయని కృష్ణకుమారి తెలుగులోకి ‘’తోరూదత్’’అనే పేరుతొ అనువదించగా సాహిత్య అకాడెమి 1977లో ప్రచురించింది .వెల-2-30.దీన్ని’’ విశ్వ పుత్రిక తోరూ దత్ ‘’శీర్షికతో మీకు అందిస్తున్నాను . తోరూదత్ ప్రపంచానికి వర ప్రసాదిని .బెంగాల్ లో గంగ ఒడ్డున జన్మించినా … Continue reading
ద్వారకాపతి శతకం -2(చివరిభాగం )
శ్రీ ద్వారకాపతి శతకం -2(చివరిభాగం ) ‘నలువయి సృష్టి సల్పితి,జనార్దనుపేర బెంచుచుంటి వీ-లనరగా జంద్ర శేఖరుడ వై నశియి౦పగా బుచ్చుచుంటి వి’’నిర్మలంగా మూడు పేర్లూ నీవే .తర్వాత మత్యావతార,కూర్మ ,వరాహ నరసింహ ,వామన పరశురామ ,రామ,కృష్ణ ,బుద్ధ ,కల్కి అవతారాలు, చేసిన అద్భుతకార్యాలు వేర్వేరు పద్యాలలో వర్ణించి’వేల్పుల గిడ్డివేల్పుల నవీనపు బువ్వలబెట్టి ప్రోచు నా –వేల్పుల … Continue reading
శ్రీ ద్వారకాపతి శతకం-1
శ్రీ ద్వారకాపతి శతకం-1 విశాఖ జిల్లా బొబ్బిలి తాలూకా అజ్జాడ వాస్తవ్యులు శ్రీ మదాది భట్ట శ్రీరామ మూర్తి కవి శ్రీ ద్వారకాపతి శతకం రచించి ,కృష్ణాజిల్లా కైకలూరు తాలూకా శోభనాద్రి పుర అగ్రహార వాస్తవ్యులు బ్రహ్మశ్రీ కాశీ నాధుని సుబ్బారావు గారి ద్రవ్య సహాయం చేత బెజవాడ ఆంద్ర గ్రంధాలయ ముద్రాక్షరశాలలో శ్రీ కుందా … Continue reading
కేసరి గారి చిన్ననాటి ముచ్చట్లు -2
కేసరి గారి చిన్ననాటి ముచ్చట్లు -2 ఆ కాలం లోతద్దినం నాడుమాత్రమే వరి అన్నం తినేవారు మిగిలిన రోజుల్లో జొన్నలు సజ్జలు వరిగలు వండుకొని తినేవారు .డబ్బిచ్చి బియ్యం నెయ్యి కొనేవారు .కేసరి తల్లి పొలాలకు వెళ్లి కందికంప పీక్కొని వచ్చి వంట చెరుకుగా వాడేది .మళ్ళీ పైరు వేసే లోపు వీటిని సమూలంగా త్రవ్వి … Continue reading
కేసరి గారి చిన్ననాటి ముచ్చట్లు -1
కేసరి గారి చిన్ననాటి ముచ్చట్లు -1తల్లికి కె ఎన్ కేసరి(కోట నరసింహం –కోట లో కె,నారా మాత్రం ఉంచుకొని సింహం బదులు కేసరి అని మార్చుకొని కె.ఎన్ .కేసరి అయ్యారు )గారొక్కరే సంతానం .ఆడపిల్ల లేని కొరత తీర్చుకోటానికి అమ్మాయి వేషం వేసి ఇరుగంమలకు పోరుగంమలకు చూపించి ముచ్చట తీర్చుకొనేవారు .అయిదవ ఏటనే పిచ్చయ్య గారి … Continue reading
పేద బాలికల విద్యకోసం నోటర్ డాం సంస్థలు నిర్మించి సేవ చేసినఫ్రెంచ్ మదర్ సుపీరియర్ –సెయింట్ జూలీ బిలియర్ట్ –గబ్బిట దుర్గాప్రసాద్.
పేద బాలికల విద్యకోసం నోటర్ డాం సంస్థలు నిర్మించి సేవ చేసినఫ్రెంచ్ మదర్ సుపీరియర్ –సెయింట్ జూలీ బిలియర్ట్ –గబ్బిట దుర్గాప్రసాద్.విహంగ మహిళా వెబ్ మాసపత్రిక .జూన్01/06/2022 గబ్బిట దుర్గాప్రసాద్మేరీ రోజ్ జూలీ బిలియర్ట్ 12-7-1751న ఫ్రాన్స్ లోని కువిలీ లో జీన్ ఫ్రాన్సిస్ బిలియంట్ ,మేరీ లూసీ ఆంటోనెట్ దంపతులకు జన్మించి ఏడుగురు సంతానం … Continue reading
Posted in రచనలు
Leave a comment
భరతముని నాట్య శాస్త్ర అనువాదకులు ,తెలుగు నాటక వికాసం కర్త ,నాట్య సామ్రాట్,నాటక రత్న ,కళా రత్న బిరుదాంకితులు,మనం మరచిపోయిన ఆధునిక భరత ముని – డా .పోణంగి శ్రీ రామ అప్పా రావు గారు
భరతముని నాట్య శాస్త్ర అనువాదకులు ,తెలుగు నాటక వికాసం కర్త ,నాట్య సామ్రాట్,నాటక రత్న ,కళా రత్న బిరుదాంకితులు,మనం మరచిపోయిన ఆధునిక భరత ముని – డా .పోణంగి శ్రీ రామ అప్పా రావు గారుజననం – విద్యాభ్యాసంఅప్పారావు 1923, జూలై 21 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు తాలూకా, బందపురంలో జన్మించారు. … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
ప్రఖ్యాత ఆయుర్వేద డాక్టరై ,’’కేసరి కుటీరం ‘’స్థాపించిలోధ్ర మొదలైన మందులు తయారు చేసి’’ గృహలక్ష్మి ‘’అనే వారపత్రిక ద్వారా దాదాపు అర్ధశతాబ్ది సాహిత్య సేవ చేసి,’’స్వర్ణ కంకణాలతో ‘’ ప్రముఖ మహిళలను సత్కరించి, మద్రాస్లో కేసరి ఉన్నత విద్యాలయం స్థాపించి విద్యాసేవ చేసిన మనం మరచిపోయిన మహానుభావుడు – కె.ఎన్. కేసరి అనే శ్రీ కోట నరసింహం గారు
ప్రఖ్యాత ఆయుర్వేద డాక్టరై ,’’కేసరి కుటీరం ‘’స్థాపించి లోధ్ర మొదలైన మందులు తయారు చేసి’’ గృహలక్ష్మి ‘’అనే వారపత్రిక ద్వారా దాదాపు అర్ధ శతాబ్ది సాహిత్య సేవ చేసి,’’స్వర్ణ కంకణాలతో ‘’ ప్రముఖ మహిళలను సత్కరించి, మద్రాస్ లో కేసరి ఉన్నత విద్యాలయం స్థాపించి విద్యాసేవ చేసిన మనం మరచిపోయిన మహానుభావుడు – కె.ఎన్. కేసరి … Continue reading
Posted in మహానుభావులు
Leave a comment
శ్రీ భీమ లింగేశ్వర శతకం -2(చివరిభాగం )
శ్రీ భీమ లింగేశ్వర శతకం -2(చివరిభాగం )మొదటి పద్యం –‘శ్రీ వాణీశ ముఖామర ప్రకరస౦సేవ్యాంఘ్రీ పంకేరుహా –భావాతీత సుమంగళా౦చిత గుణా,భద్రేభ చర్మాంబరాధీ విభ్రాజిత దాసకల్ప కుజ దాత్రీ భ్రున్నివాసొన్నతా –గ్రావా ధీశ కుమారికా రమణ భర్గా శ్రీ రామ లింగేశ్వరా ‘’అని మొదలుపెట్టి ‘’ఘనపా౦డిత్యం ,సూరి జన సాంగత్యం సాధన సంపత్తి తనకు లేవని ,శివునిపై … Continue reading
గ్రీకు ,సంస్కృత ,ఆంగ్ల ,తెలుగు నాటక దర్శకుడు ,నటుడు ,రచయిత,నూరేల్లతెలుగు నాటక రంగం
గ్రీకు ,సంస్కృత ,ఆంగ్ల ,తెలుగు నాటక దర్శకుడు ,నటుడు ,రచయిత,నూరేల్లతెలుగు నాటక రంగం సంపాదకులు ,రసమయి ,అప్పాజోష్యుల పురస్కార గ్రహీత –డా .మొదలి నాగభూషణ శర్మమొదలి నాగభూషణ శర్మ (జూలై 24, 1935 – జనవరి 15, 2019) రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక రచయిత, అధ్యాపకుడు, విమర్శకుడు, పరిశోధకుడు.[1]జననంనాగభూషణ శర్మ 1935, జూలై 24 … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
శ్రీ భీమ లింగేశ్వర శతకం -1
శ్రీ భీమ లింగేశ్వర శతకం -1 పల్నాడు తాలూకా జూలకల్లు గ్రామవాసి శ్రీ శానం పూడి వరద కవి శ్రీ భీమేశ్వర లింగ శతకం రాసి ,వినుకొండ తాలూక ముప్పాళ్ళ గ్రామస్తులు శ్రీ కాకుమాను కాశీ విశ్వానాథం ఆర్ధిక సహకారం తో గుంటూరు కన్యకా ముద్రాక్షర శాలలో శ్రీ పెండేల చక్రపాణి సోదరుల చే 1924లో … Continue reading