విశ్వ పుత్రిక తోరూ దత్-10

విశ్వ పుత్రిక తోరూ దత్-10

ఒక్కత్తీ

ఆరూ చనిపోయాక నెమ్మదిగా అందరూ చాలాకాలానికి మామూలు స్థితికి వచ్చారు .తోరూ మేరేకిఉత్తరాలు రాస్తూ ఇంగ్లాండ్ పై ప్రేమను చూపిస్తూనే ఉంది ఆమె తండ్రికి వర్డ్స్ వర్త్ కవి నివసించిన వెస్ట్ మోర్లాండ్ ,అక్కడి విండర్ మెర్ సరస్సు ,దగ్గర కేస్విన్ చాలా ఇష్టం .చదువులోనే ఎక్కువ కాలం గడుపుతున్నా తొరూ వంటరితనం భరించలేక పోతోంది .గణిత శాస్త్ర పరిజ్ఞానానికి పదును పెట్టటం మొదలు పెట్టింది .అప్పుడు బెంగాల్ కరువు విపరీతంగా కబళించేస్తోంది .దానిపై తోరూ’’మనుషులందరూ అస్థిపంజరాల్లా ఉన్నారు .ఎముకలు బయటకు పొడుచుకొని వస్తున్నాయి .అన్నం కోసం ఒకరితో ఒకరు కొట్టుకొంటున్నారు .పిల్లల చేతుల్లోని తినుబండారాలను తల్లులు లాగేసుకొంటూ హృదయ విదారకంగా కనిపిస్తున్నారు ‘’అని రాసింది .

 కొన్ని నెలల తర్వాత దత్తు కుటుంబం బాగ్ మరీ తోటలోకి మారారు .కానీ ఆరూ స్మృతులు వెంటాడి ఉండటానికి భయమేసింది .సంస్కృతం నేర్వాలని తోరూ తీవ్రంగా భావించింది .తండ్రి ఏర్పాటు చేశాడు –‘’వెలుతురులో రాణించే-అతి చిక్కని శబ్దరాహిత్యం –అక్కడ ఒక దేవత –దేవతకు మారుగా –మంచం పక్కనే కూర్చుని –ఓర్పుగా నన్నే చూస్తున్న మానాన్న –నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని కన్నీళ్లు ఆపుకొంటున్నాడు ‘’అని అద్భుత కవిత రాసింది .ఇందులో తాత్వికత కనిపిస్తుంది .విలియం బ్లేక్ తాత్వికత దర్శనమిస్తుంది .ఆమె రాసిన కవితల్ని చదువుతూనే ఆమె మరో ప్రపంచం లోకి జారిపోయున్నట్లు కనిపిస్తుంది .మృత్యువును కూడా మంచితనం పోతపోసిన వాడి గానే ఊహించింది –ఓ మృత్యూ !ఇంకా ఎప్పుడు ??’’అని ఆహ్వానించింది .సెయింట్ జాన్ చెప్పినట్లు ‘’మృత్యువు చీకట్లో మెరుస్తుంది .తనకు తానె వస్తుంది దానికి స్వాగతం చెప్పిన వారంతా దేవుని బిడ్డలే ‘’ .

  తోరూకు లి కాంటేడిలైల్ అంటే ప్రత్యెక అభిమానం .అతనిపై ఒక ప్రత్యేకవ్యాసం 1874 చివర్లో బెంగాల్ పత్రికలో రాసింది .అతని కవితల్ని ‘’లా మార్టే డీ వాల్మీకి ‘’పేరుతొ అనువదించింది .1874 చివర మళ్ళీ ఆమెకు జబ్బు చేసింది .

   1875

1875 జనవరి ఒకటిన తోరూ తన స్నేహితురాలికి న్యు యియర్ గ్రీటింగ్స్ చెప్పింది .ఫిబ్రవరిలో జబ్బు ఎక్కువైంది కనుక విదేశ యానానికి ఏర్పాట్లు జరగలేదు .ఎలిజబెత్ బ్రౌనింగ్ కవితలు ఇష్టంగా చదువుతోంది .బ్లీక్ హౌస్ కూడా చదివి అనువాదాలు చేసి బెంగాలీ పత్రికకు పంపేది .అప్పుడే ఇంగ్లాండ్ నుంచి కొత్త పుస్తకాలు వచ్చాయి .వేల్స్ యువరాజు 7వ ఎడ్వర్డ్ ఇండియా రాబోతున్నాడు .జులైలో తోరూ నాయనమ్మ చనిపోయింది .తొరూ చాతీమీద ప్లాస్టర్ పట్టీ వేయటంతో ఎక్కడికీ కదలటానికి వీల్లేకపోయింది .సెప్టెంబర్ లో యువరాజు రాక కోలాహలంతో కలకత్తా నిండిపోయింది .ఈ సమయం లో తన దిన చర్య గురించి ‘’తెల్లవారుజామున 4-30కే లేస్తాను .నాకూ నాన్నకు రెండుకప్పుల చాకొలేట్ తయారు చేస్తా .బట్టలు మార్చుకొని అమ్మా నాన్న లను చూస్తా. నాన్న చుట్ట కాలుస్తూ కనిపిస్తాడు .పైకి వెళ్లి ఒకసారి ప్రకృతిని చూసి పని వాళ్లకు చేపలకు ఆహారం పెట్టమని అందిస్తా .మా గుర్రాలు జెంటిల్, చానేట్లు ను తనివితీరా చూస్తా వాటికి దాణా పెట్టిన్చాక మా ఫలహారాలు చేస్తాం . అమ్మ వంటిట్లో వంటపనికి వెడుతుంది .నేను పుస్తకం పట్టుకొంటా నాన్న రాతపనిలో ఉంటాడు .12కు భోజనం చేసి 3గంటలదాకా చదువు లేక రాత .తర్వాత ఒక సీతాఫలమో బత్తాయో తింటా .కాసేపు తోటలో షికారు .రాత్రి 7కు భోజనాలు పూర్తీ .8-30కు టీతాగి రాత్రి 10కి హాయిగా పడుకోవటమే ‘’అని రాసుకొన్నది .

   ఆత్మకూ పరమాత్మకూ ఉన్న సంబంధాన్ని ఒక కవితలో ఇలా రాసింది తోరూ-‘’రహస్యంగా గుంపులో నుంచి –ఆత్మను ఒకదాన్ని –పరమాత్మ పరిగ్రహిస్తాడు –విచారం, లోపాలనుండి –మెల్లగా ముందుకు నడిపిస్తూ –నిబ్బరంగా గమ్యానికి చేరుస్తాడు –చిరుసూది లాంటి ఆత్మను చూసి చిరునవ్వు నవ్వుకొంటాడు –తను చేసిన పనికి మురిసిపోతాడు ‘’.1869 డ్యూక్ ఆఫ్ ఎడింబరో కలకత్తా వస్తే 9వేలమంది ప్రేక్షకులు బాణా సంచా కాల్చటం తెల్సి ‘’డబ్బు ను బూడిద చెయ్యటం అంటే ఇదేగా ‘’అన్నది .తండ్రి గుర్రపు పందాలకు తీసుకు వెడతాను అంటే అంతగా ఉత్సాహం చూపలేదు .ఆమె స్వంత రచన ‘’ఫ్రెంచ్ క్షేత్రం లో మెరిసే కంకులు ‘’పూర్తీ చేసింది .దీన్ని చాలామంది విమర్శకులు మెచ్చారు –‘’పుష్ప వర్ణ శబలితాలుగా పుష్ప పత్రాలు విచ్చుకొన్నాయి ‘’లాంటి లైన్లు చాలాఉన్నాయి అందులో .

 పుస్తకం పూర్తయింది కనుక తండ్రీ కూతురు  సంస్కృత  అధ్యయనం మొదలెట్టారు .డిసెంబర్ 4న పాఠాలు మొదలయ్యాయి .రామాయణ మహాభారతాలను సంస్కృతంలో చదవాలని ఆమె కోరిక .తోరూచూడటానికి రోజూ చాలామంది వచ్చేవారు .ఇంగ్లాండ్ నుంచి మిస్ ఆడాస్మిత్ కలకత్తా వస్తే తండ్రి ఆమెను బాగ్ మరీకు తీసుకు వస్తే మేనత్త ఆమెకు ‘’కాస్కేట్ ఆఫ్ జేమ్స్ ‘’చూపిస్తే ఆ ఇల్లూ ఆ తోట ఆమెకు భూలోక స్వర్గం లా అనిపించి ,ఈ ఆనందాన్ని అనుభవించకుండా ఈ కుటుంబం ఎందుకు ఇంగ్లాండ్ వెళ్ళాలను కొంటున్నారు అని ఆశ్చర్యపోయింది .

  డిసెంబర్ లో వచ్చే యువరాజు స్వాగతానికి కలకత్తా అంతా పెళ్లి ముస్తాబు చేసుకొన్నది .రాజులు అందరూ వచ్చి విడిది చేశారు .ఒక రాజు రత్నాలు ముత్యాలుపొదిగిన   చొక్కా పది లక్షలు ఖర్చు చేసి తయారు చేయిన్చుకొన్నాడు .ఒక రాజు తన ఆస్థానానికి యువరాజు వస్తే ఖర్చు చేయటానికి 30లక్షలతో సిద్ధంగా ఉన్నాడు .

  తప్పులు పడకుండా పది నెలలలో సంస్కృతం చదవటం అలవాటయింది తోరూకు .రోజురోజుకు ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది .సెప్టెంబర్ వరకు శ్రమ పడవద్దని డాక్టర్లు సూచించారు .తనకు నేర్పుతున్న గురువు గొప్పతనం గురింఛి మేరీకి రాసింది .1976జులైలో ‘వ్యాకరణం చాలా కష్టంగా ఉంది .రుజుపధం లో మూడు భాగాలు పూర్తీ చేశాను .కాళిదాసు శాకుంతలం మొదలు పెట్టాలి ‘’అని రాసింది .కానీ చదువు మూలపడింది .

 సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-6-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.