Category Archives: పుస్తకాలు

సరసభారతి  పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో 98 వ శతకం –అఘ వినాశ శతకం

 సరసభారతి  పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో 98 వ శతకం –అఘ వినాశ శతకం కృష్ణాజిల్లా బేతవోలు గ్రామస్తులు శ్రీమాన్ శ్రీపతి సుదర్శనాచార్యుల ప్రియ శిష్యుడు శ్రీ దాసరి అ౦జదాసు రాసిన ‘’అఘవినాశ శతకం’’బాపట్ల తాలూకా ఆదిపూడి నుంచి1932లొ  ప్రచురితం .పరిచయకర్త శ్రీ అబ్బరాజు వెంకటరంగారావు గారు –‘’భక్తితో పామరకవిరాసిన శతకం అని .కవిత్వం లీలామాధుర్యం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

సరసభారతి పరిచయం చేస్తున్న శతాధిక శతకాలలో 97 వ శతకం –శ్రీ సిద్దేశ్వర శతకం

97 వ శతకం –శ్రీ సిద్దేశ్వర శతకం సరసభారతి పరిచయం చేస్తున్న శతాధిక శతకాలలో 97 వ శతకం –శ్రీ సిద్దేశ్వర శతకం గుంటూరుజిల్లా పల్నాడు తాలూకా రాయవరం వాసి శ్రీచిదంబర గురుస్వామి శిష్యుడు శ్రీ కోటయాఖ్య కవి శ్రీ సిద్దేశ్వర శతకం రచించి ,గుంటూరు అనసూయ ముద్రాక్షర శాలాలో 1933లొ ముద్రించారు .వెల తెలుపలేదు … Continue reading

Posted in పుస్తకాలు, ప్రవచనం | Leave a comment

శ్రీ పన్నగాచల నాయక శతకం

శ్రీ పన్నగాచల నాయక శతకం శ్రీ సచ్చిదానదస్వరూప పులహరి పీలోజి దేశికేంద్రులు రచించిన శ్రీ పన్నగాచల నాయక శతకం శ్రీకోల్లిపర సూరేశ్వర లింగం దేవర ద్రవ్య సహాయంతో శ్రీ పులహరి పీరోజి బాబు చే 1924లొ ప్రచురితం .వెల –పావలా .విజ్ఞప్తిలో బాబు –‘’తనతాతగారు పీరోజి దేశికేంద్రులు అనేక గ్రంథాలు రాశారని అవి ముద్రితం కాకుండానే శివైక్యం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

శ్రీ గనముక్కల నాగయ్య విరచిత’’ శ్రీ సోమేశ్వర శతకం ‘’

శ్రీ గనముక్కల నాగయ్య విరచిత’’ శ్రీ సోమేశ్వర శతకం ‘’ ను మహారాజ రాజశ్రీ సోము పాళ్యం కనుకొండ కోటిరెడ్డి ,మదనపల్లి బోర్డ్ హైస్కూల్ తెలుగు పండితులు బ్రహ్మశ్రీ వెంకటరామ శాస్త్రి గార్లచే పరిష్కరి౦పబడి మదనపల్లె బ్రిటానియా ముద్రాక్షర శాలలో 1926లో ప్రచురింపబడింది .వెల –అణన్నర.తండ్రిగారికి ఈ శతకం అంకితమిచ్చారు కవి .ఈ సీసపద్య శతకం  మకుటం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

శ్రీ ఆత్మబోధ సిద్దేశ్వర శతకం -2(చివరిభాగం )

శ్రీ ఆత్మబోధ సిద్దేశ్వర శతకం -2(చివరిభాగం ) రుద్రుడు లయకారుడు రుద్రబీజం చిన్ముద్ర .శంకరుడు ఆనంద రూపుడు .చిర శుభాకార మంగళుడు .శుద్ధ జీవుడు దేహ బద్ధ జడుడు .జ్ఞానాప్తితో జడత పోతుంది .బ్రహ్మమొక్కడే దృక్కు.కంటితో రూపం చూద్దాము అనుకొంటే మనసు కంటికి అదృశ్యం .మనసుతో చూద్దామంటే బుద్ధికి దృశ్యమై బద్ధమౌతుంది .బుద్ధి దృష్టితో తెలుసుకొందామంటే ధీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

శ్రీ ఆత్మబోధ సిద్దేశ్వర శతకం

శ్రీ ఆత్మబోధ సిద్దేశ్వర శతకం కలమళ్ళ హిందూ బోర్డ్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీ కె.రామస్వామి శ్రీ ఆత్మబోధ సిద్దేశ్వర శతకం రచించి ,ప్రొద్దుటూరు శ్రీ జానకీ ముద్రాక్షర శాలలో 1930లో ముద్రించారు .వెల –కేవలం –నాలుగు అణాలు .కవిగారు పండితాభిప్రాయం సేకరించి పొందు పరచారు .శ్రీమద్రామాయణ ,,బ్రహ్మా౦డపురాణ,బ్రహ్మపురాణాది బహు గ్రంధ కర్తలు ,కావ్య స్మృతి తీర్ధ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆంజనేయ శతకం

ఆంజనేయ శతకం పుష్పగిరి సంస్థాన పాఠశాల సాహిత్య విద్యార్ధిగుంటూరు జిల్లా  సత్తెనపల్లి తాలూకా అందుకూరు కు చెందిన పరాశరం నరసింహా చార్యులు రాసిన ఆన్జనేయశతకం 1934లో గుంటూరు ఆర్యవైశ్య ముద్రాక్షరశాలలో ముద్రి౦ప బడింది .మనవి మాటలు లో కవి’’తాను  పదహారేళ్ళ వయసులో ‘’శృంగార నక్షత్రమాల ‘’పుస్తకం రాశానని ,అది శృంగారం కనుక ప్రచురించలేదని తర్వాత శ్రీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీమతి వల్లివేడు కాదాటి గుండ్ల పల్లి నరసమ్మ గారిచే రచింపబడిన ‘’వరద రాజ శతకం ‘’-2(చివరిభాగం )

శ్రీమతి వల్లివేడు కాదాటి గుండ్ల పల్లి నరసమ్మ గారిచే రచింపబడిన ‘’వరద రాజ శతకం ‘’-2(చివరిభాగం ) పాఠకమహాశయులకు విజ్ఞప్తి –అంటూ కవయిత్రి నరసమ్మ గారు ‘’పన్నెండవ ఏట భర్త ,పదమూడవ ఏట తండ్రి మరణం సంభవించింది .మాతాపిత భతృ సేవలు చేసి తరించే అవకాశం పూర్తిగా లభించలేదు .పైతృక కార్యాలు దైవధ్యానం టో కాలం … Continue reading

Posted in పుస్తకాలు, ప్రవచనం | Tagged | Leave a comment

శ్రీమతి వల్లివేడు కాదాటి గుండ్ల పల్లి నరసమ్మ గారిచే రచింపబడిన ‘’వరద రాజ శతకం ‘’-1

శ్రీమతి వల్లివేడు కాదాటి గుండ్ల పల్లి నరసమ్మ గారిచే రచింపబడిన ‘’వరద రాజ శతకం ‘’-1 కు శ్రీకట్టమంచి రామ లింగారెడ్డి పీఠిక రాశారు .చిత్తూరు విక్టోరియా జూబిలీ ముద్రాక్షర శాలలో 1931లోప్రచురితం .పీఠిక లో రెడ్డిగారు –‘’కవయిత్రి చిత్తూరు దగ్గర గుండ్లపల్లె గ్రామస్తురాలని ,తనకు అక్క వరుస అని , వారి వంశంలో అంతటి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

హరి ముకుంద శతకం

హరి ముకుంద శతకంశ్రీ కోట్రెడ్డి నాగిరెడ్డి హరి ముకుంద శతకం రాసి ,శ్రీ ఖాద్రి నరసింహ సోదరులచే పరిష్కరిమ్పజేసి ,అనంతపురం సాధన ముద్రాణాలయం లో 1932లో ముద్రించారు .కవిగారిది కదిరి తాలూకా పందుల గుంట గ్రామం .అక్కడి ముకుంద స్వామికే అంకితమిచ్చారు .ఇది సీస పద్య శతకం .మకుటం –‘’భువిని పందులకుంట సత్పుర నివాస –అరసి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged , | Leave a comment

భక్తకవి పోతనామాత్యుని ‘’నారాయణ శతకం

భక్తకవి పోతనామాత్యుని ‘’నారాయణ శతకం’’.   ఈ శతకాన్ని 1919 లో పిఠాపురం కు చెందిన ఆంధ్ర పరిశోధక మహా మండలి తరఫున శ్రీ వంగూరి సుబ్బారావు గారు ముద్రించారు .పీఠిక లో వంగూరి వారు- ‘’ఈ శతకం పోతనామాత్యుడు రచించాడు .శైలి భాగవతంతో సరిపోతోంది .పెద్దాపురం నుంచి ఒక తాళపత్ర గ్రంధాన్ని వేరొక చోటు నుంచి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహాత్ముని అంతేవాసి నిస్వార్ధ సేవకుడు శ్రీ మహాదేవ దేశాయ్ డైరీ కధనం -2

మహాదేవ్ 1923లో లక్నో జైలు నుండి విడుదలయ్యాడు. అదే సంవత్సరంలో అతని తండ్రి మరణించాడు. 1924లో నవజీవన్ సంపాదకునిగా బాధ్యతలు స్వీకరించారు మరియు తన ఇంటిని కూడా కొడుకుతో ఆశీర్వదించారు. 1925 నుండి అతను గాంధీ ఆత్మకథను ఆంగ్లంలోకి అందించడం ప్రారంభించాడు మరియు యంగ్ ఇండియాలో సీరియల్‌గా ప్రచురించాడు. 1926లో సత్యాగ్రహ ఆశ్రమ కార్యనిర్వాహక కమిటీకి అధ్యక్షుడయ్యాడు, నవజీవన్‌లో తన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మహాత్ముని అంతేవాసి నిస్వార్ధ సేవకుడు శ్రీ మహాదేవ దేశాయ్ డైరీ కధనం -1

మహాత్ముని అంతేవాసి నిస్వార్ధ సేవకుడు  శ్రీ మహాదేవ దేశాయ్  డైరీ కధనం .తెలుగు లో లేని ఈ ప్రత్యెక కధనం అందరికి ప్రేరణ ఆదర్శం  కావాలన్న ఆశయంతో సరసభారతి ప్రయత్నించి ధారావాహిక గా అంద జేస్తోంది . మహదేవ్ దేశాయ్ 1892 జనవరి 1న గుజరాత్‌లోని సూరత్ జిల్లాలోని సరస్ గ్రామంలో జన్మించారు. అతని తండ్రి హరిభాయ్ దేశాయ్ సరస్ ప్రాథమిక … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

శ్రీ శ్రీనివాస శతకం -2(చివరిభాగం )

శ్రీ శ్రీనివాస శతకం -2(చివరిభాగం ) సీసపద్యమయమైన శ్రీనివాస శతకం మకుటం –‘’మధు మదన నిరాస కోటి మన్మధ విలాస -శ్రిత మనోవాస జయజయ శ్రీనివాస’’ ‘’ మొదటి సీసం –‘’శ్రీ వనజాలయా ,సేవితాన్ఘ్రి సరోజ –కలిసాధ్వసా క్రాంత కల్ప భూజ –మార్తాండ శతకోటి మహిత దీప్తి కలాప –నవ నవోన్మీల నానద రూప – … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

 శ్రీ శ్రీనివాస శతకం -1

 శ్రీ శ్రీనివాస శతకం -1 శ్రీ నారాయణం రామానుజా చార్యులు శ్రీ శ్రీనివాస శతకం ను రేపల్లె విక్టరి ప్రెస్ లో 1946లో ముద్రించారు . వెల పన్నెండు అణాలు .కవిగారు శృంగార రస రంజిత౦ గా,విచిత్ర ఇతి వృత్త౦తొ ‘’సుచంద్ర ‘’ వీర రసాలంకారంగా’’వీర బభ్రువాహన ‘’ నాటకాలు ,క్షీరాబ్ది కుమారీ శతకం  రాశారు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

అండమాన్ దీవుల్లో జైలు శిక్ష అనుభవించిన  మనం మర్చిపోయిన భారత స్వాతంత్ర్య యోధులు -3

అండమాన్ దీవుల్లో జైలు శిక్ష అనుభవించిన  మనం మర్చిపోయిన భారత స్వాతంత్ర్య యోధులు -3 5-షియోనరైన్ సింగ్ షియోనరైన్ సింగ్ ఇంగ్లీష్ ఈస్టిండియా కంపెనీ సైన్యంలో సేవలో ఉన్నాడు కానీ 1857 తిరుగుబాటు సమయంలో దానిని విడిచిపెట్టాడు మరియు విదేశీ శక్తిని పడగొట్టే ప్రతిజ్ఞతో తిరుగుబాటు దళాలలో చేరాడు. అతను వివిధ ప్రదేశాలలో బ్రిటీష్ వారితో పోరాడాడు మరియు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

శ్రీ భవానీ శంకరార్ధాస్టోత్తర శతకం

శ్రీ భవానీ శంకరార్ధాస్టోత్తర శతకం శ్రీ బాలకవి కూరపాటి వెంకటరత్నం రచించిన శ్రీ భవానీ శంకరార్ధాస్టోత్తర శతకం శ్రీ యార్లగెడ్డ కొండయ్య చౌదరి చేత కాకినాడ పట్టమట్ట వెంకటరంగారావు గారి రంగా అండ్ కొ ముద్రాక్షర శాలలో 1930 లో ముద్రితం . స్వర్గీయ యార్లగెడ్డ మాణిక్యాంబ కు అంకితం .వేళ౦గి కి చెందిన యార్లగెడ్డ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

శ్రీ భగీరధీ శతకం

  శ్రీ భగీరధీ శతకం శ్రీ కొవ్వలి వెంకట సూర్య నారాయణ గారు రచించిన ‘’శ్రీ భగీరధీ శతకం ‘’లో’’ మంచి శైలి ఉంది,స్వానుభవ పద్యాలున్నాయి .కవిత్వ ప్రవాహం భాగీరధీ ప్రవాహమే .భక్తిలో నీతి ,రక్తి ముక్తి రంగరించి రాసిన శతకం .కవికున్న సంగీతరసానుభావమూ వ్యక్తమౌతుంది ‘’అంటూ పీఠిక లో పిఠాపురం కొత్తపల్లికి చెందినసంగీత సాహిత్య … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

సత్యవ్రతి శతకం -2వ భాగం (చివరిభాగం )

సత్యవ్రతి శతకం -2వ భాగం (చివరిభాగం ) అతిరాత్ర ,మహారాత్ర క్రతువులు అతి భక్తితో చేస్తే సత్యవ్రతుడు సంతోషిస్తాడు .పరస్త్రీలపై వ్యామోహం లేకుండా ఉండేఅతి ధైర్యవంతుడు ,కపి వీరులను బ్రతికించటానికి సంజీవి తెచ్చిన ఆంజనేయుడు ,సత్యం శాంతి ఉన్నవారు మొహరహితులు,సన్యాసులవలన గీతాసారాన్ని గ్రహించినవాడు ,నిత్యానిత్య వస్తు వివేచనం చేసేవాడు సత్యవ్రతునికి సంతోషం కలిగిస్తాడు ..’’ఋతమును దప్పక … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

సత్యవ్రతి శతకం -1వభాగం

సత్యవ్రతి శతకం -1వ భాగం శ్రీ భాగవతుల లక్ష్మీ నారాయణ శాస్త్రి రచించిన ‘’సత్యవ్రతి శతకం ‘’విజయ నగరం శ్రీరామానుజ ముద్రాక్షార శాలలో  1929లో ముద్రించబడింది .దీనికి పీఠిక రాసిన శ్రీ భాగవతుల లింగమూర్తి –విజయనగర సంస్థానాధిపతి శ్రీ ఆనంద గజపతిరాజు ఒక రోజున ‘’సతతము సంతసమొస౦గు సత్యవ్రతికిన్ ‘’అనే సమస్యనిచ్చి దీనిపై శతకం రాయమని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గ్రామాలలోని పిల్లలు భావిభారత పౌరులవ్వాలిగా

గ్రామాలలో పిల్లలు భావి భారత పౌరులవ్వాలిగా అంటూ పుస్తకం రచించి ఈఆగస్ట్ లోనే ముద్రించి ఇవాళ ఉదయం మాయింటికి వచ్చి అందజేశారు డా. నాగులపల్లి భాస్కరరావు గారు.అయన స్వగ్రామం ముదునూరు లో ‘చరిత్ర పుస్తకాల గ్రంథాలయం ‘’నెలకొల్పి భావి భారత పౌరుల్ని మహిళా మణులను ఉత్తేజితం చేస్తున్నారు పలుకార్యక్రమాలు నిర్వహిస్తూ .మనం బాలల దినోత్సవం నాడో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

ఆంధ్ర కవితా విశారద ,కవిజన తిలక శ్రీమాన్ నల్ల౦తి ఘళ్ చక్రవర్తుల ఠంయాల లక్ష్మీ నృసింహా చార్య కవినాధుని –ముకుంద శతకం

ఆంధ్ర కవితా విశారద ,కవిజన తిలక శ్రీమాన్ నల్ల౦తి ఘళ్ చక్రవర్తుల ఠంయాల లక్ష్మీ నృసింహా చార్య కవినాధుని –ముకుంద శతకం దీనిని వరంగల్ శ్రీ వేంకటేశ్వర భక్తసమాజం ద్రవ్యసాయంతో శ్రీమాన్ ప్రతాపం రామానుజా చార్యుల వారి శ్రీ వేంకటేశ్వర ముద్రాక్షర శాలలో 1928లో ముద్రించారు .వెల –రెండు అణాలు .   విజ్ఞాపనలో అల్పజ్ఞులకోసం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

ఒరిస్సా ,విశాఖల్లో ఇంగ్లీష్ లెక్చరర్ ,స్త్రీ విముక్తి నవలా,25 సంపుటాల కధా రచయితా రచయిత పదహారేళ్ళ వయసులో ‘’చందమామ’’లో కధ రాసిన అనేక పురస్కార గ్రహీత –అవసరాల రామ కృష్ణారావు

ఒరిస్సా ,విశాఖల్లో ఇంగ్లీష్ లెక్చరర్ ,స్త్రీ విముక్తి నవలా,25 సంపుటాల కధా రచయితా రచయిత పదహారేళ్ళ వయసులో ‘’చందమామ’’లో కధ రాసిన అనేక పురస్కార గ్రహీత –అవసరాల రామ కృష్ణారావు అవసరాల రామకృష్ణారావు (డిసెంబర్ 21, 1931 – నవంబర్ 28, 2011) కథ, నవల రచయిత. 1931, డిసెంబర్ 21న చెన్నైలో జన్మించిన రామకృష్ణారావు … Continue reading

Posted in సమీక్ష | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -63(చివరి భాగం )

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -63(చివరి భాగం )    ప్రతి వ్యక్తీ గౌరవాన్ని వ్యక్తిత్వాన్ని శాస్త్రి గౌరవించాడు .అవతలి వారి తప్పులపై విరుచుకు పడేవాడుకాదు . నెమ్మదిగా చెప్పి మారేట్లు చేసేవాడు .మాట్లాడే స్వేచ్చ అ౦దరికి ఉండాలనే వాడు .తన అధికారాన్ని తప్పనిసరిగా ప్రయోగిన్చాల్సి వస్తే మృదువుగా ,అవతలి వారి అభివృద్ధికి దోహద పడేట్లు ,వారి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -62

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -62 మహోన్నత మనీషి శాస్త్రి  స్నేహ పవిత్రత శాస్త్రి బాగా గుర్తించాడు గాంధీలాగానే స్నేహధర్మం జీవితాంతం కొనసాగించాడు .స్నేహంలో డిగ్నిటి ఉండరాదు .మానవులు పరిపూర్ణంగా ఉండటం దేవతలకు ఇష్టం ఉండదు ఈర్ష్య పడతారు .స్నేహం లో వ్యాపారం ప్రవేశిస్తే ఇక స్నేహం ఖాళీ .బాల్యం నుంచి ఇతరులకు మంచిచేయటమే ఆయనకు తెలుసు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -61

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -61  మాటలో శాస్త్రి పాటలో లాగా మాధుర్యం చిదింస్తాడు .He was the master of ‘’the other harmony of prose ‘’.పీస్  శివ స్వామి ,సిపి రామస్వామి అయ్యర్ లు అసూయ పడతారనికానీ లేకపోతె ప్రపంచానికి ఇంగ్లిష్  ప్రోజ్ లో  మాస్టర్ పీస్ లు అందించి ఉండేవాడు .ప్రపంచానికి. … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -60

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -60   ఉపాధ్యాయుల హక్కులను శాస్త్రి ఎప్పుడూ సమర్ధించేవాడు .సౌత్ ఇండియన్ టీచర్స్ గిల్డ్  కు ఒక వ్యాసం రాస్తూ ఉపాధ్యాయుని అవసరం సమాజానికి చాలా ఉందని ఆయన పాత్ర సర్వ శ్రేష్టం అనీ అన్నాడు .వారు ఆదర్శంగా  నిబద్ధతతో  వ్యక్తిత్వం తోవిధి నిర్వహించాలి ,వారు కాంతి రేఖలై  మార్గ దర్శులు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -59

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -59 మహా విద్యావేత్త ,మహా వక్త ,మహా అక్షరార్చకుడు రైటానరబుల్ శ్రీనివాస శాస్త్రి జీవితం అంతా నేర్చుకొంటూ బోధిస్తూ గడిపాడు.’’బోధించటానికి నేర్చుకో .నేర్చుకోవటానికి బోధించు ‘’అనే ప్రాచీన నానుడిని అనుసరించాడు .పట్టుదలతో జీవితకాలమంతా నేర్చుకొంటూనే ఉన్నాడు.దాన్ని గర్వంగా రంద్రాన్వేషణకు ఉపయోగించలేదు .విద్యాబోధన స్కూల్ టీచర్ అయినా హెడ్మాస్టర్ అయినా వైస్ చాన్సలర్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -58

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -58  మహాత్ముని 1944 లో జైలు నుంచి విడుదల చేశారు .పాకిస్తాన్ విషయం వదిలేయమని శాస్త్రి చాలా ఉత్తరాలు గాంధీకి రాశాడు .శాంతి సమావేశానికి హాజరవమని విజ్ఞప్తి చేశాడు .2-4-1944న గాంధీకి రాసిన ఉత్తరం లో శాస్త్రి –‘’మీ జీవితంలో ఒక అద్భుత అవకాశం ప్రపంచ శాంతి సమావేశం జరుగబోతోంది .మీరు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -57

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -57   వైస్రాయ్  కాంగ్రెస్ తొ  యుద్ధానికి తోడ్పడమని జరుపుతున్న చర్చలు అన్నీ శాస్త్రి ఆసక్తిగా గమనిస్తూనే ఉన్నాడు .1940 లోవైస్రాయ్  ఇచ్చిన ‘’ఆగస్ట్ ఆఫర్ ‘’ను కాంగ్రెస్ ,గాంధీ  తిరస్కరించారు .గాంధీ కొద్దిమందితో వ్యక్తిగత సత్యాగ్రహం చేయాలనుకొన్నాడు .1942మార్చిలో సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ను రాయబారిగా బ్రిటీష ప్రభుత్వం ఇండియాకు పంపి అందులోయుద్ధం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -56

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -56పారమార్ధిక స్థాయినుంచి వ్యావహారిక స్థాయికి దూకిన లాఘవంతో శాస్త్రి గాంధీతో రాజకీయ పరిస్థితి చర్చిస్తూ ఉత్తరం రాస్తూ ఇలా అన్నాడు –‘’గట్టి బలం విశ్వాసాలున్న పార్టీ ఇప్పుడే అధికారం పొంది ప్రజలబాగుకోసం ,రక్షణ కోసం కృషికి ఉపక్రమించాలి .స్వతంత్రంతో పాటు అన్ని ఉద్యమాలను వెంటనే ఆపెయ్యాలి .నా అభిప్రాయాలను మీకు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బాలికలకు సంగీతవిద్యాలయం స్థాపించి ,సంగీత కచేరీల ప్రవేశానికి మొట్ట మొదటిసారిగా టికెట్ప్రవేశపెట్టిన కిరాణా ఘరానా సామ్రాజ్ఞి ,’’తార్సా గానానికి హాల్ మార్క్’’ ,పద్మభూషణ్ –హీరాబాయ్ బరోడేకర్

బాలికలకు సంగీతవిద్యాలయం స్థాపించి ,సంగీత కచేరీల ప్రవేశానికి మొట్ట మొదటిసారిగా టికెట్ప్రవేశపెట్టిన కిరాణా ఘరానా సామ్రాజ్ఞి ,’’తార్సా గానానికి హాల్ మార్క్’’ ,పద్మభూషణ్ –హీరాబాయ్ బరోడేకర్ బాలికలకు సంగీత విద్యాలయం స్థాపించి ,సంగీత కచేరీల ప్రవేశానికి మొట్ట మొదటిసారిగా టికెట్ ప్రవేశపెట్టిన కిరాణా ఘరానా సామ్రాజ్ఞి ,’’తార్సా గానానికి హాల్ మార్క్’’ ,పద్మ భూషణ్  –హీరాబాయ్ … Continue reading

Posted in సమీక్ష | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦.66 వ భాగం .6-8-23.

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦.66 వ భాగం .6-8-23.

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -55

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -55  కంగ్రెస్ వర్కింగ్ కమిటికి ఒక లేఖ పంపుతూ శాస్త్రి –‘’విషయం చాలా లోతుకు పోయింది .అది అక్కడే చిక్కుకుపోయింది .వర్కిగ్ కమిటీ తొ  గాంధీకి ఉన్న  విభేదమమిటి ?అది నాన్ వయోలెన్స్ కు భ్రస్తత్వం  అనుకోన్నారా ?బ్రిటన్ తొ లాభ సాటి బేరాలు ఆడకుండా సహకరించాకూడ దనా ?వర్కింగ్ కమిటి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శబ్దార్ధ కల్పతరువు ఇక అందరి చేతుల్లో….

శబ్దార్ధ కల్పతరువు ఇక అందరి చేతుల్లోమాన్యశ్రీ మామిడి వెంకటార్య రచించిన శబ్దార్ధ కల్పతరువు –సంస్కృత –సంస్కృత –తెలుగు నిఘంటువు కోసం చాలా మంది సాహితీ వేత్తలు గత రెండు మూడేళ్లుగా నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు .నాదగ్గర లేదని చెబుతూనే ఉన్నాను ,నేనూ మ అబ్బాయి శర్మ కూడా తీవ్రంగానే దానికోసం ప్రయత్నించినా ఫలితం కలగలేదు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -54

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -54 లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నత సభకు రైటానరబుల్ శ్రీనివాస శాస్త్రి నామినేట్ అయ్యాడు .సహజంగా ప్రతిపక్ష నాయకుడు అవటంతో ప్రభుత్వాన్ని వీలైనప్పుడల్లాతప్పులు చూపి కడిగి పారేసే వాడు .భారత దేశం లో ప్రజాస్వామ్య వ్యవస్థకు కాంగ్రెస్ మూల స్థానం కావా;లని శాస్త్రి ఆశయం .కాంగ్రెస్ హైకమాండ్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాల రోజు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

శ్రీ వెంపటి నాగభూషణం -4(చివరి భాగం )

శ్రీ వెంపటి నాగభూషణం -4(చివరి భాగం ) కృష్ణుడు రాధకు సర్వస్వం .కృష్ణుని చిన్న భార్యకనుక ఇళను సర్వస్వంగా పెంచి తగిన ఇల్లాలుగా చేసింది తన అనుభవమంతా వినియోగించి .శృంగారించి గదిలోకి పంపింది .ఇక అక్కడనుంచి ఆమె ప్రవృత్తి సాఫుగా మారిపోతుంది .అంతకు ముందు ఇళ తన శిష్యురాలు .నవ్వులాటకు సవతి అనిపరిహాసం చేసినా ,మనసులో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -53

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -53  అన్నామలై లో తిరుగు బాటు దార్లులైన విద్యార్ధులలో ఒకతను శాస్త్రి ముఖ్య స్నేహితుని కొడుకే .సౌతాఫ్రికాకు చెందిన శ్రీమతి నాయుడు ,శాస్త్రి ఇక్కడ విసి అని ఆకుర్రాడిని ఇక్కడ చేర్చింది .ఇది కొంత అడ్వాంటేజ్ గా తీసుకొని ఆకుర్రాడు గోపాలన్ చెడు సావాలకు చేరువై ఇబ్బంది కలిగించాడు .నాయుడు దంపతులు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -52

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -52  శ్రీనివాస శాస్త్రి రెండవ సారి వైస్ చాన్సలర్ అయినప్పుడు విద్యార్ధుల అమ్మే వలన ఆటంకం కలిగింది .ఇద్దరు విద్యార్ధుల మధ్య స్పర్ధ చిలికి చిలికి గాలి వానై ,మధ్యలో అసాంఘిక శక్తులు ప్రవేశించటంతో తీవ్రమైంది .ఈపుస్తకరచయిత అప్పడు అక్కడ లెక్చరర్ .అవిశ్వాసం దావానలమై ప్రాకిపోయింది ,శాస్త్రి బహు చాకచక్యంతో సమర్ధతత … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ వెంపటి నాగభూషణం -2

శ్రీ వెంపటి నాగభూషణం -2 మగ వారికి చేతకాదని ,దోషాపవాదన లేశం కూడా కాదు .ఎంత ఊహించి కథా దృశ్యం చిత్రించినా మగవాడు దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్ట నీడు-చీకటి తప్పు కనుక .పింగళి సూరన్న స్వతంత్రి౦చినాడనుకొన్నా ,సుగాత్రి చేత ఇద్దురు బ్రతిమిలాడించ దానికి నాయికా నాయకులను ,వైదిక దంపతులను ఊరవతల చెట్ల చాటున … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -51

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -51 అన్నామలై యూనివర్సిటి వైస్ చాన్సలర్- రైటానరబుల్ శ్రీనివాస శాస్త్రి భార్య చనిపోవటం వయసు పెరగటం ఆరోగ్యం తగ్గటం శ్రీని వాస శాస్త్రిని తను బాగా ఇష్టపడేబెంగులూరు లో స్థిర పడేట్లు చేశాయి .అక్కడి వాతావరం ముఖ్య స్నేహితుడు గుండప్ప సహకారం ఆయనకు బాగా తోడ్పడ్డాయి .మైసూర్ యూని వర్సిటి  ఎక్స్టేన్షన్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మహా మహోపాధ్యాయ బ్రహ్మశ్రీ వేదము వేంకట రాయ శాస్త్రి గారి ప్రతాప రుద్రీయం.2 వ భాగం.31.7.23.

మహా మహోపాధ్యాయ బ్రహ్మశ్రీ వేదము వేంకట రాయ శాస్త్రి గారి ప్రతాప రుద్రీయం.2 వ భాగం.31.7.23.

Posted in పుస్తకాలు, సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -49

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -49 శాస్త్రిరాసిన ఒక ఉత్తరం లో –‘ఈ  ఆఫీసులో ముఖ్యమైన ఆకర్షణ ,సామాన్య ప్రజల దృష్టిలో తేలిక,సుఖవంతమైన గౌరవం .నవంబర్ లోవిల్లింగ్టన్ శాస్త్రికి  రాసిన  జాబులో –‘’మా మేనేజింగ్ కమిటీ అందులోని మెంబర్ ను చేర్చటానికి తీసేయ్యతానికి అధికారం పూర్తిగా ఉంది .వచ్చే సమావేశంలో మీ భావాలేమితో స్పష్టంగా చెప్పమని నిర్మొహమాటంగా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -48

రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి –48 17-8-1932 న బ్రిటీష ప్రధాని రామ్సే మాక్దోనాల్ద్ ఒక కమ్యూనల్ అవార్డ్ ప్రకటిస్తూ కేంద్ర ,రాష్ట్ర సభలలో ముస్లిం లకు ,అణగారిన తరగతువారికి కొన్ని వెయిటేజీ లను ఇచ్చాడు .ఈ ప్రత్యెక నియోజక వర్గాలనుంచి వారు తమ వోటర్ జాబితాల ఆధారంగా ఎన్నికకావచ్చు .కేంద్ర స్థానాలకు కూడా వారు పోటీ చేయవచ్చు.దీన్ని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

కిరాణా ఘరానా కు చెందిన సంగీత విద్వాంసుడు అబ్దుల్ కరీంఖాన్

కిరాణా ఘరానా కు చెందిన సంగీత విద్వాంసుడు అబ్దుల్ కరీంఖాన్ అబ్దుల్ కరీంఖాన్ లేదా ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ (నవంబరు 11, 1872 – 1937), 20 వ శతాబ్దపు హిందుస్తానీ సంగీతంలోని కిరాణా ఘరానాకు చెందిన వారిలో ప్రముఖుడు జీవితం అబ్దుల్ కరీంఖాన్ ఉత్తరభారతంలోని కిరాణా అనే ప్రాంతంలో జన్మించాడు. కిరాణా ఘరానాకు మూలపురుషులు, … Continue reading

Posted in సమీక్ష | Leave a comment