కాంగ్రెస్ పులి ,జైలు పట్టభద్రుడు ,లోకమాన్య పత్రిక సంపాదకుడు ,అనంతపురం  స్వాతంత్ర్య సమరయోధుడు ,శాసన సభ డిప్యూటీ స్పీకర్ ,పద్మశ్రీ –కల్లూరు సుబ్బారావు

కాంగ్రెస్ పులి ,జైలు పట్టభద్రుడు ,లోకమాన్య పత్రిక సంపాదకుడు ,అనంతపురం  స్వాతంత్ర్య సమరయోధుడు ,శాసన సభ డిప్యూటీ స్పీకర్ ,పద్మశ్రీ –కల్లూరు సుబ్బారావు

కల్లూరు సుబ్బారావు (1897 – 1973), అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. తెలుగుకన్నడ పండితుడు, వక్త, కవి. వృత్తిరీత్యా అధ్యాపకుడైన సుబ్బారావు 1920లలో స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు.

సుబ్బారావు, అనంతపురం జిల్లా, హిందూపురానికి సమీపంలోని కల్లూరు గ్రామంలో 1897, మే 25న సూరప్ప, పుట్టమ్మ దంపతులకు జన్మించాడు. మదనపల్లెలోని జాతీయ కళాశాలలో 12వ తరగతి వరకు చదువుకున్నాడు. 17 ఏళ్ల వయసులో అనీబిసెంట్ ప్రసంగాన్ని విని, ఉత్తేజితుడై, జాతీయోద్యమంలో పాల్గొనటం ప్రారంభించాడు. 1920లో జరిగిన ఆంధ్రమహాసభలో పాల్గొని, అయ్యదేవర కాళేశ్వరరావుదుగ్గిరాల గోపాలకృష్ణయ్య లతో స్నేహం పెంపొందించుకున్నాడు. 1921లో విజయవాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెసు సమావేశాల్లో స్వచ్ఛందసేవకునిగా పనిచేశాడు. అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళి, మొత్తం ఏడేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించాడు. ఆంగ్లేయులు ఈయన్ను కాంగ్రెస్ పులి అని అభివర్ణించారు. బాబూ రాజేంద్ర ప్రసాద్ ఈయన్ను జైలుపట్టభద్రుడుఅని కొనియాడాడు. సుబ్బారావు లోకమాన్య అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు.

స్వాతంత్ర్యం తర్వాత మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. 1955లో ఆంధ్రరాష్ట్ర శాసనసభకు, 1965లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైనాడు. 1955లో శాసనసభ డిప్యూటీ స్పీకరుగా కూడా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శిగా కూడా పనిచేశాడు. 1967లో భారత ప్రభుత్వం ఈయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. సుబ్బారావు 1973, డిసెంబరు 21న[1] మరణించాడు.

 మా నాన్న గారు గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారు హిందూపురం లో తెలుగు పండిట్ గా పని చేసినపుడు కల్లూరి వారు తరచుగా కలిసేవారు సాహిత్యసభలకు నాన్నగారు వెళ్ళేవారు .ఆయన రాసిన పుస్తకాలపై సమీక్ష చేసేవారు .కానీ ఆయన్ను ఎప్పుడూ నేను చూడలేదు .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-9-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

రాయలసీమ స్వాతంత్ర్య సమరయోధులు ,శ్రీబాగ్ ఒడంబడికలో కీలకపాత్రదారి ,వడ్డాది వారి శిష్యులు ,సంజీవరెడ్డికి గురువు ,’’వదరుబోతు ‘’వ్యాసకర్త ,గ్రందాలయోద్యమనాయకులు ,’’పినాకిని’’పత్రిక ,భువనవిజయం భవన స్థాపకులు ,శాసన సభ్యులు –శ్రీ పప్పూరు రామాచార్యులు

రాయలసీమ స్వాతంత్ర్య సమరయోధులు ,శ్రీబాగ్ ఒడంబడికలో కీలకపాత్రదారి ,వడ్డాది వారి శిష్యులు ,సంజీవరెడ్డికి గురువు ,’’వదరుబోతు ‘’వ్యాసకర్త ,గ్రందాలయోద్యమనాయకులు ,’’పినాకిని’’పత్రిక ,భువనవిజయం భవన స్థాపకులు ,శాసన సభ్యులు –శ్రీ పప్పూరు రామాచార్యులు

పప్పూరు రామాచార్యులు (నవంబర్ 8, 1896 – మార్చి 21, 1972) [1]రాయలసీమ ప్రముఖుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. శ్రీబాగ్‌ ఒడంబడికలో రాయలసీమకు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖులలో రామాచార్యులు కూడా ఒకరు .

2022 మార్చి 21న పప్పూరు రామాచార్యులు 50వ వర్ధంతి జరుపుకోనున్నారు.[2]

జీవిత విశేషాలు
నరసింహాచార్యులు, కొండమ్మ దంపతులకు 1896 నవంబర్ 8వ తేదీనఅనంతపురంలో పప్పూరు రామాచార్యులు జన్మించారు. శ్రీవైష్ణవ సంప్రదాయానికి చెందిన బ్రాహ్మణ కుటుంబీకుడు. ఇతని పూర్వీకులు పప్పూరు నుండి అనంతపురానికి వచ్చి స్థిరపడినవారు కాబట్టి ఇతని కుటుంబాన్ని పప్పూరువారని అనటం ఆనవాయితీ అయింది. ఇతని తండ్రి నరసింహాచార్యులు పేరు మోసిన పౌరాణికుడు. హరికథలు చెప్పడంలో సిద్ధహస్తుడు. అతడి పురాణప్రసంగాలలో హాస్యధోరణి అధికం. ఆ లక్షణాలే కుమారునిలో కూడా పొడచూపాయి. పప్పూరు రామాచార్యులు తండ్రివద్దే సంస్కృతాంధ్రాలు నేర్చుకున్నాడు. ప్రాథమిక విద్య అనంతపురం మునిసిపల్ హైస్కూలులో సాగింది. రాజమండ్రిలో అతని బావ కుంటిమద్ది రంగాచార్యుల వద్ద చేరి స్కూలు ఫైనల్ పాసయ్యాడు.[3] రాజమండ్రి పాఠశాలలో వడ్డాది సుబ్బారాయుడు ఇతనికి ఆంధ్రభాషను బోధించే గురువు. అక్కడే కందుకూరి వీరేశలింగంతో పరిచయం ఏర్పడింది. 1914-16లో మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. ఆ సమయంలోనే రాజకీయాలంటే మక్కువ ఏర్పడింది. 1917లో అనంతపురం లోని దత్తమండల కళాశాలలో బి.ఏ.చేరారు. రామాచార్యులు 1917-1918లలో బి.ఏ. చదువుకుంటున్న సమయంలో సహాధ్యాయి కర్నమడకల గోపాలకృష్ణమాచార్యులతో కలిసి పదిహేను రోజులకొకసారి ‘వదరుబోతు’ పేరున వ్యాసాలను ప్రచురించి కరపత్రాలుగా పంచేవారు. అప్పటి సమకాలీన సమాజ పరిస్థితులు, సాంఘిక దురాచారాల ఖండన, జాతీయోద్యమం మొదలైన అంశాలపై హాస్య, వ్యంగ్యాత్మక ధోరణిలో, సులభమైన భాషాశైలిలో రెండు సంవత్సరాల పాటు యాభైకి పైగా వ్యాసాలను వెలువరించారు. వీటిలో ఒక వ్యాసం మాత్రం రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వ్రాశాడు. వీటిని అనాటి అనంతపురంలోని స్వామి విలాస ప్రెస్సు లో ముద్రించారు. ఆంగ్ల సాహిత్యంలో టాట్లర్ పేరుతో వ్యాసాలు రాసిన స్టీలు ప్రేరణతో వీరు ఈ వ్యాసాలు రాశారు[4]. యాబై వ్యాసాలలో ఇరవై రెండు వ్యాసాలను వ్యాసపాఠకుడైన హిందూపురానికి చెందిన పక్కా గురురాయాచార్యుల నుండి సేకరించి, 1932న పుస్తకరూపంలో ముద్రించారు. ఈ పుస్తకానికి రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ ముందుమాట రాశాడు. 1920లో బి.ఏ. పూర్తికాగానే కలెక్టర్ ఆఫీసులో చిన్న ఉద్యోగంలో చేరారు.

స్వతంత్రంగా జీవించాలనే ఉద్దేశంతో 1921లో ఆ ఉద్యోగాన్ని మానివేశారు. ఆ సమయంలో కైప సుబ్రహ్మణ్యశర్మతో పరిచయం ఏర్పడింది. అతని సహకారంతో ఇల్లూరులో నీలం సంజీవరెడ్డికి మరికొందరు పిల్లలకు ప్రైవేటు పాఠాలు చెప్పేవారు. కైప సుబ్రహ్మణ్యశర్మ, అతని సోదరుడు మహానందయ్య, ఐతరాజు నరసప్ప, పాలకొండ రామచంధ్ర శర్మ, ఆత్మారామప్ప మొదలైన వారితో కలిసి 1922లో పినాకిని అనే వారపత్రికను ప్రారంభించారు. 1925 వరకు ఈ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. ఆ పత్రిక భాగస్వాములతో భేదాభిప్రాయాలు ఏర్పడి బయటకు వచ్చి 1926లో శ్రీ సాధన అనే పత్రికను స్థాపించి, స్వంత ప్రెస్సు సాధన ముద్రణాలయంలో ప్రచురించారు. ఈ పత్రికను 1972 మార్చిలో మరణించే వరకూ ఒక్క చేతితో నిరాఘాటంగా నడిపారు.

గ్రంథాలయోద్యమంలో పాత్ర
అనంతపురం జిల్లాలో గ్రంథాలయోద్యమంతో పాటు సాహిత్య సాంన్కృతిక రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తుల్లో పప్పూరు రామాచార్యులు ఒకరు. నిరంతరం గ్రంథపఠన చేస్తూ అనేక విషయాలను ఆకళింపు చేసుకునేవారు. ఆయన సంస్కృతాంధ్ర పాండిత్యాలు భారతదేశ సంస్కృతి మూలసూత్రాలను చక్కగా అర్ధం చేసుకోవ డానికి దోహదం చేసింది. వ్యక్తిత్వ వికాసానికి గ్రంథపఠన ఆవశ్యకతను తొలుతనే గుర్తించినారాయణ. గ్రంథాలయాలు లేని రోజుల్లో రామాచార్యులు స్వయంగా పుస్తకాలు సేకరించి చిన్న పుస్తక భాండాగారం నెలకొల్పి కొంతకాలం నిర్వహించారు.

అనంతపురం చుట్టుప్రక్కలున్న తాలూకా, గ్రామస్థాయి గ్రంథాలయాలకు సైతం చేర్చేవారు. 1947-52 వరకు అనంతపురం పట్టణ మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నప్పడు ఆ మునిసిపాలిటి ఆదాయం పెరిగి 3వ గ్రేడ్ నుండి 2వ గ్రేడ్ స్థాయికి చేరుకుంది. ఇందులో గ్రంథాలయా లకు గ్రంథాలయ పన్నులు సక్రమంగా చెల్లించి నూతనంగా గ్రంథాలయాలను నెలకొల్పి కొత్త పుస్తకాలను సమకూర్చారు. అనంతపురం మునిసిపాలిటీలో నిరంతర విద్యా విజ్ఞాన భాండా గారాన్ని నెలకొల్పడం అనేది ప్రశంసనీయమైన నిర్ణయమని మద్రాస్ మెయిల్ అనే పత్రిక 4.11.1950 తేదీన సంపాదకీయంలో పేర్కొంది. ఆ సంపాదకీయం చదివిన నాటి జిల్లా కలెక్టర్ జేమ్స్ రామాచార్యులను ప్రత్యేకంగా అభినందించారు.

1952లో అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ ఏర్పడినప్పడు తొలి అధ్యక్షులుగా పనిచేసే అవకాశం కల్గింది. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి సరైన భవనం దొరకలేదు. తన ఇంటిలోని మూడు గదులను గ్రంథాలయ అవసరాలకు ఇచ్చివేశారు. సొంత పత్రిక శ్రీసాధనను జిల్లాలోని గ్రంథాలయాలకు ఉచితంగా పంపిణి చేశారు. వీరు జిల్లాలోని గ్రంథాలయాలకు చేసిన కృషి మరువరానిది. అనంతవురం జిల్లా కేంద్ర గ్రంథా లయానికి భవనం కావల్సి వచ్చింది. స్థానిక మ్యూజియం వారిని ఒప్పించి ఆ భవనాన్ని రూ.46,000/- లకు గ్రంథాలయ సంస్థకు విక్రయింపచేశారు. రాయలసీమలోని అన్ని జిల్లాలో కంటే ముందుగా అనంతపురంలో జిల్లా కేంద్ర గ్రంథాలయానికి సొంత భవనం సమకూర్చుకుంది. ముందుచూపుతో కేంద్ర గ్రంథాలయ భవన సమీపంలో దాతలతో 30వేలకు పైగా నిధిని, 50 సెంట్ల స్థలాన్ని సేకరించి మహిళా, బాలల గ్రంథాలయాలను ఏర్పరచారు. వీటి ప్రారంభోత్సవానికి గాడిచర్ల హరిసర్వోత్తమరావు విచ్చేయడం విశేషం. జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన ప్రాంగణంలో 1969లో ఆరుబైలు రంగస్థలం భువనవిజయం మంటపం నిర్మాణంలో కీలకపాత్ర వహించి దీని ప్రారంభించడానికి వావిలాల గోపాలకృష్ణయ్య, నీలం సంజీవరెడ్డి, పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు మొదలైన ప్రముఖులు విచ్చేశారు. ఇలా అన్ని సదుపాయాలు చేకూరడంతో 1969లో ఈ జిల్లా గ్రంథాలయ సంస్థ గ్రంథా లయోద్యమ ప్రముఖులు డా.ఎస్.ఆర్.రంగనాథన్ ప్రశంసలకు పాత్రమైనది. జిల్లా గ్రంథాలయ సంస్థ రావూచార్యులను ఘనంగా సన్మానించింది. 1970లో ఆయన ఛాయాచిత్రాన్ని గ్రంథాలయంలో ఆవిష్కరించారు. 1930లో జరిగిన ఒక సంఘటన పప్పూరి వారికి గ్రంథాలయోద్యమం పట్ల గల అభిమానానికి సేవానిరతికి మచ్చుతునక.

స్వాతంత్రోద్యమంలో పాత్ర
ఈయనా , కల్లూరు సుబ్బారావు కలిసి గ్రామగ్రామాలకూ తిరిగి అక్కడి ప్రజలలో స్వాతంత్ర్య సమూపార్జనా కాంక్షను రేకెత్తించారు. మద్యపాన నిషేధము, ఖద్దరు వస్త్రధారణ, హరిజనోద్ధరణ, గ్రామ పరిశుభ్రత మొదలైన కార్యక్రమాలను చేపట్టారు. 1921లో గాంధీని తాడిపత్రిలో సందర్శించారు. ఆ సమయంలో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్షను అనుభవించారు. 1928 నవంబరులో నంద్యాలలో జరిగిన ఆంధ్రమహాసభలలో పాల్గొని దత్తమండలాలకు బదులు రాయలసీమ అని వ్యవహరించాలని ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదింప జేశారు. 1932లో ఒక సంవత్సరం పాటు సహాయనిరాకరణోద్యమంలో భాగంగా జైలుశిక్షను అనుభవించారు.1937 నవంబర్ 17న శ్రీబాగ్‌ ఒడంబడికలో క్రియాశీలక పాత్రవహించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఈయన అరెస్టయ్యి తంజావూరు, వేలూరు జైళ్ళలో రెండేళ్ళు జైలుశిక్ష అనుభవించారు. ఆ సమయంలో ఇతడు తనకున్న సహజ పౌరాణిక ప్రవచనాలతో తోటి డిటెన్యూలకు భారత, కాళిదాస కావ్యములలోని రమ్యభావాలను వినిపిస్తూ, సత్కాలక్షేపం చేసేవారు. వీరి ప్రవచనాపాండిత్యానికి రాజకీయఖైదీలు సంతోషించి జైలులోనే ఇతనికి పండిత సత్కారాలను నెరవేర్చేవారు. జైలు నుండి విడుదలైన తర్వాత కూడా పురాణ కాలక్షేపాన్ని కొనసాగించారు. బళ్ళారిలో చేసిన పురాణ పఠనాన్ని విని బళ్ళారి రాఘవ బంగారుపతకంతో సత్కరించాడు. 1947నుండి 1952 వరకు అనంతపురం పట్టణ మున్సిపల్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 1952 నుండి 1955 వరకు జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 1955 నుండి1962 వరకు ధర్మవరం నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.[5] వీరి రచనా సామర్థ్యానికి వదరుబోతు వ్యాసాలు మచ్చుతునకలు. కల్లుపెంట అనే నాటకం వ్రాశాడు. రామయ్య పదాలుపేరుతో ‘విశ్వవినుత నామ వినుము రామ’ అనే మకుటంతో 40 పద్యాలు వ్రాశారు. పినాకిని, సాధన పత్రికలతో పాటుగా సహకార పత్రికకు కుడా సంపాదకత్వం నెరపారు. దక్షిణభారత హిందీ ప్రచారసభ వారి స్రవంతి పత్రిక సంపాదకవర్గంలో సభ్యుడిగా ఉన్నారు. 1972 మార్చి21 వతేదీ తన 76వ యేట మరణించారు.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-9-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మనవెండి తెరమహానుభావులు -311311-’కుదిరితే ఒక కప్పు కాఫీ ‘’డైలాగ్ ఫేం ,ఎయిర్లైన్స్ ఉద్యోగి సినీనటుడు –రాజా

రాజా ఒక తెలుగు సినీ నటుడు. రాజా స్వస్థలం విశాఖపట్నం.[1] తల్లి క్రిష్టియన్, తండ్రి హిందూ మతానికి చెందిన వారు. ఇరువైపులా తల్లిదండ్రులకు ఇష్టం లేకుండానే పెళ్ళి చేసుకున్నారు. కాబట్టి వాళ్ళింటికి బంధువులు ఎవరూ వచ్చే వాళ్ళు కాదు. ఆయనకు ఇద్దరు అక్కలు. రాజాకు ఎనిమిదేళ్ళ వయసులో ఊపిరితిత్తుల క్యాన్సర్ తో అమ్మ చనిపోయింది. ఆ సంఘటన వారి జీవితంలో పెద్ద విషాధాన్ని నింపింది. తరువాత వాళ్ళు హైదరాబాదుకి వచ్చేశారు. వ్యాపార రీత్యా వాళ్ళ నాన్న విదేశానికి వెళ్ళాడు. కొద్ది కాలం అక్కడ గడిపిన తర్వాత ఆయన స్వదేశానికి వచ్చేశారు. అయితే వారికి ఆ ఆనందం ఎక్కువ సేపు నిలువలేదు. స్వదేశానికి వచ్చిన ఏడాదికే ఆయన గుండెపోటుతో చనిపోయాడు.

వాళ్ళ నాన్న చనిపోయేటప్పటికి రాజాకు పద్నాలుగేళ్ళు. రాజాతో పాటు వారి అక్క వాళ్ళు కూడా పెద్ద దిక్కులేకుండా ఉండడాన్ని భరించలేక పోయారు. ఒకానొక దశలో బాగా డిప్రెషన్ కు లోనై ఆత్మ హత్య చేసుకుందామని నిర్ణయించుకుని పురుగుల మందు తాగేశారు. అయితే కొద్ది సేపటి తర్వాత వాళ్ళ స్నేహితులు కొంతమంది వచ్చి ఆసుపత్రిలో చేర్చడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అంతేకాక వాళ్ళు శ్రేయోభిలాషులు కొంతమంది కౌన్సెలింగ్ చేశారు. అన్నింటికీ చావే పరిష్కారం కాదని ధైర్యం చెప్పారు.

తర్వాత రాజా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ అయిపోయాక లుఫ్థాన్సా ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగానికి 3500 మంది పోటీ పడగా ఎంపికైన నలుగురిలో రాజా ఒకడు. ఉద్యోగం రావడంతో వారి కుటుంబ కష్టాలు దాదాపు తీరిపోయాయి. శిక్షణలో ఉండగానే దాదాపు 40,000 జీతం వచ్చేది. తరువాత అది 60000 కి పెరిగింది. అక్కకి పెళ్ళి చేశాడు.

చదువైపోయి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. డబ్బు కూడా వెనుకేసుకున్నాడు. అప్పుడు రాజా మనసులో ఏ మూలనో ఉన్న నటుడు కావాలనే కోరిక బయటపడింది. రెండున్నరేళ్ళుగా చేస్తున్న ఉద్యోగం వదిలేసి అమెరికా వెళ్ళి థియేటర్ యాక్టింగ్ కోర్సులో చేరాడు. అది పూర్తి చేసుకుని స్వదేశానికి చాలా ఆత్మవిశ్వాసంతో తిరిగివచ్చాడు. ఫోటోలను, సర్టిఫికేట్లను చేతపట్టుకుని నిర్మాతల చుట్టూ తిరిగాడు. రకరకాల అనుభవాలను ఎదుర్కొన్నాడు. అవకాశాలు మాత్రం రాలేదు. కొద్ది కాలం తర్వాత విసిగిపోయి ముంబై వెళ్ళి మోడలింగ్ అవకాశాల కోసం అన్వేషించాడు. వీడియో ఆల్బమ్స్ లోనూ, నాటకాల్లోనూ నటించాడు.

అలా ఒకసారి సికింద్రాబాద్ క్లబ్‌లో నాటకం వేయడానికి వచ్చి పాత్రికేయుల కళ్ళలో పడ్డాడు. వారు తమ సమీక్షల్లో రాజా గురించి ప్రత్యేకంగా రాశారు. ఆ రివ్యూలు చూసిన దగ్గుబాటి రామానాయుడు నుంచి అందుకున్న ఫోన్‌కాల్ సినీ పరిశ్రమలో రాజా తొలివిజయం అని చెప్పవచ్చు. నటుడిగా రాజా మొదటి సినిమా ఓ చినదానా. ముంబైలో ఉన్నప్పుడు ఇతడికి ఇ.వి.వి. సత్యనారాయణ కొడుకులతో సంబంధాలుండేవి. వారి ద్వారా ఈ సినిమాలో సెకండ్ హీరోగా అవకాశం వచ్చింది. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ (సినిమా) రాజాకు పేరు తెచ్చిపెట్టింది.

సినిమాలు
· ఓ చినదాన

· విజయం

· ఆనంద్

· అప్పుడప్పుడు

· కల

· మొగుడు పెళ్ళాం ఓ దొంగోడు

· మిష్టర్ మేథావి

· జగన్మోహిని

· టాస్

· ఆ నలుగురు

· కోకిల

· కేక

· కలియుగ

·

Posted in సినిమా | Tagged | Leave a comment

త్రిభాషా కోవిదుడైన స్వాతంత్ర్య సమరయోధులు ,భారత రాజ్యంగచరిత్ర కర్త,శాసన సభ్యులు –శ్రీ ఆత్మకూరి గోవిందా చార్యులు

త్రిభాషా కోవిదుడైన స్వాతంత్ర్య సమరయోధులు ,భారత రాజ్యంగచరిత్ర కర్త,శాసన సభ్యులు –శ్రీ ఆత్మకూరి గోవిందా చార్యులు

ఆత్మకూరి గోవిందాచార్యులు (1895-1973) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు, ఆంగ్లం, సంస్కృత భాషల కోవిదుడు, పలు గ్రంథకర్త, పత్రికాధిపతి, సంపాదకుడు, శాసన సభ్యుడు.

బాల్యం, విద్యాభ్యాసం
ఆత్మకూర గోవిందాచార్యులు 1895లో పశ్చిమగోదావరి జిల్లాలోని అగ్రహారగోపవరం గ్రామంలో పుట్టారు. సంపన్నులైన వైష్ణవ బ్రాహ్మణుల కుటుంబంలో, వేంకట కృష్ణమాచార్యులు, సుభద్ర దంపతులకు కుమారునిగా జన్మించారు. ఆయన తెలుగు, ఆంగ్లం, సంస్కృతం అభ్యసించారు. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి శిక్షణ కోర్సును చదవడం ప్రారంభించారు.

స్వాతంత్ర సమరంలోకి
ప్రభుత్వోపాధ్యాయ కోర్సు చదవడం ప్రారంభించిన ఆత్మకూరి గోవిందాచార్యులు 1920 అక్టోబర్ 13న గాంధీజీ ఇచ్చిన పిలుపును అందుకుని విద్యాభ్యాసం వదలిపెట్టారు. 1920లో కలకత్తా, నాగపూర్ లలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలకు హాజరై పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల తరఫున గాంధీ సహాయ నిరాకరణను సమర్థిస్తూ మాట్లాడారు. 1921లో ఏలూరులో గాంధీ ప్రబోధించిన జాతీయ విద్యాలయం స్థాపించినవారిలో ఆయన ఆత్మకూరి కూడా ఉన్నారు.

పత్రికా సంపాదకునిగా
వీరు ఏలూరు నుండి 1924లో సత్యాగ్రాహి అనే పేరుతో ఒక రాజకీయ వారపత్రికను స్థాపించి దానికి సంపాదకులుగా ఉన్నారు[1].

రచనలు
· గోవింద రామాయణము[2]

· మహాత్మా గాంధీ చరిత్ర

· భారతదేశ ఆర్థికచరిత్ర

· భారతీయ రాజ్యాంగ చరిత్ర

· పాహిమాం శతకము

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-9-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారి జీవితం.17వ భాగం.7.9.22

శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారి జీవితం.17వ భాగం.7.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -3

ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -3
కవిగా జీవనానంద
జీవనాన౦ద దాస్ కవిత్వం లో ప్రత్యేకత అతని భావ చిత్రాలలో నవ్యత .ఇందులో సంప్రదాయం సమకాలీన భావ సమైక్యతా ఉంటాయి .అతని భావ చిత్రాలు టాగూర్ వాటికంటే ప్రత్యేకంగా ఉంటాయి .టాగూర్ భావ చిత్రాలు అనువాదం లో తేలిపోతాయి అంటే పేలవమై పోతాయి .ఈయనవి స్పష్టంగా నిలుస్తాయి.ఇతనికవిత్వం లో పదాలు సందర్భ శుద్ధి దాటి ఎక్కడో ఉండి అధివాస్తవిక భావనాబలం తో కొత్తగా కనిపిస్తాయి ఇతని ‘’మృత్యు పరిష్వంగానికి ముందు ‘’కవిత విశిష్ట మార్గం లో ఉంటుంది .దీని నిండా కళ్ళకు కనిపించే ,చెవులకు వినిపించే చిత్ర ,క్లిష్ట సంకేతాలు౦టాయి .ఆయన అనుభూతుల్లోంచి రెక్కలు వచ్చి ఎగిరిపోతున్నట్లు ఉంటాయి .అలంకారాల అందం బలంగా మనసులోకి చొచ్చుకుపోతుంది .ఉదాహరణ –‘’నది ఒడ్డున మంచుపూలు వెదజల్లుతున్న –నారీరత్నాలను చూసిన మేం –నీటిలో ఏకాంతంగా ఈదే –చేపకన్నెల నేత్రాలలోకి –అలల ద్వారా చొచ్చుకు పోయిన –ధాన్యపు సుగంధాలు దర్శించాం-ఇంతకూ మించి నేర్చే దీమిటి ? మృత్యు పరిష్వంగానికి ముందు కు ?ఎర్రగా ఎత్తుగా పెరిగిన ప్రతికోర్కేకు పక్కన గోడలా –నల్లటి మృత్యు ముఖం దాక్కుందని నరులైన మనకు తెలీదా ?మనిషి మనసులో పండే కలలూ ,ఐహిక భోగాల బంగారు చాయలూ –ఒక మహా ప్రశాంత నిశ్చలయోగ స్థితిలో –సమతూకం లో ఉంటాయని ప్రజలకు తెలీదా ?’’
ఇలా ఒకదాని వెంట మరో భావచిత్రం పరుగులు తీసి పరాకాష్టకు చేరతాయి .
ఇదే కృష్ణ శాస్త్రి గారి ‘’ఆకులో ఆకునై ,పూవులో పూవునై ‘’కవితలా మనల్ని మెరిపిస్తుంది .కళ్ళను పేము చెట్టు పళ్ళతో పోలుస్తాడు .ముగ్గురు ముష్టివాళ్ళు కవితలో పట్టణవాతావరణం హాస్యం గా పోషించాడు .’’ఎముకముక్క తిన్న కోతి నీటిలో ప్రతిఫలిస్తుంది’’ అంటాడు
‘’ సరోజినీ సమాధి ‘’కవితలో –‘’ఇదుగో ఇక్కడే నిద్రిస్తోంది మన సరోజినీదేవి –ఇంకా ఇక్కడే ఉందేమో నాకు తెలీదు –ఇక్కడే శాశ్వతంగా ఉండేట్లు –సంగీతాన్ని దాచిపెట్టారు ‘ఈ వర్ణనలో శ్మశానం కనిపించదు.సజీవ స్త్రీ ప్రక్కమీద పడుకొన్న భావం కలుగుతుంది .వర్ణన హఠాత్తుగా ఊహా స్థాయి నుంచి ,విశ్వభావన స్థాయికి ఉవ్వెత్తున ఎగిరిపోతుంది —‘’ఆకాశం లో కాషాయ వర్ణ కిరణ శకలం ఒకటి – పరివేషం తో మిలమిల మెరుస్తోంది-నీహారం కప్పిన నిప్పు కన్నెలా –బూడిదలో దాక్కుని కనిపించని పిల్లిలా –కనిపించీ కనిపించని ముఖం మీద చిరునవ్వు చిందులతో –చూపరుల కనువిందు తో ‘’సరోజినీ సమాధిని వర్ణించాడు .
‘’వనలతా సేన్ ‘’అనే ప్రసిద్ధ గీత౦ ప్రారంభం లో –
‘’శతానేక బ్రహ్మకల్పాలు గతం లో కలిసిపోకముందే –ఈ భూమ్మీద కాలం పరచిన గులకరాళ్ళ రాస్తా వెంబడి –ఓపికతోఒంటరిగా ఒక్కడినే ఆనాడు తిరుగుతూ-కోప ఘూర్ణిత సముద్ర ఘోషలు విన్నాను –అవి ప్రళయంగా నాలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి –సింహళ సముద్ర తీరం నుంచి –చీకటి రాత్రులలో జీవకళలు విరుగుతూ –మలయా జలసంధిదాకా –మత్తుగా నడుస్త్తూoడేవాడిని –వనలతా సేన్ నన్ను ఆలింగనం చేసుకొన్న చోటు లోమాత్రమే –నాకు కలిగింది మనశ్శాంతి ‘’.కాలం వీధుల్లో ఆత్మ చేస్తున్న అనంత ప్రయాణం ఇక్కడ చూపాడుకవి .చివరగా ‘’శతాబ్దాలక్రిందట తెలిసిన దాని కంటే –ఎక్కువ ఏం తెలిసింది నాకు?’’అంటాడు .మన అనుభూతికవి తిలక్ కూడా ఇలానే రాశాడు .అనేక చారిత్రిక అంశాలు కవితలలో మెలి తిప్పేస్తాడు దాస్ .ఈజిప్ట్ దేశాల పురాతన నాగరకత పై కవి ప్రత్యెక మోజు ఉన్నట్లు కనిపిస్తుంది. పతంజలి ,ఆమ్రపాలి ,నాగార్జున, శ్రావస్తి కంఫ్యూషియస్,అత్తిలి వంటిచారిత్రక పాత్రల ,ప్రదేశాల పేర్లు ఆయనకవిత్వంలో చాలాసార్లు ప్రత్యక్షమౌతాయి .’’మకరమాసం చివరి రోజు ‘’కవితలో కాలప్రవాహ చారిత్రిక చైతన్యాన్ని పరిగెత్తే పక్షితో పోలుస్తాడు .ఎడిత్ సిట్ వెల్ కవితలలో ఉన్నట్లే దాస్ కవితలలో జంతు ప్రపంచమూ దర్శన మిస్తుంది –‘’పుండుమీద నెత్తురూ చీమూ బాగా తాగేసి –తళత్తళల రెక్క లాడిస్తూ ఈగ ఎండలో ఎగురుతోంది ‘’అని వర్ణిస్తాడు .అసహ్యంగా కనిపించేదాన్ని అర్ధవంతంగా భాసి౦ప జేస్తాడు .ఆయనకవిత బుద్ధి సూక్ష్మతను కూడా నిద్ర లేపుతుంది .వీరసావర్కార్ ,నారీమన్ వంటి మహాపురుషులు అత్తిలి వంటి పాత్రలతో కలిసి నడుస్తారు .ఆయనది పలాయన వాదం మాత్రం కాదు –‘ఎక్కడో ఉషస్సు మనకోసం వేచి ఉంది ‘’అని ఆశకలిగిస్తాడు.చరిత్ర కొట్టిన కొరడా దెబ్బలకు తట్టుకోలేక ఆత్మఎక్కడి నుంచి వచ్చిందో ,అక్కడికి అంటే మృత్యు గహ్వరం లోకి ,అంధకార గర్భం లోకి వెళ్ళిపోవాలనే ఆకాంక్ష కనిపిస్తుంది .’’బల్లెపు పోట్లకు బలియిన వరాహం లా-భూదేవి వెర్రికేకలు వేస్తోంది ‘’అన్నాడు .’’ఏనాటికీ మెలకువరాని –ఈఅనంత నిద్రా దీర్ఘ సముద్రం లోకి వెళ్ళ దలుచుకున్న నన్ను –ఎందుకులేపుతారు ?ఎందుకు పిలుస్తారు ?’’అంటాడు .’’యుగయుగాలుగా మనిషి తన శవాన్ని తానె మోస్తున్నాడు-రక్తదాహం దాహం తీర్చుకొన్న మానవాత్మ –దుర్వాసనతో దూరంగా ఉన్న ఆకాశాన్ని చూస్తోంది-రక్షించమని నక్షత్రాలను అర్ధిస్తోంది-ప్రేమకోసం పరితపిస్తోంది –విజ్ఞాన రోచిస్సులను పిలిచి నెత్తురు మచ్చ తుడిచేయమ౦టో౦ది -అసలు అడిగేవాడా ఆత్మ అనేది లేకపోతె “”?అని ప్రశ్నించాడు .
భాషలోని పలుకుబడితో రవీంద్రుని కంటే , భిన్నమైన పలుకుబడిసాధించినా శబ్దార్ధ సామ్యభావనలో టాగూర్ కు చాలా దగ్గరగా వచ్చాడు దాస్ అనిపిస్తాడు .ఆయన్ను ‘’ ఏకాంతకవి ‘’మహాకవి ,యుగకవి ,అన్నారుకానీ ఏ ఇజానికీ చెందిన వాడుగా ముద్ర పడలేదు ..’’ఈ ప్రపంచభీకరారవ౦ ద్వారా వచ్చిన –నాశనం లేని అనాది నాద శక్తి –వెలుగుకు లొంగి ,ఆన౦దానికి పొంగి మూగ పోయిన దానిలా –అనంత కరుణా సముద్రం మీద అలలలతో గుసగుసలాడుతోంది ‘’అని ముగిస్తాడు కవితను .సంప్రదాయంలో మునిగి తేలుతూ ,తామరాకుపై నీటి బిందువుగా తప్పించుకొనే నేర్పరి కవి జీవనానంద దాస్ . హృదయస్పర్శి.భావనా తీవ్రత తో ,కవితా భాగీరధీ పావిత్ర్యాన్ని వివిధ కోణాలలో దర్శించి ,ప్రదర్శించటం ఏ కవికైనా అసాధ్యం కానీ దాన్ని సుసాధ్యం చేశాడు దాస్ .సమకాలీన బెంగాలీ కవులలో ఇంతటి ప్రతిభా వ్యుత్పత్తులను చూపిన కవి లేడు.’’దటీజ్ ‘’జీవనా నంద దాస్ .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-9-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.7వ భాగం.7.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.7వ భాగం.7.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ గాడి చర్ల హరి సర్వో త్తమరావుగారి జీవితం.16వ భాగం.6.9.22

శ్రీ గాడి చర్ల హరి సర్వో త్తమరావుగారి జీవితం.16వ భాగం.6.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -2

ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -2

పట్టణన వర్గాలలో మధ్యతరగతి ప్రజలకష్ట నష్టాలను  వర్ణిస్తూ సమర సేన్ తనకవితలలో అసహనం చూపాడు .ఈ మార్పులను గురించి కవితా అస్త్ర సన్యాసం చేయటానికి కూడా సిద్ధపడ్డాడు .విష్ణు డే కవితలలో శ్రామికవర్గం పై జాలికనిపిస్తుంది .నాటికవులు తమ వర్గ స్వభావాన్ని వదులుకోలేక పోయారు .సుభాష్ ముఖోపాధ్యాయ ,,సుకంతో భట్టాచార్య కవితల్లో ఏ కొన్నో తప్ప నిజంగా ప్రజానీకానికి చేరలేదు.ఆ రోజుల్లో కవి తనకు తానె తుది లక్ష్యం వలన ,తనకు తాను తన్మయుడై ,దాన్నికవిత్వంగా ‘’కక్కటం ‘’తప్ప ఏమీ సాధించలేక పోయాడు .ప్రజాహృదయ స్పందన కలిగించలేక పోయాడు .

 విభూతి భూషణ బంద్యోపాధ్యాయ కవిత్వం లో  నవలలో లాగా జీవనానంద దాస్ ప్రకృతి దృశ్యాలతో చేలూ, నదులు సామాన్యప్రజలు వారి మనోభావాల చిత్రణ ఉంది .దాస్ కూడా బంద్యోపాధ్యాయ లాగా వామ పక్ష భావ ప్రభావితుడు కాదు .ప్రముఖ బెంగాలీ చిత్ర దర్శకుడు సత్యజిత్ రే విభూతి నవలలను సినిమాలుగా మలిచాడు .చిత్రకారుడు జెమిని రాయ్ కూడా ఈ కోవలోని వాడే .ఇతడి కళాఖండాలకు అద్భుత వ్యాఖ్యాత విష్ణు డే.

 టాగూర్ తర్వాత జీవనానంద దాస్ ఒక్కడే బెంగాలీ కవిత్వం లో అద్భుతాలు సాధించాడు .నజ్రులిస్లాం గొంతెత్తి దేశభక్తి గీతా గానం చేశాడు .ప్రజల్లో బ్రతుకు బాధ ఎక్కువై వాటిపై మోజు తగ్గింది .సుధీంద్ర నాథ దత్తా సంస్కృత సాహిత్య లోతులు తరచి ,సమకాలీన జీవితాన్ని సంస్కృతంలో ఆవిష్కరించాడు .విలువలను సమన్వయ పరచాడు .విష్ణు డే తన కవితా మృదు స్పర్శతో ,ఆవేశం ,అనుభూతి రంగరించి ,ప్రజలలో వైజ్ఞానిక చైతన్యం తెచ్చాడు .బుద్ధ దేవ బోస్ తన అనుభూతుల్ని ప్రజానుభూతులు చేసి ప్రజా హృదయం ఆకర్షించాడు .ప్రేమేంద్ర మిత్రా విశాల దృక్పధంతో ప్రజాహృదయాలను మీటాడు .అమీయా చక్రవర్తి రచనలలో ఆధునిక భాష, నుడికారం శైలీ చి౦దులేశాయి .సురేంద్రనాథ్ లాగా ఆజిత్ దత్తా భారతీయ భావాలకు, సమకలీనతకు పట్టం కట్టాడు .అల్పాక్షరాలతో అనల్పార్ధ రచన చేశాడు .ఇలా వీరంతా ఎవరికీ వారే తమ ప్రత్యేకతను నిల్పుకొన్నారు .కానీ వీరిలో ఎవరూ జీవనానంద దాస్ లాగా నూతనత్వం కవితాశక్తి సంమోహ గుణం ప్రదర్శించ లేకపోయారు .అందుకే రవీంద్రుని తర్వాత ఆస్థానం జీవనానంద కు దక్కింది .

           వ్యక్తిత్వం

జీవితమంతా కవిత్వంలోనే మునిగి తేలినవాడు జీవనానంద దాస్ .ఏవోకొన్ని నవలు కథలు రాశాడుకానీ, కవిత్వంలోనే జీవించాడని చెప్పవచ్చు .అదే ఆయన వ్యక్తిత్వమై భాసిల్లింది .ఆయన కవిత్వం లో ఉన్న సౌందర్యం ఆయన వేష ధారణలో కనిపించదు .శైలి లో ఉన్న శోభ ఆయన ఇంట్లో ఉండదు .అంటే ఊహకూ నిజానికీ మధ్య సమన్వయము లేదు .తను నిర్మించిన కల్పనా జగత్తుకు ,సాంఘిక జీవనం లోని నిత్య జీవితానికి సంబంధం ఉండదు .తూర్పు బెంగాల్ బారిసాల్ లో పుట్టి ,కలకత్తా లో పెరిగిన దాస్ కు పల్లె సౌ౦దర్యం ,పట్టణ  సౌభాగ్యం రెండూ కూడా పట్టనే లేదు .తనలోకం లో తాను ఊహా సౌధాలు నిర్మించుకొని గడిపాడు .జీవిత సమస్యలకు దూరంగా ఉన్నా , జీవితాన్ని నిశితంగా పరిశీలించే నేర్పున్నవాడు .కానీ జీవిత సమరంలో రచనలద్వారానే పాల్గొన్నకవి. ఆయన కవే కానీ మరేదీ కానివాడు .అందుకే ‘’ఒక వ్యక్తీ నిజంగా కవి అయితే ,నిత్య జీవితంలో సతమతమయ్యే లోకానికి తానిచ్చే మొదటి బహుమతి కవిత్వమే ‘’అన్నాడు .

  జీవనానంద దాస్ చివరికి ట్రా౦ కారు కింద పడి మరణించటం ఆయన జీవితంలో భగవంతుడు చేసిన చమత్కారం .అయ్యో అనిపించినా ,మంచాన పడి తీసుకోకుండా హఠాన్మరణం పొందటం లో కూడా ఆయన కవితా సాహసం తొంగి చూసింది అంటారు .మరణానికి ముందే ఆయన జీవితంలో పతనావస్థ ప్రారంభమైంది .నిత్య జీవితంలో సన్నిహిత సంబంధం కల వ్యక్తిగా ఆయన్ను భావించేవారు .అందువల్ల సనాతనులు ఆధునికులు హేళన తో ఆయన్ను చూసేవారు .’’శనివారర్ చీటీ ‘’-శనివారం లేఖ అనే పత్రికలో సజనీ కాంత దాస్  ఈయన్ను దుయ్య బడుతూ ఉండేవాడు .

  నిష్టాగరిష్ట బ్రహ్మ సమాజ  కుటుంబం లో పుట్టిన జీవనానంద ,తండ్రి మంచి పండితుడైన ఉపాధ్యాయుడు తల్లి కవయిత్రి ..కలకత్తాలో బ్రహ్మ సమాజీయుల కాలేజిలో దాస్ ఇంగ్లీష్ లెక్చరర్ గా పని చేశాడు .ఒక కవితలో స్త్రీ వక్షోజాలను  వర్ణించి నందుకు  ఆయన్ను ఉద్యోగం నుంచి తీసేశారని అంటారు .జీవితమంతా ఇంగ్లీష్ లెక్చరర్ గానే గడిపాడు .ఆదాయం చాలక ,కవిత్వంతో బాగా పేరు తెచ్చుకొనే సమయంలో ఇన్సూ రెన్స్ పాలసీని అయినకాడికి అమ్మేశాడు .

 ప్రజలతో మాట్లాడటానికి ఇబ్బంది పడేవాడు .టాగూర్ ప్రదర్శించిన ప్రశాంత సమైక్య సంపూర్ణ సమన్వయ భావాలకు దూరంగా జీవితం గడిపాడు దాస్ .ఆయన జీవించిన కాలానికి సంబంధించి సమస్త గుణాలు ఉన్నకాలం లో జీవితం గడిపాడు .జీవితంలో రచనలలో ఆయన టాగూర్ అనంతర కాలానికి అంకితమైన వాడు జీవనానంద దాస్ .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-9-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం. గణపతి ఖండం.6.వభాగం.6.9.22

బ్రహ్మ వైవర్త పురాణం. గణపతి ఖండం.6.వభాగం.6.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హరి సర్వోత్తమ రావు జీవితం.15వ భాగం..5.9.22

శ్రీ హరి సర్వోత్తమ రావు జీవితం.15వ భాగం..5.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.5వ భాగం.5.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.5వ భాగం.5.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హరి సర్వోత్తమ రావు గారి జీవితం.14వ భాగం.4.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్

ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్

చిదానంద దాస్ గుప్త ఆంగ్లం లో రాసిన పుస్తకానికి కుందుర్తి చేసిన అనువాదం జీవనానంద దాస్ .కేంద్ర సాహిత్య అకాడెమి 1979లో ప్రచురించింది. వెల –రూ-2-50.హుమాయున్ కబీర్ కు స్మృత్య౦జలి గా  అంకితం చేశారు .

 కవి కాలాదులు

రవీంద్రుని ప్రతిభ ఉత్కృష్టంగా వెలుగు తున్నప్పుడే జీవనానంద దాస్ కవితా ప్రతిభ కూడా వెలుగు లీనింది .అర్ధ శతాబ్దం టాగూర్ బెంగాలీ సాహిత్యాన్ని ప్రభావితం చేశాడు .ఆనాటి కవులంతా ఆయన దారి తొక్కి ఆమర్గం లో నడిచారు. అదే శైలి అనుసరించారు .ఆయన చూపిన సమన్వయ దృక్పధం అందరికీ ఆరాధనం అయింది .ఆయన్ను దాటి అలోచి౦చటం సాధ్యమా ?అనే స్థితిఏర్పడింది .అన్నిటా ఆయన శిఖరాయ మానుడు .టాగూర్ సాహిత్య సంస్కృతీ బెంగాల్ లో ఇప్పటికీ జీవించే ఉంది .1937లో టాగూర్ ‘’ప్రాంతిక్ ‘అనే కవితా సంపుటిరాసి విడుదల చేశాడు .పెద్ద జబ్బు చేసి మరణావస్థ నుంచి కోలుకొని ,ఆనాటి బెంగాలీ సమకాలీనతను ఆకవిత్వం లో ఆవిష్కరించాడు .యుద్ధ కారణ శక్తులను తీవ్రంగా ఖండించాడు .సమాజం వింతపోకడలు ,దిగజారుడు లను కళ్ళకు కట్టించాడు .తన ఆవేదనను ఒకకవితలో ఇలా అన్నాడు –

‘’బుసకొట్టే సర్పరాజులు విషం కక్కు తున్నాయ్ –నా చుట్టూ ఉన్న గాలిలో –శాంతి ప్రవచానాలన్నీ శక్తి హీనమైపోయాయి-పెద్ద వాణ్ని అయిపోయాను –పోయే లోగా ఒక విజ్ఞప్తి-ఈ రాక్షసిని తుద ముట్టిద్దాం .-అందరూ దీనికోసం సర్వ సన్నద్ధులు కావాలి ‘’

  1930వ తరానికి చెందిన కవులంతా రవీంద్రుని ప్రభావం నుంచి బయట పడాలనే కాంక్ష ,కృషీ మొదలయ్యాయి .బుద్ధ దేవ బోస్ దీనికి ప్రధాన పాత్ర పోషించాడు .టాగూర్ మరణానికి 15ఏళ్ళ ముందునుంచి ‘’కల్లోల్ సాహితీ బృందం ‘’దీనికి తోడ్పడింది .ఆ కాలం లో నిరాశా నిస్పృహలతో ఉన్నవారు ,మార్క్సిస్ట్ ప్రభావితులైన వారు ,,ఈ రెండిటికీ మధ్యగా ఉన్నవారు అందరూ కలిసే ఉండేవారు .వీరంతా టాగూర్ తర్వాత రానున్న ఆలోచనా ధోరణుల గురించే బాగా ఆలోచించారు .కల్లోల్ బృందమేకాదు ‘’విష్ణు డే’’కూడా –‘’టాగూర్ చెట్టు పేరు చెప్పికాయలమ్మే గతి –ఇక మనకు వద్దు –జటాజూటపు మెలికల్లో గంగను ఇరికి౦చుకొని –శాశ్వతంగా నిలపటానికి ఇక వీల్లేదు –ఆత్మ భావ గంగా ప్రవాహాన్ని –విచ్చల విడిగా వదుల్తున్నాం –పాటల పడవల మీదెక్కి –జలధి వైపుకు కదుల్తున్నాం –కొత్తదారి ,కొత్తనడక –కొత్త రంగులు ,కొత్త చిత్రాలు –కొత్త గొంతుల కోలాహలం తో –నవ్యకవితా ప్రవాహాలు పారిస్తాం –ప్రజల మనస్సులు పాలిస్తాం ‘’అంటూ వైశాఖ 25 కవిత్వంతో ముందుకు దూకాడు విష్ణు డే.

  ఇలాంటి సమయంలో కూడా జీవనానంద దాస్ టాగూర్ పై ధ్వజమెత్తి కవిత్వం రాయలేదు .ఆయన కవితా వస్తు ప్రదర్శనం టాగూర్ లో వచ్చిన పరిణామ దశల్లో ప్రయాణం చేసి బలపడింది .టాగూర్ అనంతర కవులలో జీవనానంద దాస్ లో అందరికంటే ఎక్కువగా ఈ పరిణామం చోటు చేసుకొన్నది .ఇది ఆయన గమనించి ఇలా అన్నాడు –‘’తమకంటే ముందున్న మహాకవులను పడ త్రోసే ప్రయత్నం లో, కవులు తమ స్థానాన్ని నిలబెట్టుకో లేరు .ఒకరిద్దర్ని మినహాయిస్తే ఆధునిక బెంగాలీ కవితారంగం అంతా టాగూర్ ప్రభావమే కనిపిస్తుంది .ఆధునిక కవితలను ఆయన కవిత్వంతో పోలిస్తే ,ఆయనలో ఎంత వైవిధ్యం ఉందొ అర్ధమౌతుంది .ఆయన అడుగు జాడల్లోనే ఆధునిక  బెంగాలీ కవిత్వం ఇప్పుడే కొత్తగా ప్రారంభించింది .టాగూర్ ప్రతిపాదించిన విలువలకు ఎన్నటికీ భంగం కలగదు ‘’అన్నాడు .టాగూర్ కవితా సంప్రదాయానికి ఎదురు తిరక్కుండా ,దాన్ని కొత్తతరంలోని భావాలతో ,భాషా నుడికారాలతో మేళవించి ముందుకు తీసుకు వెళ్ళటమే ధ్యేయంగా జీవనానంద దాస్ కృషి చేశాడు .’’సంప్రదాయం –వ్యక్తి ప్రతిభ ‘’లో ఆంగ్లకవి టీఎస్ ఇలియట్ రాసిన వ్యాసం లో ఈ రెండిటికి ఉన్న సంబంధాన్ని వివరించినట్లుగా జీవనానంద దాస్ కవిత్వం రాశాడు .

 బెంగాలీ సాహిత్యం లో పశ్చిమ దేశాల హవా బాగా ఉన్న రోజులవి .రెండు ప్రపంచ యుద్దాలఫలిత౦ గా  ‘’వేస్ట్ లాండ్ ‘’గా మారిన భూగోళం మీద వీచిన గాలి ,బెంగాలీ నేలనూ  తాకింది .విక్టోరియాకాలపు నైతిక విలువలు పతనమై ,అణుయుగం లో మానవ జీవితం లో సందిగ్ధ పరిస్థితులేర్పడి ,ప్రపంచమంతా ఎర్రజండాలు ఎగురుతున్న రోజులవి .వీటన్నిటి ప్రభావం బెంగాలీ సాహిత్యంపై బలంగానే పడింది .

  టాగూర్ యుగం చివర్లో ,టాగూర్ తర్వాత బెంగాలీ సాహిత్య నిర్మాతలలో చాలామంది ఆంగ్ల భాషా నిష్ణాతులవటం విశేషం .అలాంటి వారిలో బుద్ధ దేవ బోస్, అమియా చక్రవర్తి, విష్ణు డే,సమర్ సేన్ ,జీవనానంద దాస్ ముఖ్యాతి ముఖ్యులు .ఇంగ్లీష్ జర్నలిస్ట్ లుగా ఉంటూ ఇంగ్లీష్ సాహిత్యాన్ని మధించినవారూ ఉన్నారు .పాశ్చాత్య దేశాల కళా సాహిత్యాలలో ,పురాతన ,అధునాతన గాధలతో ఉన్న పద చిత్రాలు వారికవితల్లో కో కొల్లలు .ఇలియట్, వెబ్స్ ,యేట్స్,కాల్డ్వెల్ ,రజనీ పామీదత్ ఆస్వాల్డ్ స్ప్లేన్గ్లార్ ల వివిధ సాహిత్య ప్రక్రియలను బెంగాలీ సాహిత్యం లో దిగుమతి చేసి దారీ గమ్యం లేకుండా చేశారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-9-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.4వ భాగం.4.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.4వ భాగం.4.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సరస భారతి 167 వ కార్యక్రమంగా శ్రీకోటగురువరేణ్యుల స్మారక నగదు పురస్కార ప్రదానం 

సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

‘’అక్షరం లోక రక్షకం ‘’

సరస భారతి 167 వ కార్యక్రమంగా శ్రీకోటగురువరేణ్యుల స్మారక నగదు పురస్కార ప్రదానం 

సాహితీ బంధువులకు శుభకామనలు ,ఉపాధ్యాయ దినోత్సవ శుభా కాంక్షలు

సరస భారతి 167వ కార్యక్రమంగా 2022 మార్చి లో లో పదవతరగతి  పాసై , అత్యధిక మార్కులు పొందిన పేద ప్రతిభగల బ్రాహ్మణ విద్యార్ధికి , విద్యార్ధినికి  మా గురువరేణ్యులు కీ .శే .బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కార౦   శ్రీ సర్వేపల్లి రాదా కృష్ణ పండితుని జన్మదినోత్సవం –ఉపాధ్యాయ దినోత్సవం  నాడు 5–9-22 సోమవారం ఉదయం 10.గం కు అమరవాణి  హైస్కూల్ లో మా  గురుపుత్రులు శ్రీ కోట సోదరులచేతులమీదుగా అందజేయ బడుతుంది .అలాగే శ్రీ కోట మాస్టారి  శిష్యులు శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )ఏర్పాటు చేసిన బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కారం పేద ప్రతిభగల ఒక SC విద్యార్ధికి ,ఒక BC విద్యార్ధినికి అంద జేయబడుతుంది .సాహిత్య ,విద్యాభిమానులుఅందరూ  పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .

  కార్య క్రమం -5-9-22 సోమ వారం ఉదయం 10.గం.లకు

   సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

   సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు

 ఆత్మీయ అతిధులు -పురస్కార ప్రదాతలు శ్రీ కోట గురుపుత్రులు ,శ్రీ కోట సోదరులు – శ్రీ కోట చంద్రశేఖర శాస్త్రి గారు ,శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గారు ,శ్రీ కోట రామకృష్ణగారు ,శ్రీకోట సీతారామాంజనేయులు గారు .

             కార్యక్రమ వివరం

 శ్రీ కోట గురువరేణ్యుల ,శ్రీసర్వేపల్లి రాధా కృష్ణన్ చిత్ర పటాలకు  పుష్పమాలాలంకరణం

        1-  శ్రీ కోట సోదరులు ఏర్పాటు చేసిన –  శ్రీ  కోట గురువరేణ్యులు కీ .శే .శ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం  –

ఉయ్యూరు ఫ్లోరా స్కూల్ లో  చదివి 2022 పబ్లిక్ పరీక్షలో పదవతరగతి  546/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,శ్రీచైతన్యలో ఇంటర్ చదువుతున్న   –చిర౦జీవి  కుందేరు నాగ సాయి కృష్ణ తేజ కు రూ-10,116(పది వేల నూట పదహారు రూపాయలు )

2-శ్రీ కోట సోదరులు ఏర్పాటు చేసిన -కీ శే .శ్రీమతి కోట సీతమ్మ గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం  

  ఉయ్యూరు శ్రీనివాస అక్షరాలయం లోచదివి   2022 పదవ తరగతి  పబ్లిక్ పరీక్షలో 536/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,శ్రీనివాస కాలేజిలో ఇంటర్ చదువుతున్న

 కుమారి వేదాంతం శ్రీ కమల తేజస్విని కు రూ-10,116(పది వేల నూట పదహారు రూపాయలు )

3-శ్రీ కోట గురు వరేణ్యుల శిష్యులు ,శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )ఏర్పాటు చేసిన

కీ.శే. శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారి స్మారక నగదు పురస్కారం –S.C..విద్యార్ధికి  

 ఉయ్యూరు అమరవాణి హైస్కూల్ లో చదివి ,2022పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 549/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,నారాయణ కాలేజిలో ఇంటర్ చదువుతున్న

చిరంజీవి జిత్తుక దీక్షిత్ బాబు కు –

5000రూపాయలు +శ్రీ గబ్బిట రామనాధ బాబు అందించిన 2,000రూపాయలు +శ్రీమతి కొల్లి భారతి అందించిన 1000 రూపాయలు –మొత్తం –రూ.8,000.

4- కీ శే .శ్రీమతి కోట సీతమ్మ గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం  -BC విద్యార్ధినికి

ఉయ్యూరు అమరవాణి హైస్కూల్ లో చదివి ,2022పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 576/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,శ్రీ చైతన్య  కాలేజిలో ఇంటర్ చదువుతున్న

కుమారి ధూళి పూడి త్రిష కు

5000రూపాయలు +శ్రీ గబ్బిట రామనాధ బాబు అందించిన 2,000రూపాయలు +శ్రీమతి కొల్లి భారతీ దేవి  అందించిన 1000 రూపాయలు –మొత్తం –రూ.8,000.

సరస భారతి ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేక  సన్మానం

 –అమరవాణిలో పని చేస్తున్న  ఇద్దరు ఉపాధ్యాయులకు

  ఉపాధ్యాయ దినోత్సవ  శుభా కాంక్షలతో

జోశ్యుల శ్యామలాదేవి   మాదిరాజు శివ లక్ష్మి    గబ్బిట వెంకట రమణ

గౌరవాధ్యక్షులు              కార్య దర్శి              కోశాధికారి

                             గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు మరియు పివి.నాగరాజు –ప్రిన్సిపాల్ అమరవాణి హైస్కూల్

                                                          4-9-22-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

శ్రీ హరి సర్వోత్తమ రావు గారి జీవితం.13వ భాగం.2.9.22

శ్రీ హరి సర్వోత్తమ రావు గారి జీవితం.13వ భాగం.2.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

‘’మహా భారత తత్వ కథనం’’ రచయిత మహోపాధ్యాయ ,మహాభారత మర్మజ్ఞ -శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

‘’మహా భారత తత్వ కథనం’’ రచయిత మహోపాధ్యాయ ,మహాభారత మర్మజ్ఞ -శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు. మహాభారత తత్త్వ కథనము రచించారు ..

జీవిత విశేషాలు
1894వ సంవత్సరం విజయ, మార్గశిర శుద్ధ షష్ఠి నాడు, తూర్పు గోదావరి జిల్లా, కాజులూరు గ్రామంలో తన మాతామహుని ఇంట జన్మించారు[1]. వారణాసి భావనారాయణ, కామేశ్వరమ్మ తల్లిదండ్రులు. స్వస్థలం పిఠాపురం. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు జన్మించడం వల్ల ఇ సుబ్రహ్మణ్యశాస్త్రి అని పేరు పెట్టారు. తన మాతామహుడైన రేగిళ్ల కామశాస్త్రి వద్ద సంస్కృత కావ్యాలను అభ్యసించారు. పిదప పిఠాపురంలో పేరి పేరయ్యశాస్త్రి వద్ద సిద్ధాంతకౌముది చదువుకున్నారు. అనంతరం వేదుల సూర్యనారాయణశాస్త్రి వద్ద వ్యాకరణం మహాభాష్యాంతం మంజూషతో సహా చదువుకున్నారు. అక్కడ కుప్పా ఆంజనేయశాస్త్రి, దర్భా సర్వేశ్వరశాస్త్రి, వడ్లమాని వేంకటశాస్త్రి సహాధ్యాయులుగా ఉన్నారు. ఆ తరువాత సుబ్రహ్మణ్యశాస్త్రి శ్రీపాద లక్ష్మీనృసింహశాస్త్రి వద్ద న్యాయశాస్త్రము, దెందుకూరి నరసింహశాస్త్రి వద్ద వేదాంతశాస్త్రము క్షుణ్ణంగా నేర్చుకున్నారు. స్వయంకృషితో ఇతర శాస్త్రాలను కూడా అభ్యసించి సర్వతంత్ర స్వతంత్రతను సంపాదించారు. తాను నేర్చుకున్న విద్యను ఇతర ప్రాంతాలనుండి వచ్చిన విద్యార్థులకు భోజనాది సదుపాయాలు కల్పించి గురుకుల పద్ధతిలో బోధించారు. వీరి వద్ద శిష్యరికం చేయడం గొప్ప విషయంగా భావించి దూరదేశాలనుండి ఎంతో మంది విద్యార్థులు పిఠాపురం చేరుకొనేవారు. ఈయన శిష్యులలో చాలామంది ప్రాచ్యకళాశాల ప్రిన్సిపాల్స్‌గా,పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా, పురాతత్త్వ శాస్త్ర పరిశోధకులుగా ఉన్నతపదవులు అలంకరించారు.

రచనలు
బాల్యం నుండే అనేక వ్యాసాలను వ్రాసి ప్రచురించేవారు. సుమారు 14 గ్రంథాలను సంస్కృతాంధ్రాలలో రచించి ప్రకటించారు. వాటిలో కొన్ని:

  1. చేతవనీ ఖండనం
  2. మహాభారత తత్త్వ దీపః
  3. మహాభారత తత్త్వ కథనం
  4. రామాయణ తత్త్వ కథనం
  5. ఆస్తికత్వం మొదలైనవి.

ఇంకా అనేక వ్యాసాలను విశ్వహిందూ పరిషత్తు సావనీరులోను, ఇతర పత్రికలలోను ప్రకటించారు. తెలుగులోను, సంస్కృత భాషలోను ఆకాశవాణి ద్వారా అనేక ప్రసంగాలు చేశారు. ఇతర రాష్ట్రాలలో సంస్కృతంలో, ఆంధ్రరాష్ట్రంలో తెలుగులో అనేక మహాసభలలో ఉపన్యాసాలు చేసి మంచి వక్తగా రాణించారు అష్టాదశ పురాణాలను తన పురాణపఠనం ద్వారా పిఠాపురవాసులకు వినిపించి వారిని ఆకట్టుకున్న విద్వన్ శిరోమణి .

బిరుదులు, సన్మానాలు
వీరిని అనేక బిరుదులు, సన్మాన సత్కారాలు వరించాయి.

ఇతని బిరుదులలో కొన్ని:

· వ్యాకరణాలంకార

· బ్రాహ్మీభూషణ

· వ్యాకరణస్థాపక

· మహామహోపాధ్యాయ

· మహాభారత మర్మజ్ఞ

· బాలవ్యాస

· తర్క వ్యాకరణ వేదాంత కేసరి

· జరిగిన సన్మానాలలో కొన్ని:

· విజయవాడలో జరిగిన పండితపరిషత్తులో శృంగేరీ పీఠాధిపతులచే సన్మానం

· ఆంధ్ర ప్రభుత్వాస్థాన కవి కాశీ కృష్ణాచార్యుల చే సత్కారం

· త్రిలింగ విద్యాపీఠం వారిచే సన్మానం

· ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారిచే పురస్కారం

· పిఠాపురంలో సింహతలాటంతో పౌరసన్మానం

కుటుంబం
తన మేనమామ రేగిళ్ల చింతామణి పుత్రిక సుబ్బమ్మను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు భావనారాయణశాస్త్రి, కామశాస్త్రి, చింతామణిశాస్త్రి, రాజేశ్వరశాస్త్రి అనే నలుగురు కుమారులు, కామేశ్వరి, సుబ్బలక్ష్మి అనే ఇద్దరు కుమార్తెలు జన్మించారు.

మరణం
ప్రవచనాలు, ధర్మోపన్యాసాలు, దుర్విమర్శనా ఖండనము తన నిత్యకృత్యంగా పెట్టుకుని జీవిస్తూ తుదకు 1978, మార్చి 3వ తేదీన 84 వ ఏటమరణించారు.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-9-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హాస్యానందం  29 –సందేహాలంకారాభాసం  

హాస్యానందం 

29 –సందేహాలంకారాభాసం  

 సందేహం అనే అలంకారం ఉంది .అందులోనరస భూపాలుడిని చూసి  ‘’ఇంద్రుడో ,ఉపెంద్రుడో బలీ౦ ద్రుడో ‘’అనే పద్యం ఉదాహరణగా ఇచ్చాడు అలంకార శాస్త్రవేత్త .సందేహం అనే హాస్య ప్రక్రియ కూడా అలానే ఉంటుంది అన్నారు మునిమాణిక్యం నరసింహారావు మాస్టారు .ఎప్పుడో తనదగ్గర చదువుకొన్న శిష్య పరమాణువును చూసి ఒక మాస్టారు ‘’వీడు నా దగ్గర చదువుకొన్నవాడేనా ?వాడి తమ్ముడా ?’’అని అనుమానపడతాడు .అనుకుని ఊరు కొంటె బాగానే ఉంటుంది .కాని వాడితో ‘’నా దగ్గర చాలా మంది చదువుకొన్నారు .ఒక్కొకుటుంబంలోనే  నలుగయిదుగురు  అన్న దమ్మలుంటారు .వాళ్ళు పెద్ద వాళ్లైన తర్వాత  నన్ను కలిసి ‘నమస్కారం మాస్టారూ అంటారు ..ఆనలుగుర్లో వీడు ఎన్నో వాడో నాకు గుర్తుండదు .అప్పుడు నేను ‘’అయితే అబ్బాయీ !నువ్వు నువ్వేనా ?లేకపోతె మీ అన్నయ్యవా ?“”అంటాను. ఇదే ఒక సందేహమేగా ఈ దేహానికి వచ్చి౦ దేగా  .ఒక సారి అలాంటి కవలలో ఒకడు మరణించాడు .అప్పుడు వాడిని ‘’బాబూ!మీ ఇద్దర్లో చనిపోయింది నువ్వా ?మీ అన్నయ్యా ?అని అడిగాడు .సందేహాన్ని హాస్యోత్పత్తికి ఉపయోగిస్తే ఇలాంటి పలుకు బడులు తయారౌతాయన్నారు మనిమాణిక్యం .కనుక దీన్ని సందేహాలంకార ఆభాసం అన్నారాయన .మరో ఉదాహరణ –విస్తట్లో వడ్డించిన కూర చూసి ‘’ఇది వంకాయకూరా ?దోసకాయ కూరా ??’’అంటే సందేహాలంకారం .ఈ అలంకారం అల్ప వస్తు పరంగా ఉందికనుక సందేహాలంకార ఆభాసం అంటారు మాస్టారు .

 ఉత్ప్రేక్షా భాసం

ఉత్ప్రేక్ష  దాదాపు అతి శయోక్తి వంటిది..మునిమాణిక్యంగారింటి ముందు ఒక ధనికుడి ఇల్లుంది .ఈయనభార్య కాంతం గారికీ, ఆయన భార్యకూ మంచి స్నేహం ..ఆవిడ రత్నాలు ,వజ్రాలు పొదిగిన ఖరీదైన ఆభరణాలు ధరించేది .కా౦త౦ గారికి  ‘’అంత దృశ్యం ‘’లేదు .చిలకల పూడి గిల్ట్ నగలు పెట్టుకొనే వారీమె .ఆవిడ  ఒక సారి ఈవిడను ‘ఏమండీ అవి రవ్వ దుద్దులేనా ?ముత్యాలహారం లోవి మంచి ముత్యాలేనా ?’’అని అడిగింది ఆవిడకు తెలుసు అవి కాదని .కానీ హేళన చేయాలనే ఆవిడ ఉద్దేశ్యం .ఈ సంగతి గ్రహించిన కాంతం గారు ‘’ఆ అవి మంచి ముత్యాలే .నాలుగు వేలు పోసికొన్నవి మాయముత్యాలది అవుతుందా వదినా “”అన్నారు .ఇది చూడండి వదినా .ఇది డైమ౦డ్ నెక్లెస్ అంటే మరీ లక్షల ఖరీదు  కాదు .ఏదో పది వేలకే వస్తే మా వారు ఉబలాట పడితే ,మా అన్నయ్య కొన్నాడు ‘’అవతలామెకూ తెలుసు ఇందులోని మర్మం .మరో సారి ఆ షావుకారి భార్య కాంతం గారిని ‘’వదినగారూ!రత్నాలు,కెంపులు  నీరు పడితే మేము కెమికల్ తో శుద్ధి చేస్తాం .మీరేం చేస్తారు?’’అని అడిగితె కా౦త౦ గారికి ఒళ్ళు మండి,తాను అబద్ధాలాడినసంగతి ఆవిడ బయట పెట్టాలని ప్రయత్నం చేస్తోందని  గ్రహించి ‘’ఇవి ఖరీదైన రాళ్ళే అయినా,నీరు పట్టినా ,మాసినా ,వాటిని బాగు చేస్తూ కూర్చోం .అలాంటి వాటిని గోడవతల విసిరేసి పారేస్తాం .కొత్తవి కోనేస్తాం వదినగారూ ‘’అని మూతి మూడు వంకర్లు తిప్పి ఝాడించి చెప్పారు కాంతం గారు అని భర్త మునిమాణిక్యం ఉవాచ .

  కోతలు –కోతలు కూడా ఉత్ప్రేక్షా ? అనే అనుమానం రావచ్చు .కాని తానూ వాటిని ఉత్ప్రేక్షగా మార్చి అందిస్తున్నాను అన్నారు నరసింహారావు జీ .నరస భూపాలీయం లో –నరస భూపాలుడు శత్రువులను సంహరిస్తే,  వాళ్ళ భార్యలు ఏడిస్తే ఆ కన్నీటితో సముద్రాలు నిండి పొంగాయట.ఇది ఉత్ప్రేక్షాలంకారం .వాడుక భాషలో ఇది సొరకాయ కోత అంటాం .మొదటిది కావ్య గంభీరంగా ఉంటె తాను  చెప్పింది హాస్యం తో రామణీయకంగా ఉంది  అన్నారు .రెండిటిలోనూ జరిగింది వాక్ వ్యాపారమే అన్నారు .మనం కూడా ప్రదీప్ లాగా ‘’అంతేగామరి, అంతేగా ‘’అని తలూపాల్సి౦ దేగా .అంతేమరి .

మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

  సశేషం

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-9-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం .గణపతి ఖండం.3వ భాగం.2.9.22

బ్రహ్మ వైవర్త పురాణం .గణపతి ఖండం.3వ భాగం.2.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీహరి సర్వోత్తమ రావు గారి జీవితం,.12వ భాగం.1.9.22

శ్రీహరి సర్వోత్తమ రావు గారి జీవితం,.12వ భాగం.1.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ రాఘవ వేంకటేశ్వర బృహత్ శతకం

శ్రీ రాఘవ వేంకటేశ్వర బృహత్ శతకం

శ్రీ మత్తిరుమల రాఘవాచార్య కవి ‘’పెద్దాపురీ వాస ,వేంకటేశ్వర ‘’మకుటం తో 165 సీస పద్యాలతో శ్రీ రాఘవ వేంకటేశ్వర బృహత్ శతకం రచించారు .శ్రీ ఘంటసాల పూర్ణయ్యగారు పిఠాపురం లోని శ్రీ విద్వజ్జన మనోరంజని ముద్రాక్షర శాలలో 1941 న ప్రచురించారు .వేల ఆరు అణాలు .

 కవి గారు సీస పద్యాలలో తన తండ్రి శ్రీ తిరుమల దేశికా చార్య అనీ ,తల్లిగారు రంగాంబ అనీ ,చూడామణి తన భార్య అనీ ,కొడుకు పేరు శ్రీనివాసుడు అని చెప్పారు .తమ్ముడు సీతారామమూర్తి ,అక్కగారు నరసమాంబ .తనపేరు రాఘవాచార్య .షట్ శాస్త్ర ప్రవీణుడు చేవలి సుబ్రహ్మణ్యం గారునూనూగు మీసాల నాడే వైద్యంతో పాటు సంస్కృతం నూరి పోశారు .తమ కుటుంబానికి ఉమా మహేశ్వరం అనే అగ్రహారం ఉంది .పద్నాలుగు ఏళ్ళకే తనను కవితా కన్య పాణి గ్రహణం చేసింది .18వ ఏట భీష్మ సంభవం ,19వ ఏట పార్వతీ వల్లభ శతకం రాసి ,,ఇప్పుడు ఈ ఇరవై రెండవ ఏట  ఈ రాఘవ వేంకాటేశ్వర శతకం సంతరిస్తున్నానని చెప్పుకొన్నారు ,కూచిమంచి తిమ్మన సంస్కృతంలో కుక్కుటేశ్వర శతకం ,ధూర్జటి కాళహస్తీశ్వర శతకం ,భాస్కరుడు భాస్కర శతకం రాసి వన్నె కెక్కినట్లు తానూ ‘’అనవద్యహృద్య పద్య రత్నమాలికల గూర్చంగ నూతన గతులలో ‘ఈ శతకం రాస్తున్నాని స్వామికి నివేది౦చు కొన్నారు .

  గ్రుడ్డులోపల పిల్ల ఎవరి కారుణ్య౦ చక్కగా ఎదుగుతుందో ,ఆకాశం లోఎంతో ఎత్తున ఎగిరే పక్షి మళ్ళీ ఎలా భూమిని ఎవరి కరుణతో చేరుతుందో,కర్మ బంధాలు ఎవని పాద ధ్యానం వలన విచ్చిన్నమవుతాయో అలాంటి ‘’దేవాది దేవా దివ్య ప్రభావ ,ఆది మధ్యా౦తశూన్య లోకైక మాన్య ‘’అయిన వేంకటేశుని నమ్మాను అన్నారు .,లోకంలోని అన్ని విషయాలపై తన ఆవేదన వ్యక్తం చేశారు .ధర్మ దేవత నాలుగు పదాలు విరిగాయని బాధ పడ్డారుకవి .అక్క చేల్లెల్లమధ్య అన్నదమ్ముల మధ్య సఖ్యత కరువైంది .వైష్ణవంలో పుట్టి ,వగలు పోయిన నారి వేశ్యగా మాలజాతిలోపుట్టి ,అగ్రజన్మలో పేద బ్రాహ్మణుడి సొమ్ము హరించిన విప్రునిభార్య కడజాతి కాంతగా,అన్త్యకులం లోపుట్టి సార్వ భౌమి గా ప్రసిద్ధి చెందుతారేమో అని పురాణకధలు వివరించారు  .ఆత్మను తెలుసుకున్నవారికి అందరూ పూజనీయులే .

  విటులను తార్చే వేశ్యకు ,ఒక్క నిమిషం హరిని ధ్యానిస్తే ముక్తికలుగుతుంది .మేకల్నికోస్తూ హరినామ స్మరణ చేస్తే కైవల్యం వస్తుంది కటిక వాడికి.సంసార బంధం లో చిక్కుకున్నా చిత్తం శివునిపై లగ్నం చేస్తే జన్మ సాఫల్యం కలుగుతుంది .గోవింద స్మరణ చేసిన వారందరూ ఇహ పరసౌఖ్యాలు పొందుతారు –‘’కలదు భగవంతు డను నమ్మకంబే చాలు –ప్రజలకెల్లను భ్రుత్యుడై పరగు శౌరి’’అని గ్యారంటీ ఇచ్చారు  .చక్రవర్తికి పుత్ర ప్రేమ ఎంతో ,మాలవాని పుత్ర మమత అంతే.పట్టపురాణిపై  పతికి ఎంత ప్రేమో ,,నిరుపేదకు ఆలి పై ప్రేమ అంతే.సుఖభోగాలు అందరికీ సమానం .పండితుడు ఎలాంటి ఖ్యాతికోరుతాడో ,నోరులేనివాడూ అంతె.అంటూ అన్నమయ్యలాగా చక్కని వేదాంతం చెప్పారుకవి .

  ఎండిన చెట్టు చిగిర్చటం ,పెద్దగా పెరిగిన వృక్షం నేలకూలటం ,పనికి రానివాడే అన్నీ సాధించటం ,మహాబలశాలి కూడా ఒక్కోసారి  ఓడిపోవటం ,పండిన చేను ఒరిగిపోవటం ,మహా విద్వా౦సుడుకూడా ఒక్కోసారి కటిక నెల మీద పడుకోవాల్సి రావటం ,రారాజుకూడా చెయ్యి చాచి బిచ్చం అడుక్కోవాల్సి రావచ్చు .మహా దరిద్రుడు రాజుకావచ్చు .ఏది ఎలా జరుగుతు౦దోఎవరికే తెలీదు –‘’కాక మానదు కానున్న కర్మ ఫలము –సర్వము నీ కృతమే కదా శ్రీనివాసా ‘’అన్నారు .గయ్యాళి భార్యకు భయపడే వారు కులమతాచారాలను వదిలేసిన వారు ,అష్టకష్టాలు పడి పెంచిన తలిదండ్రుల చావు కోరేవారు ,పరము అనేదిలేదని విర్రవీగేవారు ,కుటిలమతులు ఈరోజుల్లో  గడ్డాలుపెంచి సన్యాసులై,అమాయకుల్ని మోసగిస్తున్నారు .కాకిగూటిలో కొంతకాలం ఉంటె కాకి కోకిల అవుతుందా .పాము పడగ విప్పకుండా పడుకొన్నమాత్రాన వానపాము శేషభోగి అవుతుందా ?మట్టి కొట్టుకు పోయిన బొగ్గు మాణిక్యం అవుతుందా ?అని ప్రశ్నించారు .’’మానినీ మణికి మారు మనువులేదు –సతుల విడనాడు పతులకు గతులు లేవు ‘’అని ధర్మ సూక్షం చెప్పారు .

   గార్ధభం అశ్వం ,కాకికోయిల ,ఉల్లి మల్లి ,సింహం నక్క ,ఆవుబర్రే ,నెమలి ఎరికోడి ,బంగారం ,కాకిబంగారం ఒక్కటికావు. దేని స్థాయి దానిదే .నువ్వు ఆకాశం అనటానికి సాక్షి దూర దృష్టికల అనంతుడివిఅవటం ,జలరూపదారి అనటానికి సాక్ష్యం గంగ నీ పాదోద్భవ .పృధ్వీస్వరూపం అనటానికి సాక్షి నీ భార్య భూదేవి కావటం .వాయు స్వరూపానికి సాక్ష్యం భూత పాలన .అగ్ని స్వరూపం అనటానికి సాక్ష్యం నీ విగ్రహం ‘’హాటక చ్ఛవి’’వెలుగు ఉండటం –‘’పంచ భూతములీవ ప్రపంచమీవ .’’అని స్వామిని పంచభూతాత్మకునిగా చక్కగా వర్ణించారు కవి .

 మొదటిపద్యం –‘శ్రీ మీర తిరుపతి క్షేత్రమందు వసి౦చి –మూడులోకమూల నేలు మొదటి వేల్ప –

అజ రుద్రులను గూడ గజగజ లాడించు –దేదీప్యమాన మూర్తి ప్రభావ

పాహిమా యని వేడు ప్రజల బ్రోవగ ధాత్రి –నవతరించిన స్వయం వ్యక్తరూప

నీకు సోదరమూర్తి నీవయైద్వారకా- తిరుపతిబాలించు పరమ పురుష

తండ్రులకు దండ్రివైకుంఠ ధామ నిన్ను –బొగడ బూనితి నా పూర్వ పూజ వలన

నిహపరములిచ్చి మముగావు మి౦దిరేశ-విదిత పెద్దాపురీ వాస వేంక టేశ   –   తో ప్రారంభించి 165వ చివరిపద్యం –

‘’కా౦చ నోజ్వల చేల కారుణ్య మయ శీల –యఖిల కళ్యాణ గుణాల వాల

రక్షితామర గణాధ్యక్ష కౌస్తుభ వక్ష –కమలాయతాక్ష రాక్షస విపక్ష

పరమ భక్తిజ్ఞాన ,పటు నిశ్చలధ్యాన –ఘనజన ప్రత్యక్ష కల్ప వృక్ష

సకలలోకస్వామి జ౦గమమస్థావరాం –తర్యామి గరుడ పత౦గ గామి

చిన్మయానంద లక్ష్మీ విహార –పరమ గుణ సద్మ-భవదీయ పాద పద్మ

సేవకు౦డను ననుగావు దేవ దేవ –విదిత పెద్దాపురీ వాస వేంక టేశ’’అని శతకం ముగించారు శ్రీమత్తిరుమల రాఘవాచార్య కవి .

  ఈశతకం లో భక్తి వెల్లువగా ప్రవహించింది .లోకోక్తి తేజస్సుతో ప్రకాశించింది .నడక కావేరీ ప్రవాహం .శైలి అద్భుతం .అత్యంత రమణీయం .ఈ శతకమూ లోకం దృష్టిలో పడ లేదని పించింది .వైష్ణవం లో ప్రచారం లో ఉందేమో ?మంచిశతకాన్ని కర్త అయిన విద్వత్ కవిని పరిచయం చేసే భాగ్యం నాకు కలిగింది .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-9-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.2వ భాగం.1.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.2వ భాగం.1.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హరి సర్వోత్తమ రావు గారి జీవితం.11వ భాగం.31.8.22.

శ్రీ హరి సర్వోత్తమ రావు గారి జీవితం.11వ భాగం.31.8.22.

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మ వైవర్త మహా పురాణం.గణపతి ఖండం 1వ భాగం.31.8.22

బ్రహ్మ వైవర్త మహా పురాణం.గణపతి ఖండం 1వ భాగం.31.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -4(చివరిభాగం )

మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -4(చివరిభాగం )

7-శ్రీ మర్ల అప్పయ్య శాస్త్రి

ఒక రోజు రాత్రి  7-30కి నాలుగు లారీలతో యాభై మంది పోలీసులు శ్రీ మర్ల అప్పయ్య శాస్త్రి గారింటిపై దాడి చేశారు .అప్పుడాయన భోజనం భోజనం చేస్తున్నారు .అయ్యే దాకా ఆగకుండా ఆయనపై విచక్షణా రహితం గా లాఠీలతో పోలీసులు విపరీతంగా కొట్టారు .ఆయన స్పృహతప్పి కూలి పోయారు .తలమీద, ఒంటి నిండా గాయాలై రక్తం ప్రవహించింది .ఆయన కుటుంబ సభ్యులను దొడ్లోకి గెంటేసి ,ఇంట్లో ఉన్న 1500రూపాయలు  దోచుకు  పోయారు .బీరువాలలో ఉన్న ఔషధాల సీసాలు బద్దలుకొట్టి వీధిలో పారేశారు .

అప్పయ్య శాస్త్రి గారిని అరెస్ట్ చేసి ,రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ లో పెట్టి ,చాలా రకాలుగా హింసించారు .కనీసం మంచి నీళ్ళు తాగటానికి కూడా వీల్లేకుండా ,ఆయన నోటిలో గుడ్డలు కుక్కారు .కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి కొట్లో పడేశారు .ఇలా మూడు రోజులు ఆయన్ను బాధించారు .ఈయన సోదరులను బంధువులపై కూడా లాఠీ చార్జి చేశారు .

8-శ్రీ సామవేదం అచ్యుత రామయ్య

రాజమండ్రి వాస్తవ్యులైన బ్రాహ్మణులు శ్రీ సామవేదం అచ్యుత రామయ్య

గారు .1932లో కర్కోటకుడు ముస్తఫా ఈయనపై చేసిన లాఠీ చార్జి వలన ఆయన చెయ్యి విరిగి పోయింది .

9-శ్రీ వల్లూరి సూర్యనారాయణ రావు

కొవ్వూరులో ప్లీడరయిన శ్రీ వల్లూరి సూర్యనారాయణ రావుగారు సద్గుణ సంపన్నులు .1932లో వీరు రాజమండ్రిలో నెత్తిపై గాంధీ టోపీ పెట్టుకొని వెడుతుంటే ,నర రూప రాక్షస పోలీస్ ఆఫీసర్ ముస్తఫా ఎదురై , టోపీలాగి  పీకిపారేశాడు .దీనిపై సూర్యనారాయణ రావు గారు కోర్టుకు వెళ్లి ,మూడు కోర్టులు తిప్పించి ముస్తాఫాను మూడు చెరువుల నీళ్ళు తాగింఛి ,మొగాడు అనిపించారు .

  వినాయక చవితి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-8-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ విద్వాన్ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి సాహిత్య, సామాజిక సేవ వార్తాపత్రికల సంకలనం 132 వ జయంతి కానుక

బ్రహ్మశ్రీ విద్వాన్ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి సాహిత్య, సామాజిక సేవ వార్తాపత్రికల సంకలనం 132 వ జయంతి కాను

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం.10వ భాగం.30.8.22

శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం.10వ భాగం.30.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -3

మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -3

5-శ్రీ రాపాక తిరుపతి రాజు

1904లో రాజోలు తాలూకా పోతవరం లో బ్రాహ్మణ కుటుంబం లో జన్మించిన శ్రీ రాపాక తిరుపతి రాజుగారు 1921నుంచి కాంగ్రెస్ సేవలో ఉన్నారు .ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్లి 1921 రాజమండ్రి జైలునుంచి విడుదలయ్యారు .1929లో అఖిలభారత చరఖా సంఘం లో ఉద్యోగం లో చేరారు .1930 ఉప్పు సత్యాగ్రహం లో అయిదారు సార్లు పాల్గొని ,లాఠీచార్జి కి గురయ్యారు .మంచి ఆరోగ్యవంతులు కనుక తట్టుకోగలిగారు .ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ,గాంధీ గారి పిలుపు అందుకొని అనేక సత్యాగ్రహాలలో అకు౦ఠీత  దీక్ష తో పాల్గొన్నారు .

  డాక్టర్ కొరళ్ళ రాజారావు  గారితో కలిసి స్వదేశీ ఉద్యమం ప్రచారం చేస్తూ రామచంద్రాపురం వెళ్ళారు .ఆ రాత్రి ఆయనతోపాటే ఒక సత్రంలో బసచేసి నిద్రించారు .అర్ధ రాత్రి వేళ పోలీస్ ఆఫీసర్ ముస్తఫా పోలీసు బృందంతో వచ్చి ,ముందుగా రాజారావు గారిపై దమనకాండ సాగించి, తర్వాత రాజుగారిపై లాఠీలతో విరుచుకు పడ్డాడు .విపరీతమైన ఆదె బ్బలకు తిరుపతి రాజు గారు నేలపై పడి పోయారు .కనికరం లేని ముస్తఫా తుపాకి బాయి నెట్ తో అయన మోకాలిపై తీవ్రంగా పొడిచాడు .రాజుగారి శరీరంనుంచి రక్తం కాలువ కట్టింది .ఇద్దరు పోలీసులు ఆయన్నులేపి  నిలబెట్టారు .కోపం ,ఉద్రేకం తగ్గని ముస్తఫా ఆయన కుడిజబ్బ పై లాఠీతో బలం గా కొట్టాడు .వాడికున్న అక్కసు అంతాచూపించాడు ఆదెబ్బలో రాజుగారి జబ్బ ఎముక విరిగి పోయింది .ఇంకా కసి తీరక, అరెస్ట్ చేసి రాజుగారిని జైలుకు పంపాడు .ఆరునెలలు బళ్ళారి జైలులో శిక్ష అనుభవించారు .తిరిగి వచ్చి మళ్ళీ దేశసేవ లోనే మునిగిపోయారు శ్రీ రాపాక తిరుపతి రాజు.

6-శ్రీ పోడూరి పేర్రాజు

తారణ నామ సంవత్సరం లో షష్టి పూర్తి చేసుకొన్న శ్రీ పోడూరి పేర్రాజు బ్రాహ్మణులు .కృష్ణా జిల్లా బందరు తాలూకా చిన గొల్లపాలెం లో జన్మించారు .1906వరకు రాజమండ్రి ట్రెయినింగ్ కాలేజి లో చదివి ,వందేమాతరం ఉద్యమం లో చదువు మానేసి ,స్వగ్రామం పోడూరు చేరారు .

  1907లో బొంబాయి వెళ్లి శ్రీ కాశీనాధుని నాగేశ్వర రావు పంతులుగారి అమృతాంజన్ కంపని లో ఉద్యోగం లో చేరారు .1908 లో రంగం అంటే రంగూన్ వెళ్లి,ఒక ఏడాదిగడిపి తిరిగి  స్వగ్రామం చేరారు ,కొన్ని రోజులతర్వాత మళ్ళీ రంగూన్ వెళ్లి ,అక్కడ డబ్బు సంపాదించి అక్కడి రాజకీయాలలో పాల్గొనేవారు .

  మళ్ళీ స్వగ్రామంచేరి ,పెళ్లి చేసుకొని రాజమండ్రిలో కాపురం పెట్టివ్యాపారం చేశారు  .యుద్ధ సమయం లో విపరీతంగా డబ్బు సంపాదించారు .హోం రూల్ లీగ్ లో చేరి ,1919లో వ్యాపారం మానేసి ,గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమం లో పూర్తిగా పని చేశారు .నాలుగైదు సార్లు జైలుకు వెళ్ళారు .1930లో రాజమండ్రి నుంచి రాయ వెల్లూరుకు మార్చబడిన ఖైదీలలో శ్రీ వెలిదేండ్ల హనుమంతరావు గారి తో పాటువీరూ ఉన్నారు .

 పొట్టిగా ఉండే పేర్రాజుగారికి పొడవైన దట్టమైన గుబురు మీసాలు ఉండేవి .రాజమండ్రిలో   లాఠీఛార్జి చేసే సార్జంట్ రాజుగారి మీసాలు పట్టుకొని ,’’యు ఆర్ ఎ లిల్లీ పుట్.ఐయాం ఎ లిల్లీపుట్ ‘’అంటూ మీసాలు అటూ ఇటూ లాగి నరకాన్ని చూపించాడు .లాఠీతో వెన్నుమీద ,పిర్రలమీద చావు దెబ్బలు కొట్టాడు .రెండు కాళ్ళూ పట్టుకొని లారీలోకి గిరాటేశాడు .చావుతప్పి కన్ను లొట్ట పోయినట్లు ఆ లారీలో రాయ వెల్లూరు చేరారు .విడుదలైనతర్వాత రాజమండ్రి వచ్చి, మళ్ళీ దేశ సేవకు అంకితమయ్యారు శ్రీ పోడూరి పేర్రాజు.

సశేషం

  రేపు వినాయక చవితి శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -30-8-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

భారతీ నిరుక్తి .45వ చివరి భాగం.30.8.22

భారతీ నిరుక్తి .45వ చివరి భాగం.30.8.22

Video link

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఇవాళ కాటూరి హై స్కూల్ లో తెలుగు భాషా దినోత్సవం లో నేను

ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కడియాల రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాటూరు నందు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పిల్లలకు పద్య,పాఠన పోటీలను నిర్వహించి తెలుగు భాష ఔన్నత్యాన్ని ,ప్రాముఖ్యాన్ని తెలిపే పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ సాహితీ వేత్త,సాహితీ పోషకులు,విశ్రాంత ప్రధానోపాధ్యాయులు గబ్బిట దుర్గా ప్రసాద్ గారు తెలుగు భాష ప్రాముఖ్యాన్ని తెలియజేసి తన సరస భారతి ద్వారా చేసే సాహితీ సేవలను తెలియజేశారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులను మరియు వారి సాహిత్యాన్ని పాఠశాల గ్రంథాలయానికి అందించడం జరిగింది. కార్యక్రమాలలో ప్రధానోపాధ్యాయిని టి.రమాదేవి తెలుగు ఉపాధ్యాయులు రోజం రాజా,మోకా మాధవరావు లు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.వివిధ అంశాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేయడం జరిగింది

Posted in సమయం - సందర్భం | Leave a comment

భారతీ నిరుక్తి .44వ భాగం.29.8.22

భారతీ నిరుక్తి .44వ భాగం.29.8.22

Video link

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హరి సర్వోత్తమ రావు గారి జీవితం.9వ భాగం.28.8.22

శ్రీ హరి సర్వోత్తమ రావు గారి జీవితం.9వ భాగం.28.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -2

మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -2

3- పోలీసు లాఠీ చార్జి లో  గాంధీ దర్శనం పొందిన మరో వినోబా  డా .కొరళ్ళ రాజారావు

కాకినాడలో వైశ్య కుటుంబానికి చెందిన డా .కొరళ్ళ రాజారావు,మెట్రిక్ పాసై ,గురువులవద్ద సంప్రదాయ బద్ధంగా ఆయుర్వేద విద్య నేర్చారు .బాల్యం నుంచి దేశ సేవ పై అభిలాష ఎక్కువ .1921-22లో కాంగ్రెస్ లో చేరి సేవ చేశారు .1930 ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్న 200 మందిలో మొదటివారు శ్రీ బులుసు సాంబమూర్తి గారు కాగ ,రెండవ వారు డా .కొరళ్ళ రాజారావు గారు .గాంధీజీకి వినోబా ఎలాగో బులుసువారికి కొరళ్ళ అలాటి శిష్యుడు ..

  సత్యాగ్రహం తర్వాత కొందరు వాలంటీర్లతో కలిసి రామ చంద్రాపురానికి ప్రచారం కోసం వెళ్లి అక్కడి ఒక ఇంట్లో  లో రాత్రి పడుకొని ఉండగా ,విషయం పసిగట్టిన ముస్తఫా అర్ధరాత్రి ,పోలీసులతో ప్రవేశించి తుపాకి మడమతో రాజారావు గార్ని పొడిచి నిద్ర లేపి  నిర్దాక్షిణ్యంగా లాఠీ చార్జి చేశాడు .రాజారావు గారు ఏమాత్రం భయపడక చలించక అలాగే నిలబడ్డారు .ఆయన్ను కొట్టటానికి నలుగురు రిజర్వ్ పోలీసులను నియమించి  వాళ్ళతో రక్తం ధారగా కారెట్లు  చితక బాదించాడు .అయినా నిబ్బరంగా తక్కుకున్నాడు ఆ వైశ్య ధీర ధైర్య దేశ భక్తుడు .ముస్తాఫాను కొట్టాలంటే రాజారావు గారి కి చాలా తేలికే .అంతటి బలిష్టులాయన .కానీ గాంధీజీ చెప్పిన దౌర్జన్య రాహిత్య తత్వానికి అంకిత భావం తో లోబడి ,ముస్తఫా పై చేయి చేసుకోలేదు .మిగిలిన సత్యాగ్రహులను అందర్నీ ఒక వాయింపు వాయించి మళ్ళీ ముస్తఫా ఈయన దగ్గరకు వచ్చాడు .మళ్ళీ రెండో సారి లాఠీ చార్జి చేశాడు పరమ కిరాతకం గా .అప్పుడు ‘’తనకు గాంధీ మహాత్ముని దివ్య దర్శనం’’ కలిగిందని దేశభక్త డా .కొరళ్ళ రాజారావు గారు చెప్పారట .అప్పటికీ డాక్టరు గారు చలించక పోవటం తో ముస్తఫా మిలిటరీ బూటుతో రాజారావు గారి ఆయువు పట్టుపై అత్యంత బలంగా తన్నాడు .డాక్టర్ గారికి స్పృహ తప్పికింద పడిపోయారు .గిలగిల తన్నుకొన్నారు .అయినా వదలక ఆ నరరూప రాక్షసుడు మళ్ళీ తన్నగా నెత్తురు కక్కుకొన్నారు .రాక్షసానందం తో నవ్వుకొంటూ బలగంతో వెళ్ళిపోయాడు ముస్తఫా .  గ్రామస్తులెవ్వరూఅక్కడికి  వచ్చి ఆయన ముఖమైనా చూడలేదు.  రాజారావు గారిని లెవ తీయనూ లేదు.మంచినీళ్లివ్వ  లేదు భోజనం పెట్టలేదు .అందరూ ముస్తాఫాకు భయపడి ఏరకమైనా సానుభూతి కాని సహాయంకాని ప్రజల ప్రాణాలు కాపాడే అ డాక్టర్ గారికి చూప లేకపోయారు .ఆ రోజు రాత్రి ఎలాగో కాకినాడ చేరారు .అప్పటినుంచి ఆరోగ్యం దెబ్బతిని క్షయవ్యాధి వచ్చింది .కానీ తాను  సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు అవటంతో తగిన మందులు తానె చక్కగా వాడుకొని ఆరోగ్యం పొందగలిగారు .1941లో మళ్ళీ వ్యక్తి సత్యాగ్రహం లో పాల్గొన్నారు రెట్టింపు ఉత్సాహం తో .పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయలేదు .కొద్ది శిక్ష వేసి వదిలేశారు .

4-అభినవ ప్రహ్లాద శ్రీ కాశీ భట్ట జగన్నాథం  

తూగోజి అమలాపురం తాలూకా కడలి గ్రామ కాపురస్తులు శ్రీ కాశీ భట్ట జగన్నాథం  గారు .వైదీక శోత్రియ బ్రాహ్మణులు.సదాచార  సంపన్నులు  .మొదట్నించి గాంధీజీ ఉద్యమం లో పని చేశారు .ప్రతిగ్రామాన్ని కాలినడకతో తిరిగి గాంధీ సూత్రాలు ప్రచారం చేసిన మహాను భావులు .నిరంతరం రాట్నం పై నూలు వడికే కర్మిష్టి .గాంధీ మహాత్ముడికంటే ఎక్కువ నూలు వడికిన వారుగా జగన్నాథంగారు  అని చెప్పుకొంటారు . .కాంగ్రెస్ సేవ తప్ప వేరే జీవితం లేనివారు .పరాదీనతలో బ్రతకరాదనే సిద్ధాంతాన్ని అమలు చేశారు .గ్రామాలలో వారానికి ఒకసారి జరిగే సంతలకు వెళ్లి అక్కడ ప్రజల్ని సమీకరించి మహాత్ముని సందేశాలు వినిపించేవారు. .

   1932లో అలాగే ఒక ఊరు వెళ్లి ,అక్కడ త్రివర్ణ పతాకం ఎగరేసి ,అక్కడికి అందర్నీ పిలిచి ,గాంధీగారి ఖద్దరు ఉద్యమం గురించి బోధ చేశారు .ఇంతలో ముస్తఫా వచ్చి ఆ జండాను ముక్కలు ముక్కలుగా చి౦పేసి జగన్నాథం గారిని లాఠీ చార్జి చేయించాడు .ఆయన్ను వస్త్ర విహీనుడిని చేసి ,విదేశీ వస్త్రాన్ని ఆయనపైకి విసిరేసి దాన్ని కట్టుకోమని ఆజ్ఞా పించాడు .ససేమిరా కట్టుకోనన్నారు .కోపం నషాళానికి అంటిన ముస్తఫా ఆయన నుంచి ఊడదీసిన ఖద్దరు వస్త్రాలను ఆయన ఎదుటే తగలబెట్టించాడు .మళ్ళీ లాఠీ చార్జి చేయించాడు .తగిలే ప్రతి దెబ్బకు ‘గాంధీ గాంధీ గాంధీ ‘’అంటూ ఆక్రోశించటం తప్ప జగన్నాధం గారు ఏమీ చేయలేక పోయారు పాపం .కిందపడిన ఆయన్నుమట్టిలో పొర్లించాడు . బూటుకాలుతో కసితీరేదాకా తన్నాడు ఆ కంస రూప రాక్షస పోలీసు ఆఫీసర్ముస్తాఫా .ఆయన  గాంధీనామం తప్ప వేరేదీ స్మరించలేదు .ఆయనకున్న జంధ్యం చూసి బ్రాహ్మణుడు అని గుర్తించి కల్లు కుండ తెప్పించి ,నోట్లో కల్లుపోయించే ప్రయత్నం చేయించాడు .ఆయన నోరు తెరవలేదు .ఆ నరాధముడు బాయినెట్ తో నోరు పెకలించి ,కల్లు పోశాడు నోట్లో .వెంటనే జగన్నాధంగారు ప్రక్కకు తిరిగి ఉమ్మేశారు .వాడు ఆయన గుండేపైకి ఎక్కి కూర్చుని ,బాయి నెట్ తో నోరు తెరిచి మళ్ళీ కల్లు నోట్లో పోశాడు .ఆయన మింగక పోవటంతో ఆకు౦డలోని కల్లు అంతా ఆయనపై కుమ్మరించి అక్కసుతో అక్కడినుంచి వెళ్ళిపోయాడు .

  జగన్నాథం గారు నెమ్మదిగా లేచి కూర్చుని నోటిలోఒక్క కల్లు చుక్క కూడా లేకుండా ఉమ్మేసి ,అక్కడి వారు ఇచ్చిన ఖద్దరు తువ్వాలు కట్టుకొని, ఇంటికి వెళ్ళారు ఆ ‘’అభినవ ప్రహ్లాదుడు ‘’జగన్నాధం గారు .కాంగ్రెస్ వారికి ఎన్నికలు వచ్చినప్పుడే ఆయన గుర్తుకు వస్తారు .నిశ్చల దేశభక్తులు అచంచల సత్యాగ్రహి .గాంధీజీ ని మాత్రమె నమ్ముకొన్నఆధునిక  భక్త ప్రహ్లాదుడు ఆయన..డబ్బు కు  ,పదవులకు ,పలుకు బడికి ప్రాకులాడని విశుద్ధ దేశ భక్తులు శ్రీ కాశీ భట్ట జగన్నాధం గారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-8-22-ఉయ్యూరు 

Posted in మహానుభావులు | Leave a comment

భారతీ నిరుక్తి .43వ భాగం.28.8.22

భారతీ నిరుక్తి .43వ భాగం.28.8.22

Video link

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ గాడి చర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం.8వ భాగం.27.8.22

శ్రీ గాడి చర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం.8వ భాగం.27.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భారతీ నిరుక్తి .42వ భాగం.27.8.22గ

భారతీ నిరుక్తి .42వ భాగం.27.8.22గ

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు

మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు

1=శ్రీ వెన్నెటి సత్యనారాయణ

గోదావరిజిల్లా కాతేరు గ్రామవాసి బ్రాహ్మణులు శ్రీ వెన్నెటి సత్యనారాయణ .బియే పాసై రాజమండ్రి వీరేశలింగం హై స్కూల్ ఉపాధ్యాయులుగా పని చేసి ,మానేసి ప్లీడరీ చదివి పాసై ,రామ చంద్రాపురం లో న్యాయవాదిగా పని చేశారు .గాంధీజీ  పిలుపు విని వృత్తివదిలేసి ,ఉద్యమాలలో పాల్గొని 1921-22లో అరెస్ట్ కాబడి జైలు శిక్ష అనుభవించి విడుదలై ,కాంగ్రెస్ లో చేరి ఉప్పు సత్యాగ్రహం లో1930 పాల్గొని రెండవసారి జైలుకు వెళ్ళారు .1932లో ముస్తఫా క్రూరానికి బలై,చెరసాలపాలై , ,విడుదలై గాంధీ గ్రామ పునర్నిర్మాణం లో చురుకుగా పాల్గొని ,గృహ పరిశ్రమలకు ,ఖద్దరు ఉత్పత్తికి పాటు పడ్డారు .డా జోశ్యుల సుబ్రహ్మణ్యం గారి తర్వాత ఈయన్నే ఎక్కువగా టార్గెట్ చేసి ముస్తఫా లాఠీలతో బాధించాడని   రాజమండ్రి పురవాసులు చెప్పుకొంటారు .

2-శ్రీ నాళ౦ భీమరాజు

రాజమండ్రిలో ప్రసిద్ధ వైశ్య కులం లో జన్మించిన శ్రీ నాళం భీమరాజు గారు మహాసాహసి ,పిరికితనం అంటే ఏమిటో తెలియని ధీరుడు .1930ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని జైలుకు వెళ్లి వచ్చారు .1930 డిసెంబర్ లో జరిగిన పెద్దాపురం తోట విందుఏర్పరచిన వారిలో ఒకరు .

  ఆ రోజు తోట విందు పూర్తయ్యాక మధ్యాహ్నం 2-30కి పోలీ సులు లాఠీ లతో వస్తున్నారన్నవార్త తెలిసి ,అందరూ చెదిరి పారిపోదామని భావించగా భీమరాజు ఒక్కరే పారిపోవటం పిరికి తనం పారిపోకూడదని పట్టు బట్టగా ,అరగంటలోపే పోలీసులు వచ్చి చితక బాదేశారు అందర్నీ .కోదేటి రంగా చార్యుల చెయ్యి విరగ గొట్టారు .అది మళ్ళీ అతుక్కోలేదు .1937లో చనిపోయాడు .1932లో డా సుబ్రహ్మణ్యం గారితోపాటు భీమరాజుగారినీ పోలీసులు బాదిపారేశారు .భీమరాజును అరెస్ట్ చేశారు విడుదలై ,హార్ట్ అటాక్ తో చనిపోయారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-8-22-ఉయ్యూరు   —

Posted in మహానుభావులు | Leave a comment

భారతీ నిరుక్తి .41వ భాగం.27.8.22

భారతీ నిరుక్తి .41వ భాగం.27.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కు ”బ్రహ్మ వైవర్త మహా పురాణం -గణపతి ఖండం

భారతీ నిరుక్తి తర్వాత ?

 శ్రీ హరి సోదరులు రచించిన భారతీ నిరుక్తి ,ఈ రోజు ఉదయం 10గంటలకు ,,సాయంత్రం 4గంటలకు కూడా ప్రసారం చేసి 30వ తేదీ మంగళవారం ఉదయం తో పూర్తీ చేస్తున్నాము .

31-8-22 బుధ వారం శ్రీ వినాయక చవితినాడు సాయంత్రం 4 గంటలకు ”బ్రహ్మ వైవర్త మహా పురాణం -గణపతి ఖండం ”ప్రారంభి౦చి ,మర్నాడు 1-9-22గురువారం నుంచి ఉదయం 10 గంటలకు ప్రత్యక్ష ప్రసారం చేస్తాము .వినాయక చవితి శుభా కాంక్షలతో -గబ్బిట దుర్గా ప్రసాద్ -27-8-22

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం.7వ భాగం.26.8.22

శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం.7వ భాగం.26.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

స్వాతంత్ర్య విప్లవ కారులకు సహాయ,సహకారాలు అందించిన  వంగల వెంకట నారాయణ దంపతులు .

స్వాతంత్ర్య విప్లవ కారులకు సహాయ,సహకారాలు అందించిన  వంగల వెంకట నారాయణ దంపతులు .

 వైదీక తెలగాణ్య శాఖకు చెందిన వంగల వెంకట నారాయణ అత్తిలి వాస్తవ్యులు  రసాయన శాస్త్రం లో బి ఏ పాసై ,పాండిత్యం సంపాదించారు .వీరికున్న అభినివేశం ,ఉత్సాహం ఎవరికీ లేదు ., వెంకట నారాయణ ,తమ్ముడు శివరాం కూడా ఇలాంటి వారే ..లక్నో యూని వర్సిటిలో గొప్ప పదవులలో ఉన్నారు .కృష్ణా పత్రిక సంపాదకులు శ్రీ ముట్నూరి కృష్ణా రావు గారి కుమార్తె ను శివరాం గారు వివాహం చేసుకొని ,యూరప్ అమెరికాలకు వెళ్లి విజ్ఞాన ఖనులుగా గుర్తింపు పొందారు .

  వెంకట నారాయణ గారు బియేపాసై ఉపాధ్యాయ వృత్తి లో చేరి ,రెండేళ్ళు పని చేసి జపాన్ వెళ్ళారు .అక్కడ  రసాయన శాస్త్రం లో నిష్ణాతులయ్యారు .ఆదేశాలు స్వేచ్చా స్వాతంత్రాలతో వర్దిల్లటం కనులారా చూసి ,తన మాతృభూమి భారత దేశం పరదేశ దాస్య శ్రుంఖలాలలో  బంధింప బడటం తట్టుకోలేక పోయారు .

  1905-06లో ఇండియాకు తిరిగి వచ్చిన వెంకట నారాయణ గారు  వివాహం చేసుకొని రాజమండ్రి లో స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు .అప్పటినుంచి ఆంద్ర తొలిలి విప్లవవీరుడు ఎర్రమిల్లి జగ్గన్న శాస్త్రి గారితో గొప్ప పరిచయం ఏర్పడింది .శాస్త్రిగారు రాజకీయం లో ప్రవేశించగానే వంగల వారు ఆయనకు కుడిభుజంగా నిలిచారు .అత్యంత రహస్య విషయాలు సేకరిస్తూ శాస్త్రి గారికి అందిస్తూ ,కావలసిన అన్ని విధాల సాయం అందించారు .

  ఆరోజుల్లో వెంకట నారాయణ గారి ఇల్లు రాజమండ్రి లో తీవ్ర రాజకీయ ఆందోళనలకు నిలయంగా ఉండేది .ఎవరు ఏ విషయం మాట్లాడాలన్నా వెంకట నారాయణ గారింటికే వచ్చి మాట్లాడే వారు .ఎవరెవరు పోలీసు వారంట్ తప్పించుకోవాలన్నా వంగల వారింటికే చేరేవారు .వెంకట నారాయణ దంపతులు అందరికి చక్కని వసతి భోజనాలు సమకూర్చేవారు .వెంకట నారాయణ గారు వారికి గొప్ప సలహాదారు గా మాత్రమె ఉన్నారు .కానీ సాహసించి ముందు అడుగు వేయలేదు .

   కానీ ఆయన భార్య అలాకాదు .ఆకాలం లో విప్లవకారులతో దీటుగా పని చేసేవారు .పోలీసుల ఎర్ర టోపీ చూసి భయపడే ఆకాలం లో ఆమె ధైర్య సాహసాలతో ,ఉత్సాహం గా ముందుకు వచ్చి భారత స్వాతంత్ర్య విప్లవానికి సాటిలేని సహాయం చేసేవారు .ఎవరికీ ఏ వార్త చేరాలన్నా, ఆమె ద్వారానే చేరేది అలాంటి’’ కీ రోల్ ‘’పోషించారామే .రకరకాలుగా దుస్తులు మార్చుకొని ,వేషాలు వేసుకొని పోలేసుల కళ్ళు కప్పి ,విప్లవ కారులకు గొప్ప సాయం చేసేవారు .ఆకాలం లో రాజమండ్రి లో అంతటి సాహసం చేసి౦ది వెంకట నారాయణ గారి భార్య ఒక్కరే .

  ఒక రోజు దొరసాని వేషం తో గోదావరి స్టేషన్ లో దిగిన ఆమె ను పోలీసులు వెన్నంటారు .రెండు మూడు సందులు దాటి మాయమయ్యారామె .పోలీసులకు ఆమె దొరకలేదు ఎంత ప్రయత్నం చేసినా ..అప్పుడామే సరాసరి’’జాతీయ నాయకులు ‘’పుస్తక రచయిత ,జగ్గన్న శాస్త్రికి కుడిభుజం  కోటమర్తిచినరఘు పతి గారింటికి వెళ్లారు .ఆయన తల్లి సోదరి ఆమెను ఆశ్చర్యంగా చూసి ‘’అమ్మా ఇదేమిటి ?’’అని అడిగితె మాట్లాడ వద్దని సౌజ్ఞ చేసి ,లోపలి వెళ్లి దొరసాని వేషం తీసేసి .ముఖానికి పసుపురాసుకొని స్నానం చేసి ,పట్టు చీర పట్టు జాకెట్ ధరించి,నుదుటిపై కాణీ అంత కుంకుమ బొట్టు తలలో పూలు ధరించి  ,పళ్ళెం లో పూలు ,పళ్ళు పెట్టుకొని ,చేతిలో చెంబు నీళ్ళు పట్టుకొని ,అతి శాస్త్రోక్తంగా రఘుపతి గారిచ్చిన రహస్యమైన జాబులు మొలలో దాచుకొని ,సరాసరి గుడికి వెళ్లి ,అక్కడినుంచి బండి కట్టించుకుకొని ఇంటికి చేరారు .భర్త వెంకట నారాయణ గారు ‘’ఎప్పుడు వచ్చావు ?ఈ వేషం ఏమిటి ?’’అని అడిగితె ,ఆమె దొరసానివేషం తో తన పుట్టిల్లు అయిన రఘుపతి గారింటికి వెళ్లి ,అక్కడినుంచి తాను  తెచ్చిన రహస్య ఉత్తరాలను భర్తకు అందజేశారు .ఇంతటి ధైర్య సాహసాలతో స్వాతంత్ర్య సమరానికి రహస్యంగా తోడుపడిన ఏకైక ఆంద్ర మహిళ వెంకట నారాయణ గారి భార్య ,రఘుపతి గారి సోదరి 1914లో బొంబాయిలో మరణించారు .ఆమె పేరు కూడా మనకు తెలీదు .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-8-22-ఉయ్యూరు

  భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ సంవత్సరంలో శ్రీ వంగల వెంకట నారాయణ  దంపతులను పరిచయం చేయటం మహదానందంగా ఉంది .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-8-22-ఉయ్యూరు–

Posted in మహానుభావులు | Leave a comment

  మా నాన్న గారి నవ్యజ్యోతి మాసపత్రిక

  మా నాన్న గారి నవ్యజ్యోతి మాసపత్రిక

 మా నాన్న గారు విద్వాన్ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారు అనంతపురం జిల్లా హిందూపూర్ లో ఎడ్వర్డ్ కారోనేషన్ మునిసిపల్ హైస్కూల్ (ఇ.సి.ఎంహైస్కూల్ )లో సేనియర్ తెలుగు పండిట్ గా 1931 నుంచి 1953వరకు పని చేసినపుడు  ‘’నవ్య జ్యోతి ‘’మాస పత్రిక కు సంపాదకులుగా ఉంటూ వెలువరించారని  నాకు ఇంతవరకు తెలియదు .దీని విషయం శ్రీ ఆశావాది ప్రకాశరావు గారు  రాయల సీమ లో వెలువడిన పత్రికల గురించి సేకరించివిషయాలను  తెలుగు అకాదేమికి అందించినట్లు ,ఇవాళ మా అబ్బాయి శర్మ సేకరించి పంపగా తెలిసి మహా సంతోషం పొందాను .వాడికి అభినందనలు  -దుర్గాప్రసాద్ -26-8-22-ఉయ్యూరు 

Page Number 445 : https://ia801604.us.archive.org/8/items/in.ernet.dli.2015.489107/2015.489107.Telugulo-Parishodhana.pdf

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

హరిజనోద్ధరణ చేసిన రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ ,జాతీయ సత్యాగ్రహి,ఉత్తమ ప్రజాసేవకులు  డా. శ్రీ పాలకొడేటి గురు మూర్తి -2(చివరిభాగం

హరిజనోద్ధరణ చేసిన రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ ,జాతీయ సత్యాగ్రహి,ఉత్తమ ప్రజాసేవకులు  డా. శ్రీ పాలకొడేటి గురు మూర్తి -2(చివరిభాగం

 ఇందులో మొదటి భాగం చదివిన శ్రీమతి క్రష్ణమయిగారు వెంటనే స్పందించి అమెరికా నుంచి మెయిల్ లో తాను  పాలకొడేటి గురుమూర్తిగారికి మనవరాలు అంటేకుమారుని కుమార్తెఅని తెలియ జేశారు .ఈమె నాకు ఎలా పరిచయం అంటారా ?ఆమె భర్త ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త ,117వ మూలకం టేన్నిస్సిన్(Tn)ను ఆవిష్కరించిన మహా శాస్త్రవేత్త శ్రీ ఆకునూరి వెంకట రామయ్య గారిపై నాతొ మా మైనేని గోపాల కృష్ణగారు ‘’అణుశాస్త్ర వేత్త డా .ఆకునూరి వెంకట రామయ్య ‘’పుస్తకం రాయించి సరసభారతి తరఫున ప్రచురించారు .ఆసమయం లో రామయ్యగారితో, ఈమె గారితో ఎన్నో సార్లు ఫోన్ లో మాట్లాడి విషయ సేకరణ చేశాను .ఇప్పటికే తరచుగా ఫోన్ చేసి ఆదంపతులు మాట్లాడే సౌజన్యమూర్తులు ఆ దంపతులు  .మన సరసభారతి ని ఆమె రోజూ చదువుతారు .శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం కార్యక్రమాలు చూస్తారు ,స్పందిస్తారు .ఇంకో విషయం నేను రామయ్య గారిపై రాసిన పుస్తకం అమెరికాలో టెన్నిసీ రాష్ట్రం లో రామయ్య గారింట్లోనూ ,స్పాన్సర్ శ్రీ మైనేని గారుండే అలబామా రాష్ట్రం లోని హ౦ట్స్ విల్ దగ్గరున్న మాడిసన్ కౌంటి లోను ,మూడవసారి ఉయ్యూరులో  సరసభారతి  ఉగాది వేడుకలలో రామయ్య దంపతుల బంధుగణం సమక్షం లో శాసన మాండలి సభ్యులు శ్రీ వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించి హాట్రిక్ సాధించారు .అంతేనా ?ఈ సంవత్సరం సరసభారతి సాహితీ పుష్కరోత్సవం మా సహస్ర చంద్ర మాసోత్సవం నాడు 27-6-22 సోమవారం  శ్రీ మైనేని దంపతులు ఆపుస్తకానికి ఇంగ్లీష్ అనువాదం చేయించి Nuclear Scinntist  ’’Dr.Akunuri Venkataramayya ప్రచురించగా  నాలుగో సారి రాజేంద్ర ఆవిష్కరించి అరుదైన రికార్డ్ సృష్టించారు .

 శ్రీమతి కృష్ణ మయి గారు మెయిల్ లో తెలియ జేసిన విషయాలు –తనమూడవ ఏట తాతగారు గురు మూర్తిగారు మరణి౦చారని ,కనుక తనకు వారితో ప్రత్యక్ష పరిచయం  లేదని ,ఆయనకు స్వంత ఇల్లు కూడా లేదని ,కస్టపడి సంపాదించి రాజమండ్రిలో స్వగృహం నిర్మించుకోన్నారని ,కో ఆపరేటివ్ బాంక్ ను రాజమండ్రిలో స్థాపించిన ఘనత వారిదే అని చెప్పారు .ఆ బ్యాంక్ వజ్రోత్సవ అంటే 75 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి ఫాదర్ డా.రాం బాబు గారిచే సన్మాన౦చినపుడు తానుకూడా హాజరయ్యానని తెలియజేశారు .పేపర్ వార్తలనుబట్టి గురుమూర్తిగారి 1884లో జన్మించారనీ ,ఆంధ్ర దేశం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి దిట్ట గా గుర్తి౦పు పొందారని ,మునిసిపల్ చైర్మన్ గా ఆదర్శ వంతగా పరిపాలించారని ,స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొని జైలుకు వెళ్ళారని ,హరిజన సీవ లో తరించారనీ ,రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా ఆయుర్వేద మునిసిపల్ ఆస్పత్రి నిర్మించినఘనత తాతగారిదే అని చెప్పారు .తాతగారి ఫోటో కూడా పంపి వ్యాసానికి నిండుదనం చేకూర్చారు 

Posted in మహానుభావులు | Leave a comment

భారతీ నిరుక్తి 40 వ భాగం.26.8.22

భారతీ నిరుక్తి 40 వ భాగం.26.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment