సహస్ర చంద్ర దర్సన -మహోత్సవ ఆహ్వానం

Posted in సమయం - సందర్భం | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-7

విశ్వ పుత్రిక తోరూ దత్-7

ఫ్రాన్స్ లో తోరూ

గోవిన్ చందర్ కుటుంబం ముందు మార్సేల్స్ చేరి అక్కడి నుంచి నైస్ కు వెళ్ళింది .1870 వసంతం దాక అక్కడే ఉండి,స్కూల్ లో తొరూ ఆరూ చేరి ఫ్రెంచ్ చదివారు .కొన్ని నెలలతర్వాత తండ్రి ఇంటివద్దనే ష్వేయర్ అనే టీచర్ తో చదువు చెప్పించాడు .అప్పుడే ఫ్రెంచ్ సాహిత్యపు లోతులు తరచారు అక్క చెల్లెళ్ళు .అప్పటి అ సాహిత్యం లో స్వాతంత్ర్య కాంక్ష ప్రముఖంగా ఉండేది .జార్జి సాన్డ్స్ నవలలో స్త్రీస్వాతంత్ర్యం కూడా ఉంది .తోరూకు ఫ్రాన్స్ పై అభిమానం పెరిగిపోయింది .’’ఎవరూ మార్చలేని ,అధికారం  చెలాయించ లేని ఫ్రెంచ్ మహిళ ను నేను ‘’అని రాసుకొన్నది .

  నైస్ లో ఈ కుటుంబం హెలేవిటి హోటల్ లో ఉండేది .ఇక్కడి నుంచి కలకత్తాలోని బంధువు అరుణ్ చందర్ కు ఉత్తరాలు రాసేది తోరూ.లెంట్ సమయంలో కాధలిక్కులు కలివిడిగా పెద్దమనిషి తరహాగా ఉంటారని రాసింది .ఒకరోజు కుటుంబ మంతా సంతకు బయల్దేరారు .తలిదండ్రులు ఒక డొక్కు బండీ ఎక్కితే ఆడపిల్లలిద్దరూ మిస్టర్ ఇలియట్ తో వెళ్ళారు .ఇతడు మిసెస్ బార్టన్ తమ్ముడు .ఒక డాబా ఎక్కి కుర్చీలపై నుంచుని సంతా అంతా చూశారు ..ఒక డాక్టర్ భార్య వీరి కుటుంబానికి సన్నిహితంగా ఉండేది .ఆమె పిల్లలిద్దర్నీ ఫ్రెంచ్ లోనే మాట్లాడమని హితవు చెప్పేది .తప్పులు మాట్లాడినా ప్రోత్సహించేది .

  ఆకాలం లో ఇంగ్లాండ్ కంటే ఫ్రాన్స్ కు పేరు ప్రతిష్టలు ఎక్కువ .ఫ్రెంచ్ బాలికలు అధునాతన బెంగాలీ బాలికలకంటే మెరుగ్గా ఉండటం తోరూను ఆకర్షించింది .తన నవలలో ఒకదానిలో అలాంటి ఫ్రెంచ్ బాలిక ను మార్గరెట్ పేరుతొ చక్కగా చిత్రించింది .జేమ్స్ డామేష్టర్ ఫ్రెంచ్ సాహిత్యం లో తోరూకున్న అద్భుత పరిచయానికి అబ్బురపడ్డాడు .నైస్ లో దత్తు కుటుంబం ‘’ప్రోమెనేడ్ డెస్ యా౦ గ్లాయిస్ ‘’లో నివసించింది .అక్కడి బహు వర్ణమిశ్రమంగా ఉన్న మేడిటరేనియన్ దృశ్యానికి ముగ్దురాలైంది .ద్రాక్ష తీగలు ,పళ్ళ తోటలు , నీలి సముద్రం లను చూసి అక్క చెల్లెళ్ళలో కవితాత్మ మేలుకొన్నది .కాన్స్ నుంచి మొనాకో కు చేసిన ప్రయాణం తన్మయులను చేసింది .అక్కడి జీవన మాధుర్యానికి చలించిపోయారు .దక్షిణ ఫ్రాన్స్ లో ఉన్న ఈ చల్లని వాతావరణం ఆరూ కు పడలేదు .కనుక అక్కడి నుంచి వెళ్లి పోవాలనుకొన్నారు .ఇంగ్లాండ్ లో ఉంటె ఆరూ ఆరోగ్యం బాగు పడుతు౦దనుకొన్నాడుతండ్రి  .కానీ అక్కడ చలీతేమా ఎక్కువ అన్న సంగతి ఆలోచి౦చినట్లు లేదు .1870లో శ్రీమతి బార్డాన్ తో సహా ఇంగ్లాండ్ చేరారు .’’వాళ్లకు కళ చరిత్ర బాగా తెలుసు .అది వాళ్ళనాన్న గారి కృషే .ఒకసారి కానన్ చైల్దర్ హౌస్ కు వీళ్ళను తీసుకు వెళ్లి అక్కడ కంచుతో చేసిన చనిపోతున్న మల్లుడి విగ్రహం చూపించి ఎవరిదీ అని అడిగ్తే ఆరూ తొరూ లిద్దరూ చటుక్కున సమాధానం చెప్పి నన్ను ఆశ్చర్యం లో ముంచేశారు వాళ్ళు రోమ్ ను చూడకపోయినా.పుస్తకాలద్వారా గ్రహించారన్నమాట .ఫ్రాన్స్ కష్టదశలో ఉన్నప్పుడు మా దేశం పై తొరూ ప్రేమ వర్షించింది ‘’‘’అని రాసింది బార్డాన్ .14ఏళ్లవయసులో తోరూ కు బిస్మార్క్ రాజకీయం పట్ల అయిష్టత ఉండేది .యుద్ధం ప్రారంభమైనప్పుడు ఆమె మనస్సంతా ఫ్రాన్స్ క్షేమం మీదే ఉండేది .1851లో ఫ్రాన్స్ శాసన సభలో విక్టర్ హ్యూగో చేసిన ప్రసంగాన్ని ‘’సమకాలీన చరిత్రలో ఒకరంగం ‘’పేరుతొ తోరూఅనువదించి  బెంగాల్ పత్రికకు పంపితే ప్రచురితమైంది .ఫ్రెంచ్ రాజ్యాంగం లో కొన్ని మార్పులు కావాలని కొందరు అంటే హ్యూగో ‘’అలా చేస్తే నెపోలియన్ ఫ్రాన్స్ కు రాజుగా చేసి అమితమైన అధికారాన్ని కట్ట బెట్టి నట్లే ‘’అని ధైర్యంగా వ్యతిరేకించిన ప్రజాస్వామ్యవాది .తొరూ దీన్ని బాగా బలపరచింది .మిస్టర్ ధియర్ ఉపన్యాసాన్నికూడా అనువదించి బెంగాలీ మేగజైన్ కు పంపగా ప్రచురితమైంది .1870లో ఫ్రాన్స్ ప్రష్యా పై యుద్ధ ప్రకటన  చేయటాన్ని ఆయన ఖండించాడు .ఒక చిన్న బాలిక ఇంతగా రాజకీయంగా పరిణత బుద్ధి చూపటం అమితాశ్చర్యకరం .ఆమె తనను ఫ్రెంచ్ బాలికగా మలచుకున్నది .

 1871జనవరి సంచికలో తనకు ఫ్రెంచ్ దేశమంటే ఎంత గౌరవమో వెల్లడించింది తొరూ .ఆమె ఫ్రెంచ్ దేశభక్తుడికియేమాత్రం తీసి పోదు ..’’మేము పారిస్ లో ఉన్నది కొద్దికాలమే అయినా అదెంత అందమైన ప్రదేశం ,అవేమి వీధులు ,,అదెంత సేన .కానీ ఇప్పుడు ఎంతగానో పతనమై పోయింది.నగరాలన్నిటికి తలమానికమే అయినా ,ఇప్పుడు దాని నిండా దుఖం పొంగి ప్రవహిస్తోంది  ‘’అని బాధపడింది.ఫ్రాన్స్ పతనానికి నాస్తికతే కారణం  అనీ అందుకే దేవుడు దాన్ని శపించాడని భావించింది –‘’ఎంత పతనం చెందావ్ ఫ్రాన్స్ !ఇంత అవమానం భరించాక ఇక నువ్వు తప్పని సరిగా భగవంతుని పూజించి సేవించు .నీ కోసం నా గుండె ఎలా ముక్కలై పోతోందా తెలుసా ??అని వాపోయింది చిన్నారి తొరూ .15ఏళ్ళ వయసులో ఆమె రాసిన కవితలో ఆమె కున్న పరిపక్వత కనిపిస్తుంది .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-6-22-ఉయ్యూరు   

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పామర్రు జిల్లాపరిషత్ హైస్కూల్ 1986-87 పదవతరగతి బాచ్ పూర్వ విద్యార్ధుల సమ్మేళనం ,గురు వందనం ఆహ్వానం

పామర్రు జిల్లాపరిషత్ హైస్కూ ల్ 1986-87 పదవతరగతి బాచ్ పూర్వ విద్యార్ధుల సమ్మేళనం ,గురు వందనం ఆహ్వానం

Posted in రచనలు | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-6

విశ్వ పుత్రిక తోరూ దత్-6

తోరూ బాల్యం

కలకత్తా మధ్యలో మాణిక్ తలావీధిలో రామబాగన్ లో తొరూ దత్ 4-3-1856 న పుట్టింది .పెద్ద వాడు అబ్జూ పుట్టి 14ఏళ్ళకు ,అక్క ఆరూ 1854లో పుట్టిన 20ఏళ్ళకే చనిపోయారు . .తొరూ 21ఏళ్ళు మాత్రమె బతికి 30-8-1877న మరణించింది .గోవిన్ దత్ కుటుంబమంతా కారన్ వాలీస్ స్క్వేర్ లో ఉన్న చర్చిలో మత పరివర్తనం పొందారు .పిల్లలు ముగ్గురికి బాబూ సాహెబ్ చందర్ బెనర్జీ టీచర్ .ఆయన మేనకోడలు భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడైన w.c.బెనర్జీ భార్య .బాబూ సాహెబ్ దగ్గరే మిల్టన్ రాసిన పారడైజ్ లాస్ట్ మొదటి మూడు భాగాలు చదివారు .ముగ్గురికిఅదంతా కంఠతా వచ్చు.అక్క చెల్లెళ్ళు పియానోతోపాటు ఇంగ్లీష్ సంగీతాన్ని మిసెస్ సెనేస్ వద్ద నేర్చారు .మంచి సంగీతకారులుగా గుర్తింపు పొందారు .విశాలమైన ఇల్లు తోట నౌకర్లు చాకర్లు బంధువులతో వాళ్ళ బాల్యం హాయిగా గడచిపోతుండగా 1865లో అన్న అబ్జూ అకస్మాత్తుగా చనిపోయి భరించరాని దుఖాన్ని కలిగించాడు .కొడుకు మరణం తో కుంగిపోయిన తండ్రి మిగిలిన ఇద్దరు పిల్లలనీ కోల్పోతానేమో అనే బెంగ ,భయం పెట్టుకొన్నాడు .కోడుకుపై ఒక కవిత రాశాడు –‘గడిచే రోజుల్ని బరువుగా లేక్కేస్తూ –అలసిన మనసుతో –ఒంటరిగా గుండెలు పగిలి మిగిలిపోయాను ‘.దైవాన్నే నమ్మాడు .తన సంతానం గురించి రాసిన కవితలో ఆయన –‘’జనముద్దు బిడ్డ నా పెద్దకొడుకు –ఆంతర్యం లో పసివాడు –వాడి వయసులో అంత ఎత్తు ఎదిగిన వాళ్ళు లేరు –ఇంటికి దీపం నా రెండో బిడ్డ –గుండెనిండా బెరుకూ భయమూ –తటాలున ఎర్రబడే బుగ్గలు –నిటారుగా తీర్చిన కనుబొమలు –ఆమె తీరు నిర్మలం గంభీరం –సాయం సంధ్యానక్షత్రకా౦తిలాగా శాంతం సుందరం –చిట్ట చివరిబాల-అర్భకంగా అచ్చర కూనలా –అందాలు చిమ్మేపసిపాప –‘’

  1869లో చలికాలం లో యూరప్ వెళ్లేముందు కలకత్తాలో ఆకుటుంబం కొంతకాలం గడిపి౦ది .అక్కడి తోటలో ఇల్లు అంటేతోరూకు బాగా ఇష్టం అద్భుతమైన కవిత్వం ఆక్కడి ప్రకృతిపై రాసింది –‘’బ్రహ్మ రాక్షసుల్లా అశ్వత్ధ వృక్షాలు జడలుకట్టిన గచ్చ తీగేలపోదలు – అడవి ద్రాక్ష తీగ గుంపు –గ్రామ్యవనితల భూషణాలై –ఆర్యకవితను వాసికెక్కిన –శిరీష కుసుమ సందడి –అదంతా పచ్చదనాల కడలి –తూర్పున నిలుచున్నా వెదురు పొదల సౌందర్యాన్ని మించింది ఏదీ లేదు –సృష్టి ఆదిలో ఈడేన్ తోటను చూసిన ఆనందం ‘’ఇలాంటి బాగ్ మరీ తోటలో గడిచిన బాల్యం ఆమెది .మిస్ ఎలిజబెత్ కాటన్ తోరూ కు వీరాభిమాని .తోరూచనిపోయిన 30 ఏళ్ళకు వచ్చి అదంతాచూసి ఆమె కవిత్వాన్ని ఆతోట సౌందర్యాన్నీ వాటిని ఆమె వర్ణించిన తీరుకు అప్రతిభురాలైంది .

  తొరూ ఆరూ లకు ఫ్రాన్స్ అంటే బాగా ఇష్టం .ఫ్రెంచ్ వాళ్ళు తోరూను ఫ్రెంచ్ అమ్మాయి అనే అనుకొనేవారు .ఫ్రాన్స్ అంటే ప్రాణంగా భావించింది ఆతర్వాత భారతదేశం పై నెమ్మదిగా ఆరాధన కలిగింది తోరూ కు .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-5

విశ్వ పుత్రిక తోరూ దత్-5

రాం బగాన్ లో

దత్తు కుటుంబం మొదట్లో బెంగాల్ లోని బర్ద్వాన్ జిల్లా అజాపూర్ లో ఉండేవారు కాయస్తులు .నీలమణి దత్ 3-1-1757న జన్మించాడు .తన వ్యక్తిత్వం వలన అందరికి స్పూర్తి కలిగించాడు .ఆయన తండ్రి కొందరు కుటుంబ సభ్యులని బర్ద్వాన్ లోనే వదిలిపెట్టి కలకత్తా లోని రాం బాగాన్ కు  చేరాడు .ఉదారస్వభావంతో అందరికి దగ్గరయ్యాడు .నీలమణి కి రసమయి హరీష్ ,పీతాంబర్ అనే ముగ్గురు కొడుకులు .రసమయి మూడవకొడుకు తోరూతండ్రి గోవిన్ దత్ .మిగిలిన వాళ్ళు కిషన్ చందర్ ,కైలాస చందర్ హరి చందర్ ,గిరి చందర్ .పీతాంబరుని పిల్లలు ఈశాన చందర్ ,శశి చందర్ .ఈశానుడి కొడుకే ప్రసిద్ధ రచయిత ,తత్వవేత్త రమేష్ చందర్ .ఇప్పటికీ ఆయన నివసించిన ఇల్లు ఉంది .అందులో ఆయన చుట్టం అశోక దత్ ఉంటాడు .

  తోరూ తాత రసమయి దత్ ఆంగ్ల సాహిత్యాన్నీ అర్దికశాస్త్రాన్నీ బాగా అభ్యసించాడు .హిందూకాలేజీ కమిటి గౌరవ కార్యదర్శి .స్మాల్ కోర్ట్ లో జడ్జి ,అప్పిలేట్ కోర్ట్ లో కమీషనర్ .ఆయన లైబ్రరీ లోని ఇంగ్లీష్ సాహిత్య పుస్తకాలు ఇంటి వారందర్నీ ఆకర్షించాయి .రసమయి తండ్రి బాగా డబ్బు ఖర్చు చేసి పూజా పునస్కారాలు దాన ధర్మాలు చేయటం కొడుకుకు ఇష్టం ఉండేదికాదు .అందుకే సనాతన బ్రాహ్మణ్యం పై ఈసడింపు పెరిగింది .తోరూ పుట్టటానికి రెండేళ్ళ ముందే 14-5-1854న రసమయి చనిపోయాడు .బైబిల్ లో ఇంట్లో వారందరికీ ఆయన మార్గదర్శి .

 దత్తు కుటుంబం క్రైస్తవానికి మారటానికి కారణాలు s.m.మాకే 29-6-1854న రాసిన ఉత్తరం లో ఉన్నాయి .రసమయి చనిపోయి దహనక్రియలు పూర్తయ్యాక ,పెద్దకొడుకు కిషన్ కు తీవ్రంగా జబ్బు చేసి,చనిపోయాడు .చావు బతుకులతో ఉన్న అన్నకోసం తమ్ముడు గిరీష్ ‘’అజిల్ వీ టెంపుల్ ‘’అనే మిషనరీని పిలిపించి ,తన అన్న చనిపోయేముందు పరలోకం చూశాడని ,క్రైస్తవం పై నమ్మకం పెంచుకున్నాడని ,మతం తీసుకోవటానికి కూడా సిద్ధపడ్డాడని చెప్పాడు  .ఈమిషనరి రావటం ఇంట్లో వారికి ఇష్టం లేదు .గిరీష్ తానె మతం తీసుకొని అన్నకు క్రైస్తవం ఇప్పించాడు .కొన ఊపిరితో ఉన్న కిషన్ ఇంట్లో వారందర్నీ క్రైస్తవం తీసుకోమని చెప్పి చనిపోయాడు .

  కిషన్ చనిపోయాక ఇంట్లో వారంతా బాగాచర్చించుకొని క్రైస్తవం తీసుకోవటానికి సిద్ధపడ్డారు .కానీ స్త్రీలు వ్యతిరేకించారు .1862లో కానీ దత్తు కుటుంబ సభ్యులంతా క్రైస్తవులు కాలేకపోయారు .గోవిన్ బాబు బృందావన్ మిట్టల్ కూతురు హిందూపురాణాలను పుక్కిటపట్టిన సంప్రదాయవాదిక్షేత్రమణి ని పెళ్ళాడాడు.ఆమె బెంగాలీ బాగావచ్చిన విద్యావేత్త .ఇంటి పెత్తనం అంతా ఆమెదే .కూతురు తోరూ కు పురాణగాధలు కధలుగా గీతాలుగా చెప్పేది .తల్లిపాడే ఆపాటలకు ఆమెకు కంటి నుండి ఆనంద బాష్పాలు రాలేవి .1862లో ఈమె క్రైస్తవం పుచ్చుకొన్నా ,హిందూ విశ్వాసాలను మనసులో భద్ర పరచుకొనే ఉంది .క్రమంగా ఆమె పూర్తి విశ్వాసంకల క్రైస్తవురాలయింది .భర్త తనకూ భార్యకూ మధ్య పెద్ద అఘాతం ఏర్పడుతుందేమో నని భయపడ్డాడు కానీ అలా జరగాకయేసరికి ఊపిరి పీల్చుకొని ఆ భావాలను ఒకకవితలో నిక్షిప్తం చేశాడు –‘’ఒద్దువెళ్లి పోవద్దు –ఒక్క నిమిషం నిలు –నన్ను శపిస్తూ చీదరించుకోకు –అందరిలాగే నువ్వూ –నన్ను అడవిలో వదిలేసి పోవద్దు –ప్రతిమల్ని నిరసిస్తూ –ప్రభువు ము౦దు మోకరిల్లె –నన్ను వదిలేసి వెళ్ళద్దు ‘’

  పెళ్ళయ్యాక ఆమె ఇంగ్లీష్ జ్ఞానాన్ని బాగా పెంచుకొన్నది .’’ది బ్లడ్ ఆఫ్ జీసెస్ ‘’ను బెంగాలీలోకి అనువదించింది .దీన్ని ట్రాక్ట్ అండ్ బుక్ సొసైటీ ముద్రించింది .ఆకుటుంబం లోఎక్కువకాలం బతికింది ఈమె మాత్రమె .పవిత్ర యోగినిలా బతికి క్షేత్రమణి1900లో మరణించింది .కూతుళ్ళు ఇద్దరిపైనా ఈమె ప్రభావం తండ్రి ప్రభావం బలంగా ఉన్నాయి .తండ్రి నుంచి తెలివి పాండిత్యం,తల్లి నుంచి  నైతిక హృదయ సౌందర్యమ నిర్మలత్వం  తోరూ పొందింది .

  రసమయి కొడుకుల్లో గోవిన్ పరమ ఉదారుడు .హిందూకాలేజిలో చేరి ప్రొఫెసర్ రిచర్డ్సన్ గారి ముఖ్య శిష్యుడయ్యాడు .గోవిన్ ,మధుసూదన్ కలిసి కాలేజీలో నాటకాలు ఆడారు .షేక్స్పియర్ పోయెట్రి ఎలా చదవాలో గురువు వద్ద నేర్చాడు .ఆకాలం లో హిందూకాలేజీ అనేకమంది రచయితల్ని కవులనూ తయారు చేసింది .చిన్నప్పటి నుంచి కవిత్వం రాసే అలవాటున్న గోవిన్ కొన్నికవిత లను ఒక సంపుటంగా ప్రచురిస్తే బ్లాక్ వుడ్ పత్రిక చక్కని విమర్శ చేసి ప్రోత్సహించింది .చదువు పూర్తయ్యాక ప్రభుత్వ శాఖలో ఆదాయ వ్యయ శాఖాదికారయ్యాడు .బెంగాలీలను చిన్న చూపు చూస్తున్నాడు అనే అభియోగం తో బొంబాయికి బదిలీ చేశారు .అక్కడ కుటుంబం పెట్టినా ఉద్యోగం ప్రోత్సాహకంగా లేక రాజీనామా చేసి ,కలకత్తా వచ్చి సాహిత్య, మత కార్యక్రమాలలో మునిగిపోయాడు .

  1873లో లండన్ నుంచి కుటుంబం తో తిరిగొచ్చాడు లండన్ లో  అక్క ఆరూను ప్రతిభా వంతురాలు తోరూను పెద్ద జబ్బు కబళించగా ఇండియా వచ్చారు .ఇంగ్లాండ్ లో తొరూ రాసిన కవిత్వాన్ని ఎడ్మండ్ గాసే బాగా మెచ్చుకొన్నాడు .ఆమె ఇంకొంచెం కాలం బతికి ఉంటె ఆంగ్ల సాహిత్యం లో తన పేరు చిర స్థాయిగా నిలుపుకోనేది అని కితాబిచ్చాడు .ఇద్దరు పిల్లల మరణం తర్వాత తండ్రి కొద్దికాలం మాత్రమె జీవించి ఉన్నాడు .తర్వాత భార్య ఆయన్ను అనుసరించింది .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-6-22-ఉయ్యూరు   

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరస భారతి 165వ కార్యక్రమం గా ‘’సాహితీ పుష్కర మహోత్సవం ‘’

సరస భారతి 165వ కార్యక్రమం గా ‘’సాహితీ పుష్కర మహోత్సవం ‘’
(ఇదే ఫైనల్ ఇన్విటేషన్ –కొన్ని రోజుల తర్వాత దీనినే కార్డ్ సైజు లో కలర్ లో డిజైన్ చేసి పెడతాము .ఈ వాట్సాప్ ఇన్విటేషన్ నే అసలైన ఆహ్వానంగా భావించి అతిధులు ,సన్మానితులు ,కవులు అందరూవిచ్చేసి జయప్రదం చేయవలసినదిగా మనవి .)
సాహితీ బంధువులకు శుభ కామనలు .. సరసభారతి సాహిత్య సాంస్క్రుతిక సంస్థ స్థాపించి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా ,సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారి ‘’సహస్ర చంద్ర మాసోత్సవం ‘’’’ను పురస్కరించుకొని
27-6-2022 సోమవారం సాయంత్రం 4 గం.లకు సరసభారతి 165వ కార్యక్రమంగా ‘’సాహితీ పుష్కరోత్సవం’’,ఉయ్యూరులోని టాక్సీ స్టాండ్ వెనుక ఉన్న ‘’శాఖా గ్రంధాలయం నందు ( A/C లైబ్రరి )నిర్వహిస్తున్నాము.
దీనిలోపుస్తకావిష్కరణ , సంగీవవిభావరి ,కవి సమ్మేళనం , ‘’సరస భారతి ప్రతిభా పురస్కార ప్రదానం ‘’ మొదలైన వి ఉంటాయి .కవి పండితులు ,సాహితీ మిత్రులు ,సంగీత సాహిత్యాభిమానులు పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన .
మొత్తం సభా కార్యక్రమ నిర్వహణ ,పర్యవేక్షణ – శ్రీ దండి భట్ల దత్తాత్రేయ శర్మ –‘’హాస్య దండి ‘’తెలుగు భాషా సమాఖ్య కోశాధికారి ,హాస్యలహరి కార్య దర్శి’’ ప్రముఖ కవి ,విశ్లేషకుడు,సంస్కృతాంధ్ర ప్రజ్ఞానిది స్వర్గీయ శ్రీ కె.వై.ఎల్.ఎన్.’’కళాపీఠంసంస్థాపకులు – విజయవాడ
సహకారం –శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి –సరసభారతి కార్యదర్శి
కార్యక్రమ వివరం –
సాయంత్రం -3-30నుండి 4 గం వరకు –అల్పాహారం
సాయంత్రం 4గం.నుండి 4-30 వరకు
-శ్రీమతి ఏలేశ్వరపు రాధికా సుబ్రహ్మణ్యం (మచిలీ పట్నం )గారిచే ‘’సంగీత విభావరి ‘’
సాయంత్రం 4-30గం .నుండి 5-30 వరకు –కవి సమ్మేళనం
కవి సమ్మేళనం –అంశం –‘’సరసభారతి సాహితీ పుష్కరోత్సవం ‘’
మనవి -5పద్యాలు లేక 15పంక్తుల వచన కవిత్వం .చదివిన తర్వాత కాపీ సరసభారతికి అందజేయ మనవి .అతిధులు ,పురస్కార గ్రహీతలు కూడా ఇందులో పాల్గొనవచ్చు .అందరికి అవే నిబంధనలు వర్తిస్తాయి .
సాయంత్రం -5-30 గం నుండి -5.45వరకు –పుస్తకావిష్కరణ
‘’Nuclear scientist Dr.Akunuri Venkata Rmayya’’( శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించిన ‘’అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి రామయ్య ‘’పుస్తకానికి ‘’ఆంగ్లానువాద పుస్తకం ‘’ ఆవిష్కరణ –-స్పాన్సర్ –శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )
ఆవిష్కర్త శ్రీ వై. వి.బి. రాజేంద్ర ప్రసాద్ – శాసనమండలి మాజీ సభ్యులు .
సాయంత్రం -5-45నుండి 7-15 వరకు సరసభారతి సాహితీ పురస్కార ప్రదానం పురస్కార గ్రహీతల స్పందన
-సాహితీ క్షేత్రం లో అపూర్వ సేవలు అందించిన వారికి విశిష్ట సాహితీ పురస్కార ప్రదానం ,
1- బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి ,-చీరాల
గీర్వాణ, ఆంధ్ర, ఆంగ్ల,భాషా నిపుణులు ,హనుమాన్ ఆధ్యాత్మిక కేంద్ర సంస్థాపకులు ,పరాశర సంహితపై అధారిటి ,సనాతన ధర్మ జ్యోతి సంపాదకులు , ఆధ్యాత్మిక ప్రవచన ప్రముఖులు –చీరాల ,
2- శ్రీ ఆముదాల మురళి-అవధాన కిరీటి -తిరుపతి,
3–,శ్రీ బెల్లంకొండ నాగేశ్వరరావు -బాలసాహిత్య శ్రీ ,బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ,తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ విజేత ,తెలుగు భాషోద్యమ నాయకులు –, చెన్నై
4- శ్రీమాన్ గుడిమెట్ల చెన్నయ్య- జనని సాహిత్య సాంస్కృతిక సంఘం వ్యవస్థాపక కార్యదర్శి ,నటుడు ,రచయిత,సాహిత్య సేవా పారాయణ – చెన్నై
5- శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మ- అపూర్వ కథా రచయిత (నరసరావుపేట )
6-,,శ్రీ చలపాక ప్రకాష్ ,-ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ,రమ్యభారతి సంపాదకులు,కవి ,కధకులు విమర్శకులు ,ప్రచురణ కర్త ,శ్రీ చలపాక ప్రకాష్ -విజయవాడ ,
7- శ్రీ యల్లపు కళాసాగర్ -64 కళలు తెలుగు అంతర్జాల సకల కళల సమాహార పత్రిక నిర్వాహకులు ,చిత్రకారనిపుణులు- విజయవాడ
8-, డా .ఎన్ .భాస్కరరావు–,సోషల్ రిసెర్చ్ పయనీర్ – ఢిల్లీ
9- డా. చిల్లర భవానీ దేవి- వివిధ సాహిత్య ప్రక్రియల నిపుణ – హైదరాబాద్
,10- డా. నోముల నర్మదా రెడ్డి -ప్రముఖ ప్రపంచ పర్యాటకురాలు ,గాయని ,పర్యాటక రచయిత్రి ,క్రీడా కారిణి -హైదరాబాద్,
11- చి.ఉప్పలధడియం భరత శర్మ- బాలఅష్టావధాని –తిరుపతి
12-డా .టేకుమళ్ళ వెంకటప్పయ్య – శ్రీ అద్దేపల్లి రామమోహనరావు గారిపై పి.హెచ్.డి.చేసి ఆధునిక ప్రబంధం ‘’ధర్మ దత్తోదయం ‘’, నిర్మాత ,అన్నమయ్య పద్య సంకలన , ,అన్నమాచార్య అష్టోత్తర శతం కర్త –నెల్లూరు

  • విశేష సాహితీ పురస్కార ప్రదానం
    1- –శ్రీ గాడేపల్లి వెంకట రామ కృష్ణా రావు -ఆంధ్ర ప్రదేశ్ పురావస్తు,మరియు ప్రదర్శనల శాఖ విశ్రాంత సంచాలకులు – హైదరాబాద్
    2- శ్రీ కానూరి బదరీ నాథ్ -విశిష్ట చారిత్రిక పరిశోధకులు ,ప్రాంతీయ చరిత్ర రచయిత- తణుకు
    3- శ్రీ శిష్టు సత్య రాజేష్- గోదావరి రచయితల సంఘం అధ్యక్షుడు,బహుకార్యక్రమ నిర్వాహకుడు ,పుస్తక ప్రచురణకర్త – రాజమండ్రి
    4 శ్రీ కంభంపాటి వెంకట సుబ్రహ్మణ్యం-,ఉయ్యూరులో 1977-78లో ఆర్ట్ ఫిలిం ప్రదర్శనకు’ఉయ్యూరు ఫిలిం క్లబ్ ‘’స్థాపించిన’’ విజనరీ’’ ,హాస్య రచయిత ,కార్టూనిస్ట్, ప్రస్తుతం కుర్తాళ శ్రీ సిద్దేశ్వరి పీఠ సేవకులు,ఆధ్యాత్మిక వేత్త -కుర్తాళం
    4- శ్రీమతి లేళ్ళ శ్రీదేవి (డిస్టింక్షన్ లో అన్ని డిగ్రీలు పొందిన విద్యావతి ),శ్రీ రమేష్((IIT Alumni and musicologist )- ,సాహిత్య ,సామాజిక సేవ లో తరిస్తున్నదంపతులు –చెన్నై
    5- శ్రీ పంతుల వెంకటేశ్వరరావు -శారదా సమితి సంస్థాపకులు ,తెలుగు పండితులు ,కవి ,విమర్శకులు,ప్రవచన ధురీణ –విజయవాడ
    6- శ్రీమతి కోనేరు కల్పన -కవి, కథా రచయిత్రి –విజయవాడ
    7- ,శ్రీ పెదప్రోలువిజయ సారధి -కవి ,విశ్లేషకులు -ఉయ్యూరు
    8- శ్రీ బి.హేచ్ .వి ..కృష్ణ రావు – శాఖా గ్రంలయాదికారి -ఉయ్యూరు
    9- శ్రీమతి కె.స్రవంతి -శాఖా గ్రందాలయాది కారిణి – ఉయ్యూరు
    సరసభారతి అపూర్వ సౌజన్య పురస్కారప్రదానం –శ్రీమతి పువ్వుల కరుణానిధి ,శ్రీ నరసింహారావు దంపతులకు -ఉయ్యూరు
    రాత్రి -7-15గం.లకు విందు
    . ఆహ్వానించు వారు
    శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షురాలు
    శ్రీ గబ్బిటదుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
    శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –సరసభారతి కార్యదర్శి
    శ్రీ గబ్బిట వెంకటరమణ –సరసభారతి కోశాధికారి
    శ్రీ వి.బి.జి.రావు –సరసభారతి సాంకేతిక నిపుణులు
    శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా ) ,శ్రీ సుంకర కోటేశ్వరరావు(హైదరాబాద్ ) ,డా ఆకునూరి రామయ్య శ్రీమతి కృష్ణ మయి దంపతులు (అమెరికా )డా.రాచకొండ నరసింహ శర్మ(విశాఖ పట్నం ) ,శ్రీ వేలూరి వివేకానంద్ (హైదరాబాద్ ),శ్రీ కోమలి సా౦బావధానిశ్రీమతి విజయలక్ష్మి దంపతులు (అమెరికా )శ్రీ పువ్వుల నరసింహారావు ,శ్రీమతి కరుణానిధి దంపతులు (ఉయ్యూరు ),శ్రీ వేలూరి మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి విజయ లక్ష్మి దంపతులు (అమెరికా )శ్రీ జగదీశ్ శ్రీమతి లక్ష్మి దంపతులు (అమెరికా )మరియు షార్లెట్ సరసభారతి మొదలైన వారి సౌజన్యంతో –
    సభ నిర్వహణ సహకారం
    శ్రీ గబ్బిట రామనాధ బాబు ,శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు ,శ్రీమతి సీతం రాజు మల్లిక,శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ ,శ్రీ చౌడాడ చిన అప్పల నాయుడు
    కవి సమ్మేళనం లో పాల్గొనే కవి మిత్రులు
    1-శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి 2-శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణా చార్యులు,3-శ్రీవిష్ణుభొట్ల రామ కృష్ణ,-4-శ్రీ కందికొండ రవి కిరణ్ ,5-శ్రీమతి ముదిగొం-డ సీతారావమ్మ ,6-శ్రీమతి మందరపు హైమవతి,7-,శ్రీమతి-వి.శ్రీ ఉమా మహేశ్వరి, 8-,శ్రీమతి-.ఎస్.అన్నపూర్ణ,9–శ్రీమతికొమాండూరి కృష్ణా, 10-శ్రీమతిలక్కరాజు వాణీ సరోజిని ,11-శ్రీమతి వడ్డాది లక్ష్మీ సుభద్ర,12-శ్రీమతి.ఆదుర్తి సుహాసిని-,13-శ్రీమతిఓలేటి ఉమాసరస్వతి,14-,శ్రీమతి-సింహాద్రి వాణి, 15-శ్రీమతి తుమ్మల.స్నిగ్ధ మాధవి,16-శ్రీమతి సోమరాజుపల్లి విజయ కుమారి,17-శ్రీమతిసామినేని శైలజ(విజయవాడ ) -18శ్రీమతివారణాసి సూర్యకుమారి, 19-శ్రీమతిగురజాడ రాజ రాజేశ్వరి, -20-శ్రీమతిజి మేరీ కృపాబాయి, 21శ్రీమతి గుడిపూడి రాధికారాణి, 22-శ్రీమతి కె కె డి మహాలక్ష్మి, 23-శ్రీమతి చిల్లరిగె ప్రమీల, 24-శ్రీ అన్నం లాల్బహదూర్ శాస్త్రి (మచిలీ పట్నం ) -.25-శ్రీ వసుధ బసవేశ్వర రావు(గుడివాడ )26-శ్రీ అక్షరం ప్రభాకర్ (మానుకోట –వరంగల్ జిల్లా )27-మోకా మాధవరావు (జగ్గయ్యపేట )28- శ్రీమతి.సింహాద్రి పద్మ(అవనిగడ్డ ) 29-శ్రీమతి పెళ్లూరి శేషుకుమారి(నెప్పల్లి )30- శ్రీ కాట్రగడ్డ వెంకటరావు(గూడూరు ) 31శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం(ఆకునూరు )32,డా.దీవిచిన్మయ , 33-శ్రీ మాదిరాజు శ్రీనివాసశర్మ, 34-శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి (ఉయ్యూరు )-
    సభ నిర్వహణ సహకారం
    శ్రీ గబ్బిట రామనాధ బాబు ,శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు ,శ్రీమతి సీతం రాజు మల్లిక,శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ ,శ్రీ చౌడాడ చిన అప్పల నాయుడు
    తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు
    -11-6-22. ఉయ్యూరు
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్-4

విశ్వ పుత్రిక తోరూ దత్-4
మైకేల్ మధుసూదన దత్ హిందూకాలేజిలో చదివి ప్రిన్సిపాల్ రిచర్డ్సన్ కుప్రియశిష్యుడైనాడు .అంతకు ముందు కాశీప్రసాద్ ,రాజనారాయణ అక్కడే చదివారు .మధు 1883లో క్రైస్తవం తీసుకొని ,కొద్దికాలం కలకత్తా బిషప్ కాలేజిలో పని చేసి ,1849లో మద్రాస్ వెళ్ళాడు..మొదట్లో ఇంగ్లీష్ లో తర్వాత బెంగాలీలో రాసి కవిగా నాటకకర్త గా ప్రసిద్ధుడయ్యాడు .1876లో తోరూ తన ఇంగ్లీష్ స్నేహితురాలికి జాబురాస్తూ మధుసూదన్ దత్తు గురించి రాసింది .అప్పుడే అచ్చయిన తన ‘షీఫ్ గ్లీన్డ్ ఇన్ ఫ్రెంచ్ ఫీల్డ్స్ ‘’ను బెంగాలీ పత్రికలో చక్కగా విమర్శించారనీ ,విద్యావంతుల్లో కూడా వ్యక్తం కాని సంస్కృతి అందులో కనిపించిందనీ ,తాను  మధు కుటుంబానికి చెందినదానిని అని పొరబాటు పడ్డాడని తెలిపింది .అతడు జేస్సూర్ జిల్లా సాగర్ దారీ గ్రామం వాడని కూడా రాసింది .
   1851లో తోరూపినతండ్రి హరిచందన దత్ ‘’ఫ్యూజిటివ్ పోయెమ్స్ ‘అనే కావ్యం రాసి ప్రచురించాడు .ఆధ్యాత్మిక నీతి కవితాత్మక రచనలు కూడా చేశాడు .ఇంకో పినతండ్రి గిరీష్ చందర్ ‘’చెర్రీ బ్లాసమ్స్’’కావ్యం రాశాడు .వీళ్ళు ‘’దత్ ఫామిలి ఆల్బం ‘’లో తరచురాసేకవులు .దీన్ని 1870లో తోరూ దత్ తండ్రి గోవిన్ చందర్ దత్ ప్రచురించాడు .ఆయన మేనల్లుడుఉమేష్ దత్ పద్యాలూ ఇందులో ఉన్నాయి .దీన్ని లాంగ్ మన్ అండ్ గ్రీన్ సంస్థ ప్రచురించింది .ఇది చాలామంది బెంగాలీ కవులను ఉత్తేజితం చేసి,సాహిత్యపు విలువ పెంచింది .ఒకరకంగాఇది  బెంగాలీల మొదటి ఆంగ్ల కవితా సంపుటి .బెంగాలీల పాత రచనకు ప్రాతినిధ్యం వహించింది కూడా .మధు సూదన్ రాసిన ‘’కాప్టివ్ లేడీ ‘’కూడా ఇలాంటిదే .డి.ఎఫ్.ఎ.లో తోరూవికాని, చెల్లెలు ఆరూ వికానీ కవితలు లేవు .1873లో వీళ్ళు ఇండియాకు తిరిగివచ్చాకనే తమరచనల ప్రచురణ గురించి ఆలోచించారు .అప్పటినుంచి బెంగాల్ పత్రికకు రాస్తూనే ఉన్నారు .ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు ఫ్రెంచ్ కవితల్ని ఇంగ్లీష్ లోకి అనువదించేవారు .
  డి.ఎఫ్.ఎ.అంటే దత్ ఫామిలి ఆల్బం లో తొరూ తండ్రి 66కవితలురాశాడు .ఆయన శైలి 17వ శతాబ్దికి చెందినదిగా వింతగా ఉండేది ..ఉమేష్ 73రాశాడు .ఈపుస్తకం ప్రతిభా పూర్ణమైన ఒక కుటుంబానికి స్మృతి చిహ్నంగా మాత్రమె కాక ,కలకత్తాలో ఉన్నత ఆంగ్ల విద్య ను ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు అభినందన పత్రం లాగా కూడా ఉండేది .తోరూ కు ఈ గ్రంథం అంటే విపరీతమైన ఇష్టం .ఆమె స్నేహితుతాలు మేరీ ఈపుస్తకం పై విమర్శరాసి క్వీన్స్ మేగజైన్ కు పంపితే ప్రచురణకు స్వీకరించ లేదు .వాళ్ళు అంతేలే అని సరిపుచ్చుకోన్నది .ఆకుటుంబం లో మరో కవి శశి చంద్ర దత్ ‘’విజన్ ఆఫ్ సుమేరు ‘’మరికొన్నికవితలు 1878లో రాసి ప్రచురించాడు .ఇతని పినతండ్రి గోవిన్ దత్ బంధువు రమేష చంద్ర దత్ ఆకుటు౦బ కవులలో  మహా గొప్పకవి .ఈయన తొరూ ఆరూలకవిత్వాలను మెచ్చేవాడు .
   19వ శతాబ్దం ఇంగ్లీష్ ప్రవేశపెట్టటం తోపాటు వైజ్ఞానిక సంస్కరణలు మత సంబంధ గుర్తింపుతో ప్రసిద్ధికెక్కింది .అప్పుడే యూరోపియన్లు భారతీయ విజ్ఞానానికి బాగా ఆకర్షితులయ్యారు .ఇంతకు  కొద్దికాలం క్రితమే  కలకత్తాలో రాయల్ ఏషియాటిక్ సొసైటీ పుట్టి సర్ విలియం జోన్స్ ,జాన్ విల్సన్ ,సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ ,సర్ విలియం హంటర్  మొదలైన వారు భారతీయప్రాచీన విజ్ఞానానికి పూర్తిగా ఆకర్షితులయ్యారు .ఇలాంటి సారవంతమైన సృజనాత్మకమైన కాలం లో తోరూజీవించి ,దేదీప్యమానంగా వెలిగి ,పుట్టిన వందేళ్ళ తర్వాతకూడా సాహిత్యరంగాన్ని వెలిగిస్తూ ధ్రువ తారగా నిలిచింది .
   సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 విశ్వ పుత్రిక తోరూ దత్-3

 విశ్వ పుత్రిక తోరూ దత్-3

బెంగాల్ వాతావరణం

ఆంగ్లేయులు బెంగాల్ ను స్వాధీనం చేసుకొన్నప్పుడు జనం లో ప్రతిఘటన పెద్దగా కనిపించ లేదు .భావాల్లో ఆలోచనా విధానం లో మార్పులు రావాలని ఆ ప్రజ కోరారు .బెంగాల్ బ్రిటన్ తో పాటు సమాన హోదా పొందిందని భావించారు .భావ పునరుద్ధరణ కావాలన్నది అందరి కోరిక .’’ఆధునిక జనకుడు’’ రాజారామమోహన రాయ్ తన దేశాన్ని కొత్త జీవంతో నింపే ప్రయత్నం చేశాడు .ప్రాక్ పశ్చిమ స్నేహహస్తం నవ సాహిత్యం లో ప్రవేశ పెట్టాడు .ఫ్రాన్స్ దేశం ఎగరేసిన జాతీయ పతాకం చూసి సంతోషం పట్టలేక ఎగిరిగంతులేసి కాలు విరగ కొట్టుకున్నాడు .మత విద్యా జాగృతికి సంస్కరణకు ముందు నిలిచాడు .బెంగాల్ విద్యా వైజ్ఞానిక మత సా౦ఘికరంగాల్లో పునర్జన్మ పొందటానికి రామ మొహనుడే ముఖ్య కారణం .1817లో ఆయనా ,బెంగాల్ సంస్కరణ వాదులుఆంగ్ల మిత్రులతో  కలిసి ఆంగ్ల బెంగాలీసమైక్యాన్ని చాటే మొదటి హిందూ కాలేజి 100మంది విద్యార్ధులతో ప్రారంభించారు .మరుసటిఏదాది కేరీ వార్డ్,మార్ష్ మన్ అనే మిషనరీలు షెరాపూర్ కాలేజి పెట్టారు .ఈ ముగ్గురు బెంగాల్ పునరుజ్జీవనానినికి జీవితాలు ధారపోసిన మహనీయులు .దీని మొదటి ప్రిన్సిపాల్ డా డఫ్.రెండవవాడు డేవిడ్ లేష్టర్ రిచర్డ్ సన్.

  తొరూ దత్ కుటుంబానికి చెందిన నీలమణి దత్తుకు కేరీ మంచి మిత్రుడు .18వ శతాబ్ది ఉత్తరార్ధం లో హైందవ విద్యావంతుల్లో నీలమణి ఒకడు .రామమోహన్ మిషనరీలతో కలిసి తిరిగినట్లే ఈయనా వాళ్ళతో తిరిగాడు .హిందూ జీవితం పై ఈ మిషనరీల ప్రభావం ఆ రోజుల్లో బాగా ఎక్కువే .ఇక్కడ ప్రారంభమైన నవీన వైజ్ఞానికోద్యమం క్రైస్తవ విధానంతో కలిసి సాగింది .హీబ్రూ గ్రీక్ భాషల్ని చదివి రామమోహన్ బైబిల్ మూలం చదివి బాగా అర్ధం చేసుకొన్నాడు .ఆనాటి విద్యావంతులు చాలామంది గ్రీక్ లాటన్ ఫ్రెంచ్ జర్మని భాషల్ని ఆసక్తిగా నేర్చుకొన్నారు .

  కేరీ ఇండియాలో స్థిరపడటానికి నీలమణి దత్ చాలా సహాయం చేశాడు .ఎవరూ లేని అతనికి తన ఇంట్లోనే  ఆశ్రయమిచ్చాడుకూడా .భార్య పిచ్చిది .పిల్లలు రోగగ్రస్తులు .ఈ సహాయాన్ని కేరీ ఎన్నడూ మర్చిపోలేదు .మాణిక్ తలా వీధిలో నీలమణి ఇల్లు’’రాం బాగన్ ‘’ ఉండేది.ఇదే కేరీకీ స్వగృహమే అయింది .ఇదే తర్వాత తోరూ దత్ ఇల్లుకూడా అయింది .సంపన్నుడైన నీలమణి పూజలు దానాలు ధర్మాలు బాగా చేసి చివరికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఉన్నప్పుడు కెరీయే ఆదుకొన్నాడు .

  హిందువులను ఇంగ్లీష్ రచనా వ్యాసంగం బాగా ఆకర్షించింది .బెంగాల్ మొదటి తరం కవులలో హెన్రి లూయీ వివియన్ డెరోజియా(1809-1831)ఒకరు .హిందూకాలేజిలో గుమాస్తాగా చేరి లెక్చరర్ అయ్యాడు .తల్లి హిందూ తండ్రి పోర్చుగీస్ ..ఆయన ‘’జన్ఘీరా పకీరు –ఇతర రచనలు ‘’కావ్యం రాసి బాగా ప్రసిద్ధుడయ్యాడు .ఆకాలేజి ప్రిన్సిపాల్ రిచర్డ్సన్ ‘’లిటరరీ గెజిట్ ‘’సంపాదకుడు .ఇతడు రాసిన ‘’బెంగాలీ పత్రాలు ‘’ ఆనాటి బెంగాలీ కవులపై విశేష ప్రభావం కలిగించాయి . .

  1874లో తోరూ బెంగాలీపత్రికలో డేరోజియాపై ఒక వ్యాసం రాసింది .కాశీప్రసాద్ ఘోష్ అనే కవి  డేరోజియా ను అనుసరించి ఇంగ్లీష్ లో పద్యాలు రాసేవాడు .ఈయనే మొదటి బెంగాలీ ఆంగ్లకవి .ఈయన రచించిన షాయర్ మొదలైన కవితలు 1830లో ప్రచురితమయ్యాయి .1835కు పూర్వం మోహన్ లాల్ ,హసన్ ఆలీ ,రాజ గోపాల్ అనే ముగ్గురు కవులు ఉండేవారు .రాజనారాయణ దత్ ప్రాచీన గాధా పద్ధతిలో రాసిన ‘’ఓస్మిన్’’,అరేబియన్ టేల్  ‘’1844లో రిచర్డ్సన్ కు అంకితమిచ్చాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-6-22-ఉయ్యూరు–

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్ -2

విశ్వ పుత్రిక తోరూ దత్ -2

ఎమిలీ బ్రాంటి కవిత్వం ,తొరూ కవిత్వం చదువుతుంటే మనలో రకరకాల అంచనాలు మొదలౌతాయి .ఆవూహలు తీర్మానాలు మనల్ని నిలవనివ్వవు కదిల్చి వేస్తాయి .బిరాన్జర్ రాసిన ‘’నా వ్యాపకం ‘’కవితను ఈమె అనువదించింది .నిజంగా అలాటిటి కవిత్వం రాసే సామర్ధ్యం తొరూ కు ఉంది –‘’అన్నిటా అతి తక్కువగా నిరసి౦పబడినదాన్ని –ఈ పెదాలనుండీ చీల్చుకోస్తున్న రోదన –దురంత పరితాపం వల్లనే బయట పడుతుంది –దీనికి ఉపశమనంగా భగవంతుడు చెబుతున్నాడు –‘’పాడు పిచ్చి తల్లీ !పరవశించిపాడు ‘’.బాధా, బుద్ధికి అందని దురదృష్టం చిక్కటి చీకటిలా ఆమె వెంట బడ్డాయి .కవికూడా తన ఆత్మీయతా ముద్ర చేత తనవైపుకు ఆకర్షించు కొంటూనే ఉంటాడు ‘’.

  అద్భుతవ్యక్తి తోరూ ఎన్నో భాషల్ని వశం చేసుకొన్నది .మూడు భాషలపై మాస్టరీ సాధించి వాటిలోనే రచనలు చేసి సామర్ధ్యం నిరూపించింది .పదినెలలలో సంస్కృతం నేర్చి ,దాని అనువాదాలుకూడా చేసింది .ఒక స్నేహితురాలికి రాసిన ఉత్తరం లో భారతీయ ప్రాచీన సాహిత్యాన్ని మధించాలని ఉందని రాసింది –‘’గొప్ప పేరు ప్రతిష్ట పొందిన రామాయణ భారతాలను  వాటి మూల భాషలోనే చదవాలని ఉంది .మళ్ళీ కేంబ్రిడ్జ్ వెళ్ళే లోపు సంస్కృతాన్ని మదిస్తాను .అక్కడికి రావాలని యెంత తపన పడుతున్నానో తెలుసా నీకు ‘?అని రాసింది .బెంగాలీ బాగా మాట్లాడినా అందులో రాయటం పట్టుబడ లేదు ఆమెకు .1975డిసెంబర్ లో సంస్కృతం అధ్యయనం మొదలుపెట్టి 1976కల్లా అందర్నీ ఆశ్చర్యపోయేట్లు నేర్చింది .స్నేహితురాలు మేరీకి ఉత్తరం రాస్తూ ‘’ఈ సారి ఫ్రెంచ్ సాహిత్య క్షేత్రం నుంచి గాక ,సంస్కృత క్షేత్రం నుంచి పెద్ద ధాన్యపు పనను కూడా బెడతాను ఇప్పటికే రెండు మూడు కంకుల్ని చేరవేశాను ‘’అన్నది . ఆమె రాసిన ‘’హిందూ దేశపు గేయ గాథలు ,,పురాణకధలు ‘’పుస్తకం ఆమె చనిపోయాక1878లో అచ్చయింది .ఇప్పటికి ఆమె ఫ్రెంచ్ ఆంగ్ల సాహిత్య మోజును వదిలేసి హిందూ దేశ సాహిత్యం పై గొప్పగా మనసు పడ్డది .ఆమె రాసిన గేయగాథలలో  ఉన్నదంతా భారత దేశానికి సంబంధించిన విషయాలే .ఆమె రాసిన సావిత్రి ,ప్రహ్లాద లలో ఆసియా ఖండ ఆత్మ యొక్క అంతర్ దృష్టిని చూపించింది .అంతబాగా ఏ నవీన ప్రాచ్య వాదీ ఆవిష్కరించ లేకపోయాడు.ఆమె అనువదించిన  ‘’జోగాఢ్య ఉమ’’కూడా కల్పనతో ఉన్న కవితా శిల్ప ఖండమే .ఇవి ఆమె ఆన౦దబాష్పాలు రాలుస్తూ పదేపదేపాడుకొనే పదాలే ..మన సంస్కృతి పయనించే అద్భుత పధం లో తోరూ ఒక మైలు రాయి .

  ఫ్రెంచ్ ఇంగ్లీష్ లలో ఆమె గుణజ్ఞురాలు రసజ్ఞురాలు .కానీ వ్యక్తిత్వం ఆలోచన ఊహల్లో మాత్రం నూటికి నూరుపాళ్ళు హైందవ స్త్రీ .ఇండియాతర్వాత ఫ్రాన్స్ ను అభిమాని౦చినా ఇంగ్లాండ్ లో స్థిరపడి పోయింది .కారణం హిందూ స్త్రీలకంటే ఆంగ్ల స్త్రీలకు  స్వేచ్చ ఎక్కువ అని భావించి ఉండచ్చు.19వ శతాబ్ది మధ్యలో చాలామంది బెంగాలీ స్త్రీలు తెరచాటుగానే ఉండేవారు .ఆమె ఇతర దేశాలలో ఉన్నప్పుడు ఇండియాలో ఎక్కువ ఆంక్షలు చూసింది .అందుకే అంతర్జాతీయ పరిధిలో హైందవ తత్త్వం తో కూడిన క్రైస్తవాన్ని ఇష్టపడి అనుసరించింది .కానీ శివుడు విష్ణువు ఆమె పై గొప్ప ప్రభావం కలిగించారు .అందుకే పురాణాలవైపుకు మనసు మళ్ళింది .దేవీదేవులు నాయికా నాయకులు ఆమెకు ఎంతగానో ఇష్టం .ఆమె అభిమాని గాసే ‘’తోరూ కవితలు వేదాల గాంభీర్యం నింపుకొని సరళంగా శోభిల్లాయి .అపత్వం  నీచత్వం వాటిలో లేనేలేవు ‘’అన్నాడు .

  ‘’బెంగాల్ ఆడపడుచు తోరూ ప్రపంచం నుంచి అబ్బురాన్నీ అభినందనల్ని అందుకొన్న వప్రసాదిని .జాతీ సంప్రదాయం వలన హిందువు ,విద్యవలన ఆంగ్ల వనిత .18ఏళ్ళవయసులోఆంగ్ల ఫ్రెంచ్ కవులను లోతుగా అధ్యయనం చేసి ఇండియన్ లకు చక్కగా పరిచయం చేసింది .తనలో ఆమూడు దేశాలతత్వాలు సంప్రదాయాలు మిళితం  చేసుకొన్నది .తనపా౦డిత్యం విరగ బూసె సమయం లో ,ప్రతిభ పరిపూర్ణ మయే వయసులో ఇరవై ఏళ్ళకే తొరూ దత్ లోకాన్ని విడిచి వెళ్లి పోయింది .ప్రపంచ సాహిత్యం లో తోరూలాంటి వ్యక్తి లేనేలేరు .ఆమెకు ఆమె సాటి .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-6-22-ఉయ్యూరు      

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విశ్వ పుత్రిక తోరూ దత్ -1

విశ్వ పుత్రిక తోరూ దత్ -1

పద్మిని సేన్ గుప్త రాసిన పుస్తకానికి ఆచార్య నాయని కృష్ణకుమారి తెలుగులోకి ‘’తోరూదత్’’అనే పేరుతొ అనువదించగా సాహిత్య అకాడెమి 1977లో ప్రచురించింది .వెల-2-30.దీన్ని’’ విశ్వ పుత్రిక తోరూ దత్ ‘’శీర్షికతో మీకు అందిస్తున్నాను .

   తోరూదత్ ప్రపంచానికి వర ప్రసాదిని .బెంగాల్ లో గంగ ఒడ్డున జన్మించినా ఆమె మనసుమాత్రం జాతి భాషా సంకుచితాలను దాటి ,ఇంగ్లీష్ ఫ్రెంచ్ భాషా సౌందర్యాలను ఆకళింపు చేసుకొని ,ఆ భాషలనే వాహికలుగా గ్రహించి సర్వ విద్యల్నీ కరతలామలకం చేసుకొన్నది .ఆభాషణ రుణాన్ని రచనలద్వారా తీర్చుకోన్నది .దీనితోతన మాతృదేశాన్ని ప్రపంచ సాహిత్య పటం లో ప్రధానమైనదిగా గుర్తి౦చేట్లు చేసింది .అసలు ఆమె తన మాతృభాష బెంగాలులో రచనలే చేయలేదు అంటే ఆశ్చర్యపోతాం .

  ఆమె జీవించినకాలం లో ఇండియా లార్డ్ విలియం బెంటిక్ ,లార్డ్ మెకాలే లు భారతీయులలో ఇంగ్లీష్ వ్యాప్తికోసం తంటాలు పడేవారు .దానికి డబ్బు మంచినీళ్ళులా ఖర్చు చేశారు .కనుక దేశీయులకు ఇంగ్లీష్ నేర్చుకోవటం తప్పని సరి అయింది .పరభాష నెత్తిన రుద్దటం పై దోషం అనిపించలేదు.అక్షరజ్ఞానమున్న ప్రతి వారూ అలానే చేశారు కనుక తోరూ దత్ ను తప్పు పట్టలేము .తండ్రి వద్ద సంస్కృతం లో గొప్ప ప్రవేశం పొందింది .ఆమెకు ఆయుర్దాయం పరి పూర్ణంగా ఉండి ఉంటే తన సృజనాత్మక సాహిత్యాన్ని తప్పని సరిగా భారతీయం చేసి ఉండేది .తన సంప్రదాయం సంస్కృతీ వారసత్వం ఆమెను క్రమంగా తన్మయురాలిని చేసేశాయి .అన్నిటా ఈశ్వర తత్వమే ఉందన్న భావన కలిగించేది .  తాత్వికురాలైన తోరూ,చిన్నవయసులో చెల్లెలు ‘’ఆరు ‘’చనిపోతే –‘నోరు చెప్పగలిగీ –కలం రాయగలిగీ –ఎక్కువవిచారాన్ని కలిగించే –మాటలివీ-ఇది ఇలా జరిగి ఉండేది ‘’అని విలపించింది ఇరవై ఒక్క ఏళ్ళకే చనిపోయిన తోరూఫ్రెంచ్ ఇంగ్లీష్ లను జీర్ణించుకొని ఆభాషల్లోనే రాసింది  కాని ఆతత్వం తన దేశానికి కాకుండా పోయింది .ఆమెను ఎవరూ ఎప్పుడూ ఈ దేశం నుంచి బహిష్కరించలేదు .రచయితలూ పత్రికలూ ఆమెనుస్మరించినట్లు ఇంగ్లీష్ లో రాసే వేరెవర్నీ స్మరించలేదు .మనదేశం తయారు చేసిన గొప్పవారి పట్టిక లో తోరూ పేరూ ఉందని గుర్తించాలి .ఇప్పటికీఆమే ఉత్తమ రచయితగానే గుర్తింపు లో ఉంది .

  తోరూ ను అంచనా వేయాలంటే ఆమె జీవితాన్నీ,అందులో ఆమె పొందిన విషాద భారాన్నీ ఆవిడ రచనలతో కలిపి చూడాల్సిందే .ఆమె కవన శక్తీ ,పాండిత్యం ఆమె రచనలలో భాగాలే .విడదీసి చూడ లేము .ఆమె రాసినలేఖలు, చేసినస్నేహాలు ఆమె పై ఒక అంచనాకు రావటానికి తోడ్పడతాయి .అందుకే విల్ఫ్రెడ్ఓవెన్ ‘’కవిత్వం తోరూ జీవితం లో పరచుకొన్న విషాదం లోనే ఉంది ‘’అని గొప్పగా కనిపెట్టి చెప్పాడు .ఆమెకూ ఆమె విషాద జీవితానికీ కవిత్వానికీ విడదీయరాని సంబంధం ఉందని విమర్శకులు విశ్లేషకులు ముక్త కంఠం తో విశ్వ వ్యాప్తంగా చెప్పారు .అందం విషాదం మృత్యు భీకరత్వం ఆమె జీవితం తో చెర్లాటలాడాయి.

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-6-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ద్వారకాపతి శతకం -2(చివరిభాగం )

శ్రీ ద్వారకాపతి శతకం -2(చివరిభాగం )

‘నలువయి సృష్టి సల్పితి,జనార్దనుపేర బెంచుచుంటి వీ-లనరగా జంద్ర శేఖరుడ వై నశియి౦పగా బుచ్చుచుంటి వి’’నిర్మలంగా మూడు పేర్లూ నీవే .తర్వాత మత్యావతార,కూర్మ ,వరాహ నరసింహ ,వామన పరశురామ ,రామ,కృష్ణ ,బుద్ధ ,కల్కి అవతారాలు, చేసిన అద్భుతకార్యాలు వేర్వేరు పద్యాలలో వర్ణించి’వేల్పుల గిడ్డివేల్పుల నవీనపు బువ్వలబెట్టి ప్రోచు నా –వేల్పుల వేల్పు వౌదు ‘’అని తనకు శరణు ఇమ్మనికోరాడు కవి .వేద పరిపూర్ణులను చూస్తె నీకు సంతోషం ,శాస్త్ర సంవాదుల్ని చూస్తె ఆనందం ,పండిత భాషకు ఆహ్లాదం చెందుతావు ,వివాదం వస్తే కాలుదువ్వుతావు అన్నాడు  , ‘’క్షాత్రవ శిక్ష సల్పగా విచక్షణ దక్షుడవౌదు .ఆ క్షాత్రపు చిహ్న లొందుచూ,విశాలయశస్సు పొందావు .  ‘’గొల్ల చేడియలను వికార చేష్టలతో మోహపెట్టావు ,జార చోర బిరుదులూ పొందావుకానీ వేదాలకు ఆధారమే నీవని నాకు తెలుసు .’’వెన్న దొంగవై రంగడవన్న కీర్తిపొందావు.సిరికి మగడవైన నువ్వు మమ్మల్ని దరిద్రం లో ఉంచటం నీ మగసిరికే అవమానం .’’దారము కూర్చు పుష్పముల దండ గతిన్ వసియించి ,జీవులం దారయ నీవే యంతట మహాత్ముడవు ‘’అని చక్కగా చెప్పాడు .

  శ్లేషలకు ఉబ్బిపోతారు కొందరు ,ఆడవాళ్ళుకూడా అంతే కానీ ‘’గొప్పగా మృదూక్తి పద్య సంభాషలకు లోకులు గొప్పగా ఆన౦దిస్తారు .జుట్టూ జుట్టూ ముడివెయ్యటం లో మహా నేర్పరివి .కౌరవులని చీల్చి పాండవులకు రాజ్యమిప్పించావు .అలాగే నాకోరిక తీర్చు .’’అపగత కిల్బిషు డవు,మహాత్ముడవు అలాంటి నిన్ను నా చపల కాంక్షతో నిన్ను ని౦ది౦చాను .నీభక్తినిచ్చి నన్నుకాపాడు .చరాచరాలకు నువ్వు జీవనం ,నీ విలసనం ప్రాణులకు విస్తృత తేజం ,నన్నుకాపాడు .’’ఫుల్ల సరోజనేత్ర ,పరిపూర్ణ జలా౦బుదగాత్ర ,శాంభవీ –వల్లభ మిత్ర ,లోకనుతిపాత్ర మహాఘలతాలవిత్ర స-ద్ధల్లకపత్ర చిత్రతర దామ విదర్భ సుతా కళత్ర రా –జిల్లెడుత్వత్క్రుపా రసముం జిందవె నాపయి ద్వారకాపతీ’అని పరవశంతో కవి కీర్తించాడు .

  ‘’సూనృత భాష ,నీల ఘన సుందరవేష,యశో విశేష సు-జ్ఞాన మనో విభూష వర కౌస్తుభన్మణి కాంతి పూషసం-ధానిత  సర్వ భక్త వరదానక తోష ,యశేష లోక దు-ర్మానిత భూరిదోష ‘’అంటూ భక్తపోతనలా తేనెలు రంగరించి కవిత్వం చిలికించాడు ఈభక్తకవి .  ‘’నెలకు ద్రివృష్టి నింపి ధరణిలో సస్య గో సంవృద్దిపెంచి ,సర్వజీవులు ఆనంద మయ సుఖ జీవనం చేసేట్లు చెయ్యమని ద్వారకాపతి ని వేడుకొన్నాడు .చివరి పద్యంగా చంపకమాలలో –‘’యువ యను నేటమాధవ సితో త్ప్రతిపత్ధిర వాసరా౦ మం-దవిరళ భక్తి దావక పదాంబుజ యుగ్మ సదర్చ సేయనే –ప్రవిమల పద్య పుష్పముల బాగుగనూటొకయెన్మిది౦టి మా –ధవ యిడియుంటి గొంచునను దన్పవె నీ కృప ద్వారకాపతీ’అని శతకం ముగించారు శ్రీమదాది భట్ట శ్రీరామ మూర్తి కవి .

 మంచి భక్తి శతకం ,విశ్వనాథ ఆశీస్సు పొందిన కవి రచన .సర్వోత్క్రుష్టంగా సాగింది .చదివి ఆనందించి తరించాల్సిన శతకం .పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-6-22-ఉయ్యూరు–

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ ద్వారకాపతి శతకం-1

శ్రీ ద్వారకాపతి శతకం-1

విశాఖ జిల్లా బొబ్బిలి తాలూకా అజ్జాడ వాస్తవ్యులు శ్రీ మదాది భట్ట శ్రీరామ మూర్తి కవి శ్రీ ద్వారకాపతి శతకం రచించి ,కృష్ణాజిల్లా కైకలూరు తాలూకా శోభనాద్రి పుర అగ్రహార వాస్తవ్యులు బ్రహ్మశ్రీ కాశీ నాధుని సుబ్బారావు గారి ద్రవ్య సహాయం చేత  బెజవాడ ఆంద్ర గ్రంధాలయ ముద్రాక్షరశాలలో శ్రీ కుందా లక్ష్మీ నరసింహయ్య చేత 1942లో ముద్రించారు .వెల-4అణాలు .

సీస పద్యం లో ఆశీస్సు పలుకుతూ ‘’ఆత్రేయస గోత్రులు శ్రీ కాశీ నాథ నాగ లింగారాధ్య తాత ,శ్రీలలితాంబ పుత్రుడు మల్లయ్యఅన్నపూర్ణ గారి పుత్రుడు సుబ్బారావు ,భార్య మహలక్ష్మి ని వివాహమాడి తాత,తండ్రులు లాగా ధర్మతత్పరతతో దాత అయి ప్రఖ్యాతి పొందాడు వారిని ద్వారకాపతి కాపాడాలని’’ అన్నారుకవి .

   పీఠిక లో కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు ‘’ఈ కవి రాసిన శ్రీమద్రామాయణ గీతమాలికలు అక్కడక్కడ చదివాను. ధార అనర్గళం గా ఉంది .మకార ప్రాసతో కుంటు పడకుండా రసం చెడకుండా రాయటం అసాధ్యమే .మధు వాహిని ప్రవహి౦పజేశాడు .వీరి రామాయణ కీర్తనలు రమ్యాతి రమ్యాలు.సుబ్రహ్మణ్య కవి ఆధ్యాత్మ రామాయణానికి వన్నె పెట్టినట్లున్నాయి .ఈకవి రాసిన గీతాకావ్యం, నారాయణ శతకం పాండిత్యానికి ప్రతిభకు నిదర్శనం .క్రమాంత స్వాధ్యాయులైన ఈకవి జ్యోతిష పాండిత్యం లో దిట్ట .ఇలాంటి గుణ గరిష్ఠుడైన ఈ కవి మాటలు గుండెకు సూటిగా తాకుతాయి .ఇదంతా అక్షర సత్యం .’’అన్నారు .ద్వారకాపతీ అనే మకుటం తో ఉత్పల ,చంపక మాలపద్యాలతో శతకం కూర్చి సుగంధాన్ని వెద జల్లారు .

 మొదటి పద్యం ఉత్పలమాలలో –‘’శ్రీ రమణీ మనోహర విశేష కృపాకరయాదవాన్వాయో –దార పయోధి శీతకర దానవదూర ,వినమ్ర దాసమం-దార మధాంధ చైద్య ముఖ దర్ప కుఠార,కళింద నందినీ –తీర విహార గోపవర ధీర వశీకర ద్వారకాపతీ’అని స్వామిని స్తుతి౦చాడుకవి .విఘ్నాలుకలిగి౦చవద్దు అని గణపతిని కోరి ,వాణిని తన నాలుకపై నర్తించమని ప్రార్ధించి ,వాల్మీకి వ్యాస కాళిదాసాదులను స్మరించి ,సిరికి తలిదండ్రులకు నమస్కరించి తర్వాత తన వంశాన్ని గురించి చెప్పుకొన్నాడు ౦-భారద్వాజవంశం లో రామయలక్ష్మి తన తాతగారు .అవధాని ,ఉపాధ్యాయుల వెంకటా ర్యుని సుబ్బమ దంపతుల కుమార్తె కాత్యాయని సాటి పాపమ,తల్లీ తండ్రీ .తనపేరు రామమూర్తి అని చెప్పుకొన్నాడు .తర్వాత విశేషాలు రేపు తెలుసుకొందాం .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్-5-6-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కేసరి గారి చిన్ననాటి ముచ్చట్లు -2

కేసరి గారి చిన్ననాటి ముచ్చట్లు -2

 ఆ కాలం లోతద్దినం నాడుమాత్రమే వరి అన్నం తినేవారు మిగిలిన రోజుల్లో జొన్నలు సజ్జలు వరిగలు వండుకొని తినేవారు .డబ్బిచ్చి బియ్యం నెయ్యి కొనేవారు .కేసరి తల్లి పొలాలకు వెళ్లి కందికంప పీక్కొని వచ్చి వంట చెరుకుగా వాడేది .మళ్ళీ పైరు వేసే లోపు వీటిని సమూలంగా త్రవ్వి తీసేవారు .అవి పొరబాటున కాలిలో గుచ్చుకొంటే గాయం త్వరగా మానేది కాదు .కూలీలతో పీకిస్తే చాలా డబ్బు అవుతుంది కనుక రైతుల భార్యలే వచ్చి తవ్వుకొని తీసుకు వెళ్ళేవారు .కేసరి తల్లి సంవత్సరానికి సరిపడా కండి కంప పోగేసి జాగ్రత్త చేసేది .

  కేసరి బంధువు అదే వూళ్ళో ములుకుట్ల కృష్ణయ్య భిక్షాటన, పౌరోహిత్యం చేసేవాడు .సమీపగ్రామం బసవన్న పాలెం కూడా వెళ్ళే వాడు .కేసరికి ఊళ్ళో బిచ్చమెత్తుకోట౦ సిగ్గుగా ఉండేది .అందుకని కృష్ణయ్యతో కలిసి బసవన్నపాలెం కు జోలేకట్టుకొని ఒకసారి వెళ్ళాడు .చిన్న వాడుకనుక ఆదరించి ఆయనకంటే ఎక్కువ బిచ్చెం వేసేవారు .జోలి మోయలేనంత బరువు అయ్యేది .కృష్ణయ్య గారే ఆమూట కూడా కొంత దూరం మోసి సాయం చేశాడు . ఇంటికి చేరగానే మూట చూసి తల్లి చాలా సంతోషించింది . .కానీ ఆయనపడిన కష్టం ఆయాసం చెమట చూసి చలించిపోయింది . .స్నానం చేయించి అన్నం పెట్టి నిద్ర పుచ్చింది . .తల్లి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని ఏడ్చండి  .కాళ్ళలో ముళ్ళు గుచ్చుకొని ఉండటం చూసి వ్యధ చెందింది .ఈయనకు మెలకువ వచ్చి ఎందుకేడుస్తున్నావని తల్లిని అడిగితె కాళ్ళలో దిగిన తుమ్మ ముళ్ళు చూపించి మరీ ఏడ్చేసింది. సూదితో నెమ్మదిగా ముళ్ళు తీసేసి మళ్ళీ ఎప్పుడూ భిక్షాటనకు వెళ్ళను అని ప్రమాణం చేయించింది .ఆతల్లి హృదయం అంతగా తల్లడిల్లి౦దన్నమాట .

  వీరింటి ఎదురుగానే మేనమామ ములుకుట్ల మహాదేవయ్య గారిల్లు .కానీ వారినుంచి కానీ కూడా సహాయం అందేది కాదు .ఆయన మంచివాడే ధర్మరాజు ,భార్య పరమగయ్యాళి. ఆవిడకు ఆయనే గాక ఊరుఊరంతా భయపడేది .జగడాలమారి ఆమె తిట్టినతిట్టు తిట్టకుండా రెండు గంటలు తిట్టేది .భార్యకు భయపడి మేనమామ ఏమీ వీరికి సాయం చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండేవాడు .కనుక తల్లిస్వయం శక్తితోనే ఏదో సంపాదిస్తూ ,తాను ఒంటిపూట తింటూ కొడుకుకు  రెండు లేకమూడు పూటలా భోజనం అమర్చేది.కంటికి రెప్పలాగా కాపాడేది. ఆమె కష్టాలు చూడలేక ఒకరోజు ఇంట్లో చెప్పకుండా మద్రాస్ కు కాలినడకన నడిచి వెళ్ళాడు బాలకేసరి .

    మద్రాస్ జీవితం

మద్రాస్ లో ప్రతి డిసెంబర్ చివరి వారం లో  రాణీ తోట అనే పీపుల్స్ పార్క్ లో ‘’పార్క్ ఫేర్ వేడుకలు ‘జరిగేవి .మద్రాస్ రాష్ట్ర ప్రజలు వేసవిలో ఊటీ వెడతారు .అందుకని చిన్నచిన్న ఉద్యోగులు మద్రాస్ వెళ్ళేవారు .కుటుంబాలతో తరలి వచ్చేవారు .వీరందరివలన వ్యాపారాలు బాగా జరిగేవి .ఈప్రదర్శనలకు కొబ్బరాకులతో,బొంగులతో  పెద్ద పెద్ద ఆవరణలు రెండు  కట్టేవారు .మొదటిది ఇన్నర్ సర్కిల్ రెండోది ఔటర్ సర్కిల్ .మొదటి దానిలో విలువైన వస్తువులు ప్రదర్శనకు పెట్టేవారు రెండవదానిలో కాఫీ హోటల్లు సోడా బడ్డీలు ,లాటరీ కొట్లు ఉండేవి .ఒక్కొక్క ఆవరణకు నాలుగు ద్వారాలు౦డేవి .గేట్ల దగ్గర పోలీసు కాపలా తోపాటు కాంట్రాక్టర్ల మనుషులుకూడా కాపలా ఉండేవారు .బయటహాలుకు అర్ధణా ,లోపలిదానికి నాలుగు అణాలు టికెట్ .అర్ధణా ఇచ్చి లోపలి వెళ్లి ,పావలా ఇచ్చి లోపలి ఆవరణలోకి వెళ్ళాలి .

  అప్పటికి మద్రాస్ లో ఇంకా కరెంట్ రాలేదు .రాత్రిళ్ళు వెలుతురుకోసం కిరసనాయిల్ పోసిన తగరపు బుడ్లు ను లోపలా బయటా తోరణాలుగా కట్టేవారు .వీటిని సాయంత్రం అయిదుకు వెలిగించటం మొదలుపెడితేకానీ చీకటి పడేసరికి పూర్తయ్యేదికాదు.అప్పుడు కేసరి మద్రాస్ లో చదువుతున్నాడు .వాళ్ళమ్మ ఒకసారి మద్రాస్ వచ్చి కొడుకును చూసింది .ఆమె వచ్చినప్పుడు కొత్వాలు బజారుదగ్గర ఆచారప్పన్ వీధిలో ఒకగదిని నెలకు 12అణాలు అద్దెకు తీసుకొని ఉన్నారు .

 1886లో రాణీ తోటలో వేడుకలు ప్రారంభమై మూడేళ్ళయింది .ఆ ఏడూ అలానే సంరంభంగా వేడుకలు మొదలయ్యాయి .కేసరి తన ఇంటి యజమాని గారబ్బాయితో వేడుకలు చూడటానికి వెళ్ళాడు .బయట రంగుల రాట్నంఎక్కి హాయి అనుభవించి ,’’చుక్కాణి’’ అంటే బయోస్కోప్ లో కాశీ రామేశ్వరాలు చూసి సంతోషించారు .ఆకుర్రాడు లోపలకు పోదామన్నాడు .అర్ధణా తనదగ్గర లేదన్నాడు కేసరి .అఆకుర్రడి దగ్గర అర్ధణా ఉంటె విడిచి వెళ్ళలేక వెళ్ళలేక లోపలి ఒక్కడే వెళ్ళాడు .వాడి చేతిలో అర్ధణా ఉ౦దికనుక లోపలి వెళ్ళాడు. ఆ అర్ధణా లేని నిర్భాగ్యుడు కేసరి లోపలి వెళ్ళలేక పోయాడు .అప్పటికే సాయంకాలం 6అయింది . కాసేపటికి లోపలినుంచి పొగలు మంటలు వచ్చి వెదురు బొంగులు పేఠేల్  ,పెఠీల్ మని కాలుతూ పగులుతున్న శబ్దం లోపలి నుంచి వినబడుతోంది .ఆ పొగలో కళ్ళు కనపడక తొక్కిసలాట జరిగి ,కాళ్ళకింద పసిపిల్లలు నలిగి పోయారు ధనవంతుల కుటుంబాలు చాలావచ్చాయి ప్రదర్శనకు .ఆడ మగ పిల్లా జెల్లా అందరూ ఆమంటల్లో మాడి మసి అయిపోయారు .అరగంటలో అంతా రుద్రభూమయిపోయింది .మంటల వేడికి తట్టుకోలేక కూవం నదిలో దూకారు కొందరు .ఆభరణాల ప్రదర్శనలో ఉన్నవారు వాటిని వదిలి రాలేక అక్కడే సజీవంగా దహనమయ్యారు .సందట్లో సడేమియా లాగా దొంగతనాలకు పెద్దగా అవకాశం కలిగింది వీలైనంత దోచుకొని పోయారు .ఆభరణాల బంగారం వెండి కరిగి ముద్దలయ్యాయి .ఆరోజు అమావాస్య కూడా కావటం తో కన్నుపొడుచుకున్నా వెలుతురూ లేదు .పోలీసు వారొచ్చి నిప్పునార్పు యంత్రాలతో మంటల్ని ఆర్పేశారు .అయినా తగినన్ని ఫైర్ ఇంజన్లు లేవు అప్పుడు .

  క్రిష్టియన్ కాలేజి ప్రిన్సిపాల్ మిల్లర్ దొర వచ్చితానేస్వయంగా గుంజలపై ఉన్న పందిళ్లను దులిపి లోపలి స్త్రీ శిశువులను బయటికి తెచ్చికాపాడాడు .బాధితులకు చేతనైన సాయం చేశాడు .కాలేజికి వెళ్లి రిజిస్టర్లు తనిఖీ చేసి విద్యార్ధుల యోగ క్షేమాలు కనుక్కొని తలిదండ్రులకు వెంటనే తెలియజేశాడు .తెల్లారేసరికి అక్కడ కరిగి ఉన్న బంగారం వెండి ముద్దలు మాయమైపోయాయి .చనిపోయిన వారి బంధువులంతా అక్కడ శవ జాగరణం చేసి మర్నాడు ఉదయం తమ వారిని గుర్తు పట్టగలిగారు .గుర్తు పట్టలేక పోయినవార్కి సామూహికంగా అంత్యక్రియలు జరిపించారు .చావుతప్పి బయట పడినవారిలో కసరత్తు చేసిన బలశాలి కొల్లా కన్నయ్య శ్రేష్టి ఉన్నాడు .పల్టీకొట్టి దూకుతూ బయటపడ్డాడు. అప్పుడు ఆయనమెడలో ఉన్నపగడాలహారం జారిపోయింది .అది దొరికినవాడు సెట్టిగారింటికి మర్నాడు తీసుకు వెళ్లి ఇచ్చి బహుమానం పొందాడు .

  బాలకేసరి లోపలి వెళ్ళకుండా బయటనే తిరుగుతూ ,లోపలి వెళ్ళిన ఇంటియజమాని కొడుకుకోసం బయట చాలా సేపు నిరీక్షించాడు .అతడు కనపడలేదు. కేసరి తల్లి రొప్పుతూ రోజుతూ పరిగెత్తుకు వచ్చి కొడుకును చూసి కావలించుకొని ఊరట చెందింది .ఆమెను తీసుకొని సెంట్రల్ స్టేషన్ గేటు ఎదురుగా జనరల్ హాస్పిటల్  ఆవరణ  గోడపక్కన కూర్చుని తల్లీ కొడుకు సేద తేరారు .ఒంటేద్దుబండిలో రాత్రికి ఇంటికి చేరారు .ఇంటియజమానిభార్య తనతో వచ్చిన వాళ్ళ అబ్బాయి సంగతి అడిగితె జరిగింది. అంతా చెప్పగా ఆమె వెళ్లి యెంత వెతికినా జాడ దొరక్క నిరాశతో తిరిగి వచ్చింది .

 (ఇక్కడే ఆతర్వాత1960-70లలో  సెకండ్ హాండ్ బుక్ షాపులు ఉండేవి ,’’మూర్ మార్కెట్’’ అనే వారు .అన్నీ తక్కువధరకే దొరికేవి .అవీ ఆతర్వాత కాలిపోయాయి.మేము చాలాపుస్తకాలు వస్తువులు కొన్నా౦ .వాటిని ఇప్పుడు పారిస్ కు దూరంగా ఏర్పాటు చేశారు ).  

  సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కేసరి గారి చిన్ననాటి ముచ్చట్లు -1

కేసరి గారి చిన్ననాటి ముచ్చట్లు -1
తల్లికి కె ఎన్ కేసరి(కోట నరసింహం –కోట లో కె,నారా మాత్రం ఉంచుకొని సింహం బదులు కేసరి అని మార్చుకొని  కె.ఎన్ .కేసరి అయ్యారు )గారొక్కరే సంతానం .ఆడపిల్ల లేని కొరత తీర్చుకోటానికి అమ్మాయి వేషం వేసి ఇరుగంమలకు పోరుగంమలకు చూపించి ముచ్చట తీర్చుకొనేవారు .అయిదవ ఏటనే పిచ్చయ్య గారి వీధి బడిలో చేరారు .ఆయనకు చదువు చెప్పే సత్తా లేకున్నా ,బెత్తం తో వీపులు చీరేసి భయపెట్టేవాడు .నెలజీతం లేదు పిల్లలు భోజన పదార్దాలైన పరిగలను కాయగూరాలని పిల్లలు తెచ్చిచ్చే వారు .అవి సమర్పించిన వారికి దెబ్బలు ఉండేవికావు .పిల్లల సంఖ్యను బట్టి ప్రభుత్వం సంవత్సరానికి కొంత గ్రాంట్ ఇచ్చేది .దానికోసం ఎదురుచూస్తూ బడిలో ఆయన పిల్లల్ని చేర్చుకోనేవాడు .కొత్తపిల్లలు చేరితే పప్పు బెల్లాలు పంచిపెట్టేవాడు .జీతం వరహా అంటే నాలుగు రూపాయలు .కానీ ఇవ్వగల సమర్ధులు ఉండేవారుతక్కువే  .ఈ జీతాలు వగైరాలే వలననే ఆయన ఇంట్లో పొయ్యిలో పిల్లి లేచేది .పూరిపాకలో బడి జరిగేది .
  గుంత ఓనమాలు నేర్చి తర్వాత కొయ్యపలకలపై రాసేవాళ్ళు పిల్లలు .పలకకు నీలిమందు దోసాకు పసరు పట్టించి బాగా రుద్ది ఎండలో పెట్టేవారు .అప్పుడు బలపాలతో రాస్తే బాగా కనిపించేది .బలపం కోపులు అనే తెల్లటి రాళ్ళు ఉండేవి .వాటిని తెచ్చి రంపం తో సన్నగా కోసి రాసేవారు .నాలుగైదేళ్ళ చదువు తర్వాత పెద్ద పుస్తకం అంటే రామాయణం ,భారతం భాగవతం పట్టించి చది విన్చేవారు .సరస్వతి పూజ చేయించి పంతులుగారు రామాయణం పట్టించేవారు .అది అయ్యాక పప్పు బెల్లాలు పంచి సెలవిచ్చేవారు .ఆ బడిలో ఈ పెద్ద పుస్తకం తో చదువు పూర్తయ్యినట్లే . పేద కేసరి గారికి పంతులు దెబ్బలు తప్ప చదువు అబ్బలేదు .ఇంటి వద్ద తల్లికి సాయం చేయాల్సి ఉండటం తో బడికి కూడా క్రమంగా వెళ్ళే వాడు కాదు .పొద్దున్నే గుండ్లకమ్మ నదికి వెళ్లి ,కాలకృత్యాలు తీర్చుకొని ,చిన్న కావడిలో రెండు తప్పాలలతో ఇంటికి నీరు తెచ్చేవాడు .చద్దన్నం తిని ఎవరిపోలం లోకైనా వెళ్లి వంకాయలో గో౦గూరో ,దోసకాయలో మెరపకాయలో ,జొన్న కంకులో సజ్జ కంకులో లో అడిగి తెచ్చుకొని వాళ్ళ అమ్మగారికి ఇచ్చేవాడు
ఇంటి దగ్గరున్న ఉప్పలవారి మర్రి చెట్టు పెద్ద  ఆకులు కోసి విస్తరాకులు కుట్టి అందులో తినేవారు .ఒకసారి చెట్టు ఎక్కి కళ్ళు తిరిగి దిగలేకపోతే ఎవరో వచ్చి పగ్గం తో దించారు .తర్వాత చెట్టు ఎక్కటం మాని దోటీ తో ఆకులు కోసి తెచ్చి విస్తళ్ళు కుట్టేవాడు .జొన్నదంటు ఈనెలను సన్నగా చీల్చి ,విస్తళ్ళను మహా నాజూకుగా కుట్టేవాడు .మిషన్ కుట్టు లాగా ఉండేదని తల్లితో సహా అందరూ మెచ్చేవారు .తల్లి రవికలు కుట్టటం లో మహానేర్పరి ఆడవాళ్ళు వచ్చి కుట్టిన్చుకోనేవారు .సాదారవికకు ముక్కాలు అణా,పూలు వేసి కుడితే అణా తీసుకొనేవారు .తేళ్ళు మండ్రగబ్బలు పక్షులబొమ్మలు వేసి కుడితే రెండు అణాలు అంటే బెడ ఇచ్చేవారు .అప్పటి నాజూకు వస్త్రాలు పాలచాయ కోకలు , నల్లచాయ రవికలు ,గువ్వకన్ను నెమలికన్ను అద్దకం రవికలు .అట్లతద్దినాడు స్త్రీలు ఈ అలంకారాలతో కొప్పు నిండా బంతి పూలతో సిన్గారించుకోనేవారు .కోలాహలంగా ఉయ్యాలలు ఊగేవారు .అప్పటివి జాతీయ క్రీడా వినోదాలు దేహానికి పుష్టినిచ్చేవి .తల్లి రవికకలు కుట్టి సంపాదించింది కుటుంబానికి బోతటా బోటిగా సరిపోయేది .
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పేద బాలికల విద్యకోసం నోటర్ డాం సంస్థలు నిర్మించి సేవ చేసినఫ్రెంచ్ మదర్ సుపీరియర్ –సెయింట్ జూలీ బిలియర్ట్ –గబ్బిట దుర్గాప్రసాద్.

పేద బాలికల విద్యకోసం నోటర్ డాం సంస్థలు నిర్మించి సేవ చేసినఫ్రెంచ్ మదర్ సుపీరియర్ –సెయింట్ జూలీ బిలియర్ట్ –గబ్బిట దుర్గాప్రసాద్.విహంగ మహిళా వెబ్ మాసపత్రిక .జూన్
01/06/2022 గబ్బిట దుర్గాప్రసాద్
మేరీ రోజ్ జూలీ బిలియర్ట్ 12-7-1751న ఫ్రాన్స్ లోని కువిలీ లో జీన్ ఫ్రాన్సిస్ బిలియంట్ ,మేరీ లూసీ ఆంటోనెట్ దంపతులకు జన్మించి ఏడుగురు సంతానం లో ఆరవ పిల్ల .ఏడవ ఏటనే’’ కాటేచిసం ‘’కంఠతా పట్టి తన స్నేహితురాల్లను పిలిచి అప్పగింఛి ఆశ్చర్యపరచేది .ఆమె అంకుల్ తిబాల్ట్ గుల్బెర్ట్ నడిపే బడిలో ప్రాధమిక విద్య నేర్చింది .ప్రీస్ట్ ఫాదర్ డాంగి చర్చిలో ఆయన సమక్షం లో మొదటి కమ్యూనియన్ చేయగా ఆమె వయసు 9అని నిర్ధారించాడు .అయిదేళ్ళ తర్వాత ‘’చాస్టిటి’’అనే శీల ప్రవర్తనం పై ప్రతిజ్ఞ చేసింది .కుటుంబం అప్పుల పాలయి నందున టీన్ ఏజ్ లో శారీరక కష్టం చేసి సంపాదించి కుటుంబానికి సాయపడేది  .
  ఆమె పవిత్ర ,విశుద్ధ ప్రవర్తనకు అందరూ ఆశ్చర్యంతో మురిసి పోయి ‘’సెయింట్ ఆఫ్ కువిల్లీ ‘’అని గౌరవంగా సంబోధించేవారు .ఇరవై రెండేళ్ళ వయసులో  తండ్రి పై,ఆయన అజ్ఞాత విరోధి అకస్మాత్తుగా జరిపిన పిస్టల్ కాల్పులలో ఆమె కింది శరీరభాగం పాక్షిక పక్షవాతానికి గురైంది .తర్వాత కొన్నేళ్ళకే ఆమె మంచానికే పరిమితమైపోయి 30ఏళ్ళు ఉండిపోయింది .ఈకాలం లో నిత్య పవిత్ర ప్రార్ధనలతో అనుభూతులతో ,అసాధారణ ప్రార్ధనా పరురాలైంది.తర్వాత జీవితకాలమంతా చుట్టు ప్రక్కల పిల్లలను రప్పించి వారిని ‘’మొదటి కమ్యూనియన్ ‘’కు శిక్షణ ఇచ్చేది .
1789  ఫ్రెంచ్ విప్లవ కాలం లో రివాల్యూషనరి సైన్యం మత విశ్వాసమున్న వారిని గుర్తించి నిర్దాక్షిణ్యంగా చంపేది. ఆమె స్నేహితులు ఆమెను కువిలీ నుంచి ఒక గడ్డి బండి లో రహస్యంగా  అక్కడి నుంచి తప్పించారు. కా౦ పీన్  చేరి అక్కడ రోజుకో ఇంట్లో రహస్యంగా గడుపుతూ ,విపరీతమైన శారీరక బాధలను తట్టుకొంటూ గడిపింది .కొంతకాలం ఆమె కు మాటకూడా పడిపోయింది .కానీ ఈ కాలం ఆమె మానసికం గా , ఆధ్యాత్మికంగా ఎదగటానికి అద్భుతంగా ఉపయోగపడింది .ఆమెకు ఒక రోజు ఒక విజన్ కనిపించి ,ఒక అదృశ్య వాక్కు ‘’ “Behold these spiritual daughters whom I give you in an institute marked by the cross.”అని చెప్పినట్లు గ్రహించింది .
ఇలా గడపగడపకు తిరుగుతూ ప్రవాస జీవితం గడుపుతున్న జూలీ కి ఒక రోజు అరిష్టోక్రాటిక్ మహిళ ఫ్రాంకాయిస్ బ్లిన్ డీ బోర్డన్ తో పరిచయం కలిగి౦ది .జూలీ లోని   మతవిశ్వాసానికి ,బోధనా పటిమకు అబ్బురపడి ఆశ్రయమిచ్చింది  .ఇద్దరూ కలిసి ‘’ఇన్ ష్టిట్యూట్ ఆఫ్ నోటర్ డాం’’అనే పేద యువ క్రిస్టియన్ విద్యార్ధినులకు  విద్య నేర్పించే సంస్థ ను నెలకొల్పారు .ఇందులోనే వారికి కేటాక్రిస్ట్ లో శిక్షణ కూడా ఇచ్చేవారు .మొదటి ఏడాది పూర్తికాగానే మొదటి నోటర్ డాం బాచ్ సిస్టర్స్  ప్రతిజ్ఞ చేశారు . అదే కాలం లో జూలీ బిలియర్ట్ వ్యాధికూడా అకస్మాత్తుగా మాయమై ఆమె మామూలు ఆరోగ్యవంతురాలైంది.22ఏళ్ళ తర్వాత మొదటిసారిగా ఆమె నడవటం మొదలు పెట్టింది .
  జూలీ మనసంతా బీదప్రజల అవసరాలు తీర్చటం వారి విద్యపైనే ఉండేది .సమాజంలోని ఇతరులకు కూడా క్రైస్తవ బోధన అవసరమని గ్రహించింది .ఆ ధ్యేయం తో  జీవితకాలమంతా ఫ్రాన్స్ ,బెల్జియం దేశాలలో నోటర్ డాం లాంటి సంస్థలను ,స్కూల్స్ ను ఎన్నిటినో నెలకొల్పి పేదలకు విద్యాదానం చేసింది .తర్వాత జూలీ ,ఫ్రాంకాయిస్  లు మాతృ సంస్థ ను బెల్జియం లోని నెమర్ కు మార్చారు
జూలీ కి ఆమె శారీరక ఇబ్బంది ప్రజా సేవలో ఆటంకం కలిగించలేదు .టీచింగ్ ఆర్డర్ ను తీర్చి దిద్దటం పేదలకు ధనికులకు కూడా అవసరమైన విద్య అందివ్వటం లో ఆమె చేసిన కృషి అద్వితీయం .అప్పటి భయంకర పరిస్థితులలో,భీభత్స పాలనలో  ఆమె ఇంటికే పరిమితమైపోయింది .రాబెస్ పియర్రీ పతనం తర్వాత అకస్మాత్తుగా చావునుంచి తప్పించుకోగలిగింది .అప్పుడు ఈ ‘’సెయింట్ చుట్టూ అక్కడి ఉన్నత వంశపు యువతులందరూ కలిసి ఒక బృందంగా ఏర్పడగా ,వారికి భగవంతుని నమ్మి పవిత్ర జీవనం సాగించటం ,తోటి అనాధలకు సేవచేయటం నేర్పింది .వీరంతా నియామబద్ధ జీవితాలు గడుపుతూ పవిత్ర జీవితంతో లోకులకు సాయం చేస్తూ జీవితాలను ధన్యం చేసుకొన్నారు .
1803 లో ఫాదర్ వారిన్ బిపఫ్ అమీన్స్ ల ఆశీస్సులతో చాలామంది ఈ ఇద్దరు సుపీరియర్స్ కు  బిలియర్ట్ ,డీబౌర్డాన్ లకు  సహాయకులుగా ఉండటానికి స్వచ్చందంగా ముందుకు వచ్చారు .అందులో ముందుగా ఎనిమిది మంది అనాధలు ముందుకు వచ్చారు .1-6-1804న బిలియంట్ కు ఆమె సుపీరియర్స్ ప్రార్ధనల ఫలితంగా పక్షవాతం నయమైంది .అప్పుడు వీరంతా కలిసి అక్టోబర్ 15న తమ ఇంటిపేర్లను సెయింట్స్ పేర్లుగా మార్చుకొన్నారు .క్రిస్టియన్ బాలికల విద్యావ్యాప్తి చేయాలని నిర్ణయించారు .దీనికోసం అనేక కాన్వెంట్ లు నెలకొల్పి వాటిని పర్యవేక్షి౦చ టానికి సమర్ధులను నియమించారు.’సిస్టర్స్ ఆఫ్ నోటర్ డాం’’అనే సంస్థ ఇలా ఏర్పాటైంది .ఈ వ్యవహారమంతా బిలియర్ట్ చాల బ్రిలియంట్ గా నిర్వహించింది .ఆమెకు మదర్ సెయింట్ జోసెఫ్ సహాయం చేసింది .19-7-1806లో ఈ సంస్థ ఇంపీరియల్ డిక్రీ ద్వారా గుర్తింపు పొంది౦ది అప్పుడు సభ్యులు 30మంది ఉన్నారు .ఆతర్వాత ఈసంస్థలుఫ్రాన్స్ ,బెల్జియం దేశాలలో అనేక టౌన్ లలో ఏర్పాటయ్యాయి .అందులో ఘెంట్ ,నమూర్ లోని సంస్థలు బాగా  పేరుపొందాయి .మదర్ జోసెఫ్ మొదటి సుపీరియర్ అయింది వీటికి .
  ఆ సిటికమ్యూనిటి కన్ఫేషర్ వానిస్  వెళ్ళాక ది ఆబే డీ సంబూసి డీసెయింట్ ఎస్టేవ్ చాలాసమర్ధతతో నిర్వహిస్తూ ,అనేక కాంగ్రి గేషన్ లను స్థాపించి ,పురాతన సనాతన విధాలతో కలుపుతూ వాటి మధ్య గొప్ప సమన్వయము సాధించాడు .బిషప్ డేమాన్దాల్క్స్ పై గొప్ప ప్రభావం కల్గించగా ,బిలియర్ట్ కు దియోసిస్ ఆఫ్ అమీన్స్ ను విడువక తప్ప లేదు .అప్పుడు పిసాని డీలాగౌడే అనే నార్మన్ బిషప్ బిలియర్ట్ ను ఆహ్వానించి అక్కడి సెంటర్ బాధ్యతలు అప్పగింఛి నూతన విధానాలకు శ్రీకారం చుట్టమని ఆదేశించాడు .
  బిలియర్ట్ అక్కడికి వెళ్లి అక్కడి వారిని వారికీ నచ్చిన విధానం లో ఉండటానికి లేక తనను అనుసరించటానికి స్వేచ్చ నిచ్చింది .ఇలా 1809 మధ్యలో నామర్ కా  న్వెంట్ ఆ సంస్థ కు గొప్పకేంద్రమై,ఇప్పటికీ నిలిచింది .తర్వాత ఆమెను అమీన్స్ కు తిరిగి వెళ్లి అక్కడి సంస్థను పునర్నిర్మించామన్నాడు .కాని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ,అక్కడ డబ్బులూ లేవు ,ఆసక్తి ఉన్నవారూ లేకపోవటం తో వెంటనే నామర్ కు  తిరిగి వచ్చేసింది .
  జీవితం లో చివరి పదేళ్ళు అక్కడి డాటర్స్ ను పవిత్ర జీవనం ,ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా మార్చే ప్రయత్నం చేసి కృత కృత్యురాలైంది .దైవ సాన్నిధ్యం లో ప్రతిక్షణం ఉంటూ ఎందఱో పవిత్ర ఆత్మలకు మార్గదర్శి అయింది .1804-1816 మధ్య 12 ఏళ్ళు బిలియర్ట్ 15కాన్వెంట్ లను స్థాపించి ,120సార్లు అక్కడికి వెళ్లి వస్తూ ,వాటి అభి వృద్ధిని పర్యవేక్షించింది .డాటర్స్ తో ఎన్నో ఆంతరంగిక సమావేశాలు నిర్వహించి వారిని తీర్చి దిద్దింది .ఆమె రాసిన వందలాది ఉత్తరాలు మాతృ సంస్థలో ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి .
  1815లో బెల్జియం నెపోలియన్ యుద్ధాలకు కేంద్రమైంది .మదర్ జనరల్ బిల్లియర్ట్ చాలా ఆందోళనకు గురైంది .దీనికి కారణ౦  ఆమె సంస్థలు చాలాభాగం అ సైన్యం వెళ్ళే మార్గం లో ఉండటమే .కానీ వారెవరికీ గాయాలు తగలలేదు .1816 జనవరిలో మదర్ కొద్దిగా జబ్బు పడింది .64వ ఏట 13-5-1816న బెల్జియం లోని మదర్ హౌస్ లో సుపీరియర్ మదర్ జూలీ బిలియర్ట్ తుది శ్వాస వదిలి ,దేవుని చేరింది .ఆమె కానో నైజేషన్ 1881లో ప్రారంభమైంది .13-5-1906లో పోప్ ప యస్-10 బ్యూటిఫై చేస్తే,1969లో ఆరవ పోప్ పాల్ కానోనైజ్ చేశాడు .లోకమంతా బిలియర్ట్ వదాన్యత ను గొప్పగా శ్లాఘించారు .ఆమె గౌరవార్ధం  వందలాది  స్కూళ్ళు నిర్మించారు .అమెరికాలో కూడా నోటర్ డాంస్కూల్స్ స్థాపించబడ్డాయి .నోటార్ డాండీ నామర్ యూని వర్సిటి ఏర్పడింది .అలాగే ఇంగ్లాండ్ లోనూ ఇవి వెలిసి ఆమె సేవలను నిత్యం స్మరిస్తున్నారు .1969లో ఇంగ్లాండ్ లోని మెర్సిసైడ్ లో ఆధునికంగా నిర్మించిన చర్చి ని ఆమెకు అంకితం చేశారు .ఆమె స్థాపించిన సంస్థలు ఇప్పటికీ నిరుపేదల విద్యకు గొప్ప సాయమందిస్తున్నాయి .’’టీచింగ్ ది చిల్ద్రెన్ వాట్ దే నీడ్ టు నో ఫర్ లైఫ్ ‘’అనే జూలీ బిలియర్ట్ స్పూర్తి ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది .జాలీ బిలియర్ట్ ‘మొట్టమొదటి సుపీరియర్ జనరల్ ఆఫ్ ది కాంగ్రి గేషన్ ఆఫ్ ది సిస్టర్స్ ఆఫ్ నోటార్ డాం డీ నమూర్ ‘’.
The Catholic Church holds that “all who die in God’s grace and friendship but still imperfectly purified” undergo the process of purification which the Church calls purgatory, “so as to achieve the holiness necessary to enter the joy of heaven“.
మనం ఏదైనా సాయం కోసం స్నేహితుల్ని ఇతర బంధువుల్ని కోరినట్లు ఈ సంస్థవారు మనతరఫున వారికి సాయం చేయమని దేవుడిని ప్రార్ధిస్తారు .
–గబ్బిట దుర్గాప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~.

Posted in రచనలు | Leave a comment

భరతముని నాట్య శాస్త్ర అనువాదకులు ,తెలుగు నాటక వికాసం కర్త ,నాట్య సామ్రాట్,నాటక రత్న ,కళా రత్న  బిరుదాంకితులు,మనం మరచిపోయిన ఆధునిక భరత ముని – డా .పోణంగి శ్రీ రామ అప్పా రావు గారు

భరతముని నాట్య శాస్త్ర అనువాదకులు ,తెలుగు నాటక వికాసం కర్త ,నాట్య సామ్రాట్,నాటక రత్న ,కళా రత్న  బిరుదాంకితులు,మనం మరచిపోయిన ఆధునిక భరత ముని – డా .పోణంగి శ్రీ రామ అప్పా రావు గారు
జననం – విద్యాభ్యాసం
అప్పారావు 1923, జూలై 21 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు తాలూకా, బందపురంలో జన్మించారు. కొవ్వూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోను, విజయవాడ శ్రీరాజా రంగయ్యప్పారావు కళాశాలలోనూ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలోను విద్యాభ్యాసం చేశారు.తలి దండ్రులు లక్ష్మీ నరసమ్మ ,శ్రీరామ మూర్తి .
ఇతర వివరాలు
’తెలుగు నాటకవికాసం‘ అనే అంశంపై పరిశోధన చేసి 1961 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా స్వీకరించాడరు. తెలుగు నాటక రంగాన్ని గురించిన సర్వ సమగ్రమైన గ్రంథమిది. 1967లో ఈ గ్రంథం వెలువడిన నాటినుంచి నాటకరంగానికి ప్రామాణిక గ్రంథంగా విరాజిల్లుతుంది. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.’’సంస్కృత శాస్త్రాలునృత్త , నృత్య నాట్యాలు ,-చతుర్విధ అభినయాలు ‘’పై విశిష్ట గ్రంథరచన -1986-88 కాలం లో రాశారు
అప్పారావు వృత్తిరీత్యా అధ్యాపకులు . భీమవరం, రాజమహేంద్రవరం, మద్రాసు, కడప, శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీల్లోనూ, మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీలోనూ కొంతకాలం ఉపస్యాసకుడిగా పనిచేశారు. విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం లోను పాఠ్యగ్రంథ జాతీయకరణ ప్రత్యేకోద్యోగిగా పనిచేశారు.తెలుగు అకాడెమీ ,,అంతర్జాతీయ తెలుగు సంస్థల డైరెక్టర్ గాపని చేసి సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గా -1983లో పదవీ విరమణ చేశారు .
  మలేసియా ,సింగపూర్ ,లండన్ ,ప్రాగ్ ,వియన్నా ,అమెరికాలను సందర్శించారు
భరతముని ‘నాట్యశాస్త్రం’ను తెలుగులో అనువదించి ప్రపంచానికి అందించారు. ఈ గ్రంథానికి కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి లభించింది. శ్రీ కాళ హస్తీశ్వర మహాత్మ్యాన్ని విపుల పీఠిక తో 1968లో ప్రచురించారు 1983లో విషాద సారంగధర ను విస్తృత పీఠిక ముద్రించారు .Historical tebles ,selected prayers ,Anoyims  and synonyms -1973లో ప్రచురించారు .’’మానవల్లి కవి రచనలు ‘’1972లో తెలుగులోనూ ,1986లో ఇంగ్లీష్ లోను ప్రచురించారు ఇతర రచనలు తాజ్ మహల్ (నాటిక), విశ్వభారతి (నవల), వేణువు (పద్యాత్మక గద్యము), నాట్యశాస్త్రము (గుప్తభావప్రకాశికాసహితము-జాతీయ బహుమతి పొందన గ్రంథం), నాటకరచనాప్రయోగములు (సిద్ధాంత గ్రంథము), తెలుగు నాటక వికాసము (డాక్టరేట్ పట్ట పరిశోధన వ్యాసము).నృత్య కళ-తెలుగు దేశం –తెలుగు నృత్య రత్నావళి కి 70పేజీల పీఠిక-1974,ధర్మవరం రామకృష్ణ మాచార్య –జీవితం ,రచనలు -1986,భారతీయ నాటక రంగం –శ్రీ ఆద్య రంగాచారి  గారి ఆంగ్ల గ్రంధానికి అనువాదం -1980,అభినయ దర్పణం -1987,నాట్య శాస్త్రం –విశ్లేషణాత్మక అధ్యయనం -1988,సాత్వికాభినయం -1993,వైఖానసాగమనం -1993,ఉత్తమా౦గాభినయం-1993,శారీరాభినయం -1994,చేష్టాకృతాభినయం -1994,చిత్ర సూత్రం -1994,హస్తాభినయం -1994.
1994 నాటికి -అముద్రిత రచనలు -ప్రధమాంధ్ర నాటక కర్తలు ,ఆంద్ర అలంకారికులు ,,సాహిత్య సంప్రదాయాలు ,ప్రాచీన నృత్యాలు
సత్కారసన్మానాలు – అప్పారావు 1987 లో కలకత్తాలో జరిగిన విశ్వ ఉన్నయన్ సంసద్లో రాష్ట్ర నాట్య సామ్రాట్ బిరుదును, 1990లో హైదరాబాదు యువ కళావాహిని వారిచే నాటక రత్న బిరుదాన్ని, 1992 లో శ్రీకాళహస్తి భరతముని ఆర్ట్స్ అకాడెమీ వారిచే కళారత్న బిరుదాన్ని అందుకున్నారు.[1]
నాట్య శాస్త్రం కు ఉత్తమ గ్రంథ కర్త గా 1961లో జాతీయ బహుమానం అందుకొన్నారు .1975లో ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభలకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు .1980ఉత్తమకళాశాల అధ్యాపక సన్మానం పొందారు .1994లో మద్రాస్ తెలుగు అకాడెమీ ఉగాది పురస్కారం ,19-11-94న రాజాలక్ష్మీ పురస్కారం అందుకొన్నారు
ఆంద్ర ప్రదేశ్ పాఠ్య గ్రందాల జాతీయీ కరణ రివ్యు కమిటి -1964,ఆంద్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడెమి -1964-65,పానుగంటి లక్ష్మీ నరసింహారావు శాత జయంతి ఉత్సవ కమిటి -1965,ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక అకాడేమీ ల రివ్యు కమిటీ -1972-73, కేంద్ర ప్రభుత్వ హిందీ గ్రంథ అకాడెమీ ల రివ్యు కమిటీ  -1976,ఆంద్ర ప్రదేశ్ నృత్య అకాడెమి -1981 లలో విశిష్ట సేవలు అందించారు
1988నుంచి –హైదరాబాద్ కేంద్ర విశ్వ విద్యాలయం లో ప్రదర్శన కళలు లో ఆచార్యులు
మరణం
నాటకరంగ పరిశోధనలో విశేషంగా కృషిచేసిన అప్పారావు 2005, జూలై 2 న కన్నుమూశారు
నేను అప్పారావు గారిని కూచిపూడిలో జరిగిన సిద్ధేంద్ర యోగి ఉత్సవాలలో ప్రసంగిస్తుండగా చూసిన అదృష్ట వంతుడిని .పరిచయం చేసుకొని మాట్లాడాను .అప్పుడు ఆయన బొంబాయి నుంచి కళల పై ఒక త్రైమాసపత్రిక ఇంగ్లీష్ లో నడుపుతున్నారు .అందులో డా.వేదాంతం చిన సత్యం గారిపై ఒక ప్రత్యెక సంచిక కూడా తెచ్చారు అది నేను కొని భద్రపరచుకోన్నాను .
  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

ప్రఖ్యాత ఆయుర్వేద డాక్టరై ,’’కేసరి కుటీరం ‘’స్థాపించిలోధ్ర మొదలైన మందులు తయారు చేసి’’ గృహలక్ష్మి ‘’అనే వారపత్రిక ద్వారా దాదాపు అర్ధశతాబ్ది సాహిత్య సేవ చేసి,’’స్వర్ణ కంకణాలతో ‘’ ప్రముఖ మహిళలను సత్కరించి, మద్రాస్లో కేసరి ఉన్నత విద్యాలయం స్థాపించి విద్యాసేవ చేసిన మనం మరచిపోయిన మహానుభావుడు – కె.ఎన్. కేసరి అనే శ్రీ కోట నరసింహం గారు

ప్రఖ్యాత ఆయుర్వేద డాక్టరై ,’’కేసరి కుటీరం ‘’స్థాపించి లోధ్ర మొదలైన మందులు తయారు చేసి’’ గృహలక్ష్మి ‘’అనే వారపత్రిక ద్వారా దాదాపు అర్ధ శతాబ్ది సాహిత్య సేవ చేసి,’’స్వర్ణ కంకణాలతో ‘’ ప్రముఖ మహిళలను సత్కరించి, మద్రాస్ లో కేసరి ఉన్నత విద్యాలయం స్థాపించి విద్యాసేవ చేసిన మనం మరచిపోయిన మహానుభావుడు – కె.ఎన్. కేసరి అనే శ్రీ కోట నరసింహం గారు

కె.ఎన్.కేసరి (1875 – 1953) గా పేరు పొందిన ఈయన అసలు పేరు కోట నరసింహం. కేసరి కుటీరం అనే ఔషధశాల స్థాపకుడు. మదరాసులోని మైలాపూరులో కేసరి పాఠశాలను స్థాపించాడు. కేసరి దానశీలిగా పేరు గాంచారు. స్త్రీ జనోద్దరణకై గృహలక్ష్మి మాసపత్రికను స్థాపించాడు. కర్నాటక సంగీత విద్వాంసుడు, సినీ గాయకుడైన ఉన్ని కృష్ణన్ ఆయన మునిమనుమడు.[1]

బాల్యం

కేసరి, 1875 ఏప్రిల్ 26 న ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు మండలానికి చెందిన ఇనమనమెళ్ళూరు గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. వీరిది పేద కుటుంబం. కేసరికి ఐదేళ్ల వయసులో తండ్రి మరణించాడు. తల్లికి ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఉండటం వల్ల బడికి సరిగా వెళ్ళగలిగేవాడు కాదు. తల్లి దర్జీ పని చేస్తుండేది. తల్లి కష్టపడి తనను పెంచి పెద్ద చేస్తుండటం గమనించిన ఈయన, తన పదకొండేళ్ళ వయసులో కాలినడకనే మద్రాసు చేరుకుని అక్కడే చదువుకోవడం మొదలు పెట్టాడు. హిందూ ధార్మిక పాఠశాలలో స్కాలర్‌షిప్పు పొందాడు. కొంతకాలానికి 1889లో తల్లి కూడా మద్రాసుకు వచ్చి అతనితో ఉండసాగింది. ఆ తర్వాత కొద్దికాలానికే ఆమె జబ్బుచేసి మరణించింది. ఆయన తన చిన్ననాటి జ్ఞాపకాలను “నా చిన్ననాటి ముచ్చట్లు” అనే పుస్తకంగా ప్రచురించాడు.[2]

వైద్యవృత్తి

చదువు పూర్తి చేసుకుని పలుచోట్ల ఉద్యోగ ప్రయత్నాలు చేసినా అవేమీ సత్ఫలితాలను ఇవ్వలేదు. తర్వాత ఆయన వైద్యం నేర్చుకోవడం ప్రారంభించాడు. కోమట్ల సహాయంతో శ్రీ కన్యకాపరమేశ్వరీ ఆయుర్వేద వైద్య కళాశాలలో కొలువు సంపాదించాడు. 1900 సంవత్సరంలో మద్రాసు జార్జిటౌన్ నారాయణ మొదలి వీధిలో ఒక చిన్న బాడుగ ఇంటిలో కేసరి కుటీరము పేరుతో మందుల తయారీ సంస్థను ప్రారంభించాడు.

సామాజిక కృషి

1928లో కేసరి, సామాజిక రాజకీయ రంగాలలో మహిళను ప్రోత్సహించేందుకై గృహలక్ష్మి అనే తెలుగు వారపత్రికను స్థాపించి, దానికి వ్యవస్థాపక సంపాదకుడిగా,[3] మహిళా రచయితలను పెంపొందించాడు.[4] మహిళా రచయితలను సత్కరించేందుకు గృహలక్షి స్వర్ణకంకణమనే పురస్కారాన్ని స్థాపించాడు.[5]

1943లో కేసరి మద్రాసులోని మైలాపూరు తెలుగు ప్రాథమిక పాఠశాల యొక్క యాజమాన్యపు బాధ్యతలను తీసుకొని దానికి తగిన నిధులు సమకూర్చి, ఉన్నత పాఠశాల స్థాయికి తీసుకెళ్ళాడు[6] 1951లో తన విద్యాభివృద్ధి పనులను మరింత విస్తరించడానికి కేసరి విద్యాసంస్థ అనే ధర్మాదాయసంస్థను ఏర్పాటుచేసాడు. ఆ సంస్థ తన ఆధ్వర్యంలో ఇప్పడు అనేక పాఠశాలలను నడిపిస్తున్నది.[7]

కేసరి కుటీరం ఉత్పాదనలు

· అమృత, రక్తశుద్ధిద్రావకము

· అర్క, సర్వజ్వరనివారిణి

· కేసరి డెంటల్ క్రీం, దంతధావన నవనీతము

· కేసరి పుష్పత్రయము

· లోధ్ర

రచనలు
ఆయన జీవిత విశేషాలను చిన్ననాటి ముచ్చట్లు పేరుతో పుస్తకంగా రాశాడు.[8] పుస్తకంగా విడుదలైన తర్వాత వీరి జీవిత విశేషాలను ధారావాహికగా జగతి (పత్రిక) లో జూలై 1989 నుండి ప్రచురించబడింది.[

గృహ 20వ శతాబ్దంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు కె.యన్. కేసరి స్త్రీల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేరు. 1924 లో గృహలక్ష్మి మాసపత్రిక స్థాపించి స్త్రీవిద్యకీ, రచనావ్యాసంగానికి కృషి చేసేరు. 1934లో స్వర్ణకంకణము పురస్కారము ప్రారంభించి సాహిత్య, సాంస్కృతిక, తదితర రంగాలలో విశిష్టసేవ చేసిన స్త్రీలను సత్కరిస్తున్నారు. ఆధునిక యుగంలో స్త్రీలని క్రమపద్ధతిలో ఏటా సత్కరించడం ఈ స్వర్ణకంకణముతో మొదలయింది.

స్వర్ణకంకణముతో సత్కారం పొందిన మహిళలు

కనుపర్తి వరలక్ష్మమ్మ (1934)
చిలకపాటి సీతాంబ (1935)
కాంచనపల్లి కనకమ్మ (1936)
పులవర్తి కమలావతి (1937)
బాలాంత్రపు శేషమ్మ, రత్నాల కమలాబాయి (1938)

బాలాంత్రపు శేషమ్మ (1939లో పురస్కార గ్రహీత)
వి. రాధామనోహరి, చేబ్రోలు సరస్వతీదేవి (1940)
బత్తుల కామాక్షమ్మ (1941)
ఉన్నవ లక్ష్మీబాయమ్మ (1948)
బెంగుళూరు నాగరత్నమ్మ (1949)
గిడుగు లక్ష్మీకాంతమ్మ (1951)
స్థానాపతి రుక్మిణమ్మ (1952)
ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ (1953)
పొణకా కనకమ్మ(1955)
కొమ్మూరి పద్మావతీదేవి (1956)
కె. రామలక్ష్మి(1957)
దేశిరాజు భారతీదేవి(1958)
గుడిపూడి ఇందుమతీదేవి (1959)
కానుకొల్లు చంద్రమతి(1960)
ఎ. కనకదుర్గా రామచంద్రన్ (1961)
1962, 1963 సంవత్సరాలలో బహుమతులు ఇవ్వలేదు.

ఇల్లిందల సరస్వతీదేవి (1964)
తెన్నేటి హేమలత (1965)
ద్వివేదుల విశాలాక్షి (1966)
కోడూరి కౌసల్యాదేవి (1967)
ముప్పాళ్ళ రంగనాయకమ్మ (1968)
యద్దనపూడి సులోచనారాణి (1969)
ఐ.వి.యస్. అచ్యుతవల్లి (1970)
డి. కామేశ్వరి (1971)
సి. ఆనందారామం (1972)
కోడూరి లీలావతి (1974)
ద్వారక పార్థసారథి (1975)
వాసిరెడ్డి సీతాదేవి (1976)
గుళ్ళపల్లి సుందరమ్మ (1977)
మాదిరెడ్డి సులోచన (1978)
తురగా జానకీరాణి (1982)
అవసరాల (వింజమూరి) సీతాదేవి (1984)
జె.భాగ్యలక్ష్మి (1986)
నాయని కృష్ణకుమారి
వేదుల మీనాక్షీదేవి
మాలతీ చందూర్
ఉన్నవ విజయలక్ష్మి
పోలాప్రగడ రాజ్యలక్ష్మి
శారదా అశోకవర్థన్
వాసా ప్రభావతి

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-6-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

శ్రీ భీమ లింగేశ్వర శతకం -2(చివరిభాగం )

శ్రీ భీమ లింగేశ్వర శతకం -2(చివరిభాగం )
మొదటి పద్యం –‘శ్రీ వాణీశ ముఖామర ప్రకరస౦సేవ్యాంఘ్రీ పంకేరుహా –భావాతీత సుమంగళా౦చిత గుణా,భద్రేభ చర్మాంబరా
ధీ విభ్రాజిత దాసకల్ప కుజ దాత్రీ భ్రున్నివాసొన్నతా –గ్రావా ధీశ కుమారికా రమణ భర్గా శ్రీ రామ లింగేశ్వరా ‘’అని మొదలుపెట్టి ‘’ఘనపా౦డిత్యం ,సూరి జన సాంగత్యం సాధన సంపత్తి తనకు లేవని ,శివునిపై భారమేసి శతకం రాస్తున్నాని చెప్పాడు .ఆయన్నుసేవి౦చినవారి పాపాలుపోతాయి ,ఆయన స్మరణైక దాస్యమిమ్మని ,,ఆయన మహిమలు పొగడటానికి శక్యం కాదని ,ఆత్మలో ఆయన పాదాబ్జాలు కొలిచే భాగ్యమిమ్మని కోరుతూ ‘’రారా శైల నికేతనా వడిని సంరక్షించ’’అంటూ ఆయనలాంటి వారు లేరనీ ,’’రంగత్తు౦గ తరంగ గంగ ‘’ను సుమూర్ధం లో ,’’మకుటాగ్రం లో రోహిణీ పతిని దాల్చి శరణన్న వారిని వెంటనే కాపాడేవాడని స్తుతించాడు .ఎద్దు వాహనం క్రూరసర్పాలు హారాలు ధరించటం ఎందుకు నీ మిత్రుడు ధనాధిపతి కదా అన్నాడు .
‘’పరి పూర్ణుడవు ,నిర్వికల్పుడవు శోభా రమ్య దేహుండు ,విద్ధరుచిన్,ప్రాపగు దేవతా మణివి,ఆద్యంతాలు లేనివాడవు ‘’అని కీర్తించాడు .మూర్ఖుడైన వాడి జడాత్మను మార్చటానికియే విజ్ఞుడూ సమర్ధుడు కాడు.’’దక్షుం డద్వర మొప్ప జేయ నట దాక్షయణీపిల్వకే –నక్షుద్రోక్తి ని బోవ ,తారచట గర్వా౦ధ౦బున దూల ప్ర-త్యక్ష ప్రౌఢిని ప్రాణముల్ విడువ వీరావేశతన్ వీరభ –ద్రాక్షుద్ర స్థితి జంప జేసితివి కావా భీమలింగేశ్వారా ‘’అని క్షకార ప్రాసతో దక్ష యజ్ఞ ధ్వంసాన్ని కనులకు కట్టి నట్టు వర్ణించి శ్రీనాధుడు భీమ ఖండం లో క్షకార ప్రాసతో వ్యాసుడుభిక్షా పాత్ర నేలకేసికోట్టటం అన్నపూర్ణమ్మ పిలిచి పెట్టిన కమ్మని భోజనం గుర్తుకు తెచ్చాడు కవి . ,చీమకు ఏ వస్తువు కనిపించినా తన వారికి జాడలు చూపించినట్లు నాకూ దారి చూపించు ‘క్రీడా ఖేలన శైల కంధర హరా శ్రీ భీమేశ లింగేశ్వరా ‘’అని లోకోక్తిగా వేడుకొన్నాడు .సత్యమే జగత్తును ఉద్ధరిస్తుంది అదే మోక్షాన్ని,ఆన౦దాని యిస్తుంది .
‘’పద వైశద్యం అర్ధగౌరవం శోభారమ్యభావం కల చంచలాక్షి లాగా బుద్ధిబలం తో ప్రబంధాలను సత్పద వైశద్యంతో అర్ధగౌరవ శోభా రమ్యత తో రాసేవాడే కవి అన్నాడు ఈకవి ..’’కనులా కల్మష పూతిగంధజల ముక్త ద్వారకా చా౦కముల్ –చనులా క్షీర ప్రవాహ వాహయుగమాంస స్ఫారకంకాళముల్-వెనులా ?బంధుర శల్య సంచయ కళా వేశ్మైక చర్మా ధ్యముల్ –‘’అలాంటి వామాక్షులను కోరటం సబబా ?అని వేదాంత ప్రవచనం చేశాడు కవి .’’శివ ఈశాన పరాత్పరా వరద దాక్షి ణ్యైకభావా౦ బుధీ-పవమానప్రియ భాస్కరాబ్జ నయనా బాలేందు మౌళీహరా –భవమృత్యుంజయ పార్వతీ రమణ సౌభాగ్యప్రదాధీమణీ’’అని ఎలుగెత్తి స్తోత్రం చేశాడు ఆర్తిగా .చంద్రుడు ఏ చుట్టమయ్యా నీకు నెత్తికేక్కి౦చు కొన్నావ్ ?అని ఈసడింపుగా అన్నాడు .
‘’స్వర్ణ గ్రావము కార్ముకంబు రాజతక్ష్మా ద్రంబు వాసంబు –సంపూర్ణజ్యొత మణీప్రముక్త చాయ శంభూ తాబ్ది తూణంబుశ్రీ –పూర్ణ స్ఫారుడవై కరంబు సతతంబు న్ భిక్ష మందేగేదో-కర్ణ భ్రాజిత కుండలా తగునె ఏగన్ భీమ లింగేశ్వరా “’అని ‘’వాయించాడు’’ .పూలను రువ్విన వాడికి దేహం లేకుండా చేశావు .మరి రాళ్ళు రువ్వితే ఏం చేస్తావ్ (ఏం పీకుతావ్ )అని దేప్పిపోడిచాడు .నీటిలో వహ్నిలో కాష్టం లో బయలులో నీరేజం లో భూమిలో వాయువులో సకలప్రాణులలో సంక్రా౦త౦ ఎప్పుడూ ఉంటాడు శివుడు అని ఆయన విభూతిని కీర్తించాడు .అపరిచ్చిన్నం అద్వితీయం ఆద్యన్తశూన్యం అయిన బ్రహ్మం ఒక్కటే సదానందంగా వెలుగుతూ ఉంటుంది .అంటూ 88పద్యాలు చెప్పాడు .
89నుంచి ‘’శ్రీ భీమేశా వరద కవి నుతపద’’లోని మొదటి అక్షరాలతో 91వరకు పద్యాలు చెప్పాడు .99వ పద్యం లో –‘జయ సర్వేశ్వరా శాశ్వతా గిరిధరా సర్వం సహా వందితపదాచంచత్కటాక్షోదయా -జయకాత్యాయినీ నాయకా శశిధరా ,సంక్రందనాభ్యర్చితా –జయ మృత్యుంజయ జూలకల్లు పురవాసా భీమ లింగేశ్వరా ‘’అని పార్వతీ వల్లభుని స్తుతించి ,తర్వాత రెండుపద్యాలలో తనగురించి చెప్పి ‘’శ్రీ భీమ లి౦గేశ్వరార్పణ మస్తు ‘’అంటూ 101పద్యంతో శతకం ముగించాడు శానం పూడి వరద రాజ కవి .
చక్కని ధారా శుద్ధి విశుద్ధమైన భక్తీ తాత్పర్యాలు గొప్ప ఊహా ,కమనీయ కవిత్వం తో శతకం అత్యద్భుతంగా నడిచింది .భక్తులకు కొంగు బంగారం గా వెలసిన శతకమిది .దీన్ని గురించి, కవి గురించి మన మహానుభావుల దృష్టిలో పడి నట్లు తోచదు .ఈ కవినీ, శతకాన్ని పరిచయం చేసే మహద్భాగ్యం నాకు కలిగింది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 1 Comment

గ్రీకు ,సంస్కృత ,ఆంగ్ల ,తెలుగు నాటక దర్శకుడు ,నటుడు ,రచయిత,నూరేల్లతెలుగు నాటక రంగం

గ్రీకు ,సంస్కృత ,ఆంగ్ల ,తెలుగు నాటక దర్శకుడు ,నటుడు ,రచయిత,నూరేల్లతెలుగు నాటక రంగం సంపాదకులు ,రసమయి ,అప్పాజోష్యుల పురస్కార గ్రహీత –డా .మొదలి నాగభూషణ శర్మ
మొదలి నాగభూషణ శర్మ (జూలై 24, 1935 – జనవరి 15, 2019) రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక రచయిత, అధ్యాపకుడు, విమర్శకుడు, పరిశోధకుడు.[1]
జననం
నాగభూషణ శర్మ 1935, జూలై 24 తేదీన గుంటూరు జిల్లా, ధూళిపూడి గ్రామంలో జన్మించాడు.[2] ఇతని తల్లి కామేశ్వరమ్మ. తండ్రి సుబ్రహ్మణ్యశర్మ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.
రంగస్థల ప్రస్థానం
ఇతని తండ్రి కూడా స్వయంగా నాటక రచయిత, ప్రయోక్త, కథా రచయిత. అతని స్ఫూర్తి వల్లనే నాగభూషణ శర్మ నాటకరంగంలోకి వచ్చాడు. తండ్రి నేతృత్వంలో ఎనిమిదవ ఏటనే రంగస్థలంపై తొలిపాఠాలు నేర్చిన శర్మ కాలేజీ రోజుల్లో బందరులో కన్యాశుల్కం నాటకంలో మధురవాణి పాత్రను ధరించి పేరుపొందాడు. కళాశాలలో చదువుతుండగానే ఆయన తొలి రచన అన్వేషణ 1954లో భారతిలో ప్రచురితమైంది.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ ఆంగ్ల సాహిత్య పట్టభద్రుడై నాగభూషణ శర్మ, అమెరికా లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో నాటకదర్శకత్వంలో ఎం.ఎఫ్.ఏ పట్టా పొందాడు. నాటకమే ప్రధానాశంగా పరిశోధన చేసి డాక్టరేటు అందుకున్నాడు. ఆ తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు శాఖ లోను, నాటక శాఖ లోను ఆచార్యుడిగా పనిచేశాడు.
విదేశాలలో పర్యటించి, వివిధ నాటక ప్రయోగ రీతుల్ని అధ్యయనం చేసి శిక్షణ పొందాడు. నవల, నాటక సాహిత్యానికి చెందిన అనేక పరిశోధనాత్మక వ్యాసాలు పత్రికల్లో ప్రకటించాడు.
ది విజిట్, కింగ్ ఈడిపస్, హయవదన, తుగ్లక్, మృచ్ఛకటిక, వెయిటింగ్ ఫర్ గోడో వంటి గ్రీకు, సంస్కృత, ఆంగ్ల నాటకాలకు దర్శకత్వం వహించి హైదరాబాదు డ్రమటిక్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రదర్శించాడు. అడ్డదారి, పెళ్ళికి పది నిమిషాల ముందు, మదనకామరాజు కథ, ప్రజానాయకుడు ప్రకాశం వంటి స్వతంత్ర నాటకాలను, యాంటిగని, మాక్‌బెత్, డాల్స్‌హౌస్, ఎనిమీ ఆఫ్‌ది పీపుల్, ఎంపరర్‌జోన్స్, వెయిటింగ్ ఫర్ గోడో, కాయితం పులి, హయవదన, సాంబశివ ప్రహసనం వంటి గొప్ప పాశ్చాత్య, భారతీయ నాటకాలను స్వేచ్ఛానువాదం చేశాడు. ప్రజా నాయకుడు ప్రకాశం నాటకాన్ని దేశవ్యాప్తంగా ప్రదర్శించాడు.
విషాదాంతం, జంట పక్షులు, సంభవామి, నరజాతి చరిత్ర, మన్మధుడు మళ్లీ పుట్టాడు, రాజా ఈడిపస్ (అనువాదం), ప్రజానాయకుడు ప్రకాశం మొదలైన నాటకాలను, అన్వేషణ, అడ్డదారి, ఆగస్టు 15, జననీ జన్మభూమి, రాజదండం మొదలైన నాటికలను రచించాడు. ఈయన దాదాపు 70 నాటకాలు, నాటికలు, రేడియో నాటికలు వ్రాశాడు. స్వతంత్ర నాటకాలే కాక అనేక అనువాద నాటకాలు కూడా వ్రాశాడు. ఈయన దర్శకత్వంలో ఇరవైకి పైగా ఆంగ్ల నాటకాలు, అరవైకి పైగా తెలుగు నాటకాలు ఈయన దర్శకత్వంలో ప్రదర్శించబడ్డాయి.
తెలుగు సాహిత్యం- గాంధీజీ ప్రభావం, నూరేళ్ళ తెలుగునాటకరంగం (సంపాదకులు), లోచన (వ్యాస సంపుటి) వీరి ఇతర రచనలు. ‘ప్రకాశం’ నాటకానికి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం లభించింది. నాటక, కళారంగాల్లో విశేష కృషి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మక నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారానికి 2013 లో ఈయన ఎంపికయ్యాడు.[3] 2019, జనవరి 6న తెనాలిలో అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభా వైజయంతి జీవితకాల సాధన పురస్కారం అందుకున్నాడు.[1]
పురస్కారాలు
1. రసమయి రంగస్థల పురస్కారం (2017)[4]
మరణం
నాగభూషణశర్మ 2019, జనవరి 15న తెనాలిలో మరణించారు
నాటకాన్ని శ్వాసిస్తూ, నాటకం ఔన్నత్యాన్ని స్వప్నిస్తూ ఆ రంగానికి ఏడుపదుల కాలాన్ని అంకి తం చేసిన మహనీయుడు ఆచార్య మొదలి నాగ భూషణశర్మ. కాలేజి రోజుల్లో కన్యాశుల్కంలో మధు రవాణి వేషంతో నటుడిగా నాటక కళాసేవ ఆరం భించి, నాటక దర్శకుడిగా, రచయితగా, అధ్యాపకు డిగా, పరిశోధకుడిగా నాటకానికి బహుముఖీన సేవ లందించారు. తెలుగు నాటకాలే కాదు, విదేశాల్లోని ఉత్తమ నాటకాలను అద్భుత ప్రయోగాలతో ప్రద ర్శించి, తెలుగు ప్రజలకు నాటకవిందు చేశారు. నాటక, గాయక ప్రముఖులపై పుస్తకాలను తీసుకొ చ్చారు. తోలుబొమ్మలాటను జపనీయుల కళ్లకు కట్టారు. తెలుగు డ్రామా అండ్‌ థియేటర్‌ చరిత్రను ఇంగ్లిష్, తెలుగులో రాయాలనే తపనతో కృషిచేస్తున్న తరుణంలో ఆయన కన్నుమూయటం తెలుగు నాటకానికి తీరనిలోటు.
ఆచార్య మొదలి నాగభూషణశర్మ (84) పూర్వీ కులది గుంటూరు జిల్లాలోని బ్రాహ్మణకోడూరు. తండ్రి సుబ్రహ్మణ్యశర్మ ఉద్యోగరీత్యా ఇదే జిల్లాలోని రేపల్లె దగ్గరగల ధూళిపూడిలో స్థిరపడ్డారు. అక్కడే 1935 జూలై 24న నాగభూషణశర్మ జన్మించారు. పాఠశాల దశనుంచే ఆయనకు రంగస్థలంపై అను బం«ధం ఏర్పడింది. విజయవాడ, బందరులో కాలేజి చదివే రోజుల్లో ఆ బంధం మరింత పెరిగింది. ‘మధుర వాణి’గా 50 ప్రదర్శనల్లో నటించారు. ‘భారతి’లో ప్రచురితమైన తొలి నాటకం ‘అన్వేషణ’ రాసిందీ ఆ రోజుల్లోనే. హైదరాబాద్‌లో ఎంఏ, పీహెచ్‌డీ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్‌ అధ్యాపకుడిగా చేరారు. కొంతకాలం తర్వాత అమెరికాలోని ఇల్లినాయ్‌ యూనివర్సిటీలో ఎంఎఫ్‌ఏ (థియేటర్‌) చేశారు. తిరిగి రాగానే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రారంభించిన థియేటర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ శాఖకు తొలి అధిపతిగా మొదలిని నియమించారు.
చాట్ల శ్రీరాములు, రాజా రామదాస్‌ వంటి నిష్ణాతులను అధ్యాపకులుగా చేర్చుకుని, నాటకకళ వికాసానికి నాగభూషణ శర్మ శ్రద్ధపెట్టారు. పలు నాటకాలనే కాదు, ఆచార్య ఆత్రేయ నాటకోత్సవాన్ని విజయవంతంగా ప్రదర్శించారు. నాటకరంగ ప్రము ఖులు డీఎస్‌ఎన్‌ మూర్తి, తనికెళ్ల భరణి, తల్లావ ఝుల సుందరం, భిక్షు, భాస్కర్, హవల్కర్, విద్యా సాగర్, జీఎస్‌ ప్రసాద్‌రెడ్డి వంటి ప్రముఖులు ఉస్మా నియా థియేటర్‌ ఆర్ట్స్‌ శాఖ నుంచి పట్టాలు తీసు కున్నవారే. 1988లో సెంట్రల్‌ యూనివర్సిటీలో సరోజినీనాయుడు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ ప్రారంభమైనపుడు శర్మ తొలి డీన్‌గా నియమితుల య్యారు. ఆ స్కూలును కళల వికాసానికి అనువైన దిగా రూపుదిద్దారు శర్మ.
మరోవైపు నాటకరచన, దర్శకత్వం బాధ్యత లను అపూర్వంగా నిర్వహించారు. తెలుగులో 60, 28 ఇంగ్లిష్‌ నాటకాలకు దర్శకత్వం వహించారు. విదేశీ భాషలకు చెందిన అనేక కళాఖండాలను తెలు గులోకి అనువదించి, ప్రదర్శింపజేశారు. వీటిలో ‘రాజా ఈడిపస్‌’, ‘ది విజిట్‌’, ‘మ్యాడ్‌ విమెన్‌ ఆఫ్‌ చల్లియట్‌’, ‘హయవదన’, ‘మృచ్ఛకటిక’ వంటి నాటకాలు ప్రముఖమైనవి. వీటిలోని ప్రయోగాలు అనితరసాధ్యం. హైదరాబాద్‌లోని రసరంజని సంస్థకు అనేక నాటకాలను ప్రదర్శించారు. వీటిలో టంగుటూరి ప్రకాశం పంతులు ఆత్మకథను ‘ప్రజా నాయకుడు ప్రకాశం’ నాటకంగా, తన దర్శకత్వంలో రాష్ట్రమంతా ప్రదర్శించారు. హెన్నిక్‌ ఇబ్సెన్‌ నాటకం ‘డాల్స్‌ హౌస్‌’ తెలుగులో ‘బొమ్మరిల్లు’గా, బెర్టాల్ట్‌ బ్రెచెట్‌ ఇంగ్లిష్‌ నాటకం ‘తెల్లసున్నా’గా శామ్యూల్‌ బకెట్‌ రచన ‘దేవుడయ్యి వస్తాడట’ పేరుతోనూ తన దర్శకత్వంలోనే ప్రదర్శనలకు సిద్ధంగా ఉంచారు.
సాహిత్యం, కళలు, జానపదం, నాటకం, అను వాదాలు, విమర్శలు… ఇలా అన్ని ప్రక్రియల్లోనూ 14 పుస్తకాలు రాశారు. 1975లో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ జానపద కళోత్సవాల కోసమని నటరాజ రామకృష్ణతో కలిసి 300 గ్రామాలు తిరిగి 750 మంది కళాకారులను ఆ ఉత్సవంలో పాల్గొనేలా చేశారు. 64 కళారూపాలను ‘ఫోక్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ ఆఫ్‌ ఆంధ్ర ప్రదేశ్‌’ పుస్తకంగా తీసుకొచ్చారు. తోలుబొమ్మలాట బృందాన్ని జపాన్‌ తీసుకెళ్లి 15 పట్టణాల్లో ప్రదర్శిం పజేశారు. నాటకరంగ సేవలకుగాను నాగభూషణ శర్మ కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని, రాష్ట్ర ప్రభుత్వ ఎన్టీఆర్‌ రంగస్థల పురస్కారాన్ని, గతేడాది ‘కళారత్న’ గౌరవాన్ని స్వీకరించారు. ఈనెల 6న తెనాలిలో అజో–విభొ– కందాళం ఫౌండేషన్‌ వారి ప్రతిభా వైజయంతి జీవితకాల సాధన పుర స్కారాన్నిఅందుకున్నారు.మీ -గబ్బిటదుర్గాప్రసాద్ 2-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

శ్రీ భీమ లింగేశ్వర శతకం -1

శ్రీ భీమ లింగేశ్వర శతకం -1

పల్నాడు తాలూకా జూలకల్లు గ్రామవాసి శ్రీ శానం పూడి వరద కవి శ్రీ భీమేశ్వర లింగ శతకం రాసి ,వినుకొండ తాలూక ముప్పాళ్ళ గ్రామస్తులు శ్రీ కాకుమాను కాశీ విశ్వానాథం ఆర్ధిక సహకారం తో గుంటూరు కన్యకా ముద్రాక్షర శాలలో శ్రీ పెండేల చక్రపాణి సోదరుల చే 1924లో ముద్రించారు .’’కృతి గ్రహింపు ము బిడ్డలకింపు నింపు –దీవెనలు సల్పి మనుపుము దీర్ణమతిని –రామయామాత్య గృహిణి సాధ్వీమతల్లి –విష్ణు పద రోలంబ వేంక మాంబ’’అని శ్రీమతి వే౦క మాంబ కు అంకితమిచ్చారు .

  భూమిక లో కవి వచనం లో తాను  జూలకంటి భీమేశ్వరుని పేర ఒక శతకం రాయటానికి 28-8-1922 న పూనుకొని పది పద్యాలురాసి ,తీవ్రమైన వ్యాధితో పది నెలలు ఇబ్బందులు పడి,వ్యాధి నివారణ పొందాక మళ్ళీ ఉత్సాహంతో మొత్తం 50పద్యాలు రాసి ,మేళ్ళ వాగు స్కూలు నుంచి ముప్పాళ్ళ స్కూలు కు బదిలీ అయి తృతీయ ప్రధానోపాధ్యాయుడై ,కొద్దికాలం లోనే శతకం పూర్తీ చేసి శ్రీ భీమ లింగేశ్వరుని సమర్పించి నట్లు చెప్పాడు కవి .

  అందులోనే దేవాలయ చరిత్ర గురించి చెబుతూ పల్నాడు తాలూకా జూలకల్లు లో శ్రీ భీమేశ్వర స్వామి వెలసి ఉన్నాడని ,కాకతి రాజులు ప్రతిష్ట చేశారని చెప్పే శిలా శాసనాలున్నాయని ,నిత్యపూజాదికాలు ఉత్సవాలు జరపటానికి తగిన భూ వసతి కూడా కల్పించారని ,ఆ గ్రామం లో ని గుంటుపల్లి వారు ఆలయాన్ని శ్రద్ధా భక్తులతో నిర్వహిస్తున్నారని చెప్పారు. ముప్పాళ్ళ వాసి వైశ్యకుల ప్రముఖులు శ్రీ కాకుమాను కాశీ విశ్వనాథం  ఈ శతక ముద్రణకు కావలసిన ధన సహాయం చేశారనీ ,వారు ,వారి వంశీకులు ఆ చంద్ర తారార్కం గా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరారు .శ్రీ కింతాడ వీరభాద్రాచారి కవి గారి కృషిని పద్యం లో అభినందించారు .

  శతకం లో మొదట వంశ వర్ణ చేశాడు కవి .మొదటి సీసపద్యం లో శ్రీ ఆది నారాయణ స్వామిని స్తుతించాడు .తర్వాత వైశ్య వర్ణం ఏర్పడిన విధానం ,కాకుమాను వారి వంశం గురించి చెప్పి వారిది నాభిళ్ళ గోత్రం అనీ అందులో బసవయ్యగారు ప్రముఖులనీ ,ఆయన భార్య శాయమ్మ అనీ ,వారికి ఆరుగురు పుత్రులని ,అందులో రంగయ అనంతమ్మను పెళ్లాదాడని , వీరి సంతానం లో పట్టాభి రామయ్య దంపతులకు కలిగిన కాశీ విశ్వనాధం కనకా౦బను పెళ్ళాడి ,ఆమె కొద్దికాలానికే చనిపోతే ఆమె చెల్లెలు అన్నపూర్ణను ద్వితీయం చేసుకొని గొప్ప శ్రీమతుడై దాతగా కీర్తిపొంది,ఈ శతకాన్ని ముద్రించటానికి ధనం అందించాడు .తర్వాత కవిగారు ఆయనకు పద్యాశీస్సులు వర్షించారు.

  శ్రీ గోపాలుని హనుమంత రాయ శాస్త్రి ,అష్టావధాని శ్రీ పోతరాజు లక్ష్మీ నరసింహకవి పద్యాలతో కవిని అభినందించారు .

 కవిగారు ముందుగా ‘’శ్రీ మన్మహా దేవ దేవేశ  -సోమార్ధ జూటాగ్ర-భూమీధరాధీశ కన్యా మనః పద్మ షట్పాద-శ్రీదా-సుధా ధామ మందార –బృందారకాధీశ దంతావళ శ్రేష్ఠ దుగ్దోధదీ ట్కుంద-డి౦డీర ధావల్యకీర్తుజ్వలా ‘’అంటూ దండకం మొదలుపెట్టి ‘’క్రూర రాత్రి౦చరధ్వంస –శ్రీ జూలకల్వాస శ్రీ భీమ లింగేశ –నే దండకంబొండు,నీనామ రూపంబులన్ జేసి యర్పించితిన్ –దీని రత్నోరు హారంబుగా దాల్పవే –నాపయిన్ నీ కృపన్ నిల్పవే –శూల హస్తా –నమస్తే నమస్తే నమస్తే నమః ‘’అని భక్తి చిప్పిలేట్లు ముగించాడు .మత్తేభ ,శార్దూల పద్యాలతో ‘’భీమ లింగేశ్వరా ‘’మకుటంతో రాసిన పద్య శతకం ఇది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-6-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -10(చివరి భాగం )

జయశంకర ప్రసాద్ -10(చివరి భాగం )

కామాయిని కావ్య సంశ్లేషణం -4(చివరిభాగం )

సామూహిక హత్యతో ఉన్న ‘’సంఘర్షణ పర్వం ‘’పూర్తయ్యాక ,’నిర్వేద సర్గం ‘’మొదలౌతుంది .మనువు శరీరమంతా గాయాలే .గ్లాని తో ఉన్న ఇడ అతన్ని చూసి పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటుంది .అసహ్యం –మమతల మధ్య అంతర్ సంఘర్షణ లో కకా వికలమౌతుంది .శ్రద్ధ కొడుకుతోసహా అక్కడికి వస్తుంది .ఆమె మాటలు అంతటా ప్రతిధ్వనిస్తాయి .అతనిలో రేగిన తుఫాను గమనిస్తుంది .వ్యాకులం లో మేల్కొనే ఉన్న మనువు ఎక్కడికో పరిగెత్తి పోతాడు .దర్శన్ సర్గ లో కొడుకును ఇడకుఅప్పగించి ఆమె అతని కోసం పరిగెత్తిపట్టుకొంటు౦ది . ఇడ తన హృదయబాధను శ్రద్ధకు తెలియజేస్తుంది .విరహం ,కలయిక నిత్య నిరతమైన ఈ జగత్తు నిత్య చితి రూపం అని పిస్తుంది .శ్రద్ధ కొడుకును అక్కున చేర్చుకొని ‘’సౌమ్యుడా !ఇడ నిర్మలానురాగం నీ దుఖాన్ని హరిస్తుంది .నువ్వు ఆలోచనా పరుడవు .మానవ సౌభాగ్యానికి భూమిక తయారు చేయి .సమరసభావాన్ని చాటు’’అని బోధిస్తుంది . .

  శ్రద్ధ మనువును కలుస్తుంది .ఆమె ‘’లోకాగ్ని లో కాలి కరిగిన ,మూసలో పోసిన విశ్వామిత్ర మాత్రు భూమిలా కనబడుతుంది .అతని రుణ విద్యుత్ ధన విద్యుత్ గా మారుతోందని చెబుతుంది .అతడు ఇప్పుడు స్వతంత్రుడు అని గుర్తు చేస్తుంది .కొన్నేళ్ళ క్రితం అక్కడే తాను అతనికి సర్వం సమర్పించు కొన్నాను అని చెబుతుంది .ఇద్దరం కలిసి శాంతి ప్రభాతం దగ్గరకు వెడదాం అంటుంది .

  తర్వాత అధ్యాయం ‘రహస్యం ‘’లో శ్రద్ధా ,మనువులు హిమాలయా రోహణం చేస్తూ౦డగా,మనువు అలసి పొతే ,ఆమె ధైర్యం చెప్పి ,ఎక్కడున్నామో చూడమంటే అతనికి ‘’మూడు అలోక బిందువులు ‘’కనిపిస్తాయి .ఆతడు మూడు లోకాల ప్రతినిధిగా ,అది ఇచ్చ జ్ఞానం క్రియల ప్రపంచం అని చెబుతుంది కామాయిని .అతడు ఆ త్రికోణ కేంద్ర బిందువు అనీ ,ఇచ్చాలోకం ఎర్రగా సుందరంగా జీవిత మధ్యప్రాంత౦ గా  ఉండి మధురలాలసతో కూడి మాయ రాజ్యం చేస్తుందని చెబుతుంది .రెండవ వృత్తాకారం కర్మలోకం .నియతి ,ప్రేరణ ప్రకారం ఇక్కడ చక్రం విరామం లేకుండా తిరుగుతుంది .ఇచ్చాలోకపు సుఖాలు ఇక్కడ దుఖాలుగా మారుతాయి .ఇక్కడ నిరంతర పోరాట వైఫల్యాలు కోలాహలం రాజ్యమేలుతాయి .భయపడి మూడవ లోకం గురించి అడుగుతాడు .అది జ్ఞాన క్షేత్రమని ,నిర్మలత్వం ఉదాసీనత ఇక్కడ ఉంటాయని ,అక్కడి మరుభూమిలా ఎండిన నది మెరుపుతో సమానమని ,ఇక్కడి మనుషులు భ్రమతోకూడిన శాంతి నెలకొల్పుతారు .శాస్త్ర పరిరక్షణ వారి బాధ్యత అని తెలియజేస్తుంది .దివ్య అనాహత నినాదం లో –శ్రద్ధాయుతుడైన మనువు తన్మయు డౌతాడు ‘’.

   ఆనంద సర్గ ఉపసంహార సర్గ .మానససరోవరం వైపు వెళ్ళే యాత్రిక సమూహం కనిపిస్తుంది .ఆ సమూహం లో మనువు శ్రద్ధా ఇడా,మనువు పుత్రుడు మానవుడు కూడా ఉన్నారు .మానససరోవరం చేరి అక్కడ మనువు ధ్యానమగ్నుడౌతాడు .అందరూ పరమ పవిత్ర భావనకు లోనౌతారు .శ్రద్ధ ఒడిలో కొడుకు మానవుడు ఉంటాడు .పాదాలవద్ద ఇడ నత మస్తక అయింది .కైలాసాన్ని చూపిస్తూ మనువు ‘’రెండు అనే భావనే విస్మృతి .ఈ అద్వైతాన్ని చూడండి ‘’అంటాడు –‘’నేను అనే చేతనా –అందర్నీ స్ప్రుశిం చేలా –అన్ని విభిన్న పరిస్థితుల –మత్తు గుటక తాగినట్లుగా ‘’ఉందన్నాడు .ఈ దృశ్యం లో కామాయిని ‘’ఈ జగతి ఏకైక మంగళకరమైన కోరిక గా ‘’కామం సంపూర్ణ ప్రతిమలా ,విశ్వ చైతన్యం పులకింత గా వర్ణించాడు జయశంకర ప్రసాద్ .-‘తనదంటూ ఉన్న ఒక కళలో –జడ చేతనాలు సమరసంగా ఉన్నాయి –సౌందర్యం రూపు దాల్చి –చైతన్య విలసితమైంది –గాఢ మైన ఆనందం అఖండం ‘’అంటాడు ప్రసాద్. ఆ ఆనంద సంగీతమే అన్నిటా ప్రతిధ్వనిస్తుంది .మానవ పరిణతి ఆశించి రాసిన కావ్యమే కామాయిని .

  ఆధారం –రమేశ్ చంద్ర శాహ రచనకు డా ఎ బి సాయి ప్రసాద్ చేసిన తెలుగు అనువాదం ‘జయశంకర ప్రసాద్ ‘’పుస్తకం .

  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -31-5-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్

జయశంకర ప్రసాద్ -9
కామాయిని కావ్య సంశ్లేషణం -3
లజ్జ అధ్యాయం తర్వాత కథ త్వరత్వరగా జరిగిపోతుంది .ఆత్మ విశ్వాసం మేల్కొన్న మనువు యజ్ఞం చేస్తాడు .కాని యజ్ఞ విధానం మర్చి పోవటంతో ఒక పురోహితుడు అవసరమై అకులి ,కులాతుడు అనే ఇద్దరు ఆసుర వచ్చి కామాయిని గారాబంగా పెంచుకొన్న జింకపిల్లను కూడా బలి ఇవ్వటానికి సిద్ధపడి,మనువును ఒప్పిస్తారు .తిరిగి వచ్చిన శ్రద్ధ ఈ దృశ్యాన్ని చూసి తట్టుకోలేక పోతుంది .ముందుముందు రాబోయే అరిష్టాలు తలచుకొని కుమిలి పోయి మనువును నిందిస్తుంది .అతడేవొఆదర్శాలు వల్లిస్తే ,తీవ్రంగా ఖండిస్తుంది .సృష్టి అనేది భగవంతుడు నిరాఘాటంగా నిరంతరంగా సాగించే యజ్ఞమని ,సృష్టి వికసనం లో మానవుడు సహభాగస్తుడనీ,మనిషి ఈ బ్రహ్మాండానికి కేంద్రం కాదని హితవు చెబుతుంది .ఆమె తర్కానికి అతని వద్ద సమాధానం లేక పోవటం తో మనువు మౌనంగా ఉంటాడు .ఆమెతో ఏకీభవిస్తున్నట్లు నటించి సోమరస౦ గిన్నెను ఆమెకిస్తూ ‘’నువ్వు చెప్పినట్లే చేస్తా ‘’అంటాడు .అతడిని నమ్మి సోమరసం అమాంతంగా తాగేస్తుంది .
ఎనిమిదవ అధ్యాయం లో నాయకుడు మనస్తత్వ వేత్త అయిన ఆయన ఈర్ష .శ్రద్ధ గర్భం దాలుస్తుంది .ఆమెలో ఉండే ఆకర్షణ అందం చంచలత్వాదులు క్రమంగా తగ్గిపోయి ,అతని మనసు మారటం ప్రారంభమౌతుంది.అసుర పురోహిత ప్రభావం తో మనువు పూర్తిగా మారిపోతాడు .వేట వ్యసనం అవుతుంది .పేరాశ పెరిగి అసంతృప్తి చోటు చేసుకొంటుంది .శ్రద్ధ మాతృ సౌందర్యం అతడిని కాల్చుకు తింటుంది .గార్హస్త్యం గుది బండ అనుకొంటాడు .ఎందుకు విచ్చలవిడిగా ఉండకూడదు అని తర్కిస్తాడు .
‘’ఇడా ‘’ పేరున్న తొమ్మిదవ అధ్యాయం లో సారస్వత దేశం లో మనువు సరస్వతి నదిఒడ్డున ఒంటరిగా ఉంటాడు .దేవతల నాగరకతకు శంకు స్థాపన జరిగిన ప్రదేశం అది .ప్రస్తుతం ఊసర క్షేత్రం అయింది .దేవాసుర యుద్ధాలు గుర్తుకొచ్చి ,అసురులు శరీరాన్ని పూజించటం ,దేవతలు అహంకారం తో తమరినే ఆత్మగా భావించటం గుర్తుకొస్తుంది .నిజమైన ఆత్మజ్ఞానం లేకుండా దేవరాక్షసులు ఉండిపోయారు .ఇద్దరూ వంచితులై పోరాటానికి దిగారు .సంస్కార బీజాలు నిర్మూలనం కాకపోగా తిరిగి పుట్టి ,శ్రద్ధను పరిత్యజించటం దాకా సాగింది .మనువు మనసును కామభావన తొలి చేస్తూ ‘’ఆ సౌందర్య సాగరం లో నువ్వు గరళపాత్రనే ని౦పుకున్నావు ,నీ ప్రజాహితభావాలు కలుషితమయ్యాయి ,భవిష్యత్తులో కూడా కోపిష్టిగా నే ఉంటావు ,నిజమైన శ్రద్ధ రహస్యాన్ని ప్రజలు మర్చి పోతారు ,స్వర్గం ఎక్కడో లేదు .ఈ భూమి కళ్యాణ వేదిక .అది తన అతిక్రమణలో సహజ రహస్యాన్ని మరచి పరలోక వంచనకు గురౌతుంది .బుద్ధి భ్రాంతిలో కొట్టుమిట్టాడుతుంది .’’
తర్వాత మనువు బుద్ధికి ప్రతీక అయిన ‘’ఇడ’’ను కలుస్తాడు .ఆమె ఒకప్పుడు రాణిగా ఉండి పాలించిన ప్రాంతం అది .అతని వ్యధ విన్న ఆమె అతడు పరిపూర్ణుడు అని ,అతడికి కావాల్సిన సహాయమతడే చేసుకోవాలని ,,సకల ఐశ్వర్యనిలయ ప్రకృతి అతనికోసం నిరీక్షిస్తోందనీ ,కంటికి కప్పిన పొర తొలగించు కోమని ,అందర్నీ శాసిస్తూ యోగ్యతలు విస్తరించు కోమని ,అతడే నిర్ణాయకుడు ‘’అని బోధిస్తుంది ఇడ.
పదవ అధ్యాయం లో శ్రద్ధకు ఒక కలవస్తుంది .అందులో సారస్వత దేశం లో మనువు ఇడ తో కలిసి పాలిస్తున్నట్లు ,సంస్కారయుత నాగరకతను సృష్టిస్తున్నట్లు అవన్నీ చూస్తూ ఒక ఆశ్చర్యకర మహలు లో ప్రవేశించినట్లు అక్కడ సింహాసనం పై మనువు ను చూసినట్లు ,ఇడఅతనికి మధుపాత్ర అందిస్తున్నట్లు ,అతడు ఆమెతో ‘’ఇంత సుందర హర్మ్యం నిర్మించానుకానీ ఇక్కడ నా హృదయ మందిరం లో ఎవరుంటారు ?’’అని అడిగినట్లు ,జవాబుగా ఇడ’’నేను నీ ప్రజలలోని ఆర్తి ని ‘’అన్నట్లు ,కామంద మనువు ఆమెను బాహువులలో బందించినట్లు ,భయకంపితయై ఆమె అతడిని తోసేసినట్లు ,అతడి చేస్ట అక్కడ అల్లకల్లోలం సృష్టించినట్లు ,బాధిత ప్రజాసమూహం అతనివైపు విపరీతమైన కోపంతో రావటం ,ప్రజలు తిరగ బడుతున్నారనే భయంతో మనువు ప్రధాన ద్వారాన్ని మూసేయించటం ‘’కలలోస్పష్టంగా చూసింది శ్రద్ధ .
ఆమె కల నిజమే .సారస్వత దేశ ప్రజలు బాధలు పడుతూ ఉంటారు మహల్ లో మనువు ఆలోచిస్తూ ఉంటాడు .సాను సర్వాధికారినని ప్రజలకు అనేక మేళ్ళు కలిగించాననీ,అయినా వారికి విశ్వాసం లేదని అనుకొంటాడు . ఇడఅక్కడికి వచ్చి ‘’శాసనం చేసినవాడే ఉల్లంఘిస్తే వాడికిసర్వనాశనం తప్పదు .ఏప్రజాపతీ ఇప్పటిదాకా హద్దు లేని అధికారం అనుభవించలేదు .ఇక ముందు కూడా అనుభవించడు ‘’అని స్పష్టంగా చెప్పింది –‘’రాగం తాళం పాటించిన లయను తప్పిపోనివ్వకు –తెలియకుండానే నువ్వు వివాద స్వరాన్ని వదలకు ‘’అని హెచ్చరిస్తుంది .
మనువు ప్రతిక్రియ ఉగ్రరూపం దాలుస్తుంది .ఇడను’’ మాయావి ‘’అని దూషిస్తాడు .ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాడు .సింహద్వారం తెరుచుకొంటుంది .ప్రజలు లోపలి ప్రవేశించి ‘’నువ్వే లోభగుణాలను నేర్పావు .యంత్రాలు ప్రవేశపెట్టి మాసహజ శక్తులను ధ్వంసం చేశావు ‘’అని కోపంగా విరుచుకు పడగా తోక తొక్కిన పాములా,క్రోధం తో ఊగిపోయాడు .’’ప్రకృతి చేతిలో కీలు బొమ్మల్లారా ‘’అంటూ నిందిస్తాడు .ఆకులి, కిలాతుడు ఈతిరుగు బాటుకు నాయకత్వం వహించటం చూసి ఆశ్చర్యపోతాడు .వాళ్ళను ధరాశాయిలుగా మార్చి ఆఘర్షణలో మనువు కూడా గాయపడతాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-5-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -8

జయశంకర ప్రసాద్ -8

కామాయిని కావ్య సంశ్లేషణం -2

 కామాయిని రెండవ సర్గ పేరు ఆశ .ప్రళయ కాళ రాత్రి తన వికృత స్వరూపం చూపించి నీటిలో అదృశ్యమౌతుంది .ఉషస్సు తన బంగారు కిరణాలతో జయలక్ష్మిలా ఉదయిస్తుంది .ఇందులో మనుషుల అంతరంగాన్ని బయట పడేస్తాడు కవి జయశంకర ప్రసాద్ .హిమ ఆచ్చాదం తొలగి భూమి నెమ్మదిగా బయట పడింది .వనస్పతులు మత్తుగా లేచాయి .ప్రకృతి చైతన్యమైంది .జలధి తల్పం పై భూమి పెళ్ళికూతురు రాత్రి కోలాహల జ్ఞాపకాలతో అలిగి ఒదిగి కూర్చుంది .ఈ ప్రళయం వెనక ఉన్న శక్తి ఏది ?అనే ప్రశ్న వచ్చింది .దేవతాశక్తి అయిన పకృతి శక్తి అని సమాధానం దొరికింది .దైవత్వం ఒక భ్రమ మాత్రమే .మనం తోలు బొమ్మలమే అనే భావం కలిగింది .ప్రకృతికి కావాల్సిన జీవరసాన్ని ఎవరిస్తున్నారు ?ఆ అస్తిత్వం ఎక్కడుంది ?ఎవరి ఆజ్ఞల్ని గ్రహనక్షత్రాలు పాటిస్తున్నాయి ?మనువుకు ఈ అస్తిత్వపు చిరు సవ్వడి వినిపిస్తుంది .అది అనంత రమణీయం .దీనితో లోలోపల ఒక మెలకువ కలుగుతుంది –‘’వరం లాంటి భావం నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది .నేను ఉంటానని నేనూ స్వరం కలిపాను ‘’

  ఈ జిగీష తర్వాత మనువు ఒక గుహలో నుంచి తన జీవిత చర్చ చేస్తాడు .జీవితానుభవం ఒక యజ్ఞ రూపం లో కనిపిస్తుంది .అది ఆయన నిత్యజీవితం లో అంతర్భాగమే అయిపోతుంది .అనుభూతి చింతనలు క్రమంగా విస్తరించి అంతర్జగత్తును ఆవిష్కరిస్తాయి .ఒంటరిగా ఉన్నానన్న తీవ్రభావన ఆయన్ను కలవర పెడుతుంది  .

   శ్రద్ధా సర్గ లో కవి సుందర ఛందస్సులా మనువు శ్రద్ధను దర్శిస్తాడు .ఆమె వేసిన జిజ్ఞా పూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ‘’నేను భూమ్యాకాశాలమధ్య నిరపాయంగా వేలాడుతున్న జీవన రహస్యాన్ని విస్మృతి చైతన్య రహిత స్తూపాన్ని ‘’అని పరిచయం చేసుకొంటాడు .ఆమె అతని గుండెల్లో ఆశ రేపుతుంది .’’శ్రుణ్వంతు విశ్వే అమృతస్య పుత్రః ‘’లాంటి ధైర్యాన్నిస్తాడు .ఆమె అతడిని ‘’చేతన సుందర చరిత్ర లాంటి అఖిలమానవ భావ సత్యం వైపుకు ఉన్ముఖుడిని చేస్తుంది .ఆమె సాంగత్యం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది .మధుమాస అనుభూతి కల్గిస్తుంది .మోహం మొలకెత్తుతుంది .ఒకరాత్రి కలలో ‘’కామం ‘’స్వరం వినిపించి ,సృష్టిలీలను ప్రేరేపించే మూలశక్తి అయిన ప్రేమకళను పరిచయం చేస్తుంది .దాన్ని పొందే యోగ్యత సాధించమని మనువు మనసు బోధిస్తుంది .

‘’వాసన ‘’అనే నాలుగవ అధ్యాయం లో మను –శ్రద్ధ ల సహజీవనం తళుక్కుమంటు౦ది .తర్వాత అతడి ఈర్ష్య ,అధికార దర్పం వ్యక్తమౌతాయి .ఇందులో స్త్రీ పట్ల పురుషుడి కోరిక మేల్కోవటం దాని అభి వ్యక్తీ దృశ్యాలు ఉంటాయి .శ్రద్ధ లోని స్త్రీత్వం కొంత చలిస్తుంది –‘’నారీత్వపు ఆ ఆది మధురాను భావం –నాలో పె౦పొందిస్తోంది అనురాగం –మధుర క్రీడా చింతనతో ఉత్సాహం మీటగా పలికి౦ది ఆనందం తో హృదయం ‘’అంటుంది .

  ‘’లజ్జ ‘’అధ్యాయం లో   స్త్రీ హృదయపు అత్యంత సూక్ష్మ గుణగణాలపై రాయబడింది..సమర్పణకు ముందు అంతర్ జగత్ భావ సృష్టి ,దాని కార్యకలాపాలతో కూడిన సంవేదనాత్మక సృష్టి హిందీ సాహిత్యం లో అంతకు ముందు లేనే లేదు .ప్రసాద్ కవిత్వం మంత్రం ముగ్ధుల్ని చేస్తుంది .’’ది ఆఫుల్ డేయరింగ్ ఆఫ్ ఎ మూమెంట్స్ సరెండర్  ‘’అన్నాడు ఆంగ్లకవి .స్త్రీ హృదయం దృష్టిలో ఈ సమర్పణ భావం తీవ్రంగా హృదయానికి హత్తుకోనేట్లు చిత్రించాడు ప్రతిభతో ప్రసాద్ .చాయావాదకవిత్వం రాసిన జయశంకర్ సర్వ శ్రేష్ఠ ఐంద్రియ కవిత్వమూ రాసి సవ్యసాచి అయ్యాడు .-‘’కోమల కిసలయాల కొంగులో –దాగిన అతి చిన్నారి మొగ్గలా-సాయం కాల దుమ్ము తెరలో –ప్రకాశించే దీప స్వరంలా –మెరిసే మనసు ఉన్మాదంలా-సురభిత అలల నీడలలో –బుడగ వైభవం చిమ్ముతోంది –సరస వసంత కుతూహలంలా –కనులనిండిన నీటితో ఉంది ‘’.

  లజ్జ లో స్త్రీకి అధిక ప్రాధాన్యమిచ్చి భారతీయతకు అద్దంపట్టాడు జయశంకర్ .’’సౌందర్యం అని దేన్నీ అంటారో –ఎవరిలో అది ఎప్పుడూ జాగృతమౌతుందో –ఆ చపలత్వ ధాత్రినేను-తగలబోయే దెబ్బలని నిదానంగా తెలియజేస్తాను’’ .ఇందులో మనసుయొక్క జ్ఞాన సరసత్వం ,దాని అనుభవ పరిపక్వత స్పష్టం చేస్తాడు కవి –‘’ఎప్పుడూ జాగృతి కోరను –కదలను మెదలను –పిచ్చివానిలా ఆలోచించ లేక పోతున్నాను –పురుష తరువు పరిష్వంగం లో –లతలా ఉయ్యాలలూగుతున్నాను .’’ఆమె లోని ఈ అంతర్ నాట్యం వ్యాఖ్యానం చేస్తుంది .దీనితో పాఠకులు ఒక ఆశ్చర్యకర ఆట౦కాన్ని అనుభవిస్తారు .-‘’ఈ అర్పణలో ఏ ముంది ?త్యాగం పోగు మాత్రమె –ఇచ్చి ,బదులుగా మరేదీ తీసుకోలేను’’అంటుంది .ఇందులో    యేట్స్ కవి రాసిన’’ క్రేజీ గన్ ‘’లో లాగా ‘’హోల్ నెస్’’ను సంపూర్ణత్వం తో సమర్పణ చేసిందని పిస్తుంది .అధ్యాయం చివర్లో –‘’ఓనారీ!నువ్వు కేవలం శ్రద్ధవు –విశ్వాసం వెండికొండ బాటలపై-జీవితపు ఈ సుందర సమతలం పై –పీయూష ధార గా ప్రవహించు ‘’.ఇక్కడే ఇలియట్ రాసిన ‘’వేస్ట్ లాండ్’’  కావ్యం గుర్తుకొస్తుంది .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-5-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరస భారతి 165వ కార్యక్రమం గా ‘’సాహితీ పుష్కర మహోత్సవం ‘’ –(బులెటిన్ -2)

సరస భారతి 165వ కార్యక్రమం గా ‘’సాహితీ పుష్కర మహోత్సవం ‘’ –(బులెటిన్ -2)

సాహితీ బంధువులకు శుభ కామనలు –

సరసభారతి స్థాపించి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా ,సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారి ‘’సహస్ర చంద్ర మాసోత్సవం ‘’’’సందర్భంగా

27-6-2022 సోమవారం సాయంత్రం 4 గం.లకు సరసభారతి 165వ కార్యక్రమంగా ‘’సాహితీ పుష్కరోత్సవం’’,ఉయ్యూరులోని టాక్సీ స్టాండ్ వెనుక ఉన్న ‘’శాఖా గ్రంధాలయం నందు ( A/C లైబ్రరి )నిర్వహిస్తున్నాము .ముఖ్య కార్యక్రమాలు –

1-శ్రీమతి ఏలేశ్వరపు రాధికా సుబ్రహ్మణ్యం (మచిలీ పట్నం )గారిచే ‘’సంగీత విభావరి ‘’

2-శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించిన ‘’అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి రామయ్య ‘’కు ‘’ఆంగ్లానువాద పుస్తకం ‘’ ఆవిష్కరణ –ఆవిష్కర్త శ్రీ వై విబి రాజేంద్ర ప్రసాద్ – శాసనమండలి మాజీ సభ్యులు .

3-  కోరకుండానే సరసభారతి కి విరాళాలను అందించిన వదాన్యులైన శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా ) ,శ్రీ సుంకర కోటేశ్వరరావు(హైదరాబాద్ ) ,డా ఆకునూరి రామయ్య శ్రీమతి కృష్ణ మయి దంపతులు (అమెరికా )డా.రాచకొండ నరసింహ శర్మ(విశాఖ పట్నం ) ,శ్రీ వేలూరి వివేకానంద్ (హైదరాబాద్ ),శ్రీ కోమలి సా౦బావధానిశ్రీమతి విజయలక్ష్మి దంపతులు (అమెరికా )శ్రీ పువ్వుల నరసింహారావు ,శ్రీమతి కరుణానిధి దంపతులు (ఉయ్యూరు ),శ్రీ వేలూరి మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి విజయ లక్ష్మి దంపతులు (అమెరికా )శ్రీ జగదీశ్ శ్రీమతి లక్ష్మి దంపతులు (అమెరికా )షార్లెట్ సరసభారతి మొదలైన వారి   సౌజన్యంతో సాహితీ క్షేత్రం లో అపూర్వ సేవలు అందించిన –ఆధ్యాత్మిక ప్రవచన ప్రముఖులు బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి (చీరాల ),అవధాన రవళి శ్రీ ఆముదాల మురళి (తిరుపతి ),బాలసాహిత్య శ్రీ శ్రీ బెల్లంకొండ నాగేశ్వరరావు (చెన్నై) ,అపూర్వ కథా రచయితశ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మ (నరసరాపేట ),రమ్యభారతి సంపాదకులు ,శ్రీ చలపాక ప్రకాష్ (విజయవాడ ),64 కళల నిపుణ శ్రీ వై.కళాసాగర్ (విజయవాడ ),సోషల్ రిసెర్చ్ పయనీర్  డా .ఎన్ .భాస్కరరావు(ఢిల్లీ) వివిధ సాహిత్య ప్రక్రియల నిపుణ  డా.  చిల్లర భవానీ దేవి (హైదరాబాద్ ),ప్రపంచ పర్యాటకురాలు గ్రంథకర్త,క్రీడాకారిణి డా.  నోముల నర్మదా రెడ్డి (హైదరాబాద్ ),ప్రముఖ సాహితీ వేత్త శ్రీమతి మైలవరపు అరుణ కుమారి(గుంటూరు ), బాలఅష్టావధాని  చి.ఉప్పలధడియం భరత శర్మ(తిరుపతి ) స్థానిక చరిత్ర పరిశోధకులు శ్రీ కానూరి బదరీనాథ్ (తణుకు )గోదావరి జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు –శిష్టు సత్య రాజేష్ (అమలాపురం),సాహితీ,ఆధ్యాత్మిక వేత్త  శ్రీ కంభం పాటి సుబ్రహ్మణ్యం(కుర్తాళం)  మొదలైన సాహితీ ప్రముఖులకు’’సరసభారతి  విశిష్టసాహితీ సేవా పురస్కారాలు’’, సాహితీ సేవా పురస్కారాల  ప్రదానం .

4-‘’సరసభారతి సాహితీ పుష్కరోత్సవం ‘’ అనే అంశం పై ప్రముఖ కవులచే కవిసమ్మేళనం .

 కార్యక్రమ నిర్వహణ ,పర్యవేక్షణ –ప్రముఖ కవి ,విశ్లేషకుడు శ్రీ దండి భట్ల దత్తాత్రేయ శర్మ (విజయవాడ )

     సహకారం –శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి –సరసభారతి కార్యదర్శి

 కవులు ,కళాకారులు ,సాహితీ వేత్తలు ,అతిధులు ,సాహితీ బంధువులు విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .

                   ఆహ్వానించు వారు

 జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షురాలు

శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –సరసభారతి కార్యదర్శి

శ్రీ గబ్బిట వెంకటరమణ –సరసభారతి కోశాధికారి

శ్రీ వి.బి.జి.రావు –సరసభారతి సాంకేతిక నిపుణులు

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

 కవి సమ్మేళనం లో పాల్గొనే కవుల తో సహా మరిన్ని వివరాలు ‘’బులెటిన్ -3’’ లో తర్వాత తెలియజేస్తాం .

 27-5-22-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -7

జయశంకర ప్రసాద్ -7
కామాయిని కావ్య సంశ్లేషణం -1
‘’జడ చేతనాలు సమరసంగా ఉన్నాయి –సుందర సాకార రూపం ఏర్పడింది –చైతన్యపు విలసనం –అఖండంగా చిక్కగా ఆనందం వెల్లి విరిసింది ‘’అని కామా యిని మహాకావ్యం లో జయశంకర ప్రసాద్ చివరి వాక్యాలు రాశాడు .ఆ ఆనందం జీవితాంతం వ్యాపించి ఉన్న సాధన యొక్క పరమ ఉత్కర్ష .దీనిప్రారంభం ప్రళయ తాండవం తో కమ్ముకున్న ప్రకృతి రంగస్థలం పై జరిగింది .ఇలాంటి కథ అనేక దేశాలలో వ్యాపించి ఉన్నదే .కానీ ప్రసాద్ ఇందులో విశ్వ మానవుడి ఆత్మ కథను వినిపించాలనీ, వినాలనీ అనుకొన్న కళాకారుడికి సహజ స్వభావం కూడా .ఈ కావ్యం లో మనస్తత్వ శాస్త్రం ,,చరిత్ర ,ఆదిమతత్వం ,ఆధునికత ,మత సంబంధ సంవేదన ,మత ప్రమేయం లేని దృష్టి ,నాటకం ,కవిత్వం అన్నీ ఒక బిందువులో ఏకాగ్రమై దర్శన మిస్తాయి ..ఇది కావ్య నాటక కథ ఉన్న మహా కావ్యం .
‘’హిమగిరి ఉత్తుంగ శిఖరం పై-శిలల శీతల ఛాయలో కూర్చుని-తడి ఆరని కన్నులతో ఒక పురుషుడు –ప్రళయ ప్రవాహాన్ని చూస్తున్నాడు.-కింద నీరు ,పైన మంచు –ఒకటి తరళం మరొకటి సఘనం –ప్రథానతత్వం రెండిట్లో ఒకటే –దాన్ని జడం అనండి చేతనం అనండి –తరల తపస్విలా ఆతను కూర్చున్నాడు –సుర స్మశానం లో సాధన చేస్తున్నాడు –దిగువనున్న ప్రళయ సింధు అలలు –కరుణా జనకం గా నశిస్తున్నాయి ‘’ ఆతరుణ తపస్వి మనువు . మనుష్యత్వం ఉన్న మహాకావ్య నాయకుడు .వేద,పురాణ ఇతిహాసాలలో మను చరిత్ర ఉంది .అతడు మానవతా నవ యుగ ప్రవర్తకుడు .మనువు, శ్రద్ధల దంపతులకు మానవుడు ఉద్భవించి ,మానవ వికాసానికి తోడ్పడ్డాడు .ఇదొక ‘’అల్లిగరి’’ మాత్రమె .ఇందులో సార్ధకత ,సంగీతం ఇమిడి ఉన్నాయి .ప్రసాద్ వేదాంతం సహజ అంతర్ దృష్టి .మైధిలీశరణ్ గుప్త కవి తో ఏమాత్రం తీసిపోని మహాకవి జయశంకర్ .ఇరవై వ శతాబ్దపు మనిషి ,మానవాళికి ద్రోహం చేసే జాతీయతావాదం సారం లేని అంతర్జాతీయతా వాదాల మధ్య ఇరుక్కున్న మనిషిని ఉద్ధరించే మార్గం చూపాడు .శ్రద్ధ విషయం లో కవి సహజ వివేకంతో ఉంటాడు .ఆమే కవితకు ఆరవ ప్రాణం .మొదటి దేవుడు కాముడు కుమార్తె గా కామాయిని ని భావిస్తారు .ఋగ్వేదం లో శ్రద్ధ ,మనువు ఋషులు .ఈ అస్తిత్వం లో స్త్రీ ,పురుష తత్వాలు మిశ్రితాలై ఉంటాయి .ఈ శ్రద్ధనే కవి తన సృజనాత్మక కల్పనా ,సంపూర్ణ స్వాదీనతా ,స్పూర్తి లతో సృష్టించాడు .
సూక్షం గా కథ
జలప్రళయం కామాయినీ కావ్యానికి నేపధ్యం .శతపద బ్రాహ్మణం 8వ అధ్యాయం లో జలప్రళయ వర్ణన ఉంది .ప్రసాద్ ఇది మన దేశ గాథ గా నే చెప్పాడు .ఈ జలప్రళయం ద్వారా విలక్షణ మానవులకు ,ఒక విభిన్న సంస్కృతిని సృష్టించటానికి దేవతలు మనువుకు ఒకావకాశం ఇస్తారు .దేవతల విచ్చలవిడి వలన వారి సంస్కృతీ నాశనమౌతుంది .అప్పుడు వచ్చిన ప్రళయం లో ఒక్క మనువు మాత్రమె బతికి బయట పడ్డాడు .అతడే మానవ దృష్టికీ సంస్కృతికి శ్రీకారం చుట్టాడు .ఒకరకం గా శాపం వరంగా మారుతుంది .ఈ విపత్తు వలన మనువు తానూ లోపలా బయటా కూడా శిధిలమై పోయినట్లు భావిస్తాడు .ఆత్మ చేతనం అనే కొత్త విధిని చేబడతాడు .దీనిద్వారా మానవీయ ప్రవృత్తులను ,భావాలు బుద్ధి సంపదను పొందుతాడు .
జలప్రళయ తీవ్రత తగ్గి భూమి క్రమగా బయట పడుతుంది .ఈ నేపధ్యం లో మనువు మనసులో చింత రేగుతుంది .గతమంతా ముందు సుళ్ళు తిరుగుతుంది .అమరత్వ౦ లేని జీవితతం తో గర్వంగా ఉండే రూపాన్ని దర్శిస్తాడు .మృత్యువు యదార్ధం అనే భావన కలుగుతుంది .ఈ జీవితం మృత్యువు యొక్క ఆశ అని తెలుస్తుంది .మానవ బుద్ధి మనువులో జాగృతమై ,మనం మారే కీలు బొమ్మలమని ,దేవతలం కాము అనే భావన స్థిర పడుతుంది .మార్పు లక్షణమే చింత ,అది తప్పని సరి అని తెలుస్తుంది .ఈ చింత మొదటిరేఖ విశ్వ వనం లో సంచరించే వ్యాలం తో పోలుస్తాడు .పుణ్య సృష్టిలో సుందర పాపమే చింత అని పోలుస్తాడు .ఇది అగ్ని పర్వతం ప్రేలేటప్పుడు వచ్చే భయంకర శబ్దం లాంటిది .అభావపు చపల బాలిక వంటిది .ఇది హృదయాకాశ ధూమకేతువు .అది కనిపించటం అమంగళం అనిష్టం అని అందరి నమ్మకం .ఇదంతా మొదటి సర్గలోని విషయాలు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-5-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరస భారతి 165వ కార్యక్రమం గా ‘’సాహితీ పుష్కర మహోత్సవం ‘’

సరస భారతి 165వ కార్యక్రమం గా ‘’సాహితీ పుష్కర మహోత్సవం ‘’
సాహితీ బంధువులకు శుభ కామనలు .సరసభారతి స్థాపించి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా 27-6-2022 సోమవారం సాయంత్రం 4 గం.లకు 165వ కార్యక్రమంగా ‘’సాహితీ పుష్కరోత్సవం ‘’ను స్థానిక శాఖా గ్రంధాలయం (A/Cలైబ్రరీ )నందు నిర్వహిస్తున్నాము .దీనిలోపుస్తకావిష్కరణ , సంగీవవిభావరి ,కవి సమ్మేళనం , ‘’సరస భారతి ప్రతిభా పురస్కార ప్రదానం ‘’ మొదలైన వి ఉంటాయి .కవి పండితులు ,సాహితీ మిత్రులు ,సాహిత్యాభిమానులు పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన .పూర్తి వివరాలతో ఆహ్వాన పత్రం ఒక వారం తరువాత అందజేస్తాం .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-5-22-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -6

జయశంకర ప్రసాద్ -6

ఒక గీతి అంతరాళం

జయశంకర ప్రసాద్ సంగీత కళా జ్ఞానం ఉన్న కవి .ఆయన రాసిన నాటకాలలో గేయాలు స్వతంత్రంగా పాడుకో తగినవి .కచాయీ లాటి చతుష్పదిలో కొత్త అభి వ్యక్తీ కనిపిస్తుంది .కచాయీ ,లహార్ ,కామాయినీ కావ్యాలు ఆయన వ్యక్తిత్వంతో ,క్రమవికాసం తో ముడి పడి ఉంటాయి .మొదట్లో కవితలు తర్వాత గేయాలు రాశాడు .నిరాలా లో ఈ ప్రత్యేకత అప్పటికి ఇంకారాలేదు .లహార్ కవితా సంకలనం 1935లో వచ్చింది .అప్పటికే ఉత్తమనాటకాలు నవలలు రాశాడు .చాలాకవితలు గీతి సంవేదనాత్మకాలు .ముక్త ఛందస్సులో రాసిన మూడు కవితలు కూడ ఇందులో ఉన్నాయి .చాయా అనే దీర్ఘ కవితకూడా ఉంది .ఇది నిరాలా రాస్సిన ‘శివాజీ లేఖ ‘’తో పోలుస్తారు .ప్రసాద్ గతి స్వాభావికంగా సహజం గా ఉంటుంది .ప్రసాద్ సంయమనం ,క్రమ శిక్షణతో రాశాడు .చక్కని లయతో స్వంత సంగీతంలా ఉంటాయి .’’సెలయేరులా కలకలధ్వనితో-మాధవీ లత పొదరింటి నీడలో – మంత్రం ముగ్ధ మాయలో –చేతనప్రవహిస్తోంది –సుఖ దుఖాల జీవితా౦తపు రాత –వాటితో పడుతూ లేస్తూ ఈ ప్రపంచం తిరోహితమౌతోంది –సెలయేరులో ముద్దిడినప్పుడు –నాలోని రోమరోమం పులకించింది –ఆలింగనం లోకి వచ్చినట్లే వచ్చి కనులు కప్పి పారిపోతుంది –లేలే ఓలఘులోలతరంగమా –కరుణ సరికొత్త ఆవలింతలా –మలయానిల ప్రతి బింబం లా –కాంతి లేని ఈ శరీరాన్ని వెలుగులతో నింపుమా –నర్తి౦చిన అడుగు జాడలను వదలిపోతావు –ఇసుక రేఖలు లేపి లేపి –నీ తరళ కంపనాలతో నింపి పో –జీవితపు శూన్యత్వం లో –ప్రేమ పులకరింతతో నిండి తొలుకుమా –వచ్చి నీరస పులిన ఆధరాన్నిచుంబించు ‘’.ఇందులో కవి ఆశయ మాధుర్య అవధి కనిపిస్తుంది .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-5-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -5

జయశంకర ప్రసాద్ -5

 నవలావ్యూహం

జయశంకర ప్రసాద్ రాసిన ‘’ఆ౦శూ ‘’,కామాయినీ నవలల మధ్యకాలం రచనా దృష్టిలో చాలా ఫలవంతమైన కాలం .ఈ కాలం లో గేయకావ్యాలు ,కధలు ,నవలలు నాటకాలు పండించాడు .ఆయనలో దాగి ఉన్న తర్కం కామాయినిలో విశ్వరూపం దాల్చింది .సమకాలీనత  ,చారిత్రత కలిశాయి .మానవ వికాస యాత్రలో ఉత్తీర్ణుని , చేసే ప్రయత్నం జరిగింది .విజన్ ,నిర్ణయాత్మక బుద్ధి జోడు గుర్రాలస్వారీ చేశాయి .స్త్రీ పురుష సంబంధాలలో విప్లవాత్మక మార్పులు రావాలని కోరాడు .కంకాల్ నవలలోని భారత సంఘం సమాజ ఉత్క్రుష్టత కోసం తపించేది .పూర్ణ వ్యవస్థ వ్యక్తీ సజీవ ఉన్నతికి తోడ్పడాలి .ఇందులోని సమాజం ఆధునికయుగానికి చెందిన భౌతికవాదాన్ని గుడ్డిగా నమ్ముతుంది .అనాధబాలలకు ప్రసాద్ అత్యద్భుత వ్యక్తిత్వాన్ని కల్పించాడు .ప్రేమించటం ,ప్రేమించబడటం అనే ప్రాధమిక సూత్రంతో స్త్రీ బంధింప బడి ఉంటుంది .ఇందులోని సంఘటనలు ప్రయాగ ,హరిద్వార్ ,మధుర ,బృందావన్ కాశీ లలో జరగటం విశేషం .తీర్ధయాత్రికుల్ని పండాలు ,దూర్తులు దొంగలు దొంగ వేశ్యలు పట్టుకొని జలగల్లా పీడిస్తారు .సంస్కరణ వాదులైన ఆర్యసమాజం క్రిష్టియన్ మిషనరీ లు కూడా ఉన్నాయి .స్త్రీత్వం అనేది పురుషత్వం మధ్యలో ఉంటూ వికసి౦చాలన్నది ధ్యేయం .కంకాల్ నవల బెంజాన్సన్ నాటకాలను గుర్తుకు తెస్తుంది .ఇందులోని పాత్రలు రిప్రజెంతెషణ్ లు కాకుండా కారి కేచర్స్ లాగా కనిపిస్తాయి .

  తితిలీ నవల గ్రామీణ వాతావరణం నేపధ్యంగా రాశాడు .అయినా ఉన్నతవర్గ నగర జీవితమూ చూపి౦చాడు.నిమ్నవర్గ పాత్రలూ ఉంటాయి .కామాయిని రాయటం పూర్తయ్యాక ఇరావతి నవల రాశాడు ప్రసాద్ .ప్రాణాంతకమైన వ్యాధిలో చిక్కుకొని  ఈ చారిత్రాత్మకనవల పూర్తిచేయలేక పోయాడు .నవలకు౦డాల్సిన గొప్ప లక్షణాలన్నీ ఉన్న నవలగా ఇది గుర్తింపు పొందింది .

  హిందీ అమరకదా రచయయిత మున్షీ ప్రేంచంద్’’ప్రసాద్ గారి నవలలు ,మధువా గుండా లాంటి కధలు చదవటం ఒక శుభప్రదమైన ఆశ్చర్యంగా ఉండేవి ‘’అని కీర్తించాడు .ప్రేంచంద్ పోటీతోప్రసాద్ రాయలేదు తన అనుభూతి తోనే రాశాడు .ప్రేమ చ౦ద్ రాసిన ‘’గోదాన్ ‘’వంటి నవల కఫన్ లాంటి కధ ప్రసాద్ రాయ లేడు.అలాగే మున్షీ కూడా గుండా ,ఆకాష్ దీప్ లాంటి కధలు రాయలేడు.

  జయశంకర్ గేయాలలో ఆదర్శం వాదిగా ,నవలా కధలలో భావుకత తాత్వికత లతోపాటు యదార్ధవాదిగా ,అక్కడక్కడ రహస్యవాదిగా కన్పిస్తాడు .గుండా లో ఆత్మబలిదానాన్ని వర్ణించిన తీరు మహోత్క్రుష్టం .ఆదర్శ వాది అయిన ప్రేమికుడి భావం ఒక తరం యొక్క భావనగా కనిపిస్తుంది

 ప్రసాద్ కధలలో పాత్రలు ఆయనకు బాగా పరిచయమైన మానవ మాత్రులు .చేతనాచేతనాలు పెనవేసుకొని నడుస్తాయి .సంపూర్ణ కళాత్మక రచనలుగా ఇవి కనిపించి ప్రేరణ కలిగిస్తాయి .జయశంకర ప్రసాద్ రాసిన 12కధలు చిరస్మరణీయాలు .

 సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-5-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -4

జయశంకర ప్రసాద్ -4

చరిత్ర పాఠాలు

తమకాలపు గొప్పg బుద్ధి జీవులలో జయశంకర్ ప్రసాద్ ఒకరు .భారతేందు దారిలో నడుస్తూనే చారిత్రకనాటకాల ద్వారా కొత్త జీవితం ఇచ్చాడు .ఐకమత్యం ,సామూహిక జాగరణ ఆనాటి అందరి లక్ష్యం .చరిత్ర గౌరవాన్ని పెంచిన ఆయన నాటకాలు రాజ్యశ్రీ ,హర్ష వర్ధన్ ,అజాత శాత్రు ,చంద్రగుప్త ,స్కంద గుప్త ,చాణక్య గౌతమబుద్ధ ,ధ్రువ స్వామినీ .’’నాటకం రంగస్థలం కోసం కాదు రంగస్థలం నాటకం కోసం ‘’అని నిష్కర్షగా చెప్పాడు .తనకాలం నాటి జాతీయ భావాలను అందులో పోదిగాడు .ఆయన నాటకం ఆనందం తోపాటు భయాన్నీ ,కష్టాలనూ కలిగించేది.

రాజ్యశ్రీ నాటకం లో వికట ఘోషుడు బౌద్ధ భిక్షువుగా ఉంటూ ,తర్వాత ఘరానా దొంగ ఖూనీ కోర్ అయ్యాడు .అజాత శత్రు లోని దేవదత్తుడు ఈర్ష్య మోసం అత్యాశలకు ప్రతినిధి అయిన పీఠాధిపతి.యువరాజు విరుద్ధకుడు తండ్రికే శత్రువు .అజాత శత్రువు తన తండ్రి బింబి సారుడిని దేశం నుంచి బహిష్కరిస్తాడు .కులీనులు ఇవేమీ పట్టకుండా ఉదాసీనంగా ఉంటారు .సామాన్యజనాన్ని పట్టించుకొనే నాథుడు ఉండేవాడు కాదు .వీరు సకలం కోల్పోయి చేతనా శూన్యులై ఐకమత్యం లేకుండా ఉంటారు .గొప్ప వీరుడు పర్ణదత్తుడు పౌరులపరిహాసానికి గురౌతాడు .దేశ స్వతంత్ర సంగ్రామం లో పాల్గొని క్షతగాత్రులైనవారికి సాయం చేయమని పౌరులను వేడుకొంటాడు .నిస్వార్ద దేవసేన ఆయన కు పూర్తీ సహకారమందిస్తుంది .ఈ చివరి దృశ్యం స్మశాన నేపధ్యం లో జరిగి గుండెల్ని పిండి చేస్తుంది .స్కందగుప్తుడు ఆశా కిరణంగా గోచరిస్తాడు .చివరికి అసత్యం పై సత్యం విజయం సాధిస్తుంది .

బౌద్ధం పై రచయితకు ఆకర్షణతో పాటు విమర్శనా ఉంటుంది .ఆటవిక మతాన్ని అనుసరించేవారికన్నా హూణులు ఫర్వాలేదు అంటాడు శ్రీలంక బౌద్ధ భిక్షువు ధర్మ సేనుడు .సంస్కృతీ పట్ల ఉన్న ఆత్మానందాన్ని ప్రసాద్ వ్యంగ్యంగానే చూశాడు. స్కంద గుప్తుని ప్రపంచం లో వెలుగు మానవాత్మ సౌందర్యం కనిపిస్తాయి .స్కంద గుప్తనాటకం ప్రసాద్ సర్వోత్క్రుష్టనాటకం .క్షమాభావం తక్కువ .

చంద్ర గుప్త నాటకం లో చాణిక్యుని మహోన్నత పాత్రగా చిత్రించాడు .మధు కరుణ ఆయనకవిత్వం లో పదేపదే వాడాడు. కామనా నాటకం ఎలిగరి తో ఉంటుంది .ఏకఘాంట్ నాటకానికీ ఇదే నేపధ్యం .ఈ రెండూ గొప్ప స్పూర్తి నిస్తాయి .భావనాత్మక శక్తులు క్రియ ,ప్రతిక్రియగా ఒకవైపు ,ఆలోచనల సంఘర్షణ లుగా మరో వైపు దర్శనమిస్తాయి .చాణక్యుడు ఆసరాతో పాటు ఆనందం కల్గిస్తాడు .జ్ఞానం తో ఐకమత్య సాధన చేశాడాయన .నాటకం లోఉన్న శాంతి అత్యంత సహజం గా ఉంటుంది .చాణక్యుని నిర్వేదనానికి ఒక దీప్తినీ ప్రసాదిస్తాడు జయశంకర ప్రసాద్ ..

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -301

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -301
301-తెలుగుటాకీ రెండవరాముడు ,కళ్యాణిరాగ ‘’మాస్టర్ కల్యాణి ‘’
కల్యాణి రాగ ‘’మాస్టర్ కల్యాణి ‘’
1934లో కాకినాడ లో కృష్ణలీలలు అనే నాటకం లో వేమూరి గగ్గయ్య కంసుడుగా నటించి హడలగొడుతుంటే ,ఆయనకు దీటుగా ఒక కుర్రాడు కృష్ణుడి వేషం లో సరిసమానంగా లేక అంతకంటే ఎక్కువగా శ్రావ్యంగా భావయుక్తం గా పద్యాలు పాడుతూ నటించి మెప్పించాడు .గగ్గయ్య ను మించి పోయి నటిస్తున్నాడని కల్యాణి రాగం లో అత్యద్భుతంగా పద్యాలు పాడి మనో రంజనం కలిగిస్తున్నాడనీ ప్రేక్షక జనావళి అబ్బురపడ్డారు .వన్స్ మోర్ లతో జనం మళ్ళీ మళ్ళీ పద్యాలు పాడించు కొన్నారు .ఒక్క రోజు అను కన్న ప్రదర్శన వరుసగా అయిదు రోజులు జరిగి రసిక జన మనో రంజనం చేశాడు ఆకోత్తకుర్రాడు కృష్ణ పాత్రధారిగా .ఐదవరోజు ఆ పాత్రధారిని  ఏనుగు పై ఊరేగించి తమ ఆనందాన్ని ప్రకటించారు కాకినాడ ప్రజలు .కల్యాణి రాగం ను వశపరచుకొని అలవోకగా అద్భుతం గా కర్ణ పేయంగా పద్యాలు పాడినందుకు అతడికి ‘’మాస్టర్ కల్యాణి ‘’అనిపెరుపెట్టి సమ్మాననించి తమ సంతృప్తి ప్రకటించుకొన్నారు .అప్పటినుంచి మరణించేదాకా ఆయన మాస్టర్ కల్యాణి గానే పిలువబడ్డాడు .ఒకరకంగా అప్పుడు ఆయన నాటకరంగ సూపర్ స్టార్ .
  1934లోనే మొదటిసారి ఒక తెలుగు వాడు పివి దాసు పూర్తిగా మద్రాస్ లోనే చిత్రించిన సినిమా ‘’సీతాకల్యాణం ‘’.ఇది రామాయణం కధతో వచ్చిన రెండవ టాకీ చిత్రం .మొదటిది పాదుకా పట్టాభిషేకం .ఇందులో యడవల్లి సూర్యనారాయణ రాముడిగా నటించాడు .సీతాకల్యాణం లో రాముడిగా వేసినవాడు మాస్టర్ కల్యాణి .తెలుగు టాకీ లో రెండవరాముడు మాస్టర్ కల్యాణి .
  1970లో తూర్పు గోదావరి జిల్లా కాట్రావులపల్లి అనే పల్లెటూరి లో పానుగంటి లక్ష్మీ వెంకాయమ్మ గారి పేరుమీద ఒక ధర్మ సత్రం ఉండేది పేదలకు గొప్ప ఆసరాగా ఉండేది .అప్పుడు ఆ సత్రం లో భార్యా పిల్లలతో పూట గడవనిదిక్కుమాలిన దుర్భర దారిద్ర్యంతో మాస్టర్ కల్యాణి బస చేసి దీనంగా బతుకు ఈడుస్తున్నాడు .కల్యాణి రాగాన్ని మాస్టరీ చేసిన ఆమహానటుడు చాల హృదయ విదారకంగా .సర్వం కోల్పోయి ఆంద్ర ప్రదేశ్ నాటక ఎకాడమి ఇస్తున్న నెలకు 40రూపాయల పెన్షన్ తో కుటుంబాన్ని పోషిస్తున్నాడు .ఆ సత్రంలోనే అదే ఏడాది మాస్టర్ కల్యాణి కన్ను మూశాడు అత్యంత దుర్భర పరిస్థితులలో .రంగస్థలం పై వన్స్ మోర్లు కొట్టించుకొన్న మహా గాయక నటుడి జీవితం ఇలా అత్యంత విషాదంగా ముగిసింది .
మాస్టర్ కల్యాణి అసలు పేరు నౌడూరు వెంకటరావు .అమలాపురం లో 1914లో పుట్టాడు .తండ్రి పేరయ్య దీక్షితులు ,తల్లి సుబ్బమ్మ .ఆర్ధికంగా బలమైన కుటుంబం కాదు .అందుకే చదువుమీద శ్రద్ధ ఉండేదికాదు .కానీ పాటలు పాడటం అలవోకగా అలవాటైంది .భావరాగ యుక్తంగా పాడేగాత్ర సౌలభ్యం ఉండేది .కురుమద్దాలి రామచంద్రరావు గొప్ప హార్మోనిస్ట్ .పద్యనాటకాలకు హార్మోనియం  వాయిస్తూ, దర్శకత్వం కూడా చేసేవాడు .శ్రీకృష్ణ హాపీ క్లబ్ అనే సంస్థ స్థాపించి రామదాసు నాటకం ప్రాక్టీస్ చేయిస్తున్నాడు .అప్పుడు ఇంకా స్కూల్లో చదువుతున్న వెంకటరావు గాత్రానికి ఆకర్షితుడై ,రామదాసు లో రఘురాముడు గా నటి౦పజేశాడు .ప్రేక్షకులు విపరీతంగా మెచ్చారు వెంకటరావు ను .రావుగారే  వెంకటరావు కు పాటలు పాడటం కూడా నేర్పించాడు .రోజూ స్కూల్ అవగానే రామచంద్ర రావు ఇంటికి వెళ్లి ఆయనకున్న గ్రామఫోన్ లో అబ్దుల్ కరీ౦ఖాన్ ,గానగంధర్వ,ఓంకార నాద మొదలైన మహాగాయకుల గానం వింటూ ,తన గాత్రానికి మెరుగులు దిద్దుకొన్నాడు వెంకటరావు .చిన్న తనం లోనే ఆనాటి అగ్రనటులకు దీటుగా ,ఒక్కోసారి వారిని అధిగమించీ నటన తో, పద్యాలతో గొప్ప స్థానం సంపాదించుకొన్నాడు .
  శ్రీ కృష్ణ తులాభారం నాటకం లో మాస్టర్ కల్యాణి శ్రీకృష్ణుడిగా ,కపిలవాయి రామనాధ శాస్త్రి నారడుడుగా వేసేవారు ..మరోగ్రూపు తులాభారం లో స్థానం నరసింహారావు సత్యభామగా ,కపిలవాయి శ్రీ కృష్ణుడిగా ,మాస్టర్ కల్యాణి నారదుడిగా వేసేవారు .ఈ నాటకాలాకు కాంట్రాక్టులు ఒక సంవత్సరం ముందే బుక్ అయిపోయేవి అంత డిమాండ్ ఉండేది ఈరెండు బృందాలకు .మాస్టర్ కల్యాణి బాగా పల్లెటూర్లలో తాటాకు పందిళ్ళకిందా , నాటకాలు ఆడాడు ,అలాగే పెద్ద పెద్ద పట్టణాలలోనూ మాంచి  ఆడిటోరియం  లలోనూ  నాటకాలు వేశాడు .ఎక్కడ వేసినా అదే ప్రేక్షకాదరణ వన్స్ మోర్ లు ఉండేది .వన్స్ మోర్లు కొట్టించుకొని ప్రేక్షక సమూహాలు లేనే లేవు .కృష్ణుడు ,నారదుడు అంటే మాస్టర్ కల్యాణి అని పేరుపొందాడు మిగతావారంతా  ఈయన తర్వాతే అంతటి సూపర్ స్టార్ డం సంపాదించాడు మాస్టర్ కల్యాణి . ఆ నాటి కాంట్రాక్ట్ నాటకయుగం లో ఎదురులేని’’ నాటకరారారాజు మాస్టర్ కల్యాణి’’ .’’ఆయన గొంతెత్తి రాగం ఆలపిస్తే ఆరాగం ఆగానం ఎప్పుడు ఆగిపొతు౦దోఎవరికే తెలిసేదికాదు .అది అమరగానం .ఏఒడిదుడుకులూ లేకుండా గలగలపారే గంగా స్రవంతిలా జలజలా సాగిపోయేది .పాత్ర ఔచిత్యం తగ్గకుండా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ ,తన అభిమానులను సంతృప్తి పరుస్తూ వన్స్ మోర్ లు అందుకొంటూ అభినయి౦ చేవాడు .కల్యాణి రాగ గానం లో మహోన్నత స్థితి అందుకొన్న గాంధర్వ గాయకుడు మాస్టర్ కల్యాణి ‘’అనికీర్తించాడు  మరో గొప్ప నాటక సినీ నటుడు మిక్కిలినేని .
  అదేకాలం లోనే టాకీ సినిమాలు మొదలయ్యాయి ఆప్రారంభకాలం లోనే ముందే మనం చెప్పుకోన్నట్లు ఆయన సీతాకల్యాణం వగైరా లలో నటించి సుభాష్ అనిపించాడు .1937లో వచ్చిన రుక్మిణీ కల్యాణం సినిమాలో రఘురామయ్య కృష్ణుడుగా ,శాంతకుమారి రుక్మిణిగా ,మాస్టర్ కల్యాణి నారడుగా నటించి అద్భుత నటన ప్రదర్శించాడు .తర్వాత పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవటం వలన మళ్ళీ నాటకరంగానికి వచ్చేసి నారదుడిగా కృష్ణుడుగా నటించాడు .ఆంధ్రగంధర్వ జొన్న విత్తుల శేషగిరిరావు మాస్టర్ కల్యాణికి ‘’ఆంద్ర బాలగంధర్వ ‘’బిరుదు ప్రదానం చేశాడు .1940లో ఏలూరులోని మోతే నారాయణ రావు అనే జమీందారు కల్యాణిని అత్యుత్తమ నటుడుగా అభిమానించి గజారోహణం తో ఏలూరు పట్టణంలో ఊరేగించి ఘన సన్మానం చేశారు .
అన్నేళ్లు గా  నాటకరంగం లో ఉన్నా ఆయన ఊరేదో పేరేదో ఎవరికీ తెలియదు .భార్యా పిల్లలతో సహా ఏవూరులో నాటకం వేస్తె అక్కడికి వెళ్ళేవాడు .అదే ఆయన ఊరు అనుకొనే వారు .స్థిరంగా ఏఊరులో ఉంటాడో తెలిసేదికాదు .నాటకం మీద వచ్చే ఆదాయమే ఆ యన కు ఆధారం .కనుక వెనకేసుకున్నది ఏమీ లేదు .దాదాపు 48సంవత్సరాలు ఇలాసంచార జీవితం గడిపేశాడు . ఆయనకుఅరవై ఏళ్ళు వచ్చేసరికి నాటకాలలో కూడా పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి .నిరంతర ప్రయాణాలవలన ఆరోగ్యమూ బాగా దెబ్బతిన్నది .చివరికి కాట్రావులపల్లి ధర్మసత్రం లో కుటుంబంతో గడుపుతూ దీనంగా దయనీయంగా ఆమహానటుదు  ఆంద్ర  బాలగంధర్వ మాస్టర్ కల్యాణి మరణించాడు .
  శ్రీ కిరణ్ ప్రభ కు ధన్యవాదాలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -3

జయశంకర ప్రసాద్ -3

చయావాదం –జయశంకర ప్రసాద్

చాయా వడ కవిత్రయం జయ శంకర ప్రసాద్ ,సూర్యకాంత త్రిపాఠీ-నిరాలా ,సుమిత్రా నందన పంత్.వీరు ఆధునిక హిందీ కవిత్వాన్ని కాంతిమయం చేశారు .ప్రసాద్ లోఆత్మ చైతన్యం ఎక్కువ .గతకాలం కూడా వర్తమానం లా మాట్లాడుతుంది ఆయన కవిత్వం లో .ఆయన గొప్ప కవితా నావికుడు .ఆయన జాతి చైతన్యానికి వ్యక్తీ చైతన్యానికి ప్రతీక .నుభూతిని సాంస్కృతిక చైతన్యం తో చెప్పాడు .ప్రధాన ప్రేరణలో వ్యక్తిగత చైతన్యం ఉంటుంది .సంవేదనా భావం సాంద్రంగా ఆయనలో ఉంది .ప్రేమానురాగాల ఐశ్వర్యం కధల్లో చూపాడు .చాయావాద యుగం లో అత్యంత ప్రతిభా సంపన్నమైన కవులున్నారు .పంత్ ‘’ఛాయా ‘’అనేకవిత్వం తో సంచలనం కలిగించాడు కనుక అది చాయావాదం అయింది .’’ప్రకృతి కరుణ కావ్యం లా ,వృక్ష పత్రాల మధు చాయలలో -రాయబడినట్లు అచలంగా ,అమృతాన్ని పోలిన నశ్వర శరీరం లో ఎవరున్నారు?’’అని జయశంకర్ రాసిన కవిత మొదటిచారణాలు .పంత్ –‘’ఓ!హరిత వసనా భూమిపై పడిన మ్లాన మణీ నువ్వెవరు ?గాలితాకిడికి విచ్చిన్నమైనలతలా ,రతి శ్రాంత బ్రజ వనితలా-వది వంచిత ఆశ్రయ రహిత జర్జర పద దళితలా-ముక్త కుంతలాల నీవు ఎవరివి ?”’ ఈ కవితల్లో వారిద్దరి భావుకత అంతర్ దృష్టి కన్పిస్తాయి .ప్రసాద్ కవితలో జీవం తోణికిసలాడితే ,వస్తువు కవికి వెలుపల చూస్తున్నట్లు ఉంది .ఈకవితలు మనసును లగ్నం చేస్తాయి .ప్రసాద్ కవితా కేంద్రం లో అనుభవ స్పందన మనం పడే పడే అనుభవిస్తాం .పంత్ కల్పనలు అనుభవం నుంచి వేరై స్వతంత్రంగా ఉన్నట్లు అనిపిస్తాయి .

ఈరకమైన కవిత్వం లో ఆత్మీయ భావన మార్మికతతో జత చేస్తుంది .ప్రసాద్ అనుభూతి స్పష్టం .ప్రసాద్ సాంకేతిక వాదం పంత్ లో విస్తరించింది .ప్రసాద్ ది’’విషాద్ ఛాయా ‘’.పంత్ లో అది ఆరోపణగా ఆహ్వానిస్తుంది .కావ్య భావనల వాదం లో చాయావాదం ఒక ముఖ్యమలుపుకుదుపు..కవిత్వాన్ని ఈ మలుపుదాకా తెచ్చిన కవి జయశంకర్ .ప్రసాద్ కు స్వంత గొంతుక ,లయ ఉన్నాయి .లయబద్ద భావావేశం నిరాలాది.ప్రసాద్ ఛందో బంధనాలు తెంచి కవిత్వానికి కొత్తనడక నేర్పాడు .పద్యాన్ని యాంత్రిక మార్గం నుంచి తప్పించాడు .ఆయన పాండిత్యం సూక్ష్మ శబ్ద భావాలు అబ్బురపరుస్తాయి .అనుభూతి శారీరక రచన చేయకుండా ఆత్మను రచిస్తుంది .ఆంశు లో ప్రయోగాలు

ఝార్నా తర్వాత ప్రసాద్ రాసిన ఆంశు కావ్యం సుదీర్ఘ కవిత ఇలాగే నిరాలా ‘’తులసీ దాస్ రాశాడు .ఆమ్షు ఒక లిరిక్ గా వృత్తాంతా కావ్యంగా ,శోక గీతిలా తాత్విక కావ్యం లా ఉంటుంది .డ్రామాటిక్ మొనోలోగ్స్ ఉన్న నాటకంకూడా కాదు ప్రపంచానికి ప్రేమ సందేశం పంచటమే లక్ష్యం .కామాయిని ఇచ్చినంత కిక్ ఇవ్వదు.ఎలిగరి రూప కావ్యం వైపు కు మొగ్గు చూపుతుంది .సముద్రం అంతరిక్షం రెండూ ఆయనకు ఇష్టమైన ప్రతీకలు –‘’లేవదుచేతనా తారంగం – .స్థిరంగా ఉంటుంది జీవన సముద్రం –సంధ్యకాని ప్రళయానికి ఉద్గమం –కలయిక అవుతుంది మళ్ళీ విచ్చేదం ‘’.ఇందులో ఆశావాదం ఉంది .కాల్రిడ్జ్ రాసిన ‘’డిజేక్షన్ ఓడ్’’కూడా ఇలానే ఉంటుంది .ప్రసాద్ ధ్యేయం ‘’మధు రేన సమాపయేత్ ‘’.కాంతి బిందువులు రాలుస్తూ రజని కనులు వర్షించాయి –తమస్సు నల్లని మోసగత్తేలు –నక్షత్రం రాలే క్షణం లో ఎందుకు ఉజ్వలంగా జీవిస్తాడు ?’’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-5-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన వెండి తెర మహానుభావులు-299• 299-

మన వెండి తెర మహానుభావులు-299
• 299-చిల్లర కొట్టు చిట్టెమ్మ తో సినీ ప్రవేశం చేసి ,పునాది రాళ్ళు సినిమా నటనకు స్వర్ణ నంది పొందిన –గోకిన రామారావు
• గోకిన రామారావు సహాయ నటుడు పాత్ర నుండి ప్రతినాయకుడి పాత్ర వరకూ అనేక విలక్షణ పాత్రల్లో దాదాపు 100 సినిమాలు పైగా నటించి ప్రేక్షకులను అలరించిన గోకిన రామారావు గారి సొంత ఊరు తూర్పు గోదావరి జిల్లా లోని పెద్దాపురం, పెద్దాపురం గోలి వారి వీధిలో రోడ్డు అనుకుని ఉన్న రామాలయం ఆయన స్వగృహం నటనపై చిన్న నాటి నుండి ఉన్న ఆసక్తితో చిన్న చిన్న స్టేజీ షోలతో మొదలైన ఆయన నటనా ప్రస్థానం నటనే ఒక వ్యాపకంగా మరి హైదరాబాదు వరకూ నడిపించింది. సినిమాల్లో చిన్న వేషాలు లభించాయి. ఆ తరువాత దర్శకరత్న దాసరి నారాయణ రావు గారు మంచి పాత్రకి అవకాశం ఇచ్చారు ఆయన స్వీయ దర్శకత్వంలో తీసిన చిల్లరకొట్టు చిట్టెమ్మ సినిమాతో గోకిన రామారావు గారి నట జీవితం ఊపందుకుంది. సినిమా ఆద్యంతం పెద్దాపురం లోనే చిత్రీకరించబడి అద్ద్భుత విజయం సాధించిన శివరంజనీ అనే సినిమాకు దాసరినారాయణ రావు గారికి పూర్తి సహకారం అందించారు. 1979 లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి గారి తొలిచిత్రం పునాది రాళ్ళులో పండించిన విలక్షణ నటనకు గానూ గోకిన రామారావు గారికి బంగారు నంది లభించింది. ఇటీవలే అయన 62 సంవత్సరాల వయస్సులో హైదరాబాదులో గుండె పోటుతో మరణించారు
నటించిన సినిమాలు
• లాహిరి లాహిరి లాహిరిలో (2002)
• దాదాగిరి (2001)
• రైతురాజ్యం (1999)
• కన్యాదానం (1998)
• సరదాల సంసారం (1997)
• సూరిగాడు (1992)
• సూత్రధారులు (1990)
• మనవడొస్తున్నాడు (1987)
• మంగమ్మగారి మనవడు (1984)
• దేవాంతకుడు (1984)
• పల్నాటి పులి (1984)
• జనని జన్మభూమి (1984)
• మగ మహారాజు (1983)
• అమాయక చక్రవర్తి (1983)
• బడాయి బసవయ్య (1980)
• పునాదిరాళ్ళు (1979)
• రంగూన్ రౌడీ (1979)
• శివరంజని (1978)
• చిల్లరకొట్టు చిట్టెమ్మ (1977)
• సోగ్గాడు (1975)
• మోసగాళ్ళకు మోసగాడు (1971
మంగమ్మగారి మనవడు సినిమాలో విలక్షణ నటన ప్రదర్శించాడు .
మన వెండి తెర మహానుభావులు-300
300- స్రవంతి ,సంస్థ నిర్మాత ,లేడీస్ టైలర్,క.మా.రి .డాన్స్ కంపెని ,గిల్లికజ్జాలు ,నువ్వేకావాలి సినీ  నిర్మాణ ఫేం –స్రవంతి కిషోర్
స్రవంతి రవికిషోర్ తెలుగు సినీ నిర్మాత.[1] స్రవంతి మూవీస్ అనే సంస్థ ద్వారా అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించాడు. రవికిషోర్ 1986లో తన మిత్రులతో కలిసి మొదటి సారిగా లేడీస్ టైలర్ అనే చిత్రాన్ని నిర్మించాడు. వంశీ, ఎస్. వి. కృష్ణారెడ్డి, కె. విజయభాస్కర్, త్రివిక్రం శ్రీనివాస్, ఎ. కరుణాకరన్ లాంటి దర్శకులతో దాదాపు 30కి పైగా సినిమాలు నిర్మించాడు. ఓ జ్యోతిష్యుడి సలహా మేరకు తన సంస్థ పేరును చంద్ర కిరణ్ మూవీస్ గా మార్చాడు.
వ్యక్తిగత జీవిత౦
ఆయన వృత్తి రీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. విజయవాడలో పని చేస్తుండేవాడు.[2] గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఎలక్ట్రానిక్స్ కు సంబంధించిన వ్యాపారం చేసేవాడు. మొదట్లో ఆయనకు సినిమాల మీద అంతగా ఆసక్తి ఉండేది కాదు. తర్వాత స్నేహితుల సలహా మేరకు సినీ నిర్మాణ రంగంలో ప్రవేశించాడు. మొదట్లో దాన్ని ఆయన పూర్తి వ్యాపార ధృక్పథంతో ఆలోచించినా నెమ్మదిగా సినిమాల మీద ఆసక్తి పెరిగింది. మంచి సినిమాలు తీయాలనే తపన కలిగింది.
సినిమాలు
ఆయన మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన స్రవంతి అనే నవల చదివి ఆ స్ఫూర్తితో తన నిర్మాణ సంస్థకు స్రవంతి మూవీస్ అనే పేరు పెట్టాడు. తర్వాత ఓ జ్యోతిష సిద్ధాంతి సలహా మేరకు ఆ సంస్థ పేరు చంద్ర కిరణ్ మూవీస్ గా మార్చాడు. మొదట్లో దర్శకుడు వంశీతో మిత్రులు తమ్ముడు సత్యం, సాయిబాబా తో కలిసి 1986 లో లేడీస్ టైలర్ చిత్రాన్ని నిర్మించారు. తర్వాత మహర్షి, కనకమహాలక్ష్మి డాంస్ ట్రూప్, లింగబాబు లవ్ స్టోరీ లాంటి సినిమాలకు పనిచేశాడు. తరువాత ఎస్. వి. కృష్ణారెడ్డితో కలిసి మూడు సినిమాలు చేశాడు. తర్వాత కె. విజయభాస్కర్ తో కలిసి రెండు సినిమాలు చేశాడు.
నువ్వే కావాలి సినిమా కోసం మలయాళం నుంచి హక్కులు కొని అప్పటి ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో దాన్ని ఉషాకిరణ్ మూవీస్ ఆద్వర్యంలో నిర్మించాడు.[2] ఆ సినిమా మంచి విజయం సాధించింది.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కోటి, సుచిత్ర చంద్రబోస్, శ్రీకర్ ప్రసాద్ లాంటి సాంకేతిక నిపుణులతో ఎక్కువగా పనిచేశాడు.
పాక్షిక జాబితా
• లేడీస్ టైలర్
• మహర్షి
• శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాంస్ ట్రూప్
• జైత్రయాత్ర
• రౌడీ మొగుడు
• మావిచిగురు
• ఎగిరే పావురమా
• గిల్లికజ్జాలు
• మనసులో మాట
• పిల్ల నచ్చింది
• నువ్వే కావాలి
• నువ్వు నాకు నచ్చావ్
• గౌరి (2004)
• గణేష్
• ఎందుకంటే ప్రేమంట
•   సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-5-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

జయశంకర ప్రసాద్ -2

జయశంకర ప్రసాద్ -2

రెండు కావ్యాలు

జయ శంకర్ పరచనలలో మూడు సోపానాలున్నాయి .చిత్రాధార్ ,కానన్ కుసు౦ ,మహారాణా ప్రతాప్ ,ప్రేం పధిక్ మొదటి దశకు ,నాటకాలలో రాజ్యశ్రీ ,విశాఖ,చాలా కథలు ఆతర్వాత ‘’ఛాయా ‘’పేరుతొ వచ్చిన సంకలనకథలు మొదటి దశకుచెందినవి .రెండవ దశ ‘’ఝార్నా ‘’తో మొదలౌతుంది .ఇందులో కొత్తభావాల ఆక్రోశన కవిగా కనిపిస్తాడు .ప్రతిధ్వని వంటి కధలద్వారా మార్పులు తెచ్చాడు .నాటకరచయితగా సానబెట్టిన వజ్రమే అయ్యాడు .కామనా వంటివి నాటకం లో కొత్త ప్రయోగం .1927-37మధ్యకాలమైన మూడవ దశ ముఖ్యమైనదీ చివరిదీ .అప్పుడే ఆ౦శా, లహార్ ,కామాయినీ  వంటి ఉత్క్రుష్టరచనలు చేశాడు .వీటితోపాటు కంకాల్ అంటే అస్థిపంజరం ,తితలీ అంటే సీతాకోక చిలక ,అసంపూర్నరచన అయిన ఇరావతి కూడా రాశాడు .చంద్రగుప్త ,స్కందగుప్త ,ధ్రువస్వామినీ ,ఏక్ ఝాంట్ లతో పోలికున్న గొప్ప నాటకాలుకూడా ఈ మూడవ దశలోనే రాశాడు .ఈరకమైన రచనాత్మక ‘’బాంబ్ బ్లాస్ట్’’ తో పాటు ఆకాష్ దీప్ ,ఆంధీ అనే రెండు కథా సంకలనాలూ వెలువరించాడు .ప్రతి దశలోనూ చాలా ప్రక్రియలు సాగించిన సాహిత్యకారుడు జయశంకర్ .కథాప్రసాద్ వ్యక్తిత్వం కవి ప్రసాద్ వ్యక్తిత్వం తో ముడి పడి ఉంది .

  కిషోర దశలో ఆయన భారతేందుకాలభావ ప్రేరణతో రాశాడు .తర్వాత ద్వివేదీ గారి విప్లవ యుగం  మూడవ యుగం చాయావాద్ యుగం లో అగ్రగణ్యుడు జయశంకర ప్రసాద్ ..ఖడీ బోలీ భాషలో ప్రేంపధిక్ అనే దీర్ఘ కవిత రాశాడు .ఇందులో మానవ సమాజ ప్రేమ భావన ఉంది .తర్వాత విశ్వ ప్రేమకు దారి చూపుతుంది .ఇందులో ప్రాసను వదిలేశాడు .కొత్త ఆశలను చిగురింప జేశాడు .నిర్మాణం శైలి లో కూడా నూతనత్వం తెచ్చాడు .వీటన్నిటికి జవాబు ‘’కరుణాలయ్’’.లఘు నాటిక .దీని తర్వాత రాణాప్రతాప్ నుకూడా దీర్ఘ కవితగా రాశాడు .ఇందులో కథను నడిపించే తీరు అబ్బురపరుస్తుంది .కానన్ కుసుం లో వస్తుపరంగా ఛందస్సు పరంగా గొప్ప వైవిధ్యం చూపాడు .లయలో జాగ్రత్తలు తీసుకొన్నాడు ,కథలలో కూడా ఈ కళా మర్మజ్ఞాత్వం తెచ్చాడు .ఇందు పత్రికలోనే ఆయన పాతవీ కొత్తవీ రచనలన్నీ ప్రచురితాలైనాయి .నహీ డర్ తే అనే సానెట్ రాశాడు .ఝార్నా లో ఒక విషయం లోనుంచి మరోదానికి దాటిపోయే లక్షణం ఉంది .ఆయన కవితావికాసం స్పష్టంగా కనిపిస్తుంది ,’’కాలం సంఘటనల కల్పనా తీతం –మనసు శరీరాన్ని చేసింది ప్లావితం –అప్పుడు ఒక రోజు ధారా అపా౦గ౦  –హృదయం నుండీప్రవాహం –కన్నీరొలికి ప్రవహించింది –ప్రణయ మన్యంలా విస్తరి౦చి౦ది ‘’.ఈ భావ పరంపరనే’’ చాయా వాదం’’ అన్నారు .చనిపోవటానికి ముందు రాసిన మూడు పంక్తులను ,అంతకు ముందెప్పుడో రాసిన నాలుగు పంక్తులతో కలిపి ‘’శేష గీత్’’పేరిట వచ్చింది –‘’నా జీవన ధ్రువతార –నీ కరుణ నీడ నీలాకాశం లో విస్తరించింది చంచల గ్రహాలూ శూన్య పధాన్ని కోలుస్తున్నాయి –క్షార సాగరం కల్లోలితమైంది –నీ మధుర జ్యోతి ధారలో నానావ తేలియాడింది ‘’ఈ కవిత 1994ఫాల్గుణమాసం లో  వెలువడింది –‘ఈ రోజు జీవితం లో చంచల సుఖం –విశ్వ మదిర లా నిండింది –ప్రాణాలను కైపెక్కించే ఆ మధుర సుఖం ‘’-1994-అశ్వన్ మాసం లో వచ్చింది .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-5-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన వెండి తెర మహానుభావులు-296

  • మన వెండి తెర మహానుభావులు-296
  • 296-గాజుల కిష్టయ్య ఫేం ,ఫిలిం ఫేర్ అవార్డీ-జరీనా వహాబ్

ప్రారంభ జీవితం[

జరీనా వహాబ్ విశాఖపట్టణంలోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఈమెకు మాతృభాష తెలుగు[1] తో పాటు ఉర్దూహిందీఇంగ్లీషు భాషలలో ప్రావీణ్యం ఉంది. ఈమె పూణేలోని ఫిల్మ్‌ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(FTII)లో శిక్షణ పొందింది.[2] ఈమెకు ముగ్గురు సోదరీమణులు ఒక సోదరుడు ఉన్నారు.

వృత్తి

ఈమె సినిమాలకు పనికిరాదని సినిమా నిర్మాత రాజ్ కపూర్ తిరస్కరించగా ఈమె పట్టుదలతో తన ఆహార్యంపై దృష్టిపెట్టి మెరుగులు దిద్దుకుని సినిమా పార్టీలకు, కార్యక్రమాలకు హాజరయ్యింది. దానితో ఈమె పలువురి దృష్టిలో పడి సినిమా అవకాశాలు దక్కించుకుంది. ఈమె సాధారణంగా మధ్యతరగతి పాత్రలలో నటించేది. ఈమె 1976లో విడుదలైన “చిత్ చోర్” సినిమాలో నటించింది. ఇదే కాకుండా అమోల్ పాలేకర్ నటించిన “అగర్”, రాజ్ బబ్బర్‌తో “జజ్‌బాత్”, అరుణ్ గోవిల్‌తో “సావన్ కో ఆనే దో” విక్రంతో “రయీస్ జాదా” మొదలైన సినిమాలలో నటించింది. 1977లో విడుదలైన “ఘరండా” చిత్రంలో నటనకు ఈమె ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేట్ అయ్యింది.[3] ఈమె హిందీ సినిమాలలోనే కాక మళయాల, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో కూడా నటించింది. ఈమె మళయాల చిత్రం క్యాలెండర్ (2009)తో నటిగా పునః ప్రవేశం చేసింది.[4] “మై నేమ్ ఈజ్ ఖాన్” చిత్రంలో షారూఖ్ ఖాన్ తల్లి పాత్రలో దర్శనమిచ్చింది.[5]

జరీనా వహాబ్ ప్రస్తుతం హిందీ టెలివిజన్ సీరియళ్లలో వయసు మళ్లిన పాత్రలలో నటిస్తున్నది.[6]

వ్యక్తిగత జీవితం

జరీనా సినీనటుడు ఆదిత్య పంచోలిని “కళంక్ కా టీకా” అనే సినిమా సెట్లో కలుసుకుంది.[7] పంచోలి ఈమె కన్నా 6 సంవత్సరాలు పిన్నవయస్కుడు. 1986లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి సన అనే కూతురు, సురజ్ అనే కొడుకు కలిగారు.[8][9] వీరి సంతానం ఇరువురూ నటీనటులే.

నట జీవితం[

ఈమె సుమారు 60 హిందీ సినిమాలలో నటించింది. ఈమె నటించిన తెలుగు సినిమాల జాబితా:

సంవత్సరంసినిమా పేరుపాత్ర
1975గాజుల కిష్టయ్య
1978అమర ప్రేమజయమాల
1980హేమాహేమీలు
2010రక్త చరిత్రజయలక్ష్మి
2013విశ్వరూపంసైకియాట్రిస్ట్
2021విరాట పర్వం
2022దసరా

టెలివిజన్[

ఈమె అనేక టెలివిజన్ సీరియళ్లలో నటించింది. వాటిలో “క్యోంకి సాస్ భీ కభీ బహూ థీ”, “మధుబాల ఏక్ ఇష్క్ ఏక్ జునూన్”, “ఏక్ కిరణ్ రోష్నీ కీ”,”ఎఫ్.ఐ.ఆర్.”, “మేరీ ఆవాజ్ హీ పెహచాన్ హై” మొదలైన ప్రజాబాహుళ్యమైన సీరియళ్లు ఉన్నాయి.

అవార్డులు, నామినేషన్లు

·         2011 “మై నేమ్‌ ఈజ్ ఖాన్” చిత్రంలోని పాత్రకు గ్లోబల్ ఇండియన్ ఫిలిం అండ్ టెలివిజన్ వారి ఉత్తమ సహాయ పాత్ర పురస్కారం.

·         2011 “రక్త చరిత్ర” స్క్రీన్ అవార్డుకు ఉత్తమ సహాయనటి కేటగరీలో నామినేషన్

·         2011 “మై నేమ్‌ ఈజ్ ఖాన్”, “రక్త చరిత్ర” సినిమాలలోని నటనకు స్టార్ డస్ట్ అవార్డుకు ఉత్తమ సహాయనటి కేటగరీలో నామినేషన్

·         1977 “ఘరోండ” చిత్రంలో నటనకు ఫిలింఫేర్ అవార్డుకు ఉత్తమ నటి కేటగరీలో నామినేషన్.

  • మన వెండి తెర మహానుభావులు-297-
  • 297-గుణసుందరి ఫేం ,జీవనతరంగాలు ,క్రిష్ణలేలలు ,లైలామజ్ఞు ,అమరసందేశం నటి ,కన్నీటి కడలి నటి అనిపించిన-జూనియర్ శ్రీరంజని
  •  

రంజని (అసలు పేరు మహాలక్ష్మి) తెలుగు సినిమా నటి. వీరు గుంటూరు జిల్లా మురికిపూడి గ్రామంలో 1927 సంవత్సరం ఫిబ్రవరి 22 న జన్మించారు. శ్రీరంజని సీనియర్ గా పేరుపొందిన తెలుగు సినిమా నటి ఈమె సోదరి.

చిత్రపు నారాయణమూర్తి ప్రోత్సాహంతో మొదటిసారిగా భీష్మ (1944) చిత్రంలో నటించారు. 1949లో సుప్రసిద్ధ దర్శకులు కె.వి.రెడ్డి గారి గుణసుందరి కథలో కథానాయిక పాత్ర ధరించారు.

ఈమె 1974 సంవత్సరంలో ఏప్రిల్ 27 న మరణించింది.

నటించిన చిత్రాలు

·         జీవన తరంగాలు (1973)

·         నేనంటే నేనే (1968)

·         బంగారు పంజరం (1965)

·         శ్రీకృష్ణార్జున యుద్ధం (1963) …. రుక్మిణి

·         మహాకవి కాళిదాసు (1960)

·         కృష్ణ లీలలు (1959)

·         ప్రేమే దైవం (1957)

·         శ్రీ గౌరీ మహత్యం (1956)

·         పెంకి పెళ్ళాం (1956)

·         సంతానం (1955) …. లక్ష్మి

·         శ్రీకృష్ణ తులాభారం (1955) …. రుక్మిణి

·         చంద్రహారం (1954) …. గౌరి

·         అమర సందేశం (1954)

·         పెద్ద మనుషులు (1954)

·         Raji En Kanmani (1954)

·         బ్రతుకు తెరువు (1953)

·         మానవతి (1952)

·         పరాశక్తి (1952) …. కళ్యాణి

·         ప్రేమ (1952) …. లత

·         రాజేశ్వరి (1952)

·         సంక్రాంతి (1952)

·         లైలా మజ్ఞు (1949)

·         గుణసుందరి కథ (1949) …. గుణసుందరి

·         గీతాంజలి (1948)

·         మదాలస (1948)

·         గృహప్రవేశం (1946)

·         భీష్మ (1944) …. సత్యవతి

  • మన వెండి తెర మహానుభావులు-298
  • 298-సాంఘిక నాటక నటుడు ,ముత్యాలముగ్గు ఫేం ,రియల్ ఎస్టేట్ లోనూ హీరో ,మా ఉయ్యూరు దగ్గర వాడు –శ్రీధర్

జననం

కృష్ణా జిల్లాఉయ్యూరు సమీపంలోని కుమ్మమూరు గ్రామంలో 1939 డిసెంబర్ 21 న ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన శ్రీధర్, తల్లా? పెళ్లామా? చిత్రంతో తెలుగు జాతి మనది అనే పాటలో విద్యార్థిగా సినీ రంగ ప్రవేశం చేశాడు.[1] మచిలీపట్నంలో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకొని 1964లో హైదరాబాదుకు వచ్చి ప్రభుత్వపనుల శాఖలో గుమాస్తాగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు. ఉద్యోగం చేస్తూనే సాయంత్రం కళాశాలకు వెళుతూ బి.ఏ పూర్తిచేశాడు. కళాశాల సాంస్కృతిక విభాగంలో క్రియాశీలకంగా పనిచేస్తూ కార్యదర్శి అయ్యాడు. పరీక్ష, చీకటి తెరలు, అభాగ్యులు, సాలెగూడు, మండేకొండలు మొదలైన అనేక నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించాడు. ఈయన ప్రధానపాత్ర పోషించిన మంచుతెర అనే నాటకానికి గాను ఆంధ్ర నాటక కళా పరిషత్ యొక్క ద్వితీయ బహుమతి అందుకున్నాడు.[2]

ఒకప్పుడు ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలన్నింటిలోనూ శ్రీధర్ కనిపించేవాడు. జస్టిస్ ఛౌదరి సినిమాలో ఎన్టీ రామారావు కొడుకుగా నటించాడు. ప్రతిభావంతమైన కళాకారుడైన శ్రీధర్ ఏనాడు వేషాలకోసం అర్ధించలేదు. తనకు అవకాశం వచ్చిన సినిమాలలో నటించాడు. నటుడిగా ఉండగా ఈయన రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడులతో, తన చివరి దశకంలో ఆ వ్యాపార రంగంలో బిజీగా ఉన్నాడు.[3]

చివరాఖరిలో ఆయనకు టివి సీరియళ్లు అవకాశం వెతుక్కుంటూ వస్తే అందులో నటించడానికి ఇష్టపడలేదు. ఆ సీరియళ్లు నటిస్తే శ్రమ ఎక్కువ తప్పితే ఆర్థికంగా ఫలితాలు బహు తక్కువ అని తెలుసుకుని నటనకు దూరంగా ఉన్నాడు. స్వంతచిత్ర నిర్మాణాలపై ఆసక్తి కనబరచలేదు. హీరోవేషాలు వస్తున్నప్పుడు శ్రీధర్‌చే ఎన్‌టిఆర్‌ తనస్వంతచిత్రం శ్రీరామ పట్టాభిషేకంలో గుహుడు వేషం వేయించారు. దాంతో శ్రీధర్‌కు వచ్చే హీరోవేషాలు కూడా రాకుండా పోయాయి. అంతకుముందు ఎన్‌టిఆర్‌ గుహుడు వేషానికి డ్రయివర్‌రాముడులో సెకెండ్‌హీరో వేషానికి లింకుపెట్టి ఇచ్చారు. కానీ, డ్రయివర్‌రాముడు చిత్రం హిట్‌కూడా శ్రీధర్‌ను మరిన్ని చిత్రాలలో హీరోని చేయలేకపోయాయి. సహాయ పాత్రలను తెచ్చిపెట్టాయి. ఇలా శ్రీధర్‌కు తాను నటించిన హిట్‌చిత్రాలు ఎలాంటి లాభాలను చేకూర్చలేదనే చెప్పాలి. ఆయన విభిన్న పాత్రల్లో కనిపించాడు. వాటిల్లో అమెరికాఅమ్మాయి, అడవి రాముడు, జస్టిస్‌ చౌదరి, కరుణామయుడు, ఈనాడు, బొమ్మరిల్లు, సీతా మహాలక్ష్మీ, యశోధకృష్ణ వంటి చిత్రాలున్నాయి.[4] ఈయన కనిపించిన చివరి చిత్రం గోవిందా గోవిందా.

సినిమాల జాబితా

1.   తల్లా? పెళ్లామా? (1970)

2.   విశాలి (1973)

3.   చక్రవాకం (1974)

4.   దేవదాసు (1974)

5.   మాంగల్య భాగ్యం (1974)

6.   ముత్యాల ముగ్గు (1975)

7.   యశోదకృష్ణ (1975)

8.   శ్రీరామాంజనేయ యుద్ధం (1975)

9.   అమెరికా అమ్మాయి (1976)

10. దొరలు దొంగలు (1976)

11. బంగారు మనిషి (1976)

12. భక్త కన్నప్ప (1976)

13. వెలుగుబాటలు (1976)

14. అడవి రాముడు (1977)

15. తరం మారింది (1977)

16. మనవడి కోసం (1977)

17. అంగడిబొమ్మ (1978)

18. ఇంద్రధనుస్సు (1978)

19. కరుణామయుడు (1978)

20. గోరంత దీపం (1978)

21. పల్లెసీమ (1978)

22. బొమ్మరిల్లు (1978)

23. శ్రీరామ పట్టాభిషేకం (1978)

24. సీతామాలక్ష్మి (1978)

25. జూదగాడు (1979)

26. డ్రైవర్ రాముడు (1979)

27. బొట్టు కాటుక (1979)

28. ఆడది గడప దాటితే (1980)

29. కలియుగ రావణాసురుడు (1980)

30. కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త (1980)

31. పొదరిల్లు (1980)

32. బంగారు బావ (1980)

33. మంచిని పెంచాలి (1980)

34. మూగకు మాటొస్తే (1980)

35. సంధ్య (1980)

36. సంసార బంధం (1980)

37. దేవుడు మావయ్య (1981)

38. మా పెళ్ళి కథ (1981)

39. ఆపద్బాంధవులు (1982)

40. ఈనాడు (1982)

41. జస్టిస్ చౌదరి (1982)

42. డాక్టర్ మాలతి (1982)

43. కిరాయి కోటిగాడు (1983)

44. నేటి చరిత్ర (1990)

45. గోవిందా గోవిందా (1994)

మరణం

ఆయన ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతూ, హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటుతో జూలై 112007 న మరణించాడు. శ్రీధర్ కు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు.

  • సశేషం
  • మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-5-22-ఉయ్యూరు
Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-293

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-293
• 293-ప్రభుత్వ రజతపతకం ,,స్పెయిన్ అంతర్జాతీయ  సినీ ప్రదర్శన యోగ్యత పొందిన ‘’నమ్మినబంటు’’ సిని నిర్మాత ,మహాదాత ,పారిశ్రామిక వేత్త ,,ఉప్పు స
• త్యాగ్రహి ,కృతిభర్త ,సాహిత్య పోషకుడు ,-యార్లగడ్డ వెంకన్న-2
తెలుగువారు సగర్వంగా చెప్పుకునే సినిమా తో ఆ బ్యానర్ ప్రారంభమైంది. ఆ సినిమా సూపర్ హిట్ కూడా అయ్యింది. బోల్డు పేరువచ్చింది. విదేశాల్లో జరిగిన ఫిలిం ఫెస్టివల్స్ కూడా ప్రశంసలు సాధించింది . రాష్ట్రపతి నుంచి బంగారు పతకం పొందింది. అయినా…ఆ నిర్మాత సినిమాలు తీయడం మానేయాలనుకున్నాడు. ఆ బ్యానరేమిటి? ఆ నిర్మాతెవరు? అసలా సినిమా ఏమిటి? ఈ వివరాల్లోకి ఓ సారి తొంగిచూద్దాం.
ఆ బ్యానర్ పేరు శంభు ఫిలింస్ బ్యానర్ మీద మొత్తం ఐదు సినిమాలు వచ్చాయి. అయితే మొదటి సినిమాలకు నిర్మాత యార్లగడ్డ వెంకయ్య చౌదరి. మిగిలిన చిత్రాలకు నిర్మాత ఆయన మేనల్లుడు దగ్గుబాటి లక్ష్మీనారాయణ చౌదరి. చివరి సినిమాకు మాత్రం మళ్లీ యార్లగడ్డ వెంకయ్య కుమారుడు శంభూ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు.
యార్లగడ్డ వెంకన్న చౌదరిది ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామం. స్వతంత్ర సమరయోధుడు. పారిశ్రామికవేత్త. అనేక వ్యాపారాలు చేసి చాలా గడించాడు. న్యాయశాస్త్రంలోనూ గణిత శాస్త్రంలోనూ మంచి ప్రవేశం ఉన్న మనిషి. అంతటి పెద్దమనిషికి సినిమా తీయాలనే కోరిక కలిగింది. చేతిలో డబ్బుంది. అనుకున్నదే తడవుగా అగ్రహీరోను అగ్ర దర్శకుడ్నీ అగ్ర హీరోయిన్నీ బుక్ చేసి సినిమా షురూ అన్నారు. ఆ సినిమానే నమ్మిన బంటు..
నమ్మిన బంటు చిత్రం యాంటీ హీరో సినిమా. ఊళ్లో దొరలకు నమ్మినబంటులా ఉండే హీరో అక్కినేని నాగేశ్వర్రావు. అతని మనసు గెల్సుకున్న సావిత్రి. ఆ సావిత్రికి నాగేశ్వర్రావంటే చాలా ఇష్టం. అయితే…అతను చేసే పనులు మాత్రం నచ్చవు. అతను భూస్వాముల తరపున వకాల్తా పుచ్చుకుని తన వాళ్ల మీదకు దాడికి రావడం అస్సలు నచ్చదు.అందుకే కొంచెం పొగరుగా ఉంటుంది. పొగరుబోతు పోట్లగిత్తరా అని నాగేశ్వర్రావు ఏడిపిస్తాడు కూడా ఒక రకంగా నమ్మినబంటు అంటే.. హీరోనే.
అయితే మరోకోణం కూడా ఉంది. రైతు జీవితంలో మూగజీవాలు నిర్వహించే పాత్రను కూడా సినిమాలో చర్చిస్తారు.అలా టైటిల్ కు మరో రకమైన జస్టిపికేషన్ కూడా ఉంది. రైతుతో పశువులకు ఉన్న అనుబంధాన్ని గురించి కొసరాజు అద్భుతమైన గీతం రాశారీ చిత్రం కోసం.
జాతివన్నె బుజ్జాయిల్లారా…నోరు లేని తువ్వాయిల్లారా…చెంగు చెంగునా గంతులు వేయండి అంటూ సాగే ఆ పాట వద్దనుకున్నారు ఆదుర్తి. అయితే కొసరాజు ఆ పాటతో రైతులు సినిమాకు ఎట్రాక్ట్ అవుతారని చెప్పడంతో ఉంచేశారు. సినిమా సక్సస్ లో ఆ పాటదే మేజర్ షేర్.
హీరోయిన్ సావిత్రి హీరో అక్కినేనిని మార్చి భూస్వాముల దుర్మార్గాలను అర్ధం చేయించి..వాళ్ల మీదకు ఉసికొల్పుతుంది. రైతు కూలీల హక్కుల సాధన కోసం హీరో ఉద్యమించడం…తన వారితో కల్సిపోవడం…సావిత్రిని పెళ్లాడడం….ఇదీ సినిమా.
ఔట్ డోర్ అంతా కారంచేడులోనే సాగింది. నిర్మాతగారి మరో మేనల్లుడు రామానాయుడి సారధ్యంలో. సినిమా సూపర్ హిట్ అయ్యింది. స్పెయిన్ వెళ్లి అక్కడా అందరినీ ఆకట్టుకుంది.
నమ్మినబంటు చిత్రానికి సంబంధించి మరో విశేషం…ఎస్.రాజేశ్వర్రావు వదిలేసిన సినిమాల్లో ఇదీ ఉండడం. తమిళ కవి ఉడుమలై నారాయణస్వామితో ఓ ట్యూన్ విషయంలో వచ్చిన తగాదా సందర్భంగా రాజేశ్వర్రావు నమ్మిన బంటు చిత్రం నుంచి విరమించుకున్నారు.
చెంగు చెంగునా గంతులు వేయండి. తెల తెలవారెను లేవండమ్మా పాటలు మాత్రమే రాజేశ్వర్రావు ట్యూన్ చేశారు. మిగిలినవన్నీ మాస్టర్ వేణు చేసినవే.
మరి ఇంత చారిత్రాత్మక నేపధ్యం ఉన్న నమ్మినబంటు చిత్రం తీసిన నిర్మాత మళ్లీ సినిమాలు చేయకపోవడానికి కారణం ఏమిటి.మరి శంభు ఫిలింస్ బ్యానర్ మీద మరో నాలుగు సినిమాలు ఎలా వచ్చాయి? ఇవే కదా మీ అనుమానం. ఆ డౌటును క్లియర్ చేసేస్తామిప్పుడు..
ముందసలు శంభూ ఫిలింస్ కు సంబంధించి ఒక విషయం… వెంకయ్య చౌదరి నమ్మినబంటుకు మాత్రమే నిర్మాత. మిగిలిన వాటికి ఆయన మేనల్లుడు , కొడుకు నిర్మాతలు. బ్యానర్ మాత్రమే వెంకయ్యది.
మిగిలిన వ్యాపారాల్లో డబ్బు పెట్టిన వాణ్ణే అందరూ గౌరవిస్తారు. సినిమాల్లో మాత్రం డబ్బు పెట్టిన వాడే అందరికీ గౌరవం ఇవ్వాల్సి రావడం తనను బాధించిందని వెంకయ్య చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు.తన మేనల్లుడు లక్ష్మీనారాయణ చౌదరి సినిమా తీస్తానంటే ఒద్దన్నారు.
నమ్మినబంటు తో యార్లగడ్డ వెంకన్నచౌదరి సినీ ప్రయాణం ఆగిపోయింది. ఆయన ఇక సినిమాలు తీయదల్చుకోలేదు. తీయలేదు కూడా. అయితే ఆయన మేనల్లుడు దగ్గుబాటి లక్ష్మీనారాయణ చౌదరి శంభూ ఫిలింస్ మీద మూడు సినిమాలు చేశారు. లక్ష్మీ నారాయణను సినిమాల్లోకి రావద్దన్నారు వెంకన్న…కానీ వినలేదు. ఆ సినిమాలేంటి? ఆ కథేంటి చూద్దాం.
పూజాఫలం శంభూ పిలింస్ బ్యానర్ లో వచ్చిన రెండో చిత్రం. బి.ఎన్ రెడ్డి బయటవారికి చేసిన సినిమాల్లో ఇది ఒకటి.
హీరో అక్కినేని నాగేశ్వర్రావే. ఇది నవలా చిత్రం. మునిపల్లెరాజుగారి పూజారి నవల ఆధారంగా పూజాఫలం రూపుదిద్దుకుంది. ఒక పురుషుడి జీవితంలోకి ప్రవేశించిన ముగ్గురు అమ్మాయిల కథ ఇది.
బిఎన్. రాజేశ్వర్రావుల కాంబినేషన్ లో పగలే వెన్నెల లాంటి అద్భుతమైన పాటలు రూపుదిద్దుకున్నాయి.
ఇక మరో విశేషం ఏమిటంటే. బి.ఎన్, రాజేశ్వర్రావు కాంబినేషన్ లో దేవులపల్లి రాసిన గీతాలు కాకుండా నారాయణరెడ్డి రాసిన పాటలు హిట్ కావడం విశేషం కాక మరేమిటి.
పగలే వెన్నెలే కాదు….నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో పాట కూడా నారాయణరెడ్డిగారిదే. ఈ చిత్రంలో ఘంటసాల పాడిన పాట కూడా అదొక్కటే.
పూజాఫలం ఓ మోస్తరుగా ఆడడంతో ఈ సారి ఎన్.టి.ఆర్ తో సినిమా తీయాలనుకున్నారు లక్ష్మీనారాయణ చౌదరి.
పింగళి నాగేంద్రరావు విజయా బ్యానర్ లో కాక బయట రాసిన నాలుగైదు సినిమాల్లో ఇది ఒకటి.
విశేషం ఏమిటంటే…వాహినీ సంస్ధ మూలపురుషుల్లో ఒకడైన ఆర్ట్ డైరక్టర్ ఎ.కె.శేఖర్ శ్రీకాకుళాంధ్ర మహా విష్ణు కథను డైరెక్ట్ చేయడం.
కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం అనే ఊరు ఉంది. అక్కడ ఆంధ్ర మహా విష్ణువు ఆలయం ఉంది. మహాంధ్ర సామ్రాజ్య స్థాపకుడు ఈ శ్రీకాకుళాంధ్ర మహా విష్ణువు. ఆయన కథే శ్రీకాకుళాంధ్ర మహా విష్ణువు కథ.
ఒక రాజును అవతార పురుషుడుగా జనం చెప్పుకున్నారంటే ఆయన పాలన ఏ స్థాయిలో ఉందో అర్ధ మౌతుంది. పెండ్యాల సంగీతం అందించిన ఈ సినిమా కోసం బాలమురళీ కృష్ణ ఓ డ్యూయట్ ఆలపించడం విశేషం. వసంతగాలికీ వలపులు రేగ అంటూ సాగుతుంది.
శ్రీ కృష్ణదేవరాయలుతో ఆముక్తమాల్యద రాయించింది శ్రీకాకుళాంధ్ర మహావిష్ణుడే అనే నమ్మకం ఉంది.
రాయలవారు సామ్రాజ్య విస్తరణతో పాటు శత్రు నిర్జన కార్యక్రమంలో భాగంగా దండయాత్రలు సాగించినప్పుడు కృష్ణాతీరాన కల శ్రీకాకుళంలో విశ్రాంతి తీసుకున్నారట.
అప్పుడే ఆంధ్రదేవుడు రాయల కల్లో కనిపించి ఆముక్తమాల్యద రాయించడంతో పాటు…ఆ కృతిని తిరుపతి శ్రీవారికి అంకితం ఇచ్చేలా మాట తీసుకున్నారని చెప్తారు.
శ్రీకాకుళాంధ్రమహావిష్ణుకథ తర్వాత దగ్గుబాటి లక్ష్మీనారాయణ చౌదరి తీసిన సినిమా పంతాలు పట్టింపులు. కొల్లిపర బాలగంగాధర తిలక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చౌదరిగారికి చేదు అనుభవాన్నే మిగిల్చింది. మ్యూజికల్ గా సక్సస్ కొట్టినా…వసూళ్ల పరంగా నిలబడలేదు.
శోభన్ బాబు హీరోగా వాణిశ్రీ హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రం నాట్య ప్రధానంగా సాగుతుంది.
పంతాలు పట్టింపులు చిత్రానికి సంబంధించి మరో విశేషం ఉంది. ఈ సినిమాలోనే మహాకవి శ్రీశ్రీకి చాలా ఇష్టమైన పాట ఉంది. గుమ్మడి మీద చిత్రీకరించిన ఈ పాటలో ఈ బతుకుందే సానా బరువు అనే లైను శ్రీశ్రీ ఎంత ఇష్టపడి రాశారో…అంతే గొప్పగా ఆలపించారు ఘంటసాల. ఆ లైపులో ఈ బతుకుందే అనే బిట్ అప్పటి కారక్టర్ యాక్టర్ చదలవాడ అడ్వైజ్ చేశారు.
నమ్మిన బంటుతో మొదలైన శంభూ ఫిలిమ్స్ పతాకం అక్కడితో ఆగిపోకుండా ఎనభై దశకం వరకు కొనసాగింది.
యార్లగడ్డ వెంకన్నచౌదరి కుమారుడు శంభూ ప్రసాద్ చిత్ర నిర్మాణంలోకి దిగి కట్టాసుబ్బారావు దర్శకత్వంలో కృష్ణ, శ్రీదేవి కాంబినేషన్ లో బంగారు బావ పేరుతో సినిమా తీశారు. కారణాలేవైనా ఆ సినిమా పెద్దగా పే చేయలేదు. మల్లికా నవ మల్లికా పాట మాత్రం సూపర్ డూపర్ హిట్టైంది.
బంగారుబావ తర్వాత శంభూ ప్రసాద్ కూడా సినిమా నిర్మాణానికి దూరంగానే ఉండిపోయారు.
తిరుపతి వెళ్లి వస్తూ యాక్సిడెంట్ లో భార్యతో పాటు కన్నుమూశారు. తీసింది నాలుగైదు సినిమాలే అయినా…కారంచేడు నుంచి ఓ స్టార్ ప్రొడ్యూసర్ టాలీవుడ్ లోకి రావడానికి మార్గం వేశారు వెంకన్న చౌదరి.
నిజానికి అదే ఆయన సాధించిన విజయం. శంభూ ఫిలింస్ బ్యానర్ కథ
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-5-22-ఉయ్యూరు

Posted in రచనలు, సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-293

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-293
293-ప్రభుత్వ రజతపతకం ,,స్పెయిన్ అంతర్జాతీయ సినీ ప్రదర్శన యోగ్యత పొందిన ‘’నమ్మినబంటు’’ సిని నిర్మాత ,మహాదాత ,పారిశ్రామిక వేత్త ,,ఉప్పు స
త్యాగ్రహి ,కృతిభర్త ,సాహిత్య పోషకుడు ,-యార్లగడ్డ వెంకన్న
యార్లగడ్డ వెంకన్న చౌదరి (1911 – 1986) ప్రకాశం జిల్లా కారంచేడు వాస్తవ్యుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, మహా దాత, పారిశ్రామిక వేత్త. గణితములో, న్యాయశాస్త్రములో మంచి ప్రవేశము గల మేధావి.
జనననం
వెంకన్న చౌదరి ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో యార్లగడ్డ నాయుడమ్మ, రత్నమాంబ దంపతులకు1911 లో జన్మించారు. వీరికి ఒక అక్కయ్య శ్రీమతి దగ్గుబాటి సీతమ్మ ఒక తమ్ముడు రంగనాయకులు చౌదరి ఉన్నారు. వెంకన్న చౌదరి తమ మేనమామ కూతురు రాజ్యలక్ష్మమ్మని వివాహమాడారు. వీరికి కుమారుడు శంభు ప్రసాద్. శంభు ప్రసాద్ గారి భార్య శ్రీమతి ప్రభావతి ఈమె అమరావతి రాజా వాసిరెడ్డి శ్రీనాధ్ ప్రసాద్ గారి కుమార్తె.

సమాజససేవ
ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని ఒక సంవత్సరము జైలు శిక్ష అనుభవించాడు[1]. కారంచేడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా బాధ్యతలు నిర్వహించారు. మద్రాసులోని ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్కు అధ్యక్షునిగా పనిచేశాడు.

సాహిత్య పోషణ
తుమ్మలపల్లి రామలింగేశ్వర రావు గారు తాళ్ళపాక అన్నమాచార్యుని జీవితంపై వ్రాసిన తొలి రచన కృతి స్వీకరించారు. కోట సోదర కవులు తమ రచన “రాజ్యలక్ష్మీ విలాసము” వీరికి అంకితమిచ్చారు.

ఆచార్య యార్లగడ్డ వెంకట రాఘవయ్య గారు తమ విశిష్ట రచన “కాకతీయ తరంగిణి”ని వెంకన్న చౌదరి గారికి అంకితమిచ్చారు.

విశేషమేమిటంటే వీరిద్దరూ జీవితంలో ఎప్పుడూ కలుసుకోలేదు. వెంకన్న చౌదరి గారి దాతృత్వ గుణాన్ని అభిమానించి, అన్నగా భావించి శ్రీ రాఘవయ్య గారు తమ రచనను వెంకన్న చౌదరి గారికి అంకితమిచ్చారు.

వెంకన్న చౌదరి గారి ప్రోద్బలంతో, నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు, తితిదే నిర్వహణాధికారి అన్నా రావు గారు అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రారంభించారు.

సినిమా నిర్మాత
శంభూ ఫిల్మ్స్ పతాకంపై వెంకన్న నిర్మించిన ‘నమ్మిన బంటు’ (1960) అనే చలనచిత్రము భారత రాష్ట్రపతి నుండి రజత పతకము పొందింది. స్పెయిన్లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్ర వేడుకలో ప్రదర్శించబడి పలువురి ప్రశంశలు పొందింది.

దాతృత్వత్వం
వెంకన్న చౌదరి మహా దాత. పలు పాఠశాలకు, కళాశాలలకు భూరి విరాళాలిచ్చాడు. తన తండ్రి పేరిట ‘యార్లగడ్డ నాయుడమ్మ ఓరియంటల్ విద్యాలయము’ స్థాపించాడు. తిరుపతి, తిరుత్తణి, శ్రీశైలం వంటి దేవస్థానములలో కాటేజీలు, సత్రములు నిర్మించాడు. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద కాన్సర్ ఇన్స్టిట్యూట్ నకు 30 లక్షల విరాళమిచ్చాడు.

భార్య రాజ్యలక్ష్మి పేరిట 1980 నుండి తెలుగువారిలో పేరుప్రఖ్యాతులు పొందిన వ్యక్తులకు పురస్కారములు ఇవ్వబడుచున్నవి.

మరణం
మద్రాసులో స్ధిరపడి, అశేష సంపదను సృష్టించి సమాజ శ్రేయస్సుకు వుపయోగ పెట్టిన దానశీలి వెంకన్న చౌదరి గారు1986లో పరమపదించార

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-294
294-ఈ చరిత్ర ఏ సిరాతో ,ఈ చదువులు మాకొద్దు ,మరోమలుపు సనీ దర్శకుడు ,నందీ అవార్దీ–వేజళ్ల సత్యనారాయణ
వేజెళ్ళ సత్యనారాయణ తెలుగు సినిమా దర్శకుడు.1979నుంచి 1994 దాకా దర్శకత్వం చేబట్టాడు

సినిమలు
ఇతడు దర్శకత్వం వహించిన తెలుగు చలనచిత్రాల పాక్షిక జాబితా:

విడుదల సంవత్సరం

సినిమా పేరు

నిర్మాణ సంస్థ

నటీనటులు

1979

మా ఊరి దేవత

రామకృష్ణ ఫిలింస్

1982

ఈ చరిత్ర ఏ సిరాతో

నవతరం పిక్చర్స్

రాజేంద్ర ప్రసాద్,
శివకృష్ణ

1982

మరో మలుపు

రూబీ మూవీస్

శివకృష్ణ,
నూతన్ ప్రసాద్

1983

ఇదికాదు ముగింపు

యురేకా సినీ ఎంటర్‌ప్రైజస్

శివకృష్ణ,
నరసింహ రాజు,
జ్యోతి,
గీత

1983

ఆడవాళ్లే అలిగితే

విజయచిత్ర పిక్చర్స్

సాయిచంద్,
వనితశ్రీ

1983

ఈ పిల్లకు పెళ్ళవుతుందా

శ్రీ బాలబాలాజీ చిత్ర

రాజేంద్రప్రసాద్

1983

ఈ దేశంలో ఒకరోజు

కుమారరాజా పిక్చర్స్

సాయిచంద్,
కవిత

1984

రోజులు మారాయి

విజయసారథి ఆర్ట్ పిక్చర్స్

శివకృష్ణ,
ప్రభ

1984

ఈ చదువులు మాకొద్దు

శ్రీ వెంకటదుర్గా ఇంటర్నేషనల్

సాయిచంద్,
రాజేంద్రప్రసాద్

1984

మార్చండి మన చట్టాలు

డి.వి.యస్.ప్రొడక్షన్స్

శారద,
చంద్రమోహన్

1985

ఓటుకు విలువ ఇవ్వండి

త్రిజయ

రంగనాథ్,
రాజేంద్రప్రసాద్

1985

అపనిందలు ఆడవాళ్లకేనా?

సురేఖ ఎంటర్‌ప్రైజన్

రంగనాథ్,
శారద,
అరుణ

1989

శ్రీ తాతావతారం

సాహిత్య మూవీస్

నరేష్,
సాగరిక,
బ్రహ్మానందం

1994

కలికాలం ఆడది

పవిత్ర జ్యోతి కంబైన్స్

సాయికృష్ణ,
జ్యోతి

పురస్కారాల
· ఇతడు దర్శకత్వం వహించిన మరో మలుపు చిత్రానికి 1982 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ చిత్రంగా రజత నంది లభించింది.

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-295
295-టివి ,సినీ రచయిత,సంతోషం సినీ దర్శక ఫేం-దశరధ కుమార్
కొండపల్లి దశరథ్ కుమార్ ఒక ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత. సంబరం, సంతోషం, మిస్టర్ పర్‌ఫెక్ట్ అతను దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు
జీవిత౦
దశరథ్ నవంబరు 30, 1971 న ఖమ్మం లోని ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.[3] 2005 లో శేష సౌమ్యతో అతని వివాహం జరిగింది. వారికి కార్తీక అనే కూతురు ఉంది.[4]

కెరీర్
సినిమాల్లోకి రాక మునుపు దశరథ్ ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్తో కలిసి టీవీ సీరియళ్ళకు సంభాషణలు రాసేవాడు. దూరదర్శన్ లో ప్రసారమైన వెన్నెల్లో ఆడపిల్ల అనే ధారావాహిక మంచి ఆదరణ పొందింది. వీరశంకర్, తేజ, వై.వి.యస్.చౌదరి లాంటి దర్శకులతో సుమారు పదేళ్ళ పాటు పనిచేశాడు. వీరశంకర్ తో హలో ఐ లవ్ యూ, వైవీయస్ చౌదరితో యువరాజు, తేజతో చిత్రం, నువ్వు నేను, ఫ్యామిలీ సర్కస్ లాంటి సినిమాలకు పనిచేశాడు.

2002 లో నాగార్జున కథానాయకుడిగా వచ్చిన సంతోషం సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.

సినిమాలు
దర్శకుడిగా
· శౌర్య – 2016

· గ్రీకు వీరుడు – 2013

· మిస్టర్ పర్‌ఫెక్ట్ – 2011

· స్వాగతం – 2008

· శ్రీ – 2005

· సంబరం – 2003

· సంతోషం – 2002

రచయితగా[మార్చు]
· శుభవేళ – 2000

· చిత్రం – 2000

· ఫ్యామిలీ సర్కస్ – 2001

· నువ్వు నేను – 2001

· సంతోషం – 2002

· శ్రీ – 2005

· స్వాగతం – 2008

· సశేషం

· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-5-22-ఉయ్యూరు

Posted in సినిమా | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-292

  • మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-292
  • 292-అగ్గిరాముడు  సంగీత దర్శకుడు ,’’ నీలీలపాడేదదేవా’సంగీత ఫేం  పక్షిరాజా సంస్థ ఆస్థాన సంగీత దర్శకుడు,’’సంగీతయ్య ‘’గా గుర్తింపు పొందిన  –సుబ్బయ్య నాయుడు

1960 లో విడుదలయిన ఈ చిత్రానికి మాటలూ-పాటలూ ముద్దుకృష్ణ రాశారు. సంగీతం సుబ్బయ్యనాయుడు
అందించారు. సుబ్బయ్య నాయడు అనగానే తెలుగువారందరికీ ‘మురిపించే మువ్వలు’ చిత్రం…నీ లీల పొడెదదేవా’ పాట ..గుర్తొచ్చేస్తాయి. యన్‌.టి.ఆర్‌, భానుమతి
నటించిన ‘అగ్గిరాముడు’ చిత్రాన్ని నిర్మించిన పక్షిరాజా సంస్థకు సుబ్బయ్య నాయుడు సంగీతాన్ని అందించే వారు. ఆ పక్షిరాజా సంస్టే నిర్మించిన ఈ
చిత్రం ద్వారా 

సుబ్బురాయులు మునుస్వామి సుబ్బయ్య నాయుడు (అ.కా. SMS) (15 మార్చి 1914 – 26 మే 1979) ఒక భారతీయ స్వరకర్త, కండక్టర్ మరియు ఆర్కెస్ట్రేటర్. అతను చాలా పురాతన సంగీత దర్శకుల్లో ఒకడు. అతను సెంట్రల్ స్టూడియోస్ మరియు పక్షిరాజా స్టూడియోస్‌కు అంతర్గత సంగీత స్వరకర్తగా పనిచేశాడు మరియు S. M. శ్రీరాములు నాయుడుతో బాగా అనుబంధం కలిగి ఉన్నాడు. SMS కూడా జూపిటర్ పిక్చర్స్ బ్యానర్‌లో అనేక చిత్రాలతో పని చేసింది మరియు M. G. రామచంద్రన్‌కి ఇష్టమైనది.

1914లో కడయనల్లూరులో జన్మించిన సుబ్బరాయలు మునుసామి సుబ్బయ్య నాయుడు బాల్యం సంతోషించలేదు. అతను సింగపూర్‌లో తన సంపదను కనుగొనాలనే కలలతో ఇంటి నుండి పారిపోయాడు, కానీ జగన్నాథ అయ్యర్ మరియు నవాబ్ రాజమాణికం పిళ్లై వంటి నాటక బృందాలలో పని చేయడం ముగించాడు. నటన కంటే సంగీతం వైపు ఎక్కువ ఆకర్షితుడయ్యాడు, SMS రాజగోపాల అయ్యంగార్ మరియు సుబ్రమణ్య బాగవతార్ వంటి మాస్టర్స్ నుండి సంగీతం నేర్చుకున్నాడు. సంస్థ యొక్క నాటకం భక్త రామదాస్ చలనచిత్రంగా రూపొందించబడినప్పుడు, చిత్రానికి సంగీతంపై SMS పని చేసింది.
దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అతన్ని “సంగీతయ్య” అని పిలుస్తారు. అతను మొదటి రోజుల నుండి ఎక్కువగా కంపోజ్ చేసే తన ట్రెండ్‌ను మార్చుకోలేదు. అతను భారతీయ సంగీతంలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నాడు కానీ పాశ్చాత్య ట్యూన్లు మరియు సంగీతంపై ఎప్పుడూ ఆసక్తి చూపలేదు.

SMS 1940ల ప్రారంభంలో కొన్ని సినిమాలపై ఇతర స్వరకర్తలతో కలిసి పనిచేసింది. ఆ తర్వాత 1947లో MGR హీరోగా రాజకుమారి పాత్ర పోషించిన మొదటి చిత్రానికి సంగీతం అందించాడు. 1950ల వరకు SMS అతనికి వచ్చిన సినిమాల్లో గుర్తుండిపోయే పాటలను కంపోజ్ చేస్తూనే ఉంది. ఎజై పడుమ్ పాడు (1950), కాంచన (1952) మరియు మలైక్కల్లన్ (1954) వంటి చిత్రాలు దశాబ్దంలోని అగ్రశ్రేణి స్వరకర్తలలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సహాయపడ్డాయి. తిరుమనం, మరగధం, నాడోడి మన్నన్ మరియు అద్భుతమైన క్లాసిక్ కొంజుమ్ సలాంగై కూడా ఉన్నాయి.

సెంట్రల్ స్టూడియస్‌లో రాజకుమారి చిత్రానికి సంగీతం అందిస్తుండగా ఎస్‌ఎంఎస్‌ ద్వారా హీరో ఎంజీఆర్‌తో పరిచయం ఏర్పడింది. ఇది ఇద్దరి మధ్య జీవితకాల స్నేహానికి పునాది వేసింది, ఇది మర్మ యోగి మరియు మలైక్కల్లాన్ చిత్రాల సమయంలో మరింత బలపడింది. నాడోడి మన్నన్‌తో MGR నిర్మాతగా మరియు దర్శకుడిగా మారినప్పుడు, పాటలను కంపోజ్ చేయమని SMSని ఆహ్వానించారు, N.S. బాలకృష్ణన్ 2 పాటలు కంపోజ్ చేశా
ప్పుడు, MGR తన స్నేహితుని కోసం థాయిన్ మడియిల్, ఆసై ముగం మరియు తలైవన్ వంటి కొన్ని అవకాశాలను పొందాడు.

1960వ దశకం పురోగమిస్తున్న కొద్దీ, SMS 1960ల చివరలో నామ్ మూవర్, రాజా వీటు పిళ్లై, ఉయిర్ మేల్ ఆసై, సబాష్ తంబి, పనక్కర పిళ్లై, నలుమ్ తేరింధవన్, చక్కరం మరియు మన్నిప్పు వంటి కొన్ని ప్రాజెక్ట్‌లలో నిమగ్నమైంది.

1970లలో స్నేహితి, వైరాకియం, తేరోట్టం మరియు తంగ గోపురం మధ్య అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

ఆయన సహకారం అమూల్యమైనది. అతను స్వరకర్త మాత్రమే కాదు, చాలా మంచి కండక్టర్, ఆర్కెస్ట్రేటర్ మరియు ఏమి కాదు. అతను దక్షిణ భారతదేశానికి చెందిన O. P. నయ్యర్‌గా పరిగణించబడ్డాడు. అతని ట్యూన్‌లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి మరియు అతని పాటలు తక్షణ హిట్‌గా నిలిచాయి. కుంగుమ పూవే కొంజుం పురావే పాటలో జె.పి.చంద్రబాబును గొప్ప గాయకుడిగా తీర్చిదిద్దారు. అతను తన ఉత్తమ గాయకులను తీసుకురావడానికి ఎటువంటి రాయిని వదిలిపెట్టడు. ఇప్పటి వరకు, ఎస్. జానకిలో అత్యుత్తమమైనది ఆయన స్వరపరచిన సింగర వేలనే దేవా. నాదస్వరంతో స్వరం అనే కాన్సెప్ట్‌ని ఆవిష్కరించాడు.

  • సశేషం
  • మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-5-22-ఉయ్యూరు 
Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనక మన వెండి తెరమహానుభావులు -288

మనమరుపు వెనక మన వెండి తెరమహానుభావులు -288
288-కితకితలు అత్తిలి సత్తిబాబు హాస్యం ఫేం ,వ్యాఖ్యాత -లక్ష్మీ పతి

లక్ష్మీపతి ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు. 40 కి పైగా సినిమాల్లో నటించాడు. ఇతను వర్షం సినిమాకు దర్శకత్వం వహించిన శోభన్ కు అన్న.[1] అన్నదమ్ములిద్దరూ కొద్ది రోజుల తేడాతో మరణించారు.
లక్ష్మీపతి మొదటగా టీవీ వ్యాఖ్యాతగా, హాస్యనటుడిగా తన కెరీర్ ను ప్రారంభించాడు. తరువాత శోభన్ దర్శకత్వం వహించిన బాబీ అనే సినిమాతో నటుడిగా ప్రస్థానం మొదలైంది. తరువాత అల్లరి, కితకితలు లాంటి సినిమాలో హాస్య పాత్రలు పోషించాడు.

సినిమాలు
· బాబీ

· అల్లరి

· మురారి

· నీ స్నేహం

· తొట్టి గ్యాంగ్

· జూనియర్స్

· అమ్మాయిలు అబ్బాయిలు

· విజయం (2003)

· విలన్ (2003)

· చార్మినార్

· కళ్యాణ రాముడు

· విలన్

· పెదబాబు

· దొంగ దొంగది

· అదిరిందయ్యా చంద్రం (2005)

· ఆంధ్రుడు

· నువ్వంటే నాకిష్టం

· ప్రేమికులు

· రిలాక్స్

· అదిరిందయ్యా చంద్రం

· ఎవడి గోల వాడిది

· సోగ్గాడు

· నీ నవ్వే చాలు

· డేంజర్

· అందాల రాముడు

· మహారధి

· కితకితలు

· అన్నవరం

· లక్ష్మీ కళ్యాణం

· అత్తిలి సత్తిబాబు LKG

· వియ్యాలవారి కయ్యాలు

· మంగతాయారు టిఫిన్ సెంటర్

· సుందరకాండ

· అందమైన మనసులో

· మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు (2004)

మరణం
ఆయన స్నానాల గదిలో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే కిందపడిపోయి మరణించాడు. కొద్ది సేపటి తర్వాత కుటుంబ సభ్యులు అతని భౌతిక కాయాన్ని గుర్తించారు. [2]

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-289
289-వర్షం బాబీ ,చంటి సినీదర్శకుడు –శోభన్
శోభన్ (1968-2008) ఒక తెలుగు సినిమా దర్శకుడు. వర్షం సినిమా దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు. మహేష్ బాబు హీరోగా బాబీ అనే సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు.[2] ఇతని సోదరుడు లక్ష్మీపతి సినీ నటుడు. ఇద్దరు అన్నదమ్ములూ ఒక వారం తేడాతో మరణించారు.

కెరీర్
1989 లో సినీ పరిశ్రమలో ప్రవేశించడానికి చెన్నై వెళ్ళాడు. రౌడీయిజం అనే సినిమాకు కొద్ది రోజుల పాటు పనిచేసాడు. కానీ కొన్ని కారణాల వలన 10 రోజులకు ఆ సినిమా ఆగిపోయింది. తరువాత రాంగోపాల్ వర్మ దగ్గర అనగనగా ఒక రోజు అనే సినిమాకు సహాయ దర్శకుడిగా చేరాడు. ఆయనతోనే ప్రేమకథ, దావూద్ అనే సినిమాలకు పనిచేశాడు.[1] కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సింధూరం సినిమాకు రచయితగా పనిచేశాడు. క్షణ క్షణం, ఒక రాజు ఒక రాణి అనే సినిమాల్లో కూడా నటించాడు. మురారి సినిమాకు కూడా కృష్ణవంశీతో కలిసి పనిచేశాడు. ఆ సమయంలో మహేష్ బాబు తో కలిగిన పరిచయంతో బాబీ సినిమాతో దర్శకుడిగా అవకాశం వచ్చింది.[2] ఎం. ఎస్. రాజు నిర్మించగా ప్రభాస్, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన వర్షం సినిమా అతనికి దర్శకుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. రవితేజ, ఛార్మి, అంజలి నటించిన చంటి సినిమా అతని ఆఖరి సినిమా. ఇది బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేదు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు కి కూడా సన్నిహితుడుగా ఉండేవాడు.[1]

మరణం
శోభన్ కథానాయిక భూమిక ఇంట్లో ఉండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చి కూలబడిపోయాడు. భూమిక, ఆమె భర్త అతన్ని హైదరాబాదు మాదాపూరులోని ఇమేజ్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు తెలియజేశారు.[3] అప్పటికి అతని వయస్సు 40 సంవత్సరాలు. భార్య సౌజన్య, ఇద్దరు కుమారులతో కలిసి నివసించేవాడు.

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-290
290-వర్షం దర్శకుడు శోభన్ కుమారుడు ,గోల్కొండ హైస్కూల్ తో సినీఅరంగేట్ర౦చేసిన ,టివి నటుడు –సంతోష్ శోభన్
సంతోష్‌ శోభన్ తెలుగు సినిమా నటుడు. ఆయన తెలుగు సినీ దర్శకుడు శోభన్ కుమారుడు. సంతోష్ 2011లో గోల్కొండ హైస్కూల్ చిత్రం ద్వారా బాలనటుడిగా సినిమారంగంలోకి వచ్చాడు. సంతోష్ శోభన్ బెంగళూరులోని క్రిస్ట్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ పూర్తి చేశాడు. సంతోష్ 2019లో “ది గ్రిల్” అనే వెబ్ సిరీస్ లో నటించాడు.[

సినీ రంగ ప్రస్థానం
సంతోష్ శోభన్ లో సంతోష్ 2011లో ‘గోల్కొండ హై స్కూల్’ చిత్రం ద్వారా బాలనటుడిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. 2015లో “తను నేను” చిత్రం ద్వారా హీరోగా పరిచయమై, 2018లో ‘పేపర్ బాయ్, 2021లో ‘ఏక్ మినీ కథ’[4][5] చిత్రంలో నటించాడు.

నటించిన సినిమాలు
సంవత్సరం

సినిమా

పాత్ర

దర్శకుడి పేరు

మూలాలు

2011

గోల్కొండ హైస్కూల్

ఇంద్రగంటి మోహనకృష్ణ

బాల నటుడిగా

2015

తను నేను

కిరణ్

పి.రామ్మోహన్

[6]

2018

పేపర్ బాయ్

వి.జయశంకర్

[7]

2021

ఏక్ మినీ కథ

సంతోష్

కార్తీక్ రాపోలు

మంచి రోజులు వ‌చ్చాయి

సంతోష్ “సంతు”

మారుతి

[8]

2022

ప్రేమ్ కుమార్‌

ప్రేమ్ కుమార్‌

అభిషేక్ మ‌హ‌ర్షి

[9]

అన్ని మంచి శకునములే

నందినీ రెడ్డి

[10]

శ్రీదేవి శోభన్ బాబు

ప్రశాంత్‌కుమార్‌ దిమ్మల

[11]

టెలివిజన్
సంవత్సరం

పేరు

పాత్ర పేరు

నెట్వర్క్

మూలాలు

2019

ది గ్రిల్

అర్జున్

వియూ

[12]

2021

ది బేకర్ అండ్ ది బ్యూటీ

విజయ్ కృష్ణ దాసరిపల్లె

ఆహా

సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-5-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -291

  • మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -291
  • 291-భాగ్యరేఖ ,దైవబలం కాడెద్దులు -ఎకరం నేల చిత్ర నిర్మాతలు -పొన్నలూరి బ్రదర్స్ 

పొన్నలూరి బ్రదర్స్ ఎన్టీఆర్ కెరీర్ లో దారుణమైన డిజాస్టర్ సినిమా-కాడెద్దులు –ఎకరం నేల

కలియుగ దైవం శ్రీ వెంటేశ్వర స్వామి పాత్రలో నటించిన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమా కూడా అయేడాదే విడుదల అయింది.ఎన్టీఆర్ ఫాన్స్ బాగా జోష్ లో ఉన్న తరుణం లో కాడెద్దులు ఎకరంనేల సినిమా విడుదలయ్యి డిజాస్టరుగా మిగిలింది.

అంతక ముందు ఎన్టీఆర్ తో దైవ బలం చిత్రాన్ని నిర్మించిన పొన్నలూరు బ్రదర్స్ నిరించిన సినిమా కాడెద్దులు ఎకరంనేల .ఎన్టీఆర్ తోనే బట్టి విక్రమార్కుడు చిత్రాన్ని రూపొందించిన జంపనా ఈ చిత్రానికి దర్శకులు.

 సినిమాకి జనాలు అంతగా రాకపోవటం తో కొన్ని కేంద్రాలలో కేవలం ఒక్కరోజు మాత్రమే సినిమాను ఉంచి తర్వాత తీసివేయటం కూడా జరిగింది.

మద్రాస్‌లో పొన్నలూరి బ్రదర్స్ సొంత స్టూడియో నిర్మించారు. పొన్నలూరి బ్రదర్స్ బ్యానర్‌పై ఇదే స్టూడియోలో 1957లో ‘్భగ్యరేఖ’ చిత్రాన్ని యన్టీ రామారావు, జమున కాంబినేషన్‌లో రూపొందించారు. ప్రముఖ దర్శకులు బిఎన్ రెడ్డి ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. వాహినీ సంస్థ చిత్రాలకేకాక ఇతర చిత్రాల సంస్థలకూ బిఎన్ రెడ్డి పనిచేయటం ‘్భగ్యరేఖ’తోనే ప్రారంభం కావటం విశేషం. ఆ చిత్రానికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చారు. భాగ్యరేఖ చిత్రానికి రాష్టప్రతి రజిత పతకం లభించింది. తరువాత పొన్నలూరి బ్రదర్స్ -యన్టీఆర్, అంజలి, రాజసులోచనతో ‘శోభ’ (1958), యన్టీఆర్, జానకి కాంబినేషన్‌లో ‘కాడెద్దులు- ఎకరం నేల’ (1960) నిర్మించారు. ‘శోభ’ చిత్రానికి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఏఎం రాజా సంగీత దర్శకత్వం వహించారు. ప్రసిద్ధ క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్యనటుడు, నాటక రచయిత రావి కొండలరావు ‘శోభ’ చిత్రం ద్వారానే సినీ రంగానికి పరిచయమయ్యారు. పొన్నలూరి బ్రదర్స్ బ్యానర్‌పై నిర్మాతలలో ఒకరైన వసంతకుమార్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో 1959లో రూపొందించిన జానపద చిత్రం ‘దైవబలం’. తరువాత వీరు 1966లో ‘పాదుకా పట్ట్భాషేకం’, 1973లో ‘పూలమాల’ చిత్రాలు నిర్మించారు.
దైవబలం చిత్రం 1959 సెప్టెంబర్ 17న విడుదలై 60ఏళ్లు పూర్తి చేసుకుంది.
యన్టీఆర్, జయశ్రీ (జయచిత్ర తల్లి.. అసలు పేరు అమ్మాజి) కాంబినేషన్‌లో వసంత్‌కుమార్‌రెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో ‘దైవబలం’ రూపొందింది. ఛాయాగ్రహణం: బిజె రెడ్డి
శబ్దగ్రహణం: కణ్ణన్
కళ: వాలి
సంగీతం: అశ్వద్ధామ
నేపథ్య సంగీతం: టీవీ రాజు
మాటలు, పద్యాలు: పరశురామ్
మేటి హాలాహలమ్మును మ్రింగవచ్చు/ ప్రళయ కాలాగ్నిలో బడి బ్రతుకవచ్చు/ ఎంత బలవంతుడైన.. తానెవ్వడైన/ దైవబలమును కాదనతరముగాదు. పరశురామ్ రచించిన ఈ పద్యాన్ని ఘంటసాల గానం చేశారు. ఈ పద్యంలోని సత్యాన్ని నిరూపించే కథతో రూపొందిన చిత్రం -దైవబలం.
మాళవ దేశ మహారాజు ఉగ్రసేనుడు (గుమ్మడి). అతని కుమార్తె రూప. ఆమె జాతకం చూసిన జ్యోతిష్యులు.. ఓ సామాన్యుడు ఆమెకు భర్త అవుతాడని చెబుతారు. విధి లిఖితాన్ని మార్చాలని ఉగ్రసేనుడు ప్రయత్నిస్తాడు. జ్యోతిషులను పంపించేసి, ఆ లక్షణాలుకల బాలుడు చంద్రసేనుని కనిపెడతారు. ఆ బాలుని తల్లి (మాలతి) వద్దనుంచి తెచ్చి వధించమని తలారులను మహారాజు ఆజ్ఞాపిస్తాడు. ఆ బాలుని తలారులు వదిలిపెట్టడంతో, అతడు తల్లితో కలిసి ఓ గురువు ఆశ్రయంలో ఆశ్రమవాసిగా పెరిగి సకల విద్యలు నేరుస్తాడు. ఒకనాడు రాకుమారి రూప (జయశ్రీ)ని కలిసిన చంద్రసేనుడు (యన్టీ రామారావు) ఆమె అనురాగం పొందుతాడు. రాకుమారి స్వయంవరానికి ఏర్పాటు చేసిన పోటీలలో పాల్గొని విజయం సాధిస్తాడు. అతడెవరో నిజం తెలుసుకున్న ఉగ్రసేనుడు అతన్ని భూతమందిరంలో బంధించగా, చంద్రసేనుడు అతన్ని వధించి రూప చెలికత్తె (బాల) సాయంతో తప్పించుకొని మృత్యుమందిరం చేరతారు. అక్కడ గంధర్వుని పత్ని, భర్త శాప విమోచనం కోసం సంగీత వృక్షాన్ని కోరుతుంది. కంకాక్షుడు (ముక్కామల) అనే రాక్షసరాజు వద్దనున్న సంగీత వృక్షాన్ని అతి ప్రయాసతో సాధించి, తనను ప్రేమించాననే కంకాక్షుని కుమార్తె (గిరిజ) వలపునుండి తప్పించుకుని రూపతోసహా చంద్రసేనుడు మాళవ రాజ్యం చేరతాడు. చంద్రసేన రూపలను బంధించి ఉరిశిక్ష విధించిన మహరాజు ఉగ్రసేనుడు, తన ఆలోచన మార్చుకొని ఇద్దరికీ వివాహం జరిపించి.. దైవ నిర్ణయాన్ని ఎంతటివారికైనా తప్పింపరాదన్న నిజాన్ని వెల్లడించటంతో చిత్రం ముగుస్తుంది.
ఈ చిత్రంలో చంద్రసేనుని బంధించిన వారికి రాశులలో బంగారం ఇస్తారన్న రాజు ప్రకటనతో అతన్ని బంధించటానికి యత్నించిన టక్కు, టమారాలుగా రేలంగి, రమణారెడ్డి నటించారు. యన్టీఆర్ మిత్రుడు, ఆశ్రమవాసిగా కస్తూరి శివరావు నటించగా, ప్రముఖ నటుడు శోభన్‌బాబు మృత్యుమందిరంలో (కావలివానిగా, గంధర్వుల కుమారునిగా) నటించారు. అతని తల్లిగా మోహన.. ఇంకా అనేకమంచి ఇతర పాత్రలు పోషించారు.
దర్శకులు వసంతకుమార్‌రెడ్డి కథానుగుణంగా సన్నివేశాలను తీర్చిదిద్దటంలో చాకచక్యం చూపించారు. ఓ జానపద చిత్రానికి తగిన విధంగా అన్ని అంశాలను మేళవించటం కనిపిస్తుంది. హీరో స్వయంవర పోటీల్లో అన్ని విన్యాసాల్లో పాల్గొనటం; రథాలమీద గుర్రాల మీద పోరాటాలు; భూతమందిరంలో.. తెలివిగా భూతం కాలిలోని కన్ను నొక్కి అంతం చేయటం; ఉగ్రసేనునినుంచి పారిపోయి మృత్యుమందిరం చేరిన రూపను పూవుగా మారిస్తే.. గంధర్వుని నుంచి ఆమెను రక్షించటానికి కంకాక్షుని రాజ్యంచేరిన చంద్రసేనుడు అతనితో చేసే పోరాటాలు; అక్కడ బందీకావటం; రూపతోసహా పారిపోతూ కంకాక్షునితో గుహలో జరిపిన పోరాటం; కంకాక్షుని ప్రాణంవున్న జీవిని పట్టి రూప వధించటం; హాస్యంకోసం రేలంగి, రమణారెడ్డిలపై ఓ పాట, సన్నివేశాలు, తల్లినుంచి చిన్నతనంలో చంద్రసేనుడు విడిపోయినపుడు విషాద గీతాన్ని అడవిలో తల్లీబిడ్డలపై చిత్రీకరణ -లేనే లేదా రానే రాదా బాబును చూసే భాగ్యము (తల్లి, బాలుడు చంద్రపై).. లేనే లేదా రానే రాదా అమ్మను చూసే భాగ్యము (రచన: సీనియర్ సముద్రాల, గానం: వైదేహి). చిత్రం చివరలో కూతురును బంధించిన మహారాజు ఉగ్రసేనునికి ఆమె బాల్యంలో తండ్రితో ప్రహ్లాదుని వృత్తాంతము గురించి చేసిన చర్చ గుర్తుకువచ్చి.. కూతురు రూపకోసం కారాగారం వద్దకు వచ్చి ఆమెను, చంద్రసేనుని విడిపించి, వారికి వివాహం జరుపనిశ్చయించి ‘దైవబలం’ గూర్చి వివరించటం, రాజులోని మానసిక పరివర్తన, మార్పునకు సంకేతంగా ఆ సన్నివేశాన్ని రూపొందించటం అర్ధవంతంగా నిలిచింది.
చిత్రంలో చంద్రసేనునిగా యన్టీ రామారావు పాత్రోచితం, పలు వైవిధ్య సన్నివేశానుగుణంగా నటన ప్రదర్శించారు. అతని జోడి రూపగా జయశ్రీ తన పాత్రకు తగిన నటనతో అలరించింది. చిత్రంలో వారిరువురిపై చిత్రీకరించిన నేటికీ అలరించే యుగళ గీతం -అందాల ఓ చందమామ రావోయి (గానం: పిబి శ్రీనివాస్, ఎస్ జానకి; రచన: అనిశెట్టి). హవాయిన్ గిటార్ బేస్‌తో పాట సాగుతుంది. చిత్రంలో పద్యాలు, పాటలు 14పైగా ఉన్నాయి. వాటిలో కొన్ని రమణారెడ్డి, రేలంగిలపై హాస్య గీతం -కొడితే కోస్తాలే కొట్టాలి ఒరే చిచ్చరపిడుగా (రచన: కొసరాజు, గానం: పిఠాపురం, మాధవపెద్ది). గిరిజపై చిత్రీకరించిన గీతం -జీవితం ఎంతో హాయి.. ఈ యవ్వనమే (గానం: వైదేహి, రచన: అనిశెట్టి). -చిరు చిరు నవ్వుల పువ్వుల మురిసే యుగళ గీతం యన్టీఆర్, జయశ్రీలపై (గానం: పిబి శ్రీనివాస్, ఎస్ జానకి, రచన: అనిశెట్టి), మరో గీతం -నిను వరియించి మదికరగించి (గానం: పిబి శ్రీనివాస్, జానకి; రచన: అనిశెట్టి) అశ్వద్దామ సంగీతంతో అలరించేలా రూపొందాయి.
దైవబలం చిత్రం స్క్రీన్‌ప్లే, ఫొటోగ్రఫీ, సంగీతం, నటీనటుల అభినయంపరంగా అలరించేలా రూపొందినా.. అంతగా ఆర్థిక విజయం సాధించలేదు. ‘అందాల ఓ చందమామ’ గీతం విన్నపుడల్లా మాత్రం ఈ చిత్రం గుర్తుకు రావటం.. ఓ మంచి జ్ఞాపకంగా మిగలటం హర్షణీయాంశం.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి

కాడెద్దులు ఎకరం నేల
కాడెద్దులు ఎకరం నేల 1960 తెలుగు భాషా నాటక చిత్రం. పొన్నలూరు బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పొన్నలూరు వసంతకుమార్ రెడ్డి నిర్మించాడు[1]. ఈ సినిమాకు జంపనా దర్శకత్వం వహించాడు[2]. ఇందులో ఎన్. టి. రామారావు, షావుకారు జానకి ప్రధాన పాత్రలలో నటించగా సి. ఎం. రాజు స్వరపరిచాడు.[3]


పాటలు
చాలులే నా గులాబి మొగ్గ మానులే నీ బడాయి – ఎ.ఎం. రాజా, ?
టక్కుటమారం తుక్కు దుమారం ఎక్కడ చూసిన – ?
తీయని పాటలు మాయని మాటలు మాసిపోవు – ఎస్. జానకి
యుగాలు మారినా జగాలు మారినా మారదు పేదల గాధా – పిఠాపురం
యాడుంటివే పిల్లా నీ జాడా జవాబు లేక చూస్తింటి – ?


కథ
ఈ చిత్రం ఒక గ్రామంలో ప్రారంభమవుతుంది, అక్కడ రాముడు (ఎన్. టి. రామారావు) ఒక యువకుడైన శక్తివంతుడు. తన 1 ఎకరా భూమి తో పాటు రెండు ఎద్దులతో సొంతంగా వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా నివసిస్తున్నాడు. అతను తన మామయ్య సూరయ్య (పెరుమాళ్ళు) కుమార్తె సీతను (షావుకారు జానకి) ప్రేమిస్తాడు. షావుకారు వెంకయ్య (రేలంగి) డబ్బు అప్పులు ఇచ్చేవాడు. అధిక వడ్డీకి రుణాలు ఇవ్వడం ద్వారా మొత్తం గ్రామాన్ని బాధించే దిర్మార్గుడు. సూరయ్య అతని దుశ్చర్యలకు మద్దతు ఇస్తాడు. రాముడు ఎల్లప్పుడూ అతనిపై పోరాటం చేస్తాడు. ఇంతలో, గ్రామంలో ఎన్నికలు ప్రకటించబడతాయి. షావుకర్ పోటీ చేస్తాడు. రాముడు తెలివైన వ్యక్తిని వీరయ్యను తన ప్రత్యర్థిగా నిలబెట్టి విజయం సాధిస్తాడు. ఈ కారణంగా షావుకర్ రాముడుపై పగ పెంచుకుంటాడు. అతను ఇప్పటికే చెల్లించిన తన రుణాన్ని తిరిగి చెల్లించలేదని అతనిపై తప్పుడు కేసు పెట్టాడు. కానీ దురదృష్టవశాత్తు రాముడు వద్ద ఎటువంటి ఋజువులు లేవు. కాబట్టి, రాముడు షావుకరు రుణాన్ని 3 నెలల్లోపు తిరిగి చెల్లించవలసి ఉంటుందని కోర్టు తీర్పు ఇస్తుంది, లేకపోతే అతని ఆస్తి సీలు చేయబడుతుంది అని చెబుతుంది. ఇప్పుడు రాముడు తన భూమిని తిరిగి పొందాలని నిర్ణయించుకుంటాడు, అందువల్ల, అతను తన తమ్ముడు గోపి (మాస్టర్ వెంకటేశ్వరులు) తో కలిసి నగరానికి వెళ్తాడు, అక్కడ అతను రేయింబవళ్ళూ శ్రమించి అవసరమైన మొత్తాన్ని సంపాదించే పనిలో ఉంటాడు. గ్రామంలో, సూరయ్య సీతకు మరో సంబంధాన్ని సూస్తాడు. కాబట్టి, ఆమె తప్పించుకుని రాముడును వెతుక్కుంటూ నగరానికి చేరుకుంటుంది.

రాముడు హత్య కేసులో చిక్కుకుంటాడు, గోపీ సహాయంతో సీత అతన్ని రక్షిస్తుంది. వారందరూ గ్రామానికి తిరిగి వస్తారు. రుణం తిరిగి చెల్లించినప్పటికీ ఇక్కడ షావుకరు భూమిని రాముడుకు ఇవ్వడానికి నిరాకరించాడు. ఇప్పుడు సూరయ్యతో సహా గ్రామస్తులంతా కలిసి నిలబడి షావుకరుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తారు. చివరికి, షావుకారు అనుచరులు సూరయ్యను వెనక్కి నెట్టినపుడు రాముడు తనకు రక్షణకు వచ్చినప్పుడు అతని ఇంటిని దోచుకోవడానికి ప్రయత్నిస్తారు. చివరికి, షావుకరు తన తప్పును గ్రహించి తన ఆస్తిని గ్రామస్తులకు పంపిణీ చేస్తాడు. చివరగా, ఈ చిత్రం రాముడు, సీత వివాహం తో సంతోషకరమైన నోట్ తో ముగుస్తుంది.

తారాగణం
ఎన్. టి. రామారావు రాముడుగా
షావుకారు జానకి సీతగా
రేలంగి వెంకటరమయ్య షావుకారు వెంకయ్యగా
రమణా రెడ్డి గోవిందయ్యగా
వంగర షావుకరు బావమరిది
సురయ్యగా పెరుమాళ్ళు
నామలుగా సీతారాం
కాంతిగా సూరబి బాలసరస్వతి
రాముడు తల్లిగా లక్ష్మీకాంతమ్మ
నిర్మలమ్మ సురయ్య భార్యగా
గోపిగా మాస్టర్ వెంకటేశ్వరులు

  నేను స్నేహితులతో ఈ సినిమా కు వెళ్లి మధ్యలో పారి పోయొచ్చాం .నా జీవితం లో అంతటి బోరింగ్ సినిమా చూడనే లేదు అప్పటి నుంచి ఇప్పటికి .


  • మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-285
  • 285-మెలోడి కి శ్రీకారం చుట్టి ,సంప్రదాయ సంగీతానికి నవ్యత కూర్చి 500పాటలు పాడిన సంగీత దర్శకుడు.లేతమనసులు ,మంచి చేసు సినీ ఫేం – –ఎం.ఎ
  • స్.విశ్వనాధన్-2

సంగీ‌త‌మ‌నేది మాన‌వు‌డికి భగ‌వం‌తుడు ప్రసా‌దిం‌చిన వరం.‌ ఆనందం, బాధ, కోపం, ప్రేమ, విరహం వంటి ఎలాంటి భావా‌ల‌కైనా అద్దం‌ప‌ట్టేది సంగీ‌తమే.‌ వేదాలు కూడా సంగీత స్వరాలే.‌ రాళ్లను కూడా కరి‌గించే గాంధర్వం సంగీతం.‌ సంగీతం సాధిం‌చ‌లే‌నిది ఏదీ లేదు.‌ ఎందు‌కంటే స్వరాల ప్రభావం అమోఘం కనుక.‌ రాగం, తాళం, స్వరం సమ్మి‌ళి‌త‌మై‌న‌ప్పుడు శ్రావ్య‌మైన సంగీతం ఉద్భ‌వి‌స్తుంది.‌ అటు‌వంటి సంగీ‌తా‌నికి శాశ్వ‌త‌త్వాన్ని అందిం‌చిన స్వర్ణ‌యు‌గపు సంగీత సామ్రాట్‌ ‌‘‌‘ఎమ్మెస్‌’‌’‌ అని అభి‌మా‌నంగా పిలి‌పిం‌చు‌కున్న కళా‌మ‌తల్లి కంఠా‌భ‌రణం ఎమ్మెస్‌ విశ్వ‌నా‌థన్‌.‌ జూన్‌ 24, 1928న కేర‌ళలో జన్మిం‌చిన ఎమ్మెస్‌ పన్నెండు వందల సిని‌మా‌లకు పైగా అద్భు‌త‌మైన సంగీ‌తాన్ని అందిం‌చిన కలై‌మా‌మణి.‌ ఇవాళ ఎమ్మెస్‌ జయంతి.

విశ్వ‌నా‌థన్‌ సంగీ‌తంలో కని‌పిం‌చని ఆక‌ర్షణ ఏదో వుంది.‌ కాలం‌తో‌బాటు ఎమ్మెస్‌ తన సంగీత పంథా కూడా మార్చు‌కు‌న్నారు.‌ యువ‌త‌రాన్ని ఆక‌ర్షిం‌చ‌గ‌లి‌గారు.‌ అలా‌గని క్లాసి‌కల్‌ టచ్‌ని విడ‌నా‌డ‌లేదు.‌ తెలుగు సినీ రంగ విష‌యా‌నికి వస్తే 1955లో విశ్వ‌నా‌థన్‌ ‌‘సంతోషం’‌ సిని‌మాకు సంగీతం సమ‌కూ‌ర్చారు.‌ స్వతంత్ర నిర్దే‌శ‌కు‌నిగా అనేక విజ‌య‌వం‌త‌మైన తెలుగు సిని‌మా‌లకు సంగీతం అందిం‌చారు.‌ ఆయన చేసిన సంగీ‌తా‌నికి సింహ‌భాగం పాటలు రాసింది ఆచార్య ఆత్రేయ.‌ ఎమ్మెస్‌ ప్రజా‌ద‌రణ పొందిన పాటలు తెలు‌గులో కోకొ‌ల్లలు.‌ ‌‘తనువు కెన్ని గాయా‌లైనా’, ‌‘బుజ్జి‌బుజ్జి పాపాయి’‌ (ఆడ‌బ్రతుకు), ‌‘రేపంటి రూపం కంటీ’‌ (మంచి −‌ చెడు), ‌‘తల‌చి‌నదే జరి‌గి‌నదా’‌ (మనసే మందిరం), ‌‘అందాల ఓ చి‌లకా’, ‌‘కోడి ఒక‌కో‌నలో’‌ (లేత‌మ‌న‌సులు), ‌‘నన్ను ఎవరో తాకిరి’‌ (సత్తె‌కా‌ల‌పు సత్తెయ్య), ‌‘ఏమం‌టు‌న్నది ఈ గాలి’‌ (మేమూ మను‌షు‌లమే), ‌‘తాళి‌కట్టు శుభ‌వేళా’‌ (అందు‌లేని కథ), ‌‘ఏ తీగ పూవునో’‌ (మరో చరిత్ర), ‌‘సన్న‌జా‌జు‌లోయ్‌’‌ (సింహ‌బ‌లుడు), ‘అటు‌ఇటు కాని హృద‌యము తోటి’ (ఇది కథ‌కాదు), ‌‘నువ్వేనా సంపంగి పువ్వుల’‌ (గుప్పె‌డు‌మ‌నసు), ‌‘కుర్రా‌ళ్ళోయ్‌ కుర్రాళ్ళు’‌ (అంద‌మైన అను‌భవం), ‌‘కన్నె పిల్ల‌వని కన్ను‌లు‌న్న‌వని’‌ (ఆక‌లి‌రాజ్యం), ‌‘కదిలే మేఘమా’‌ (లైలా), ‌‘పల్ల‌వించవా నా గొంతులో’‌ (కోకి‌లమ్మ) పాటలు ఉదా‌హ‌ర‌ణకు కొన్ని మాత్రమే.‌ ఎమ్మెస్‌ కొన్ని మల‌యాళ సిని‌మాల్లో నటిం‌చారు‌ కూడా.‌

చెన్నైలో ఎంఎస్ విశ్వనాథన్ మృతి సినీ పరిశ్రమ అశ్రు నివాళి

 తన అసమాన ప్రతిభతో సంగీత కళామతల్లిని ఓలలాడించిన ముద్దుబిడ్డ ఎంఎస్ విశ్వనాథన్ తనను వదలి తిరిగిరాని లోకాలకు వెల్లడంతో ఆ సంగీత కళామతల్లి కంటతడి పెట్టింది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో చెన్నై అడయారులోని ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. 87 ఏళ్ల ఈ కురువృద్ధుడు మరణానికి సినీలోకం అశువులు బాసింది. నెల రోజుల క్రితం శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఎంఎస్ విశ్వనాథన్ చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు.     

భారతీయ సినిమా అపర సంగీత చాణుక్యుడు ఎం ఎస్ విశ్వనాథన్. ఎం అంటే మహా ఎస్ అంటే సంగీతం. విశ్వనాథన్ సొంతం. 70 వసంతాలకు పైగా సంగీత కళామతల్లి ఒడిలో ఓలలాడుతూ సరిగమలతో జతులుకడుతూ తాను ఎదుగుతూ సంగీత మాధుర్యాన్ని ఇతరులకు పంచుతూ సంగీత కుటుంబాన్ని పెంచుతూ సంగీత రారాజుగా మన్ననలను అందుకున్న ఎం ఎస్ విశ్వనాథన్‌ను అమరజీవి అయ్యారు. అయినా సంగీత పిపాసి చిరంజీవినే. తమిళ సినిమా సంగీత చక్రవర్తి అంటూ సాక్షాత్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితనే 2012లో బిరుదుతో సత్కరించి 60 బంగారు నాణేలతో పాటు కారును బహూకరించారు.

 

 బాల్యం : మెల్లిసై మన్నర్ (ది కింగ్ ఆఫ్ లైట్ మ్యూజిక్) బిరుదాంకితుడైన ఎం ఎస్ విశ్వనాథన్ 1928 జూన్ 24న కేరళ రాష్ట్రం పాలక్కాడు సమీపంలోని ఎలపుల్లి గ్రామంలో జన్మించారు. మనయాంగల్ సుబ్రమణియన్, నారాయణి కుట్టి తల్లిదండ్రులు. నాలుగేళ్ల వయసులోనే ఎంఎస్‌కు పితృయోగం కలిగింది. దీంతో విరక్తి చెందిన తల్లి ఎంఎస్‌ను చంపి తన జీవితాన్ని చాలించాలని ప్రయత్నించారు. ఆ సమయంలో ఎంఎస్ తాత సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు.

ఎంఎస్‌కు చదువుల తల్లి దగ్గరవ్వలేదు. సంగీతంపై ఆసక్తి కనబరచడంతో నీలకంఠం భాగవతార్ వద్దకు పంపారు. ఆయన వద్ద మూడేళ్లు సంగీతంలో సాధన చేశారు. అలా 13 ఏళ్ల వయసులోనే నిర్విరామ సంగీత కచేరి చేసి ప్రశంసలు అందుకున్నారు. ఎంఎస్‌కు నటనపైనా మక్కువే. తాత జైలు వార్డెన్ కావడంతో జైలు రోజున ఖైదీలతో హరిచంద్రనాటకం వేయించారు. అందులో ఎం ఎస్ లోహితుడిగా నటించి అదరగొట్టేశారు.

 మద్రాస్ పయనం: అది 1941వ సంవత్సరం విజయదశమి పర్వదినం మేనమామ సహాయంతో ఎం ఎస్ విశ్వనాథన్ మద్రాస్ మహానగరంలో కాలు మోపారు. జూపిటర్ పిక్చర్స్ అధినేతలు ఎం.సుందరం శెట్టియార్, మొహిద్దీన్ చిత్రం నిర్మించ తలపెట్టారు. అందులో ఒక పాత్ర కోసం ఎం ఎస్‌కు మేకప్ టెస్ట్ చేశారు. అయితే ఆయన ఆ పాత్రకు నప్పకపోవడంతో తరువాత చూద్దాం అంటూ చేతులు దులిపేశారు. పరిస్థితి పాలుపోని ఎంఎస్ వారిని బ్రతిమలాడుకుని వారి కార్యాలయంలోనే బాయ్‌గా చేరారు.

ఆ తరువాత ఆ సంస్థ నిర్మించిన కుబేర కుశలుఅనే చిత్రంలో సైనికుడిగా నటించారు. అయితే నటుడిగా తాను పనికి రానని గ్రహించి సంగీత రంగంపై దృష్టి సారించారు. సేలం మోడ్రన్ థియేటర్స్ సంస్థలు సంగీత దర్శకుడు కేవీ మహదేవన్ ఉన్నారని తెలిసి ఆయన్ని కలిశారు. ఎంఎస్ విశ్వనాథన్‌తో ఒక పాట పాడించుకున్న మహదేవన్ ఆయనలోని ప్రతిభను గ్రహించి సెంట్రల్ స్టూడియోకు వెళ్లు పని దొరుకుతుందని చెప్పారు. ఎంఎస్ నేరుగా సెంట్రల్ స్టూడియోలో సంగీత దర్శకుడు ఎస్‌ఎం సుబ్బయ్య నాయుడిని కలిశారు. అంతే ఆయన ట్రూప్‌లో హార్మోనిస్టుగా చేరారు. ఆ తరువాత సీఆర్ సుబ్బరాయన్ సంగీత ట్రూప్‌లో చేరారు. అక్కడ టీకేరామమూర్తితో పరిచయం ఏర్పడింది. 1952లో సీఆర్ సుబ్బరాయన్ మరణించడంతో ఆయన సంగీతాన్ని అందిస్తున్న దేవదాస్, చండీరాణి చిత్రాలను పూర్తి చేసే బాధ్యతలను ఎం ఎస్ విశ్వనాథన్, రామమూర్తి నిర్వహించారు.

 అలా ఆ చిత్రాల విజయాలతో ఎం ఎస్ విశ్వనాథన్ జెనోవా చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్ర కథా నాయకుడు ఎంజీఆర్ కావడం విశేషం. రామమూర్తి విశ్వనాథన్‌ల ద్వయం : ఆ తరువాత నిర్మాత టీకే కల్యాణం తన చిత్రం పణంకు రామమూర్తి విశ్వనాథన్‌లను కలిపి సంగీతం అందించమని చెప్పారు. అలా మొదలైన ఆ సంగీత ద్వయం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ అంటూ 700 చిత్రాల వరకు నిర్విఘ్నంగా కొనసాగింది. మొత్తం 1200 చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఘనత ఎం ఎస్‌ది. ఎం ఎస్ విశ్వనాథన్ భార్య పేరు జానకి అమ్మన్. వీరికి గోపికృష్ణ, మురళీధరన్, ప్రకాష్, హరిదాస్ అనే నలుగురు కొడుకులు. లతా మోహన్, మధు ప్రసాద్, శాంతికుమార్ అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

  చెన్నై శాంతోం రోడ్డులో నివసిస్తున్న ఎంఎస్ విశ్వనాథన్ కుటుంబం నివశిస్తోంది. ఎం ఎస్ విశ్వనాథన్ భౌతిక కాయానికి బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బీసెంట్‌నగర్ శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. నేడు ఎంఎస్ అంత్యక్రియల కారణంగా సినిమా షూటింగ్‌లు రద్దయ్యాయి.

  సీఎంల చిత్రాలకు సంగీతం : ముఖ్యమంత్రులుగా తమిళ, తెలుగు రాష్ట్రాలను పరిపాలించిన, పాలిస్తున్న ముఖ్యమంత్రులు ఎంజీఆర్, ఎన్‌టీఆర్, జయలలిత నటించిన పలు చిత్రాలకు ఎం ఎస్ విశ్వనాథన్ సంగీతం పక్క బలాన్నిచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితోను ఎంఎస్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి.

  గాయకులకు పేరు ప్రఖ్యాతులు : ఎం ఎస్ విశ్వనాథన్ చాలామంది గాయనీ గాయకులకు పేరు ప్రఖ్యాతులు అందించారు. నేటి ప్రఖ్యాత గాయనీ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, ఎల్‌ఆర్ ఈశ్వరి, టీఎం సౌందరరాజన్, కేజే ఏసుదాస్ మొదలగు వారందరూ ఎం ఎస్ సంగీతంలో ఆలపించి ప్రశంసలందుకున్న వారే.

 నటుడు, గాయకుడు కూడా: ఎం ఎస్ గొప్ప సంగీత దర్శకుడే కాదు. గాయకుడు, నటుడు కూడా. ఆయన తన చిత్రాలతో పాటు ఇతర సంగీత దర్శకుల చిత్రాల్లోనూ పాడారు. మొత్తం 500లకు పైగా పాటలను పాడారు. ఇక చిన్నతనంలో నటుడవ్వాలన్న కోరికను ప్రముఖ సంగీత దర్శకుడైన తరువాత తీర్చుకున్నారు. కాదల్‌మన్నన్ చిత్రంలో ఎంఎస్ తొలిసారిగా హాస్యపాత్రలో అలరించారు. ఆ తరువాత కాదలా కాదలా తదితర 10 చిత్రాల్లో నటించారు.

 

 జాతీయ అవార్డులు లేవు కాని….

 ఎం ఎస్ విశ్వనాథన్ జాతీయ అవార్డులకు అలంకారం అయ్యే అవకాశాన్ని పొందలేదు గాని ఆయనికి అంతకం టే గొప్ప అవార్డులే వరించాయి. 1963 జూలై 16న గీత రచయిత కన్నదాసన్, దర్శకుడు శ్రీధర్, నటుడు జెమినీ గణేశన్, చంద్రబాబు చిత్రాలయ గోపుల సమక్షంలో శి వాజీ గణేశన్ రామమూర్తి, విశ్వనాథన్‌లకు మెల్లిసై మ న్నన్ అనే బిరుదు ఇచ్చి సత్కరించారు. కలైమామణి, ఫిలింఫేర్ లాంటి పలు బిరుదులు ఎం ఎస్‌ను వరించా యి. అన్నింటికంటే పెద్ద బిరుదు సంగీత ప్రియులు ఎం ఎస్‌ను గుండెల్లో స్థిరస్థాయిగా నింపుకున్నారు. సంగీతం ఉన్నంత కాలం ఎంఎస్ విశ్వనాథన్ చిరంజీవినే.

సినీ సంగీతంలో విశ్వ’నాదం’

ఆయన స్వర పరిచిన పాటల కోసం సంగీతాభిమానులు కన్నులు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. శ్రోతల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆయన సరిగమలు పలికిస్తారు. ఆయన పాటలు విని సంగీతాభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏ చిత్రానికి ఆయన సంగీతం అందించినా శ్రోతలు సంగీత సాగరంలో ఒలలాడాల్సిందే. ఆయనే సుప్రసిద్ధ సంగీత దర్శకుడు, కింగ్ ఆఫ్ లైట్ మ్యూజిక్ ఎం ఎస్ విశ్వనాథన్ (87).
చెన్నై నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎం ఎస్ విశ్వనాథన్ మంగళవారం తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా శ్వాస కోస వ్యాధితో బాధపడుతున్న ఎం ఎస్ను కుటుంబసభ్యులు ఇటీవలే నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ ఆయన ఆరోగ్యం గత మంగళవారం కుదుటపడింది. దాంతో ఎం ఎస్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు ప్రకటించారు. ఎంఎస్ను ఇంటికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వైద్యులు ఆయన్ని ఐసీయూకి తరలించారు. ఆ క్రమంలో చికిత్స పొందుతూ ఎంఎస్ మరణించారు.
తెలుగు, తమిళ, మలయాళ భాషలకు చెందిన దాదాపు 750  చిత్రాలకు పైగా ఆయన సంగీత దర్శకత్వం వహించారు.1952లో శివాజీ గణేషన్ హీరోగా నటించిన పానమ్ చిత్రానికి తొలిసారిగా సంగీతాన్ని అందించారు. ఆ తర్వాత ఎం ఎస్ విశ్వనాథన్ ప్రాణ స్నేహితుడు టీకే రామ్మూర్తితో కలసి ‘విశ్వనాథన్ – రామ్మూర్తి’ పేరిట ఎన్నో హిట్స్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఆ తర్వాత 1965లో విశ్వనాథన్, రామ్మూర్తి ద్వయం విడిపోయింది. అనంతరం ఎం ఎస్ విశ్వనాథన్ సంగీత దర్శకత్వంలో ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి.
తెలుగులో నిర్మించిన తెనాలి రామకృష్ణ, అంతులేని కథ, ఇది కథ కాదు, ఆకలి రాజ్యం తదితర చిత్రాలకు ఎం ఎస్ స్వర రచన చేశారు. ఎంఎస్ సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలన్నీ తెలుగు ప్రజలను ఆనందపరవశుల్ని చేశాయి. ఎం ఎస్ విశ్వనాథన్, ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ కాంబినేషన్లో వచ్చిన అన్ని చిత్రాల్లోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్లే.
ఎం ఎస్ విశ్వనాథన్ భార్య జానకీ 2012లో మరణించారు. ఆ తర్వాత ఆయన మిత్రుడు టీ కే. రామ్మూర్తి మృతి చెందారు. ఎం ఎస్ విశ్వనాథన్ సంగీత సేవలను గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారంతో సత్కరించి తనను తాను గౌరవించుకుంది. అలాగే లెక్కకు మిక్కిలి పురస్కారాలు ఎం ఎస్ విశ్వనాథన్ను వరించాయి. 1928 జూన్ 24న కేరళలోని పాలక్కడ్ సమీపంలోని  ఇలప్పుళిలో ఎంఎస్ విశ్వనాథన్ జన్మించారు.

సశేషం

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-287

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-287
287-చతుర్భాషా నటి ,డబ్బింగ్ ఆర్టిస్ట్ ‘’మెడిమిక్స్ షొప్ ‘’ఫేం ,బుల్లితెర ఫేం ,సాహిత్య అకాడెమి అవార్డీ,-రోహిణి
రోహిణి దక్షిణ భారత సినిమా నటి, డబ్బింగ్ కళాకారిణి, టీవీ వ్యాఖ్యాత, సామాజిక కార్యకర్త, రచయిత. సినీరంగములో బాల్యనటిగా అడుగుపెట్టిన రోహిణి తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం భాషలలో అనేక సినిమాలలో బాల్యనటిగా నటించింది. ఆ తర్వాత కొంతకాలము తర్వాత చాలా సినిమాలలో చెల్లెలి పాత్రలు చేసింది. మలయాళంలో ప్రారంభించి తెలుగు తమిళ భాషల్లో కూడా కథానాయికగా నటించింది. నటన కొనసాగిస్తూనే డబ్బింగ్ లో కూడా ప్రవేశించింది. నవమోహిని లాంటి సినిమాలలో గ్లామర్ పాత్రలు పోషించినా, అంతగా విజయవంతము కాలేదు[1] రోహిణి సినీ నటుడు రఘువరన్ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నది. వీరి వివాహబంధము పొసగక వివాహమైన ఏడు సంవత్సరాలకు 2003లో విడాకులు తీసుకొని విడిపోయారు.
జీవిత౦
రోహిణి స్వస్థలం అనకాపల్లి. ఇంటిపేరు మొల్లేటివారు. తండ్రి రావునాయుడు పంచాయితీ అధికారి. లారీల వ్యాపారం కూడా చేసేవాడు. ఆయనకు స్వతహాగా నటన మీద ఆసక్తి ఉండేది. ఈమెకు ముగ్గురు అన్నలు, ఒక తమ్ముడు. తెలుగు టీవీ నటుడు బాలాజీ కూడా ఈమె సోదరుడే. రోహిణికి నాలుగేళ్ళ వయసులో తల్లి సరస్వతి చనిపోవడంతో చెన్నైకి మకాం మార్చి, సినిమాల మీద ఆసక్తితో తండ్రి స్టూడియోల చుట్టూ తిరుగుతుంటే రోహిణిని కూడా తీసుకువెళ్ళేవాడు. అలా స్టూడియోలో ఆమెను చూసి యశోద కృష్ణ అనే సినిమాలో బాలనటిగా అవకాశమిచ్చారు. తండ్రికి సినిమాలంటే ఇష్టమే కాబట్టి ఏ ఇబ్బందులు లేకుండానే సినీరంగంలో ప్రవేశించింది.

సినిమాల్లో అవకాశాలు వస్తూండటంతో ఆమెకు చదువుకునే వీలు కలగలేదు. పన్నెండేళ్ళు వచ్చేసరికి అటు బాలనటిగానూ, ఇటు పెద్దమ్మాయిగానూ పాత్రలు సరిగా రాలేదు. దాంతో ఆమె చదువుకోవడం కోసం నేరుగా ఐదోతరగతిలో చేరింది. మూడేళ్ళు గడిచాక కక్క అనే మలయాళ సినిమాలో కథానాయికగా అవకాశం వచ్చింది. ఆమె రఘువరన్ ని తొలిసారిగా చూసింది అక్కడే. ఆ సినిమా విజయవంతం కావడంతో మలయాళంలో వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా పనిచేసింది.[2] నటన, డబ్బింగ్ లో కొనసాగుతూనే ప్రైవేటుగా ఆంగ్లంలో ఎం. ఎ పూర్తి చేసింది.

డబ్బింగు ఆర్టిస్ట్
డబ్బింగు ఆర్టిస్ట్ గా చాలా తెలుగు సినిమాల్లో హీరోయిన్‌ లకు స్వర సహాయం చేసింది. “లేచి పోదామా” అని కవ్వించే గీతాంజలి నాయిక గొంతు, “చాయ్ పిలాతే” అనే “శివ” నాయిక గొంతు రోహిణిదే. నాలుగు స్తంభాలాట సినిమాకి సహాయ దర్శకులుగా పనిచేసిన పాణి షూటింగ్లో రోహిణిని గమనించి, గీతాంజలిలో గిరిజ డబ్బింగ్ కోసం ఆర్టిస్టును వెతుకుతుంటే రోహిణిని అడగమని సలహా ఇచ్చాడట. సినిమా ఆర్టిస్టుగా బదులు డబ్బింగ్ ఆర్టిస్టుగా ముద్రపడిపోతుందేమోనని భయంతో చేయకూడదని అనుకున్నది, మణిరత్నం సినిమాలో అవకాశం కాదనలేక ఈ సినిమాకు డబ్బింగు చేసింది. గీతాంజలి తర్వాత “శివ”లో అమల పాత్రకు డబ్బింగ్ చేయమని రాంగోపాల్ వర్మ అడిగితే రోహిణి ఒప్పుకోలేదు. ఒక మూడు రీళ్ళు చూసి నచ్చితే చేయమన్నారు. అది చూసి నచ్చాక అమలకు కూడా డబ్బింగ్ చెప్పారు. ఆ సినిమా పెద్ద హిట్టై పోవడంతో ఇక అలాగే డబ్బింగు రంగంలో కొనసాగింది. ఒక్క విజయశాంతికి తప్ప దాదాపు తెలుగులో అందరు హీరోయిన్లకు డబ్బింగు చెప్పింది రోహిణి.[3]

నటిగా గుర్తింపు
1995లో పాలగుమ్మి పద్మరాజు “పడవప్రయాణం” కథ ఆధారంగా మలయాళ దర్శకుడు కె.ఎస్.సేతుమాధవన్ నిర్మించిన స్త్రీ సినిమాలో ముఖ్యపాత్రను పోషించిన రోహిణి ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకొన్నది. రోహిణి తెలుగులో హీరోయిన్‌గా నటించిన చిత్రం “స్త్రీ”లో ఈమె ప్రదర్శించిన నటనకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో ఉత్తమ మహిళా నటి నంది బహుమతితో సత్కరించింది. ఈ చిత్రం విడుదలకు నోచుకోక పోయినా ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే నేషనల్ అవార్డు కూడా ఈమెను వరించింది. వీటితో పాటు “వీరుమండి”, “తామరైభరణి”, “ఒంబదు రూబాయ్ నోట్టు” అనే తమిళ చిత్రాలలో రోహిణి పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది.

ప్రతిభావంతమైన వ్యక్తి అయిన రోహిణి ఆ తర్వాత సామాజిక సేవ కార్యక్రమాలు, టీవీ కార్యక్రమాలలో నిమగ్నమైనది. చాలా వ్యవధి తర్వాత కమల్ హాసన్ సినిమా పోతురాజు (తమిళంలో విరుమాండి)లో, అయ్యన్ (తమిళం)లో నటించింది. పోతురాజు సినిమాలో ఒక పరిశోధకురాలి పాత్రలో కనిపించింది. అలా మొదలైంది సినిమాలో నానికి తల్లిగా నటించింది.

సినీరంగంతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే బుల్లితెరలో ప్రవేశించింది. వివిధ సీరియల్ కథలకు స్క్రిప్టులు రాశారు. “వీరుక్కు నీర్” అనే టెలీ ఫిల్మ్‌ కోసం అమెకు 2005లో సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వరించింది.[4]

రోహిణి ఎయిడ్స్ వ్యాధిపై ప్రజలలో అవగాహన కల్పించడానికి అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నది.[5][6] తమిళనాడు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, డాక్టర్ ఎంజిఆర్ విశ్వవిద్యాలయం తరపున నిర్మించిన ఎయిడ్స్ అవగాహన షార్ట్‌ ఫిల్మ్స్‌కు ఆమె దర్శకత్వం వహించింది. అంతేకాకుండా సామాజిక అంశాలను ప్రతిబింభించే అంశాలపై చర్చా వేదికలు నిర్వహించింది.

స్వయంగా బాల్యనటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రోహిణి బాల్యనటుల అంతరంగంపై “సైలెంట్ హ్యూస్” అనే 52 నిమిషాల నిడివి కల డాక్యుమెంటరీని నిర్మించి దర్శకత్వం వహించింది.[7][8]

నటించిన చిత్రాలు
· కొలంబస్[9]

· ఆశ ఆశ ఆశ (1996)

· జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ (2018)

· తిప్పరా మీసం (2019)

· రంగ్ దే (2021)

· మీట్ క్యూట్ (2022)

· సెబాస్టియన్ పి.సి.524 (2022)

ఈమధ్య వచ్చిన కళ్యాన్ రాం నటించిన సినిమాలో రావు రమేష్ కు భార్యగా నటించింది
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-5-22-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-286

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-286
286నాటక -కృష్ణ ,అభిమన్యు ,పురుష పాత్రధారి ,పుల్లయ్య గారి మొదటి లవకుశ లో సీతా సాధ్వి గా నీరాజనాలందుకొన్నగాయని –సీనియర్ శ్రీరంజని
శ్రీరంజని (సీనియర్)గా ప్రసిద్ధి చెందిన మంగళగిరి శ్రీరంజని (1906 – 1939) ప్రముఖ పాతతరం చలన చిత్ర నటి. ఈవిడ మరో నటి శ్రీరంజని (జూనియర్)కు అక్క, దర్శకుడు ఎం.మల్లికార్జునరావుకు తల్లి. 1906లో గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి గ్రామంలో జన్మించింది. ఈవిడ 1920, 1930లలో గ్రామోఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా వారు విడుదలచేసిన నాటకాలను రికార్డులలో గాయనిగా తన ప్రైవేటు గీతాల ద్వారా ప్రసిద్ధి పొందింది. చిత్రాలలో నటించకముందు ఈమె పౌరాణిక నాటకాలలో అభిమన్యుడు, సత్యవంతుడు, కృష్ణుడు వంటి పురుష పాత్రలు వేసేది,[2] అప్పట్లో ఆవిడ కృష్ణ విలాస నాటక సమాజంలో సభ్యురాలు. సి.పుల్లయ్య తీసిన లవకుశ (1934) ఈవిడ మొదటి చిత్రం. ఈవిడ మొత్తం 9 చిత్రాలలో నటించింది. 1939లో క్యాన్సర్ వ్యాధి కారణంగా మరణించింది.

వైవాహిక జీవిత౦
శ్రీరంజని బెజవాడ హనుమాన్‌ దాసు దగ్గర సంగీతం నేర్చుకుంది. మహాకవి కాళిదాసు (1960), ప్రమీలార్జునీయం (1965) వంటి చిత్రాల నిర్మాత కె.నాగమణి కూడా హనుమాన్‌దాసు దగ్గరే హార్మోనియం నేర్చుకుంది. శ్రీరంజని నాటకాలలో నటిస్తున్నప్పుడు నాగుమణి హార్మోనియం వాయించేది. పరిచమయిన కొన్నాళ్ళకి వారిద్దరు భార్యాభర్తలయ్యారు. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. శ్రీరంజని తను చనిపోయేముందు పిల్లల సంరక్షణార్థం తన భర్తను తన చెల్లెలు మహాలక్ష్మిని పెళ్ళి చేసుకోమని చెప్పారు. తర్వాత ఆమె పేరును కూడా శ్రీరంజనిగా మార్చారు. ఆవిడ శ్రీరంజని జూనియర్ గా ప్రసిద్ధి పొందింది, అందువలనే శ్రీరంజనికి సీనియర్ శ్రీరంజని అని పేరు వచ్చింది.

రంగస్థల జీవిత౦
శ్రీరంజని మేనత్తలు నాట్యము చేసేవారు, పాడేవారు. శ్రీరంజనికి ఉత్సాహం కలిగి వారిదగ్గరే ప్రాథమిక పాఠాలు నేర్చుకుంది. రాధాకృష్ణ, శశిరేఖాపరిణయం, సావిత్రి, కనకతార, ఉషాపరిణయం మొదలైన నాటకాలు శ్రీరంజనికి పేరు తెచ్చాయి. అవసరాన్ని బట్టి ఆవిడ నాటకాలలో మగవేషాన్నీ వేసేది. శశిరేఖాపరిణయంలో శశిరేఖ వేసేది, అభిమన్యుడు వేసేది, రాధాకృష్ణలో రాధ, కృష్ణ రెండూ పాత్రలు వేసేది. ఆమెది మంచి గాత్రమని హెచ్.ఎమ్.వి. గ్రామఫోను సంస్థ ఆమెతో ఒప్పందం కుదుర్చుకుని ఎన్నో గ్రామఫోను రికార్డులలో పాడించింది.

చలనచిత్ర జీవిత౦

శ్రీరంజని చివరి చిత్రం వరవిక్రయము (1939)

శ్రీరంజనికి ప్రయత్నం లేకుండానే సినిమాలో నటించడానికి అవకాశం వచ్చింది. హెచ్.ఎమ్.వి వారు రిహార్సల్సుకని శ్రీరంజనిని బెజవాడ తీసుకువెళ్ళారు. ఆ సమయంలో సి.పుల్లయ్య లవకుశ చిత్రం ఆరంభించడానికి నటులకోసం వెతుకుతున్నారు. ఆ చిత్రంలో శ్రీరామునికి పాత్రకి పారుపల్లి సుబ్బారావునీ, వాల్మీకి పాత్రకి పారుపల్లి సత్యనారాయణనీ నిర్ణయించగా వారి ద్వారా శ్రీరంజని గురించి తెలుసుకున్నారు. అలా శ్రీరంజనికి సీతపాత్ర ఖరారు అయ్యింది. శ్రీరంజని, నాగుమణి ముందు గ్రామఫోను రికార్డింగు నిమిత్తం బెంగళూరు వెళ్ళి అక్కడి నుండి లవకుశ షూటింగ్ కోసం కలకత్తా వెళ్ళారు. లవకుశతో శ్రీరంజనికి శోకపాత్రలే ఎక్కువ వచ్చాయి. మాయాబజార్ (1936)లో సుభద్ర, సతీ తులసి (1937)లో పార్వతి, సారంగధర (1937)లో రత్నాంగి, చిత్రనళీయం (1938)లో దమయంతి, శ్రీకృష్ణలీలలు (1935)లో దేవకి, నరనారాయణ (1937)లో గయుని భార్య, మార్కండేయ (1938)లో మరుద్వతి, వరవిక్రయం (1939)లో భ్రమరాంబ ఆమెకు లభించిన ముఖ్య పాత్రలు. ఈ తొమ్మిది చిత్రాలే శ్రీరంజని నటించిన చిత్రాలు. వీటిలో వరవిక్రయం ఒక్కటే సాంఘికం మిగాతావన్నీ పౌరాణిక చిత్రాలే. ఈ తొమ్మిది చిత్రాల తోనే ఆవిడ మేటితారగా ఎదిగింది. ఆవిడ సినిమాలలోకి వచ్చిన తర్వాత కూడా నాటకాలలో నటించడం మానలేదు. పాట, పద్యం మాత్రమేకాకుండా హావభావాలు ప్రకటించడంలోనూ శ్రీరంజనికి మంచి పేరుండేది. ఆమెది చక్కటి ఉచ్ఛారణ అని, చక్కని భాష అనీ ప్రేక్షకులు చెప్పుకునేవారు.

ప్రేక్షకాదరణ
నాటకాలలో నటించినవారికంటే చలనచిత్రాలలో నటించిన వారికే ఆకర్షణ ఎక్కువ. రంగస్థలం నుండి చలనచిత్రరంగంలోకి ప్రవేశించిన సి.ఎస్.ఆర్, గగ్గయ్య, కన్నాంబ వంటి వారితోటే ప్రేక్షకాదరణ మొదలైంది. ఐతే ఆరాధన, అభిమానం మాత్రం శ్రీరంజనితోనే మొదలయ్యాయి. తెలుగులో మొదటి బాక్స్‌ఆఫీసు చిత్రంగా చెప్పుకోవలసిన లవకుశ (1934) లో శ్రీరంజని సీత పాత్ర ధరించింది. సినిమాతో పాటు శ్రీరంజనికీ ప్రేక్షకాదరణ లభించింది. ఆ చిత్రంలో సీతాదేవి కష్టాలను చూసి ప్రేక్షకులు కన్నీళ్ళ పర్యంతమయ్యేవారు, సాక్షాత్తు సీతమ్మే తెరమీదకి దిగివచ్చినట్టు నమ్మేవారు. శ్రీరంజనికి ఇదే తొలి చిత్రం అంతకుముందు రంగస్థలనటి. ఈవిధంగా తొలి చిత్రంతోనే గ్లామరు, ఆరాధన సంపాదించుకున్న మొదటి నటి శ్రీరంజని.

లవకుశ విజయం
లవకుశ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న రోజుల్లో ఆమేకు అనేక చోట్ల సన్మానాలు జరిగాయి. ప్రజలు శ్రీరంజనికి పసుపుకుంకుమలు ఇచ్చి నమస్కారాలు పెట్టేవారు, కొందరు పాదనమస్కారాలు చేసి చీరిచ్చేవారు. సొంతవూరులో ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆమెను అభిమానులు వెళ్ళి గుడి దేవతను ఆరాధించినట్టు, పళ్ళు, పువ్వులు, పాలు ఇచ్చి దండాలు పెట్టేవారు. మద్రాసులోని క్రౌన్‌టాకీసులో లవకుశ శతదినోత్సవం జరిగింది, ఆ ఉత్సవంలో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, మద్రాసు గవర్నరు, జైపూరు మహారాజావారు పాల్గొని చిత్రాన్ని, దర్శకుడు సి.పుల్లయ్యని, నటవర్గాన్ని ప్రసంసించారు. ఆ సందర్భంలో శ్రీరంజనికి స్వర్ణపతకం బహుకరించారు.

మరణం
1939 సంవత్సరంలో క్యాన్సర్ వ్యాధి బారిన పడిన శ్రీరంజని అదే సంవత్సరం తన స్వగ్రామంలో పరమపదించారు. అప్పుడు ఆమె వయసు కెవలం 33. ఆమె మరణవార్తకి పత్రికలు ప్రాముఖ్యం ఇచ్చి చిన్న వయస్సులోనే పెద్ద తార రాలిపోయిందంటూ రాశాయి. సీతాదేవిగా శ్రీరంజనిని చూసి కన్నీళ్ళు పెట్టుకున్న ప్రేక్షకులు ఆమె మరణవార్త విని మరింత శోకించారు.

చిత్ర సమాహారం

లవకుశలో మాస్టర్ భీమారావు, మాస్టర్ మల్లేశ్వరరావులతో శ్రీరంజని సీనియర్

నటిగా
· లవకుశ (1934) లో సీత

· శ్రీకృష్ణలీలలు (1935) లో దేవకి

· సతీ తులసి (1936) లో పార్వతి

· మాయాబజార్ (శశిరేఖా పరిణయం) (1936) లో సుభద్ర

· సారంగధర (1937) లో రత్నాంగి

· నరనారాయణ (1937) లో గయుని భార్య

· చిత్రనళీయం (1938) లో దమయంతి

· మార్కండేయ (1938) లో మరుద్వతి

· వరవిక్రయము (1939) లో భ్రమరాంబ

గాయనిగా
· సారంగధర (1937)

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-5-22-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

మంచి గాత్రమున్న నటుడు అక్కి వెంకటేశ్వర్లు 

— అక్కి వెంకటేశ్వర్లు ప్రముఖ రంగస్థల నటులు.

జననం

వెంకటేశ్వర్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాముత్తుకూరు మండలంలోని నారికేలపల్లెలో జన్మించారు.

రంగస్థల ప్రస్థానం

ప్రాథమిక విద్య పూర్తి చేసిన వెంకటేశ్వర్లు విద్యాభ్యాసం ముందుకు సాగలేకపోయింది. వెంకటేశ్వర్ల యొక్క గాత్రం రమ్యంగా ఉండేది. ఆ గ్రామంలో ఉన్న ప్రముఖ రంగస్థల నటులు కొమరువోలు హనుమంతరావు వెంకటేశ్వర్ల గాత్రం విని నాటకరంగంలోకి ఆహ్వానించారు.

ఒకవైపు వ్యవసాయం చేసుకుంటూ నాటకరంగంలో కొనసాగారు. నవయువక నాట్యమండలి (చుండూరు) లోను, వల్లూరి వెంకట్రామయ్య చౌదరి సమాజంలోను, ఇతర నాటక సమాజాల వారి నాటకాలలో నటించారు.

నటించిన నాటకాలు – పాత్రలు

  1. కురుక్షేత్రం – అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ
  2. రామరావణ యుద్ధం – ఆంజనేయుడు
  3. తులనీ జలంధర – శంకరుడు
  4. గయోపాఖ్యానం – ధర్మరాజు
  5. సీతారామకల్యాణం – విశ్వామిత్రుడు

సన్మానాలు

చుండూరుతెనాలిగుంటూరునెల్లూరుచిలకలూరి పేటఅన్నవరంచేబ్రోలునారికేలపల్లెచిలుమూరు రామూ రూరల్ కాలేజిలో, హైదరాబాద్ త్యాగరాయగాన సభ (10.6.96) లో ఘన సన్మానాలు జరిగాయమీ -గబ్బిట దుర్గాప్రసాద్ -12-5-22-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

ప్రజా నాట్యమండలి అధ్యక్షులు ,నటులు -నల్లారి వెంకటేశ్వరరావు

ప్రజా నాట్యమండలి అధ్యక్షులు ,నటులు -నల్లారి వెంకటేశ్వరరావు

— అభిమానులంతా నల్లూరన్న అనిపిలిచే నల్లూరి వెంకటేశ్వర్లు రంగస్థల నటుడు, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజానాట్యమండలి గౌరవాధ్యక్షుడు. ప్రజా కళల ద్వారా పీడిత, తాడిత, కార్మిక, కర్షక, కూలీనాలీ జనాల్లో చైతన్యం తెచ్చి, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజా సాంస్కృతిక ఉద్యమం నిద్రావస్థలోకి పోయినప్పుడు ప్రజా కళాఉద్యమానికి పునర్జీవం పోశాడు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పాటల శిక్షణా శిబిరాలు, వీధినాటకాలు, గొల్లసుద్దులు వంటి కళారూపాలతో ప్రజల్లో చైతన్యం రగిలించడమేకాకుండా ఎంతోమందిని ప్రజా కళాకారులుగా తయారుచేశాడు.[1]

జననం
వెంకటేశ్వర్లు 1936, జూన్ 6న సుబ్బయ్య కనకమ్మ దంపతులకు ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలం నర్సాయపాలెంలో జన్మించాడు.[2]

కళాకారుడిగా
తన ఊరికి దగ్గరలోని మారెళ్లగుంటపాలెంలో ఉండే కమ్యూనిస్టు నల్లూరి అంజయ్య పరిచయం, సాహచర్యం, ప్రభావంతో, కళలపైఉన్న ఆసక్తితో చిన్నతనంలోనే నాటకరంగ ప్రవేశం చేశాడు. భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థపై జనసామాన్యంలో చైతన్యం కలిగించటానికి వెంకటేశ్వర్లు కృషి చేశాడు. ప్రజావ్యతిరేక గ్రామీణ యంత్రాంగం రద్దుకావటం గురించి… కరణం, మునసబు, పటేల్‌, పట్వారీ మొత్తం గ్రామ పెత్తందారీవర్గం సామాన్య మానువుణ్ణి దోపిడీ చేస్తున్న వైనాన్ని ‘భూభాగోతం’ (వంగపండు ప్రసాదరావు రచించిన నృత్య నాటిక) ను ప్రజానాట్యమండలి ద్వారా రాష్ట్ర వ్యాపితంగా వేలాది ప్రదర్శనలిచ్చాడు.

బొలినేని నాగభూషణం దర్శకత్వం వహించిన సత్య హరిశ్చంద్ర నాటకంలోని లోహితాస్యుడు పాత్రతో నటనా జీవితాన్ని ప్రారంభించిన నల్లూరి, 1974లో ప్రజానాట్య మండలి పునర్నిర్మాణంలో నాయకపాత్ర వహించి గ్రామగ్రామాన శాఖలను ఏర్పాటుచేయడంలో ప్రముఖ పాత్ర వహించాడు. సినిమారంగంలో ప్రవేశించి కొన్ని సినిమాలలో నటించి, అక్కడి వాతావరణం నచ్చక సినిమారంగానికి దూరమయ్యాడు.

నాటికానాటకాలు
తెనుగుతల్లి
అన్నా- చెల్లెలు
రుద్రవీణ
గాలివాన
పెత్తందారు
కొత్తబాట
మంచుతెర
ఛైర్మన్‌
పల్లెపడుచు
నల్లూరి శిష్యులు
మాదాల రంగారావు
టి. కృష్ణ
గిరిబాబు
బి. గోపాల్
నర్రా వెంకటేశ్వరరావు
ధర్మవరపు సుబ్రహ్మణ్యం
పోకూరి బాబూరావు
వందేమాతరం శ్రీనివాస్
ఎం. వి. ఎస్. హరనాథ రావు
నిర్వహించిన పదవులు
ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి కన్వీనర్‌, ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడు (1974-1997)
భారత కమ్యూనిస్టు పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి, రాష్ట్ర సమితి కార్యవర్గ సభ్యుడు
ఇఫ్టా జాతీయ ఉపాధ్యక్షుడు
పురస్కారాలు – సత్కారాలు
నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం – నంది నాటక పరిషత్తు – 2014, 2015 డిసెంబరు 30, రాజమహేంద్రవరం[2]
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -11-5-22-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

రికార్డ్ స్థాయిలో రామాంజనేయ యుద్ధం రికార్డ్ లు అమ్మిన రంగస్థల నటుడు పృధ్వీ వెంకటేశ్వరావు

పృథ్వీ వెంకటేశ్వరరావు (మే 10, 1928 – మార్చి 22, 2008) ప్రముఖ రంగస్థల నటుడు.[1]

5
జననం – ఉద్యోగం
వెంకటేశ్వరరావు 1928, మే 10న కోటి నాగేశ్వరరావు, రత్తమ్మ దంపతులకు ప్రకాశం జిల్లా, చీరాల మండలం, దేవాంగపురిలో జన్మించాడు.

రంగస్థల ప్రస్థానం
సంగీత కుంటుబమవడంతో వెంకటేశ్వరరావు చిన్నప్పటినుండే నాటకాలలో నటించడం ప్రారంభించాడు. ఈలపాట రఘురామయ్య దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. గయోపాఖ్యానం నాటకంలోని నారదుని పాత్రలో రంగస్థలంపై అడుగుపెట్టాడు. విజయవాడ లోని శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి, రాజమండ్రి లోకి చింతా సుబ్బారావు ట్రూపు ప్రదర్శించిన అనేక నాటకాలలో నటించాడు.

ప్రముఖ రంగస్థల నటులైన కళ్యాణం రఘురామయ్య, పులిపాక వెంకటప్పయ్య, అద్దంకి శ్రీరామమూర్తి, పులిపాటి వెంకటేశ్వర్లు, మాధవపెద్ది వెంకటరామయ్య, పంచాంగం పువ్వుల సూరిబాబు, పువ్వుల అనసూయ, ఆవేటి పూర్ణిమ, పువ్వుల రాజేశ్వరి, వేమూరి గగ్గయ్య, పీసపాటి నరసింహమూర్తి, షణ్ముఖి ఆంజనేయ రాజు, నిడుముక్కల సుబ్బారావు లతో కలిసి నటించాడు. టి. శ్రీరాములుతో కలిసి వెంకటేశ్వరరావు ఇచ్చిన రామాంజనేయ యుద్ధం గ్రామఫోన్ రికార్డు అప్పట్లో అత్యధిక సంఖ్యలో అమ్మడుపోయాయి.

నటించినవి:

శ్రీకృష్ణరాయబారం
సతీ సక్కుబాయి
శ్రీకృష్ణతులాభారం
శ్రీరామాంజనేయ యుద్ధం
పాదుకా పట్టాభిషేకం
సీతా కళ్యాణం
తారాశశాంకం
చింతామణి
శ్రీవేంకటేశ్వర మహాత్యం
పురస్కారాలు[
నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం – నంది నాటక పరిషత్తు – 2002
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -11-5-22-ఉయ్యూరు

Posted in సేకరణలు | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-283

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-283
283-బీదలపాట్లు ,అగ్గిరాముడు ,విమల చిత్రాలు నిర్మించిన –పక్షిరాజా వారి ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు
పక్షిరాజా స్టుడియోస్ ఒక సినీ నిర్మాణ సంస్థ. దీనిని ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు (1910-1976) కోయంబత్తూరులో 1945లో స్థాపించాడు. ఈ సంస్థ తెలుగు భాషతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ, సింహళ భాషలలో సినిమాలు నిర్మించింది.

పక్షిరాజా పతాకంపై నిర్మాత ఎస్‌.ఎమ్‌ శ్రీరాములు నాయుడు ‘బిదలపాట్లు 1 (దర్శకత్వం-రామనాథ్‌) అగ్గిరాముడు, విమల మొ చిత్రాలు నిర్మించారు,

  
విమల
“కొన్ని పాటలు వింటున్నప్పుడు చాలా బాగుంటాయి. కొన్ని పాటలు పదిమందిలో పాడేటంత ఉదాత్తంగా, గౌరవనీయమైన స్తానంలో ఉంటాయి.
కొన్ని పాటలు స్వర రచనా పరంగా క్లీష్ణంగా ఉన్నా సరే ఆదరించదగ్గ స్థాయిలో ఉంటాయి. ఈ మూడు అర్హతలనూ కలిగి ఉన్నా కేవలం కాస్‌ అనే ఒక
వర్గానికి మాత్రం కట్టుబడిపోయి ఎంతో మందికి అందకుండా ఉండిపోయిన మంచి పాటలలో

చిత్రంలోని ఓ రెండు పాటలు వస్తాయి. 1960 లో విడుదలయిన ఈ చిత్రానికి మాటలూ-పాటలూ ముద్దుకృష్ణ రాశారు. సంగీతం సుబ్బయ్యనాయుడు
అందించారు. సుబ్బయ్య నాయడు అనగానే తెలుగువారందరికీ ‘మురిపించే మువ్వలు’ చిత్రం…నీ లీల పొడెదదేవా’ పాట ..గుర్తొచ్చేస్తాయి. యన్‌.టి.ఆర్‌, భానుమతి
నటించిన ‘అగ్గిరాముడు’ చిత్రాన్ని నిర్మించిన పక్షిరాజా సంస్థకు సుబ్బయ్య నాయుడు సంగీతాన్ని అందించే వారు. ఆ పక్షిరాజా సంస్టే నిర్మించిన ఈ
చిత్రం ద్వారా అందించిన ఓ రెండు ఉత్తమ గీతాలివి.

అ: కన్నుల్లొ నీ బొమ్మచూడు నా….కన్నుల్లొ నీ బొమ్మచూడు
అది కమ్మని పాటలు పొడు ॥కన్నుల్లొ॥
ఆ; పున్నమ వెన్నెల వన్నెలలో ॥ పున్నమః స కన్నుల కట్టిన రూపముతో
నీవే మనసున తోచగా నీవే
నను నేనే మరిచిపోదురా ॥కన్నుల్లొ॥
అ; కోయిల పాటల తీరులతో ॥కోయిల॥
సరికోయిల రాగాలల్లుదమా ॥సరి; =
ఆ; నచ్చిన పూవు గద నేను ॥ నచ్చినః
కోరి వచ్చిన తుమ్మెద నీవెరా కన్నుల్లో!
అ; రాగమాలికల వీణనీవే రాగ!
అనురాగము లేలే జాణవెలే ॥ అను॥
ఆ; నీవే వలపుల జాబిలిరా నీవే!
సరి నేనే కులుకుల వెన్నెలరా ॥కన్నుల్లొ!

ఈపాటను మరొక అద్భుత స్వరరచనగా పేర్కొనాలి. ఈ పాటను కూడా ఘంటసాల, జయలక్ష్మి పాడగా ఎన్‌.టి.ఆర్‌, సావిత్రిపై చిత్రీకరించారు.
ఇది ఒక రాగమాలికా గీతం. సాధారణంగా రాగమాలిక అనగానే ఒక రాగం నుంచి ఇంకో రాగంకి స్వర రచన మారినప్పుడు శ్రోతలు ఒక విధమైన
జంప్‌ని ఫీలవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి జంప్‌ని ఎక్కడా కనబడనీయకుండా సాఫీగా స్వరపరచబడిన గీతమిది. పల్లవికి పహాడి రాగం
బేస్‌గా ఉంటే “పున్నమ వెన్నెల. వన్నెలలో చరణానికి రాగేశ్రీ రాగాన్ని, “కోయిల పాటల తీరులతో’ చరణానికి తిలంగ్‌ రాగాన్ని ‘రాగమాలికల వీణ
నీవె చరణానికి కాఫీ రాగాన్ని వాడుకున్నారు. ఈ రాగాలను వాడుకోవడంలో కూడా జనరంజకత్వం కోసం రాగేశ్రీ రాగంలో రాని కాకలినిషాదాన్ని-
తిలంగ్‌ రాగంలో లేని రిషభాన్ని ఉపయోగించారు. ఇవికాక ఉపయోగించిన రూపక తాళ ప్రకారంగా చూసుకుంటే కర్ణాటక శాస్త్రీయ సంప్రదాయానికి
కావలసిన రీతిలోని ఆరు మాత్రల నడకలో ఉండే రెండు మాత్రల చొప్పున మూడు ఖండాలుగా కాకుండా హిందుస్థానీ పద్ధతిలో ఉపయోగించే
మూడు మాత్రల చొప్పున రెండు ఖండాలుగా నడిపించటం ఓ ప్రత్యేకత ప్రయోగంగా పేర్కొనాలి. ఇక పాడిన ఘంటసాల, జయలక్ష్మి-బిందువులో
సింధువులా తమ ప్రతిభనంతా ఎంతో క్లుప్తంగా, వినేవాళ్ల గుండెల్లో నిక్షిష్తంగా ఉండేట్లు ప్రదర్శించారు.

అ: కన్నుల బెళుకే కలువలురా కన్నుల! కన్నియ తళుకే కనకమురా ॥కన్నుల॥
కలవోలే కనిపించే కల!
కలలోనె వలపించే ॥కల॥
కనులలో ఆ రూపే కాపురమైపోయే ॥కను॥కన్నుల॥
; కనరాని అందాలనే
కనులార కనినంతనే ॥కనరాని॥
వనమేమొ ఈ వేళనే ॥వన॥
నందనమనిపించెనే ॥నందన॥
॥విరు॥
చిరు!
॥లఎన॥
హృదయాలు కదిలించెనే 1హృద॥ కనరాని॥
; ఇటు చూడు ఇటు చూడవే ఇటు!
ఇది ఏమి మటుమాయమే ఇటు!
; వనరాణి వగలాడిగా కునుసైగ కావించగా ॥వన॥
వనమేమొ ఈ వేళనే నందనమని పించెరా ॥1వన॥
॥విరి॥
॥చిరు॥
కరిగించెరా ॥ఎనరాని;వనరాణి॥
: కోరి కోరి నీ రూపము కనగా ॥కోరి॥
తీరును ఆకలి దాహములే ॥తీరును॥
చేరి చేరి నీ పాటలు వినగా ॥చేరి॥
చిందును అమృత బిందువులే ॥చిందును।॥ ॥కోరి॥
అః కలలు ఫలించె కాలములో ॥కలలు॥
కలిసిన ప్రేమలు శాశ్వతమే ॥ కలిసిన ॥
ఆ; కలనైనా మెలకువనైనా కల!
లోకము సుందర నందనమే లోకము! కలలు!

ఈపాటను ఘంటసాల, జయలక్ష్మి గానం చేశారు. ఎన్‌.టి.ఆర్‌., సావిత్రి ప్రధాన పాత్రలలో అభినయించిన ఈ పాటలో రేలంగిలా డైలాగులు
చెప్పే వేళంగి అనే హస్యనటుడు, సావిత్రికి చెలికత్తెగా నటించిన మరో నటి కూడా కనిపిస్తారు. ఇది ఒక రాగమాలికా గీతం. “కన్నుల బెళుకే కలువలురా”
అనే పల్లవి నుంచి “కనులలో ఆ రూపే కాపురమై పోయే’ అనే చరణం వరకు బేహాగ్‌ రాగంలో స్వరపరిచారు. వినసొంపుగా ఉండే ఈ బేహాగ్‌ రాగాన్ని
మన సంగీత దర్శకులు అంతగా ఉపయోగించుకోలేదనే చెప్పాలి. ఓసారి సింహావలోకనం చేసుకుంటే ఎస్‌. రాజేశ్వరరావు స్వర పరిచిన “చెంచులక్ష్మి
చిత్రంలోని ‘నీలగగన ఘనశ్యామా’ పాట ‘భక్తప్రహ్లాద’ చిత్రంలోని ‘వరమొసగే వనమాలీ” పాట గుర్తుకు వస్తాయి. ‘కన్నుల బెళుకే’ పాట మొదటి
చరణం – “కనరాని అందాలనే” దగ్గర్నుంచి “’హృదయాలు కదిలించెనే’ వరకు, ఆ తర్వాత అదే వరుసలో వచ్చే ఇంకో చరణం –
“వనరాణి వగలాడిగా’ దగ్గర్నుంచి ‘హృదయాలు కరిగించెరా’ వరకు భాగేశ్రీ రాగాన్ని ఉపయోగించారు. ఈ రెండు చరణాల మధ్య వచ్చే ‘ఇటు
చూడు ఇటు చూడవే..ఇది ఏమి మటుమాయమే’ అనే వాక్యాలకు బిలహరి రాగాన్ని వాడుకున్నారు. ‘కోరి కోరి నీ రూపము కనగా” అనే చరణాన్ని
గౌరీ మనోహరి రాగంలోను “కలలు ఫలించే కాలములో) చరణాన్ని కళ్యాణి రాగంలోను స్వరపరిచారు. బెత్సాహిక గాయనీ గాయకులకు ఈ పాట
ఓ పరీక్షలాంటింది. మొత్తం పాటను సాధన చేసి ఏకబిగిన పాడగలిగిననాడు ‘మేం పాడడానికి పనికొస్తాం’అని వారు ధైర్యంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా
శాస్త్రీయ సంగీత కచ్చేరీలు చేసే విద్వాంసులు కొన్ని సినిమా పాటలు పాడవలసి వచ్చినప్పుడు తమకు అలవాటైన ధోరణిలో పాడడం, సినిమా
పాటల ఒరవడికి అలవాటుపడ్డ శ్రోతలకు ఈ ధోరణి మింగుడుపడని విధంగా వుండడం సహజం. “రాధా -జయలక్ష్మిగా శాస్త్రీయ సంగీత ప్రపంచంలో
గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకున్న గాయనీమణుల్లో ఒకరైన జయలక్ష్మి ఈ ‘కన్నుల బెళుకే’ పాటలోని “కనరాని అందాల’ చరణాన్ని పాడుతుంటే
సాధారణ స్థాయిలో ఉండే శ్రోతలకు కూడా శరీరం రోమాంచితం అయిపోతుంది. ముఖ్యంగా “హృదయాలు కలిగించెనే’ దగ్గర ఆవిడ హృదయాలను
కదిలించేస్తుంది. ఆ రససిద్ధికి కారణం – రాగం భాగేశ్రీ కారణమా లేక జయలక్ష్మి పాడిన పద్దతా అన్నది ఎవరికి వారే సమాధానం చెప్పుకోవలసిన
ప్రశ్న. అల్లాగే చిరునవ్వు చిలికించగా’ దగ్గర ఘంటసాల కూడ తనదైన రసస్పర్శతో పులకింప చేస్తారు.
ప్రజల మనసులలో చక్కని అభిరుచిని పెంపొందింపచేసి వారి చైతన్యంలో సంస్కారాన్ని నింపాలకునే దృశ్య, శ్రవణ మాధ్యమం ఏదైనా సరే
ఇటువంటి పాటల వ్యాప్తి ద్వారా పదే పదే పూనుకుంటే చక్కని సాంస్కృతిక వారసత్వాన్ని తర్వాతి తరాల వారికి అందించిన సార్థకత చేకూరుతుంది.

ముళ్ళపూడి సాహితీ సర్వస్వం
ి.
పక్షిరాజా వారి “అగ్గిరాముడు”, “మలై కళ్లన్‌” చిత్రాలు తయారవుతున్న
సమయంలో, అవసరాన్ని బట్టి, భానుమతి సరిగా ఇరవై నాలుగు గంటలలో ఆరు
పాటలు రికార్డు చేసింది, ఒక నిముషం కాలం, ఒక అడుగు సెల్యులాయిడ్‌ వృధాగా
పోకుండా.
“నేను పాదదానికీ, నటించడానికీ ప్రత్యేకం కష్టపడి ప్రయత్నం ఏమీ
చెయ్యను. నా కృషి ఫలితం బాగుంటుందని నామీద నాకు నమ్మకం ఉంది. ఇలా
చెప్పడానికి నాకు జంకేమీ లేదు. ఫాల్స్‌ డిగ్నిటీ లాగే ఫాల్స్‌ మాడెస్టీ కూడా నాకు
నచ్చదు” అంటుంది భానుమతి. (ఆంధ్ర వారవత్రిక – 1956)

అగ్గి రాముడు సూపర్ డూపర్ హిట్ సినిమా .రామారావు నటన హైలైట్ .సంగీతం ,పాటలు అదుర్స్ .రేలంగి హాస్యం చిత్రానికి మరింత వన్నె తెచ్చింది .భానుమతి పాటలు

ఒక ఊపు ఊపాయి .సబ్ ఇన్స్పెక్టర్ గా ముక్కామల జీవం పోశాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-5-22-ఉయ్యూరు

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-284
284-అలనాటి మూకీ చిత్రాల నటుడు దర్శకుడు ,కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ,పాత భూకైలాస్ ,భక్తప్రహ్లాద ఫేం –ఎం.వి.సుబ్బయ్యనాయుడు
మైసూరు వెంకటప్ప సుబ్బయ్య నాయుడు (1896 – 21 జూలై 1962) ఒక భారతీయ రంగస్థల, మూకీ చిత్రాల నటుడు, దర్శకుడు. ఇతడు తొలి కన్నడ టాకీ చిత్రం సతీ సులోచన (1934), తెలుగు సినిమా భూకైలాస్ (1940), కన్నడ సినిమా భక్త ప్రహ్లాద (1958) మొదలైన వాటిలో నటించి పేరు గడించాడు.[1] ఇతడు కన్నడ సినిమా హీరో లోకేశ్ తండ్రి. [2] నాటక రంగంలో ఇతని కృషికి గుర్తింపుగా 1961లో ఇతనికి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. [3]

విశేషాలు
సుబ్బయ్య నాయుడు నాటకాలలో మొదట చిన్న చిన్న పాత్రలలో నటించడం ప్రారంభించి నాయక పాత్రలు ధరించడం వరకు ఎదిగాడు. ఇతడు ఆ రోజులలోనే చెప్పుకోదగ్గ అభిమానులను సంపాదించుకున్నాడు. ఇతడు రట్టిహళ్లి నాగేంద్రరావుతో కలిసి సినిమాలలో నటించడం ఆరంభించాడు. వీరిద్దరూ కలిసి తొలినాళ్ళ కన్నడ సినిమాలు వసంతసేన (1941), సత్య హరిశ్చంద్ర (1943), మహాత్మా కబీర్ (1947) వంటివి తీశారు. భక్త ప్రహ్లాద సినిమా తర్వాత ఇతడు మళ్ళీ నాటకరంగానికే పరిమితమయ్యాడు.[4]

మరణ
ఇతడు 1962, జూలై 21న మండ్యలో గుండెపోటుతో మరణించాడు. ఇతని చివరి రోజులలో కూడా ఇతడు తన నాటక సమాజం సాహిత్య సామ్రాజ్య నాటక మండలితో కలిసి చురుకుగా నాటక ప్రదర్శనలు ఇచ్చాడు. ఇతడు మరణించే రోజు మండ్యలో ఓ నాటకంలో అంబరీషుని వేషం వేశాడు.[4]

పాక్షిక ఫిల్మోగ్రఫీ
సంవత్సరం

సినిమా

పాత్ర

1934

సతీ సులోచన

ఇంద్రజిత్తు

1940

భూకైలాస్

రావణుడు

1941

వసంతసేన

1943

సత్య హరిశ్చంద్ర

హరిశ్చంద్రుడు

1947

మహాత్మా కబీర్

1958

భక్త ప్రహ్లాద

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-11-5-22-ఉయ్యూరు

— మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-285
285-మెలోడి కి శ్రీకారం చుట్టి ,సంప్రదాయ సంగీతానికి నవ్యత కూర్చి 500పాటలు పాడిన సంగీత దర్శకుడు.లేతమనసులు ,మంచి చేసు సినీ ఫేం – –ఎం.ఎస్.విశ్వనాధన్
యావత్‌ భారతీయ సంగీత చరిత్ర సగర్వంగా చెప్పుకునే గొప్ప సంగీత దర్శకుడు.
ది కింగ్‌ ఆఫ్‌ లైట్‌ మ్యూమ్యూజిక్‌ (మీల్లిసై మన్నార్‌)గా ఖ్యాతినొంది సినీ ప్రేక్షకుల గుండెల్లో పదిలమైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు. సంగీతంలో ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తూ ఆశేష సినీ ప్రేక్షకులతో జేజేలు పలికించుకున్న ఈ ఘనాపాటిని ‘తైరై ఇసై చక్రవర్తి’ ( ది ఎంపరర్‌ ఆఫ్‌ సినీ మ్యూజిక్‌) అంటూ తమిళనాడు ప్రభుత్వం కీర్తించింది. ఆరు దశాబ్దాలకి పైగా వైవిధ్యమైన సంగీతంతో ఊర్రూతలూగించిన సంగీత చక్రవర్తి ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ (87)ని సినీ సంగీత ప్రపంచం శాశ్వతంగా కోల్పోయింది. ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ ఇకలేరనే విషాదాన్ని జీర్ణించుకోలేక సప్తస్వరాలు మౌనంగా రోదిస్తున్నాయి. సుమధుర సంగీతంతో ప్రేక్షకుల్ని రంజింపజేసి 60 ఏళ్ళ సుదీర్ఘ సినీ ప్రస్థానానికి ముగింపు పలికిన ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ జీవిత విశేషాల సమాహారం..
భయంకరమైన బాల్యం
1928 జూన్‌ 24న కేరళలోని పాలక్కడ్‌ గ్రామంలో విశ్వనాథన్‌ జన్మించారు. నాలుగేళ్ళ వయసులోనే తండ్రిని కోల్పోయారు. పేదరికంతో కుటుంబాన్ని పోషించలేక, ఎవరి సహాయం అందక ఆఖరికి కన్న కొడుకునే కడతేరుద్దామనే నిర్ణయం తీసుకున్న తల్లి నారాయణీకుట్టి నుంచి విశ్వనాథన్‌ని తాతయ్య రక్షించారు. బతుకు తెరువు కోసం విశ్వనాథన్‌ థియేటర్లలో సమోసాలు, బజ్జీలు అమ్మారు. బడికి వెళ్ళి చదువుకోవాల్సిన విశ్వనాథన్‌ బాల్యం భయంకరంగా గడిచిందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. థియేటర్లలో పని చేసే పుణ్యమా అని.. ఆయనకు సంగీతంపై మక్కువ ఏర్పడింది. 1933 నుంచి 1939 వరకు సంగీతం నేర్చుకున్నారు. 13 సంవత్సరాల వయసులోనే ‘త్రివాన్‌డ్రూమ్‌’ నాటకంతో తొలి సంగీత ప్రదర్శన ఇచ్చారు.
మలుపు తిప్పిన పరిచయం
సింగర్‌గా, యాక్టర్‌గా రాణించాలని విశ్వనాథన్‌ ఎప్పడూ తపించేవారు. ఆ తపనకి తగ్గట్టుగానే ఆయన కొన్ని డ్రామాల్లో సైతం నటించారు. సింగర్‌, యాక్టర్‌ ఏ వైపు పయనించాలో అర్థంకాని తరుణంలో ప్రముఖ వయోలినిస్ట్‌, స్వరకర్త టి.ఆర్‌.పాపా పరిచయం విశ్వనాథన్‌ జీవితాన్ని మలుపు తిప్పింది. విశ్వనాథన్‌లోని ప్రతిభను గుర్తించి ఆయన తన ఎస్‌.వి.వెంకటరామన్‌ మ్యూజికల్‌ ట్రూప్‌లో చేర్చు కున్నారు. ఆ ట్రూప్‌తో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విశ్వనాథన్‌కు సంగీత దర్శకత్వం పట్ల మరింత అవగాహన పెరిగింది. అదే సమయంలో ఎస్‌.ఎం.సుబ్బయ్యనాయుడు, సి.ఆర్‌. సుబ్రమణియమ్‌ వంటి సంగీత దర్శకుల మ్యూజికల్‌ ట్రూప్‌లో చేరి, హార్మోనియం వాయిద్యకారుడుగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇదే ట్రూప్‌లో పని చేస్తున్న వయోలినిస్టులు టి.కె.రామ్మూర్తి, టి.జి.లింగప్పలతో మంచి చనువు ఏర్పడింది.
సరికొత్త ఒరవడికి శ్రీకారం
ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ స్వరపర్చిన పాటలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఆయన కంపోజ్‌ చేసిన ప్రతి పాటను ప్రతి ఒక్కరూ సులువుగా పాడుకునేలా ఉండటం విశేషం. సంప్రదాయ భారతీయ సంగీతానికి వెస్ట్రన్‌, డిస్కోలతో సమ్మిళితం చేసి సరికొత్త ప్రయోగాలతో విశ్వనాథన్‌ ప్రేక్షకుల్ని అలరించారు. మెలోడి పాటల్ని ప్రేక్షకులకు పరిచయం చేసి సరికొత్త సంగీత ఒరవడికి విశ్వనాథన్‌ శ్రీకారం చుట్టారు. ఎటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించకుండా అప్పటి సంప్రదాయ సంగీతంలోనే నవ్యత తీసుకొచ్చే క్రమంలో విశ్వనాథన్‌ విజయం సాధించారు. ఆర్‌.బాలసరస్వతి, వాణీజయరాం, ఎస్‌.జానకీ, ఎ.ఎల్‌.రాఘవన్‌, ఏసుదాసు, ఎస్‌.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల, ఎ.ఆర్‌.ఈశ్వరీ, టి.ఎం. సుందరరాజన్‌, జయచంద్రన్‌ వంటి అద్భుతమైన నేపథ్యగాయనీ గాయకులంతా విశ్వనాథన్‌ చిత్రాల్లోని పాటలతో ప్రేక్షకులకు మరింత దగ్గరైనవారే కావడం విశేషం.
భిన్న దర్శకులు
ఎస్‌.ఎస్‌.వాసన్‌, బి.ఆర్‌. పంతులు, బి.ఎస్‌.రంగ, కృష్ణన్‌- పంజు, ఎ.భీమ్‌సింగ్‌, మాధవన్‌, సి.వి.సుందర్‌, టి.ఆర్‌.రామన్న, ఎ.సి.త్రిలోక్‌చందర్‌, కె.శంకర్‌, కె.బాలచందర్‌, ముక్త వి.శ్రీనివాసన్‌, చిత్రాలయ టి.ఆర్‌.గోపు, చో రామస్వామి, మల్లియం రాజగోపాల్‌, మధురై తిరుమరన్‌, కె.ఎస్‌.గోపాలకృష్ణన్‌, దాదా మిరసి, ఎస్‌.పి.ముత్తురామన్‌,

సశేషం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -11-5-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment