మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-281

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-281

• 281-సాధనా సంస్థ అధినేత ,లత పాడిన తోలి తెలుగు పాట ,అక్కినేని తొలిచిత్రం సంసారం సినిమా ఫేం-రంగనాథదాస్

నెల్లూరు జిల్లా వెంకటగిరి చెందినరంగ నాథ దాస్  ‘సంసారం’ సినిమాతో నిర్మాతగా తెలుగు చిత్రీసీమకి పరిచయమయ్యారు. ఇందులో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు హీరోలు. ఎల్వీ ప్రసాద్‌ దర్శకులు. అక్కినేనికి ఇదే తొలి సాంఘిక చిత్రం కావడం విశేషం. మహానటి అనిపించుకున్న సావిత్రి ‘సంసారం’లో చిన్న పాత్రలో కనిపిస్తారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ తెలుగులో పాడిన తొలి గీతం ‘నిదురపోరా తమ్ముడా’. ఇది దాస్‌ తీసిన ‘సంతానం’ సినిమాలోనిదే.

తొలి ప్రయత్నం విజయవంతం కావడంతో దాస్‌ ఆ తరవాత దర్శకత్వం వైపు అడుగులు వేశారు. ఎన్టీఆర్‌ నటించిన ‘దాసి’ చిత్రానికి దర్శకత్వం వహించారాయన. ఆపైన స్వీయ దర్శకత్వంలో ‘సంతానం’, ‘తోబుట్టువులు’, ‘సంకల్పం’ నిర్మించారు. అన్నీ విజయవంతమయ్యాయి. ‘సంకల్పం’ తరవాత ఆయన చిత్రసీమకు దూరమై ఇతర వ్యాపారాల్లో నిమగ్నమయ్యారు.

ప్రసిద్ధ గాయనీమణి లతామంగేష్కర్‌తో తెలుగులో తొలి పాట పాడించిన ఘనత రంగనాథ్‌దాస్‌దే. ‘సంతానం’ సినిమా కోసం సుసర్ల దక్షిణామూర్తి స్వరకల్పన చేసిన ‘నిదురపోరా తమ్ముడా..’ పాటను ఆలపించారు లతా. అలాగే సావిత్రిని వెండితెరకు పరిచయం చేసినది కూడా రంగనాథ్‌దాస్. సాధన ప్రొడక్షన్స్ పతాకంపై తోబుట్టువులు, సంకల్పంలాంటి పలు చిత్రాలు నిర్మించారు. వాటిలో రజతోత్సవాలు జరుపుకున్న చిత్రాలు ఎక్కువ. 1960తోనే రంగనాథ్‌దాస్ సినీ జీవితం పూర్తయిందని చెప్పాలి. ఆ తర్వాత ఆయన చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

‘సంసారం’, ‘సంతానం’, ‘తోబుట్టువులు’ లాంటి చిత్రాలు తీసిన నిర్మాత సి.వి.రంగనాథ్‌ దాస్‌. ఆయన బుధవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. వయసు 87 సంవత్సరాలు. గత కొంత కాలంగా దాస్‌ అస్వస్థతతో ఉన్నారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.
• సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-5-22-ఉయ్యూరు
• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-282
• 282-పద్మిని పిక్చర్స్ అధినేత ,తమిళ తెలుగు హిందీ  చిత్ర నిర్మాత దర్శకుడు కృష్ణ దేవరాయ ఫేంనటుడు కట్టబొమ్మన ,బడిపంతులు దర్శకత్వ ఫేం –బి.ఆర్ .పంతులు
బి.ఆర్.పంతులు (బడగూర్ రామకృష్ణయ్య పంతులు) ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు. ఆయన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినీ రంగాల్లో పలు సినిమాలకు నిర్మాణం, దర్శకత్వం వహించారు. ఆనాటి మైసూరు రాజ్యంలో నేటి కర్ణాటక-ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన కుప్పంకు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న బడగూరులో జన్మించారు. గుబ్బి వీరణ్ణ ట్రూపులో నటుడిగా చేరి కన్నడ నాటక రంగంలో ప్రఖ్యాతులై, తర్వాత తమిళ చలనచిత్ర రంగంతో సినీ నిర్మాణం ప్రారంభించారు. క్రమంగా పలు భాషల్లో సినిమాల నిర్మాణం సాగించారు. పద్మినీ పిక్చర్స్ బ్యానర్‌పై తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో 55 చిత్రాలను నిర్మించారు. వాటిలో కొన్ని మినహా అన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు.
లుగు సినిమా రంగ0
నిర్మాతగా/ప్రొడక్షన్ అసిస్టెంటుగా
• భక్తిమాల
• శ్రీకృష్ణదేవరాయలు
• వీరపాండ్య కట్టబ్రహ్మన
• పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం
• పెంపుడు కూతురు
• గాలిమేడలు
దర్శకుడిగా
• శ్రీకృష్ణదేవరాయలు
• బడిపంతులు
• రాణి చెన్నమ్మ
• దొంగలు దొరలు
• వీరపాండ్య కట్టబ్రహ్మన
• పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం
• కర్ణ
• విచిత్ర వీరుడు
• సెబాష్ పిల్లా
• పెంపుడు కూతురు
• గాలిమేడలు
• కథానాయకుని కథ
• రత్నగిరి రహస్యం
నటుడిగా
• శ్రీకృష్ణదేవరాయలు
• బడిపంతులు
• పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం
• అమ్మలక్కలు
• తిరుగుబాటు
• వదిన
నేపథ్య గాయకుడిగా
• భక్తిమాల
మరణం
ఇతడు హృద్రోగం వల్ల బెంగళూరులో 1974, అక్టోబర్ 8న మరణించాడు

పంతులు 6 జాతీయ అవార్డ్ లను 1963నుంచి 1958 ల మధ్యకాలం లో పొందాడు .
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-5-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

అసాధారణ విజయం పొందిన డా.యనమదల మురళీ కృష్ణ గారి ఆత్మకథా పుస్తకం –‘’కోవిడ్ –ఎయిడ్స్ –నేను ‘’

అసాధారణ విజయం పొందిన డా.యనమదల మురళీ కృష్ణ గారి ఆత్మకథా పుస్తకం –‘’కోవిడ్ –ఎయిడ్స్ –నేను ‘’

  ఈ డాక్టర్ గారెవరో నాకు తెలీదు కాని కిందటి మంగళవారం నేను శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఉండగా ఫోన్ చేసి ,తాను  కాకినాడ లో డాక్టర్ ననీ, పై పుస్తకం రాశాననీ ,దాన్ని అందరికీ ఉచితంగా ఇవ్వకుండా 2వేల కాపీలు అమ్మానని ఇది అరుదైన విషయమనీ ,సరసభారతి బ్లాగ్ ద్వారా నేను పరిచయమయ్యాననీ ,నా అడ్రస్ తెలిపితే పుస్తకాలు పంపుతాననీ చెప్పారు .కాసేపయ్యాక నా అడ్రస్ ఎలాగో సంపాది౦చాననీ ,పుస్తకాలు పంపుతున్నాననీ చదివి అభిప్రాయం రాయమనీ కోరారు .ఆయన పంపిన 3పుస్తకాలు మొన్న శనివారం 7వ తేదీ అందాయి .ఇవాళఉదయం అందులో ఒక పుస్తకం ఉయ్యూరు శాఖా గ్రంధాలయానికి అందజేసి ,ఇప్పుడే ఆ పుస్తకం చదివి అభిప్రాయం రాస్తున్నాను .

 ‘’ డా.మురళీకృష్ణ అరుదైన మేధావి .లోతైన అధ్యయనం ,నిశిత పరిశీలన ,మేర తెలియని ఊహా శక్తి ,అంతకు మించి తోటివారికి సాయపడాలనే మానవత్వం ,నిబద్ధత గల వ్యక్తీ ‘’.అందుకే ఇంత ఘనవిజయం సాధించారు వైద్య రంగం లో ‘’

 వైద్య – ఆరోగ్య –శాస్త్రీయ-ఆత్మ కథ

 పుస్తకాలతో పాటు ఆయన పంపిన కవరింగ్ లెటర్ లో తనను పరిచయం చేసుకొంటూ ,కాకినాడలో ‘’సా౦క్రమిక వ్యాధి నిపుణుడి ‘’గా పని చేస్తున్నాననీ,1997నుంచి ఎయిడ్స్ ,కోవిడ్ పీడనాకాలం లో సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలకు భరోసా కల్పించటం లో ఎన్నదగిన కృషి చేశాననీ ,చెప్పారు  .2022జనవరి లో ‘’కోవిడ్ –ఎయిడ్స్ –నేను ‘’పేరిట సెమి ఆటో బయాగ్రాఫిక్ గా ఈ పుస్తకం ప్రచురించాననీ ,గతంలో ఇలాంటి పుస్తకం ఎప్పుడూ వెలువడి ఉండదనీ , కనుక ఇది , ‘’వైద్య – ఆరోగ్య –శాస్త్రీయ-ఆత్మ కథ ‘’అనీ ,ఎఏపత్రికా ప్రకటన లేకుండానే 200రూపాయల ఈ  పుస్తకాన్ని రెండు వేలకాపీలను తెలుగు ప్రజలు కొన్నారనీ సంబరంగా తెలిపారు . ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మొట్టమొదటి HIV/ఎయిడ్స్ వైద్య నిపుణుడననీ తెలియ జేశారు .వివిధమైన అనేక సా౦క్రమిక వ్యాధుల సమాహారమే ఎయిడ్స్ అన్నారు.కరోనా వైరస్ –కోవిడ్ ఇటీవల ప్రపంచ పీడగా మారి చాలా కష్ట నష్టాలకు గురి చేసింది .ప్రభుత్వ సంస్థలద్వారా తాను ఎయిడ్స్ పై ప్రజలకు గొప్ప అవగాహన కల్పించాననీ వైద్యాన్ని ప్రజలకు అందు బాటులో తెచ్చాననీ సంతోషం తో ఆత్మవిశ్వాసం తో చెప్పారు .

  2021లోఅత్యంత ప్రమాదకర ‘’డెల్టా వైరస్ ‘’జబ్బుకు ‘’ఏస్పిరిన్ ,ప్రేడ్ని సొలాన్ ,ఎజిత్రోమైసిన్ ‘’లతో రూపొందించిన ‘’హోం కేర్ కిట్ ‘’లక్షలాది తెలుగు వారి జీవితాలపై భరోసా బతుక్కి భద్రతా కల్పించిందనీ ,తన ‘’వాల్ ‘’పైననే తొమ్మిది నెలల కాలం లో దఫదఫాలుగా ‘’యనమదల ప్రోటోకాల్ ‘’లో 18వేలకు పైగా పేర్లు నమోదవటం దీనికి తిరుగులేని నిదర్శనమన్నారు. ప్రస్తుతం భారత దేశాన్ని కుదిపేసి పీడిస్తున్న’’ఓమిక్రాన్ రకం కోవిడ్ ‘’జబ్బుకు నవీకరించిన ప్రోటోకాల్ 13వేలకు పైగా తన ‘వాల్ ‘’పై షేర్ అయిందని ,వాట్సాప్ ,ఇతరరకాలుగా లక్షలాది మందికి చేరాయని కనుక కంగారు పడకుండా ‘’జీవితాన్ని చూద్దాం –బాగు చేసుకొందాం ‘’అనే నినాదమిచ్చారు డాక్టర్ గారు .జబ్బులు మనుషుల్ని సమాజాన్ని  అర్ధం చేసుకోనేట్లు చేస్తాయి .తన వీడియోలతో సహా అన్నిటినీ చూపేలా ‘’ఫిజికల్-డిజిటల్  ‘’ఇంటర్ స్పేస్’’తో పఠనాన్ని ఈ పుస్తకం  పై మెట్టులో నిలుపుతుందని నమ్ముతున్నారు .సమాజం తనకు చదువు చెప్పి తనను ఇంత ఉన్నత స్థాయిలో నిలబెట్టి నందుకు తన శక్తి మేరకు సమాజానికి ఉపయోగ పడ్డానని ఆత్మ సంతృప్తి చెందారు ఈ డాక్టర్ .

‘అక్షరం లోక రక్షకం ‘’అనే నినాదానికి పూర్తి అర్ధం నా భాషాసేవ .నా పుస్తకాన్నీ ,నా కృషినీ మీకు తెలియ జేస్తున్నాను ‘’అని డా యనమదల మురళీ కృష్ణ కవరింగ్ లెటర్ ముగించారు  .

  ఈ సెమి ఆత్మకథా చిత్రం లో 1-కోవిడ్ 2-ఎయిడ్స్ -3-నేను అనే మూడుభాగాలున్నాయి .

మొదటి దానిలో ప్రాణభీతి కోవిడ్ ,అప్రమత్తత తోనే ఓమిక్రాన్ వేరిఎంట్ నుండి రక్షణ ,ఏసీ వలననే కోవిడ్ వ్యాప్తి,పరిశుభ్రతతో చెక్ ,మానసిక ధైర్యమే మొదటిమందు ,వాక్సిన్ సురక్షితమే ,ఇంట్లోనే ఆక్సిజన్ సాచురేషన్ ఎలాసాధ్యం ,దీని బారిన పడ్డ ఎయిడ్స్ రోగుల పరిస్థితి ,ఆందోళన భయాలే ప్రాణం తీస్తాయి ,ఎరుకతోనే భరోసా ,వ్యాదినిరోధకశక్తిని దెబ్బతీస్తున్న కోవిడ్ బ్లాక్ ఫంగస్సమస్యలు  కరోన కిట్ , సమస్య లను చక్కగా వివరించి కరోనాలో వైద్యునిగా తనప్రయాణ౦  ఎలా సాగిందో వివరించారు .

 రెండవది అయిన ఎయిడ్స్ లో –ఎయిడ్స్ నిర్మూలన సాధ్యమా ,ప్రవర్తనే ప్రపంచం ,అజ్ఞానమే మరణం ,ప్రవర్తనే జీవితం ,కొత్త దార్లలో వెలుగు రేఖలు ,నిరంతర వైద్యం ,నైపుణ్యం లేని స్పెషలిస్ట్ లు ,కోరికల గుర్రాలపై ప్రమాదకర ప్రయాణం  వనరులు స్తోమత బట్టే బతుకైనా ,వైద్యమయినా అనే అంశాలను బహు పరిశీలనాత్మకంగా చర్చించి జీవితానికి భరోసా కల్పించారు స్వానుభవాలను కూడా జోడించారు .

3-నేను –లో సైంటిఫిక్ మెధడ్,మార్కెట్ ఎకానమీ ,మెడికల్ కాలేజి మేగజైన్ ఎడిటర్ గా తన కృషి ,మూసను దాటితేనే అద్భుతాలు వస్తాయి ,పెద్దలదగ్గర తగ్గి లోకం లో పెరగాలి, జీవిత గమనాన్ని నిర్దేశించిన తన అర్ధాంగి గీత ,కొత్తగా ప్రయత్నిస్తేనే సంతోషం ,వినిమయ లాలస ,తన ప్రైమరీ స్కూల్ మాష్టారు తనికెళ్ళ వెంకట రమణ శాస్త్రి స్పూర్తి ,ప్రేరణ ,హ్యూమనిస్ట్ సుబ్బరాజు ,అదృష్టదీపక్ పాండితీ ప్రకర్ష ,జ్ఞానాన్ని అనుభవం లోకి తెచ్చుకోవటమే జీవితం , మొదలైనవి ఉన్నాయి .జగన్  వీరారాధకుడుగా డాక్టర్ కనిపిస్తారు .

  ఇది అనుభవాలతో ఆత్మకథగా సాగిన రెండు ప్రాణాంతక జబ్బుల వికటాట్టహాసం వీర విహారం .వాటిని అదుపు చేయటానికి కావలసిన మానసిక స్థైర్యం నింపిన రచన .డా యనమదల రామ కృష్ణ ను అభినదిస్తున్నాను .

చిరునామా -4-50పెట్రోల్ బ్యాంకు దాటాక ఇంద్రపాలెం –కాకినాడ -533006

సెల్ -94406-77734

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-5-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-278

  • మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-278
  • 278-రక్తకన్నీరు నాటక సినిమాఫెం ,అంతర్జాతీయ పురస్కారగ్రహీత ,నటి రాధిక తండ్రి ,ఎమ్జీఆర్ పై కాల్పులు జరిపిన కరుడుకట్టిన అగ్రశ్రేణి విలన్  –ఎం ఆర్
  •  రాదా -2
  • శ్రీ ఎమ్బి ఎస్ ప్రసాద్ చెప్పిన విషయాలు

సినీనటి, టీవీ కార్యక్రమాల నిర్మాత రాధిక ‘‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కె’’లో పాల్గొంటూ తన తండ్రి ఎమ్మార్ రాధా తెలుగువాడని, ఆ కారణంగా తమిళ సినీరంగంలో, రాజకీయరంగంలో తనను గేలి చేసేవారని చెప్పింది. ఇది విని చాలా ఆశ్చర్యం కలిగింది. నేను పదేళ్లు మద్రాసులో పనిచేసినప్పుడు రాధిక గురించి ఇలా వినలేదు. అప్పట్లో (85-95) ఆమె చాలా ఫామ్‌లో ఉన్న హీరోయిన్. తమిళ సినిమాల్లో కూడా వేసే జయప్రద, జయసుధ, జయచిత్ర, శ్రీదేవి తెలుగువాళ్లని, రమ్యకృష్ణ తండ్రి తెలుగువాడని అందరూ అనేవారు తప్ప రాధిక తెలుగమ్మాయని ఎవరూ కాజువల్‌గా కూడా అనలేదు. ఆమె, నిరోషా ద్రవిడ ఉద్యమంలో ముఖ్యనాయకుడైన ఎమ్మార్ రాధా కూతుళ్లని, రాధారవి వాళ్లకు సవతి సోదరుడనీ అందరికీ తెలుసు.

రాధిక రాడాన్ సంస్థ స్థాపించి చాలాకాలం విజయవంతంగా నడిపిన తర్వాత, ఒక ఐదారేళ్ల క్రితమనుకుంటా, తన సంస్థ పేరు గురించి వివరిస్తూ అది తన తండ్రి పేరు మీదుగా పెట్టానని, ఆయన పేరు రాధాకృష్ణ నాయుడని అంది. నాయుడంటే తెలుగువాడే కాబట్టి ఎమ్మార్ రాధా తెలుగువాడా అని తెలుసుకుని విస్తుపోయాను. తమిళం కేంద్రంగా నడిచిన ద్రవిడ ఉద్యమ నాయకుల్లో తమిళుల సంఖ్య ఒకటి తగ్గిందే అనుకున్నా. పెరియార్ కన్నడిగ అంటారు, కరుణానిధి తెలుగు, ఎమ్జీయార్ మలయాళీ, అణ్నా మాత్రం తమిళుడు. ఇప్పుడు రాధా కూడా తెలుగా? అనుకున్నాను.

పైగా రాధిక తన తండ్రి కులం పేరు కూడా చెప్పడం వింతగా కనిపించింది. ద్రవిడ నాయకులు హిందూమతానికీ, కులవ్యవస్థకీ వ్యతిరేకంగా భీకరంగా పోరాడారు. డిఎంకె అధికారంలోకి వచ్చాక రోడ్ల పేర్లలో కులసూచకాలు కనబడితే తీసేయించారు. రాధా కూడా తను ఫలానా కులస్తుడని చాటుకున్న దాఖలాలు లేవు. బ్రాహ్మణవ్యతిరేక ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించాడు కాబట్టి అబ్రాహ్మణుడని మాత్రం అర్థమౌతుంది. అంతకుమించి కులం తోక పెట్టుకోలేదు. మరి రాధిక ఎందుకు చెప్పిందో అనుకున్నాను.

గత నెలలో ఇంటర్వ్యూలో మాత్రం రాధిక తన తండ్రి చిత్తూరు, మద్రాసు ఆ ప్రాంతాలకు చెందిన నాయుడని, అది తనకు చాలాకాలం తర్వాత తెలిసిందని, తను తెలుగు సినీరంగంలోకి వచ్చినపుడు తమిళమ్మాయనే అందరూ అనేవారని, తమిళ రంగంలో మాత్రం తెలుగమ్మాయి అని తెలుసుకుని ‘గొల్టి’ అని పిలిచేవారని, తను డిఎంకె తరఫున ప్రచారానికి వెళ్లినపుడు యితర పక్షాలకు చెందిన రాజకీయ కార్యకర్తలు కూడా ఆ పేరుతో పిలిచేవారని చెప్పుకుంది. గొల్టి అంటే ఏమిటని రాధాకృష్ణ అడిగినదానికి సమాధానంగా ‘స్లాంగ్ అంతే’ అని జవాబిచ్చింది. మనం తమిళులను అరవ్వాళ్లు అంటాం, దానిలో తప్పేమీ లేదు. ఎందుకంటే తెలుగు ప్రాంతాలకు దక్షిణ సరిహద్దుల్లో ఉన్న తమిళప్రాంతం పేరు ‘అరువనాడు’. వాళ్లని అరవలు అని, వాళ్ల భాషని అరవం అని అనడం తెలుగువాళ్లకు అలవాటైంది. అలాగే కన్నడవాళ్లకు సరిహద్దుల్లో ఉన్న తమిళప్రాంతం పేరు ‘కొంగునాడు’. వాళ్లు తమిళులను కొంగ అంటారు. కొంగాట్టి అనే పదం కూడా విన్నాను.

మరి తమిళులు మననేమంటారు? ‘వడగర్లు’ అంటారు. వడ అంటే ఉత్తరం, వాళ్లకు ఉత్తరాదిన ఉంటాం కాబట్టి ఉత్తరాదివాళ్లు అని అర్థమన్నమాట. మా చెల్లెలికి పెళ్లి సంబంధాలు చూస్తూ తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిని కదలేస్తే ‘మేం వడగర్లను చేసుకోం’ అన్నారు. మనకు నార్త్ ఇండియన్లని వేరేవాళ్లుంటే మనం వీళ్లకు నార్త్ ఇండియన్లన్నమాట అనుకుని నవ్వుకున్నాను. మరి యింతకీ యీ గొల్టి ఏమిటి? ఓ సారి ఆరుద్రగారిని అడిగాను. ఆయన ‘ఏమీ లేదు, తెలుగు అనే పదాన్ని తిరగేసి, అటూయిటూ చేస్తే గొల్టి అయింది. దానికి అర్థమేమీ లేదు.’ అన్నారు. కానీ అది తెలుగువాళ్లను ఉద్దేశించిన మర్యాదకరమైన పదమేమీ కాదు. మందబుద్ధి, ఏబ్రాసి అన్న అర్థంలో వాడతారు. ఎవరైనా ఆ పదం మనపట్ల వాడితే అభ్యంతర పెట్టవలసినదే! రాధికను తీసిపారేయడానికే ఆ పదం వాడేవారనేది ఆమె మాటల్లోనే తెలిసింది.

ఇలా అనగానే మనం ఆవేశపడనక్కర లేదు. మనం తమిళుల గురించి గౌరవంగా మాట్లాడతామా అని ఆలోచించుకుని చూడాలి. ఎవరైనా గట్టిగా మాట్లాడితే అరవగోల అంటాం. హీనమైన చాకిరీ చేయవలసి వస్తే అరవచాకిరీ అంటాం. తమిళవైష్ణవులకు మంగలి చేసే సర్వాంగ క్షౌరాన్ని అరవచాకిరీ అంటారని మాండలిక పదకోశంలో ఉంది. పనికిరాని పోచికోలు కబుర్లు చెపుతున్నాడంటే ‘సొల్లు’ చెపుతున్నాడ్రా అంటాం. ఆ పదానికి తమిళంలో చెప్పడమనే అర్థమే ఉంది. అది మనకు విసుగు కలిపిస్తుంది కాబట్టి సొల్లు అంటూ తీసిపారేస్తాం. ఎక్కడైనా అతి కనిపిస్తే చాలు, అరవానికి అంటకడతాం. అరవ యేక్షన్ అనేస్తాం. తమిళుణ్ని ఎవడినైనా తీసిపారేయాలంటే ‘సాంబారుగాడు’ అంటాం. కానీ తమిళనాడులో సాంబారు పదాన్ని బ్రాహ్మల్ని ఉద్దేశించి వాడతారు. మన దగ్గర చూడండి, పప్పు అందరూ తింటారు. కానీ బ్రాహ్మణ్ని గేలి చేయడానికి పప్పు బ్రాహ్మడు అంటారు. అలాగే అక్కడ సాంబారు. ఒక తరం తమిళ హీరోల్లో జెమినీ గణేశన్ మాత్రమే బ్రాహ్మడు (పూర్తిగా కాదు, దాని గురించి వేరే వ్యాసంలో ఓ సారి రాశాను). అతనికి నిక్‌నేమ్ సాంబార్. భార్య స్నేహితుడితో మాట్లాడితే, చాటుగా విని ఆపార్థం చేసుకునే భర్త పాత్రలు చాలా వేశాడతను. అలాటి ఘట్టాల్లో హాల్లో ‘సాంబార్’ అనే చాలామంది కేకలు వేసేవారని ఓ మిత్రుడు చెప్పాడు.

ఎమ్మార్ రాధా విషయానికి వస్తే, అతడు తెలుగువాళ్లకు కూడా తెలిసిన పెద్ద హీరో అయి వుంటే, ప్రజలు ఆరాధించిన నాయకుడైతే యీ పాటికే మన తెలుగు రిసెర్చర్లు ఆ ‘నాయుడు’ కమ్మనాయుడా? బలిజనాయుడా? సెట్టిబలిజ నాయుడా?’ అని శోధించేసి, మా వాడంటే మా వాడంటూ లావులావు పుస్తకాలు రాసేసేవారు. వీలైతే విగ్రహాలు పెట్టేసేవారు. ఆ ప్రమాదం రాలేదు. నా నుంచి తెచ్చిపెట్టే ఉద్దేశం కూడా లేదు కాబట్టి, క్లుప్తంగానే అతని గురించి రాస్తాను. అతను తమిళ సినిమాల్లో విలన్‌గా, కామిక్ విలన్‌గా, కారెక్టరు నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. శివాజీ, ఎమ్జీయార్‌ల సరసన మాత్రమే కాక, ఆనాటి ప్రముఖ చిత్రాలన్నిటిలో నటించాడు. విలక్షణమైన డైలాగు డెలివరీతో ప్రత్యేకత చూపుకున్నాడు. ఆ సినిమాలు తెలుగులో డబ్ అయి వచ్చాయి కాబట్టి పాతతరం తెలుగువాళ్లకు అతని గురించి తెలుసు. డైరక్టు తెలుగు సినిమా ‘‘బొబ్బిలియుద్ధం’’ (1964)లో హైదర్ జంగ్ పాత్ర వేశాడు.

రాధా డైలాగ్ డెలివరీ ఎలా వుంటుందో తెలుసుకోవాలంటే నాగభూషణాన్ని గమనిస్తే చాలు. నాగభూషణం తొలి దశలో అనేక రకాల పాత్రలు వేశాడు. ‘‘ఏది నిజం?’’ (1956) సినిమాలో హీరో పాత్ర కూడా వేశాడు. అప్పట్లో డైలాగులు మామూలుగానే చెప్పేవాడు. అయితే రాధా ప్రధానపాత్రలో నటించిన ‘‘రక్తకన్నీరు’’ (1954) అనే తమిళ సినిమా వచ్చింది. రాధా తండ్రికి మద్రాసులోని కొత్వాల్ చావిడిలో కూరల దుకాణం ఉండేది. దరిద్రం భరించలేక, తల్లితో పోట్లాడి పదేళ్ల వయసులో బాలనటుడిగా రంగస్థలానికి వెళ్లిపోయాడు. దానిలోనే ఎదిగాడు. ‘‘సంతాన దేవన్’’ (1939) సినిమాలో చిన్న పాత్ర వేశాడు. రెండు సినిమాల్లో హీరోగా కూడా వేశాడు. గిరాకీ లేకపోయింది. అప్పుడే ద్రవిడ కళగంలో చేరాడు. పెరియార్‌కు సినిమాలపై సదభిప్రాయం లేదు. నాటకాలనే ప్రోత్సహించాడు. రాధా నాటకరంగానికే పరిమితమై పోయాడు. అక్కడ చాలా పేరు తెచ్చుకున్నాడు.

పెరియార్ శిష్యుడైన తిరువారూరు తంగరసు రాధా హీరోగా ‘‘రక్తకన్నీరు’’ అనే నాటకాన్ని రాశాడు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఓ ఆధునిక యువకుడు తల్లి బలవంతం చేత మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోవలసి వస్తుంది. సాంప్రదాయంగా ఉండే తన భార్య అతనికి నచ్చదు. ఒక వేశ్య వలలో పడతాడు. భార్యను తృణీకరించి, తరిమివేసి వేశ్యతో దర్జాగా బతుకుతాడు. కానీ చెడు అలవాట్ల కారణంగా అతనికి కుష్ఠు రోగం వస్తుంది. ఆస్తంతా లాక్కుని, వేశ్య తరిమివేస్తుంది. అతను రోడ్ల మీద పడి బిచ్చమెత్తుకుంటాడు. చివరకు భార్య అతన్ని చేరదీస్తుంది. పశ్చాత్తాప పడుతూ ఆమె చేతుల్లోనే మరణిస్తాడు. ఈ సెంటిమెంటల్ కథను రాధా సమాజం పోకడలపై విసుర్లు విసురడానికి, అప్పటికి అధికారంలో ఉన్న కాంగ్రెసు రాజకీయాలను తూర్పార పట్టడానికి ఉపయోగించుకున్నాడు. అతను కుష్ఠురోగి అయిన దగ్గర్నుంచి నాటకంలో ఊపు వస్తుంది.

రాధా వాయిసే విచిత్రంగా ఉంటుంది. పైగా తన డైలాగులను నొక్కినొక్కి పలుకుతూ ఒక రకమైన మాడ్యులేషన్‌తో డెలివర్ చేయడంతో ప్రజలు వెర్రెక్కిపోయారు. అప్పట్లో ద్రవిడ ఉద్యమం ఊపులో ఉంది కాబట్టి, దేవుళ్ల గురించి కూడా దుమ్మెత్తిపోసేవాడు. ఆ నాటకం హిట్ కావడంతో దాన్ని కృష్ణన్-పంజు డైరక్షన్‌లో సినిమాగా తీశారు. అదీ సూపర్ హిట్టయింది. సినిమారంగం అతనికి ఎఱ్ఱ తివాచీ పరిచి, ఆహ్వానించింది. అప్పణ్నుంచి 13 ఏళ్ల పాటు క్షణం తీరిక లేకుండా వేషాలు వేశాడు. ‘‘రక్తకన్నీరు’’ను తెలుగులో డబ్ చేస్తూ రాధా పాత్రకు డబ్బింగు చెప్పడానికి నాగభూషణాన్ని పిలిచారు. ఆయన రాధా తరహాలోనే డైలాగులు చెప్తే హాల్లో చప్పట్ల వర్షం కురిసింది. తనకొక మార్గం కనిపించిం దనిపించిది నాగభూషణానికి. దీన్ని తెలుగులో నాటకంగా వేసి ఊరూరా ప్రదర్శిస్తే బాగుంటుం దనిపించింది. కాపీరైటు హక్కుల కోసం రాధాను సంప్రదిస్తే, ‘కాపీరైటేమీ లేదు. ఏ ఊరికా ఊరికి డైలాగులు మార్చేస్తూంటాను. నువ్వూ అలాగే ఆడుకో పో,’ అని నాగభూషణాన్ని ఆశీర్వదించాడు.

నాగభూషణం పాలగుమ్మి పద్మరాజు గారి చేత స్క్రిప్టు రాయించుకున్నా, ఏ ఊళ్లో నాటకం వేస్తే ఆ వూరి సమస్యలను ప్రస్తావిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 2000 ప్రదర్శనలు యిచ్చారు. ఆయన పేరుకు ముందు ‘‘రక్తకన్నీరు’’ (దుష్టసమాసమే అయినా) వచ్చి చేరింది. అప్పటిదాకా ఆయన్ని పెద్దగా పట్టించుకోని తెలుగు సినిమావాళ్లు పిలిచి వేషాలివ్వసాగారు. యువక పాత్రలలో రాణించలేకపోయిన నాగభూషణం తన 45వ ఏట ‘‘ఉమ్మడి కుటుంబం’’ (1967)లో హీరోయిన్ తండ్రి పాత్రలో గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పణ్నుంచి పెద్ద తరహా పాత్రలు వేస్తూ ‘‘కథానాయకుడు’’ (1969)లో కామిక్ విలన్‌గా చాలా పేరు తెచ్చుకున్నారు. ఇక అప్పణ్నుంచి ఒక దశాబ్దం పాటు ఎదురులేకుండా పోయింది. ఆయన రాధా డైలాగు డెలివరీనే నమ్ముకున్నారు.

డూప్లికేటు రాధా యిలా వెలిగాడు కానీ ఒరిజినల్ రాధా ఏమయ్యాడనే సందేహం రాకమానదు. 1967 జనవరిలో అతని బుద్ధి వక్రించింది, దానితో బాటు జాతకమూ వక్రించింది. ‘పెరియార్’గా పిలవబడే రామస్వామి నాయకర్ ద్రవిడ కళగం (డికె) అనే సంస్థను పెట్టి బ్రాహ్మణాధిపత్యానికి, హిందూమతానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నడిపాడు. అప్పట్లో తమిళనాడు కాంగ్రెసులో బ్రాహ్మణులు నాయకులుగా ఉండడంతో పెరియార్‌కు బ్రిటిషు వారి మద్దతు లభించి, ఉద్యమం విజయవంతమైంది. బ్రిటిషు వారు వెళ్లిపోయాక, ఈ ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా మారిస్తే లాభమన్నారు పెరియార్ అనుచరులు అణ్నాదురై, కరుణానిధి వగైరాలు. ససేమిరా కుదరదన్నారు పెరియార్. చివరకు 1949లో డిఎంకె (ద్రవిడ మున్నేట్ర కళగం) పార్టీ అణ్నాదురై నాయకత్వంలో ఏర్పడింది. పెరియార్ అనుయాయుల్లో అనేకమంది అటు వెళ్లిపోయారు కానీ ఎమ్మార్ రాధా మాత్రం ఆయనతోనే ఉండిపోయాడు. డిఎంకె ఎన్నికల్లో పోటీ చేస్తూ కొన్ని స్థానాలు గెలుస్తూ వస్తోంది. డికె దాన్ని శత్రువుగా పరిగణిస్తోంది.

1967 సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికే డిఎంకెకు అనుకోని మద్దతు లభించింది. చాలాకాలం కాంగ్రెసు నాయకుడిగా ఉంటూ, దానితో విభేదించి, విడిగా వచ్చేసి 1959లో స్వతంత్ర పార్టీ పెట్టిన రాజాజీ, తమిళనాడు (అప్పటి పేరు మద్రాసు) లో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెసును ఓడించడానికి డిఎంకెకు మద్దతు ప్రకటించాడు. బ్రాహ్మణుడైన రాజాజీ మాటను మన్నించి మద్రాసు రాష్ట్ర బ్రాహ్మణులందరూ డిఎంకెకే మా ఓటు అన్నారు. ఇది డికెకు కోపం తెప్పించింది. ఇన్నాళ్లూ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పోరాడి, యిప్పుడు వాళ్ల మద్దతుతోనే అధికారంలో రావడానికి ప్రయత్నిస్తోంది డిఎంకె అనుకున్నారు. ఆ రోజుల్లో డిఎంకెకు ఓట్లు తెచ్చిపెడుతున్న స్టార్ కాంపెయినర్ ఎమ్జీయార్. అతన్ని తుదముట్టిస్తే చాలు, డిఎంకె ఫినిష్ అనుకున్నాడు డికె నాయకుడు ఎమ్మార్ రాధా. దీనికి తోడు ఎమ్జీయార్‌తో అతనికి వృత్తిపరమైన తగాదా ఒకటుంది. రాధా తనకో సినిమా చేయమని ఎమ్జీయార్‌ను అడుగుతున్నాడు. రాధాను ఎమ్జీయార్ అన్నాఅన్నా అని గౌరవిస్తాడు కానీ సినిమా కమిట్ కావడానికి యిష్టపడటం లేదు.

ఈ రెండూ మనసులో పెట్టుకుని 1967 జనవరి 12న ఒక ప్రొడ్యూసర్‌ను వెంటపెట్టుకుని ఎమ్జీయార్ దగ్గరకు వెళ్లాడు రాధా. సన్నిహితమిత్రుడు కాబట్టి సెక్యూరిటీవాళ్లు చెక్ చేయలేదు. లోపలికి వెళ్లాక జేబులోంచి తుపాకీ తీసి ఎమ్జీయార్‌ను కాల్చేశాడు రాధా. బుల్లెట్లు ఎమ్జీయార్ మెడలో యిరుక్కున్నాయి. వెంటనే తుపాకీతో తనను కూడా కాల్చుకున్నాడు రాధా. ఇద్దరూ ఒకే ప్రభుత్వాసుపత్రిలో చేరారు. ఎమ్జీయార్‌కి చావు తప్పి గొంతు లొట్టపోయింది. చాలాకాలానికి కానీ కోలుకోలేదు. జీవితాంతం ఆ గాయంతో బాధపడ్డాడు. కానీ మృత్యుముఖంలో ఉన్న ఎమ్జీయార్ అంటూ డిఎంకె పబ్లిసిటీ గుప్పించడంతో ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. రాధాను అరెస్టు చేశారు, కేసు నడిపారు. ఎమ్జీయార్ రాధాను క్షమించానని అన్నా కోర్టు ఏడేళ్లు కఠినశిక్ష వేసింది. అప్పటికే అతనికి 60 ఏళ్ల కాబట్టి దాన్ని ఐదేళ్లకు తగ్గించారు. నాలుగున్నరేళ్లు పోయాక వదిలేశారు.

ఎమ్జీయార్‌ను చంపబోయాడని తెలియగానే ఎమ్జీయార్ అభిమానులు రాధాపై దాడి చేద్దామని చూశారు. దాంతో రాధిక తల్లి గీత భయపడింది. ఆవిడ శ్రీలంకకు చెందిన వ్యక్తి కాబట్టి, పిల్లల్ని శ్రీలంక పంపేసి హాస్టల్లో పెట్టి చదివించింది. అక్కణ్నుంచి రాధిక లండన్ వెళ్లి చదివింది. మద్రాసుకి తిరిగి వచ్చినపుడు అనుకోకుండా సినిమాల్లో బుక్ అయింది. తన తండ్రి కాల్పుల ఉదంతం రాధికకు గుర్తుంది. తల్లితో పాటు ఆసుపత్రికి వెళ్లిందట. అక్కడ తన భర్త కాల్చినది సాక్షాత్తూ ఎమ్జీయార్‌నే అని తెలియగానే రాధిక తల్లి గీత మొగుడిమీద విరుచుకు పడిందట, నీకేం పోయేకాలం వచ్చింది అంటూ. రాధకు ఆమె ఒక్కత్తే భార్య కాదు. మరో ముగ్గురో నలుగురో ఉన్నారట. ప్రేమావతి అని ఒకావిడ పోయింది కానీ తక్కిన నలుగుర్ని సరస్వతి, ధనలక్ష్మి, జయ, గీతలను ఏకకాలంలో మేన్‌టేన్ చేసి  ముగ్గురు కొడుకుల్ని, ఏడుగురు కూతుళ్లను కన్నాడు. అతని పెద్ద కొడుకు ఎమ్మారార్ వాసు కూడా తండ్రిలాగే కామెడీ విలన్ వేషాలు వేశాడు. మధ్యవయసులోనే పోయాడు.

ఆ కాల్పుల ఉదంతం గురించి నెట్ సీరీస్ తీస్తానంటోంది రాధిక. రిసెర్చి చేసి కనుక్కున్న విషయాలను దానిలో చూపిస్తుందట. తన తండ్రి కాల్చలేదని చూపించడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే జైల్లోంచి బయటకు వచ్చాక రాధా ‘నేనే కాల్చాను’ అనే అర్థం వచ్చే టైటిల్‌తో నాటక ప్రదర్శనలు యిచ్చాడట. ఎందుకు కాల్చాడో వివరిస్తూ పుస్తకం కూడా రాశాడట. జైలు నుంచి వచ్చాక నాటకాలు, సినిమాలు వేశాడు కానీ ఎవరూ పట్టించుకోలేదు. మొత్తం మీద 5 వేల నాటకాలు వేసి, చివరకు 1979లో మరణించాడు. రాధిక సినిమాల్లోకి ప్రవేశించేటప్పుడు వచ్చి మేకప్ బొట్టు పెట్టి ‘నా వృత్తి నీ వృత్తి అవుగాక’ అని ఆశీర్వదించాడట.

రాధా పూర్తిపేరు మద్రాసు రాజగోపాలన్ రాధాకృష్ణ. చిన్నతనంలోనే తల్లి మీద అలిగి, యింట్లోంచి పారిపోయి నాటకాల్లో బాలనటుడిగా వేషాలు వేయడం మొదలుపెట్టాడు. అనేక నాటకసమాజాలు మారాడు. వాటిలో ఒక దానిలో బాలనటుడిగా వేస్తున్న శివాజీని చూసి అభిమానించాడు. తన కంటె 21 ఏళ్లు పెద్దవాడైన రాధాను శివాజీ అన్నా అని పిలిచేవాడు. అతను తనను ఎలా పైకి తీసుకుని వచ్చాడో శివాజీ తన ఆత్మకథ ‘‘ఆటోబయాగ్రఫీ ఆఫ్ ఏన్ యాక్టర్’’లో చెప్పుకున్నాడు. ‘‘నేను బాలగానసభలో పనిచేసే రోజుల్లో పరమకుడి అనే ఊరికి వెళ్లాం. అంతకు క్రితం ఆ ట్రూపులో పనిచేసి వదిలిపెట్టి వెళ్లిన రాధా అన్న ట్రూపుకి తిరిగి వచ్చాడు. మా పిల్లలందరికీ తండ్రిలా ఉండేవాడు. ఎంతో ఆప్యాయత కురింపిచేవాడు. మేం పడుక్కున చోటు శుభ్రం చేసేవాడు. మా అందరికీ తల దువ్వేవాడు. ‘తను జీనియస్. ఆల్‌రౌండర్. నాటకానికి సంబంధించిన ప్రతి డిపార్టుమెంటు గురించి క్షుణ్ణంగా తెలుసు ఆయనకు. అవసరమైతే ఎలక్ట్రీషియన్‌గా, కార్పెంటరుగా, పెయింటరుగా కూడా పనిచేసేవాడు.

ఇక స్టేజిపై హీరో, విలన్, కమెడియన్, కారెక్టరు యాక్టరు ఏ పాత్రైనా వేసేసేవాడు. తనంత బాగా కామెడీ ఎవరూ చేయలేకపోయేవారు. తను వేసిన నాటకాలకు బాగా డబ్బులు వచ్చేవి. అయినా నాటకసభ ఆర్థికంగా కష్టాలు పడేవి. నాకు అప్పుడు వయసు 12. ఇంట్లో చెప్పకుండా వదిలి వచ్చి ఐదేళ్లయింది. నేనూ, నా స్నేహితుడు తంగవేలు దీపావళికి యింటికి వెళతామని సభ అనుమతి తీసుకుని వెళ్లాం. మా యింట్లో వాళ్లు నన్ను చూసి ఆశ్చర్యపడ్డారు. నేను చచ్చిపోయానని అనుకున్నారు వాళ్లు. ఇంటికి తిరిగివచ్చాక మళ్లీ డ్రామా కంపెనీకి వెళ్లాలనుకోలేదు మేము. ఒక రోజు రాధా అన్న మా యింటికి వచ్చాడు. ‘నేనూ మీతో పాటు ఉంటాను.’ అన్నాడు. మా వాళ్లు సరేనన్నారు. కొన్నాళ్లు పోయాక తను ‘నేనొక డ్రామా కంపెనీ పెట్టబోతున్నాను. మీరూ వచ్చి నాతో చేరండి.’ అన్నాడు. మా అమ్మ కొత్త కంపెనీలో చేరితే రిస్కు కదా అంది. రాధా అన్న ‘మీ వాళ్లను మద్రాసు తీసుకెళ్లి మంచి తర్ఫీదు యిప్పిస్తాను.’ అని అమ్మకు మాట యిచ్చాడు.

‘నన్ను, తంగవేలును మద్రాసు తీసుకెళ్లి టంకశాల వీధి (మింట్ స్ట్రీట్)లో బస చేయించాడు. డబ్బులిచ్చి రిక్షాలో ఊరంతా తిరిగి రమ్మన్నాడు. సినిమా కంపెనీకి తీసుకెళ్లి నటుడు టిఆర్ రామచంద్రన్‌కు పరిచయం చేశాడు. తర్వాత ముగ్గురు చెట్టియార్లతో కలిసి ఒక నాటక కంపెనీ ప్రారంభించాడు. నాటక ప్రదర్శనలకై ఈరోడ్ వెళ్లినపుడు పెరియార్‌కు పరిచయం చేశాడు. ఆయన చెప్పే రాజకీయపాఠాలు విని చాలా నేర్చుకున్నాను. అణ్నాదురైతో అక్కడే పరిచయమైంది. అయితే రాధా అన్న ప్రారంభించిన కంపెనీకి నష్టాలు వచ్చి, భాగస్తులు విడిపోయి, కంపెనీ మూసేయాల్సి వచ్చింది. నేను యింటికి వెళ్లిపోయి నెలకు రూ.7 జీతంపై మెకానిక్‌గా పనిచేశాను. అయితే బాలగానసభ చేతులు మారి, కొత్త పెట్టుబడిదారులు వచ్చి నన్ను మళ్లీ పిలిచారు. స్టేజిపై మళ్లీ నటించాను.

1946లో ‘‘శివాజీ కణ్డ హిందూ రాజ్యం’’ నాటకంలో శివాజీ పాత్ర వేశాను. అది చూసి పెరియార్ నా పేరుకు ముందు ‘శివాజీ’ అని చేర్చారు. దాంతో విసి గణేశన్ కాస్త శివాజీ గణేశన్ అయ్యాడు. నా తొలి సినిమా ‘‘పరాశక్తి’’ (1952) హిట్ కావడంతో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే తొలి రోజుల్లో నాకు తర్ఫీదు యిచ్చిన, నన్ను మళ్లీ నాటకరంగానికి పిలుచుకుని వచ్చి, యింతటివాణ్ని చేసిన రాధా అన్నను మర్చిపోలేదు. ఆయనతో ఎన్నో సినిమాల్లో నటించాను. చివర్లో తిరుచ్చిలో నా యింటికి పక్కనే ఆయనకో ఇల్లు ఏర్పాటు చేశాను. 1979లో తన 72వ ఏట ఆయన ఆ యింట్లోనే మరణించాడు.’ అని శివాజీ రాసుకున్నాడు. రాధికతో మొదలుపెట్టి శాఖాచంక్రమణం చేసినా, రాధా గురించి మీకీపాటికి ఒక ఐడియా వచ్చిందనుకుంటున్నాను. (ఫోటో రాధికఎమ్జీయార్రాధా) 

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2022)

  సశేషం

మీ –గబ్బిటదుర్గాప్రసాద్ -10-5-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-279

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-279
279-శత చిత్ర ఫోటోగ్రఫీ డైరెక్టర్ ,మోసగాళ్ళకు మోసగాడు అసాధ్యుడు వీరాభిమన్యు ఫేం ,నిర్మాత దర్శకుడు,నందిపురస్కార గ్రహీత –వీస్ ఆర్ స్వామి
వి.ఎస్.ఆర్. స్వామి సుమారు 100 సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు.[1]
జీవిత విశేషాలు
ఇతడు కృష్ణా జిల్లా, గుడివాడ మండలం, వలివర్తిపాడు గ్రామంలో జూలై 15 1935 న జన్మించాడు.[2] ఇతనికి చిన్నప్పటి నుండి ఫోటోగ్రఫీపైన మక్కువ ఎక్కువ. ఇతడు తన గురువైన సి.నాగేశ్వరరావు వద్ద ఫొటోగ్రఫీలో మెళకువలు నేర్చుకున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు అయిన రవికాంత్ మెగా, ఎస్.శంకర్ ల దగ్గర పనిచేశాడు. వీరాభిమన్యు, బందిపోటు చిత్రాలకు కెమెరా ఆపరేటర్‌గా పనిచేశాడు. కృష్ణ నటించిన అసాధ్యుడు చిత్రంతో మొదటి సారిగా ఇతడు ఛాయాగ్రాహకుడయ్యాడు. ఇతడు సినిమాటోగ్రఫీలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. తెలుగులో అగ్రనటుల చిత్రాలకు ఎక్కువగా ఛాయాగ్రాహకుడిగా పనిచేసింది ఇతనే. 1986లో నిర్మింపబడిన తొలి తెలుగు 70 ఎం.ఎం. సినిమా సింహాసనంకు ఇతడే ఛాయాగ్రాహకుడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు ఎం.వి.రఘు, ఎస్. గోపాలరెడ్డి, రాం ప్రసాద్ లు ఇతని శిష్యులే.

వెండితెరపై అద్భుతాలు
మోసగాళ్ళకు మోసగాడు సినిమా క్లైమాక్స్ తీస్తున్నారు. హీరో కృష్ణ, విలన్ని గట్టిగా గూబమీద కొట్టాలి. ఆ దెబ్బకి అతనికి లోకమంతా గిర్రున తిరిగే ఎఫెక్టు రావాలి. ఈ నన్నివేశం ఎలా తీయాలి?. అందరూ టెన్షన్ పడుతున్నారు గానీ, కెమెరామన్ మాత్రం తాపీగా ఆలోచిసూ కూర్చున్నారు. కాసేపటి తర్వాత లారీ టైర్ తెమ్మని పురమాయించారు. దాన్ని తాడుతో వేలాడదీశారు. “ఈ లారీటైర్తో ఈయనగారు ఏం చేస్తారా” అని యూనిట్ అంతా వళ్లంతా కళ్ళు చేసు కుని మరీ చూస్తుంటే, ఆ కెమెరామన్ తన కెమెరాతో సహా ఆ లారీటైర్లో కూర్చుని దాన్ని గిర్రున తిప్పమని ఆదేశించారు. అలా టైర్లో గిర్రున తిరుగుతూ ఆ సీన్ షూట్ చేశారు. ఆ కాలంలో యిప్పటిలా క్రేనులూ, గ్రాఫిక్సూ లేనప్పటికీ కేవలం తన బుర్రతోనే కెమెరా కు పని చెప్పి వెండితెరపై వండర్స్ చేశారు. ఆయన ఛాయాగ్రహణ శాఖలో పూనా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి వచ్చిన తొలి బృందంలో ఒకరు. రవికాంత్ నగాయిచ్ లాంటి మహామహుల దగ్గర శిష్య రికం చేసిన స్వామి అసాధ్యుడు(1985)తో కెమెరామన్ గా మారారు[3]. తెలుగు సినిమాని సాంకేతికంగా కీలక మైన మలుపు తిప్పిన ఆయన. కలర్, సినిమా స్కోప్, 70 ఎం.ఎం. వంటి ప్రక్రియల్లో తొలినాళ్లలోనే ప్రయో గాలకు శ్రీకారం చుట్టారు. 250 పైగా సినిమాలకు ఛాయాగ్రహణం సమకూర్చారు. మలయాళం మినహా దాదాపు అన్ని భాషల్లోనూ చక్రం (కెమెరా) తిప్పారు. ఆయన ఖాతాలో ఎన్నో విలువైన చిత్రాలు ఉన్నాయి.

హిందీలో ‘మహాశక్తిమాన్’ అనే త్రీడీ చిత్రం, తెలుగులో ఆపద్బాంధవులు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే ఎదురీత, కలియుగ స్త్రీ అనే సినిమాలను నిర్మించారు. నేటి ప్రసిద్ధ ఛాయాగ్రాహకులు ఎస్.గోపాల్రెడ్డి, ఎమ్వీ రఘు, శరత్, తదితరులు ఈయన దగ్గర శిష్యరికం చేసిన వారే. కెమెరామన్ గా ఆయన చివరి చిత్రం ప్రభాస్ నటించిన ‘అడవి రాముడు’.

సినిమాలు
ఛాయాగ్రాహకుడిగా
====తెలుగు====

  1. అసాధ్యుడు (1968)
  2. కథానాయకుడు (1969)
  3. మోసగాళ్ళకు మోసగాడు (1971)
  4. భలే మోసగాడు (1972)
  5. అందాల రాముడు (1973)
  6. దేవుడు చేసిన మనుషులు (1973)
  7. మంచివాళ్లకు మంచివాడు (1973)
  8. అల్లూరి సీతారామరాజు (1974)
  9. భక్త కన్నప్ప (1976)
  10. సిరిసిరిమువ్వ (1976)
  11. ఎదురీత (1977)
  12. విచిత్ర జీవితం (1978)
  13. యువరాజు (1982)
  14. ఖైదీ (1983)
  15. చట్టంతో పోరాటం (1985)
  16. వేట (1986)
  17. సింహాసనం (1986)
  18. అల్లుడు దిద్దిన కాపురం (1991)
  19. ఆదిత్య 369 (1991)
  20. చినరాయుడు (1992)
  21. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)
  22. రౌడీ ఇన్‌స్పెక్టర్ (1992)
  23. సమరసింహారెడ్డి (1999)
  24. నరసింహ నాయుడు (2001)
  25. భలేవాడివి బాసు (2001)
  26. ఇంద్ర (2002)
  27. కొండవీటి సింహాసనం (2002)
  28. అనగనగా ఓ కుర్రాడు (2003)
  29. అడవి రాముడు (2004)
  30. లక్ష్మీనరసింహా (2004)
  31. విజయేంద్ర వర్మ (2004)
  32. ఒక్క మగాడు (2008)

హిందీ

  1. ఇత్నీ సీ బాత్ (1981)
  2. పాతాళ్ భైరవి (1985)
  3. సింఘాసన్ (1986)
  4. దోస్త్ (1989)

దర్శకుడిగా

  1. మహా శక్తిమాన్ (1985)

పురస్కారాలు
· 1987లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా విశ్వనాధ నాయకుడు చిత్రానికి తామ్ర నంది పురస్కారం.[4]

మరణం
నాలుగు దశాబ్దాల పాటు ఛాయాగ్రాహకుడిగా సుదీర్ఘ ప్రయాణం చేసి, ఎన్నో అజరామరమైన చిత్రాలకు తన కెమెరాతో నగిషీలద్దిన మేటి కెమెరామన్ వీయస్ఆర్ స్వామి 2008,నవంబరు 11న మచిలీపట్నంలో గుండెపోటుతో మరణించాడు. మరణించే సమయానికి అతని వయసు 70 సంవత్సరాలు. [5]

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-280
280-టివి,సినిమా నటుడు ,జాతీయస్థాయి జయసేన్ అవార్డ్ ,నండీ అవార్డ్ గ్రహీత –అచ్యుత్
అచ్యుత్’ ఒక తెలుగు టెలివిజన్, సినీ నటుడు. ఇతను తెలుగు దూరదర్శిని, సినిమాలలో అనతికాలంలో మంచి పేరు సంపాదించిన నటుడు.[1] చిన్న ప్రాయంలోనే గుండెపోటుతో హఠాత్తుగా మృతిచెందాడు.1-7-1964న మచిలీపట్నం లో కూనపరెడ్డి రామారావు ,సుజాత దంపతులకు జన్మించాడు

నేపథ్యము
కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల నుంచి నటనపై ఆసక్తి చూపాడు. 1983లో రెండేళ్ళు హైదరాబాదు లోని మధు ఫిలిం శిక్షణా సంస్థలో నటనలో శిక్షణ పొందాడు. 1986లో ఇంధ్ర ధనస్సు అనే దూరదర్శన్ సీరియల్ లో తొలిసారి నటించాడు. తరువాత వెన్నెల వేట, 1988లో హిమబిందు, ప్రేమ అంటే ఇదే సీరియల్స్ లోనూ, 1989లో మిస్టర్ బ్రహ్మానందం, ఇదెక్కడైనా ఉందా అనే సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగు సినిమా రంగంలో ప్రవేశించి 1991లో జంధ్యాల దర్శకత్వంలోని ప్రేమ ఎంత మధురం, 1992లో బి.సి.శేఖర్ దర్శకత్వంలోని పట్టుదల సినిమాలలో నటించాడు. ఇతని కృషికి గుర్తింపుగా 1990లో జాతీయ స్థాయిలో జయసేన్ అవార్డు అందుకున్నాడు. హిమబిందు, మిస్టర్ బ్రహ్మానందంలో అతని నటనకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. 1990 సంవత్సరంలో ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డునుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందుకున్నాడు.

మరణం
2002 సంవత్సరంలో గుండె పోటుతో హఠాన్మరణం చెందాడు.

నటించిన టెలివిజన్ ధారావాహికలు
· ఇంధ్ర ధనస్సు (1986) – దూరదర్శన్ – (తొలి ధారావాహిక)

· వెన్నెల వేట

· హిమబిందు (1988)

· ప్రేమ అంటే ఇదే (1988)

· మిస్టర్ బ్రహ్మానందం (1989)

· ఇదెక్కడైనా ఉందా (1989)

· అంతరంగాలు

· అన్వేషిత

· మట్టిమనిషి

· అన్నయ్య

సినిమాలలో
· అల్లరి రాముడు (2002)

· వాసు (2002)

· లాహిరి లాహిరి లాహిరిలో (2002)

· డాడీ (2001) …. రమేష్

· ఎదురులేని మనిషి (2001)

· కౌరవుడు (2000) …. రాహుల్

· తమ్ముడు (1999) …. చక్రి

ఉల్లాసంగా ఉత్సాహంగా చక్కని చెదరని చిరునవ్వుతో మంచి హావభావాలతో మ్సాఫ్ట్ కార్నర్ పాత్రలను బుల్లితెరపైనా వెండి తెర పైనా నటించిన మందస్మిత
వదనారవిన్దుడు అచ్యుత్ .అకాల మరణం చెంది అందరికీ బాధ కలిగించాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-5-22-ఉయ్యూరు

Posted in సినిమా | Leave a comment

సుమతీశతకాన్ని సంస్కృతం లోకి అనువాదం చేసిన శ్రీ జానపాటి పట్టాభి రామయ్య గారు -2(చివరిభాగం )

సుమతీశతకాన్ని సంస్కృతం లోకి అనువాదం చేసిన శ్రీ జానపాటి పట్టాభి రామయ్య గారు -2(చివరిభాగం )

  సుమతీ శతక సంస్కృతానువాదం

శ్రీ జనపాటి పట్టాభి రామయ్య గారు 1910లో సుమతీ శతకం ను సంస్కృతం లోకి ‘’నీతి గీతలు ‘’ గా అనువాదం చేసి నరసరావు పేట భారతీ విలాస ముద్రాక్షర శాలలో ముద్రించారు .వెల-రెండు అణాలు మాత్రమె .తెలుగు పద్యాన్ని దానికింద సంస్కృత అనువాదాన్ని అందించారు .

1-కం.-‘’శ్రీరాముని దయచేతను –నారూఢిగ సకల జనులు నౌరా యనగా –దారాళమగు నీతులు –నోరూరగ జవులు బుట్ట నుడివెద సుమతీ ‘’

సంస్క్రుతనువాదం –శ్లో –శ్రీరామ చంద్ర కృపయాక్షిత్యాం-శ్లాఘ్యంభవేద్య ధామనుజైః –ధారాళ నీతిశతకం –తధాతి రుచిరం ప్రవచిన్మధురతరం ‘’

3-అడిగిన జీతం బీయని –మిడిమేళపు దొరను గొల్చి మిడుగుటకన్నన్-వడిగల ఎద్దుల గట్టుక –మడి దున్నుక బ్రతకవచ్చు మహిలో సుమతీ

శ్లో –యోభ్యర్దితోపివిత్తం –యచ్ఛతినహి తజ్జనస్య సేవాతః –కృత్వా కృషిమతి విపులాం – కు౦భిన్యా౦ జీవనం వరం ‘’

5-ఆధరము గదిలియు గదలక –మధురములగు భాష లుడిగి మౌనవ్రతమౌ –యధికార రోగ పూరిత –బధిరాంధక శవము జూడ బాపము సుమతీ

శ్లో-అనుదిత మధుర వచస్కం –మౌనిన మధికార రోగ భూయిష్టం –దృష్ట్వా బధిరాంధ శవం –దోషీస్యాన్ముద్రితా ధరం మనుజః

12-ఇమ్ముగ జదవని నోరును –నమ్మా యని పిలిచి యన్నమడుగని నోరున్ –దమ్ముల బిలువని నోరును –గుమ్మరి మహి ద్రవ్వినట్టి గుంటర సుమతీ

శ్లో –యద్వక్త్రం నహి పతతే –జననీ త్యాహూయయాచ తేనాన్నం-యత్సహజాన్నాహ్వయతే తద్వక్త్రం –కుంభాకార కృతం గర్తం .

104-సిరిదా వచ్చిన వచ్చును –సలలితముగ నారికేళ సలిలము భంగిన్ –సిరి దా బోయిన బోవును –కరిమింగిన వెలగపండు గదరా సుమతీ .

శ్లో –శ్రీరాయాత్రికమ శస్త్వారామ –గ నారి కేళనీరమివ –భూరి క్షయ మేత్యచిరం –వారణ కబలీ కృతః కపిత్ధ ఇవ .

108-వేసరపు జాతి గానీ –వీసము దా జేయనట్టి వ్యర్ధుడు గానీ –దాసీ కొడుకైన గానీ –కాసులుగలవాడే రాజు ధరలో సుమతీ .

శ్లో-హీన కుల స్థోభూయా –దితర ప్రజ్ఞా భిరన్వితోనస్యాత్ –సూరు ర్వాస్యాద్దాస్యాః-క్షోణీనాధస్తువిత్తవానేవ .

  ఇలా శతకాన్ని చక్కగా గీర్వాణీకరి౦చారు  కవి  జానపాటి .తనసంస్కృత సత్తా చాటి చెప్పారు .

  స్కాంద పురాణం లోని ‘’నాగర ఖండం ‘’6,7,8ఆశ్వాసాలను ను పట్టాభి రామయ్య గారు సరళమైన తెలుగులోకి అనువదించి తన ప్రతిభ చాటారు .ఇది 1928లో గుంటూరు చంద్రికా ముద్రణ శాలలో ముద్రించారు .వెల-కేవలం అర్ధరూపాయి మాత్రమె .

 ఇందులో అజాగృహోత్పత్తి,ఖండశిలా సౌభాగ్యకూపికల ఉత్పత్తి , పతివ్రతా దీర్ఘిక చరిత్ర ,మాండవ్య మునిని గొల్ల వారు కొరతవేయటం ,యముడు దాసీ గర్భం లో పుట్టటం ,చనిపోయిన బ్రాహ్మణ బాలకుడు బతికి రావటం ,యుధిష్టిర ఉపాఖ్యానం ,అనూదకదాన ఫలం ,పార్వతి గణపతిని సృష్టించటం ,రంభ జాబాలి మహర్షి తపస్సు భంగం చేయటం ,రంభకు ఫలవతి పుట్టటం ,చిత్రాన్గాదేశ్వరుడు ఆమెకు వరాలివ్వటం ,స్త్రీల ఉత్క్రుష్టత ప్రశంస ,శివవారంతో దేవతలు రాక్షసులని పారద్రోలటం ,వసురుద్రాదిత్య వర్ణన ,శుక వ్యాస సంవాదం ,వ్యాసుడికి పటికలో కపిమ్జలుడు పుట్టటం ,త్రిపురాసుర సంహారం ,నారసింహ మంత్రం ప్రభావం ,వశిష్ట విశ్వామిత్ర పోరాటం ,పిప్పలాద జననం ,పద్మావతి చరిత్ర ,పుష్కర త్రయ వర్ణన ,బ్రహ్మ నారద సంవాదం ,శివుడు కపాలం పోగొట్టుకోవటం ,నాగతీర్ధ మహాత్మ్యం ,పింగలోపాఖ్యానం ,యక్ష్మ తీర్ధ ఉత్పత్తి ,గయా శ్రాద్ధఫలం ,సామ్బోపఖ్యానం ,విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవటం వగైరాలున్నాయి .

 ఇవన్నీ పద్యాలుగా అనువాదం చేశారు కవి .మార్కండేయ మహర్షి రోహితాశ్వుడికి చెప్పాడని సూతమహర్షి శౌనకాదులకు తెలియజేశాడు ..

మొదటి పద్యం –‘’శ్రీ యాడవరవిమృష్టన్యాయా –విమర్శనావసర ధృతా –మేయసమవర్తికాయ మహాయా –వరబాకరాత్పరా౦ కుశ రాయా ‘’

మరోపద్యం 8వ ఆశ్వాసం లోనిది –‘’కలదిల నాగరాఖ్య గడు ఖ్యాతము క్షేత్రము కుష్టు రోగ సం-కలితుడనై  తడనంతరమొకానొక కాలము నందు తీర్ధ యా –త్రలు నొనరించు జనుడు దత్ స్థలవర్తి తపస్వి యొక్క డి-బ్బలు రుజ నొంది కుందునను   బాగుగ జూచి కృపావిశిష్టుడై ‘’.

  దాదాపు తొమ్మిది వందల పద్య గద్యాల అనువాదం ఇది. తపస్సుగా చేసి ఫలితం మనకు అందించారు .లోకం ఆయనకు సదా రుణ పడి ఉంటుంది .

  పట్టాభి రామకవి గారు ‘’చమత్కార మంజరి ‘’అనే పద్య కావ్యం ను 132పద్యాలలో రాసి నరసరావు పేట భారతీ విలాస ముద్రాక్షర శాలలో 1911న ముద్రించారు .వెల పావలా .

 ఇవికాక విరూపాక్ష పీఠ గురు పరంపర ,వాసంతికా పరిణయం నాటకం ,కరణీకోద్ధారిణి,విశ్వ బ్రాహ్మణ శబ్ద ఖండనం –బ్రాహ్మణ శబ్ద విచారం ,విగ్రహారాధన ఖండనం ,స్వర్ణకార వ్యవహారం ,శుద్ధాంధ్ర హరిశ్చంద్ర చరితం ,ఆంద్ర సూత సంహిత ,భారతీయ ప్రబోధం ,ధర్మ నిర్ణయం ,అస్పృశ్యతా నివారణఖండనం ,పల్నాటి వీర చరిత్ర ,భాగవత రహస్యములు ,సోమేశ్వర శతకం ,వధూ శాకంబబరీ విడంబనం మొదలైనవి రచించి అతి తక్కువ వెలలో అందజేశారు .

ఇంతటి విశిష్ట రచయితను ఆంద్ర సాహిత్యలోకం నిర్లక్ష్యం చేసిందేమిటి అని బాధగా ఉంది .నలభై ఏళ్ళు ‘’అభినవ సరస్వతి ‘’పత్రిక ను నడపటం ఆషా మాషీ కాదు .అందులో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నెన్నో విషయాలు,వారి జీవితానికి సంబంధించిన విషయాలు  నిక్షిప్తమై ఉన్నాయి.చదివి తెలుసుకోవాల్సిన బాధ్యత మనది అని మనవి .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-5-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుమతీశతకాన్ని సంస్కృతం లోకి అనువాదం చేసిన శ్రీ జానపాటి పట్టాభి రామయ్య గారు -1

సుమతీశతకాన్ని సంస్కృతం లోకి అనువాదం చేసిన శ్రీ జానపాటి పట్టాభి రామయ్య గారు -1
గుంటూరు జిల్లా పలనాడు తాలూకా చానపాడు లో నివసించిన శ్రీ జానపాటి పట్టాభిరామయ్య గారికి తిరుపతికవులంటే అత్యంత గురుభావం .అందుకే తమ జీవిత విశేషాలను ‘’జాతక చర్య ‘’అని భక్తిభావంతో పేరు పెట్టుకొన్నారు. ‘’అభినవ సరస్వతి’’అనే సాహిత్య పత్రిక స్థాపించి నాలుగు దశాబ్దాలు నిర్విరామంగా నిర్వహించారు .గుంటూరు జిల్లా నివాసం తర్వాత సికందరాబాద్ వెళ్లి అక్కడే ఉంటూ తెలంగాణా సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేసి తమ స్వీయ చరిత్రలో చేర్చారు .
పట్టాభి రామ శాస్త్రిగారు అంటరానివాళ్ళు’ అనే శీర్షిక కింద 1922 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు ఐదుసంచికలలో సుదీర్ఘ వాదన చేసారు.
అంటరానివాళ్ళా అన్న కరపత్రపు శీర్షిక లోనే భాషాదోషం ఉందని ,వాళ్ళా ?వాండ్రా ఇందులో ఏది సరైనదంటూ కరపత్ర రచయితలను ఎద్దేవా చేయటం దగ్గర మొదలు పెట్టి ‘ అస్పృశ్యతా దోషం ఉండబట్టే అస్వతంత్రులమై స్వరాజ్యము పొందలేక పోతున్నాం అన్నవారి వాదాన్ని అపహాస్యం చేస్తూ స్వరాజ్య సంపాదనకు అంటరానితనం అడుగంటించటం సాధనం కాదని వర్ణధర్మభేదములు ఉండవలసినవే అని పేర్కొన్నాడు. అవి భగవంతుడి ఆజ్ఞ అని, స్పర్శ, సహపంక్తి భోజన నిషేధాలు పరమార్ధ సాధనకు ఏర్పడ్డాయని, స్వరాజ్య సుఖం కన్నా పరమార్ధ సుఖం అత్యుత్తమమని వాదించాడు. “ మమ్ములను దక్కువగా జేసినారని తక్కువజాతి వారెక్కువ జాతివారిని నిండించగూడదని, తమతమ తక్కువతనమునకు తమతమ కర్మయే కారణము కానీ ద్వేషముతో ఇతరులచేత ఏర్పరచబడినది కాదు” అని చెప్పటానికి కూడా జంకని కరుడుగట్టిన సంప్రదాయ బ్రాహ్మణవాదం అది. పంచములను అంటరాని వారని బాధపెట్టటం హిందూ ధర్మాలలో ఒకటి అంటే నేను హిందూ మతమునకే ప్రబల విరోధిని అని చెప్పిన గాంధీ దగ్గర నుండి అంటరానితనమేమిటని అసహ్యపడిన బరోడా మహారాజు, బాలగంగాధర తిలక్ మొదలైన అందరినీ నిరసించాడు ఈ శాస్త్రి.
1922 అక్టోబర్ సంచికలో ఈయన పంచమ వ్యతిరేకత ను బయలు పరిచే రచన ఒకటి ఉంది. ఆదిమాంధ్రులు చేయతలపెట్టిన గోరక్షణ సభకు సంబంధించి సుండ్రు వెంకయ్య, కుండజోగయ్య చేసిన విజ్ఞాపన కరపత్రం ప్రచురించాడు. అంతవరకు బాగానే ఉంది. వెనువెంటనే గూడూరి రామచంద్రరావు గుడివాడలో ఏర్పరచిన సేవాశ్రమం నుండి 7- 6- 22 న నిమ్నజాతుల ఉద్ధరణకు పాటుపడుతున్న కుసుమ వెంకట్రామయ్య, కుసుమ ధర్మన్న, శెట్టిబత్తుల వీరన్న, రాయడు గంగయ్య, కె. నారాయణ దాసు, కె. జోగయ్య, కె. నాగూరు, కనుపర్తి రంగయ్య, సుండ్రు వెంకయ్య సమిష్టిగా అభినవ సరస్వతి సంపాదకులకు తమ ఆశ్రమానికి ఉచితంగా పత్రిక కాపీ పంపమని, తమ సంఘాభ్యుదయానికి సంబంధించిన రచనలను ప్రచురించమనీ కోరుతూ రాసిన ఒక ఉత్తరం కూడా ప్రచురించి ఇక ఆ రెండింటి మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాసుకొంటూ పోయాడు.నాగర ఖండ ,స్వర్ణ కార వ్యవహారం మొదలైన రచనలు శాస్త్రి గారు చేశారు .’’అంటరాని వాళ్ళు ‘’అని పట్టాభిరామ శాస్త్రి గారు రాసిన పుస్తకం గుంటూరు చంద్రికా ముద్రాక్షర శాలలో 1926న ముద్రించారు. వెల.అర్ధరూపాయి .ఇందులో అస్పృశ్యతా నిరూపణం పేరుతొ మల్లాది రామ కృష్ణ చయనులు గారు రాస్తే ,దాన్ని కాదని అస్పృశ్యతా నివారణ అనే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించటానికి శ్రీ పెరి వెంకట రత్న దీక్షితులు గారి ఆహ్వానం పై 19-6-1925న అమలాపురం తాలూకా పాలగుమ్మి గ్రామం లో శ్రీ చేన్నమల్లెశ్వరస్వామి దేవాలయం లో ఒక పెద్ద విద్వత్ సభ జరిగింది .శ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ కాశీ భట్లబ్రహ్మయ్య ,శ్రీ బులుసు అప్పన్న శాస్త్రి ,శ్రీ పుల్య ఉమామహేశ్వర శాస్త్రి మొదలైన దిగ్దంతులైన సిద్ధాంతులు సోమయాజులు సుమారు 70మంది హాజరయ్యారు .ప్రేక్షకులు అన్నివర్ణాలవారు కలిసి 400మంది వచ్చారు .శ్రీ జయంతి రామయ్య గారు శ్రీ కప్పగంతుల రామశాస్త్రి గారు సభాధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు .ఎవరివాదాలు వారు చేశారు .
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు తమ ‘’ప్రబుద్ధాంధ్ర ‘’పత్రికలో ఒక తమాషారాశారు .పుల్లంరాజు చక్రవర్తి ఒకసారి గుర్రప్పందాలు చూడటానికి మరి కొన్ని స్వంత పనులమీద బొంబాయి వెళ్లి కొన్ని రోజులున్నారు .అక్కడ ఆయన అనేక సభల్లో పాల్గొని వన్నె తెచ్చారు అందులో ఆయనకు బాగా నచ్చింది ,మనసుని కదిల్చిందీ ‘’అస్పృశ్యతా నివారణ సభ ‘’.అక్కడి పేపర్లన్నీ రాజుగారిని బాగా మెచ్చాయి ,తిరిగిరాగానే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు జరిపిన సభలలో స్పందన కనిపించకపోయే సరికి తానె నడుం కట్టాలనుకొన్నారు .అస్పృశ్యులు పెద్ద సభాజరిపి తమల్ని ఎందుకు దూరం పెడుతున్నారో తెలీదని తాములేకుండా సంఘ జీవనం సాగుతుందా అని రాజుగారికి మహాజర్ పంపి వెంటనే కల్పించుకోమని కోరారు .రాజు బాగా ఆలోచించి అందర్నీ సంప్రదించి దుప్పలపూడి సామ్రాజ్యం లోఅస్ప్రుశ్యత లేకుండా చేసి అందరి మెప్పూ పొందాడు .పై విషయాలన్నీ పట్టాభిరామశాస్త్రిగారు గ్రంధస్తం చేసి కళ్ళు తెరిపించారు .పుస్తకం చివర్లో అంటరాని తనాన్ని సమర్ధిస్తూ మల్లాది చయనులు గారు రాసిన పుస్తకం కూడా చేర్చి దాన్ని చదివి అర్ధం చేసుకోమని అస్పృశ్యతను నివారించమని పట్టాభి రామ శాస్త్రిగారు చెప్పారు
పట్టాభిరామ శాస్త్రిగారు ‘’ఆరోగ్య భాస్కరం ‘’అనే మరొక గ్రంధాన్ని 1933లో రచించి గుంటూరు చంద్రికా ముద్రణాలయం లో ముద్రించారు దీన్ని త్రిలింగ పత్రిక ,శ్రీ వావిళ్ళ వెంకటేశ్వర్లుగారు శ్రీ శిష్ట్లా హనుమత్సాస్త్రి ,శ్రీ మల్లాది విద్వత్ చయన్లు ,శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి మొదలైనవారు అమూల్య అభిప్రాయలు తెలియజేశారు .ఇది మొదట్లో త్రిలింగ పత్రికలో ధారావాహికంగా వచ్చింది .
మొదటిపద్యం –‘’శ్రీపతి నీదు మండలము చేరివసింప ద్రయీతనుండవై –రేపులుమాపులున్ ద్విజులు ప్రీతి నొసంగు జలా౦జలుల్ కరం
బొపిక తోడ గొంచు మరి యూరకయు౦డక వారి బాధలన్ –పాపుచు నుండు నీదు పదపద్మములన్ శిరముంతు భాస్కరా ‘’
సంధ్యల నర్ఘ్యముల్ ల్విడిచి సంస్తుతి చేయుచుంటి ‘’అనీ రుగ్యుతు డే౦చ నౌ నిను ‘’,’’మిత్రుదతంచు నిన్ శ్రుతియే మిక్కిలి పేర్కొనే –రోగాయుద్గాత్రుని పట్ల మిత్రు దదికంబుగా జూపడే మైత్రి భాస్కరా ‘’అంటూ భాస్కరా అనే మకుటంతో 126చంపక శార్దూల మత్తేభ ఉత్పలమాల పద్యాలతో భాస్కర శతకం రాసి ఆరోగ్యమిచ్చే భాస్కర మిత్రుడికి అంకితం చేశారు కవి .చివరికి గద్యం లో తనగురించి చెప్పుకొన్నారు .
‘’ఇది శ్రీమజ్జగద్గురు కరుణా కటాక్ష సంప్రాప్తోభయ భాషా పాండిత్య ,రసవత్కవిత్వ నిధాన హరితస గోద్భవ లక్ష్మీ నారాయణ ,పేరమా౦బికాగర్భ శుక్తి ముక్తాయమాన ,విద్వత్సభావిష్కృ తావధాన విధాన ,జానపాటి పట్టాభిరామాభి ధాన విలిఖతంబగు ఆరోగ్య భాస్కరం’’
ఇంతటి విద్వత్ కవి గురించి మనవాళ్ళు ఎవరూ ఎక్కడా పేర్కొనకపోవటం ,విడ్డూరంగా ఉంది .వీరిని వీరి శతకాన్ని పరిచయం చేసే మహద్భాగ్యం నాకు దక్కింది .మా అబ్బాయిశర్మ పంపిన ఈ శతకాన్ని బట్టి రాయగలిగాను .కవి గారిఇతర రచనలగురించి మరో వ్యాసంలో తెలియ జేస్తాను .
సశేషం
గబ్బిట దుర్గా ప్రసాద్ -9-5-22-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-277

  • మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-277
  • 277-అందాల తార ,మనోహర ,చంద్రలేఖఫెం ,ఆనాటి డ్రీం గాళ్-టి.ఆర్.రాజకుమారి

ద‌క్షిణాది చిత్రపరిశ్రమలో ‘డ్రిమ్ గర్ల్’ అనిపించుకున్న అందిలతార రాజకుమారి.మనహర నాటకం ఆనాడు విరివిగా తెలుగునేలపై ప్రదర్శింపబడుతుండేది. అందులో వసంతసేనగా గరికపాటి వరలక్ష్శి నటించేది.
ఈ నాటకాన్ని ఎల్.వి.ప్రసాద్ గారి దర్శకత్వంలో వచ్చిన ‘మనోహర’ (1954) శివాజిగణేషన్, కన్నాంబా, దాసరి సదాశివరివు తదితరులు నటించిన ఈ చిత్రంలో అద్బుతంగా వసంతసేన పాత్రకు జీవం పోసారు రాజకుమారి.

1922 లో జన్మించిన ఈమె పూర్తి పేరు తంజావూరు రంగనాయకి రాజకుమారి. ఈమె పిన్ని ఎస్.పి.ఎల్.ధనలక్ష్మి (తమిళనటి) రాజకుమారిని  సినిమారంగానికి పరిచయంచేసింది. ఈమె మొదటి సినిమా ‘కుమార కుళోత్తుంగన్’ (1941)  ‘కచదేవయాని’ చిత్రంతో తారాపథానికి వెళ్ళింది. ‘మంత్రవాది’  ‘సూర్యపుత్రి’ ‘మనోన్మణి’  ‘హరిదాస్’  ‘కృష్ణభక్తి’ చిత్రాలలో నటించి నాటి కుర్రకార్లకు కలలరాణిగా వెలిగింది ఈమె.

1948 జమిని వారు నిర్మించిన భారీచిత్రం ‘చంద్రలేఖ’ చిత్రంలో ఈమె కథానాయకి. ఈ చిత్రం  తమిళ- తెలుగు నేలపై ర‌జ‌తోత్సవం జరుపుకుంది.

ఈమె అక్కగారు. నటీమణినే. ఆ అక్క కూతురు ప్రముఖ సినీ నర్తకి కుచలకుమారి. ఈమె సోదరుడు చక్రపాణి తమిళ నిర్మాత. మరోసోదరుడు సినిదర్శకుడు టి.ఆర్.రామన్న వీరిభార్యలు ప్రముఖ సినీ నటీమణులు ఇ.వి.సరోజ-బి.ఎస్.సరోజలు. రాజకుమారి చెల్లెలికూతుర్లే జ్యోతిలక్ష్మి-జయమాలినీలు.

మద్రాసు పాండీబజార్ లొ  ‘రాజకుమారి టాకీస్’ అని ఓసినిమా హలు నిర్మించింది.నేడు అక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. నేటికి ఆబస్ స్టాప్ పేరు రాజకుమారి ధియోటర్ గానే పిలుస్తారు. మద్రాసు మౌట్ రోడ్డులో వీరికి పెట్రోలు బంక్ కూడ ఉండేది.


అసమాన నటనా ప్రతిభ అందము కలిగిన రాజకుమారికి చివరిరోజుల్లో భయంకరమైన చర్మ వ్యాధి సోకి తనరూపం కోల్పోయింది. తన యింటికి వచ్చిన వారితో తెరచాటున ఉండి మాట్లాడేవారు. ఈమె రూపంలో రాజసం, దర్పం, హొయలు, కవ్వించేకళ్ళు, పదే పదే చూడాలి అనిపించే స్పురద్రూపం కలిగిన ఈ అందాలరాశి తక్కువ చిత్రాలలో న‌టించి ఎక్కువ పేరు పొంది 1999/సెప్టెంబర్ /20 వ తేదిన శాశ్విత నిద్రలో ఒరిగి పోయారు.

‍‍‍-డాక్టర్. బెల్లంకొండ నాగేశ్వరరావు

  • మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-278
  • 278-రక్తకన్నీరు నాటక సినిమాఫెం ,అంతర్జాతీయ పురస్కారగ్రహీత ,నటి రాధిక తండ్రి ,ఎమ్జీఆర్ పై కాల్పులు జరిపిన కరుడుకట్టిన అగ్రశ్రేణి విలన్  –ఎం ఆర్
  •  రాదా

మద్రాసు రాజగోపాల రాధాకృష్ణన్ ప్రముఖ తమిళ సినిమా, రంగస్థల నటుడు. ప్రముఖ దక్షిణ భారతీయ నటి అయిన రాధిక తండ్రి. ఈయన 196

7లో తన సహనటుడు, ఆ తరువాత తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ఎం.జి.రామచంద్రన్ పై కాల్పులు జరిపి జైలుకెళ్లాడు.

రాధ, 1907ఫిబ్రవరి 21న తిరుచ్చిలో జన్మించాడు. చిన్నతనంలోనే తినటానికి మరో చేప ముక్క ఇవ్వనందున తల్లితో గొడవపడి రాధా ఇల్లువదిలి పారిపోయాడు. రంగస్థల నటుడై 5000కు పైగా నాటక ప్రదర్శనప్రదర్శనలిచ్చాడు. 10వ ఏట ప్రారంభమైన చిన్నచితకా వేషాలేసి, చివరికి ఆయన్నే దృ

ష్టిలో పెట్టుకొని నాటకాలు వ్రాసే స్థాయికి ఎదిగాడు.

రాధా రక్త కన్నీరు నాటకం విజయవంతమవడంతో పేరు సంపాదించుకున్నాడు. ఈ నాటకాన్నే సినిమాగా తీసినప్పుడు అందులో కూడా అద్భుతం

గా నటించి అగ్రతారగా ఎదిగాడు. ఈ సినిమా ఈయనకు అంతర్జాతీయ గుర్తింపు, పురస్కారాలను సంపాదించి పెట్టింది. ఇటీవలి రక్తకన్నీరు సినిమా

ను కన్నడలో ఉపేంద్ర పునర్నిర్మించాడు. రక్తకన్నీరులో రాధా నటనను దేవానంద్, అమితాబ్ బచ్చన్ వంటి అనేక మంది నటులు భారతీయ సినీ

 చరిత్రలోనే అత్యద్భుతమైన నటనగా కొనియాడారు. ఈ నటనను మరే నటుడు అనుకరించలేడని అన్నారు.

ఎమ్‌జిఆర్‌పై కాల్పులు జరిపిన ఘటన[మార్చు]

1967 జనవరి 12 న ఎం ఆర్ రాధా, ఎమ్‌జిఆర్‌ ఇంటికి వెళ్ళి, అతడిపై తుపాకితో కాల్పులు జరిపాడు. నిర్మాత కె.ఎన్.వాసుతో కలిసి సినిమా ని

ర్మాణం గురించి మాట్లాడే ఉద్దేశంతో ఎమ్‌జిఆర్‌ ఇంటికి వెళ్ళాడు. మాట్లాడుతూ ఉండగానే హఠాత్తుగా లేచి నిలబడి, తుపాకీతో ఎమ్‌జిఆర్‌ను ఒకసారి కాల్చాడు. తూటా ఎమ్‌జిఆర్‌ ఎడమ చెవి పక్కగా గిగబడింది. ఆ వెంటనే రాధా తనను తానే రెండు సార్లు – ఒకటి కణతవద్ద, రెండోది మెడమీదా – కాల్చుకున్నాడు.[1] ఇద్దరినీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేసారు.

కేసును విచారించిన చెంగల్పట్టు సెషన్స్ కోర్టు, రాధాకు 7 సంవత్సరాల కారాగర శిక్ష విధిస్తూ 1967 నవంబరు 4న తీర్పు ఇచ్చింది. తరువాత హైకోర్టు ఆ తీర్పును ఐదేళ్ళ మూడు నెలలకు తగ్గించింది.[2]

నటించిన చిత్రాలు

·         రక్త కన్నీర్

·         ఆయిరాం రూబాయ్

·         దైకొదూత దైవం

·         పావ మన్నిప్పు

·         ఎన్‌ కడమై

·         చీఠీ

·         పుదియ పరవాయ్

·         బాలే పాండియ

·         థాయిక్కు పిన్ తారం

·         కవలై ఇల్లద మనితన్

·         కుముదం

·         కర్పగం

·         తాయై కథ తనయన్

·         పాశం

·         పాలుం పళముం

·         పట్టినాథర్

·         పడిత్తాల్ మట్టుం పోదుమా

·         నానం ఓరు పెణ్

·         కోడుథు వైథవల్

·         ఆలయమణి

·         సంతనథేవన్

·         వెలుం మయిలం థునై

·         రత్నపురి ఇళవరసి

·         థాయి సొల్లి థాథాథే

·         పెట్రాల్థన్ పిల్లయ

·         పెరియ ఇదతు పెన్న్‌

·         ఆంధ జోధి

·         ఉలగం సిరిక్కిరథు

·         పార్ మగళె పార్

·         తాయిన్ మదియిల్

·         నల్లవన్ వాళ్వాన్

మరణం

— రాధా 1979 సెప్టెంబరు 17 న, తన 72 వ ఏట, కామెర్ల కారణంగా తిరుచిరాపల్లి లోని తన స్వగృహంలో కన్నుమూసాడు.

ఎం.ఆర్‌ రాధ… తమిళంలో పాపులర్‌ నటుడు, రాజకీయ నాయకుడు. నాటక రంగం నుంచి సినిమాకు వచ్చి హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా తమిళ ప్రేక్షకులను అలరించారు. ఆయన సంతానమే రాధిక, రాధా రవి, నిరోషా. తన తండ్రికి నివాళిగా ఓ బయోపిక్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నారట రాధిక. తన నిర్మాణ సంస్థ రాడాన్‌ మీడియా వర్క్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించనున్నారని సమాచారం. ఈ సినిమాకు రాధా రవి మనవడు ఐకీ రాధా దర్శకత్వం వహిస్తారట.

ఆర్ రాధా గురించి చాలా మందికి తెలియదు.ఆయన ఎవరు అంటే హీరోయిన్ రాధిక వాళ్ళ నాన్న ఎం.ఆర్.రాధా గురించి మాట్లాడుకోవాలంటే ఆయన చాలా సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు.అందులో భాగంగానే ఆయన ఒకరోజు ఎంజీఆర్ ఉన్న ఇంటికి వెళ్లి ఆయన్ను బయటకు రమ్మని పిలిచారు.క్యాజువల్ గా మాట్లాడడానికి వచ్చాడు కావచ్చు అనుకుని ఎం జి ఆర్ ఎం ఆర్ రాధ పిలవగానే బయటికి వచ్చాడు ఎంజీఆర్ బయటకు వచ్చి ఆయనతో మాట్లాడుతుంటే ఆయన జేబులో నుంచి గన్ తీసి ఎంజీఆర్ ను కాల్చివేశాడు.  ఎం జి ఆర్ ని ఎం.ఆర్.రాధా కాల్చడం జరిగింది.తను కాల్చి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎం జి ఆర్ ని కాల్చింది తనే అని చెప్పడం జరిగింది దాంతో కొన్ని రోజులు పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు.అలాగే ఆ తర్వాత కొన్ని రోజుల పాటు జైల్లో ఉండి వచ్చి మళ్లీ సినిమాల్లో నటించడం కూడా జరిగింది.ఆ తర్వాత ఎం.ఆర్.రాధ కూతురు అయిన రాధిక సినిమాల్లో హీరోయిన్ గా వచ్చి తనకంటూ మంచి గుర్తింపు సాధించుకొని ఇండస్ట్రీలో అగ్రహీరోయిన్ గా చాలా కాలం పాటు కొనసాగింది ప్రస్తుతం శరత్ కుమార్ ని పెళ్లి చేసుకొని తన లైఫ్ ని లీడ్ చేస్తుందని చెప్పాలి ఇలా కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్పడానికి ఎం.ఆర్.రాధా గారిని ఉదాహరణగా తీసుకోవచ్చు.

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-5-22-ఉయ్యూరు

Posted in సినిమా | Leave a comment

కాలిఫోర్నియా ఆర్కిటెక్ట్ ,విద్యావేత్త ,విద్యాసిద్ధాంత కర్త ,కరిక్యులం రిఫార్మర్ –హిడ్లా తాబా – గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ  మహిళా వెబ్ మాస పత్రిక -మే

7-12-1902న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సాన్ ఫ్రాన్సిస్కో లోనిష్టోనియాలో ఉన్న చిన్న గ్రామం  కూరాట్సేలో పుట్టిన హిడ్లా తాబా ఆర్కిటెక్ట్ ,కర్రిక్యులం ధీరిస్ట్ అయిన విద్యావేత్త .తల్లి లిస్లా లేహ్ట్ .తండ్రి రాబర్ట్ తాబా స్కూల్ మాష్టర్ .కనెపి పారిష్ స్కూల్  లో చేరి హిడ్లా చదువు ప్రారంభించింది .తర్వాత వోరుస్ గర్ల్స్ గ్రామర్ స్కూల్ లో చేరి చదివి ,, తాటువా యూని వర్సిటి నుంచి ఇంగ్లీష్ ,ఫిలాసఫీ లలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందింది.పెన్సిల్వేనియా రాష్ట్రం బ్రియాన్ మివార్ కాలేజి లో చేరటానికి అర్హత పొంది,మాస్టర్ డిగ్రీ సాధించింది ,తర్వాత కొలంబియా యూనివర్సిటి లోని టీచర్స్ కాలేజి లో ఉద్యోగం కోసం అప్లికేషన్ పెడితే ,మహిళ కనుక తార్తు యూని వర్సిటి తిరస్కరించింది .దీనితో న్యూయార్క్ సిటి లోని డాల్టన్ స్కూల్ లో కర్రిక్యులం డైరెక్టర్ గా  చేరింది .1951లో ఇప్పుడు శాన్ఫ్రాన్సిస్కో స్టేట్ యూని వర్సిటిగా పిలువబడుతున్న సాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ కాలేజి లో ప్రొఫెసర్ గా చేరమని ఆహ్వానిస్తే చేరింది .

 రచయిత

జాన్ డ్యుయి కి శిష్యురాలైన తాబా ఆయనవద్ద రిసెర్చ్ చేసి ,మొదటి పరిశోధనా పత్రం తోపాటు ఏడు పుస్తకాలు రాసి ప్రచురించింది .1932లో ఆమె సమర్పించిన ‘’డైనమిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ –ఎ మెధడాలజి ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషనల్ ధాట్’’పరిశోధనా పత్రం తర్వాత ఆమె దృష్టి అంతావిద్యావిధాన  డెమోక్రసీ పై అవగాహన కలిగించటానికి  కేంద్రీకరించింది .ప్రజాస్వామ్య బంధాలద్వారా పిల్లలు ఒకరితో ఒకరు ఎలా కలిసి ఉండవచ్చో ఆలోచించి చెప్పింది .విద్య నేర్వటం అనేది ఎంత క్రియా శీలకంగా అంటే డైనమిక్ గా ఉండాలో,పరస్పర సంబంధంగా ,పరస్పర ఆధారకంగా ఉండాలో  తన పరిశోధనలో చర్చించింది .విద్యా ప్రణాళిక తయారు చేయటం లో విద్యావేత్తల బాధ్యతా ,ప్రాముఖ్యత వివరించింది .జాన్ డ్యుయి,బెంజమిన్ బ్లూమ్ ,రాబర్ట్ హవిగార్ట్ లలో కలిసి పనిచేయటం వలన అనుభవం పొంది ,’’కర్రిక్యులం డెవలప్ మెంట్ –ధీరీ అండ్ ప్రాక్టిస్ ‘’పుస్తకాన్ని 1962లో రాసింది . అందులో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందనీ ,సమాజంలో మార్పులు అతివేగంగా వస్తాయనీ ,కనుక మూక పాత విధానాలు వదిలేయాల్సిరావచ్చని ,నిర్ణయాలు కూడా తగినట్లు చేయాలనీ చెప్పింది .కనుక వ్యక్తీ తెలివితేటలూ ,స్వయం నిర్ణయాధికారం కలిగి ఉండాలని కోరింది .

 విద్యావేత్తలుకూడా  విద్యార్ధులలో రావాల్సిన మార్పుల్ని గురించి బోధించాలనీ .విద్యా బోధన సమర్ధవంతంగా జరగాలంటే మూడు స్థాయిలలో విజ్ఞానం సముపార్జించాలి .అవే నిజాలు ,మూల భావనలు ,సూత్రాలు ,కీలకభావనలు అనే కాన్సెప్ట్స్ .గబగబా ఎన్నో విషయాలు విద్యార్ధుల మెదడులో కుక్కేప్రయత్నంవికటిస్తుంది .దీనివలన కొత్త సమాచారానికి అప్పటికే వారిలో ఉన్నదానికి లంగరు కుదరక గందరగోళం పొందుతారు .వాళ్ళు నేర్వగల దానిమీదనే ఏదైనా అందించాలి .అన్నిటిని గ్రహించి విద్యార్ధులు చివరలో సరైన భావాలను అనుసరిస్తారు అంటుంది .

 టీచర్ మీడియేటర్ గా ఉండాలే కాని లెక్చరర్ గా కాదు అని ఆమె ఖచ్చితమైన అభిప్రాయం .అరవై అయిదవ  ఏట ఆమె చనిపోయినా ,ఆమె నిర్దేశించిన సూత్రాలు ఆమె అనుచరులు చక్కగా పాటిస్తున్నారు .కాన్సెప్ట్స్ అభి వృద్ధి చేసుకోవటం ,సమాచారాన్ని విశ్లేషించటం ,కార్యరూపం లో అనువర్తనం చేయటం అంటే అప్లై చేయటం ,భావాలు ,వైఖరులు ,విలువలను అన్వయించటం లో బాగా పాటిస్తున్నారు .విద్యార్ధుల్ని ఆలోచనకు ఉన్ముఖీకరించటం తాబా చెప్పిన ముఖ్య సూత్రం .టీచర్ తనకువచ్చింది కక్కేసి వెళ్ళటం కాదు మధ్యవర్తిగా ప్రవర్తించాలి .విద్యార్ధులను ‘’మీరు ఇప్పుడు బాగా ఆలోచిస్తున్నారు ‘’,’’మీ విధానం కరెక్ట్ ‘’,’’అలాగే ముందుకు వెళ్ళండి ‘’అని వెన్నుతట్టి టీచర్ ప్రోత్సహించాలి. The teacher’s role in the discussion is to encourage the students to expand on their classmates’ ideas or to ask students to clarify their own ideas..

  హిడ్లా తాబా బోధనలు ,ఆమె రాసిన పుస్తకాలు అమెరికా విద్యా విధానానికి ఎంతగానో తోడ్పడింది .1970లో రెండు వందలమంది విద్యావేత్తలు తాబా విధానం పై శిక్షణలో పాల్గొని హిడ్లా తాబా విద్యా విధాన భావాలు చాలా నిర్దుష్టంగా ఉన్నాయనీ గొప్ప ఆదర్శంగా ఉన్నాయనే అనుమానం లేకుండా అనుసరణీయమని ముక్త కంఠం తో ప్రకటించారు . Some of the teachers even reported that Taba’s approach to teaching was “the most valuable teaching technique they had ever acquired.”

ఇంతటి విద్యావేత్త ,విద్యా ప్రణాలికా రచయిత హిడ్లా తాబా 6-7-1967 న 65వ ఏట మరణించింది .

కర్రిక్యులం రిఫార్మర్ గా ,టీచర్ ఎడ్యుకేటర్ గా సిద్ధాంత పరమైన,బోధనాపరమైన కీలక భావనలు అంటే కాన్సెప్ట్స్ ,క్లిష్టమైన ఆలోచనలో అభి వృద్ధి సాధించటానికి విశిష్టమైన  పునాది ని విద్యా వ్యవస్థలో బోధనలో తీసుకువచ్చింది హిడ్లా తాబా .విభిన్నస్వభావాలున్న విద్యార్దిలోకం లో ఆమె ఆలోచనలు విప్లవాత్మకమార్పులు తెచ్చి విద్యా వ్యవస్థ బోధనా వ్యవస్థ కొత్త లోకాలనే చూపింది .Taba’s contribution to the study was evaluation of social sensitivity, which was related to the general goal of preparing students for effective democratic participation. She tackled a challenging area of social studies curriculum, the measurement of attitudes about race, class, and ethnicity and at the same time provided authentic alternatives to paper and pencil assessment.

 -గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

 జయశంకర ప్రసాద్ -1

 జయశంకర ప్రసాద్ -1

హిందీలో రమేష చంద్ర శాహ  రాసిన దానికి తెలుగులో అనువాదం చేసిన డా.ఎ బి సాయి ప్రసాద్ ‘’జయశంకర ప్రసాద్’’పుస్తకాన్ని భారతీయ సాహిత్య నిర్మాతలు సిరీస్ లో కేంద్ర సాహిత్య అకాడెమి 1995లో ప్రచురించింది .వెల-పాతిక రూపాయలు .

  అప్పటి ఆ యుగం

కవి నాటక రచయితా కధాశిల్పి ,నవలారచయిత జయశంకర ప్రసాద్ జీవించిన -1889-1937 కాలం అత్యంత గౌరవప్రద,గగుర్పాటు కలిగించే  అధ్యాయం . ఈ కాల నిర్మాణం లో శ్రీ రామకృష్ణ పరమహంస ,దయానంద సరస్వతి ఉన్నారు .వీరిద్దరూ ఆధ్యాత్మికంగా భారత సమాజాన్ని తీర్చి దిద్దిన మహనీయులు .బెంగాల్ లో కేశవ చంద్ర సేన్ స్థాపించిన  బ్రహ్మసమాజం ,మహారాష్ట్రలో రానడే స్థాపించిన ప్రార్ధనా సమాజం సంఘ సంస్కరణకు అంకురార్పణ చేశాయి .ప్రముఖ ఆంగ్లకవయిత్రి తోరు దత్’’  రామాయణాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించింది .రవీంద్రుడు తన రచనలద్వారా ఉద్దీపనం కలిగించాడు .గీతా రహస్యం తో తిలక్ స్పూర్తి రగిలించాడు .ఈ నేపధ్యం లో సంఘానికిపైపై పూసే మందులు పనికిరావనీ శస్త్ర చికిత్స చేయాలనిజయశంకర్ ప్రసాద్ లాంటి వారు ముందుకొచ్చారు .విశ్వ మైత్రి నుండి మనలను ఉద్ధరించాలనే వారసత్వం అబ్బాలని మహాత్మా గాంధీ లాంటి జాతీయనాయకులు జయశంకర ప్రసాద్ లాంటి రచయితలూ పుట్టుకొచ్చారు .మద్రాస్ లోని అడయార్ లోఆనీబిసేంట్ ‘’దివ్యజ్ఞాన సమాజం ‘’జయశంకర్ పుట్టిన బెనారస్ లో స్థాపించబడింది .జయశంకర్ తన ఏకైక కుమారుడిని ఆ సమాజ స్కూల్ లో చేర్చాడు .కానీ కొద్దికాలానికే దానిపై విశ్వాసం సడలి పోయింది ఆయనకు .జిడ్డు కృష్ణమూర్తి ఆ స్కూల్ కు వస్తే హారతులిచ్చి ఆహ్వానం పలకటం జయశంకర్ కు నచ్చక ,నిరసనగా కొడుకును ఆ స్కూల్ మాన్పించేశాడు .

  1885లో కాంగ్రెస్ ఆవిర్భవించిన తర్వాత కాంగ్రెస్ లో మహోన్నత నాయకత్వం వచ్చింది విప్లవాత్మకంగా ఆలోచించే అరుదైన వ్యక్తులు వచ్చారు .వీరిలో తిలక్ ,పాల్ ,అరవిందులు లజపతిరాయ్ లాంటి ఉద్దండులు స్పూర్తి ప్రేరణకలిగించారు  , హిందీ లో ఈ కొత్త చైతన్యానికి పురుడు పోసిన’’ భారతేందు హరిశ్చంద్ర ‘’,జయశంకర ప్రసాద్ కు అన్నివిధాలా పెద్దన్న లాంటి వాడు .ఇద్దరూ బహుముఖ ప్రజ్ఞా శీలురే .భారతే౦దు స్వాభావికంగా కవి .పరిస్థితుల ప్రభావంతో వచన రచనా చేశాడు .కవిత్వాన్ని తన వ్రజభాష లోనే రాశాడు .ఇదే మధ్యయుగాలనుంచి ‘’సంపర్క భాష ‘’గా ఉండేది .క్రమంగా క్షీణి౦చి పోయింది .కొత్తగా పుట్టుకొచ్చిన ‘’ఖడీ బోలీ ‘’మాండలీకం లో రాయటానికి భారతే౦దు మొదట్లోసందేహించినా అభి ప్రాయ వ్యక్తీకరణకు అదే చక్కని వచన రచనకు అనువుగా ఉందని నిర్ణయానికి వచ్చి సద్వినియోగం చేసుకొవటమేకాదు కావ్యాలకు విముక్తి ప్రసాదించాడు .ఈ భాషపై ఆచార్యుల అంకుశపు పోటులు లేవు.ఖడీ బోలీ ని ఆధారం చేసుకొని హిందీ నాటక రచనలను తన భుజస్కందాలపై మోశాడు .పార్శీ దియేటర్ స్థూల రూపాన్ని పోషిస్తూ ,అప్పటి వ్యవహారాలూ ,పరిస్థితులను తననాటకాల ద్వారా పరిపోషించాడు .భారతేందు వాడిన కొత్త భాషాజాలం ,అందించిన మనోవిజ్ఞాన వినోదాలు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి .చాయానువాదంగా రాసిన  ‘’దుర్లభ బందూ ‘’అంటే  ‘’మర్చెంట్ ఆఫ్ వెనిస్ ‘’నాటకం లోనూ చూడగలం .ఆయన వేసిన బాటను గట్టి పరచాడు జయశంకర్ .

  జయశంకర్ గొప్పతనం లో రెండు గుణాలున్నాయి .మొదట్లో ఇవి పరస్పర విరుద్ధంగా అనిపించినా క్రమేపీ విడదీయలేనంతగా కలిసిపోయి లీనమై ఒక బిందువుగా మారతాయి .ఈ బిందువే జయశంకర్ ప్రసాద్ ప్రసిద్ధ కావ్యం  ‘’కామాయిని ‘’.ఇందులో ఆయన చారిత్రిక ప్రతిభ కూడా గమనిస్తాం .వ్యక్తులగతం జాతీయగతం కలిసిపోతాయి .ఆయన ‘’నావిక్’’ కవిత లో ఆయన వ్యక్తిగతం ,జాతి సాంస్కృతిక గతం గా దర్శనమిస్తుంది .దీనినే సామూహిక ‘’అవచేతన’’ అంటారు .కామాయిని కావ్యమనే సముద్ర యానానికి బయల్దేరే ముందు ‘’లనూర్ ‘’అనే కావ్యం లో ఆయన –‘’ఓహో ! ఈ నిండిన నావను –నావ తెరచాపను ఈపెనుగాలి నుంచి ఎవరు కాపాడుతారు ?నియతిలో వ్యాపించిన చిక్కటి చీకటి జలధి-కాంతిరేఖ రహిత బాధ తో ఉప్పొంగుతోంది .-కాలం అనే బెస్తవాడు అనంతం లోకి లాక్కేళ్ళుతున్నాడు –ఏదో ఆశతో ఊపిరి కొట్టుకొంటోంది ‘’.

    జయ శంకర్ కావ్యయాత్ర ‘’కానన్ కుసుమ ‘’అనే కవితా సంకలనం తో మొదలైంది .ఆయన మొదటికధ’’గ్రామం ‘’.భారతేందు లాగా జయశంకర ప్రసాద్ కూడా సంపన్న కుటుంబం లో నుంచి వచ్చినవాడే .ఆలక్షణాలన్నీ వారసత్వంగా పొందినవాడే .జయశంకర్ రచనాత్మక ప్రతిక్రియ టాగూర్ లాగాకాక బంకిం చంద్ర లాగా ఉంటుంది .భారతే౦దు వ్రజభాషలోనే పద్య రచన చేశాడు .వ్యక్తీ ప్రతిభ పరంపరగా వస్తున్నా అభిప్రాయాలతో ఉన్నా ,కొంత మార్పు తెచ్చింది .ఈ పరిణామం సంప్రదాయం ను దూరం చేసింది .ఆయన నాటకాలు కావ్యాలలో కరుణ వెల్లివిరుస్తుంది .ఈయన ‘’ఆనంద వాదం ‘’పాశ్చాత్యుల విమోచన మార్గం కాదు .సంఘర్షణ ,సమాధానాల అద్భుత లీల ఆయన నాటకాలు .

  గాంధీ దేశ చరిత్రను లోకచచైతన్యమలుపు  వైపు మళ్లిస్తే ,జయశంకర్ లాంటి వారు ఆ మలుపు చూపిన మొగ్గును ‘’కావ్యాత్మక వేదాంతం ‘’వైపు అంటే ఆనందంతో కూడిన పార్శ్వాన్ని చిగురి౦పజేసే  భూమిక పోషించారు .జయశంకర్ ఆదర్శాలు ఆయన స్వంత బాణీలలో ఉప్పొంగి అలరిస్తాయి .దేశ యువతను ఉద్బోధిస్తూ –‘’అందర్నీ హృదయానికి హత్తుకోవాలని –హృదయ గవాక్షాలు తెరుచుకున్నాయి –మనసు శాంత మనోహరంగా మారింది –ఎవరు అంటరాని వారి పాలిటి దైవమో –వ్యవసాయదారుల సుదృఢ హలమో –దుఖితులకన్నీరో ,శ్రామికుల యంత్రమో –ఎవరి జీవితం ప్రేమమయమో –ఆచలసత్య సంకల్ప జీవితమే ఎవరి  కావ్యాలో  -ఆ యువకులు చిరంజీవులౌగాక –దేశం సుఖ శాంతులరాశి కాగా –ముందుముందు అందరికీ ఈ మహాపురుషులే అనినశ్వరంగా ఉండాలి ‘’.

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-5-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 2 Comments

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-276

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-276
• 276-ఆంధ్రా యూని వర్సిటి స్టేజి డైరెక్టర్’’ ,రాగరాగిణి ‘’నాటకం ఫేం ,నాటకగిరీశం ,నటరాజు –కె.వెంకటేశ్వరరావు -2
కె. వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో ప్రదర్శితమైన ‘ర్రాగరాగిణి’, ‘ఫణి’ వంటి
నాటకాలలో వాన్తవికత కొట్టవచ్చినట్టు కన్పిన్తుంది గతివిన్యాసాలు,
వాచికాభినయంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకున్నట్టు స్పష్టమవుతుంది నాటకం
చూస్తున్నట్టుకాక ఆ సన్నివేశాలు జరుగుతున్నచోట ఆ వ్యక్తుల మధ్య కూచొని
చూస్తున్న ఆనుభూతి కలుగుతుంది సామాజికులకు కాని వీరి నాటకాలన్నీ
ఎకపాత్రాత్మకాలు కావడం విశేషం నాటకరంగంలో డా రాజారావు తర్వాత ఆంత
చరిత్ర సృష్టించిన నటుడు,దర్శకుడు శ్రీవేంకటేశ్వరరావు
శ్రీ క వేంకటేశ్వరరావు ఒక వ్యక్తి కాదు.ఒక వ్యవస్థ ఒక ఉద్యమం శ్రీ
ఆత్రేయ తర్వాత నాటకరంగంలో పెనుమార్పులు తెచ్చి చరిత్ర సృష్టించిన
కారణజన్ముడు వెంకటేశ్వరరావు ఆంధ్ర నాటక రంగస్థలి మీద’వెంకటేశ్వరరావు
స్కూల్‌ ఆప్‌ ఎక్షన్‌ అని ముద్రవేశారు వేంకటేశ్వరరావు తర్వాత స్థానం
వేంకటేశ్వరరావుదే అన్నంత ఎత్తుకు ఎదిగారు
“ఆయనలోని జీనియన్‌ ఏమిటంటే, ఆయనకు కొత్తపద్ధతుల్ని నటనలో
పాతపద్ధతులుగానూ, పాతపద్ధతుల్ని కొత్త పద్ధతులుగానూ చూపించగల ప్రతిభ
ఉండేది“ అని ప్రశంసించారు రాచకొండవారు
వెంకటేశ్వరరావుగారు నాటక ప్రయోక్తగా ఒక వైతాళికుడు అని చెప్పుకోవాలి
అంటే, ఎన్నో కొత్త బాటలను, కొత్త ప్రయోగాలను చేశారు సంభాషణ ఒకటైనా
లేకుండా ఆయన దర్శకత్వం వహించి ప్రదర్శించిన బెత్తం మనిషిఅందుకు
తిరుగులేని ఉదాహరణ

వేంకటేశ్వరరావు ప్రదర్శించిన పావలా, త్రివేణి.బెత్తం మనిషి, విషాదం,
కొడుకు పుట్టాల మొదలయిన నాటికలు, అసురసంధ్య, ‘ ఫణి, రాగరాగిణి,
వీలునామా, ఆకాశరామన్న, మహానటుడు వంటి నాటకాలు వారి దర్శకత్వంలో
విలక్షణతను చాటే ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు

“1950 .60 మధ్యకాలంలో ప్రజానాట్యమండలి శక్తిమంతంగా లేదు ఆ
లోటును వేంకటేశ్వరరావు, తన నాటక్నాలద్వారా, ప్రజానాట్యమండలి ఆదర్శాలను
నిలబెట్టారు వేంకటేశ్వరరావు వాచిక విధానంతో, నడకతో, హావభావాలతో,
సంభాషణల మధ్య వచ్చే కించిత్‌ విరామంలో విద్యుద్దాతంలా ఆతి వేగంగా
మాట్లాడే సంభాషణలతో పాత్రలతో ఆడుకుంటాడు .ఆయన నటించిన
నాటకాలుగాని పాత్రలుగాని తాను లేకపోతే రక్తి కటైవికావు ఒకవేళ ఎవరైనా
ప్రదర్శించినా వెంకటేశ్వరరావు, నాటక వాచికాభినయ విధానప్రభావం వారిమీద
ఉండేది”
“తెలుగు నాట, నాటక ప్రక్రియ నూతన పద్ధతులు అనుసరించటానికి కీశే |
ఆత్రేయ మార్గదర్శకుడైతే నటనలో వేగం, ఉచ్చారణలో స్పష్టత, ప్రత్యేకత |
తెచ్చింది శ్రీ వేంకటేశ్వరరావేనన్న విషయం ఆందరం ఒప్పకొని తీరాల్సిందే” ఆని
ధ్రువీకరిస్తున్నారు ప్రసిద్ధ రంగస్థల దర్శకులు, రచయిత ఆయిన శ్రీ
కెయస్‌ టి శాయి
“ఆయన నాటకాలు వేస్తున్నంత కాలం, నాటకానికి ఆయనే కర్త, కర్మ
‘క్రియగా, మారి, అంతవరకూ నాటకానికున్న రంగు, రుచి, వాసనల్ని మార్చి
నాటకాన్ని కొత్త పంథాలోకి మార్చిన ట్రెండ్‌ సెట్టర్‌గా వేంకటేశ్వరరావు గారిని
పేర్కొనాలి ఆయన తెలుగు నాటక రంగానికుండే పరిమితుల్ని, ప్రదర్శనావకాశాల్ని
మాత్రమే దృష్టిలో పెట్టుకొని నాటకాన్ని ప్రదర్శించేవాడు రష్యాలో రంగస్టలం | ఎంతో ఎదిగింది, అమెరికాలో మరీ ఎదిగిపోయింది అంటూ విదేశీ మాటలు | చెప్పి, స్వదేశీనాటకాన్ని చిన్న చూపు చూడకుండా, చాలా పరిమితులకు లొబడి |
బ్రతుకుతున్న తెలుగు రంగస్థలం మీదే నాటకాన్ని బ్రతికించారు ఒక్క మాటలో |
చెప్పాలంటే, ఆయన చాలా ప్రాక్టికల్‌ దృష్టి వున్న ప్రయోక్త” ఆన్న ప్రసిద్ధ నాటకకర్త
కాశీ విశ్వనాథ్‌ గారి మాటలు ఆలోచింపదగినవి
పాశ్చాత్య నాటక విధానాలను (ధియేటర్‌ స్టయిల్స్‌) తెలుగు రంగస్థలంమీద
ప్రవేశపెట్టి, అవి ఇక్కడి సంస్కృతికి సంప్రదాయాలకు విరుద్ధంగా, కృతకంగా
ఉన్నా “మేము కొత్త ప్రయోగం చేశాం చూడండి “అని సామాజికులచేత
బలవంతపుమాఘ స్నానం చేయించి సంబరపడే ప్రయోక్తలు తెలుగు రంగస్థల
పరిమితుల్ని దృష్టిలో ఉంచుకొని ప్రయోగాలు చెయ్యగలిగినపుడే ఆ నాటకానికి,
ఆ ప్రయోగానికి గుర్తింపు, మనుగడ ఉంటుంది ఆలా కానపుడు కొత్తగా పుట్టే
ప్రతి ప్రయోగానికి (ఎక్స్‌పెరిమెంట్‌) ఆదే తొలి ప్రదర్శన, ఆదే తుది ప్రదర్శన

ఆయ్యే ప్రమాదం ఉంది నిజానికి తెలుగు రంగస్తలంమిద ప్రదర్శితమైన
జో గ్‌ పాశ్చాత్య ధౌరణిగల నాటకాలలో అత్యధిక శాతం ఈ ఆగ్నిపరీక్షకు బలి
శ ఎత ఇన prt అలం శల an శీ 1 అయిపోయిన. నెలవిదచి సాముచెయడల ఉముచెతుం కాదుగదా”
దేంకటేశ్వరరావు దర్శకత్వం వహంచిన క్రతి నాటకంలొనూ తెలుగుతనం
ఉట్టిపడుతూ ఉండటం ప్రముఖంగా గుర్తుంచుకోవలస్‌న ఆంశం
నాటకరంగంలో ఒక కొత్త ప్రయోగం అనగానె రంగస్టలం మీద కళ్ళు
చెదిరిపోయేటట్టు రంగాలంకరణ చెయ్యడమో, రంగస్థలంమీద లెనెల్స్‌
| నిర్మించడమో లైటింగుతో విన్యాసాలు చేయించడమో, విదేశీ సరుకును తెచ్చి
కొత్త లేబుల్‌ తగిలించి మసి బూసి మారీడుకాయలా చూపించడమో
కాదు ఇప్పుడున్న ప్రదర్శనా రీతులకు భిన్నంగా కొత్త తనం చూపుతూ ప్రదర్శనలో
విలక్షణత చూపే ఎ నూతనాంశమైనా ప్రయోగమే ఆలాంటి ప్రయోగం చెసిన
వారిలో శ్రీ పామర్తి సుబ్బారావు అగ్రగామి పాత్ర పోషణలో మనస్తత్త్వం
| ముమ్మూర్తులా ప్రతిఫలించేటట్ట చేయటమే ఆ ప్రయోగం ప్రదర్శన చూసిన
bei es సగ Fr=
తరా౭త ఆ పాత్ర సామాజికుల గుండెల్లొ ఇమిడిపోతుంది మనోవీఫిలో అనుక్షణం
సంచరిస్తూనే ఉంటుండి ఆ నాటకం ఆ పాత్రలు, ఆ సన్నివెశాలు మనసులో
కాక్య్వతంగా మెదులుతూనే ఉంటాయి ఆ ప్రదర్శనా ప్రభావంవల్ల అయితే దీనికి |
వేదరనా పటిమ ఒకు.టే కారణం అని చెపడం అనాఃయం రచనలోకూడా ఒక స జ bs ళో ఫ్రీ
‘ మెరుపు లేకపోతే ఇసుక తిన్నెల మిద సుందరభవన నిర్మాణం సాధ్యం కాదనే
| విషయం కూడా జ్ఞాపకం ఉంచుకొవాలి కొత్త ప్రయోగం చేసే ఎ దర్శకుడైనా
‘ రచన విషయంలో, తన లక్ష్య సాధనకోసం, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు
  కె.వెంకటేశ్వర రావు అంటే మా ఇంట్లో అందరికీ విపరీతమైన అభిమానం ముఖ్యంగా నాకూ మా శ్రీమతి ప్రభావతికి .రేడియో లో ఆయన
నాటకం వస్తుంటే పరవశం చెందేవాళ్ళం .ఆయనగురించి పేపర్లలో వస్తుంటే పులకించి పోయే వాళ్ళం .నాలుగైదు సినిమాలలో నటించి ఉం
టాడు .ఆ వాచికం అభినయం నా అన్యతో దర్శనీయం .ఆయన గురించి వివరాలు సేకరించమని మా అబ్బాయి శర్మ కు చెబితే ,కష్టపడి
సంపాదించి పంపాడు .కానీ ఇంకా అతని గురించి చాలా వివరాలుంటాయి ఎవరికైనా తెలిస్తే తెలియ జేయండి .ఆయన లాంటి వారికోసమే
ఈ శీర్షిక మొదలు పెట్టా .నా జన్మ ధన్యమైన దను కొంటున్నాను .ఇంకా ఇలాంటి మహానుభావులగురించి తెలుసుకొని తెలియ జేస్తూ
ఉంటాను .

  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-5-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-276• 276-ఆంధ్రా యూని వర్సిటి స్టేజి డైరెక్టర్’’ ,రాగరాగిణి ‘’నాటకం ఫేం ,నాటకగిరీశం ,నటరాజు –కె.వెంకటేశ్వరరావు

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-276
• 276-ఆంధ్రా యూని వర్సిటి స్టేజి డైరెక్టర్’’ ,రాగరాగిణి ‘’నాటకం ఫేం ,నాటకగిరీశం ,నటరాజు –కె.వెంకటేశ్వరరావు
• ఎంబిఎస్ ప్రసాద్ చెప్పిన మాటలు
• ఎంతో ప్రఖ్యాతి తెచ్చిన ‘రాగరాగిణి’ నాటకాన్ని పరిచయం చేద్దామనుకుంటున్నాను. 1959లో అది ప్రదర్శించేనాటికి ఆయనకు 20 ఏళ్లు. ప్రఖ్యాత నటుడు కె. వెంకటేశ్వరరావు అదే ఏడాది దిల్లీలో బ్రిటిష్ థియేటర్ గ్రూపువాళ్లు ప్రదర్శించిన ‘బియాండ్ ద హొరైజన్’ అనే 1920 నాటి నాటకం చూసి నచ్చి, దాన్ని తెలుగులో రాసి యిమ్మనమని కోరడంతో యీ నాటకం రూపుదాల్చింది. కె. వెంకటేశ్వరరావుగారికి, గొల్లపూడికి యిద్దరికీ చాలా పేరు తెచ్చిపెట్టింది. మెలోడ్రామా ఎంతో వున్న నాటకం కాబట్టి ప్రదర్శించిన ప్రతీచోట అవార్డులు గెలుచుకుంది. మూలనాటకం యూజినీ ఓ నీల్ అనే నోబెల్ బహుమతి (1936) పొందిన అమెరికన్ నాటకకర్త రాసినది. చెకోవ్ (రష్యా) ఇబ్సన్ (నార్వే)లలా అమెరికాలో అతను తన నాటకాలకు సుప్రసిద్ధుడు. ఈ నాటకానికి అతనికి పులిట్జర్ బహుమతి లభించింది. ఇద్దరు అన్నదమ్ముల కథ యిది. చాలా కొద్ది మార్పులు తప్ప యించుమించు యథాతథంగానే కథ దించేశారు. నాటక కథ చెప్తాను. కేశవరావు ఒక పల్లెటూళ్లో పదెకరాలు వున్న ఆసామి. వ్యవసాయదారుడు. అతని పెద్దకొడుకు శేషు అతనికి పొలం పనుల్లో సాయపడుతూ, అతని కంటె మిన్నగా కష్టపడుతూ, లాభసాటిగా చేస్తున్నాడు. పనివాళ్లను అదలించడంలో, అవసరమైతే తన్నడంలో దిట్ట.కేశవ రెండో కొడుకు రఘుకి పొలం పని అలవాటు లేదు. పుస్తకాలు చదువుతూ, ఊహల్లో తేలిపోతూ వుంటాడు. అతనికి యీ పల్లెటూరి బతుకంటే విసుగు. ఎక్కడో దూరప్రాంతాలకు వెళ్లి లోకాన్నంతా చుట్టి రావాలని కోరిక. డబ్బు సంపాదించడానికి కాదు, ఊరికే, దిగంతాలవరకు నాలుగు వూళ్లూ చూసి రావాలని ఆశ. మూడో కొడుకు నీలూ మూగవాడు. (ఈ పాత్ర మూలంలో లేదు. తెలుగులో దీని ప్రయోజనమూ పెద్దగా కనబడదు). మూలంలో ఈ కుటుంబం పొలం పక్కనే ఒక నెగటివ్ షేడ్స్ ఉన్న వితంతురాలి పొలం వుంది. తెలుగులోకి వచ్చేసరికి ఆమెను విధురుణ్ని (భార్యపోయినవాడిని) చేసి పరంధామయ్య అని పేరు పెట్టి అతన్ని కేశవ భార్య లలితకు అన్నగార్ని చేశారు. ఈ పాత్రకు రాధ అనే ఒక కూతురుంది.మేనరికాలు మనకు సహజం కాబట్టి అలా మార్చగలిగారు. మూలంలో అయితే వాళ్లు కుటుంబస్నేహితులు మాత్రమే. ఈ రాధను శేషు, రఘు యిద్దరూ ప్రేమిస్తూంటారు. శేషు ఎప్పుడూ రాధను ఆటపట్టిస్తూ, తన అభిమానాన్ని చాటుకుంటూ వుంటాడు. రాధ కూడా అతనితో సరదాగా వుంటూ వుంటుంది. కేశవకు కూడా వాళ్లిద్దరికీ పెళ్లి చేస్తే, యిద్దరి పొలాలూ కలిపి శేషు చూసుకుంటాడని ఆశ పడుతూంటాడు. రఘు కూడా ఆ విషయాన్ని గ్రహించాడు. అతనికీ రాధ అంటే ప్రేమ కానీ ఎప్పుడూ వెల్లడించలేదు. ఇక్కడే వుండి శేషు, రాధల కాపురం చూస్తూ వుండడం కంటె ఎక్కడికైనా వెళ్లిపోతే మంచిదని అనుకుంటున్నాడు.ఇలాటి పరిస్థితుల్లో లలిత మరో అన్నయ్య కెప్టెన్ పతి అనే అతను వీళ్లింటికి వచ్చాడు. అతను 45 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోలేదు. ఓడల్లో తిరుగుతూ దేశాలన్నీ చుట్టబెడుతూన్నాడు. తనకు సహాయంగా ఎవరైనా వుంటే బాగుండుననుకుని రఘుకి ఆఫర్ చేశాడు. రఘు ఎగిరి గంతేశాడు. ఇది తనకు అన్ని విధాలా సూటయ్యే ప్రతిపాదన. ఇక అతను మర్నాడు వెళ్లిపోతాడనగా, రాధ వచ్చి వెళ్లకు, నువ్వంటే నాకిష్టం అంది. ‘అదేమిటి, నీకు మా అన్నయ్యంటే యిష్టమనుకుని, నేను దూరంగా వెళ్లిపోదా మనుకున్నానే’ అన్నాడు. ‘కాదని యిప్పుడు తెలిసిందిగా, ఇక్కడే వుండిపో, యిద్దరం పెళ్లి చేసుకుందాం’ అంది. అతను మనసు మార్చుకున్నాడు.మర్నాడు ఉదయం అతని మేనమామ పతి వచ్చేసమయానికి ఆ ముక్క చెప్పేశాడు. ఎందుకని అడిగితే రాధ నన్ను ప్రేమిస్తోంది అన్నాడు. సరిగ్గా అదే సమయానికి యింటికి వచ్చిన శేషు అది విని హతాశుడయ్యాడు. రాధ, తమ్ముడు పెళ్లి చేసుకుని కాపురం చేస్తూంటే చూస్తూ కూర్చోవడం కన్న దూరంగా ఎక్కడికో వెళ్లిపోతే మంచిది అనుకుని, రఘు బదులు నన్ను విదేశాలకు తీసుకెళ్లు అని పతిని అడిగాడు. రఘు మాటలతో దిగాలు పడిన పతి హమ్మయ్య నువ్వయినా దొరికావ్ అనుకుని వెంటనే సరేనన్నాడు. కానీ యిదంతా కేశవరావుకి నచ్చలేదు. శేషు, రాధ మంచి జోడీ అనుకుంటే రాధను రఘు పెళ్లాడతానంటున్నాడు. పోనీలే అనుకుంటే యిప్పుడు శేషు వ్యవసాయం విడిచి వెళ్లిపోతానంటున్నాడు. అందుకని ‘నువ్వెళ్లిపోతే పొలాలు ఎవరు చూస్తారు?’ అని కొడుకుని తిట్టిపోశాడు.‘ఏం నేను వ్యవసాయం చేయడానికే పుట్టానా? నాకు అదంటే అసహ్యం. కావలిస్తే నువ్వూ, రఘూ చేసుకోండి.’ అన్నాడు శేషు. దాంతో కేశవకు పట్టరాని కోపం వచ్చింది. కొడుక్కి శాపనార్థాలు పెట్టాడు. నీతో మాట్లాడను పొమ్మన్నాడు. భార్య నచ్చచెప్పబోయినా వినలేదు. ఆమెకు రఘు, రాధ పెళ్లి చేసుకోవాలని, శేషు యిక్కడే వుండి వ్యవసాయం చూసుకోవాలని వుంది.కానీ శేషు వుండదలచలేదు. మేనమామ వెంట వెళ్లిపోయాడు. రాధ, రఘులకు పెళ్లయింది. మావగారి పొలం, తమ పొలం కలిపి రఘు చూసుకోవటం మొదలెట్టాడు. కానీ అతనికి ఆ పని చేతకావటం లేదు. మెతకమనిషి కావడంతో అందరూ తోక ఝాడించారు. పెద్దకొడుకు పోట్లాడి వెళ్లిపోవడంతో తండ్రి డీలా పడ్డాడు. ఆరోగ్యం చెడింది. సరైన మార్గదర్శనం చేయలేకపోయాడు.వ్యవసాయం నష్టాలు తెచ్చిపెడుతోంది. అప్పులు చేయవలసి వచ్చింది. కేశవ చచ్చిపోయాడు. రాధకు కూతురు పుట్టింది. ఆ పాపకు ఎప్పుడూ అనారోగ్యమే. ఎటు చూసినా దరిద్రం తాండవిస్తోంది. దానికి తోడు రాధ తండ్రి యింటికి తరచుగా వస్తూ అల్లుడి చేతకానితనాన్ని ఎత్తిచూపుతూ వెక్కిరిస్తున్నాడు. రాధకు జీవితమంటే విసుగెత్తిపోయింది.భర్తను మాటిమాటికీ విసుక్కుంటోంది. రఘుకి యీ వ్యవసాయం తప్పనిసరి తద్దినమైంది. అతనికి మానసిక విశ్రాంతినిచ్చే ఏకైక సాధనం పుస్తకాలు చదవడం. వాటిని చూస్తే రాధ మండిపడుతోంది. తల్లి అన్నీ చూస్తూ ఏమీ అనటం లేదు కానీ యింటా బయటా రఘు అసమర్థత వలననే యింత అనర్థం దాపురించిందని, అదే శేషు వుండి వుంటే బ్రహ్మాండంగా వుండి వుండేదని, తన భార్యతో సహా అందరూ, అనుకుంటూండడం గమనించిన రఘు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో ఉడుక్కోవడం మొదలుపెట్టాడు.విదేశాలకు వెళ్లిన మూడేళ్లకు శేషు బాగా చదువుకుని, బాగా గడించి, తన మేనమామ పతితో సహా తిరిగి వస్తున్నాడని కబురు వచ్చింది. అతను వస్తే సమస్యలన్నీ తీరిపోతాయని అందరూ ఆశ పెట్టుకున్నారు. డబ్బుంది కాబట్టి అప్పులు తీర్చేస్తాడనీ, వ్యవసాయాన్ని మళ్లీ ఒక దారిలో పెడతాడని, తమ నుంచి వెళ్లిపోయిన పనివాళ్లను మళ్లీ రప్పిస్తాడని అందరూ అనుకున్నారు. అతను వచ్చాడు. విషయాలన్నీ గ్రహించి, వ్యవసాయం చేపడతానన్నాడు.అతన్ని చూడగానే రాధతో సహా అందరూ గంతులు వేయడం చూసి, రఘు అభిమానం మరింత దెబ్బ తింది. ‘డబ్బిస్తాను, అప్పులు తీర్చేయి’ అని అన్న ఆఫర్ చేస్తే, అక్కరలేదు, పొలం తాకట్టు పెడతాను’ అని బింకానికి పోయాడు. ఇప్పటికే అతనితో పోల్చి అతన్ని అవమానపరుస్తున్నారు. డబ్బు కూడా తీసుకుంటే మరింత లోకువ అవుతానని అతని భయం. అతని ఫీలింగ్స్ అర్థం చేసుకున్న శేషు ఒత్తిడి చేయలేదు.కానీ పొలానికి వెళ్లి కొన్నాళ్లు పని చేసి, వ్యవహారాలు గాడిలో పెట్టి, అప్పుడు మళ్లీ విదేశాలకు వెళదామనుకున్నాడు. రాధ, శేషు విడిగా మాట్లాడుకునే అవకాశం వచ్చినపుడు రాధ మనసులోని భావాలు వెల్లడయ్యాయి. శేషు తనను యింకా ప్రేమిస్తున్నాడనే అనుకుంటోందామె. మళ్లీ విదేశాలకు వెళ్లడానికి కారణం గతంలో ఉన్న కారణమేనా? అని అడిగింది. శేషు ‘అబ్బే అదేమీ లేదు, ఇప్పుడు నువ్వు నాకు చెల్లెలివి’ అన్నాడు.రాధకు అది రుచించలేదు. అతను తనంటే యింకా వెంపర్లాడుతున్నాడని అనుకోవడమే ఆమె కిష్టం. ‘నిన్నే చేసుకోవాల్సింది. ఆ రోజు తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. నీ తమ్ముణ్ని కట్టుకుని నేనేం బావుకున్నాను?’ అనే ధోరణిలో మాట్లాడింది. కానీ శేషు ‘రఘు చాలా సున్నితమనస్కుడు. వాడిని కష్టపెట్టకు’ అని హితవు చెప్పాడు.అంతలోనే అతనికి ఒక పెద్ద ఆఫర్ రావడంతో అవేళే బయలుదేరి వెళ్లిపోవాల్సి వచ్చింది. భంగపడిన రాధ అతను వెళ్లగానే కోపంతో భర్తతో ‘నీ బదులు శేషునే చేసుకుని వుండాల్సింది’ అంది. అతను కోపంతో ఆమెను కొట్టబోయాడు. తమాయించుకున్నా, ఆమెపై విముఖత పెరిగింది. ఇక ఆ పై నుంచి ‘శేషు గురించి కలలు కంటున్నావేమో పాపం’ అని వెక్కిరించ సాగాడు.అయిదేళ్లు గడిచాయి. ఈ లోగా రఘు కుటుంబ పరిస్థితి మరింత దిగజారింది. వైద్యం అందక కూతురు, వేదనతో తల్లి చచ్చిపోయారు. పొలం మొత్తం పోయింది. ఎటు చూసినా దరిద్రమే. మనిషి బాగా జబ్బు పడ్డాడు. చెమర్చిన గోడల కారణంగా ఊపిరితిత్తులు చెడిపోయాయి. తిండికి గడవడమే కష్టంగా వున్నపుడు యింటి బాగుకి, వైద్యానికి డబ్బెలా వస్తుంది? రాధ కూడా జబ్బు మనిషిలా అయిపోయింది. జీవితంపై విరక్తి కలిగింది. ఆమె తండ్రి పరంధామయ్య వీళ్ల యింట్లోనే వుంటూ సతాయిస్తూనే వున్నాడు.ఇవన్నీ శేషుకి తెలియవు. పొరపాటు పెట్టుబడుల కారణంగా మధ్యలో కాస్త డబ్బు పోగొట్టుకోవడంతో అతను అనుకున్నదాని కంటె ఎక్కువకాలం విదేశాల్లో వుండిపోయాడు. కానీ చివరకు బాగానే మిగుల్చుకుని యింటికి తిరిగి వచ్చాడు. అతని ఉత్తరాలకు సమాధానాలు రాసేవాళ్లు ఎవరూ లేరు.ఉన్న పరిస్థితి రాస్తే డబ్బు కోసం దేవిరించినట్లు వుంటుందని రఘు అభ్యంతరం. చిన్న తమ్ముడు నీలూ చెయ్యి ఒక యంత్రంలో పడి విరిగిపోవడంతో, దాని వైద్యానికి కూడా డబ్బు లేకపోవడంతో అతనే టెలిగ్రాం యిచ్చాడు. ఆ విషయం మరెవరికీ తెలియదు.ఆ రోజు రఘుకి జ్వరం. విపరీతమైన దగ్గు. రాధ ఏమైనా సేవ చేయబోయినా వద్దన్నాడు. ‘నన్ను పెళ్లి చేసుకుని పొరపాటు చేశావు. ఈసారి శేషు వస్తే సిగ్గు పడకుండా డబ్బు అడిగి తీసుకుని, యీ పల్లె విడిచి పట్నం వెళ్లిపోదాం, అక్కడ నా చదువు విలువ ఏమిటో చూపిస్తాను. మీ అందరి మెప్పూ పొందుతాను.’ అన్నాడు. తీసుకునేదేదో అప్పుడే తీసుకుని వుంటే బాగుండేదిగా అని దెప్పి పొడిచింది రాధ. జరిగిందేదో జరిగింది, మన భవిష్యత్తు తీర్చిదిద్దుకుందాం అంటూ ఆశాభావంతో మాట్లాడాడు.కానీ పరంధామయ్యకు ఆ మాటల మీద నమ్మకమేమీ లేదు. నీరసంతో రఘు లోపలకి వెళ్లి పడుక్కోగానే కూతురి దగ్గరకు చేరి ‘వీడు పోవడం ఖాయం. ఈసారి శేషు వచ్చినపుడు నువ్వు అతన్ని పెళ్లి చేసుకుని యికనైనా సుఖపడు. వయసు ఏమంత మీరిపోలేదు.’ అని హితబోధ చేశాడు. దాంతో రాధకు పిచ్చికోపం వచ్చింది. ‘ఏమిటా పాడుమాటలు?’ అంటూ తండ్రి మీద దీపంలోని కిరోసిన్ పోసేసింది. పొరపాటు మాట అన్నానమ్మోయ్ అంటూ అతను బతిమాలుకుంటూండగా సరిగ్గా అదే సమయానికి తలుపు తోసుకుని శేషు వచ్చాడు. వెంట ఒక డాక్టరు వున్నాడు.వస్తూనే డాక్టరును తమ్ముడి గదిలోకి తీసుకెళ్లాడు. డాక్టరు పరీక్ష చేస్తూండగా బయటకు వచ్చి ‘సంవత్సరంగా నా తమ్ముడు జబ్బుతో బాధపడుతూంటే నాకెందుకు రాయలేదు? నీలూ టెలిగ్రాం యిచ్చాడు కాబట్టి యిప్పటికైనా తెలిసింది. భర్త పట్ల నీ బాధ్యత యిదేనా?’ అంటూ రాధను నిందించాడు.రఘు వద్దన్నాడని చెప్పడం తప్ప ఆమె వద్ద వేరే సమాధానం లేదు. ఇంతలో డాక్టరు బయటకు వచ్చి రఘు ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయాయని, చివరి ఘడియల్లో వున్నాడనీ చెప్పి వెళ్లిపోయాడు. కావాలంటే వేరే చోటకి తీసుకెళ్లి వైద్యం చేయిస్తానని శేషు అన్నాడు కానీ రఘుకి నిజం తెలిసిపోయింది. అన్నగారిని గదిలోకి పిలిచి, తను చనిపోయిన తర్వాత రాధను పెళ్లి చేసుకోమని కోరాడు.ఇది విని శేషు నిర్ఘాంతపోయాడు. బయటకు వచ్చి ‘వాడికి యిలాటి ఆలోచన ఎందుకు వచ్చింది?’ అని రాధను నిలదీశాడు. ‘గతసారి నువ్వు వచ్చి వెళ్లాక ఆవేశంలో శేషుని చేసుకుంటే బావుండేది, నీ ముఖం చూడడానికే అసహ్యంగా వుంది అన్నాను’ అని ఆమె ఒప్పుకుంది. శేషు రాధను తిట్టిపోశాడు. ‘అసలే సున్నితమనస్కుడు. నీ మాటలతో సగం చచ్చాడు. ఇప్పుడు పూర్తిగా ఛస్తున్నాడు. వాడికి చావుకి నువ్వే కారణం. అన్నీ తెలిసే నువ్వా మాటలన్నావు. నిజానికి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావ్.’ అని గట్టిగా అరిచాడు.రాధ కోపం కట్టలు తెగింది. ‘ఏం చూసి ప్రేమించాలి నిన్ను? డబ్బుని చూశా? నీకు ఆ విషయంలో గర్వం వుంటే, నాకు మరో విషయంలో గర్వం వుంది. డబ్బు, సుఖం అన్నీ పోయినా నా వ్యక్తిత్వం మిగిలి వుంది. నేను మనసా, వాచా ఆయన్నే మొదట ఎంచుకున్నాను. నిన్ను ప్రేమించలేదు, ప్రేమించను, ప్రేమించాననుకోవడం సిగ్గుచేటు.’ అని గట్టిగా చెప్పి ఏడవసాగింది.అదే సమయానికి రఘు తన గదిలోంచి బయటకు వచ్చి ఆమె మాటలు విన్నాడు. వినగానే సంవత్సరాలుగా తనలో వుండిపోయిన సమస్య ఆ క్షణంలో తీరిపోయినట్లు ముఖంలో తృప్తి కనబడింది. అంతలో దగ్గుతెర వచ్చి ఆపుకోలేక, రక్తం కక్కుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు. శేషు, రాధ యిదంతా గమనించలేదు. శేషు రాధతో ‘గదిలోకి వెళ్లి వాడికి ఆ మాట చెప్పు.’ అన్నాడు. ‘నేను చెప్పినా నమ్మరాయన’ అందామె. అంతలోనే వెనక్కి తిరిగి చూస్తే కుర్చీలో ప్రశాంతవదనంతో ప్రాణాలు వదిలేసిన భర్త కనబడ్డాడు. వెళ్లి కౌగలించుకుని అతని శిరస్సును హృదయానికి హత్తుకుంది.ఇంతటితో నాటకం ముగిసింది. శేషు, రాధను పెళ్లాడాడా? లేక బాగోగులు చూసుకున్నాడా? అని రచయిత చెప్పలేదు. ఒరిజినల్‌లో కూడా అంతే. అయితే ఒరిజినల్‌లో లేని మూగ తమ్ముడి పాత్ర తెలుగులో వుంది కాబట్టి, కనీసం అతని కోసం, రాధ తండ్రి కోసం శేషు యికపై డబ్బు పంపిస్తూ వుంటాడని మనం వూహించుకోవాలి.అన్నదమ్ముల మధ్య వైరమనేది బైబిల్ కాలం నాటి నుంచి, సుందోపసుందుల కాలం నుంచి వుంది. ఇక్కడ శేషు, రఘుల మధ్య వైరం లేదు. కానీ యితరులు పోలిక పెట్టి వాళ్ల జీవితాలను ధ్వంసం చేశారు. ఇద్దరి మధ్యలో ఒక స్త్రీ వుండడం విషయాన్ని మరింత క్లిష్టం చేసింది. తనది కాని రంగంలో దిగి, రఘు నాశనమయ్యాడు. చుట్టూ వున్నవాళ్లనీ నాశనం చేశాడు. విదేశాలకు వెళ్లిపోదామనుకున్న అతను రాధపై ప్రేమ కారణంగానే వ్యవసాయంలో దిగి, విఫలమయ్యాడు. చివరకు రాధ ప్రేమనూ పోగొట్టుకున్నాడు. శేషు వ్యవసాయంలోనూ రాణించాడు. బయటకు వెళ్లీ రాణించాడు కాబట్టి విజేత అనడానికి లేదు. ‌డబ్బు గడించాడు కానీ ప్రేమరీత్యా విఫలమయ్యాడు. రాధను పెళ్లి చేసుకోలేకపోయాడు సరే, వేరే ఎవరినైనా ప్రేమించో, పెళ్లాడో వుండవచ్చు కదా! అదీ జరగలేదు. రాధను సోదరిగా భావిస్తున్నానని అతను అనుకున్నా, ఆమెను మర్చిపోలేక పోయాడనే అనుకోవాలి. ఇక రాధ అన్ని విధాలా నష్టపోయింది. ఈ విషాదనాటకం విపరీతంగా ప్రజాదరణ పొందింది. – (ఫోటో – బియాండ్ ద హొరైజన్ నాటక ప్రదర్శన, ఇన్‌సెట్‌లో గొల్లపూడి)

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2021)

• గొల్లపూడి చెప్పిన విషయాలు
• గొల్లపూడివారి పుస్తకం నేనుకూడా ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకుని చదివాను. చాలా ఆసక్తికరంగా అనిపించింది. ముఖ్యంగా అరుదైన ఫోటోలూ, తెలుగువారు గుర్తుంచుకోని కె. వెంకటేశ్వరరావువంటి మహానటుల వివరాలు చాలా బావున్నాయి.

• కె వెంకటేశ్వరరావు ఆ రోజుల్లో ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నాటకరంగంలో చేసిన కృషి, ఆ ప్రభావం అప్పట్లో కుర్రాడిగా ఉన్న గొల్లపూడి వారిపై ఎంత బలంగా ఉందో గుర్తుంచుకోతగ్గవి. నిజానికి ఒకప్పుడు ఉచ్ఛదశలో ఉన్న నాటక రంగం ఈనాడు తన ఉనికినే కోల్పోవటానికి గల కారణాలు గొల్లపూడివారు తన ఆత్మకథలో వివరిస్తారు

• గొల్లపూడి:

• ఆయనకి నాటకం అంటే ప్రాణం. దాదాపు 52 సంవత్సరాల కిందట ప్రముఖ నటుడు కె.వెంకటేశ్వరరావు హైదరాబాదులో నా ‘మహానటుడు’ నాటకాన్ని ప్రదర్శించాడు. అప్పుడాయన ప్రేక్షకుల్లో ఉన్నారు. ఎందుకనో ఆ నాటకంలో పాత్రీకరణల్లో మార్పు అవసరమని ఆయన భావించారు. అలా భావించిన కొందరం ఆ రోజుల్లో మా యింట్లో కలిశాం. వారిలో బి.కె.రావు గారున్నారు. కె. వెంకటేశ్వరరావు నాటకాన్ని చదివాడు. మార్పుల్ని చర్చించాం.
• ఆ మధ్య – ఓ పదేళ్ల కిందట రావుగారిని అమెరికా వెళ్లినప్పుడు కలిశాను. ఆయన ఒక సభకి అధ్యక్షత వహించారు. ఇప్పుడు ఉన్నట్టుండి 52 సంవత్సరాల కిందట జరిగిన సవరణ గురించి ఫోన్ చేశారు. ఆయన వయస్సు ఇప్పుడు 87. ఒక మనిషి ఎల్లప్పుడూ జీవిస్తూ ఉండడానికి, మెదడులో ఆలోచనలు మురిగిపోలేదనడానికి ఇది అద్భుతమైన నిదర్శనం.
• విషాద కర సంఘటన

దశాబ్దాల కిందటి మాట. అప్పటి అమెచ్యూర్ నాటక రంగ ప్రముఖుడు, మహానటుడు కె.వెంకటేశ్వరరావు కొడుకు పోయాడు. ఈ విషయం తెలీని రేడియో అధికారులు ఆయన్ని రేడియో నాటికలో నటించడానికి పిలిచారు. అప్పట్లో రేడియో ప్రసారాలు సరాసరి సాగేవి. రికార్డింగుల్లేవు. కొడుకుని పోగొట్టుకున్న తండ్రి పాత్రని వెంకటేశ్వరరావు పోషించాలి. ప్రసారంలోనే బావురుమన్నాడు వెంకటేశ్వరరావు. అప్పుడు ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్.ఎన్.మూర్తిగారికి తెలిసింది అతనినష్టం. కాని ఎదురుగా ప్రసారం జరిగిపోతోంది. ఇప్పుడేం చెయ్యాలి? అతన్ని ఎలా ఓదార్చాలి? ఆలోచించి, ఇద్దరు వయొలినిస్టులను స్టుడియోలోకి పంపి అతని దుఃఖాన్ని సంగీతంతో అలంకరించారు.
నేడు మన దేశంలో చాలామంది మూర్తిగారి వంటివారున్నారు. అయితే వారు గత్యంతరం లేక చేశారు. కాని నేటి తరం మూర్తులు- తెలిసి దుఃఖాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
• గణేష్ పాత్రో
గణేశ్‌ పాత్రో
పాత్రో ఒక సామాన్య కుటుంబం నుంచి పైకి వచ్చిన వారు. ఉత్తరాంధ్రలోని పార్వతీపురంలో పుట్టి విశాఖపట్నంలోని ఏవీఎన్‌ కళాశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత పోస్టల్‌ అండ్‌ టెలిగ్రాఫ్స్‌ శాఖలో ఉద్యోగం చేసి ఒక సాదాసీదా జీవితం గడిపేవారు.
అతనికి భగవంతుడిచ్చిన కన్నుపెన్ను వాడుకుని ప్రపంచాన్ని పరిశీలించి ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని తూర్పు మాండలికాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. పాత్రో రచన వల్లనే తూర్పు మాండలికం దేశంలో ప్రాచుర్యం పొందింది. దానికి తోడైనట్టుగా ఆయన గురువుపిల్లనిచ్చిన మామగారు నటరాజు కె. వెంకటేశ్వరరావు గారు (ఆంధ్ర విశ్వవిద్యాలయం నాటక విభాగంలో పనిచేసిన రంగస్థల దర్శకుడు) పాత్రోను రచయితగా మలిచారు అంటే అదేమీ ఆశ్చర్యపోయే విషయం కాదు. ఎందుకంటే పాత్రో స్వతహాగా చిన్నతనం నుంచే రచయిత కాబట్టి. కానీ దానికొక ఒరవడినినడకను నేర్పిన వ్యక్తి కె. వెంకటేశ్వరరావు గారు. ఆయన సూచనల మేరకు పాత్రో మొదట త్రివేణి నాటికను రచించారు. ఆ నాటిక న్యూఢిల్లీలో పూసా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ వారి ఆధ్వర్యంలో  భాషల్లో జరిగిన నాటిక పోటీలలో ఉత్తమ నాటికగా ఎంపికైంది. దాంతో పాటు ఉత్తమ ప్రదర్శనఉత్తమ నటుడు బహుమతులు పొందడం జరిగింది.

గుమ్మడి
భీష్మ. అందులో గుమ్మడి కర్ణుడుగా నటించారు. ప్రముఖ రంగస్థల నటులు కె.వెంకటేశ్వరరావు, రచయిత మోదుకూరి జాన్సన్ తదితరులు సినీ రంగ ప్రవేశానికి పరోక్షంగా సహకరించారు.
సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-22-ఉయ్యూరు


• —


Posted in సినిమా | Tagged | Leave a comment

నగజా శతకం

నగజా శతకం
కృష్ణాజిల్లా వల్లూరు పాలెం కవయిత్రి శ్రీమతి చుక్కా కోటి వీరభద్రమ్మ నగజా శతకాన్ని రచించి ,బెజవాడ ఎజి ప్రెస్ లో ముద్రించి 1940లో ప్రచురించింది. వెల ఒక్క అణా మాత్రమె .విజ్ఞప్తి వాక్యాలలో కవయిత్రి ‘’శ్రీ మద్వేద కావ్య స్మృతి దర్శన తీర్ధ ,సాహిత్య విశారద ,ధర్మాచార్య ,విద్యానిధి విద్యారత్నాది బిరుదాంకితులు ,ఆధునిక వీరశైవ మతోద్ధారకులు శివశ్రీ చిదిరి మఠంవీరభద్రశార్మగారి పాదపద్మాలకు సమర్పించినట్లు తెలిపింది ..’’పతి బూజ బాయక ద్రుతమతిని నాగార్యుని –క్షితి గలదాక మతిలో కొని యాడెద .లక్షణము నేర్పిన లక్షణ వంతుని –కొనియాడుచు తనివి చెందేద .పిన్నపెద్దలను చిన్ని యన్నలను ,పండిత వరులను దండి కవీ౦ద్రులను –ఒప్పులగొని ,తప్పుల ద్రోసి –తప్పక నాకవితకు మెప్పుకు తేగలరని –కరములు మోడ్చి శరణు చేసేద ‘’అని విన్నవించింది .చిదిరి మఠం వీరభద్ర శర్మగారు ‘’తన ముద్దుల మేనకోడలిని సంబోధిస్తూ ,భక్తీ నీతితి సదాచారాలను సరళ భాషలో ‘’నగజా శతకం ‘’రాసింది .ఆధునిక ఆంద్ర శైవ ప్రపంచం లో ఈమె ఒక్కతే శతకకర్త అవటం అత్యంత మోదం కలిగించింది .భావ ప్రౌఢిమ గొప్పగా ఉంది .వయసున చిన్న గుణమున మిన్న .’’అని అభిప్రాయం వెలిబుచ్చుతూ ఆశీర్వదించారు .నగజా కుమారి అనే తన మేనకోడలి ని సంబోధిస్తూ ‘’నగజా ‘’మకుటంతో కందపద్యాలలో రాసిన శతకం ఇది .అందంగా ఉంది .
మొదటిపద్యం –‘’శ్రీ గౌరీ ప్రాణేశుడు –బాగోగులు చిరాయువిచ్చి బ్రతికెడు దనుకన్ –శ్రీ గౌరియు కు౦కుమనిడి-బాగుగ నిన్ను మనుచునమ్మ వసుమతి నగజా ‘’అంటూ శివపార్వతుల ఆశీస్సులు మేనకోడలికి కోరింది .తర్వాత పనులు పూర్తీ చేసే విఘ్నేశుని ,వీరశైవ పంచా చార్యులను స్తుతించింది .’’అర్ధించిన వే-అరదంబుల నిచ్చు ‘’బసవేశుని ‘’భక్తితో కొలిచి ,చిదిరి మఠం వీరభద్రగురుస్వామిని ,దీక్ష ఇచ్చిన శంభు మూర్తిని ,తండ్రి వైద్యుడు పట్టిస వీరయ్యను ,తల్లి నాగమ దేవిని ,చిన్నతనం లో తన్ను పెంచిన సంగయ ,మల్లా౦బలకు ,విద్యాగురువు లక్కన మల్లికార్జున కు ,మతిమంతుడైన భర్త నాగార్యునికి ,పెద్దన్న బసవ ,సోదరులు యల్లమార్య ,వీరభద్ర లను ,అక్కయ్య మహాదేవిని స్మరించి ,భవభూతి బసవ,నన్నెచోళ,కాళిదాసు ,బూసా మల్లయ కవీశ్వరులను 18పద్యాలలో స్తుతించింది .
19వ పద్యం నుంచి నీతులు ఉపదేశాలు రాసింది .’’సిరి గలదంచును పురుషులు –పరుల హింసింప జనదు పాండవులను నా –కురునాధుడు నిందించుట –ధర బడెగా భీము చేత దప్పక నగజా ‘’అన్నది .దీక్ష వదలక కష్టాలకోర్చి కాపురం నిలబెట్టుకొని పుట్టింటి కీర్తి పెంచాలి .పతి భక్తీ భవనాశం ,దానికి మించిన వ్రతం లేదు .ఇరుగుపోరుగువారితో అనురక్తి తో ఉండాలి .బంధువులను గౌరవించాలి ..’’హృదయేశు మీద ప్రేమను మదిలో నిల్పుకోవాలి ‘’.కష్టాలొస్తే నిష్టూరాలు పలకరాదు.గురునిందా పరనింద పరమేశు నింద చేటు తెస్తాయి .’’కట్టిన శివ లింగము నె-ప్పట్టునబాయంగారాదు’’అలావదిలేస్తే కులట అనిపించుకొంటుంది .సత్యమే యశానికి మూలం ,భవమోహనాశనం ,శీలం నిలిపేది .’’పంచాక్షరి భవహరణము –పంచాక్షరి మోక్షనెలవు ‘’.విభూతి రుద్రాక్షలు చేతులలో తాళంతో గౌరీపతిని కీర్తించే వాడే యతి .శివభక్తితో మార్కండేయుడు చిరాయువు పొందాడు .అంగం మాయామయం ,లింగం సర్వేశుని గుర్తు .లింగాన్ని అంగాలను ఏక దృష్టితో చూడాలి .’’అప్పే ముప్పును తెచ్చును –తప్పే యపకీర్తి తెచ్చు ‘’.సురతాగితే ఆరోగ్యం సిరి వంశ ప్రతిష్ట స్థిర చిత్తం విజ్ఞానం అన్నీ నశించిపోతాయి .’’ముక్కంటి మంత్రం ఎక్కడ ఉంటె అక్కడ శివుడు ఉంటాడు .
చెడి బతకటం తేలిక బ్రతికి చెడటం చాలా కష్టం .కాలాన్ని పురుషార్ధగతికి వెచ్చించాలి .’’కక్షలు పుట్టించటానికి ,రక్షకులకు చేటు కూర్చి లక్షణ పరులే –పక్షము నాతొ సరియని –శిక్షల గనకుండి వదరు చెనటియు నగజా ‘’అంటూ క్షకార ప్రయోగంతో అక్షరరమ్యత చేకూర్చింది కవయిత్రి .శిల ,మణి భేదంతో ఉంటాయి మారవు .అలాగే దుర్మార్గులు ,సత్పురుషులు ఉంటారు .కులకాంత కు సద్విద్య బోధించిన వాడే గురువు .’’శ్రీ గురు పదపద్మమ్ములు-భోగీశుని లింగ మాత్మ బోల్పుగ నుంచే –రాగంబుల బడయకెతా –బాగుగ జరియించు వాడె భక్తుడు ‘’
‘’జిలిబిలి పలుకుల పలుకుచు –కులికెడు మురిపెంపు మేనకోడలవనుచున్ –లలి న’’న్నత్తా’యనుటను – యిల నీకే కృతి నొసంగి తింపుగ నగజా ‘’అని మేనకోడలు కు అంకితమిచ్చినది మేనత్తకవయిత్రి .పద్యం రాయటం నేర్పిన అన్న ను స్మరించినది .’’లక్కన వంశోద్భవనై –చుక్కావారింటమెట్టి సుజనావలికిన్-మొక్కులిడి వీరభద్రమ-ఇక్కబ్బము చెప్పెనమ్మ ఇంపుగ నగజా ‘’
చివరి 107,108పద్యాలు
‘’జయజయ హరినుత పాదా – జయజయ ప్రమధార్తిహరణ జయ చంద్రధరా –జయజయ పురహర యనుచును –నియమంబుగ దలతు మతిని నిక్కము నగజా ‘’
‘’మంగళమో భవ హరణా –మంగళమోభక్త పోష మాపతి రమణా-మంగళమోశివ య౦చును –పొంగుచు నే పాడుచుందు ముద్దుల నగజా ‘’
ఈశతకం లో భక్తి,నీతి ,సద్వివేకం ,స్త్రీపురుషులకు సద్ధర్మ జీవన విధానం ,శివ భక్తీ పారమ్య౦ పుష్కలంగా ,ధారశుద్ధి కల సరళపదాలతో మనసుకు ఆకర్షణ కలిగించే రీతితో కవయిత్రి శ్రీమతి చుక్కా కోటి వీరభద్రమ్మతన ప్రతిభను చాటింది .కుమారీ శతకంలాగా ‘’నగజా ‘’శతకం కూడా చక్కని శైలిలో నడిచింది .సాహిత్యం లో ముఖ్యంగా శైవ సాహిత్యం లో చిరయశస్సు పొందే ఉంటుంది .కానీ మన వారి దృష్టిలో పడలేదని పించింది .ఆధునిక శైవ కవయిత్రిగా వీరభద్రమ్మ గొప్ప స్థానం పొందింది .ఆమెనూ ఆమె శతకాన్నీ పరిచయం చేసే మహద్భాగ్యం నాకు కలిగి నందుకు మహదానందంగా ఉంది .వల్లూరి పాలెం మా ఉయ్యూరుకు సుమారు అయిదారు కిలో మీటర్ల దూరం లోనే ఉన్నా ,ఈ కవయిత్రి గురించి నాకు ఇప్పటిదాకా తెలియక పోవటం నా అజ్ఞానమే .మా అబ్బాయి శర్మ ఇలాంటి కవులను శతకాలను వెతికి పంపించి నాతొ రాయిస్తున్నాడు .అతడికి అభినందనలు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-275

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-275
• 275-కర్నాటక ,హిందూ స్థానీ విద్వాంసుడు ,ఉర్దూ ఘజల్స్ ఫేం ,శ్రుతిలయలు సినిమాలో శ్రీ గణనాదం  గీత ఫేం –పూర్ణ చంద్ర రావు
• మేఘసందేశం ‘ చిత్రం టైటిల్స్ ‘’‘’సమయంలో’’శ్రీ గణనాదం  వస్తుంది. గాయకుడు పూర్ణచందర్ . ఈయన  కర్నాటక సంగీతంతో బాటు హిందుస్తానీ సంగీతం కూడా గానం చేస్తారు. ఉర్దూ ఘజల్స్ పాడడంలో ప్రావీణ్యం సంపాదించారు. అనేక కచేరీలు చేసారు. గాత్రమే కాక ఆయన వయోలిన్ వాద్య కళాకారుడు కూడా ! మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి చాలా కచేరీలలో వయోలిన్ సహకారం అందించారు.

పూర్ణచందర్ కి బంధువు, ఒకప్పటి నటుడు ముదిగొండ లింగమూర్తి గారి ప్రోత్సాహంతో మద్రాసులో అడుగుపెట్టి, తెలుగులో చలం నిర్మించిన సన్నాయి అప్పన్న చిత్రానికి మూలమైన కన్నడ చిత్రం షనాది అప్పన్న తో చలనచిత్ర సీమలో అడుగు పెట్టారు.

జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఆనందభైరవి చిత్రానికి ఆయన పాడిన తిల్లానా చిత్రంలో లేకపోయినా రికార్డులుగా, కాసెట్లలోను విడుదలై ఆరోజుల్లో ప్రజాదరణ పొందింది.

విశ్వనాథ్ గారి శుభలేఖ చిత్రంలో అక్కడక్కడ వినిపించే ఆలాపన కూడా పూర్ణచందర్ గానం చేసినదే ! చాలామంది ఆ గానం బాలు గారిదని భ్రమ పడ్డారు. దానికి బాలు గారు అప్పట్లో పత్రికా ముఖంగా వివరణ ఇచ్చారు కూడా !

విశ్వనాథ్ గారి శృతిలయలు  చిత్రంలో కూడా కొన్ని పాటలు పాడారు

• బడేగులాం అలీ ఖాన్‌

పాకిస్తాన్‌ ఏర్పడ్డాక ఉస్తాద్‌గారికి అక్కడ ఉండడం నచ్చలేదు. స్వభావంలో తాను హిందువునే నని ఆయన ప్రకటించుకున్నాడు. పహాడీలో “హరిఓం తత్సత్‌”, భూపాలీ (మోహన)లో ” మహాదేవ మహేశ్వర” వగైరా గీతాల్ని అద్భుతంగా రచించి పాడాడాయన. ఆయన అభిమానులంతా భారతదేశంలో ఉండడం వల్ల మన రేడియోలోనూ, కచేరీల్లోనూ పాడటానికి ఇబ్బందులు పడి తరుచుగా రావలసివచ్చేది. విదేశీయుడని ఏవో అర్థంలేని నిబంధనల కారణంగా ఆయన రేడియో కచేరీలు రికార్డు చెయ్యరాదనే ఆంక్ష ఉండటం వల్ల అమూల్యమైన ఆయన ఆలిండియా రేడియోలో పాడిన సంగీతంలో కొంతభాగం పత్తాలేకుండా పోయింది. ఆయనకు బొంబాయిలో ఇల్లు ఏర్పాటు చేసినది అప్పటి ముఖ్యమంత్రి మొరార్జీ దేశాయి. ఆ తరవాత ఆయన ఇండియాలో స్థిరపడి కలకత్తాలోనూ, చివరి రోజుల్లో (1968) హైదరాబాద్‌లోనూ ఉన్నారు. హైదరాబాద్‌లో ఆయన నవాబ్‌ జహీర్‌యావర్‌ జంగ్‌కు అతిథిగా బషీర్‌బాగ్‌ పాలెస్‌లో ఉన్నప్పుడు వయొలిన్‌ కళాకారుడు పూర్ణచందర్‌ ఆయన వద్ద ఠుమ్రీ వగైరాలు నేర్చుకున్నాడు. నండూరి పార్థసారథి తదితరులు వెళ్ళి కలుసుకున్నారు కూడా. అభిమానులని ఆప్యాయంగా పలకరించి, కోరగానే పాట వినిపించడం ఆయన పెద్ద మనసుకూ,నిరాడంబరతకూ నిదర్శనం.

• అన్నమయ్య

బ్రహ్మ కడిగిన పాదము అన్నమయ్య కీర్తన పూర్ణచందర్, శ్రీరామ్, కె.ఎస్.చిత్ర, అనురాధ
• —
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

రొయ్యూరు గ్రామ చరిత్ర

 రొయ్యూరు గ్రామ చరిత్ర

కృష్ణా జిల్లా కంకిపాడుకు సుమారు పది కిలోమీటర్ల దూరం లోపల కృష్ణా తీరం లో రొయ్యూరు గ్రామం ఉంది .కృష్ణ కరకట్ట పై నుంచి కూడా రొయ్యూరు చేరవచ్చు .షుమారు ఒక శతాబ్దం పూర్వం రొయ్యూరులో రొయ్యూరు జోగిరాజు ,,గోపరాజు అనే సోదరులు ఉండేవారు .ఆర్వెల నియోగులు ,భారద్వాజ గోత్రీకులు .తండ్రి అచ్యుతరామయ్య ,తాత రామరాజు ఈ గ్రామం లో మొదట నివాసులు .జోగిరాజు భగవద్భక్తుడు నిష్టా గరిష్టుడు .,కవి వరేణ్యుడు .కాళ్ళకు గజ్జలు కట్టి చిందులు తొక్కుతూ,ఒక చేతిలో తంబూర ,రెండవ చేతితో తాళం వేస్తూ ,పరవశంగా నృత్య గీతాలు చేస్తూ అభినవ భక్త రామదాసు గా ,కబీరు గా త్యాగయ్య లా ఉండేవాడు.నారదుడో తుంబురుడో అని పించేవాడు .కవి ,భక్తుడు కనుక మొదటగా ఈయన గురించే అందరూ చెప్పుకొనేవారు .

  తానూ రచించిన కీర్తనలను తన్మయా వస్తలో మమరచి గానం చేసేవాడు కవి భక్త జోగిరాజు .తానూ బీద వాడైనా అశక్తుడు అనిఅనుకోకుండా ఊరిలో ఒక దేవాలయం కట్టాలనే సంకల్పం కలిగింది ..సోదరుడు గోప రాజు కూడా ఈ మహత్కార్యానికి అంగీకారం తెలిపాడు .ఈ సోదరులు ప్రతినిత్యం జపతపాలు ,దేవతార్చన నియమం తప్పకుండా చేస్తూ, సీతారామ కల్యాణం ,రామాయణ పారాయణం ,సంతర్పణలు చేస్తూ ఉండేవారు .

 రొయ్యూరు వల్లూరు జమీ లోభాగం కనుక గోపరాజు సంస్థానం లో ఉద్యోగం చేస్తూ ,లౌకిక వ్యవహార దక్షుడయ్యాడు .ప్రజలలో సోదరులకు మంచి పేరు ప్రతిష్టలు ఉండటం ,కార్య దక్షులవటం వలన జమీందారు సాయంతో ,ప్రజా సహకారం తో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ,శ్రీ పార్వతీ సమేత శ్రీ సకలేశ్వరాలయం అద్భుతంగా నిర్మించి నిత్య పూజాదికాలకు అన్ని ఏర్పాట్లు చేశారు .వీరు నిర్మించిన శేష తల్ప విమానం కల విష్ణ్వాలయం ,శివాలయం అత్యంత శిల్ప శోభితం .తమ స్వంత ఈనాము నుంచి కొంత పోలముకూడాస్వామివార్లకు సమర్పించారు .

  వీరికి గురువులు వైష్ణవులు .తమకున్న గురుభక్తిని ప్రకటిస్తూ గురువుగారిపై ఒక అనేక  గ్రంథాలు  రాసి సమర్పించారు ,వీరు రాసిన వేణుగోపాలశతకం లో మూడవ పద్యం లో వీరి గురుభక్తి ప్రత్యక్ష మౌతుంది .-

సీసపద్యం –‘’శ్రీరామ తారక సేవాభి రతుడనై –ముందు విష్వక్సేన మూర్తి దలచి

పరమ త్రైలోక్య దీపాంకుర జనని యైన –త్రివిధంబు మెలగు ఇందిరకు మొక్కి

రామానుజాచార్య రాజితాళ్వారాది-పరమ వైష్ణవులకు ప్రణతి జేసి

తిరుమల పురిహళ్ళదేశకాన్వయ కంధి –సోముడౌ రఘునాధ సూరి సూను

గీ-రాఘవా చార్య కృపను విరాజితముగ-సన్ను తి౦చెద నిన్ను

భూరి గుణ జాల రొయ్యూరి పురవిలోల –వేణు గోపాల శ్రీలోల విజయ శీల’’.

  గురుదేవులకు పది ఎకరాల ఈనాం భూమిని కూడా ఇచ్చి తమ గురుభక్తి చాటుకున్నారు .జోగిరాజకవి రాసిన ‘’పారిజాతాపహరణం ‘’మొదలైన కావ్యాలను తానె అచ్చు వేయించి ఇస్తానని గురువు తీసుకొని వెళ్లి , ప్రచురించలేదు .తిరిగి కవి గారికి ఇవ్వనూ లేదు .ఒకరకంగా పంగనామాలు పెట్టాడు .అదొరకమైన ‘’కైంకర్యం’’ అని పించింది .ఆ వంశ పారంపర్యంగా పునర్లిఖి౦పబడిన,కొంపల్లి కాగితములపై వ్రాయబడిన గోపాల శతకం ,హనుమంత శతకం ,వామన విజయం ,,కీర్తనలు ,పాటలు మాత్రం తమకు దక్కాయని రొయ్యూరు గురించి రాసిన శ్రీ రొయ్యూరి రామ చంద్ర ప్రసాద రావు బాధతో తెలిపారు .

 రొయ్యూరు గురించి నా జ్ఞాపక శకలం –  వత్సవాయి లోసైన్స్ మేస్టర్ గా , ,పెనుగంచి ప్రోలులోనో ,హెడ్ మాస్టర్ గా  వత్సవాయి లోనో పని చేస్తున్నప్పుడు ఒక శనివారం సాయంత్రం స్కూల్ అయ్యాక ,బస్ మీద బయల్దేరి ఉయ్యూరు వస్తూ అంచెలంచెలుగా బస్సులు మారుతూ ,నిద్రమత్తులో జోగుతూ ప్రయాణం చేస్తూ .కంకిపాడు దాకా వచ్చే సరికి రాత్రి సుమారు 9అయింది .అక్కడి నుంచి ఉయ్యూరు రావాలి బస్ లో .కంకిపాడు బస్ స్టేషన్ లో బస్సు ఎక్కాను .మంచినిద్ర మత్తులో ఉన్నాను .ఒక అరగంట తర్వాత బస్ ఆగింది .తీరా చూస్తె అది రొయ్యూరు .ఉయ్యూరు అనుకోని రొయ్యూరు బస్ ఎక్కానని అర్ధమైంది .అక్కడినుంచి మళ్ళీ కంకిపాడు కు రావాలంటే బస్ లేదు .ఏం చేయాలో అర్ధం కాక దిగి అటు ఇటూ తిరుగుతుంటే ఒకాయన గుడిదగ్గర బిజెపి వాళ్ళ సభ జరుగుతోంది .కాసేపట్లో అయిపోతుంది .వాళ్ళ వెహికిల్ లో కంకిపాడు వెళ్ళండి అని చెప్పాడు .అక్కడికి వెడితే తెలిసిన ఆర్ ఎస్ ఎస్ వర్కర్  కనపడ్డాడు .ఆయనకు నా గొడవ చెబితే’’ మా కారు లో డ్రాప్ చేస్తాం మాష్టారూ ‘’అన్నాడు .వాళ్ళ మీటింగ్ పూర్తయి కారు బయల్దేరే సరికి రాత్రి 11దాటింది .వాళ్ళ కారులో కంకిపాడుకు వచ్చేసరికి 11-30అయింది .రోడ్డుమీద వచ్చే పోయే లారీలను ఆపమని చెయ్యి చూపుతూ చివరికి ఏదో లారీ దొరికితే ఉయ్యూరు కుచేరేసరికి  అర్ధరాత్రి 12-30అయింది .ఇదొక తమాషా అనుభవం .  

  గత మూడేళ్ళుగా సరసభారతి నిర్వహించే త్యాగరాజ ఆరాధనోత్సవం లో శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారితో పాటు రొయ్యూరి సురేష్ అనే ఆయనకూడా వచ్చి పాల్గొని చక్కగా గానం చేసేవారు .ఈ రొయ్యూరు కు చెందిన వారేమో తెలీదు .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-274• 274-బాపు గారిక్ క్లాసిక్ ‘’త్యాగయ్య ‘’సింగీతం గారి అమెరికా అమ్మాయి ,పంతులమ్మ ,సాంబశివరావు ఇంటింటి రామాయణం నిర్మాత -నవతా కృష్ణం రాజు

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-274
• 274-బాపు గారిక్ క్లాసిక్ ‘’త్యాగయ్య ‘’సింగీతం గారి అమెరికా అమ్మాయి ,పంతులమ్మ ,సాంబశివరావు ఇంటింటి రామాయణం నిర్మాత -నవతా కృష్ణం రాజు
• నడింపల్లి కృష్ణంరాజు ప్రముఖ తెలుగు చలనచిత్ర నిర్మాత. ఇతడు నవతా కృష్ణంరాజుగా ప్రసిద్ధుడు. ఇతడు తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం మండలానికి చెందిన వన్నె చింతలపూడి గ్రామంలో ఒక సంపన్న భూస్వాముల కుటుంబంలో జన్మించాడు[1]. ఇతడు ఏలూరులో డిగ్రీ చేశాడు. హైస్కూలులో చదువుతున్నప్పుడే ఇతనికి సాహిత్యం పట్ల అభిరుచి ఏర్పడింది. ఎం.ఎన్.రాయ్, రస్సెల్ ల తాత్విక చింతనను అలవరచుకుని అభ్యుదయవాదిగా గుర్తింపు పొందాడు. ఇతడు సినిమా రంగంలో ప్రవేశించే ముందు అమలాపురంలో సిమెంట్, ఎరువులు, ముడి ఇనుము వ్యాపారం చేశాడు. కొన్నాళ్ళు విశాఖపట్టణంలో కాంట్రాక్టు వ్యాపారం చేశాడు.
సినిమా రంగం
ఇతడు మొదట 1964లో మంచి మనిషి సినిమాకు భాగస్వామిగా చిత్రరంగంలో ప్రవేశించాడు. నవతా ఆర్ట్ పిక్చర్స్ అనే సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ర్‌గా ఉంటూ పలు సినిమాలు నిర్మించాడు. ఈ సంస్థ పేరు మీదుగా ఇతని పేరు నవతా కృష్ణంరాజుగా స్థిరపడిపోయింది. ఇతడు స్తోమత, దక్షత, పథకం, పద్దతీ ఉన్న నిర్మాతగా పేరుగడించాడు. అమెరికా అమ్మాయి, పంతులమ్మ, ఇంటింటి రామాయణం వంటి చిత్రాలను తీసి అభిరుచి కలిగిన నిర్మాతగా పేరు సంపాదించుకున్నాడు నవత కృష్ణంరాజు.[2] ఆయన ఇ.వి.వి.సత్యన్నారాయణను కనకాల దేవదాసు క్రింద ఓ ఇంటి భాగోతం సినిమాకు సహాయదర్శకునిగా అవకాశం ఇప్పించాడు.[3]
ఇతడు నిర్మించిన కొన్ని సినిమాల జాబితా:
• త్యాగయ్య
• జమీందార్ గారి అమ్మాయి
• అమెరికా అమ్మాయి
• పంతులమ్మ
• ఇంటింటి రామాయణం
• ఓ ఇంటి భాగోతం
• నాలుగు స్తంభాలాట

• నవతా కృష్ణం రాజు గారిది ఆమలాపురం. ఆయన అసలు పేరు నడిమిపల్లి కృష్ణంరాజు. ఆక్కడ వ్యాపారం చేసుకుంటున్న ఆయన్ని స్నేహితులు కొందరు సినిమాల్లోకి తీసుకువచ్చారు. 1964 లొ మంచి మనిషి సినిమా ని తాతినేని చలపతి రావు గారు ఇంకొంతమంది స్నేహితులతో కలిసి మొదలు పెట్టారు. కాని కొన్ని ఆర్ధిక సమస్యల వల్ల ఆ సినిమా మధ్యలొ ఆగి పోయింది. అప్పుడు దాని దర్శకుడు కె.ప్రత్యగాత్మ గారు కృష్ణం రాజు గారి స్నేహితులు అవడం చేత, ఆ సినిమాకి కొంచం సహాయం చెయ్యమని చెప్పారు. దాంతో ఆ సినిమా కి పెట్టుబడి పెట్టడంతో కృష్ణం రాజు గారి చిత్ర రంగ ప్రవేశం జరిగింది. కాకపోతే ఆయన పేరు ఎక్కడా కనపడదు ఆ సినిమా టైటిల్స్ లో. అప్పటి నుంచి సినిమాలలో అడపా దడపా పెట్టుబడి పెట్టిన కృష్ణం రాజు గారు 1975 లొ నవతా ఆర్ట్స్ స్థాపించి అప్పుడే దర్శకుడిగా పేరు తెచ్చుకుంటున్న సింగీతం గారిని దర్శకుడిగా, రంగనాథ్ నాయకుడిగా జమీందార్ గారి అమ్మాయి సినిమా మొదలు పెట్టారు. ఆ సినిమా పది పదిహేను రోజులు షూటింగ్ జరిగాక ఎస్.వి.రంగారావు గారు హఠాత్తుగా మరణించారు. దాంతో ఆ భాగం అంతా మళ్ళీ గుమ్మడి గారితో చిత్రీకరించారు. (మ్రోగింది వీణా పదే పదే హృదయాల లోనా పాట గుర్తు ఉందా, అది ఆ సినిమాలోదే ). ఆ చిత్రం కొన్ని కేంద్రల్లో వందరోజులాడింది.
•    ఈ వివి సత్యనారాయణకు పట్టినఅదృష్టం
• ఈవీవీ.  :
• తన సినిమా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఆలోచన రావడంతోనే   స్నేహితుడు  సుబ్బరాజు (నిర్మాత `నవత` కృష్ణంరాజు మేనల్లుడు) సిఫార్సు లేఖతో మదరాసు రైలెక్కారు ఈవీవీ. `రాజు`గారిని కలిశారు. సినిమా రంగం గురించి  ఈవీవీకి గల   అవగాహనపై   `రాజు`గారు వేసిన ప్రశ్నలకు సరైన సమాధానం రాలేదు.`సినిమారంగ ప్రవేశం, అందులో నిభాయించుకురాగలగడం అంత సులువు కాదు. ఊరెళ్లి ఏదో చేసుకోవడం మంచిది`అని  కృష్ణంరాజు హితవు చెప్పినా, తిరుగు ప్రయాణానికి మనస్కరించలేదు.  ఉన్న పొలం కాస్త అమ్ముడైపోయింది.ఇప్పుడు వెళ్లి చేసేదేముంది?అనుకొని..రోజూ మద్రాసు వీధుల్లో చక్కర్లు కొడుతూ రాజుగారి కార్యాలయం గేటు దగ్గర నిలబడటం రోజువారీ కార్యక్రమంగా మారిందట. దాదాపు నెల రోజులపాటు  ఆయన తీరు, పట్టుదలను గమనించిన కృష్ణంరాజుకి ఏదైనా  సహాయం చేయాలనిపించింది. దర్శకత్వ శాఖలో పనిచేయలన్న కోరికను మన్నించి  తాను నిర్మిస్తున్న `ఓ ఇంటి బాగోతం` (దేవదాసు కనకాల దర్శకత్వం) చిత్రానికి  అవకాశం  కల్పించారు. అటు తర్వాత దాసరి నారాయణరావు,  బాలచందర్ వద్ద సహాయ దర్శకుడిగా చేరేందుకు ఈవీవీ ప్రయత్నించారు. వారి ఖాళీలు లేక మళ్లీ `నవత`రాజు గారినే ఆశ్రయించారు.

• నవతా ఆర్ట్స్ పతాకంపై ఎన్.కృష్ణంరాజు నిర్మించిన ‘పంతులమ్మ’ చిత్రంలోని ‘మానస వీణా మధుగీతం/ మన సంసారం సంగీతం/ సాగర మథనం/ అమృత మధురం/ సంగమ సరిగమ స్వర పారిజాతం’ పాట నాకు చాలా ఇష్టం. ఈ పాట వినేకొద్దీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. బహుశ ఈ పాటను ఇష్టపడని వాళ్లు ఉండరేమో. వేటూరి రాసిన ఈ పాటకు సంగీతద్వయం రాజన్- నాగేంద్ర అద్భుతమైన బాణీ అందించారు. బాలు- సుశీల తమ గాత్రాలతో శ్రోతలను మైమరిపించారు. భార్యాభర్తల అన్యోన్య దాంపత్యానికి సంబంధించిన ఈ పాటను కళాకారులు అందరూ ఎవరికివారు పోటీపడి చిరస్థాయిగా నిలిచేలా తీర్చిదిద్దారు. ‘కానుకలేమి నేనివ్వగలను/ కన్నుల కాటుక నేనవ్వగలను’, ‘శతవసంతాల దశ దిశాంతాల సుమ సుగంధాల భ్రమరనాథాల కుసుమించు నీ అందమె విరిసింది అరవిందమే, కురిసింది మకరందమై’ అంటూ బాలు మధురమైన కంచుకంఠంలో పాట వింటున్నపుడు కలిగే ఆనందాన్ని మాటల్లో ఎలా చెప్పగలం. సింగితం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన పంతులమ్మ సినిమాలో అన్ని పాటలూ బాగుంటాయి. ముఖ్యంగా ఈ పాట మరీను. ఈ పాట చిత్రీకరణలో వైవిధ్యం చూపారు. రంగనాథ్, దీప సహజమైన నటన ప్రదర్శించారు. వాళ్ల సంసారంలో సంగీతం నిజంగానే మానసవీణ మీద మధుగీతం వింటున్నట్టు అనిపిస్తుంది. గొప్ప పాట, అంతకంటే ఏం చెప్పలేం.

• హాలీవుడ్‌లో నిర్మాతకు 8 శాతం వడ్డీకే రుణం లభిస్తోంది. అదే ఇక్కడ 18 శాతం. డబ్బు విషయం వస్తే నవతా కృష్ణంరాజు మాట గుర్తుకు వస్తుంది. 1977లో ఓ మాట అన్నారు – ‘‘మా రోజుల్లో మంచి కథ ఎవరు రాస్తారు? ఎక్కడ దొరుకుతుందని వెతికేవాళ్ళం. నేడు కొత్తగా రంగంలోకి దిగుతున్న వారిలో అధిక భాగం ఫైనాన్సియర్ అడ్రసు అడుగుతున్నారు’’ అని! నిర్మాత నవతా కృష్ణంరాజు గదిలో ఆయనకు ఎదురుగా సత్యజిత్ రే, సుందరయ్య చిత్రపటాలుండేవి. అవి ఆయన జీవిత దృక్పథానికి దర్పణాలు.


• అమెరికా అమ్మాయి

అనగానే మనకి గుర్తు వచ్చేది పాడనా తెలుగు పాట అన్న పాట లేక పొతే ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా అన్న పాట. అమెరికా అమ్మాయి గా వేసింది ఫ్రెంచ్ అమ్మాయి దేవయాని . దేవయాని కి గత సంవత్సరం భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చారు.. ఆ సినిమా గురించి కొన్ని విశేషాలు …
• అనగానే మనకి గుర్తు వచ్చేది పాడనా తెలుగు పాట అన్న పాట లేక పొతే ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా అన్న పాట. అమెరికా అమ్మాయి గా వేసింది ఫ్రెంచ్ అమ్మాయి దేవయాని . దేవయాని కి గత సంవత్సరం భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చారు.. ఆ సినిమా గురించి కొన్ని విశేషాలు …

నవతా కృష్ణం రాజు గారిది ఆమలాపురం. ఆయన అసలు పేరు నడిమిపల్లి కృష్ణంరాజు. ఆక్కడ వ్యాపారం చేసుకుంటున్న ఆయన్ని స్నేహితులు కొందరు సినిమాల్లోకి తీసుకువచ్చారు. 1964 లొ మంచి మనిషి సినిమా ని తాతినేని చలపతి రావు గారు ఇంకొంతమంది స్నేహితులతో కలిసి మొదలు పెట్టారు. కాని కొన్ని ఆర్ధిక సమస్యల వల్ల ఆ సినిమా మధ్యలొ ఆగి పోయింది. అప్పుడు దాని దర్శకుడు కె.ప్రత్యగాత్మ గారు కృష్ణం రాజు గారి స్నేహితులు అవడం చేత, ఆ సినిమాకి కొంచం సహాయం చెయ్యమని చెప్పారు. దాంతో ఆ సినిమా కి పెట్టుబడి పెట్టడంతో కృష్ణం రాజు గారి చిత్ర రంగ ప్రవేశం జరిగింది. కాకపోతే ఆయన పేరు ఎక్కడా కనపడదు ఆ సినిమా టైటిల్స్ లో. అప్పటి నుంచి సినిమాలలో అడపా దడపా పెట్టుబడి పెట్టిన కృష్ణం రాజు గారు 1975 లొ నవతా ఆర్ట్స్ స్థాపించి అప్పుడే దర్శకుడిగా పేరు తెచ్చుకుంటున్న సింగీతం గారిని దర్శకుడిగా, రంగనాథ్ నాయకుడిగా జమీందార్ గారి అమ్మాయి సినిమా మొదలు పెట్టారు. ఆ సినిమా పది పదిహేను రోజులు షూటింగ్ జరిగాక ఎస్.వి.రంగారావు గారు హఠాత్తుగా మరణించారు. దాంతో ఆ భాగం అంతా మళ్ళీ గుమ్మడి గారితో చిత్రీకరించారు. (మ్రోగింది వీణా పదే పదే హృదయాల లోనా పాట గుర్తు ఉందా, అది ఆ సినిమాలోదే ). ఆ చిత్రం కొన్ని కేంద్రల్లో వందరోజులాడింది.

ఇక అమెరికా అమ్మయి సినిమా గురించి…
సింగీతం గారు తమిళం లో వచ్చిన మేల్నాట్టు మరుమగల్ సినిమా చూడటం సంభవించింది. అది తమిళం లో ఒక మోస్తరుగా ఆడిన సినిమా కాని, కొన్ని మార్పులు చేస్తే తెలుగు లో బాగా ఆడుతుంది అని అనుకుని, తన దర్శకత్వంలో సినిమా తియ్యలి అని వచ్చిన సత్యనారాయణ గారితో చెప్పారు. ఆయనకి అది అంతగా నచ్చలేదు. (తరవాత అయన సింగీతం గారి దర్శకత్వం లో శ్రీ సుబ్రమణ్యేశ్వర బ్యానర్ మీద సొమ్మొకడిది సోకొకడిది తీశారు). అప్పుడే నవతా కృష్ణం రాజు గారు కూడా ఆ సినిమా చూసి ఇది చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు. అప్పుడు ఆ చిత్రం హక్కులు కొని సింగీతం గారితో కథా చర్చలు మొదలు పెట్టారు. సింగీతం గారు, గొల్లపూడి గారు తమిళ సినిమా కి చాలా మార్పులు చేర్పులు చేసి కథా సంవిధానాన్ని సిద్ధం చేశారు
.
జమీందార్ గారి అమ్మాయి లో నాయకుడిగా వేసిన రంగనాథ్ ని ఒక నాయకుడిగా, శ్రీధర్ ని ఇంకో నాయకుడిగా అనుకున్నారు. తమిళం లో శివకుమార్ (గజిని ఫేం సూర్య తండ్రి) శ్రీధర్ పాత్ర పోషించగా, కమలహాసన్ పాత్ర తెలుగు లో రంగనాథ్ పోషించాడు. తమిళ్ లో కమలహాసన్ పక్కన వేసింది జయసుధ. ఒక పాటలో కమల్ తో నృత్యం చేసింది వాణీ గణపతి (నాకు తెలిసీ ఆ అమ్మాయిది ఇది ఒక్కటే సినిమా.) తెలుగులో ఆ పాత్ర కి అప్పుడే మలయాళం లో ఒక సినిమా చేసిన దీపని తీసుకున్నారు. (దీప అసలు పేరు ఉన్ని మేరి, అప్పట్లో కేరళ లో అందాల పోటి లో ప్రధమురాలిగా వచ్చింది) తమిళం లో అమెరికా అమ్మాయి గా చేసిన అమ్మాయి కి వీసా అయిపోవడం తో ఇంకో కొత్త అమ్మాయి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక డాన్స్ స్కూల్లో చూసి ఒక ఫ్రెంచ్ అమ్మాయి ని ఎన్నిక చేసారు. ఆ అమ్మాయి ఈ సినిమా చెయ్యాలి అంటే ఒకతే షరతు పెట్టింది. అది చిదంబరం ఆలయం లో తను ఆరంగేట్రం చెయ్యాలి అని. సరే అని వెంపటి చిన సత్యం గారి తో శిక్షణ ఇప్పించి చిదంబరం ఆలయం లో ఆనంద తాండవమాడె పాట ని చిత్రీకరించారు. అది దాదాపు గా ఒక వారం జరిగింది. అక్కడ నుంచి వచ్చాక మద్రాస్ లో రెండు రోజులు సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగింది. ఆ తరవాత ఆ అమ్మాయి హఠాత్తుగా మాయమయ్యింది. వీళ్ళు కంగారు పడి చచ్చీ చెడి కనుక్కుంటే ఆ అమ్మాయి కి కూడా వీసా అయిపోవడం వల్ల వాళ్ళ దేశం వెళ్ళిపోయిందని తెలిసింది. దాంతో హతాశులయ్యారు (ప్రతీ సినిమాకీ ఈ పది రోజుల గండం ఏంటిరా బాబూ అని ).

మళ్ళీ నాయిక కోసం వేట మొదలు పెట్టారు. అప్పుడు ఏనుగుల సీతారామారావు గారు అని కృష్ణం రాజు గారి స్నేహితుడు ఒకాయన ఉండేవారు, ఆయన ప్రభుత్వ సాంస్కృతిక శాఖ లో పని చేసేవారు. ఆయన వీధిలోనే దేవయాని గారు ఉండేవారు. దేవయాని కూడా ఫ్రాన్స్ నుంచి డాన్స్ నేర్చుకోవడానికి ఇండియా వచ్చారు. అలా దేవయాని గురించి తెలిసిన సీతారామ రావు గారు కృష్ణం రాజు గారి కి చెప్పడం, కృష్ణం రాజుగారు సింగీతం గారు మద్రాస్ లో జరిగిన దేవయాని ఆరంగేట్రం చూడటం జరిగింది.

దేవయాని సినిమా లో అవకాశం అనగానే ఎగిరి గంతెయ్యలేదు. ముందర చెయ్యగలనా అని సందేహించారు. సింగీతం గారు, కృష్ణం రాజు గారు ఒప్పించి ఆమెతో సినిమా మొదలు పెట్టారు. సినిమా గురించి మాట్లాడుతూ దేవయాని ” సినిమాలో నేను ఫ్రాన్స్ నుంచి, దీప మలయాళం నుంచి, బాలు మహేంద్ర గారు మద్రాస్ నుంచి, మిగిలిన వాళ్ళు అంతా దాదాపుగా ఆంధ్రా నుంచి, దాంతో చిత్రమైన కలయికగా ఉండేది. దీపకి, నాకు ఇదే మొదటి సినిమా కావడం వల్ల కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవం, కాని అందరు బాగా సహకరించడం తో అది పెద్ద అడ్డంకి అనిపించలేదు, నాట్యం కోసం అప్పటికే సంస్కృతం నేర్చుకోవటం వల్ల తెలుగు పలకడం కొంచెం సులువు అయ్యింది, అందువల్లే పాడనా తెలుగు పాట కి లిప్ సింక్ అంత బాగా వచ్చింది” అన్నారు. ఈ సినిమా కోసం నేను కూచిపూడి నాట్యరీతులని శ్రీ వెంపటి చినసత్యం గారి దగ్గర నేర్చుకున్నాను. అంత పెద్ద వారి దగ్గర శిక్షణ దొరకడమన్నది ఒక అదృష్టమని చెప్పాలి. ఆనంద తాండవం పాటకి సత్యనారాయణ గారి దగ్గర అప్పుడు సహాయకురాలిగా శ్రీమతి శోభా నాయుడు గారు పని చేసారు అది ఇంకో తీపిగుర్తు” అని ఆ సినిమా గురించి అన్నారు ఆవిద. ఈ సినిమా హిట్ అయ్యాక ఆవిడకి చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చినా ఆవిడ నృత్యం మీదే కేంద్రీకరించారు తన దృష్టిని. ఆవిడ వదిలేసిన ఆవకాశాల్లో కమలహాసన్ సినిమా నుంచి రాము కరియత్ సినిమా వరకూ ఉన్నాయి.

రంగనాథ్ మాట్లాడుతూ ” నవతా సంస్థ ఒక రకంగా నాకు మాతృ సంస్థ లాంటిది. నేను చాలా సినిమాల్లో చేశాను, కొన్ని చిత్ర సంస్థల ఆఫీసు కూడా ఎక్కడ ఉంటుందో తెలీదు నాకు, కాని నవతా సంస్థ కార్యాలయానికి మాత్రం కథా చర్చల్లో కాని, ఊరికే కలవడానికి కాని ఎదో ఒక రకం గా వెళ్ళేవాడిని. నవతాలో నేను చేసిన సినిమాలు అన్నీ సంగీత పరంగా నాకు మంచి పేరుని తీసుకువచ్చాయి. (జమీందార్ గారి అమ్మాయి, అమెరికా అమ్మాయి, పంతులమ్మ, ఇంటింటి రామాయణం వగైరా). అప్పట్లో మేము ఎంతమంది హీరోలు సినిమాలో అని చూసే వాళ్ళం కాదు, మనకి ఇచ్చిన పాత్ర బాగుందా లేదా అని చూసేవాళ్ళం. సింగీతం గారి స్కూల్ డిఫరెంట్ గా ఉండేది. అంతకు ముందర నేను చేసిన రెండు సినిమాల దర్శకులు ఒక రకంగా చెబితే ఈయన ఇంకో రకంగా చెప్పేవారు. నటనలో కొంచెం ఎక్కువ కాదు, కొంచెం తక్కువ కాదు సరిగ్గా ఉండాలి అని చెప్పేవారు. కొంచెం ఎక్కువ అనిపిస్తే ఇది ఎక్కువ అయింది అనేవారు, లేదంటే కొంచెం తక్కువ అయింది అనేవారు. ఆయన చాలు అంటే మనం సరిగ్గా చేసినట్టని అర్ధం. సినిమాలో నాకు మూడు పాటలు ఉన్నా, నాకు మాత్రం ఒక వేణువు వినిపించెను పాట మీద మక్కువగా ఉందేది, నా పాటలు అన్నీ తీసివేసి నాకు ఆ పాట ఇవ్వమని కూడా అడిగాను, కాని నా పాత్రకి ఆ పాట నప్పదు అని ఒప్పుకోలేదు. శ్రీధర్ గారు మంచి స్నేహితులు ఆయ్యారు ఆ సినిమాతో. ఈ సినిమాలో ఒక పాటకి నృత్య దర్శకుడు లేరు. ఆమెతోటి మాటుంది పాటకి సింగీతం గారు వచ్చి ఈ పాటకి నృత్య దర్శకులు లేరు, మీరు నేను కలిసి చేద్దామని నాతో చేయించారు. అంతే కాదు ఈ సినిమాలో నాకు ఎక్కడ మేకప్ లేదు. సినిమాలో ఇద్దరు హీరోయిన్లకీ తెలుగు రాదు, అందులో ఇద్దరికీ మొదటి సినిమా. దీప రోజు రాగానే ఏమండీ మీ భర్త బండలు బాగుండాయ అని అడిగేది… భార్యాబిడ్డలు అని ఆమె అర్థం, దేవయాని పక్కా పర్ఫెక్షనిస్ట్. చాలా కష్టపడేవారు ఆవిడ. ఆవిడకి పద్మశ్రీ వచ్చింది అని విని చాలా సంతోషం వేసింది” అన్నారు.

సినిమాలో పాటలు సాహిత్యం గురించి :
కృష్ణం రాజు గారు ఎక్కువగా రాణి బుక్ హౌజ్ దగ్గర సాయంకాలాలు గడిపేవారు. (రాణి బుక్ హౌజ్ యజమాని అట్లూరి పిచ్చేశ్వర రావు గారు రచయిత, భార్యా భర్తలు, చివరకు మిగిలేది లాంటి సినిమాలకి మాటలు కూడా రాశారు). ఆకొట్టు చాలా మంది రచయితలకు సాయంకాలాల సమావేశాలకి విడిది గా ఉండెది. కృష్ణం రాజు గారికి పాటల రచయిత గోపి గారితో అక్కడే పరిచయం. గోపీ గారు ఈ సినిమాకి రాసిన ఒక వెణువు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు కదా..

అలాగే పాడనా తెలుగు పాట ని కృష్ణ శాస్త్రి గారు రాశారు. అప్పటికే ఆయనకి మాట కొంచెం కష్టంగా ఉండేది. ఆ పాట కోసం రోజూ గాయకుడు ఆనంద్ వెళ్ళి ఆయనని కలిసే వారు. అలా దేవులపల్లి వారి తో పరిచయం కలగడం తన అదృష్టం అంటారు ఆనంద్. గాయకుడిగా ఆనంద్ కి ఇది ఒక రకంగా మొదటి సినిమా, ఇంకో రకంగా రెండో సినిమా. ఆనంద్ మొదటి సినిమా నిజానికి పండంటి కాపురం, ఆ సినిమాలో కోరస్ పాడారు. సింగిల్ గా పాడిన మొదటి సినిమా అమెరికా అమ్మాయి. ఈ సినిమాలో పాటతో తన సినిమా ప్రస్థానం మొదలు పెట్టడం తన అదృష్టం అంటారు ఆనంద్.
దాని గురించి మాట్లాడుతూ ” అప్పట్లో చంద్రమోహన్ ఇంట్లో పండగలు ఒక వేడుకలా చేసే వారు, దానికి చాలా మంది సినిమావాళ్ళు వచ్చేవారు. నా స్నేహితుడు మేడిశెట్టి అప్పారావు నన్ను ఒక పండగకి అక్కడికి లాక్కెళ్ళాడు. నేను అప్పుడే మద్రాస్ వచ్చి అవకాశాలకోసం ప్రయత్నిస్తున్న రోజులు. మా వాడి ప్రోద్బలం తో నేను అక్కడ ఒక పాట పాడాను. ఆ పాట వింటూ ఒకాయన నిలబడిపోయారు. పాట అయ్యాక ఆయన మర్నాడు నవతా కార్యాలయానికి వచ్చి కనపడమన్నారు, ఆయనే నవతా కృష్ణం రాజు గారు. మర్నాడు కార్యాలయానికి వెళ్ళగానే ఆయన జీ.కె.వెంకటేశ్ గారికి నన్ను పరిచయం చేశారు. వెంకటేశ్ గారు నన్ను ఒకటి రెండు పాటలు పాడమని, నేను పాడాక విని తప్పకుండా నీకు అవకాశం ఉంటుంది అని మాట ఇచ్చారు.

తరవాత నాకు కృష్ణశాస్త్రి గారి దగ్గర నుంచి పాట తెచ్చే పని అప్పగించారు. రోజూ కృష్ణశాస్త్రి గారి దగ్గరకి వెళ్ళడం ఆయన్ని పాట గురించి అడగటం, అలా ఆయనతో పరిచయం జరగడం జరిగింది. నా పాట నచ్చి ఆయన నా గురించి మహాదేవన్ గారికి రికమండ్ చేస్తూ ఒక ఉత్తరం రాసి ఇచ్చారు. అలా ఈ సినిమా తరవాత నాకు బంగారక్క సినిమాలో మహదేవన్ గారి సంగీత దర్శకత్వం లో దూరాన దూరన తారా దీపం పాట పాడే అవకాశం వచ్చింది.

ఈ సినిమాలో దాదాపు అన్ని పాటలు అయిపోయాయి, అన్ని పాటలు బాలు గారు, సుశీల గారు పాడేశారు, ఒక పాట ఏమొ రమేశ్ పాడారు (రమాప్రభ, రాజబాబు మీద డార్లింగు లింగు లిటుకు పాట) ఇంకా ఒక్క పాటె ఉంది, నాకేమో టెన్షన్ ఇంకా పాడించరేమో అని. వెంకటేశ్ గారు అప్పుడు నాకు ఒక వేణువు పాట ట్యూన్ ఇచ్చి సాధన చెయ్యమన్నారు. సినిమాలో మిగిలిన పాటలేమో హుషారయిన పాటలు ఇదేమో కొంచెం స్లో గా ఉంది, ఈ పాట అసలు జనాలు గమనిస్తారొ లేదో కూడా అని సందేహం వచ్చింది, కాని సాధన చేసేవాడిని. ఇది వెంకటేశ్ గారు గమనించారు, ఒక రోజు నన్ను ఇంటికి తీసుకువెళ్ళి మెహదీ హసన్ గారు పాడిన గజల్ వినిపించి ఆ పాటకి ఉన్న సంగీతం దాని ప్రాముఖ్యత వివరించారు, అప్పుడు అర్ధం అయింది ఆ పాట కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో. ఆ పాట రికార్డింగ్ అయ్యాక విన్నవారు అందరూ, పాట బాగుంది కాని బాలు గారు పాడితే ఇంకా ఎంత బాగుండేదో అని అనడం మొదలు పెట్టారు, ఇది విని నాకు మళ్ళీ టెన్షన్ మొదలయ్యింది. వెంకటేశ్ గారి దగ్గరకి వెళ్ళి భయపడుతూనే ” సార్ నా పాట వుంటుందాండీ” అని అడిగాను. ఆయన అభయహస్తం ఇచ్చి పాటలన్నింటిని వెంటనే ఆడియో కంపనీకి పంపేశారు. అలా నా మొదటి పాట వెంకటేశ్ గారి దయవల్ల వెలుగు చూసింది. అలా అమెరికా అమ్మాయి సినిమాకి పాడిన వేళావిశేషం, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. మా అబ్బాయికి అమెరికాలో అమ్మాయి పుట్టింది. ఇలా ఇప్పుడు మా ఇంట్లోనే ఒక అమెరికా అమ్మాయి ఉంది” అన్నారు నవ్వుతూ. ఆనంద్ గారు చెప్పని ఇంకో విశేషం కూడా ఉంది. అమెరికా అమ్మాయికి గాత్రధారణ చేసింది సుజాత గారు. అప్పట్లో ఉషా ఉథుప్ పాడిన పాట ఆవిడ పాడటం చూసి కృష్ణం రాజు గారు ఈ అమ్మాయి ఐతే అమెరికా అమ్మాయికి గాత్రానికి సరిపోతుంది అని భావించి ఆ అమ్మాయితో డబ్బింగ్ చెప్పించారు. సుజాత డబ్బింగ్ చెప్పింది ఈ ఒక్క హిత్రానికే. అప్పటికీ ఆనంద్ కి ఆవిడకి పరిచయం లేదు. తరవాత ఆవిడ ఆనంద్ కి శ్రీమతి అయ్యారు. అలా అమెరికా అమ్మాయి ఆనంద్ గారి జీవితంలో ఒక ముఖ్య మలుపుకి కారణం అయ్యింది. దీపకి గాత్ర దానం చేసింది దుర్గ. ఇప్పుడు దుర్గ కూతురు కూడ ఒక లీడింగ్ డబ్బింగ్ ఆర్టిస్టు.

శరత్ బాబు కి మలుపు తెచ్చిన చిత్రం. :
శరత్ బాబు అప్పటికి నాలుగైదు సినిమాల్లో నాయకుడిగా వేసాడు. అందువల్ల ఈ సినిమాలో ప్రతినాయకుడి వేషం వస్తే, చెయ్యాలా వొద్దా అని సందేహిస్తుంటే గాయకుడు ఆనంద్ బలవంత పెట్టి ఒప్పించారు (ఆనంద్, శరత్ బాబు రూంమేట్స్ అందువల్ల ఆ చనువు ఉంది వాళ్ళ ఇద్దరి మధ్య.) ఈ సినిమా డబ్బింగ్ జరుగుతున్నప్పుడు బాలచందర్ గారి సినిమా కి కూడా అదే ధియేటర్ లో డబ్బింగ్ జరుగుతుంది. ఒక రోజు శరత్ బాబు, రంగనాథ్, దుర్గ డబ్బింగ్ ధియేటర్ లో ఉన్నప్పుడు, బాలచందర్ గారు చూడటం జరిగింది. ఎర్రగా పొడవుగా ఉన్న ఈ కళ్ళద్దాల అబ్బాయి గురించి ఆరా తీసారు బాలచందర్ గారు. శరత్ బాబు ఉన్న సన్నివేశాలు అన్ని అచ్చి బాబు (నవతా కృష్ణం రాజు గారి అబ్బాయి ) వేసి చూపించారు బాలచందర్ గారికి. తరవాత సినిమా ఫంక్షన్ లో సింగీతం గారు, శరత్ బాబు ని తీసుకెళ్ళి పరిచయం చేసారు. ఆ వేళా విశేషం వల్ల బాలచందర్ గారి సినిమాల్లో దాదాపుగా అన్నిటిలో ఉన్నారు శరత్ బాబు. బాలచందర్ గారు తమిళం లో నే కాక శరత్ బాబు ని కన్నడ సినిమాల్లో కి కూడా పరిచయం చేసారు.

ఇతర విశేషాలు”
– ఇది రంగనాథ్‌కి అయిదో సినిమా. (చందన, చదువు-సంస్కారం, జమీందారుగారి అమ్మాయి, ఒక దీపం వెలిగింది, అమెరికా అమ్మాయి)
– ఇది దర్శకుడిగా సింగీతం గారికి కూడా ఐదో సినిమా (నీతి-నిజాయితీ, దిక్కట్ర పార్వతి, జమీందారుగారి అమ్మాయి, ఒక దీపం వెలిగింది, అమెరికా అమ్మాయి)
– సినిమా కి మొదట్లో పేర్లు వచ్చే అప్పుడు దామెర్ల రామారావు గారి తైలవర్ణ చిత్రాలు పెడితే బాగుంటుంది అని దానికి అనుమతి కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే, బాపు గారు ఆదుకున్నారు. బాపు గారు దామెర్ల గారి దగ్గర అనుమతి తీసుకువచ్చారు. అందువల్ల వారికి ముందుగా కృతజ్ఞతలు ఇచ్చారు సినిమా మొదట్లో.
– సినిమాకి అనుకున్న నిర్మాణ వ్యయం ఎనిమిది లక్షలు. కాని ముందర ఒక అమ్మాయితో కొంత చిత్రీకరణ జరిపాక ఆ అమ్మాయి మధ్యలో వెళ్ళిపోవడం వల్ల నిర్మాణ వ్యయం ఇంకో రెండు లక్షల దాకా పెరిగింది.
దాదాపు నలభై ఐదు రోజుల్లో నిర్మాణం పూర్తి చేసుకుంది.
– చిదంబరం, ఊటీ, మద్రాస్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుందీచిత్రం.
– రంగనాథ్ పారితోషికం పదివేలు, శ్రీధర్, దేవయాని పారితోషికం చెరో పదిహేను వేలు, దీపకి ఐదు వేలు పారితోషికం. చిత్ర ముఖ్య నాయకుడితో సమంగా పారితోషికం తీసుకున్నది బాలు మహేంద్ర.
– ఈ సినిమాకి జీ.కె.వెంకటేశ్ కి సహాయకులుగా చేసింది ఎల్.వైద్యనాథన్ (పుష్పక విమానం సినిమాకి, ఆర్.కె.నారాయణ్ మాల్గుడి డేస్ కి సంగీతం అందించినదీ ఈయనే). మరొకరు ఇళయరాజా. అప్పట్లో వెంకటేశ్ గారి దగ్గర మ్యూజిక్ కండక్టర్ గా ఎల్.వైద్యనాథన్ గారు, కంపోజింగ్ అసిస్టెంట్ గా ఇళయరాజాగారు ఉండేవారు.
శరత్ బాబు ఈ సినిమాలో వేషం చేయాలా వద్దా అని సందేహిస్తుంటే, గాయకుడు ఆనంద్ బలవంతపెట్టి ఒప్పించారు. (ఆనంద్, శరత్ బాబు రూమ్మేట్స్ అప్పట్లో). అప్పటికీ ఇంకా రమాప్రభ, శరత్ ల వివాహం జరగలేదు. ఈ సినిమా విడుదల అయ్యాక వారి వివాహం జరిగింది.

ఇక ప్రస్తుతం :
నవతా కృష్ణం రాజు గారు, శ్రీధర్ గారు , రంగనాథ్  మన మధ్య లేరు. రంగనాథ్ గువ్వలజంట సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ప్రస్తుతం అటు సినిమాల్లో ఇటు టీవి లోను నటిస్తూ బిజీ గా ఉన్నారు. శరత్ బాబు, రమాప్రభ విడి పోయి చాలా కాలం అయింది. రమాప్రభ కూడా అటు సినిమాల్లో ఇటు టీవి లోను నటిస్తూ బిజీ గా ఉన్నారు, శరత్ బాబు మగధీర తరవాత మల్లి బిజీ అయ్యి ప్రస్తుతం తెలుగు, తమిళ , కన్నడ సినిమాల్లో బిజీ గా ఉన్నారు. ఆనంద్ గారు (ఈ వ్యాసం రాసే సమయానికి ) అమెరికా లో కొడుకు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయన ఇంకా స్వరమాధురి సంస్థ ద్వారా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. దీప కేరళ లో ఉన్నారు అని అన్నారు. ఆవిడ గురించి కనుక్కుందాం అనుకున్నా ఎవరికీ తెలీదు ఎక్కడ ఉన్నారో. దేవయాని గారికి పోయిన సంవత్సరం భారత ప్రభుత్వం ప్రద్మశ్రీ ఇచ్చి సత్కరించారు. సింగీతం గారు ప్రస్తుతం వరుడు సినిమా లో తాత గారి వేషం వేసారు. ప్రస్తుతం కొత్త సినిమా కి కథా చర్చలు జరుగుతున్నాయి. కృష్ణం రాజు గారి అబ్బాయి అచ్చిబాబు హైదరాబాద్ లో స్థిరపడ్డారు. అయన బాలు గారి పాడుతా తీయగా కార్య క్రమానికి నిర్మాత.

కృతజ్ఞతలు : సింగీతం శ్రీనివాస్ రావు, ,అచ్చి బాబు (కృష్ణం రాజుగారి అబ్బాయి)
•    సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-22-ఉయ్యూరు

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-274
• 274-బాపు గారిక్ క్లాసిక్ ‘’త్యాగయ్య ‘’సింగీతం గారి అమెరికా అమ్మాయి ,పంతులమ్మ ,సాంబశివరావు ఇంటింటి రామాయణం నిర్మాత -నవతా కృష్ణం రాజు –2
• నాగయ్య ‘“త్యాగయ్య’గా నటించి ఆ పాత్రను అజరామరం చేశారన్న సంగతి అందరికీ తెలుసు. అలనాటి నటీమణి, నిర్మాత కృష్ణవేణి “త్యాగయ్య” సినిమాను
నాగేశ్వరరావుతో తీద్దామనుకున్నారు. _“విప్రనారాయణ’లో పరమభాగవతోత్తముడిగా నటించిన నాగేశ్వరరావును వళ్లీ ‘బుద్ధిమంతుడు’లో అన్నగారి పాత్రద్వారా గుర్తుకు తెచ్చిన
బాపురమణలే దానికి తగిన వారనుకుని వారిని అడిగారు. నాగేశ్వరరావుకు కూడా ఆ
పాత్ర అంటే ఇష్టమున్నా అప్పటికి సిద్ధపడలేదు. నాగయ్య నటించిన “బీదల పాట్లు
నాగేశ్వరరావుతో పునర్నిర్మిస్తే అది ఫెయిలయింది. అలాగే గుమ్మడి నటించిన ‘భక్త
పోతని కూడా. నాగేశ్వరరావు అవృటికి అరవయోవడిలో వడుతున్నా
యువకథానాయికలతో పోటీవడి డాన్సు స్టెప్పులు వేస్తూ రొమాంటిక్‌ హీరోగా
వెలుగొందుతున్నారు. ఆ దశలో ముసలిపాత్ర వేయడం ఆయనకు సమంజసం
అనిపించలేదు. కొంతకాలం ఆగి, వేస్తే మంచిదనుకున్నారు.

• అభిరుచిగల నిర్మాతగా పేరుబడ్డ నవతా కృష్ణంరాజు “త్యాగయ్య!
నిర్మించడానికి ముందుకు వచ్చారు. నాగేశ్వరరావు అనుమతించని పక్షంలో కన్నడ
రాజ్‌కుమార్‌తో వేయిద్దామని రమణ అనుకున్నారు. కానీ “శంకరాభరణం” మోజుని
దృష్టిలో పెట్టుకుని కృష్ణంరాజు ఓ ప్రెస్‌మీట్‌లో త్యాగయ్య పాత్ర సోమయాజులు ధరిస్తారని
ఏకపక్షంగా ప్రకటించేశారు. త్యాగయ్య పాత్రపై ఎంతో ప్రేమ పెంచుకున్న నాగేశ్వరరావు
ఇది విని బాధపడ్డారు. “వాయిదా వేయకుండా ఇప్పుడే నటించడానికి మీరు ఒప్పుకుంటే
కృష్ణంరాజుగారికి నచ్చచెపుతాం” అన్నారు నాగేశ్వరరావుకు ఆస్తలైన బాపురమణలు. కానీ కెరియర్‌ను దెబ్బతీసే నిర్ణయం తీసుకోవడానికి నాగేశ్వరరావు వెనుకాడారు.
సోమయాజులుతోనే “త్యాగయ్య తయారయింది.

• నేటి తరానికి తగ్గట్టు 55 త్యాగరాజు కీర్తనలను కుదిస్తూ, ఎన్‌.వి.
బాలసుబ్రహ్మణ్యంతో భావస్ఫోరకంగా, సాహిత్యం అర్థమయ్యే రీతిలో పాడించారు
కె.వి మహదేవన్‌. సినిమా రిలీజుకు ముందే ఆడియో పదివేల రికార్డులు అమ్మి నిర్మాతల
ఆశలను పెంచింది; డిస్ట్రిబ్యూషన్‌ విషయంలో తప్పుడు నిర్ణయాలను తీసుకునేట్లు చేసింది.
త్యాగయ్య సినిమా సంగీతం ఎంత బాగున్నా (ప్రేక్షకుల మనసులను గెలుచుకో
లేకపోయింది. వారు సోమయాజులులో శంకరాభరణం” నాటి రౌద్రాన్నే చూశారు గానీ
నాగయ్యలో కనబడిన సాత్త్వికతను చూడలేకపోయారు. పైగా పోల్చి చూసుకోవడానికి
కాబోలు నాగయ్య ‘త్యాగయ్యిను అప్పుడు పనిగట్టుకుని రిలీజు చేశారు.

• సశేషం
• మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-5-22-ఉయ్యూరు

• —


Posted in సినిమా | Tagged | Leave a comment

రాంగేయ రాఘవ -5(చివరి భాగం )

రాంగేయ రాఘవ -5(చివరి భాగం )

కథలు –నిబద్ధత

సమకాలీన సాంఘిక రాజకీయ సమరశీల ఉద్యమాల ఆందోళనే రాఘవ కథా ప్రపంచం  .వీటిలో జాతీయ పెట్టుబడి దారులు విదేశీ  పెట్టుబడి దారులతో ఎలా మిలాఖత్ అయ్యారో చూపాడు .భూస్వాములు,,పెట్టుబడి దార్లు  రక్షణ కోసం కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారు .జాతీయోద్యమ ప్రతి ధ్వని చర్మకార కార్మికాది శ్రమ జీవులఇళ్ళల్లో భూస్వాముల అకృత్యాలు ,దహనకాండ ,అత్యాచారాలు ,వారి దుర్భర జీవితాలు  వెలుగులోకి తెచ్చాడు .వాటి మూలకారణాలు ,పరిష్కార మార్గాలు కూడా సూచించాడు .ప్రజలు ధనస్వామ్య వర్గం లో బందీ లై పోయారు .మానవ అంతః కారణాలు జాతీయోద్యమం సామాజిక చింతన ,వేదన ప్రతిధ్వనిస్తాయి .నలుపు ,ఆకృత్యాలను కప్పి పుచ్చటానికి పైన తెలుపు అంటే ఖద్దరు టోపీ ధరిస్తారు అంటాడు .బాప్ కా దోస్త్ లో గాంధేయ ,రాజకీయ దుర్మార్గాలను ఎండగట్టాడు .ఆయనకాలం నవ నవో న్మేషణం..అభ్యుదయ సాహిత్యం ను వెలువరించాడు .హోటల్ కార్మికుల దుస్థితి వివరిస్తూ వారిలో  అంతర్జాతీయ చైతన్యాన్ని తెచ్చే ప్రయత్నం తెచ్చాడు .అణచి వేతకు ఇక సహించరని తిరగబడటం ఖాయమని చెప్పాడు .యహ్ గ్వాలియర్ హై కథలో గాంధీ కాళ్ళమీద పెట్టుబడి దారీ విధానం పాములా కూర్చుని ఉందని చెప్పాడు .కథల్లో పీడితులు పోరాడే వీరులుకారు అలాగని మిలిటెంట్లు కూడా కాదు .రచయితే సైన్యంగా ,సేనాధిపతిగా అవతరిస్తాడు .ఆయన కథలను మగ్గం మీద నేత అన్నారు విమర్శకులు .తాడిత పీడిత జనుల ఆత్మ బంధువుగా రాఘవ కనిపిస్తాడు .బిచ్చ గాళ్ళలో కూడాస్థాయీ భేదాలున్నాయనీ , దాన్నిబట్టే వాళ్ళ ఆశలు ఆశయాలు ఉంటాయని చెప్పాడు .బిచ్చగాడి భార్య తన కడుపులో పెరిగే బిడ్డ బిచ్చగాడు కారాదని కార్మికుడు అవాలని కోరుకుంటుంది .ఆవారా కథలో అసలు దోషి వ్యవస్థ అని చూపాడు .సాహిత్యం తప్పని సరిగా యుగ స్వభావాన్ని తీసుకొని చైతన్య వాణి వినిపించాలని ఆశించాడు .దేశ విభజన ఆధారంగా ‘’తబేలేకా దుమ్ధలకా ‘’కథ రాశాడు .పరాధీనత ఒకవైపు సర్వం దోచుకోవాలనే అత్యాశ మరో వైపు ఉండటం చూపించాడు .వ్యవస్థలోని రుగ్మతలు బయట పెట్టె కథలు అసామాన్యంగా రాశాడు ..’’రాత్రి చీకటి లో నాటుసారా (ఠర్రా)తనస్వభావం చూపి ,తర్వాత బయట ప్రకృతి  లోఏకాగ్ర చిత్తం వల్ల వణుకుతూ ఉన్న గాడాంధకారం చైతన్యం మీద క్రమంగా పాకి కప్పేసి విస్తరించింది ‘’ఇలాంటి లైన్లు చాలా ఉంటాయి రాఘవ కథలలో .పెట్టుబడి దారీ సమాజం లో ‘’కల’’వాడే మగాడు.వాడెం చేసినా చెల్లుతుంది అదే న్యాయం …’’మృగ తృష్ణ’’అంటే ఎండమావి కథ సింబాలిక్ గా రాశాడు .వారసత్వానికి సంబంధిన కథను చాలా కళాత్మకంగా సంధించాడు .వ్యవస్థ అనే వ్యాఘ్రం వేట గాడి లా కుక్క రూపం లో తన మెలకువతో మృగీ ని నోటకరుచుకు పారి పోతుంది .చావు దగ్గరకొచ్చినప్పుడు మృగీ లో పశ్చాత్తాపం కలుగుతుంది .మృగం చచ్చాకకూడా కథ కొనసాగుతుంది .’’ఎవరు జ్ఞాపకం తో తీయతనాన్ని నింపుకు పోతారో వారిని అది ప్రేమతో తనలోకి తీసుకొంటుంది ‘’.హిందీ విమర్శకుల రాగాద్వేషాలనూ తీవ్రంగా తూర్పారబట్టాడు .క్షేమరాజ్ మార్మిక వాదాన్నీ ,జైనేన్ద్రకుమార్ భంగ పాటు ను తన విమర్శలో సంకేతంగా చెప్పాడు రాఘవ ..’’గదల్ ‘’లాంటి గొప్ప రచనలు తానూ ఎన్నో చేశాననీ ,వాటిని విమర్శకులు చూడనే లేదనీ ఈసడించాడు .స్కెచ్ ,రిపోర్ట్ ఫీచర్ లు ఆయన కథల్లో చోటు చేసుకొన్నాయి .పెద్ద కథమృగతృష్ణ లో యుగసత్యాలు బాగా ఆవిష్కరించాడు .లక్ష్య లక్ష్యణాలలో ఇది హిందీ సాహిత్యం లో ఉత్కృష్ట కథ గా మిగిలిపోయింది .

  విమర్శలో మార్క్సిస్ట్ దృక్పధం

1945నుంచి 55వరకు అభ్యుదయ సాహిత్య ఉద్యమం లో మార్క్సిజం ముఖ్య పాత్ర పోషించింది రాగద్వేషాలు పెరిగి నిబద్ధత,నిజాయితీ  తగ్గి  ఉద్యమం ముక్కలైపోయింది .రచయితల సంఘటిత శక్తి దెబ్బ తిన్నది .నిరాశావాదం మృత్యువు లపై దృష్టి పెరిగింది పోరాడే శక్తి సామర్ధ్యాలమీద కాకుండా మృత్యువు దయ దాక్షిణ్యాల మీద  జీవితం గెలుస్తుంది అనే ధోరణి పెరిగింది .ఆలోచనలు సంకుచితాలయ్యాయి .హజారీ ప్రసాద్ ద్వివేదీ లాగా రాఘవ సృజనాత్మక రచనలలో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా సాహితీ విమర్శ చేబట్టాడు కావ్యాలనే తీసుకొని రాశాడు. వైదిక సాహిత్యం అంతాఒక యుగం లో మాత్రమె వచ్చి౦ది కాదన్నాడు .ఋగ్వేద రుక్కులే సామవేదం లో కొంత మార్పు చెందాయి యజుర్వేదంలో యజ్ఞ ప్రాధాన్యముంది .వైయక్తిక సాధనా పరిశీలనే అధర్వ వేదం ‘’వేదాలు ప్రేరణా స్రోతస్వినులు .ఏక పక్ష సిద్ధా౦తాలు కావు .వేద సందేశం బహు వ్యాప్తమైంది .రుక్కుల అర్ధతాత్పర్యాలు వివరించిన జీనియస్ రాఘవ .మానవుడికి దగ్గరగా ఉన్న పరిజ్ఞానం అవి .ఆర్య సంస్కృతికి చిహ్నాలు కావు అన్నాడు స్పష్టంగా .మార్సిస్ట్ విమర్శకుడు వర్గ పోరాటానికే పరిమితమౌతాడు అన్నాడు .పురూరవునిలో కరుణామయ పిలుపు ,యమీ -యమ సంవాదం లో విషయ వాంచలు కర్తవ్యాలమధ్య ఉదాత్త చర్చ గమనించాడు రాఘవ .

  మహాభారతం ను తన అంతర్భుక్తిసిద్ధాంతం ఆధార౦గా విశ్లేషించాడు .ఆర్య సంప్రదాయ గ్రంథం కాదు భారతం అన్నాడు .అపూర్వ వివేచన అన్నాడు .విషయ పరిజ్ఞానం  దృష్టి లో ఆకాశమ౦త  విస్త్రుతమైనది .నాథ పరంపర సాహిత్యానికి గొప్ప సేవ చేసిందని పరిశీలించి చెప్పాడు .భక్తి ఉద్యమం లో సాంఘిక పాత్రపైనే దృష్టిపెట్టాడు .ఇస్లాం కు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమమే భక్తి ఉద్యమం అన్నాడు .తులసీ దాసు ను వర్ణ వ్యవస్థ రక్షకుడుగా చూశాడు .తులసీ దాస్ వివేకాన్ని బాగానే పొగిడాడు .

  లేఖా సాహిత్యం లో సాహిత్య రాజకీయ సంబంధాలు చర్చించాడు .సాహిత్యం లో వ్యక్తిరావాలి అన్నాడు .సంకుచితత్వాన్ని ఎదిరించాడు .నాటకాలు కూడా రాసి ‘’చరిత్రకు మమకారం ఉండదు ‘’అని చెప్పాడు .స్వీయ సుఖ చింతన తాముమాత్రమే పైకి రావాలనే ఆదుర్దా ,ఆదాయ వ్యామోహం సమాజాన్ని భ్రష్టు పట్టించినట్లు చెప్పాడు .’’ఎముకలచిరునవ్వు’’ ను చూడగలిగాడు రాఘవ .స్వాతంత్రం తర్వాత గ్రామీణ జీవితాన్ని దర్శించి రాశాడు .ఎందులో చూసినా ఆయన సంవేదనా దృష్టి గోచరిస్తుంది .శాశ్వత  ప్రమాణాలతో ఉన్నత విలువలతో రాఘవ రాశాడు .ప్రజలకు విధేయుడై ఉంటూ రాశాడు .అతడిమానవతా వాదం ఆబ్ష్ట్రాక్ట్ కాదు .మానవ సంఘర్షణ వికాసాలను రాఘవ చిత్రించిన తీరు అనితర సాధ్యం .అతడు సత్యాన్వేషకుడు .మానవుడి పట్ల సంవేదన కలిగి,పోరాటం లో కొత్త విశ్వాసం కలిగించాడు .ఇప్పటికీ  రాంగేయ రాఘవ వంటి ప్రతిభా వ్యుత్పత్తులు సృజన ఉన్న రచయిత హిందీ సాహిత్యం లో రాలేదు అన్నాడు జ్వాలాముఖి .

 ఆధారం –మధురేశ్ హిందీ రచనకు జ్వాలాముఖిఅనువాదం ‘’రా౦గేయ రాఘవ ‘’పుస్తకం   .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-5-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-273 273-తొలితరం సంగీత దర్శకుడు ,రసాలూరు రాజేశ్వరరావు అన్న ,అనేక వాయిద్యాల నిపుణుడు,ఉషా పరిణయం ,దక్షయజ్ఞం ,తుగ్లక్ ,బాంధవ్యాలు సంగీత దర్శకత్వ ఫేం ,మహమ్మద్ రఫీ తో పాడించిన వాడు –సాలూరు హనుమంత రావు

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-273
273-తొలితరం సంగీత దర్శకుడు ,రసాలూరు రాజేశ్వరరావు అన్న ,అనేక వాయిద్యాల నిపుణుడు,ఉషా పరిణయం ,దక్షయజ్ఞం ,తుగ్లక్ ,బాంధవ్యాలు సంగీత దర్శకత్వ ఫేం ,మహమ్మద్ రఫీ తో పాడించిన వాడు –సాలూరు హనుమంత రావు
· సాలూరు హనుమంతరావు (1917 – మే 27, 1980) ప్రసిద్ధ తెలుగు, కన్నడ సినిమా సంగీత దర్శకులు. ఈయన తమ్ముడు సాలూరు రాజేశ్వరరావు కూడా ప్రసిద్ధ సంగీత దర్శకుడే. సాలూరు రాజేశ్వరరావు కంటే నాలుగేళ్ల పెద్దవాడు ఈయన. పన్నెండేళ్ల వయసులో తమ్మునితో కలిసి ద్వారం వెంకటస్వామి నాయుడు దగ్గర సంగీత పాఠాలు నేర్చుకున్నాడు. గాలిపెంచల నరసింహారావు ఆర్కెస్ట్రాలో చేరాడు. అక్కడే వీణ, సితార, దిల్, సారంగి, హార్మోనియమ్, వయొలిన్, క్లారినేట్, ఫ్లూట్, వాద్యాలతో పొత్తుపెట్టుకున్నాడు.

· కొన్నాళ్ల తరువాత ఈఎ సోదరులిద్దరూ “రాజేశ్వరరావు అండ్ పార్టీ” పేరుతో ఆర్కెస్ట్రాలు ఇవ్వడం మొదలుపెట్టారు. 1947లో “రాధిక” అను సినిమాతో స్వతంత్ర సంగీత దర్శకుని అవతారం ఎత్తారు. సోదరుడైన రాజేశ్వరరావు అస్వస్థులైన సమయంలో ఆయన ఒప్పుకున్న “చరణదాసి” సినిమాను తాను పూర్తిచేసారు. ఈ సినిమాలో కొన్ని పాటలు, రీరికార్డింగ్ ఈయనే చేసారు. ఆ తరువాత తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో సుమారు 50 చిత్రాలకు పనిచేసారు. మంచి మంచి సినిమాలకు స్వరకర్తగా పనిచేసినా హనుమంతురావుకు కాలం కలిసిరాలేదు. ఆయనకు రావల్సినంతగా పేరు ప్రఖ్యాతలు రాలేదు.

· సాలూరు హనుమంతరావు సంగీత కుటుంబం నుంచి వచ్చారు. తొలితరం తెలుగు సినిమా సంగీత దర్శకుల్లో హనుమంతరావు ఒకరు. ఈయన తెలుగు సిని మాలే కాక, కన్నడ సినిమాలకు కూడా సంగీతాన్ని అందించారు. హనుమంతరావు తమ్ముడు సాలూరు రాజేశ్వర రావు ప్రసిద్ధ సంగీత దర్శకుడు. సాలూరు రాజేశ్వరరావు కంటే హనుమంతరావు నాలుగేళ్లు పెద్ద. అన్నదమ్ము లిద్దరూ సినిమా సంగీత దర్శకులు కావడం విశేషం. సరిగమల ప్రపం చంలో అన్నదమ్ములు సంగీత దర్శకులు కావడం అరుదు. సంగీత సామ్రాజ్యంలో కొంతమంది జంట సంగీత దర్శకులున్నారు. శంకర్‌ – జైకిషన్‌, కళ్యాణ్‌జీ – ఆనంద్‌ జీ, విశ్వనాథన్‌ – రామమూర్తి, రాజన్‌ – నాగేంద్ర, రాజ్‌- కోటి (ఒకప్పుడు) మొదలైనవారున్నారు. కానీ హనుమంత రావు, రాజేశ్వరరావు అన్నదమ్ములైనప్పటికీ జంటగా ఏ చిత్రానికీ సంగీతాన్ని అందించిన దాఖలా లేదు. అయితే, అనుకోని పరిస్థితిలో తమ్ముడు రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని హనుమంతరావు పూర్తి చేశారు.

· . కొన్నాళ్లకు అన్నదమ్ములిద్దరూ రాజేశ్వరరావు అండ్‌ పార్టీ పేరుతో ఆర్కెస్ట్రాను తయారు చేసుకొని, సంగీత కార్యక్రమాలు ఇవ్వడం ప్రారంభించారు. 1947లో ‘రాధిక’ అనే సినిమాతో సాలూరు హనుమంతరావు స్వతంత్ర సంగీత దర్శకు డయ్యారు. సోదరుడు రాజేశ్వరరావు ‘చరణదాసి’ సినిమా చేస్తున్నప్పుడు అనారోగ్యానికి గురి కావడంతో ఆయన ఒప్పుకున్న సినిమాను హనుమంతరావు పూర్తి చేసారు.

· ఈ సినిమాలో కొన్ని పాటలు, రీరికార్డింగ్‌ ఈయనే చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో సుమారు 50 చిత్రాలకు పనిచేశారు. హను మంతరావు సంగీతాన్నందించిన సినిమాల్లో ఎక్కువగా ఎన్టీ రామారావు చిత్రాలున్నాయి. ఈ సినిమాలు బాగా ఆడడమే కాకుండా హనుమంత రావుకు పేరు తీసుకొచ్చాయి. మంచి సినిమాలకు స్వరకర్తగా పనిచేసినా హనుమంత రావుకు రావల్సి నంతగా పేరు రాలేదు. కొన్ని సినిమాలు బాగా ఆడక పోవడం ఇందుకు కారణం కావచ్చు. అయితే హను మంతరావు సాంఘిక చిత్రాలకే కాకుండా పౌరాణిక, జానపద చిత్రాలకూ సంగీతాన్ని అందించారు.

· హనుమంతరావు స్వరపరిచిన పాటల్లో ఎన్నో ప్రాచుర్యం పొందాయి. వాటిలో ఒకటి – బాంధవ్యాలు (1968) చిత్రంలో ‘మంచితనానికి ఫలితం వంచన, మనిషికి మిగిలేదేమిటి వేదన…ఆరని, తీరని వేదన ఆవేదన’. డాక్టర్‌ సి. నారాయణరెడ్డి రాసిన ఈ పాటను ఘంటసాల ఆలపించారు. అలాగే ఉషాపరిణయం (1961) లో ‘మన ప్రేమకథా అమర కథ’ అనే పాటను సదాశివబ్రహ్మం రాయగా, హనుమంతరావు స్వరపరచగా ఘంటసాల,పి లీల పాడారు. సాలూరు హనుమంతరావు 30 దశాబ్దాలకు పైగా సినిమా సంగీత దర్శకుడిగా కొనసాగినా చాలా తక్కువ సినిమాలు చేశారు. 1947తో ప్రారంభించి 1976 వరకూ సంగీత దర్శకుడిగా కొనసాగిన సాలూరు హనుమంతరావు 1980లో మరణించారు.

సంగీతం సమకూర్చిన చిత్రాలు

  1. రాధిక (1947)
  2. మదాలస (1948)
  3. రాజీ నా ప్రాణం (1954) (కొన్నిపాటలు మాత్రమే)
  4. భలే అమ్మాయిలు (1957)
  5. వీర భాస్కరుడు (1959)
  6. ఉషా పరిణయం (1961)
  7. దక్షయజ్ఞం (1962)
  8. చంద్రహాస (1965)
  9. బాంధవ్యాలు (1968)
  10. రైతు బిడ్డ (1971)
  11. మహమ్మద్ బీన్ తుగ్లక్ (1972)
  12. పంజరంలో పసిపాప (1973)
  13. నిజ రూపాలు (1974)
  14. ప్రతిజ్ఞ (కన్నడం)
  15. సతీ అనసూయ (కన్నడం)
  16. ఆడదాని అదృష్టం (1974)
  17. మొగుడా పెళ్ళామా (1974)
  18. మనుషుల్లో దేవుడు (టి.వి.రాజు)తో
  19. ఆరాధన (1976)
  20. స్వామి ద్రోహులు (1976)

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-5-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

రాంగేయ రాఘవ -4 నవలలలో నవ చైతన్యం

r

రాఘవ  సాంఘిక ,నగరజీవిత ,గ్రామీణ జీవిత నవలలు,చారిత్రకనవలలు ,జీవిత చారిత్రాత్మక, ,ప్రాంతానికి చెందిన ,నిర్దుష్ట వాతావరణ సన్ని వేశ,ప్రాంతానికి సంబంధించిన  నవలలు  రాశాడు .నగర జీవిత నవలలో చోటీసీ బాత్ ,విషాద్ మఠ్,రాయి ఔర్ పర్వత ,సీదాసాదా రాస్తా ,హుజూర్ ఉన్నాయి. వీటిలో అనేక సమస్యలు స్పృశించాడు .పట్టణ జీవితానికి చెందిననవలలు –ప్రొఫెసర్ ,కల్పనా,ఉబాల్ ,పత్ ఘర్ .లేఖలరూపం లో చోటీసీ బాత్ రాశాడు .

  విషాద్ మఠ్ నవల బెంగాల్ కరువుపై మానవత్వం పై కరుణ రసార్ద్రంగా రాశాడు .సీదాసాదా హుజూర్ లలో మార్క్సిస్ట్ జీవన దృక్పధాన్ని తెలిపాడు .హుజూర్ లో రచనా శిల్పం బాగా ఆకట్టుకొంటుంది .కష్టపడి పని చేసే శ్రామికుడికి పూర్తీ అధికారం రానంతవరకూ వాడి ప్రపంచం దిక్కూమొక్కూ లేకుండా ఉంటుంది అని హెచ్చరించాడు .గ్రామీణ నవల’’పథ్ కా పావ్ ‘’దారిలోపాపం ,ఆఖరి ఆవాజ్ –చివరి కేక నిజంగానే’’ కేక ‘’అనిపిస్తాయి .నైతిక పతనం ,పంచాయితీ అవినీతి పూర్తిగా కళ్ళకు కట్టించాడు .నైతికపతనం పైఎక్కువ బాధపడి రాశాడు .పథ్ కాపాప్ లో శైలీ వ్యంగ్యాత్మక రచన మనసుకు పడతాయి .

  చారిత్రకనవలలో సమకాలీన జీవన సత్యాలు వర్తమానం లోకి ఆకర్షిస్తే భారతీయ ఆత్మ అయిన భాషా సంస్కృతులగమనం  తనను ఆకర్షించింది అన్నాడు .శవాలగడ్డ అనే ముర్దోం కా టీలా నవలలో మొహంజదారో మహానాగరకత పతనాన్ని బాధా తప్త హృదయం తో రాశాడు .చాలాసంయమానం తో రాశాడని మెచ్చారు .సంస్కృతి లోని బానిస బానిస లాగానే మాట్లాడుతాడు .ఆధునిక జీవన సమస్యలు ఇందులోకి చొప్పించలేదు రాఘవ .’’చారిత్రిక రచనల్లో యుగాన్నే చూశాను యుగం ద్వారానే వ్యక్తిని చూశాను .అతడు సత్యాన్వేషణలో ఉన్నట్లు నాకు కనిపించాడు ‘’అన్నాడు .రాజశ్రీ పాత్ర ఆదర్శానికి ప్రతీక .ద్వంద్వ యుద్ధం తో తేల్చుకోవలసిన దాన్ని సామూహిక మారణ కాండ యుద్ధం లోకి లాగటం ఎందుకని రాజశ్రీ ప్రశ్నిస్తే అది పుష్యభూపతి వంశ గౌరవానికి సంబంధించి అని సేనాపతి అంటే ‘’కాదు అది భ్రాంతి, దోపిడీ ,పురుష దౌష్ట్యం ‘’అంటుంది సంయమనం అంటే పలాయనం కాదు ఆరోగ్యప్రవాహం .స్వార్ధం పశుత్వ భావన .

దేవకికా బేటాలో కృష్ణుని మొదటిపదహారేళ్ళు కంస వధతో పూర్తవుతుంది .మూఢనమ్మకాలను తర్కబుద్ధితొఆలొచి౦చి  చెప్పాడు ‘’అద్భుతాలమధ్య సత్యం మునిగి పోతుంది ‘’అన్నాడు .కబీర్ తులసీదాస్ విద్యావతి ల జీవిత చరిత్రలు రాశాడు .వీటిలో హీరో వ్యక్తిత్వం ప్రతిఫలిస్తుంది .యశోధర తన పరిమితుల్లో బంధింప బడినా, ఆధునిక స్త్రీకి ఉండాల్సిన స్వాభిమానం, హక్కులను ప్రస్తావిస్తుంది .’’అతడు భర్త .అతడి దయను కాను నేను .నాకు సరి సమానమైన హక్కులు కావాలి ‘’అంటుంది యశోధర.పలాయనం ఆమెదృష్టిలో అధర్మం పురుషా హంకారం పై తిరగబడింది ‘’జన్మ దుఃఖ కారణం తెలుసుకోపోలేయినంత మాత్రాన రాజ్యాధికారం దుఖం అని అన్న మాత్రాన అది దర్శన అ౦టేతత్వం అయిపోతుందా “’అని ప్రశ్నించింది .

  కృష్ణుడు కూడా ‘’నాకు కులం, వంశం కన్నా జనం గొప్ప. అన్యాయాలు అత్యాచారాలు విధ్వంసమైన ప్రపంచం లో సుఖ శాంతులు ప్రవేశించటానికే నేను జీవించి ఉంటాను ‘’అని స్పష్టం చేశాడు .నవీన మానవుడిని సమాజ వికాసం తోపాటు భారత దేశం లోకానికి ఇవ్వగలదు ‘’.సామాజిక వికాసం తో వ్యక్తీ అంతరించిపోదు ,దానికి భిన్నంగా అతడు వికసిస్తాడు’’ అన్నాడు రాఘవ .కబీరు జ్ఞాన రహస్యంలో మునిగిపోయిన వాడు ఆయన్ను ఎవరూ సరిగా అర్ధం చేసుకోలేదు అంటాడు .రాజస్థాన్ దొమ్మరి వాళ్ళ సర్కస్ ఫీట్ లను ,అక్కడి స్త్రీ పురుష సంబంధాలను ,లైంగిక నీతిగురించి ‘’కబ్ తక్ పుకారూ ‘’నవలలో గొప్పగా ప్రదర్శించాడు రాఘవ  .ధర్తీ మేరాఘర్ లో రాజస్థాన్ లోహ పీటులఅంటే కమ్మరి పనులు చేస్తూ ఉండే సంచార జీవుల మూఢనమ్మకాలు ,జీవన విధానాన్ని దగ్గరుండి పరిశోధించి  జీవిత చరిత్ర గా చూపాడు .వాళ్ళ జీవితాలను వాళ్ళ దృష్టిలో చూసి రాయటం రాఘవ ప్రత్యేకత ..అందులో ఒకడు ‘’నేను ఈలోకం లోకి వచ్చినప్పుడు నాకు కులం లేదు ,పోయేప్పుడూ ఉండదు .ఇప్పుడు నేను మానవుడిని .ఆకాశాన్ని అలాగే విశాలంగా ఉండనీయండి .భూమిని బంధించకండి .మధ్యమీరు లేపిన గోడలు కూల్చేయండి.నేను నిర్మలంగాస్వతంత్రంగా ఉన్నాను ‘’అంటాడు కాదు అనిపిస్తాడు రాఘవ .

  ఎక్కువగా రాయటం వలన రాఘవ శైలీశిల్పం దెబ్బ తిన్నాయి .అతనిదిఎక్కువగా శిల్ప దృష్టి .గాంధీ త్యాగం నిష్ఠ సేవాభావాలను మహత్తరంగా కీర్తించాడు .సుగుణ రాశి అన్నాడు. రాజకీయ మూర్ఖత్వం లేని వాడు రాఘవ .రాఘవ నవలలో నవ చైతన్యం సమర శీలత్వం ఉన్న మానవుడి సంస్కారంగా అభి వృద్ధి చెంది ,మహత్తర మార్పుకోసం పాటు పడే ఇంగిత౦ గా  కనిపిస్తుంది .విశ్వాసం దాని లక్ష్యం వివేకం దాని లక్షణం .

   సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జనేయ దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి

శ్రీ హనుమజ్జయంతి
వైశాఖ బహుళ దశమి శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో 23-5-22సోమవారం నుంచి 25-5-22 బుధవారం వరకు త్రయాహ్నికంగా శ్రీ హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహింపబడును .భక్తులు కార్యక్రమ లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొని తరించ ప్రార్ధన –గబ్బిట దుర్గా ప్రసాద్ –ఆలయ ధర్మకర్త ,మరియు భక్తబృంద౦.
కార్యక్రమం
23-5-22- వైశాఖ బహుళ అష్టమి సోమవారం –ఉదయం -5గం .లకుస్వామివార్లకు అష్ట కలశ స్నపన ,మన్యుసూక్తం తో అభిషేకం ,నూతన వస్త్ర ధారణ, స్వామివార్లకు వివిధ పుష్పాలతో , గంధ సిందూరం తో అష్టోత్తర సహస్రనామార్చన ,నైవేద్యం మంగళహారతి ,తీర్ధ ప్రసాద వినియోగం .
సాయంత్రం -6-30కు సరసభారతి కార్యక్రమంగా –శ్రీమతి జి.మాధవి బృందం చే లలిత సంగీత కచేరి ,ఛి కౌశిక్ నాట్య ప్రదర్శన
24-5-22 వైశాఖ బహుళ నవమి మంగళవారం -–ఉదయం 9గం లకు –మామిడిపండ్లతో విశేష అర్చన నైవేద్యం మంగళహారతి ,తీర్ధ ప్రసాద వినియోగం
సాయంత్రం 6-30కు సరసభారతి కార్యక్రమంగా –శ్రీ పొన్నాడ సత్య ప్రకాష్ గారిచే –‘’తెలుగు చలన చిత్రాలలో శ్రీ హనుమ ‘’ప్రసంగం
25-5-22-వైశాఖ బహుళ దశమి బుధవారం శ్రీ హనుమజ్జయంతి
ఉదయం 5గం .నుంచి 9-30వరకు –తమలపాకులతో ప్రత్యేక పూజ
ఉదయం -10గం .లకు శ్రీ సువర్చలా౦జ నేయస్వామి వారల శాంతికల్యాణ మహోత్సవం
అనంతరం నైవేద్యం,మంగళహారతి ,తీర్ధ ప్రసాద వినియోగం
సాయంత్రం -6గం.లకు కాలనీ మహిళా మండలి వారిచే శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ,స్వామి వారలకు ‘’వడమాల’’తో ప్రత్యేక అర్చన . అనంతరం నైవేద్యం,మంగళహారతి ,తీర్ధ ప్రసాద వినియోగం
పూర్తీ వివరాలతో కరపత్రం మరో వారం లో అందజేస్తాం .

Posted in దేవాలయం | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-272

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-272
272-సినీ ‘’విరోధి’’కి నంది ,’’షో’’కు జాతీయ పురస్కారం పొందిన టాలెంటెడ్ డైరెక్టర్ –నీలకంఠ
నీలకంఠ ఒక ప్రముఖ సినీ దర్శకుడు.[1] షో అనే సినిమాకు గాను జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు. [2] విరోధి అనే సినిమాకు నంది పురస్కారం లభించింది. మిస్సమ్మ, మిస్టర్ మేధావి, నందనవనం 120 కి.మీ ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు.

జీవితం
నీలకంఠ స్వస్థలం కడప.[3] తండ్రి నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా పనిచేసేవాడు. బడిలో ఉండగానే మార్గరెట్ అనే ఉపాధ్యాయురాలు స్ఫూర్తితో తరగతి పుస్తకాలు కాకుండా వేరే పుస్తకాలు చదవడం కూడా అలవాటైంది. అలా హాస్యకరమైన (కామిక్) పుస్తకాలు చదవడం అలవాటైంది. ఇనిబ్ బ్లెటెన్ అనే రచయిత వయసు వారీగా పుస్తకాలు ఉంటే వాటిని వరసగా చదివేశాడు. తర్వాత నేరము , ఉత్కంఠ కథలు, నవలలు చదవడం మొదలు పెట్టాడు. నెమ్మదిగా సినిమాలు చూడటం ప్రారంభమైంది.

విజయవాడలోని లయోలా పబ్లిక్ స్కూల్, ఆంధ్రా లయోలా కళాశాలలో చదువుకున్నాడు. నీలకంఠ అన్నయ్యకు చిత్రలేఖనం హాబీ. ఇద్దరూ కలిసి సినిమాలి చూసేవాళ్ళు. అతను నీలకంఠతో దర్శకుల గురించి మాట్లాడేవాడు. అలా పాఠశాల రోజులనుంచే సినిమా దర్శకత్వం పట్ల శ్రద్ధ ఆయన డిగ్రీ పూర్తి కాగానే చెన్నై వైపు నడిపించింది. పద్దెనిదో ఏటనే భారత్ పాక్ నేపథ్యంలో ఒక కథ రాశాడు. అది స్నేహితులు చదివి మెచ్చుకున్నారు. తనకు సినిమా వృత్తి అయితే బాగా సరిపోతుందనుకున్నాడు.[4] కె. బాలచందర్ స్ఫూర్తితో దర్శకుడు కావాలనుకున్నాడు.

కెరీర్
సినీ రంగంలోకి ప్రవేశించిన తర్వాత వల్లభనేని జనార్ధన్ దగ్గర కొన్ని సినిమాలకు సహాయకుడిగా పని చేశాడు. కృష్ణ హీరోగా భారతీరాజా దర్శకత్వంలో జమదగ్ని అనే సినిమాను మరికొంతమందితో కలిసి నిర్మించాడు. కానీ అది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. తర్వాత రేవతి కథానాయికగా తమిళంలో ప్రియాంక అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇది హిందీ సినిమా దామినికి పునర్నిర్మాణం. ఈ సినిమాకు రేవతికి ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ పురస్కారం లభించింది. ఈ సినిమా తర్వాత చాలా సినిమాలకు రీమేక్ చేయమంటూ అవకాశాలు వచ్చాయి కానీ రీమేక్ దర్శకుడనిపించుకోవడం ఇష్టం లేక వాటన్నింటినీ వదులుకున్నాడు. అలా మళ్ళీ అవకాశం కోసం ఏడేళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది.

తెలుగులో సొంతంగా కథతో ప్రయోగం చేయాలనుకున్నాడు. పరమహంస యోగానంద రాసిన ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం చదివి దాని స్ఫూర్తితో కేవలం రెండే పాత్రలతో ఒక కథ తయారు చేసుకున్నాడు. ఆ కథను అప్పటికే ఓ చిన్న సినిమా నిర్మించాలని ప్రయత్నిస్తున్న నటుడు కృష్ణ కుమార్తె మంజులకు వివరించాడు. ఆమెకు ఐడియా నచ్చి నిర్మించడానికి ఒప్పుకుంది. అలా తయారైందే షో సినిమా.

సినిమాలు
సంవత్సరం

చలన చిత్రం

పాత్ర

భాష

ఇతర వివరాలు

1994

ప్రియాంక

దర్శకుత్వం

తమిళం

హిందీ చిత్రం దామిని– లైట్నింగ్ కి పునఃనిర్మాణం

2002

షో

స్క్రీన్‌ప్లే, దర్శకుత్వం

తెలుగు

రెండు జాతీయ పురస్కారాలు గెలుపొందారు

2003

మిస్సమ్మ

స్క్రీన్‌ప్లే, దర్శకుత్వం

తెలుగు

నాలుగు నందీ పురస్కారాలు గెలుపొందారు

2005

సదా మీ సేవలో

స్క్రీన్‌ప్లే, దర్శకుత్వం

తెలుగు

2006

నందనవనం 120 కి.మీ.

స్క్రీన్‌ప్లే, దర్శకుత్వం

తెలుగు

2008

మిస్టర్ మేధావి

దర్శకుత్వం

తెలుగు

2009

ఈనాడు

సంభాషణలు

తెలుగు

2011

విరోధి

స్క్రీన్‌ప్లే, దర్శకుత్వం

తెలుగు

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా – 2011 లో ప్రదర్శించబడింది

రెండు 2011 నందీ పురస్కారాలు గెలుపొందారు

మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ -2011 లో ప్రదర్శించబడింది[5]

2013

చమ్మక్ చల్లో

దర్శకుత్వం

తెలుగు

2014

మాయ[6]

స్క్రీన్‌ప్లే, దర్శకుత్వం

తెలుగు

[7]

2018

దటీస్ మహాలక్ష్మీ

దర్శకుత్వం

తెలుగు

హిందీ చిత్రం క్వీన్ యొక్క పునఃనిర్మాణం

2018

జామ్ జామ్

దర్శకుత్వం

మళయాళం

పురస్కారాలు
జాతీయ చలన చిత్ర పురస్కారాలు

· తెలుగులో ఉత్తమ జాతీయ చలన చిత్రం – 2002 – షో

· ఉత్తమ స్క్రీన్‌ప్లే కి గాను జాతీయ పురస్కారం– 2002 – షో

నందీ పురస్కారాలు

· ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌కి గాను నందీ పురస్కారం – షో (2001)

· ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌కి గాను నందీ పురస్కారం – మిస్సమ్మ (2003)

· ఉత్తమ సంభాషణ రచయితకుగాను నందీ పురస్కారం – విరోధి (2011)

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-22-ఉయ్యూరు

image.png

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-271

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-271
• 271- రంగస్థల, టీవి, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు-ముదిలి సంజీవి
• సంజీవి ముదిలి రంగస్థల, టీవి, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు.[1] 1965నుండి నాటకరంగంలో కృషిచేస్తున్న సంజీవి, సినీరంగంలో 50కిపైగా చిత్రాలకు నటుడిగా, రచయతగా పనిచేశాడు. ప్రజానాట్యమండలి కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించాడు.[2]
జననం
సంజీవి సెప్టెంబర్ 24న కృష్ణా జిల్లా, విజయవాడలో జన్మించాడు.[3]
రంగస్థల ప్రస్థానం

సంజీవి రాసిన త్రేతాగ్ని పుస్తక ఆవిష్కరణ
1965లో నటనాలయం నాటకంలోని చిట్టిబాబు పాత్ర ద్వారా నాటకరంగంలోకి అడుగుపెట్టిన సంజీవి నటుడిగా, రచయితగా, దర్శకుడిగా అనేక నాటక నాటికలకు పనిచేశాడు.[4] గురజాడ కళామందిరం అనే సంస్థను స్థాపించి, గత 40 ఏళ్ళుగా నాటక ప్రదర్శనలను ఇస్తున్నాడు.
నటించినవి
నాటకాలు

  1. సమాధానం కావాలి
  2. యుద్ధం
  3. ఈ చరిత్ర ఏ సిరాతో
  4. దేశం మోసపోయినప్పుడు
  5. మాస్టార్జీ
  6. యాచకులు
  7. శబ్దం
  8. మూక
    నాటికలు
  9. పగగం పగిలింది
  10. నీరుపోయి
  11. చరమాంకం
  12. శవాలపై జీవాలు
  13. ఊసరవల్లి
  14. మనకెందుకులే
  15. కదలిక
  16. సంచలనం
  17. డేకోయిట్లు
  18. రేపు
  19. వర్తమాన భూతం
  20. అయో (వ) ధ్య
  21. మనుధర్మం
  22. రాజ్యహింస
  23. నిజాయితి
  24. ఊరుమ్మడి బతుకులు
  25. క్విట్ ఇండియా
  26. అమూల్యం
  27. చెప్పుకింది పూలు
  28. ఓటు బాట
  29. గబ్బిలం
  30. అని తెలుస్తుంది
  31. వామపక్షం
    బహుమతులు
    నంది అవార్డులు
  32. ఉత్తమ నటుడు – నిజాయితి (నాటిక) – 2000
  33. ఉత్తమ నాటకం – మధురం
  34. ఉత్తమ రచన – శివరంజని
  35. నాలుగు అవార్డులు – గబ్బిలం (నాటిక)
  36. రెండు అవార్డులు (నంది నాటక పరిషత్తు – 2005)- అని తెలుస్తుంది (నాటిక)[5]
    ఆంధ్ర నాటక కళా పరిషత్తు
  37. ఉత్తమ బాల నటుడు – నటనాలయం (నాటకం), 1965, హైదరాబాదు.
  38. ఉత్తమ నాటకం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ రచన – ఈ చరిత్ర ఏ సిరాతో (నాటకం), విశాఖపట్టణం.
  39. ద్వితీయ ఉత్తమ నాటిక, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు – కదలిక (నాటకం), విశాఖపట్టణం.
    ఇతర అవార్డులు
  40. కళాసాగర్ అవార్డులు (1981 నుండి 84 వరకు, వరుసగా మూడుసార్లు)
  41. 62సార్లు ఉత్తమ రచయిత అవార్డులు
  42. 50సార్లు ఉత్తమ దర్శకుడు అవార్డులు
  43. 110సార్లు ఉత్తమ నటుడు అవార్డులు
    పురస్కారాలు
  44. మహాకవి గురజాడ స్మారక పురస్కారం, కళా విరించి – గుంటూరు
  45. పీపుల్స్ రైటర్ – జవ్వాది ట్రస్టు
  46. దాసరి ప్రతిభా పురస్కారం – 2018 ( ఫిలిం ఎనాలిటికల్ అండ్ అప్రిషియేషన్ సొసైటీ)[6]
    సినిమారంగ ప్రస్థానం
    నటనాలయం (నాటకం)లోని సంజీవి నటనను చూసి బి.ఎన్. రెడ్డి తన రంగులరాట్నం (1966) సినిమాలో బాలనటుడి వేషం ఇచ్చాడు. దాదాపు 50కిపైగా చిత్రాలకు నటుడిగా, రచయతగా పనిచేశాడు. సంజీవి రచనలో రాజశేఖర్ నటించిన ‘అన్న’ చిత్రం నాలుగు నంది అవార్డులు అందుకోవడమేకాకుండా, ఆస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో విజయశాంతి నటించిన ఒసేయ్ రాములమ్మా చిత్ర రచనలో కూడా సంజీవి తన సహకరించాడు. ఈ చిత్రం అంతకుముందున్న బాక్సాఫీస్ రికార్డులను అధిగమించడమేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుండి అనేక అవార్డులతోపాటూ ఉత్తమ నటి విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈయన రచయితగా చేసిన మరో సినిమా ఎర్రమందారం ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో రాష్ఱ్ర ప్రభుత్వ అవార్డులు, జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భారత ప్రభుత్వ అవార్డు గెల్చుకుంది. ఎర్రసైన్యం, ఒరేయ్ రిక్షా, సమ్మక్క సారక్క వంటి చిత్రాలకు పనిచేసిన సంజీవి తమిళ సినిమా, కన్నడ సినిమా రంగంకు కూడా పనిచేశాడు. అంతేకాకుండా ఛాయా (1981), తెలుగోడు (2014) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
    సినిమాలు
    నటుడిగా
  47. 1966 – రంగులరాట్నం (బాలనటుడు)
  48. 1992 – హలో డార్లింగ్
  49. 1991 – కర్తవ్యం
  50. 1991 – ఎర్రమందారం
  51. 1989 – భారతనారి
  52. 1989 – అడవిలో అభిమన్యుడు
  53. 1989- మౌన పోరాటం
  54. 1988 – మహర్షి
  55. 2000 – అడవిచుక్క
  56. 2011- రాజన్న
    రచయితగా
  57. 2003 – అమ్ములు (కథ)
  58. 1997 – ఒసేయ్ రాములమ్మ (మాటలు)
  59. 1990 – అలజడి
  60. 2000 – అడవిచుక్క
    దర్శకత్వం
  61. 1981 – ఛాయా
  62. 1998 – తెలుగోడు
    టీవిరంగ ప్రస్థానం
  63. భరత నాట్యం
  64. అంతరంగాలు
  65. మాతృదేవత
  66. ప్రతిఘటన,
  67. నిన్నే పెళ్ళాడుతా
  68. సూర్యవంశం
  69. అపరాజిత
  70. పెళ్ళి
  71. కృష్ణవేణి
  72. మనసంతా నువ్వే
  73. కళ్యాణ తిలకం
  74. సీతమ్మ మాఅమ్మ
  75. బ్రహ్మముడి
  76. ఆరాధన
  77. శివరంజని
  78. గోరంత దీపం
  79. లక్ష్మీ కళ్యాణం
  80. మహలక్ష్మి
    పుస్తకాలు
    సంజీవి రాసిన త్రేతాగ్ని పుస్తకం 2021, ఆగస్టు 12న హైదరాబాదు రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో అవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డా. కె.వి. రమణాచారి, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రంగస్థల నటులు, దర్శకులు ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ మాజీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, దైవజ్ఞశర్మ, సినీ టివి దర్శకులు, నటులు నాగబాల సురేష్ కుమార్, సినీ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, లయన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
    • సశేషం
    • మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-22ఉయ్యూరు —
Posted in సినిమా | Tagged | Leave a comment

నాటకరంగ వ్యవస్థాపకులు ,శారదా మనోవినోదినీ స్థాపకులు  ,ఆంధ్రనాటక కళాపరిషత్ సంస్థాపకులు ,ఆంధ్రనాటక కలోద్ధార బిరుదాంకితులు –పనారస గోవిందరావు

నాటకరంగ వ్యవస్థాపకులు ,శారదా మనోవినోదినీ స్థాపకులు  ,ఆంధ్రనాటక కళాపరిషత్ సంస్థాపకులు ,ఆంధ్రనాటక కలోద్ధార బిరుదాంకితులు –పనారస గోవిందరావు

వనారస గోవిందరావు రంగస్థల నటులు, నాటకరంగ వ్యవస్థాపకులు.

తొలిజీవితం

వనారస గోవిందరావు 1867లో గంపరామన్న, పకీరమ్మ దంపతులకు జన్మించారు. వీరి పెంపుడు తలిదండ్రులు సుంకమ్మ, వెంకోజీరావులు. గోవిందరావు అసలు పేరు పకీరప్ప. పెంపుడు తలిదండ్రులు పెట్టిన పేరు గోవిందప్ప. అదే గోవిందరావుగా మారింది.

ఆంధ్ర నాటక కళాపరిషత్తు వ్యవస్థాపక సభ్యులతో వనారస గోవిందరావు, 1929

రంగస్థల ప్రస్థానం

వెంకోజీరావు దగ్గర సంగీతం, ఫేడేలు, నంద్యాల జ్యోతి సుబ్బయ్య కంపెనీలో చేరి పాటలు నేర్చుకున్నారు. ఆ కంపెనీలో వేసిన మొదటివేషం సత్యహరిశ్చంద్రలోని విశ్యామిత్రుడు.

మద్రాసులో నాటకాలను చూసిన గోవిందరావు తను కూడా స్టేజి నాటకాలు వేయాలని అనుకొని, సురభి గ్రామంలో కీచకవధ నాటకం ప్రదర్శించారు. అందులో గోవిందరావు నకులుడి పాత్ర ధరించారు. తరువాత 1857లో ‘శ్రీ శారదా మనో వినోదినీ సభ’ అనే నాటక సమాజాన్ని స్థాపించి, స్టేజి నాటకాలు వేయడం ప్రారంభించారు. ఆ సభే నేటి సురభి కంపెనీలకు మాతృసంస్థ.

తరువాత కంపెనీని సంచాల నాటక రంగంగా రూపొందించి, సంచారానికి పనికివచ్చే రేకులు, విద్యుత్ దీపాలు, వైర్ వర్క్ సామాగ్రి సంపాదించి పెద్దఎత్తున్న వివిధ ప్రాంతాలలో నాటక ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. రంగూన్ లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. స్త్రీలు నాటకాలలో నటించకూడదని అంటున్నకాలంలో తన భార్యాబిడ్డలను నాటకాలలో నటింపజేసి, సురభి నాటక సమాజాన్ని నాట్యశాస్త్ర విహిత సమాజంగా తీర్చిదిద్దారు.

1917లో భీమవరంలో అంకాదహనం నాటకంలో ఆంజనేయ పాత్రలో నటిస్తుండగా గోవిందరావు ధరించిన దుస్తులకు నిప్పంటుకొని దేహం కాలిపోయింది. నాటకాలలో నటించడానికి పనికిరాని పరిస్థితి ఏర్పడింది. అయినా కానీ సమాజాన్ని వదిలిపెట్టలేదు. హస్యం చేప్పేవారు. కాంతామణి నాటకంలో దొంగవేషం వేసి అద్భుతంగా నటించేవారు. అందుకే నాటక ప్రదర్శన కరపత్రాలలో ‘కంపెనీ ప్రొప్రెయిటర్ చే దొంగవేషం ధరింపబడును’ అని అచ్చు వేసేవారు.

1929నాటికే ఆంధ్రదేశంలో నాటకకళ క్షీణదశ ప్రారంభమైందని గ్రహించి దానిని సరైన మార్గంలో పెట్టడానికి పెద్దలతో కలిసి ఆంధ్ర నాటక కళా పరిషత్తు స్థాపించారు. ఆ సమయంలోనే ఆ పరిషత్తు ఆయనకు ‘ఆంధ్రనాటక కళోద్ధారక’ బిరుదుతో సన్మానించింది.

చివరిదశలో ఏలూరు దగ్గర పొలసనపల్లిలో స్థిరనివాసం ఏర్పరుచుకొని చాలా దానధర్మాలు చేశారు. ఆయన శిలా విగ్రహాన్ని కళాకారులు ఏలారులో ప్రతిష్ఠించారు.

ధరించిన పాత్రలు

విశ్వామిత్రుడునకులుడు, ఆంజనేయుడు, దొంగ, అర్జునుడు (సుభద్ర), రాజరాజ నరేంద్రుడు, హరిశ్చంద్రుడు, అనిరుద్ధుడు, రావణుడు, శ్రీరాముడు (సంపూర్ణ రామాయణం), విక్రమార్కుడు, బిల్వ మంగళుడు, జగన్మోహనుడు, హిరణ్యకశిపుడు, రుక్మాంగదుడు.

మరణం

జీవితాన్ని నాటకరంగానికి, నాటకోద్ధరణ కోసం ధారపోసిన వనారస 1953, డిసెంబర్ 19న మరణించారు.

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-5-22-ఉయ్యూరు 

Posted in సేకరణలు | Leave a comment

విశాఖ నటీమణులు

విశాఖ నటీమణులు

1- ఆకాశవాణి బిగ్రేడ్ ఆర్టిస్ట్ ,కృష్ణ వేష దారిణి,సత్యభామ చంద్రమతి ఫేం –రేకందార్ ఇందిరాదేవి

రేకందార్ ఇందిరాదేవి రంగస్థల నటి.

జననం
ఇందిరాదేవి, వనారస అబ్బాజీరావు, తిరుపతమ్మ దంపతులకు జన్మించింది.

రంగస్థల ప్రస్థానం
బాల్యంలోనే కృష్ణ లీలలో బాలకృష్ణుడుగా, కనక్తారాలో తారగా, భక్తప్రహ్లద లో ప్రహ్లదుడిగా నటించింది. చంద్రమతి, సత్యభామ, చింతామణి, సీత, లీలావతి మొదలగు స్త్రీ పాత్రలను అవలీలగా ప్రేక్షక జనరంజకంగా అభినయించింది. మాయాబజార్ లో, కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని పాత్రను కూడా ధరించి ప్రశంసలందుకొన్నది. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ‘బి’ హైగ్రేడ్ ఆర్టిస్ట్ గా అనేక శ్రవ్య నాటకాలలో నటించిన ఈమె ఎన్నో అవార్డులు – రివార్డులు, సత్కారాలు, సన్మానాలు అందుకుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పొందుతూ శేష జీవితాన్ని గడుపుతున్నది.

2-బహువిధ నాటక పాత్రధారిణి –రేకందార్ గుణవతి

రేకందార్ గుణవతి రంగస్థల నటి.

జననం
గుణవతి 1964, ఆగష్టు 22న విశాఖపట్టణం జిల్లా, నర్సింగరావుపల్లి లో శ్రీమతి వనారస సత్యనారాయణమ్మ, వనారస బాబూరావు దంపతులకు జన్మించింది.

రంగస్థల ప్రస్థానం
బాలపాత్రల ద్వారా రంగస్థలంపై అడుగుపెట్టింది.

సతీ అనసూయలో (గంగ, పార్వతి, అనసూయ) శ్రీకృష్ణ లీలలు లో (దేవకి, మాయపూతన), హరిశ్చంద్రలో (మాతంగ కన్య, కలహకంఠి), [[మాయాబజార్]] లో (కృష్ణుడు, సుభద్ర, సత్యభామ, శశిరేఖ), సావిత్రిలో (సావిత్రి), గుణసుందరిలో (హేమసుందరి), కాంతామతిలో (కాంచనమాల), పాతాళభైరవి లో (నళిని), బొబ్బిలియుద్ధం లో (చిన వెంకటరావు), బాలనాగమ్మ లో (మాణిక్యాలదేవి, లచ్చి, సంగు), భూకైలాస్ లో (పార్వతి), లవకుశ లో (భూదేవి, లచ్చి, కుశుడు), విక్రమార్కలో (ప్రమద), కనక్తారా లో (తార), భక్త ప్రహ్లదలో (లీలావతి), విశ్వనాథ విజయంలో (శ్రీకృష్ణ దేవరాయలు), శ్రీకృష్ణ తులాభారంలో (సత్యభామ), చింతామణి లో (చింతామణి), బ్రహ్మంగారి చరిత్రలో (వనకన్య, ఎరుకలసాని), రంగూన్ రౌడీ లో (అన్నపూర్ణ కుమారుడు-గిరికుమారి), చెంచులక్ష్మి లో (లీలావతి), ముగ్గురు మరాఠీలు (రుక్కురాణి-రఘు) మొదలైన పాత్రలలో నటించింది.

3-చిన్నతనం లోనే రంగస్థలాన్ని దున్నేసిన –రేకందార్ ప్రేమలత

రేకందార్ ప్రేమలత ప్రముఖ రంగస్థల నటి.

జననం
రేకందార్ ప్రేమలత 1957, ఆగష్టు 21 న శ్రీమతి వనారస భువనేశ్వరి, వనారస వెంకట్రావు దంపతులకు విశాఖపట్నం జిల్లా, రావికమతం మండలంలోని మేడివాడలో జన్మించింది.

రంగస్థల ప్రస్థానం
ఈవిడ పసిప్రాయంలోనే రంగస్థలంపై అడుగుపెట్టింది. ఐదు దశాబ్దాలకు పైబడిన రంగస్థల అనుభవం గడించి, అనేక పాత్రలను పోషించింది. గంగ, కృష్ణుడు, లవుడు, బాలవర్ధి, సంగు, వనకన్య, శశిరేఖ, శూర్పణఖ, ఊర్వశి, మాతంగ కన్య, రంభ, రాధాభాయి, పార్వతి, కనక సేనుడు, ఇందుమతి, చంద్రలేఖ, ప్రహ్లాదుడు, మన్మథుడు, అనసూయ, సావిత్రి పాత్రలు పోషించారు.

4-డిప్లొమా ఇన్ యాక్టింగ్ ,డైరెక్షన్ పొంది ,ఆకాశవాణి దూరదర్శన్ లో బిగ్రేడ్ ఆర్టిస్ట్ ,ఎన్నోనాతకాలలో వైవిధ్య పాత్ర పోషించిన –ఎం .హేమ

హేమ. ఎమ్ ప్రముఖ రంగస్థల నటి.

జననం[మార్చు]
వీరు 1977 డిశంబరు 19న శ్రీమతి మహాలక్ష్మి, డి.ఎమ్. నాయుడు దంపతులకు విశాఖపట్నంలో జన్మించారు.

రంగస్థల ప్రవేశం[మార్చు]
1995 సంవత్సరం తన గురువుగారైన ఎల్. సత్యానందం దర్శవత్వంలోని ‘బొమ్మలాట’ నాటకంతో తన రంగస్థల నటజీవితాన్ని ప్రారంభించారు. ఈవిడ ప్రజా నాట్యమండలి బృదంతో కలిసి రైలుబండి, లెట్ ఇట్‌బి వేకస్ట్, గారడి లాంటి వీధి నాటికలలో శతాధిక ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఎయిడ్స్, పల్స్ పోలియో, మలేరియా లాంటి వాటిమీద ప్రజలకు అవగాహన కల్పించే వీధి నాటకాల్లో పాత్రధారణ గావించారు.

రంగస్థల నటిగా దాదాపు 15 సంవత్సరాల అనుభవం గడించిన ఈవిడ పలు పరిషత్తులలో ఉత్తమ నటిగా, సహాయనటిగా, ప్రతినాయకిగా, శతాధిక బహుమతులను అందుకున్నారు. 2002లో కళాజగతి మాసపత్రికవారు కళాజగతి అవార్డును ప్రదానంచేశారు.

డిప్లమా ఇన్ యాక్టంగ్, డిప్లమా ఇన్ డైరెక్షన్ లో ఆంధ్రా యూనివర్సిటీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. నాగపూర్ వర్క్ షాప్ లో 60రోజులు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఒక ఏడాదిపాటు శిక్షణ పొందారు. ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ఆడిషన్ లో ‘బి’ హైగ్రేడ్ స్థానాన్ని పొందారు.

రావూజీ, మందులు, అత్తిలి కృష్ణారావు, చలసాని కృష్ణప్రసాద్, ప్రసాదమూర్తి ముదనూరి, కృష్ణచైతన్య, మిశ్రో, కె.ఎస్.టి. శాయి, కె.జి.ఆర్. గాంధి, నాయుడు గోపి లాంటి ప్రముఖ దర్శకుల నాటకాల్లో నటించి నటనలోని మెళకువలను నేర్చుకున్నారు.

నటించినవి[మార్చు]

  1. అతనికోసం ఇతను
  2. మపకేయకే చందమామ
  3. పోస్టర్
  4. శ్రీకారం
  5. ఆరణి
  6. చదరంగం
  7. కుక్కపిల్ల దొరికింది
  8. హుళక్కి ఇచ్చుటలో వున్న హాయి
  9. భారతరత్న
  10. దర్పణం
  11. ఒంటెద్దు బండి
  12. అంబేద్కర్
  13. మబ్బుల్లో బొమ్మ
  14. కకావికలం
  15. మైదానం
  16. జీవన సంధ్య
  17. పండగొచ్చింది
  18. నిమజ్జనం
  19. అనంతరాగం
  20. పడమటిగాలి
  21. దిగేమ్
  22. వందేమాతరం
  23. సావిత్రి సవాల్
  24. అంతర్మథనం
  25. పెద్ద బాలశిక్ష
  26. అంతరాలు
  27. తులసీతీర్థం
  28. భరతవాక్యం
  29. మధ్యతరగతి మందహాసం
  30. కాబూలీవాలా
  31. మనోధర్మం
  32. అతిథి దేవుళ్లోస్తున్నారు జాగ్రత్త
  33. సిద్ధార్థ
  34. అద్దంలో చందమామ
  35. శాంతి యుద్ధం
  36. తలుపు
  37. ఇక్కడ కాసేపు ఆగుదాం
  38. పితృవనం
  39. మానవత్వానికి మరో కోణం
  40. లగాబుస్ లచ్చన్న
  41. కాలుష్యం
  42. పులుస్టాప్ కాదు కామా మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-5-22-ఉయ్యూరు
Posted in రచనలు | Leave a comment

కూచిపూడి నాట్యగురువు ,పరిశోధకా చార్య ‘’లాస్యప్రియ అకాడెమీ’’ స్థాపకురాలు ,సంగీత నాటక అకాడెమి అవార్డీ-డా.ఉమా రామారావు

కూచిపూడి నాట్యగురువు ,పరిశోధకా చార్య ‘’లాస్యప్రియ అకాడెమీ’’ స్థాపకురాలు ,సంగీత నాటక అకాడెమి అవార్డీ-డా.ఉమా రామారావు

శ్రీమతి డాక్టర్ ఉమా రామారావు కూచిపూడి నర్తకి, నృత్య దర్శకురాలు, పరిశోధకులు, ఆచార్యులు, రచయిత్రి. 1985 లో హైదరాబాదులో తాను స్థాపించిన లాస్యప్రియ డ్యాన్స్ అకాడమీకి నిర్దేశకులు కూడా. భారతదేశానికి చెందిన సంగీత, నృత్య, రూపక అకాడమీ 2003 లో ఉమా రామారావుని సంగీత్-నాటక్ అకాడమీ అవార్డుతో సత్కరించింది.

పుట్టు పూర్వోత్తరాలు
4-జూలై-1938 న “ఉమా మహేశ్వరి” డా. శ్రీ వి.వి. కృష్ణారావు, శ్రీమతి సౌభాగ్యం లకు విశాఖపట్టణంలో జన్మించింది. సాహిత్యం, సంగీతం, నృత్యాల యెడల అమితాసక్తిగల వేదపండితుల ఇంట జన్మించటం, వారందించిన స్ఫూర్తి, ప్రేరణలతో 5వ ఏటి నుండే ఆచార్య పి.వి.నరసింహా రావు, పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ, బ్రహ్మశ్రీ వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రి, గురు పక్కీరిస్వామి పిళ్ళై, గురు సి.ఆర్. ఆచార్యల వద్ద కూచిపూడి, భరతనాట్యం, ఇతర సాంప్రదాయిక నృత్యరీతులని అభ్యసించటం ప్రారంభించింది. ఈ నృత్యరీతుల సైద్ధాంతిక, ఆచరణీయ కారకాలని అవపోసన పట్టినది.

తొలినాళ్ళలో సోదరి సుమతీ కౌశల్‌తో బాటు పలు సందర్భాలలో పలు ప్రదేశాల్లో గురువుల వ్యక్తిగత పర్యవేక్షణలో ప్రదర్శనలు చేసింది. 1953-55 లలో అప్పటి మద్రాసు ప్రభుత్వం నిర్వహించిన శాస్త్రీయ సంగీత, నృత్య పరీక్షలలో ఉత్తీర్ణురాలైనది. అటు పిమ్మట డా. నటరాజ రామకృష్ణ గారి ఆశీస్సులతో భావి తరాలకు ఈ సంప్రదాయాన్ని అందించేందుకు ఆచార్యుల వృత్తిని చేపట్టారు.

అర్థశాస్త్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పోస్టు-గ్రాడ్యుయేట్ పట్టాని పుచ్చుకొన్నారు.

ప్రదర్శనలు
పేరొందిన నాటి, నేటి రచయితల గీతాలకు పలు ఏకపాత్ర నృత్యాలను, నృత్య లక్షణాలను, నృత్య రూపకాలను, సాంప్రదాయికి యక్షగానాలను వినూత్న రీతిలో నృత్య దర్శకత్వం వహించటంతో ఉమా రామారావు ప్రసిద్ధికెక్కారు. శ్రీ త్యాగరాజ నౌకాచరిత్ర, ప్రహ్లాద భక్తి విజయం, షాహజీ రాజు శంకర, విష్ణు పల్లకీ సేవా ప్రబంధనాలు, విఘ్నేశ్వర కళ్యాణం, నారాయణ తీర్థుల సాధ్వి రుక్మిణి, మాతృభుతయ్యుల పారిజాతాపహరణం, కాకుటూరి పద్మావతి గారి మందాకిని, శివ కాత్యాయని వంటి సాంప్రదాయిక రూపకాలు, విశ్వదీపం, పంచనదీయం, సినారె వారి స్వరరాగనర్తనం, తెలుగు వెలుగులు, మేధ, కంప్యూటరు పై మేధావికాస్ వంటి నృత్య లక్షణాలు వారిలో నృత్య దర్శకత్వం లోని బహుముఖ పాటవాన్ని, పాండిత్యాన్ని బహిర్గతం చేసింది.

బోధనా వృత్తి
ఈ నేపథ్యంతో హైదరాబాదుకి చెందిన శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో సీనియర్ లెక్చరర్ గా 1969 నుండి 1988 వరకు భరతనాట్యంలో విద్యార్థులకు సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ కోర్సులను బోధించింది. తర్వాత పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయిలో నృత్య విభాగానికి అధిపతిగా బాధ్యతలు చేపట్టారు.

నృత్యకళలో విద్యార్థుల పరిశోధన, ఇతర కార్యకలాపాలలో పర్యవేక్షణకై ‘షాహజీ రాజు యక్షగాన ప్రబంధాలు’ (షాహజీ 1684 నుండి 1712 వరకూ తంజావూరుని పరిపాలించిన ఒక మరాఠీ రాజు. ఈయన తెలుగు భాషలో ఇరవై యక్షగానాలని కూర్చారు.) అనే థీసిస్ ని తెలుగు విశ్వవిద్యాలయానికి సమర్పించి 1994 లో పీహెచ్ డీ పట్టాతో బాటు బంగారు పతకాన్ని కూడా అందుకొన్నారు.

తెలుగు విశ్వవిద్యాలయానికి నృత్య విభాగానికి అధిపతి అయిన డా. అలేఖ్య పుంజాల,[1] జ్యోతి లక్కరాజు, మాధురి కిషోర్, పద్మ చేబ్రోలు, పల్లవి కుమార్ లు వీరి ప్రియ శిష్యురాళ్ళే.

లాస్యప్రియ డ్యాన్స్ అకాడమీ
1985 లో లాస్యప్రియా డ్యాన్స్ అకాడమీని హైదరాబాదులో స్థాపించారు. ఈ కళాశాల కూచిపూడి, భరతనాట్యం లలోని నృత్య సాంప్రదాయలని సైద్ధాంతిక, ఆచరణీయ అంశాలపై శిక్షణనిస్తూ విద్యార్థులని రాష్ట్ర ప్రభుత్వ, విశ్వవిద్యాలయ స్థాయిలో పరీక్షలకి సిద్ధం చేస్తుంది. లాస్యప్రియ ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి అనుబంధ సంస్థ.

అవార్డులు , సత్కారాలు
నాట్యం పట్ల తమకున్న అంకిత భావానికి, నిబద్ధతకి, నాట్యానికి తామందించిన సేవలకి వారికి ఎన్నో అవార్డులు, సత్కారాలు లభించాయి. వాటిలో కొన్ని:

· ఆం. ప్ర ప్రభుత్వం నుండి కళా నీరాజనం, ఉత్తమ అధ్యాపకులు

· ఉత్తర అమెరికా అన్నమాచార్య మునీశ్వర సంస్థ నుండి శ్రీ కళాపూర్ణ

· పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు నుండి ప్రతిభా పురస్కారం

· 26-అక్టోబరు-2004 లో సంగీత్-నాటక్ అకాడమీ అవార్డు

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-5-22-ఉయ్యూరు

Posted in సేకరణలు | Leave a comment

రాంగేయ రాఘవ -3చారిత్రిక దృష్టి

రాంగేయ రాఘవ -3
చారిత్రిక దృష్టి
రాఘవసృజనాత్మకంగా ‘’ముర్దోం కా టీలా’’నవలను అద్భుతకల్పనలతో రాశాడు .ఆర్యులు దురాక్రమణ దారులు గా ,ద్రావిడులు సర్వం కోల్పోయిన వారిగా చెప్పాడు .మొత్తం భారతీయ మానవ వికాసం దృష్ట్యా ఆయన పరిశీలించి చెప్పాడు .బానిసబతుకు వ్యతిరేకించాలని ఉద్బోధించాడు .’’ధూళి కణమా హిమాలయంగా మారిపో. నా ధమనుల్లో ద్రావిడ రక్తం కుతకుత ఉడుకుతోంది .సింహ గర్జనలతో వెంటాడి పోరాడు ‘’అంటాడు .మొహంజొదారో నేపధ్యం లో రాసిన నవల ఇది .కన్హైలాల్ హరప్పా నాగరకత నేపధ్యం లో రాశాడు .రెండిటిలోనూ వస్తువు ఒక్కటే ఆర్యుల దండయాత్ర .తనపాత్రలు చరిత్రలో ఏ దశలో ఉంటె ,అలాగే ఆలోచించి విధులు నిర్వహిస్తాయి ‘’అన్నాడు రాఘవ .చింతన ఆధారం గా కొత్త శిఖరాలు అందుకోవాలి ,పరిణామ క్రమం లో ప్రగతి చూపాలని చెప్పాడు .జ్ఞానాన్వేషణలో ఉదారబుద్ధి తిరస్కరిస్తే అంధకారం లో పడిపోతాం .రాగ ద్వేషాలకు అతీతంగా చారిత్రిక సంఘటనలు వ్యక్తులమీద శాస్త్రీయంగా వ్యాఖ్యానించాడు .సంస్కృతీ సంబంధ మైన ‘’అంతర్భుక్తి ‘’సిద్దాన్తానికే ఎక్కువ ప్రాదాన్యమిచ్చాడు .మనమంతా భారతీయులం ,మానవులం అని ఎలుగెత్తి చాటాడు .వేదాలలో యక్ష గాంధర్వ జైన పరంపరలో కూడా ఈ సిద్ధాంతం ఉంది .సంచార జాతులు ఆకలి దప్పులవల్ల నిరంతరం స్థాన చలనం లోఉండేవి .
రామగాధ వివరిస్తూ రామసుగ్రీవ సఖ్యం ఆర్య అనార్య పరస్పర ఆదాన ప్రదానంగా భావించాడు .దీనివల్ల జాతుల సమ్మేళనం జరుగుతుందన్నాడు .క్షత్రియులు బ్రాహ్మణులు ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో జీవితం సాగించారు .పౌరాణిక విశ్వాసాలు జాతుల పోరాటం గురిచి చెప్పేటప్పుడు ‘’టాటే౦’’ను ఆధారం చేసుకొన్నాడు .మహాయాత్రా రెండవ భాగం లోస్కంద గుప్తుడు కుభా నది అంటే కాబుల్ నది చేరి ప్రాణార్పణ చేసుకొంటూ మధురభూమికి నమస్కరిస్తాడు కారణం ఇక్కడే అన్యాయ అత్యాచారాలకు వ్యతిరేకంగా శ్రీ కృష్ణుడు కంసుడిని సంహరించాడు .ఇలా అన్యాయ ప్రతిఘటన రాఘవ ధ్యేయం .గుప్త రాజుల నీతి ప్రజాకల్యా ణ౦గా సాగింది అంటాడు .ప్రజల సుఖ దుఖాల దృష్టితో చరిత్ర పరిశోధన చేయాలన్నాడు .
నాగసేన –పతంజలి సంఘర్షణలో బౌద్ధ బ్రాహ్మణ సంఘర్షణ ఉందన్నాడు .బ్రాహ్మణులు స్వదేశీప్రేమికులుగా గెలిస్తే ,బౌద్ధులు విదేశీయులతోచేతులు కలిపి ఓడిపోయారుఅని వ్యాఖ్యానించాడు .స్వాతంత్ర్య కాంక్షతో మౌర్య చంద్రగుప్తుడు ,పుష్యమిత్రుడు స్కంద గుప్తుడు హర్షుడే కాక రాణాప్రతాప్ ,బహదూర్ షా జాఫర్ ,వాజిదలీ షా ప్రజాసంక్షేమం కోసం ఒక గొప్ప దేశనిర్మాణ౦ కోసం బలిదానం చేసిన మహా వీరులు అన్నాడు .భారతచరిత్ర బాహిరరూపాన్నే కాక ఆన్తర్యాన్నికూడా స్ప్రుసించాను.నిజానికి భారత చరిత్ర వాస్తవానికి దుర్లభమైనది .దాన్ని పరిశోదించటం కేవలం చరిత్రను మాత్రమె చెప్పటం కాదు’’ అన్నాడు .కేనోపనిషత్ వాక్యాన్ని ఉదాహరిస్తూ తన చారిత్రిక దృక్పధాన్ని వివరించాడు .బ్రహ్మజ్ఞాన పరిజ్ఞానం చాలా అల్పమైనదని ఉపనిషత్ కారుడు అన్నాడు అంటాడు .కానీ ఆ సత్యాన్ని తెలుసుకొని మననం చేయాలి అని స్పష్టంగా చెప్పాడు .
రాఘవ కావ్యాలలో మానవ కల్యాణం
రాఘవ సాధనా సంపత్తిలో అతడి కావ్య వైశిష్ట్యం ఉజ్వల సాహిత్య సౌందర్యం అన్నాడు ఒక విశ్లేషకుడు .జయశంకర ప్రసాద్ రాసిన ‘’కామాయినీ ‘’కి పోటీగా రాఘవ ‘’మేధావీ ‘’పద్య కావ్యం రాశాడు .ఇది మానవుడి మౌలిక చింతనా వేదన .తర్వాత సామాజిక స్పృహ ,సమకాలీన చైతన్యంతో’’పాంచాలి ‘’ఖండకావ్యం రాశాడు .నాజీ దురాక్రమణ ను తిప్పికొట్టిన రష్యా ప్రజల వీరోచిత పోరాటాన్ని ‘’అజేయ ఖాన్దహార్ ‘’కావ్యంగా రాశాడు .రష్యా సోషలిస్ట్ సమాజం మానవ విముక్తి దీపం లా వెలుగుతుంది .రష్యన్ల విజయాలు భారత దేశానికి ,సమస్త పీడిత మానవాళి కి సంబంధించిందని అంతర్జాతీయ దృష్టితో చెప్పాడు.చైనాలో ప్రజాపోరాటం నిర్ణయాత్మక దశకు ,భారత జాతీయోద్యమమం చివరి మలుపు కు తిరిగింది .రాఘవ దేశాలు సరిహద్దులు దాటి ఆలోచించాడు. సకల జీవన తత్వాలు ఒక్క చోటికితెచ్చి ఆకళింపు చేసుకొన్నాడు .మానవ జీవన శక్తి సత్యాన్ని చాటి చెప్పాడు .తత్వశాస్త్రం ఖగోళం చరిత్ర సాంఘిక రాజకీయాలన్నీ తనకావ్యం లో కలగలిసి పోయాయని చెప్పుకొన్నాడు .
మేధావి కావ్యం ప్రబంధంగా ఉంటుంది .మేధావి పాత్ర మానవ వినాశనానికి చింతిస్తుంది .వర్తమాన ప్రేరణకోసం పురాణ విషయాలు తెలిపాడు .పాంచాలి ఆత్మాభిమానమున్న స్త్రీ .ధర్మరాజు నుకొత్తగా ఆవిష్కరిస్తాడు .ధర్మాన్ని తనపై అమలు చేసుకోనిచూస్తేనే సత్య దర్శనం అవుతుందని యుధిష్ఠిరుడు అంటాడు .నిరంకుశత్వాన్ని వ్యతిరేకించాడు ధర్మరాజు ,మానవతా దార్శనికుడు ,.తన సోదరుల వీర విక్రమ పరాక్రమాలు తనకు పూర్తిగా తెలుసుననీ ,ఈ సంఘర్షణలో తాను చనిపోయినా ,తనధర్మానికి క్షతి ఏర్పడేదికాదు అంటాడు పా౦చాలితొ . ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి ,బాధ్యతాయుత ధర్మనిర్వాహణ కు, యుగ కర్తవ్యానికి ఇవి మచ్చు తునకలు .జయద్రధుడు ద్రౌపది పై మోహ పరవశుడై వస్తే ‘’నేను కురుభూమిలో విజయ పతాకను నేను చక్రవర్తి మహిమా వైభవాన్ని .ఓరీ సేవకుడా నువ్వు నన్ను భరించగలవురా ఓరీ ఉన్మాదీ!నువ్వు మాతృహీనుడవా పాపీ !స్త్రీ గౌరవం తెలీని మూర్ఖుడా !నేను పవిత్రతను ,కులస్త్రీని ,మాతృ మూర్తిని .నువ్వా నాకు ఆశలు చూపేది ?.జీవితమే రణ రంగం .నేనుచేతులుమారే వస్తువును కాను ద్రోహీ ‘’అంటుంది .జయద్రదుడికి తగిన గుణ పాఠం చెప్పాలని పాండవ సోదరులు భావించినప్పుడు ద్రోపది ‘’ఏది చేస్తే ధర్మం గెలుస్తుందో ,అదే చేస్తాను .అపరాధిని వదిలి క్షమా గుణం చూపిస్తాను ‘’అని ధర్మరాజు తనను ఆవహించినట్లు ధర్మబద్ధంగా చెప్పింది పాంచాలి .అదీ రాఘవ కవిత్వ మహోత్రుష్టత .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-5-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-267

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-267
• 267-నాటక నట గాయక దర్శకుడు ,సినీ నారద ,మార్కండేయ ,మైరావణ ఫేం –త్రిపురారి భట్ల రామకృష్ణ శాస్త్రి
• త్రిపురారిభట్ల రామకృష్ణశాస్త్రి (ఏప్రిల్ 10, 1914 – మే 21, 1998) రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. రామకృష్ణశాస్త్రి 1920, 1930వ దశకాల్లో చెందిన గాయకుడు. ఈయన తెనాలి శ్రీరామ విలాస సభలో దర్శకుడిగా పనిచేశాడు.[1]
జననం
రామకృష్ణ శాస్త్రి 1914, ఏప్రిల్ 10వ తేదిన రాఘవయ్య, కామేశ్వరమ్మ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోని పెదరావూరు గ్రామంలో జన్మించాడు.
నాటకరంగం
వంశ పారంపర్యముగా వచ్చిన ‘తరంగ గానం’ను చిన్నవయసులోనే నేర్చుకన్నాడు. 9వ ఏట తెనాలి రామవిలాస సభలో బాలనటుడిగా చేరి అనేక నాటకాల్లో నటించాడు.[2] ఈయన కొన్ని గ్రామోఫోను రికార్డుల్లో కూడా పాడాడు. 1926లో గుంటూరులో బాలమిత్ర సభను ప్రారంభించి, బాలనటులతో ఒక బృందాన్ని తయారుచేసిన దంటు వెంకటకృష్ణయ్య ఆహ్వానం మేరకు రామకృష్ణ శాస్త్రి ఆ సమాజంలోకి చేరి ‘రోషనార’లో శివాజీ, ‘కృష్ణలీలలు’ లో యశోద, ‘రామదాసు’ లో రామదాసు పాత్రలు పోషించాడు. పువ్వుల సూరిబాబు, కళ్యాణి, నాగలింగం వంటి నటులు కూడా ఆ సంస్థలో ఉన్నారు.
నాటక సమాజాలు మూతపడిపోయినకాలంలో స్థానం నరసింహారావు, సి.యస్.ఆర్. ఆంజనేయులు లతో కలసి ఊరురా తిరిగి ‘తులాభారం’ నాటకంలో నారదుడుగా నటించి మెప్పించాడు. సినిమారంగంలో ఉంటూనే కలియుగ ఆంజనేయ బిరుదాంకితుడైన బేతా వెంకటరావు ‘రామాంజనేయ యుద్ధం నాటకంలో నారదుని పాత్రలో అనేక ప్రదర్శనలిచ్చాడు. ఇతర నాటక సమాజాలు ప్రదర్శించిన నాటకాలలో బిల్వమంగలుడు, శివయోగి, రామదాసు, కబీరు, నారదుడు పాత్రలలో నటించాడు.[3]
సినిమారంగ౦ ]
నారదుడిగా రామకృష్ణ శాస్త్రి నటనను చూసిన దర్శకుడు చిత్రపు నరసింహారావు 1937లో తాన దర్శకత్వం వహించిన ‘మోహిని రుక్మాంగద’ సినిమాలో నారద పాత్రకు శాస్త్రిని ఎంపిక చేశాడు. అలా దాదాపు 12 సినిమాలలో నటించాడు.[4]
నటించిన చిత్రాలు
• 1937: మోహిని రుక్మాంగద – నారదుడు
• 1938: భక్త మార్కండేయ
• 1940: మైరావణ
• 1941: దక్షయజ్ఞం
• 1942: ప్రహ్లాద
• 1942: సుమతి
• 1943: గరుడ గర్వభంగం
• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-268
• 268-షూటింగ్ లో ఫస్ట్,షిప్ యార్డ్ ఉద్యోగి ,సినీసహాయనటుడు –వంకాయల సత్యనారాయణ మూర్తి
• వంకాయల సత్యనారాయణ ఒక తెలుగు నటుడు.[1] సహాయ నటుడిగా దాదాపు 180 తెలుగు సినిమాలలో నటించాడు.[2]
జీవిత విశేషాలు
ఈయన 1940 డిసెంబరు 28న విశాఖపట్నంలో జన్మించాడు. బి. కాం లో బంగారు పతకం సాధించాడు. 1960 లో షూటింగ్‌ పోటీలో భారతదేశంలోనే మొదటి స్థానం పొందాడు. చదువు, క్రీడల్లో ప్రతిభ ఆధారంగా ఆయనకు హిందుస్థాన్ షిప్ యార్డులో ఉద్యోగం వచ్చింది. 1970 లో నాటకరంగంలోకి ప్రవేశించాడు. 1976 లో నీడ లేని ఆడది సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు. దాదాపు 180కి పైగా సినిమాల్లో ఎక్కువగా సహాయ నటుడి పాత్రలు పోషించాడు. సీతాకోక చిలుక, సూత్రధారులు, సీతామాలక్ష్మి, దొంగకోళ్ళు, ఊరికిచ్చిన మాట, విజేత, స్టేషన్ మాస్టర్, మావి చిగురు లాంటి సినిమాల్లో ఆయన చెప్పుకోదగ్గ పాత్రలు పోషించాడు. పలు టెలివిజన్ ధారావాహికల్లో కూడా కనిపించాడు. ఆయన చివరి సినిమా కారం దోసె.
ఆయన భార్య శకుంతల. వీరికి ఇద్దరు కుమార్తెలు.
సినిమాల జాబితా
ఈయన నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
1. అయినవాళ్ళు (1976)
2. అర్ధాంగి (1977)
3. సీతామాలక్ష్మి (1978)
4. కమలమ్మ కమతం (1979)
5. కుక్క కాటుకు చెప్పు దెబ్బ (1979)
6. మా ఊళ్ళో మహాశివుడు (1979)
7. రతీమన్మథ (1979)
8. ఊరికిచ్చిన మాట (1981)
9. శుభలేఖ (1982)
10. శివుడు శివుడు శివుడు (1983)
11. నవమోహిని (1984)
12. మంత్ర దండం (1985)
13. విజేత (1985)
14. ఊరేగింపు (1988)
15. జానకిరాముడు (1988)
16. మహారాజశ్రీ మాయగాడు (1988)
17. సూత్రధారులు (1990)
18. అత్తింట్లో అద్దెమొగుడు (1991)
19. ఆశయం (1993)
20. రుక్మిణి (1997)
21. కారందోశ (2016)[3]
ఇతర విశేషాలు
• 1958లో కొచ్చిన్‌లో ఎన్‌సిసి క్యాడెట్లకు జరిగిన పోటీలలో ఆలిండియా ఉత్తమ జూనియర్‌ క్యాడెట్‌గా నిలిచారు.
• 1958లో కొచ్చిన్‌లో ఎన్‌సిసి క్యాడెట్లకు జరిగిన పోటీలలో ఆలిండియా ఛాలెంజ్‌ బోట్‌ రోయర్‌ బహుమతిని గెలుచుకున్నారు.
• 1960లో ఢిల్లీ రిపబ్లిక్‌ డే కవాతులో పాల్గొన్నారు.
• 1960 ఆగస్టులో షూటింగ్‌ కాంపిటీషన్‌లో భారతదేశంలోనే మొదటి స్థానం పొందారు.
• బి.కాంలో బంగారు పతకం అందుకున్నారు.
• జిల్లాస్థాయి కందుకూరి పురస్కారం – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 30 ఏప్రిల్ 2017.[4]
మరణం
కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న వంకాయల సత్యనారాయణమూర్తి 2018 మార్చి 12 న మరణించారు.[5][6]
• సీతామహాలక్ష్మి ,శ్రుతిలయలు సినిమాలలో చిరస్మరణీయ నటన ప్రదర్శించాడు .
• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-269
• 269-భాషా పరిశోధకుడు ,వ్యావహారిక భాషోద్యమనాయకుడు ,ఆంద్ర విజ్ఞాన సర్వస్వం లో విలువైన వ్యాసరచయిత ,సాహిత్య అకాడెమి అవార్డీ,గిడుగు వారి పుత్రుడు ,రైతుబిడ్డ స్వర్గసీమ సినీ ఫేం –గిడుగు సీతాపతి
• గిడుగు వెంకట సీతాపతి (జనవరి 28, 1885 – ఏప్రిల్ 19, 1969) ప్రసిద్ధ భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత. పలు గేయాలను పిల్లలకోసం రాసిన సాహిత్యవేత్త. ఇతని బాలసాహిత్యంలో ప్రాచుర్యం పొందినది చిలకమ్మపెళ్ళి.
జననం
వీరు జనవరి 28, 1885 సంవత్సరంలో విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో తెలుగు వ్యావహారిక భాషోద్యమ సారథి అయిన గిడుగు వెంకట రామమూర్తి దంపతులకు జన్మించారు.
మద్రాసు క్రైస్తవ కళాశాలలో చరిత్రలో పట్టభద్రులై కొంతకాలం పర్లాకిమిడిలో చరిత్రోపన్యాసకులుగా పనిచేశారు. వ్యావహారిక భాషోద్యమంలోను, సవర భాషోద్ధరణలోను తండ్రికి కుడిభుజంగా నిలిచి విశేషానుభవం గడించారు. రైతుబిడ్డ, స్వర్గసీమ, పల్నాటి యుద్ధం, భక్తిమాల వంటి కొన్ని చలనచిత్రాలలోను, కొన్ని నాటకాలలోను నటించారు.
1945లో మాగంటి బాపినీడు సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్ర సర్వస్వముకు అనేక వ్యాసాలు రచించి విశేషంగా తోడ్పడ్డారు. 1949లో తెలుగు భాషా సమితి ఏర్పడినపుడు తెలుగు విజ్ఞాన సర్వస్వపు ప్రధాన సంగ్రాహకులుగా నియమితులయ్యారు. చరిత్ర-రాజనీతి సంపుటం సంపాదక వర్గంలో ప్రముఖపాత్ర వహించారు. సూర్యరాయాంధ్ర నిఘంటువుకు చివరిదశలో వీరు గౌరవ సంపాదకులుగా పనిచేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ సంకలితం చేసిన భారతీయ గ్రంథసూచిలో తెలుగు విభాగానికి వీరు సంపాదకత్వం వహించారు.
వీరు రచించిన తెలుగు కావ్యాలలో ముఖ్యమైనవి: ‘భారతీ శతకము’, ‘సరస్వతీ విలాసము’, ‘కొద్ది మొర్ర’. వీరు రాసిన ‘బాలానందము’ వంటి బాల సాహిత్య రచనలు విశేష ప్రజాదరణ పొందాయి. వీరు బైబిల్ లోని మూడు సువార్తలను సవర భాషలోకి అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి అభ్యర్ధనపై తెలుగు సాహిత్య చరిత్రను ఇంగ్లీషులోకి అనువదించారు. వీరు రచించిన ‘తెలుగులో ఛందోరీతులు’ అనే గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
వీరి కుటుంబం ఆంధ్రాభిమానానికి ప్రసిద్ధికెక్కింది. పర్లాకిమిడి తాలూకాను ఒడిషా రాష్ట్రంలో చేర్చడానికి జరిగిన ప్రయత్నాన్ని వీరు, వీరి తండ్రి రామమూర్తి తీవ్రంగా ప్రతిఘటించారు. తెలుగువారి పక్షాన వాదించడానికి 1933లో వీరు లండన్ వెళ్ళి, శామ్యూల్ హోర్ మొదలైన వారి ఎదుట యుక్తిగా వాదించారు. అయినా 1936లో పర్లాకిమిడి తాలూకా ఒడిషా రాష్ట్రంలో భాగంగా ఏర్పడింది.
తండ్రి అనంతరం రాజమండ్రి చేరిన సీతాపతి రాజకీయాలలో పాల్గొని జిల్లా బోర్డు, మునిసిపల్ కౌన్సిల్, సెనేట్ మొదలగు సంస్థలలో సభ్యులుగాను, అధ్యక్షులుగాను పనిచేశారు.
వీరికి ఆంధ్రవిశ్వకళాపరిషత్ కళాప్రపూర్ణ ఇచ్చి గౌరవించింది. వీరి ఇంగ్లీషు రచనలలోని విశిష్టతను గుర్తించి వాషింగ్టన్ లోని అంతర్జాతీయ అకాడమీ వీరికి డి.లిట్. గౌరవం ఇచ్చింది.
మరణం
వీరు ఏప్రిల్ 19, 1969లో హైదరాబాదులో పరమపదించారు.
నటించిన సినిమాలు
• పల్నాటి యుద్ధం(1947) ……కొమ్మరాజు
• భక్తిమాల(1941) …..రామానుజాచారి
• రైతుబిడ్డ(1939) ….జమీందార్
• పంతులమ్మ(1943) …..గూడవల్లి రామభ్రహ్మం
• మాలపిల్ల(1938) ……..గూడవల్లి రామభ్రహ్మం
• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-270
• 270-ఏకపాత్రాభినయ ,నాటక ఫేం ,నంది రఘుపతి వెంకయ్య అవార్డ్ గ్రహీత ,’’మా’’ప్రధాన కార్యదర్శి ,బట్టలసత్యం గా హాస్య సినీ గుర్తింపు .మాండలికం లో దిట్ట –మల్లికార్జున రావు
• మల్లికార్జునరావు (అక్టోబర్ 10, 1960 – జూన్ 24, 2008) తెలుగు సినీ, రంగ స్థల హాస్య నటులు.[1] ఆయన పూర్తి పేరు పీలా కాశీ మల్లికార్జునరావు. పాఠశాల దశనుంచే నాటకాల్లో నటించే వారు. 50 నుంచి 60 నాటకాలూ, ఏకపాత్రాభినయం పాత్రలూ ఆయనకు నటన మీద మంచి పట్టు లభించేదానికి దోహదపడ్డాయి.
తొలి జీవితం
భమిడిపాటి రాధాకృష్ణ రాసిన లెక్కలు తెచ్చిన చిక్కులు ఆయన తొలి నాటకం. ఆయన్ని రంగస్థలంపై నటుడిగా నిలబెట్టింది పలుకే బంగారమాయె. ఇందులో నిర్మాత వేషం మల్లికార్జునరావుకి ఎంతో గుర్తింపు నిచ్చింది. అనకాపల్లిలోనే ఎ.ఎమ్‌.వి.ఎమ్‌. ఆసుపత్రిలో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. అక్కడి ట్రేడ్‌ యూనియన్‌కి నాయకత్వం వహించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
సినీ ప్రస్థానం
దివంగత నటులు రావు గోపాలరావు సహకారంతో చిత్రసీమలోకి ప్రవేశించారు. 1972లో తులసి అనే చిత్రంలో చిన్నవేషం వేశారు. ఆ సమయంలోనే పార్వతీ పరమేశ్వరులు చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. తరువాత నాగమల్లి లాంటి కొన్ని చిత్రాల్లో నటించారు. వంశీతో ఏర్పడ్డ పరిచయం ఆయన సినీజీవితాన్ని మలుపు తిప్పింది.
వంశీ మొదటిచిత్రం మంచు పల్లకీలో చిన్న పాత్ర పోషించారు. అన్వేషణలో పులిరాజుగా మల్లికార్జునరావు నటన చిత్రసీమను ఆకట్టుకొంది. అదే సమయంలో తన తండ్రి అస్వస్థతకు లోనైతే అనకాపల్లి వెళ్లడం వల్ల అవకాశాలు కోల్పోయారు. ‘లేడీస్‌ టైలర్‌’లో బట్టల సత్యం పాత్ర తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 350కి పైగా సినిమాల్లో నటించారు. తమ్ముడు సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును పొందారు. ఏప్రిల్‌ ఒకటి విడుదల, కనకమాలక్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్‌ట్రూపు, హలో బ్రదర్, ఆలీబాబా అరడజను దొంగలు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, బద్రి, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఎవడి గోల వాడిది, మా ఆయన సుందరయ్య (2001) లాంటి చిత్రాలు ఆయనకెంతో పేరు తీసుకొచ్చాయి. మల్లికార్జునరావు నటనలో తనకంటూ ఓ పంథాను ఏర్పరచుకొన్నారు. తొలినాళ్లలో రావుగోపాలరావు ప్రభావం ఉండేది. తన సంభాషణ శైలిలో ఉత్తరాంధ్ర యాసని మేళవించడంతో జనాన్ని సులభంగా ఆకట్టుకోగలిగారు. ఆ యాసనీ, మాండలికాన్నీ సాధికారికంగా మాట్లాడగలిగిన నటుడిగా గుర్తింపు పొందారు. అలాగే గ్రామీణ నేపథ్యం ఉన్న పాత్రలకు జీవంపోసే నటుల్లో ఆయన ముందుండే వారు. చివరిగా ఆయన నటించిన చిత్రం మహా నగరంలో.
నటించిన చిత్రాలు
• దాసన్నా (2010)
• అతడెవరు (2007)
• 143[2][3]
• ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి (2004)
• 6 టీన్స్ (2001)
• ప్రేమసందడి (2001)
• సాంబయ్య (1999)
• పవిత్ర ప్రేమ (1998)
• ఆలీబాబా అరడజను దొంగలు (1994)
పురస్కారాలు
• తమ్ముడు సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు.[4]
• రఘుపతి వెంకయ్య బంగారు పతకం (ప్రముఖ నటుడు గుమ్మడి స్థాపించారు)
పదవులు
• తెలుగుదేశం పార్టీతో సాంస్కృతిక విభాగానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా[1] ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి.
• మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు ప్రధాన కార్యదర్శిగా మూడు సార్లు ఎంపికయ్యారు.
తుదిశ్వాస
57 సంవత్సరాల వయస్సులో మంగళవారం 24 జూన్, 2008 ఉదయం 10.30 ని.లకు రక్త కేన్సర్‌ (లుకేమియా) వ్యాధితో తుదిశ్వాస విడిచారు.[1]
మల్లికార్జునరావు కనిపిస్తే చాలు హాస్యం పొంగుతుంది .ఏపాత్రలోనైనా ఒదిగి జీవంపోశాడు .మామంచినటుడు మల్లికార్జునరావు .
  సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-5-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

రాంగేయ రాఘవ -2

రాంగేయ రాఘవ -2
వ్యక్తిగతం-యుగసందర్భం
రా౦గేయరాఘవ పూర్వీకులు సుమారు రెండున్నర శతాబ్దాలకు పూర్వం దక్షిణ ఆర్కాడు నుంచి రాజస్థాన్ సరిహద్దు గ్రామాలైన వైర్,వారౌలీ జాగీరు క్షేత్రాలలో స్థిరపడ్డారు .ఆ వంశం లోనిశ్రీనివాసాచార్యుల పాండిత్యానికి మెచ్చి జైపూర్ మహారాజు ఒక జాగీరు ను ఇచ్ఛి ,రామాలయం కట్టించి ఆయన్ను అర్చకుడిగా నియమించాడు అంటే అగ్రహారీకుడుయ్యాడు .తమిళ సంస్కృత పండితుడు రంగా చార్యులు ఈ వంశం వాడే .ఈయనకు రాఘవ 17-1-1923న జన్మించాడు .తల్లి కనకవల్లి తమిళ సంస్కృతాలలో ,వ్రజభాషలో దిట్ట .ముగ్గురు సోదరుల్లో రాఘవ చివరి వాడు కనుక గారాబంగా పెరిగాడు .మేనత్త అక్కాజీ వ్రజభాషలో విదుషీ మణి.భర్త దేశికాచార్యులు వేద,వేదాంగాలలో అసమాన ప్రావీణ్య మున్నవాడు .శాస్త్ర చర్చల్లో అక్కాజీ కూడా పాల్గొనేది .ఇది రాఘవ పై గొప్ప ప్రభావం చూపింది .. రాఘవ అసలుపేరు ‘’తిరుమలైనంబాకం వీర రాఘవాచార్య ‘’.ఈపేరు స్కూలు, కాలేజీ రికార్డ్ లలో ఉంది .అతడి సన్నిహిత మిత్రుడు భరత్ భూషణ్ అగర్వాల్ సూచనతో తండ్రి పేరు కలిసి వచ్చేట్లు’’ రా౦గేయ్ రాఘవ్ ‘’గా మార్చుకొన్నాడు .తర్వాత రచనలన్నీ ఈ పేరుతోనే రాశాడు .ఇంగ్లీష్ మీడియం లోనే చదివాడు .ఆగ్రా విక్టోరియా స్కూల్ లో ప్రాధమిక విద్య ,,సెయింట్ జాన్స్ కాలేజిలోడిగ్రీ చదివాడు .1941లోతత్వ శాస్త్రం ఆర్ధిక శాస్త్రం ఇంగ్లీష్ సబ్జెక్ట్ లతో డిగ్రీ పొందాడు .అప్పుడే ఆర్ధిక శాస్త్ర పాఠాలు ఎగగొట్టి ‘’ఘరౌందా’’నవల రాశాడు .1943లో హిందీ లొఎమ్. ఎ .అయ్యాడు .ప్రొఫెసర్ హరిహర నాధ టాండన్ మార్గ దర్శకత్వం లో ‘’భారతీయ మధ్యయుగాలలో సంధికాల అధ్యయనం-గోరఖ్ నాధ యుగం ‘’ పై పరిశోధన చేసి ఆగ్రా యూనివర్సిటి నుంచి పిహెచ్ డి పొందాడు .పరిశోధన సామగ్రికోసం శాంతి నికేతన్ వెళ్లి అక్కడి ద్వివేదీ ‘’నాధ సంప్రదాయం ‘’పై రాసినా,అచ్చు వేయకపోవటం తో రాఘవకిచ్చాడు .అక్కడే అధ్యయనం చేసి కావాల్సిన విషయాలు తీసుకొన్నాడు రాఘవ .గొప్పలకోసం ఈ డిగ్రీని ప్రదర్శించలేదు రాఘవ .అది తాత్విక చిన్తనాధార గ్రంథం.
1937లో ‘’సాప్తాహిక్ విశ్వామిత్ర ‘’పత్రికలో రాఘవ మొదటి గీతం పడింది .ఇదేఅతడి భవిష్యత్తు నిర్ణయించింది సాహిత్య వ్యాసంగాన్ని జీవనాదారంగా ఎన్నుకోన్నాడు .ఆర్ధిక ఇబ్బందులెన్ని ఎదురైనా ఈ దారి వదలలేదు .రచయితగానే స్థిరపడాలనుకొని స్థిరపడ్డాడు .అన్ని ప్రక్రియలోనూ తనదైన ముద్ర వేశాడు .ఇది అంకిత భావంతోసాధించిన విజయం .’’సాహిత్యాకాశం లో రా౦గేయ రాఘవ ఉదయించటం ,అందరికి ఒక తోకచుక్క కాంతి కెరటం లా తోచింది ‘’అన్నాడు ఆయన ప్రొఫెసర్ ప్రకాశ చంద్ర .
రాఘవ ఉంటున్న గ్రామం వైర్ లో కరెంటు లేదు .వేసవి రాత్రులలో దోమతెరలలో లంటారు వెలిగించుకొని జాగారం చేస్తూ రచనలు చేసేవాడు .అందుకే పెళ్లి ఆలోచన రాలేదు . మేడమీద గుడ్డ పంఖాతాడుతో లాక్కొంటూ ఉక్కపోత నుండి తప్పించుకొనే వారు .రాఘవ అలాంటి తాడును కాలి వేళ్ళకు కట్టుకొని లాగుతూ ,బోర్లాపడుకొని రచనలు చేసేవాడు .రాఘవ 33వ ఏట తనకన్నా 14ఏళ్ళు చిన్నదైన సులోచనతో1956లో పెళ్లి జరిగింది .ఇదీ అంత తేలిగ్గా జరగలెదు.ఒకసారి ఒక అయ్యంగార్ల అమ్మాయిశకుంతల ను తనకోసం చూస్తె తన అన్నటిఎల్ఎన్ఆచార్య కు ఇప్పించి పెళ్లి చేయించాడు .అనేకసార్లు సులోచనతో మాట్లాడి తన రచనా వ్యాసంగానికి ఆమె అడ్డు పడదు అని హామీ పొందాకనే మెట్రిక్ చదివిన ఆమె ను పెళ్ళాడాడు .బొంబాయి మాతు౦గాలో వీరి వివాహం 7-5-1956న అతి సామాన్యంగా జరిగింది .ఆరేళ్ళ దాంపత్యం లో వీరిద్దరూ కలిసి ఉన్న కాలం చాలా తక్కువే .రాఘవ కోరిక ప్రకారం బొంబాయిలోనే ఉంటూ ఇంటర్ డిగ్రీ పూర్తీ చేసింది .ఇది ఆమె కు తర్వాతకాలం లో బాగా ఉపయోగపడింది .వీరిఏకైక సంతానం సీమంతిని వయసు రాఘవ తన 39వయేట మరణించే నాటికి కేవలం నాలుగేళ్ళు మాత్రమె .తల్లి కనకవల్లి తో రాఘవకు విడదీయరాని అనుబంధం .ఆమె కేన్సర్ తో 1959లో చనిపోయింది .
రాఘవ 1960లో జైపూర్ వచ్చేనాటికి ఆయన మెడమీద ఒక రాచపుండు ఏర్పడి అది ఆగ్రా వెళ్ళినా నయంకాక ,మళ్ళీ జయపూర్ వచ్చాక జర్మనీ డాక్టర్ హైలింగ్ అది కేన్సర్ అని తేల్చాడు .తర్వాత బాంబేలో టాటా హాస్పిటల్ లో రాఘవ చేరగా ,డాక్టర్ జస్సావాలా బ్లడ్ కాన్సర్ గా గుర్తించి ,చాలాజాగ్రత్తగా చికిత్సలు చేసినా ,12-8-1962మిట్ట మధ్యాహ్నం రచనా భాస్కరుడు రాఘవ అమాంతంగా అస్తమించాడు .క్వీన్స్ రోడ్ లో చందన్ వాడి స్మశాన వాటికలో వానపడుతుండగా అంత్యక్రియలు జరిపారు .
తక్కువకాలం లో ఎక్కువ రచనలు చేసిన అతికొద్దిమందిలో రాఘవ ఒకడు .రాఘవ 39నవలలు,వెయ్యేసి పేజీలున్న రెండుసంపుటాల ‘’మహాయాత్రా ‘’అనే బృహత్ రచన ,అ౦దులోఅపూర్వ గాధలు ,వాటి చారిత్రిక వివరణలు ,ఉన్నాయి ఆయనవి ముద్రితాలైన కథలు 30ఉన్నాయి .అజేయ్ ఖాన్దహార్ , మేధావి ,పాంచాలి కావ్యస్మృతులు ,చారిత్రిక నేపధ్యంలో రాసిన నాటకాలు ,బెంగాల్ కరువు పై రిపోర్ట్ ల సంకలనం ‘’తుఫానోం కే బీచ్ ‘’చారిత్రిక ,సామాజిక శాస్త్ర విశ్లేషణలు గ్రీకు నాటకాలు షేక్స్ పియర్ నాటకాలు గాల్స్ వర్త్ ,శూద్రక కాళిదాస విశాఖదత్త ల రచనానువాదాలు ప్రముఖంగా ఉన్నాయి .సాహిత్య విమర్శలో వివాదాస్పద రచనలు చేశాడు .జీవిత వేగం లో ఆయన ఎక్కడా కుదురుగా లేడు.రచనలు చేస్తూ అలసిపోతె,దేవకీ నందన నవలల ప్రస్తావన తెచ్చుకొని చదివి సేద తీరేవాడు మిత్రులకు సరదాగా నవ్వులాటకోసం ‘’మీ రా౦గేయ్ రాఘవ్ ‘’అని మొదలు పెట్టి రాసేవాడు .
సశేషం
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -30-4-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-266

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-266
• 266-చమ్రియా టాకీస్ డిస్ట్రిబ్యూషన్స్ అధినేత ,ఆంద్ర ,దక్షిణ భారత చలన చిత్రమండలి అధ్యక్షుడు ,శాంతినివాసం ,వీరాభిమన్యు వంటి హిట్ చిత్ర నిర్మాత –సుందర్లాల్ నహతా
• సుందర్ లాల్ నహతా చలనచిత్ర పంపిణీదారు, నిర్మాత[1].
వృత్తి
ఇతడు కలకత్తా విశ్వవిద్యాలయంలో బి.కాం.పట్టా పుచ్చుకుని 1941లో మద్రాసులో “చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్” అనే సంస్థకు మేనేజర్‌గా చేరాడు. ఆ సంస్థ యజమాని, ఈస్ట్ ఇండియా ఫిల్మ్‌ కంపెనీ అధినేత చమ్రియా ఇతని వ్యవహార నైపుణ్యాన్ని చూసి మెచ్చుకుని కొంత కాలానికే ఆ సంస్థలో భాగస్వామిగా చేర్చుకున్నాడు. యుద్ధం భయంవల్ల 1943లో చమ్రియా సంస్థ మద్రాసు నుండి విజయవాడకు తరలించబడి 1953 వరకు విజయవాడలోనే నడుపబడింది. ఆ సమయంలో సుందర్‌లాల్ తన సంస్థను చూసుకుంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంతో సహాయకారిగా ఉన్నాడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను వెలుగులోనికి తీసుకురావడానికి ఎంతో కృషి చేశాడు. ఆ సమయంలో ఆంధ్ర చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడిగా కూడా ఎన్నికైనాడు.
1950లో ఇతడు తారాచంద్ బర్జాత్యా తో కలిసి రాజశ్రీ పిక్చర్స్ అనే సంస్థను ప్రారంభించి అనేక సినిమాలను నిర్మించాడు. తరువాత ఇతడు శ్రీ ప్రొడక్షన్స్, రాజలక్ష్మి ప్రొడక్షన్స్, విజయలక్ష్మి పిక్చర్స్ వంటి సంస్థలను ప్రారంభించి తెలుగు, తమిళ చిత్రాలను నిర్మించాడు. ఇతని చిత్రాలన్నీ అఖండమైన విజయాన్ని సాధించాయి.
ఇతడు ఇండొనేషియా దేశం జకార్తాలో జరిగిన రెండవ ఆసియా-ఆఫ్రికా చలనచిత్రోత్సవంలో భారతదేశం తరఫున పాల్గొన్నాడు. 1968లో జర్మనీ ప్రభుత్వం ఆహ్వానంపై జర్మనీలో జరిగిన ఎగ్జిబిషన్‌కు హాజరయ్యాడు. ఇతడు దక్షిణ భారత చలనచిత్ర మండలికి కూడా అధ్యక్షుడిగా వ్యవహరించాడు[1].
సినిమాల జాబితా
నిర్మించిన సినిమాల జాబితా:
తెలుగు
• జయం మనదే (1956)
• సతీ అనసూయ (1957)
• మంచి మనసుకు మంచి రోజులు (1958)
• శభాష్ రాముడు (1959)
• అభిమానం (1960)
• శాంతి నివాసం (1960)
• రక్తసంబంధం (1962)
• బందిపోటు (1963)
• గుడిగంటలు (1964)
• వీరాభిమన్యు (1965)
• గూఢచారి 116 (1966)
• మరపురాని కథ (1967)
• ఆస్తులు అంతస్తులు (1969)
• కర్పూర హారతి (1969)
• మారిన మనిషి (1970)
• మొగుడా- పెళ్ళామా (1975)
• చేసిన బాసలు (1980)
• రహస్యగూఢచారి (1981)
హిందీ
• ఫర్జ్ (1967)
• జిగ్‌రీ దోస్త్ (1969)
• ప్యార్ కీ కహానీ (1971)
మలయాళ౦
• శాంతి నివాస్ (1962)
• కనకచిలంగ (1966)
కన్నడ
• వీరకేసరి (1963)
• నాటి మేటి నటుల్లో ఒకరైన టి.యల్. కాంతారావు పేరు చెప్పగానే ఆయన కత్తి పట్టి కదం తొక్కిన చిత్రాలు, నారద పాత్రతో అలరించిన వైనం గుర్తుకు వస్తాయి. సాంఘిక చిత్రాల్లోనూ కాంతారావు హీరోగా అలరించారు. రాజలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్ లాల్ నహతా, డూండీ నిర్మించిన సాంఘిక చిత్రాలలోనూ కాంతారావు నటించి ఆకట్టుకున్నారు. సుందర్ లాల్ నహతా, డూండీ నిర్మించిన ‘ఖైదీ కన్నయ్య’ చిత్రంలో కాంతారావు హీరోగా నటించారు. 1962 మార్చి 1న విడుదలయిన ఈ చిత్రం జనాన్ని ఆకట్టుకుంది.
• కన్నయ్య బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. బ్యాంకు నుండి డబ్బు తీసుకు వస్తూండగా పాపారావు అనేవాడు కొట్టేస్తాడు. కన్నయ్య తల్లిలేని కొడుకును కూడా పాపారావు, అతని మిత్రుడు కిడ్నాప్ చేస్తారు. డబ్బు పోగొట్టిన నేరంపై కన్నయ్యను అరెస్ట్ చేస్తారు. జైలులో ఉండగా, తన కొడుకు చనిపోయాడని తెలుస్తుంది. అదే సమయంలో జైలర్ కొడుకు రవి అతనికి దగ్గరవుతాడు. దుర్గారాయుడు అనే దుర్మార్గుడు తాను జైలు నుండి తప్పించుకోవడానికి జైలర్ కొడుకు రవిని కిడ్నాప్ చేసి తీసుకుపోతాడు. రవిని వెదికి తెచ్చేందుకు కన్నయ్య కూడా తప్పించుకుంటాడు. రవికి తాను నేర్పిన పాట కారణంగా అతని జాడ తెలుసుకుంటాడు కన్నయ్య. చివరకు బాబును కన్నవారి చెంతకు చేరుస్తాడు. పాపారావు, దుర్గారాయుడును చట్టం శిక్షిస్తుంది. కన్నయ్య నిర్దోషి అని తేలుతుంది. తనను ప్రేమించిన మాధవిని కన్నయ్య పెళ్ళి చేసుకోవడంతో కథ ముగుస్తుంది.
• ఈ చిత్రంలో కాంతారావు, రేలంగి, గుమ్మడి, రాజనాల, కేవీయస్ శర్మ, బాలకృష్ణ, రాజసులోచన, గిరిజ, సంధ్య, మల్లీశ్వరి, రాజరత్నం తదితరులు నటించారు. ఈ సినిమాకు రాజన్ – నాగేంద్ర సంగీతం సమకూర్చారు. ఇందులోని పాటలన్నీ జి.కృష్ణమూర్తి కలం నుండి జాలువారాయి. “ఈ నిజం తెలుసుకో… మనిషిగా మసలుకో…”, “తియ తీయని తేనెమాటలతో…”, “యవ్వనం అది…”, “చోటెక్కడ చూసెదెప్పుడు…”, “అందాల కళ్ళు చూడు…”, “ప్రేమకు కానుక కావలెనా…” వంటి పాటలు అలరించాయి.
• హిందీలో విజయం సాధించిన ‘ఖైదీ నంబర్ 911’ సినిమా ఆధారంగా ‘ఖైదీ కన్నయ్య’ తెరకెక్కింది. ఈ సినిమాకు ప్రముఖ చిత్రకారుడు, తరువాతి రోజుల్లో దర్శకునిగా ఎంతో పేరు సంపాదించిన బాపు పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేశారు. పలు కార్టూనులతో ఈ చిత్ర ప్రచారం సాగింది. దానిని అప్పట్లో వింతగా చెప్పుకున్నారు జనం. ‘ఖైదీ కన్నయ్య’ తెలుగులోనూ మంచి విజయం సాధించి, శతదినోత్సవం చూసింది.
• (2022 మార్చి 1న ‘ఖైదీ కన్నయ్య’కు    60 ఏళ్ళు)
•   సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-22-ఉయ్యూరు



• —

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-265

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-265
• 265-కనిపించని తెలుగు టాకీ గ్రాండ్ ఓల్డ్ మాన్ ,తోలి డిష్ట్రిబ్యూషన్ సంష్టాపకుడు ,మొదటి సినిమాస్స్కోప్ దియేటర్ నిర్మాత =పూర్ణా మంగరాజు ,కామరాజు
• లెజెండరీ శ్రీ సి. పుల్లయ్య తన వ్యాపార భాగస్వామి శ్రీ గ్రంధి కామరాజు మంగరాజుకు – ఈస్ట్ కోస్ట్‌లో బియ్యం-వ్యాపారంలో సంపన్నమైన వ్యాపారి, అప్పటి బర్మాలోని రంగూన్ వరకు – తన సినిమా నిర్మాణం కోసం మద్రాస్‌కు వెళ్లడానికి తన వాటా మొత్తాన్ని ఇచ్చాడు. /డైరెక్షన్ ప్రయత్నాలు 1927లో. ఆ తర్వాత 1925లో వారిద్దరూ ప్రారంభించిన ‘శ్రీకృష్ణ టూరింగ్ టాకీస్’కి ఏకైక యజమాని అయ్యారు. తర్వాత 1930లో శ్రీ జికె మంగరాజు పూర్తిస్థాయి పూర్ణ థియేటర్‌ని నిర్మించారు. వైజాగ్‌లో విద్యుద్దీకరణ సౌకర్యం ప్రవేశపెట్టిన వెంటనే, ప్రస్తుత పాత నగరంలో ప్రధాన రహదారిపై. మొదట్లో మూకీ సినిమాలు, వాటిలో ప్రముఖమైన భీష్మ ప్రతిజ్ఞ, నందనార్, గజేంద్ర మోక్షం వంటివి ప్రదర్శించబడ్డాయి.
• తదనంతరం, టాకీ సినిమా యుగం ప్రారంభమైనప్పుడు, అది ఉన్నత స్థాయికి అభివృద్ధి చెందడం ప్రారంభించింది. సినిమాల పట్ల అతని అభిరుచి కేవలం వాటిని ప్రదర్శించడం మాత్రమే కాకుండా ఫైనాన్సింగ్/పంపిణీలోకి కూడా వెళ్లింది. నిజానికి, 30వ దశకంలో తొలి తెలుగు టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’ను రూపొందించినప్పుడు ప్రముఖ అగ్రగామి మరియు దక్షిణ భారత సినీ దిగ్గజం శ్రీ హెచ్‌ఎమ్‌ రెడ్డికి దాదాపు 90% మేర ఆయనే ప్రధాన ఫైనాన్షియర్ అని తెలుసుకోవడం ఎంతగానో ఉర్రూతలూగిస్తోంది. . ఆ మేరకు శ్రీ మంగరాజు తెలుగు టాకీస్‌లో కనిపించని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు. అతను 1933లో తన స్వంత డిస్ట్రిబ్యూషన్ కంపెనీ “క్వాలిటీ పిక్చర్స్”ని స్థాపించాడు – ఇది 1945లో పూర్ణ పిక్చర్స్ అని పేరు మార్చబడింది – మరియు అనేక సినిమాలను కూడా పంపిణీ చేసింది.
• పూర్ణ సినిమా థియేటర్‌ని ఎప్పటికప్పుడు ఆధునీకరించాడు. 1949లో బాల్కనీని జోడించినప్పుడు, క్లాసిక్ “లైలా మజ్ను” అందులో ప్రదర్శించబడింది. బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి మద్రాసు నుంచి వచ్చి పునరుద్ధరించిన థియేటర్‌ను ప్రారంభించారు. 1955లో సినిమా-స్కోప్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఇది మొత్తం కోస్తా ఆంధ్ర ప్రాంతంలో మొదటి సినిమా థియేటర్‌గా మారింది. హాలీవుడ్‌కి చెందిన “ఫోర్స్ 10 ఫ్రమ్ నవరోన్” 1980లో పునరుద్ధరించబడిన తర్వాత మొదట ప్రదర్శించబడింది. ఇది 1993లో దాని ప్రస్తుత యజమాని శ్రీ రామయ్య ఆధ్వర్యంలో మరింత అప్‌గ్రేడ్ చేయబడింది మరియు ఆధునీకరించబడింది.
• స్వర్ణోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న ఊర్వశి థియేటర్స్‌ను పూర్ణ పిక్చర్స్

• 1970లో డిసెంబర్ 10న తన తాత జి.కె. తొలి  చిత్రాన్ని నిర్మించిన మంగరాజు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పంపిణీ వ్యవస్థను ప్రారంభించిన మొదటి వ్యక్తి కూడా, ఊర్వసి థియేటర్లు వాణిజ్యంలోని వైరుధ్యాలను అధిగమించాయని ఆయన చెప్పారు.
• గ్రంధి మంగరాజు (డిసెంబర్ 11, 1896 – ?) ప్రముఖ సినిమా పంపిణీదారులు, నిర్మాత.
• వీరు విశాఖపట్నంలో గ్రంథి కామరాజు, గౌరమ్మ దంపతులకు జన్మించారు. వీరి తండ్రి కామరాజు పెద్దాపురం నుండి విశాఖపట్నం వచ్చి వ్యాపారం చేసి అక్కడి ధనికులలో ఒకరుగా పేరుపొందారు.
• మంగరాజు విద్యాభ్యాసం తర్వాత ఇరవై ఏళ్ళకే సొంతగా వ్యాపారం ప్రారంభించారు. దయానంద సరస్వతి గారి వైదిక సిద్ధాంతాల పట్ల ఆకర్షింపబడి 1935 ప్రాంతంలో విశాఖపట్నంలో ఆర్య సమాజం స్థాపించారు.
• 1929లో చలనచిత్రరంగంలో ప్రవేశించి విశాఖపట్నంలో “పూర్ణా టాకీస్” సినిమా హాలును నిర్మించారు. 1937లో దశావతారములు చిత్రానికి నిర్మాణ బాధ్యతలు వహించారు. ఆ రోజుల్లోనే విజయవాడలో సినీ పంపిణీ సంస్థ “పూర్ణా పిక్చర్స్”ను ప్రారంభించారు. వీరు తొలిరోజుల్లో తెలుగు సినిమా అభివృద్ధిలో ఒక మూలస్తంభంగా నిలిచారు.
• వీరు ప్రజలలో భక్తిభావాన్ని పెంపొందించే నిమిత్తం యాత్రా బస్సు, రైలు సేవలను నడిపేవారు.
• సశేషం
• మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-264

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-264
• 264-ఆంధ్రాలో మొదటి ధియేటర్ మారుతిటాకీస్ నిర్మాత ,ఎన్నెన్నో మూకీ చిత్రాలు ఆడించిన –పోతిన శ్రీనివాసరావు

మూకీ సినిమాలు
వచ్చిన తొలిరోజుల్లో సినిమా (ప్రారంభానికి ముందు హాల్లో దీపాలు
ఆర్చితే, జనం “దీపాలు ఆర్బకండి బాబోయ్‌, మాకు భయం” అని అరిచే
వారట. కొన్నాళ్ళకి గాను అది సర్దుకోలేదు. అమెరికాలో మొదటిసారి
సినిమా చూసిన వాళ్లు, హీరోయిన్‌ క్టోజప్‌ రాగానే “దగా! మోసం! ఆవిడ
నడుమూ కాళ్లు ఏవీ?” అని గట్టిగా అరిచారట. అలాగే మన తెలుగు
సినిమా మాట నేర్చుకున్న కొత్తల్‌, ఒక పాత్ర పద్యం చదువుతూ వుంటే
ఇంకో పాత్ర ‘రియాక్షన్‌’ షాటు వేస్తే ఒప్పుకునే వారు కాదుట. పద్యమో,
పాటో పాడుతున్న పాత్రే కనిపించాలి!

ఈ మాటలు ఆంధ్రదేశంలో మొదట సినిమా థియేటరు కట్టించిన
పోతిన శ్రీనివాసరావు గారు చెప్పేవారు. ఆయన చాలా మూకీలు తెప్పించి,
ఆంధ్రలో ఆడించారు. “ఒక పౌరాణిక మూకీ చిత్రంలో భీముడికి మ
మీసం ఊడిపోతుంది. అది ఆ సినిమా తీసిన వాళ్లు గమనించలేదు కానీ,
(ప్రేక్షకులు గమనించారు. “మీసం ఊడీన భీముడు, మీసం జారిపోయిన
భీముడు” అని గోల చేశారు. ఊరంతా ప్రచారం కూడా చేశారు. “ఆ
(ప్రచారాన్ని ఖండిస్తూ, నేను ఇంకొక ప్రకటన చేయించాను. “ఇవాళ
ీముడికి మీసం ఊడదు. దయచేసి రండి” అని మేళతాళాలతో చెప్పించాను. నేను ఆపరేటరుతో చెప్పి మీసం ఊడిన భాగాన్ని కత్తిరించేసి అతికేయమన్నాను. అంతే! అది ఎవరికీ తెలియలేదు గనుక, అందరూ సంతోషించారు” అని చెప్పారు శ్రీనివాసరావు. ఐతే, ‘కదిలే బొమ్మ’ జనానికి వింత కలిగించినా, జనం ఎక్కువగా వచ్చేవారు కాదుట. ఎదురుగా పాత్రలు కనిపిస్తూ పాటలూ పద్యాలూ పాడుతున్న నాటకాలకే ఎగబడే వారుట.

“అంచేత మేము సినిమా మధ్యలో ఉచితంగా
సోడాలు, కిల్లీలూ ఇస్తామని ప్రకటనలు వేసే వాళ్లం. వాటికోసమైనా జనం వస్తారేమోనని. ఊళ్లో నాటక యు స్య లేకపోతే ళా వచ్చేవారు. మొత్తానికి మూకీ చిత్రాల ప్రదర్శన నష్టాలతోనే నడిచింది”
అని శ్రీనివాసరావు చెబుతూ వుండేవారు.
దాదాఫాల్కే కూడా ఇలాంటి అవస్థలే ఎదుర్కొన్నాడు. ‘లంకా దహనం’
తీసినప్పుడు “నిజంగానే లంకా దహనం కనిపిస్తుంది – రండి” అన్నట్టుగా
ప్రకటనలు చేయించాడు. హనుమంతుడు లంకను దహనం చేస్తున్న దృళ్యం
రాగానే, ప్రొజెక్టర్‌ ముందు ఎర్రని అద్దం ముక్క పెట్టి చూపించగానే, బొమ్మ
ఎర్రబారింది. నిజం గొనే మండుతున్న భ్రాంతి కలిగింది. మొదటి రోజున ప్రేక్షకుల్లో

సినిమాల్లో మొట్ట మొదటి కృష్ణ పాత్రధారి రఘురామయ్యే. పోతిన
శ్రీనివాసరావు తీసిన పృథ్వీ పుత్ర’ (1934లో కృష్ణుడు. మరికొన్ని చిత్రాల్లో
నారదుడు. కృష్ణ నారద పాత్రలు ఆరోజుల్లో ఆయనే ఎక్కువగా నటించారు.
జానపద చిత్రం ‘గొల్లభామ’లో హీరో. ఒకే ఒక్క సాంఘిక చిత్రం
‘పంతులమ్మ’లో నటించినట్టు జ్ఞాపకం. సినిమాల్లో నటిస్తున్నా నాటకాలు
వదల్లేదు. అయితే నాటకంలో ఏ పాత్ర ధరించినా సరే, నాటకాంతంలో..
రఘురామయ్య చేత ప్రేక్షకులు గోలా గగ్గోలూ పెట్టి ఈలపాట
పాడించుకునేవారు.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-4-22-ఉయ్యూరు
• —

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-263

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-263
• 263-విజయవాడ ప్రెస్ మీట్లకు మార్గదర్శి ,ఫిలిం సొసైటీ ప్రెసిడెంట్ ,నిష్పక్షపాత విమర్శకు ఆద్యుడు ,నవయుగా ఫిలిమ్స్ జనరల్ మేనేజర్ –కాట్రగడ్డ నరసయ్య
• నరసయ్య సినిమాలపై విలువైన వ్యాఖ్యానాలకు పేరుగాంచారు. విజయవాడ ఫిలిం సొసైటీకి ప్రెసిడెంట్‌గా పనిచేసిన కాలంలో అద్భుతాలు చేశారు. అతను చలనచిత్ర పరిశ్రమకు చాలా ప్రయోజనం చేసాడు మరియు అతను ప్రచారంలో విప్లవాత్మక పోకడలను చేసాడు.

కాట్రగడ్డ నరసయ్య వ్యాఖ్యలు చాలా ఘాటుగా, సూటిగా ఉన్నాయి. నిజానికి నిర్మాతలు మరియు కళాకారులు నరసయ్య నుండి తన తీర్పు కోసం విడుదల తేదీకి కాల్స్ వచ్చేవారు. ఆ సంవత్సరంలో విడుదలైన చిత్రాల గురించి సంక్షిప్త సమాచారం ఇవ్వడానికి అతను సంవత్సరం చివరి రోజున ఒక సమావేశాన్ని నిర్వహించేవాడు.
. సినిమాలు ఉన్నంత వరకు నరసయ్య ఉంటారని, సినిమా విజయానికి ప్రచారమే ప్రాణమని నిరూపించారు. ఇంకా, 1993లోనే ‘రైతుబజార్’ ప్రారంభించడం వంటి సమాజహితం కోసం నరసయ్య కూడా కొన్ని ఆవిష్కరణలు చేశారని మోహనరామ్ అన్నారు. విజయవాడలో చాలా పెద్ద ఫంక్షన్ హాల్ కమ్ ఆడిటోరియం నిర్మించాడు. మహా మానవతావాది కాట్రగడ్డ నరసయ్యకు మోహనరామ్ నివాళులర్పించారు.

సినీ ప్రముఖుడు కాట్రగడ్డ నరసయ్య  విజయవాడలో కన్నుమూశారు

• వామపక్ష ఉద్యమం, రాజకీయ పరిణా మాలు, సినిమా, మీడియా రంగం వంటి వాటిపై వామపక్ష ఉద్యమం కళా సాహిత్య వాణిజ్య సామాజిక క్షేత్రంలో సుదీర్ఘ కాలం సేవలం దించిన చైతన్య వంతుడు దూరమైనారు. స్వతంత్ర పోరాటంతోనూ సామ్యవాద భావ జాలంతోనూ పెనవేసు కుపోయిన కాట్రగడ్డ కుటుంబంలో పాత తరంలో ఆఖరి ప్రతినిధి, కొత్త తరాలకు వారధిó అస్తమించారు. సినీ రాజకీయ వాణిజ్య దిగ్గజాలతో సాన్నిహిత్యం నెరిపిన పెద్దాయన లేకుండా పోయారు. వ్యక్తిగతంగా నాకు అత్యంత ఆప్తులొకరు కరువైనారు.
కాట్రగడ్డ నరసయ్యగారి కుటుంబం గురించి తెల్కపల్లి రవి
• వారి తండ్రి మధుసూదనరావు మాత్రమే గాక వారి నాయనమ్మలు, మేనత్తలు, బాబాయిలు, పెదనాన్నలు చాలామంది ఏదో ఒక సమయంలో జైలుకు వెళ్లినవవారే. మహిళలు తమ ఆభరణాలు ఉద్యమాలకు ఇచ్చిన వారే. సుందరయ్య వంటి హేమాహేమీలకు అన్నం పెట్టి అజ్ఞాతవాసంలో ఆశ్రయం ఇచ్చినవారే. విజయవాడలో ‘ప్రజాశక్తి నగర్‌’కు భూములు సమకూర్చిన పెద్ద కుటుంబమే గాక తర్వాత కాలంలోనూ భూరి హృదయంతో ఆదుకున్న వారెందరినో చూడగలం. వారందరిలోనూ ‘నవయుగ ఫిలింస్‌’ సంస్థాపకుడైన కాట్రగడ్డ శ్రీనివాసరావు, సారథ్యం వహించిన నరసయ్య జనానికి మరింత బాగా తెలుసు. వాస్తవంలో నరసయ్య విద్యార్థి ఉద్యమాలలో పాల్గొనడమే గాక అభ్యుదయ రచయితల తొలి శిబిరానికి హాజరైనారు. ప్రజా కళారూపాలనూ అధ్యయనం చేశారు. కొద్ది కాలం ఉద్యోగం చేసినా బెనారస్‌ విశ్వవిద్యాలయంలో చేరి చాలా మంది అభ్యుదయ వాదులతో పాటు చదువు భావాలు నేర్చుకున్నారు. నవయుగ ఫిలింస్‌ జనరల్‌ మేనేజర్‌గా ఎన్నెన్నో గొప్ప చిత్రాలను పంపిణీ చేయడమే గాక ప్రమోట్‌ చేయడంలో ప్రత్యేకత చూపించారు. ‘నమ్మిన బంటు, రోజులు మారాయి’ వంటి గొప్ప సంచలనాత్మక చిత్రాలను ప్రమోట్‌ చేయడంలో నరసయ్య ముద్ర చెరగనిది. ఈ చిత్రాల రూపశిల్పులూ అభ్యుదయ వాదులే. ‘నమ్మినబంటు’లో నటీనటులతో పోటీ పడి నటించిన ఎద్దు గురించి, ‘రోజులు మారాయి’లో ‘ఏరువాక సాగారో…’ పాట గురించి వూపెత్తిస్తే నాయక పాత్రధారి నాగేశ్వరరావుకు చిర్రెత్తి పేచీ పెట్టుకున్నారట. ఏరువాక పాట చూడ్డానికి కొండ మీద కనకదుర్గ కూడా వచ్చిందని ఆరోజుల్లో ఓ వదంతి బయిలుదేరితే అందరూ ఆ పాట రాగానే మరీ మరీ వెతికేవారట! రోజులు మారాయి చిత్ర రజతోత్సవాల్లోనే మొదటిసారి పబ్లిసిటీ రంగానికి షీల్డు ఇవ్వడం మొదలైందంటే అది ఆయన కృషి ఫలితమే.
నవయుగ సంస్థ విడుదల చేసే చిత్రాలన్నిటికీ ప్రచార బాధ్యతలు చూసిన నరసయ్య పత్రికలకు డిజైన్లు, క్యాప్షన్లు, బొమ్మలు ఇవన్నీ కొత్త తరహాలో చేయించేవారు. స్త్రీల కోసం ఎంబ్రాయిడరీలు, ధైర్య సాహసాలు పెంచే ఎన్‌సిసి వంటి పద్ధతులు, వాటిలో జొప్పించే వారు. మహిళా సంఘాల వారిని ప్రత్యేకంగా తీసుకుపోయి వారి అభిప్రాయాలు వేయించేవారు. ఒక సినిమాతో మొబైల్‌ లాండ్రీ పద్ధతిని వ్యాప్తి లోకి తెచ్చారు. విద్యార్థులు, యువతకు కూడా సామాజిక అంశాలపై పోటీలు పెట్టి చిత్ర ప్రచారంతో కలిపేసేవారు. ఆ రోజుల్లో మద్రాసు లోనే చిత్ర పరిశ్రమ వున్నా విజయవాడను ప్రెస్‌మీట్ల కేంద్రంగా చేయడంలో ఆయన పాత్ర ముఖ్యమైంది. వాటిలోనూ నగరంలోని రచయితలు, మేధావులను పాత్రికేయులను భాగస్వాములను చేసి అలరింపచేసేవారు. కొత్త ఏడాది వస్తుండగానే గడచిపోయిన ఏడాది చిత్రాల జాబితా, శత దినోత్సవాలు, నటీనటులు ధోరణులు అన్నిటితో సమగ్ర సమీక్ష రెండు మూడు దశాబ్దాల పాటు కొనసాగించారు. ఆయనది ఆ విషయంలో సాధికార పరిజ్ఞానం. మీడియా పట్ల ఆయన ప్రత్యేకాసక్తి అడ్వర్టయిజ్‌మెంట్లకే పరిమితం కాదు. ఇంగ్లీషు పుస్తకాలు, మ్యాగజైన్లు విపరీతంగా చదివే ఆయన వాటిలోని కొత్త పద్ధతులు ప్రవేశ పెట్టాలని వెంటపడుతుండేవారు. కాలానుగుణమైన మార్పులను పసిగట్టడంలో దిట్టగనక చిన్నవిగా రాయాలనేవారు. సినిమాలకు పేజీల తరబడి రంగుల ప్రకటనలు ఇస్తే ఖరీదు పెరిగి చిన్న పత్రికలకు అవకాశముండదని చిన్న ప్రకటనలనే క్యాంపైన్‌ చేపట్టారు. ‘చిన్న మనుషుల బతుకులు’ అంటూ రోజూ సామాన్యుల గురించి రాసేవారు.
సినిమా రంగంలో చిన్న సినిమాలు, ప్రగతిశీల చిత్రాలను, దర్శక నిర్మాతలను ప్రత్యేకంగా ప్రోత్సహించేవారు. వారిని పత్రికల కార్యాలయాలకు తీసుకువచ్చేవారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ రామానాయుడు, ప్రత్యగాత్మ, మధుసూదనరావు వంటి పెద్దల నుంచి నాటికి నూతన నటులు సాయిచంద్‌, మాదాల రంగారావు వంటివారి వరకూ అందరితో కలసిపోతుండేవారు. ఔత్సాహికులకు అవకాశాలు రావడానికి సహకరించేవారు. చిత్రోత్సవాలకు తప్పక హాజరై ప్రజాశక్తికి వాటిపై ధారావాహికంగా రాసేవారు. తర్వాత కాలంలో ఆయన కుమార్తె సీత కూడా ఆ కృషి కొనసాగించారు. నవయుగ ఫిలింస్‌ తర్వాత మరో అరడజను ప్రముఖ పంపిణీ సంస్థలకూ సంచాలకుడుగా పనిచేశారు. విజయవాడ ఎగ్జిబిషన్‌ సొసైటీ పక్షాన వినూత్న కార్యక్రమాలు రూపకల్పన చేశారు. రైతుబజార్లకు ముందే కూరగాయలు వాటిలో విక్రయించేవారు. కళ్యాణమండపాల పేరు తీరు మార్చి మధు కళామండపం కట్టించిన నరసయ్య అది వున్నంత కాలం ప్రజాసంఘాలకు, పార్టీ సమావేశాలకు నామకార్థపు ఖర్చులతో ఇస్తుండేవారు. 2005లో సాహితీ స్రవంతి మొదటి సాహిత్యశాల అక్కడే అపురూపంగా జరిగింది. వెంటపడి మరీ పుస్తక ప్రదర్శనలు పెట్టించేవారు. మసాలా దినుసులు, మత్తు పదార్థాల బదులు వేడుకలలో ఆరోగ్యకరమైన ఫలాలు, పదార్థాలు ఇవ్వడం అలవాటు చేశారు. చిత్రకళా శిబిరాలు, కార్టూన్ల శిక్షణ వంటివి నడిపేవారు. మొగల్రాజపురంలో ఆయన ప్రాంగణం నగరంలో బొమ్మారెడ్డి, మిక్కిలినేని, పొన్నం వీరరాఘవయ్య వంటి పెద్దల గోష్టిగా వుండేది. వయసు పైబడినా ఆయన మాత్రం కొత్తదనం కోసమే పాకులాడేవారు గాని వెనక చూపు వుండేది కాదు. కమ్యూనిస్టు నాయకులతో నరసయ్యకు అత్యంత ప్రేమ, గౌరవం వున్నా విమర్శ చేయాలంటే వెనుకాడేవారు కాదు. విజయవాడలో ఆయన హాజరు కాని సినిమా, సాంస్కృతిక వేడుక వుండేది కాదు. హైదరాబాదులో పరిశ్రమ పెరిగిన మొదటి దశలో కొంత పాత్ర వహించినా తర్వాత వయోభారం, అనారోగ్యంతో ఇంటికే పరిమితమైనారు. ఆ కదలలేని స్థితిలో కూడా వామపక్ష ఉద్యమం రాజకీయ పరిణామాలు, సినిమా, మీడియా రంగంపై నాలాంటి వారితో, స్థానిక కార్యకర్తలతో నిరంతరం సంబంధాలు పాటించేవారు. నేను, వెంకట్రావు, వొరప్రసాద్‌ లాంటివాళ్లం వీలైనప్పుడల్లా నరసయ్య గారిని, ఆయన సతీమణి విజయలక్ష్మి గార్లను పరామర్శించి రావడం పరిపాటి. ఆయన బహుముఖ జ్ఞాపకాలు రాయించాలని చాలాసార్లు ప్రయత్నించాను గాని అన్నీ కలగాపులగమై కుదరలేదు. ఇప్పటికి రాసిన వాటిని పరిశీలించి ఒక రూపం ఇచ్చేందుకు ప్రయత్నించవలసి వుంది. ఆయన జీవితంలో ఇవి కొన్ని పార్శ్వాలు మాత్రమే. కడదాకా చైతన్యశీలిగా సామాజిక ఆసక్తికి ప్రతిరూపంగా జీవించిన కాట్రగడ్డ నరసయ్యకు ఇవే నా జోహార్లు.
– తెలకపల్లి రవి
• —
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-262

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-262
• 262-కృష్ణ ను జేమ్స్ బాండ్ గా చూపిన సినీ నిర్మాత ,దర్శకుడు –డూండీ
• డూండీ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు. ఆయన అసలు పేరు పోతిన డూండీశ్వరరావు. డూండీగా ఆయన సుప్రసిద్ధుడు. 70 కి పైగా సినిమాలు నిర్మించాడు. అభిమానవతి అనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించాడు. తెలుగు తెరపై అనేక ప్రయోగాలు చేసిన నిర్మాతగా డూండీకి పేరుంది. ఈయన తండ్రి పోతిన శ్రీనివాసరావు మన రాష్ట్రంలో మొట్టమొదటి సినిమా హాల్‌ (విజయవాడ మారుతీ టాకీస్‌)ను నిర్మించాడు. 1956లో తన తొలి చిత్రంతో తెలుగు సినీ రంగంలో నిర్మాతగా అడుగిడిన డూండీ ‘బందిపోటు’, ‘రక్తసంబంధం’, ‘శాంతినివాసం’, ‘గూఢచారి 116’, ‘మరపురాని కథ’ భలేదొంగలు,దొంగలకు దొంగ,దొంగలవేట లాంటి చిత్రాలు నిర్మించారు. తెలుగు సినిమాలలో ఘట్టమనేని కృష్ణను జేమ్స్‌ బాండ్‌ రూపంలో చూపించిన నిర్మాత డూండీనే. 2005 నంది అవార్డుల ఎంపిక కమిటీకి సారథ్యం వహించిన డూండీ 2007 జనవరి 1 న మరణించాడు.
•   సశేషం
• మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

అపరసరస్వతీ దేవి చేబ్రోలు సరస్వతి దేవి

అపరసరస్వతీ దేవి చేబ్రోలు సరస్వతి దేవి

చేబ్రోలు సరస్వతీదేవి
జననం [[]] 1900
పుల్లెల గ్రామం, నల్గొండ జిల్లా
నివాస ప్రాంతం నీలగిరి
భార్య / భర్త చేబ్రోలు రాజగోపాలం
తండ్రి రాజగోపాలనాయుడు
కవి కలహంసి బిరుదాంకితురాలైన చేబ్రోలు సరస్వతీదేవి తెలుగు కవయిత్రి. ఈమె రచించిన సరస్వతీ శతకము శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి, చిలకమర్తి లక్ష్మీనరసింహం వంటి రచయితల మన్ననలు పొందినది. మద్రాసు విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియట్ క్లాసుకు పాఠ్యగ్రంథంగా ఎన్నుకొనబడింది. ఉత్తరకాండకు తొలిపలుకు రాస్తూ దివాకర్ల వేంకటావధాని ఆమె రచన ధారాళమై, భావనిర్భరమై, ఔచిత్య శోభితమై, నిర్దుష్టమై, అత్యంత హృద్యముగానున్నదని, మొల్ల, వెంగమాంబ కవితలతో సాటిగానున్నదని వ్రాసినారు.
ఈమె భర్త నూజివీడు జమీందారైన రాజా గోపాలమనాయుడు. ఈమెకు ముగ్గురు కుమారులు.
సరస్వతీదేవి సంస్కృతము, తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలతో పాటు జ్యోతిషము కూడా అభ్యసించారు. ఈమె గురువు కందాడై కృష్ణమాచార్యులు, పంచకావ్యములు, నాటకాలంకారములు జ్ఞానసముపార్జన దృష్టితో బోధించేరని సుమిత్రాదేవి పేర్కొన్నారు.
ఈమె జటప్రోలు సంస్థానకవి వాజపేయాజుల రామసుబ్బరాయశాస్త్రి స్థాపించిన స్నేహలతా సంఘానికి ఉపాధ్యక్షురాలుగానూ, గృహలక్ష్మి మాసపత్రికకి ఉపసంపాదకురాలుగానూ పనిచేసింది.
సాహిత్యకృషి
సరస్వతీ రామాయణము
శ్రీ సరస్వతీశతకము
సత్యనారాయణ వ్రతకల్పము
ఆత్మోపదేశము
పతివ్రతాశతకము
పురస్కారాలు
గృహలక్ష్మి స్వర్ణకంకణం (1939)
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -29-4-22-ఉయ్యూరు

Posted in సమీక్ష | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-259

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-259

• 259-మూకీ చిత్ర ప్రదర్శకుడు ,టాకీ చిత్రనిర్మాత డైరెక్టర్ ,తొలిద్విపాత్రాభినయనం ప్రవేశపెట్టి ,జానపద చిత్రాన్ని పరిచయం చేసి ,చిత్ర కల్పనా యాక్టింగ్ స్కూల్ పెట్టిన –కాళ్ళకూరి సదాశివరావు
• కాళ్ళకూరి సదాశివరావు తెలుగులో జానపద చిత్ర నిర్మాణం ప్రారంభించిన వ్యక్తి. ఆ కాలంలో వరుసగా వస్తున్న పౌరాణిక సినిమాలకు భిన్నంగా ఒక కొత్త తరహా చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలన్న సంకల్పంతో తొలి జానపద చిత్రం గులేబకావళి కథ తీసాడు. 1939లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించింది. పాటలు, పద్యాలకు భిన్నంగా ఆ సినిమాలో ఉన్న కత్తి యుద్ధాలు, పోరాటాలు, మంత్రాలు, మాయలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
జీవిత విశేషాలు
అతను “చింతామణి” , “వరవిక్రయం”, “మధుసేవ” వంటి నాటకాలు రాసి జనాన్ని చైతన్యవంతుల్ని చేసిన మహాకవి కాళ్ళకూరి నారాయణరావు కుమారుడు సదాశివరావు. మూకీల కాలం నుండి అతనికి చిత్రపరిశ్రమతో సంబంధం ఉంది. అతను 1901 ఫిబ్రవరి 13న కాకినాడలో జన్మించాడు. నెల్లూరు లో జిల్లా బోర్డు విద్యా శాఖాధికారి కాళ్లకూరి దక్షిణామూర్తి అతని అన్నయ్య. కాకినాడలో పి.ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. తరువాత హైదరాబాదు, మద్రాసు లలో బ్యాంకింగ్ కోర్స్ చదివారు. ఉద్యోగ వేటను ప్రారంభించి అతను రంగూన్‌లో సినిమా మెజిస్టిక్ అనే థియేటరుకు అసిస్టెంటుగా 1932లో ఉద్యోగంలో చేరి నాలుగు నెలల పాటు పనిచేసాడు. అక్కడి వాతావరణంలో ఇమడలేక కాకినాడ తిరిగి వచ్చేసాడు.[1]
చిత్ర పంపిణీ సంస్థ స్థాపన
చిత్తజల్లు పుల్లయ్య కు కాకినాడలో ఒక థియేటర్, ఒక టూరింగ్ టాకీసు ఉండేవి. రంగూను నుండి వచ్చిన తరువాత సదాశివరావు పుల్లయ్యను పరిచయం చేసుకొని అతని వద్ద అసిస్టెంటుగా చేరాడు. ఆ థియేటర్ల నిర్వహణా భాద్యతలను చూసుకొనేవాడు. ప్రదర్శనా రంగంలో అనుభవం పొందడంతో పుల్లయ్య ప్రోతసహంతో కొంతమంది మిత్రులనుకలుపుకొని “ఇంపీరియల్ పిక్చర్ ప్యాలస్” అనే థియేటరును ప్రారంభించాడు. ఆధాయం పెరిగే సరికి భాగస్వముల మధ్య విభేదాలు తలెత్తడంతో స్వంతంగా “కాకినాడ ఫిలిం ఎక్చేంజి” పేరుతో మరో పంపిణీ సంస్థను నెలకొల్పాడు.
చిత్ర రంగ ప్రవేశం
ఎనిమిదేళ్ల పాటు పంపిణీ, ప్రదర్శన రంగాలను కొనసాగించిన అతను ఎన్నో మూకీ చిత్రాలను తీసుకు వచ్చి తెలుగు ప్రేక్షకులకు ప్రదర్శించాడు. ప్రేక్షకులు ఎటువంటి సినిమాలు ఆదరిస్తారనే అవగాహన ఏర్పడింది. ఆ సమయంలో టాకీల నిర్మాణం ప్రారంభమైంది. చిత్ర నిర్మాణంపై ఆసక్తితో అతను కలకత్తా వెళ్ళి రాధాకిషన్ చమ్రియాను కలిసాడు. అతని సంకల్పం తెలిసిన రాధాకిషన్ మదన్ పిక్చర్స్ సంస్థను నెలకొల్పి సదాశివరావు దర్శకత్వంలో చింతామణి చిత్రాన్ని నిర్మించాడు. 1933లో విడుదలైన ఈ చిత్రంలో రామతిలకం, పులిపాటి తదితరులు నటించారు. తన తండ్రి రాసిన చింతామణి నాటకం ఆధారంగా తొలి సినిమా తీసాడు.
అతను తన సినిమాలకు స్వయంగా స్క్రిప్టు తయారుచేసుకొనేవాడు. “సతీ సులోచన” చిత్రంలో తొలిసారిగా ద్విపాత్రాభినయం అతను ప్రవేశపెట్టాడు. తొలి టాకీ సినిమా “భక్త ప్రహ్లాద” లో హిరణ్యకశిపునిగా నటించిన వి.వి.సుబ్బారావు ఈ చిత్రంలో రావణాసురునిగా, ఇందజిత్తుగా రెండు పాత్రలను పోషించాడు. అలాగే జానపద చిత్రాల్ని నిర్మించిన ఘనత కూడా అతనిదే.[1]
1940 లో చంద్రహాస సినిమాకు మొదటి సారిగా దర్శకత్వం వహించాడు. కానీ మధ్యలో కంపెనీ వారితో అబిప్రాయ భేదాలు ఏర్పడి ఆ సంస్థనుండి మధ్యలోనే తిరిగి వచ్చేశాడు.
సినిమాలు
• భక్త కుచేల (1935)
• లంకాదహనం (1936)
• సతీ సులోచన (1936)
• గులేబకావళి కథ (1939)
• చిరుతొండ నైనార్ (తమిళ సినిమా)
• చంద్రహాస (1940)
ఆర్మీలో నాలుగేళ్ళు
1942లో మద్రాసులో యుద్ద వాతావరణం నెలకొన్న రోజులలో ఆర్మీలోని వినోద శాఖలో చేరి సైనికులకు ఆహ్లాదాన్ని పంచాడు. అలాగే నాలుగేళ్ళు చిత్రరంగానికి దూరంగా ఉండి అర్మీలోనే కొనసాగాడు.
తిరిగి సినిమాలలోకి
యుద్దం ముగిసిన తరువాత 1946లో అతను నెల్లూరు వెళ్ళిపోయాడు. అతని అత్తవారు ఊరు కూడా అదే. అప్పటికి చిత్రరంగంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అందుకే ఆ వాతావరణానికి ఇమడలేక మద్రాసు వదిలి నెల్లూరు చేరుకున్నాడు. ఆ ఊరి పెద్దల సహకారంతో మళ్ళీ సినిమా తీయాలనే నిర్ణయానికి వచ్చాడు. 1947లో సువర్ణలతా పిక్చర్స్ సంస్థను నెలకొల్పి “సువర్ణమాల” సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఆంధ్రా బ్యాంకు లో పనిచేసే సూర్యనారాయణ, బాలసరస్వతి ఇందులో నటించారు. ఈ సినిమా విజయవంతం కాకపోవడంతో చిత్ర నిర్మాణం కొనసాగించలేక పోయాడు. బయట సినిమాలకు అవకాశాలు రాకపోవడం, సొంతంగా చిత్ర నిర్మాణం చేపట్టే అవకాశం లేకపోవడంతో పబ్లిసిటీ ఆఫీసును ప్రారంభించాడు. దీనిని 1950 నుండి 1953 వరకు నడిపాడు. తరువాత ఆ సంస్థను కూడా మూసివేసాడు.
తరువాత హైదరాబాదులో “చిత్ర కల్పనాలయ” పేరుతో యాక్టింగ్ స్కూలును 1966లోప్రారంభించాడు.
కొంత కాలానికి హైదరాబాదులోనే మరణించాడు.
• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-260
• 260-ప్రప్రధమ హార్మోనిస్ట్ ,,నటుడు ,ప్రయోక్త ,పాత సీతా కళ్యాణ మారీచుడు – కృత్తి వెంటి వెంకట సుబ్బారావు
• కృత్తివెంటి వెంకట సుబ్బారావు (1886 – 1958) ప్రముఖ రంగస్థల నటుడు, నాటక ప్రయోక్త, ప్రప్రథమ తెలుగు హార్మోనిస్టు.[1]
జననం
వెంకట సుబ్బారావు 1886లో బందరులో జన్మించాడు.
రంగస్థల ప్రస్థానం
తెలుగులో మొట్టమొదటి హర్మోనిస్టుగా పేరుగాంచిన వెంకట సుబ్బారావు బందరు ఇండియన్ డ్రమటిక్ కంపనీ, ఏలూను ప్రభాత్ కంపనీల నాటకాలలో నటించాడు. సుమారు 50 సంవత్సరాలపాటు తెలుగు, హిందీ నాటకాలలో స్త్రీ, పురుష పాత్రలు ధరించాడు.
నటించిన పాత్రలు
• ఆలీబాబా
• విశ్వామిత్రుడు
• కంసుడు
• వీరనాయకుడు
మరణం
ఈయన 1958లో ఏలూరులో మరణించాడు.
1934లో వచ్చిన సీతా కల్యాణం సినిమాలో శ్రీరాముడుగా మాస్టర్ కళ్యాన్ ,లక్ష్మణుడుగా నాగేశ్వరరావు ,గౌతముడుగా మాస్టర్ సూరిబాబు జనకుడుగా గోవిందరాజు వెంకటరామయ్య ,,రావణుడుగా తీగెల వెంకటేశ్వర్లు మారీచుడుగా కృత్తివెంటి వెంకట సుబ్బారావు ,కౌసల్యగా శ్రీహరి ,అహల్యగా కమలకుమారి నటించారు దర్శకుడు చిత్రపు నరసింహారావు .మ్యూజిక్ మాస్టర్ పెంచలయ్య .
261-సినీనటుడు ,సీతాకల్యాణం శ్రీ కృష్ణలీలలు దర్శక ఫేం –చిత్రపు నరసింహారావు
చిత్రపు నరసింహారావు తెలుగు దర్శకుడు, నటుడు.
సినిమాలు
1932 లో హెచ్. ఎం. రెడ్డి దర్శకత్వంలో విడుదలైన తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద సినిమాలో ఈయన నటించాడు.[1] ఘంటసాల బలరామయ్య నెల్లూరు జమీందారుల సహకారంతో శ్రీరామ ఫిలిమ్స్ ని స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా మొదటి సారిగా 1936లో రూపుదిద్దుకున్న సతీ తులసి సినిమాకు చిత్రపు నరసింహారావు దర్శకత్వం వహించాడు.[2]
దర్శకత్వం
• సీతా కల్యాణం (1934)
• శ్రీ కృష్ణ లీలలు (1935)
• సతీ తులసి (1936)
• మోహినీ రుక్మాంగద (1937)[3]
• కృష్ణ జరాసంధ (1938)
• జయప్రద (1939)
• సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

రాంగేయ రాఘవ -1

రాంగేయ రాఘవ -1

రాంగేయ రాఘవ -1

అనే పుస్తకాన్ని హిందీలో మధురేశ్ రాస్తే ,తెలుగు అనువాదం జ్వాలాముఖి చేస్తే ,సాహిత్య అకాడెమి 1998లో ప్రచురించింది. వెల-25రూపాయలు .

 ముందుమాటలలో జ్వాలాముఖి చెప్పిన ముఖ్య విషయాలు .’’నలభైఏళ్లు కూడా జీవించని రాఘవ పాతికేళ్ళు రచనా వ్యాసంగం లో గడిపాడు .సాహిత్య వ్యాసంగానికి అడ్డు వస్తుందని వివాహం కూడా ఆలస్యంగా ,కాబోయే భార్య సాహిత్యోపజీవి సులోచనను 33ఏట పెళ్లి చేసుకొన్నాడు .ఆరేళ్ళ దాంపత్యంలో కూతురు సీమంతిని కి జన్మనిచ్చారు అదంపతులు .మెడ మీద పుట్టిన రాచపుండు బ్లడ్ కాన్సర్ కి దారితీసి రాఘవ అకస్మాత్తుగా మృత్యువు ఒడికి చేరాడు .

  ఎం ఎ పిహెచ్ డి అయినా ,ఉద్యోగాలు తలుపు తడుతూనే ఉన్నా ,రచనే జీవిత వృత్తిగా తీసుకొని అయినవారికీ కానివారికి దూరమయ్యాడు .పుంఖాను పుమ్ఖంగా రాసినా ప్రచురణ కర్తలు బాగుపడ్డారే తప్ప ఆయనకు కీర్తి తప్ప ఏదీ మిగల్లేదు .ఆర్ధికం కున్గాదీసినా కేన్సర్ కోతపెట్టినా ,జీవితావసరాలు గీ పెట్టినా ,ఉద్యోగం చేయలేదు రచన మానలేదు .ఉన్నవి అమ్ముకొని జీవిక సాగించాడు .

  రచనకు స్వేచ్చ ముఖ్యం అనేవాడు రాఘవ .సత్యాన్వేషణతో సాహిత్యం లో శాశ్వతత్వం సాధించాలని రాఘవ ఆలోచన .అభ్యుదయం ,మానవ వికాసం ,చారిత్రకదృష్టి సమసమాజం ,అంతఃకరుణ ,అన్యాయ ప్రతిఘటన,దోపిడీ నిర్మూలన అతని రచనలకు ప్రేరణ .హిందీలో మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ దృష్టిని ప్రవేశపెట్టిన వాడు రాంగేయ రాఘవ .సామ్రాజ్యవాద వైఖరినీ ,ఫాసిజాన్నీ ,దాని వికృత చేష్టల్ని,దేశ విభజన విషాదాన్నీ  ఎండగట్టాడు .పరాధీనమానవుల్ని స్వార్ధ పరులు ఎలాదగా చేస్తారో చూపాడు .భారతీయ చారిత్రిక పరిణామాన్ని ,మనవ వికాసానికి నిల్చిన మైలురాళ్ళను ,పాత్రల్నిచూపిస్తూ ‘’గాధలు ‘’నాలుగు భాగాలుగా’’మహాయాత్ర ‘’గా  రాయాలనుకొని రెండు భాగాలు మాత్రమె రాయగలిగాడు .మానవ వికాస చింతన ,సత్యాన్వేషణ ఆయన ఆకాంక్ష.అతని ‘’అంతర్భుక్తి సిద్ధాంతం జ్ఞాన చక్షువు .

  పౌరాణిక పాత్రలైనద్రౌపది భీష్ముడు యుధిష్ఠిరుడు మొదలైన వారిని గొప్ప తర్కం తోఆవిష్కరిస్తూ వారు తమయుగ యదార్దాలలో ఉంటూ కూడా యుగాతీత౦ గా  వర్తి౦చారని చెప్పాడు .దీన్ని  విభేదించిన మైధిలీ శరణ గుప్తాకు జవాబురాస్తూ ‘’మనం స్థిరపడి పోయిన భావాలకు బందీలైతే సత్య సాక్షాత్కారం జరగదు ‘’అని సుదీర్ఘ లేఖ రాశాడు .ఈ లేఖ ‘’సాహిత్యలక్ష్య  లక్షణ వివరణ ‘’కు అత్యుత్తమ ఉదాహరణగా నిలిచి పోయింది .రామానుజా చార్య సంస్కరణాభి లాషనూ మహోత్తమంగా వివరించాడు రాఘవ .

  దేశాభిమానం లేకుండా వామాచారం పెరగటం వలన బౌద్ధం నశించింది అనీ ,జైనం ముందుకు సాగిందనీ అన్నాడు .క్షత్రియుల్ని గెలిచి భూమిని అంతా పరశురాముడు బ్రాహ్మణులకు ధారపోస్తే చివరికి ఆయనకు నిలవటానికి చోటే లేకుండా పోయిందన్నాడు .తర్వాత యుగాలలో బ్రాహ్మణ క్షత్రియులు కలిసి పోరాటం చేయాల్సి వచ్చింది అన్నాడు .ఋగ్వేదం రూపాంతరం చెంది సామవేదం అయి౦దన్నాడు .ఇంగ్లీష్ వారు విమర్శించి నందువలననే ‘’వాజిదలీషా’’అందరి దృష్టిలో పడి,సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా భారతీయ సైన్యాన్ని సమీకరించిన ధీరుడు అని మెచ్చాడు రాఘవ..పతనమవుతున్న నవాబుల యుగం వాడు కావటం అతడి దురదృష్టం .అయినా అతడిని ప్రజలు విపరీతంగా ప్రేమించి ఆరాదించారు  ,ఆతర్వాత నాయకుడు లేకుండానే ప్రజలు బ్రిటిష్ వారిని ఎదిరించారని చారిత్రిక అర్ధం చెప్పాడు .కపాయి అక్బర్ ఏ విధంగానూ సమర్ధనీయుడు కాదు అని చారిత్రిక సత్య శోధన చేసి వివరించాడు రాఘవ .

 మేధావి రచయితా గా రాంగేయ రాఘవ హిందీ రచయితలలో అగ్రగామిగా ఉన్నాడు .అతడిలో తర్కం ,వివేకం తోపాటు అంతఃకరణ కనిపిస్తుంది .ప్రేం చంద్ తో సమానంగా ‘’గదల్ కధ రాశాడు .చారిత్రకరచనలో రాహుల్ సాంకృత్యాయన్ ,నవలా రచనలో యశ్పాల్ ,ప్రేమ చ౦ద్ లను ,కావ్య రచనలో జయశంకర ప్రసాద్’’నిరాలా ‘’ను ,సాహిత్య విమర్శలో రామ చంద్ర శుక్ల ,రాం విలాస్ శర్మలకు దీటైనవాడు రా౦గేయ రాఘవ .బెంగాల్ కరువును ప్రత్యక్షంగా వెళ్లి చూసి రాసిన ‘’తుఫానోం కే బీచ్ ‘’  ఆధునిక పత్రికారిపోర్టింగ్ కు శ్రీకారం .పోలీస్ కాల్పుల్ని నిరసిస్తూరాసిన   ‘యహ్ గ్వాలియర్ హై’’,అతడి కార్మికవర్గ స్నేహ భావానికి అద్దంపట్టింది .అరసం అనే ‘’ప్రగతి శీల అభ్యుదయ సంఘం ‘’తో రాఘవ సాహిత్యం పెనవేసుకు పోయింది .అతడు మనయుగం లో నిజాయితీ నిబద్ధత ఉన్న రచయిత ,మానవతా ప్రవక్త ,వికాస పరిశీలకుడు ,చరిత్రలో విజ్ఞాతా బాధ్యతలు తెలిసిన సంస్కారి .అ౦తటి  రచయిత నభూతో న భవిష్యతి ‘’అతని గురించి అతడి సాహిత్యం గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవటానికి 1990 మే 31 న నేను రాఘవ కుటుంబాన్ని అంటే భార్య సులోచన కూతురు సీమంతిని అల్లుడు అశోక్ శాస్త్రిని ప్రత్యక్షంగా చూడటానికి జైపూర్ వెళ్లాను .రాఘవ జ్ఞాపకాలు ఇంకా వారిలో నిండి ఉన్నాయి సంతృప్తి కలిగింది .సులోచన జైపూర్ యూని వర్సిటిలో సోషియాలజీలెక్చరర్ , భర్త జ్ఞాపకాలను ‘’పునః ‘’రాసి భద్ర పరుస్తోంది .భర్త రాఘవపై ఆమె రాసిన వాటికి టివి లో సంభాషణలు రాస్తున్నాడు .కూతురు ఇంగ్లీష్ లెక్చరర్ ,.రాఘవ రాజస్థానీ వాడుకావటం, హిందీ వాడు కాకపోవటం తో హిందీ సాహిత్యంలో నిర్లక్ష్యానికి గురయ్యాడు .’’ద్రావిడ వాది ‘’అనే ముద్రకూడా వేశారు .నిజానికి రాఘవ తన యుగ పరిధుల్ని దాటి సత్యాన్ని సాక్షాత్కారి౦పజేసిన ‘’స్రష్ట ‘’.మార్గ దర్శకుడు .ఆకుటుంబం అంతా రాఘవ జ్ఞాపకాలతో జీవిస్తున్నారని తెలుసుకొని సంతృప్తి చెందాను ‘’   అన్నాడు జ్వాలాముఖి .

 సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-4-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –257

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –257
• 257-సంగీత విద్వాంసుడు రసపుత్ర విజయ ‘’విమల ‘,రాదా కృష్ణ లో రాధ ’ఫేం,పారుపల్లి వారి తమ్ముడు ,సినీ రాముడు ,ధర్మరాజు ,జనకుడు –పారుపల్లి సుబ్బారావు
• పారుపల్లి సుబ్బారావు నాటకరంగ, సినిమారంగ కళాకారుడు, సంగీత విద్యాంసుడు. స్త్రీ పాత్రలకు పేరొందిన వాడు.[1]
సుబ్బారావు 1897లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా, ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం గ్రామంలో లక్ష్మీనారాయణ, సీతమ్మ దంపతులకు 1906లో జన్మించాడు.

నట ప్రస్థాన౦
1908లో మొట్టమొదట బందరు బాలభారతి సంఘం రసపుత్ర విజయం నాటకంలో విమల పాత్రలో నటించాడు. తమ అన్న పారుపల్లి రామకృష్ణయ్య పంతులు (డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గురువు) దగ్గర సంగీతాన్ని నేర్చుకొని, మైలవరం కంపెనీలో అప్పటి సంగీత దర్శకుడు పాపట్ల కాంతయ్య (పరబ్రహ్మ పరమేశ్వర -ప్రార్థనా గీతానికి సంగీతాన్ని సమకూర్చిన) వద్ద మరాఠీ, పార్సీ సంప్రదాయ రీతుల్ని అభ్యసించాడు. ఆ తరువాత మద్రాస్ సుగుణ విలాస సభలోలోనూ, విజయవాడ మైలవరం కంపెనీలోనూ, ఏలూరు మోతే వారి కంపెనీలోనూ నటించి ఎంతో పేరు సంపాదించాడు. స్ఫురద్రూపం, చక్కని గాత్ర మాధుర్యంతో సాత్వికాభినయంలో మేటిగా, స్త్రీ పాత్రధారణకు పేరొందిన సుబ్బారావు పానుగంటి లక్ష్మీనరసింహారావు రచించిన రాధాకృష్ణలో రాధ వేషాన్ని చక్కగా ధరంచేవాడు
నటించిన పాత్రలు
• విమల (రసపుత్ర విజయం)
• రాముడు (లవకుశ)
• సావిత్రి
• లీలావతి
• రాధ
• సుకన్య
• కైక
• చంద్రమతి
• రుక్మిణి
• రత్నాంగి
• కమలాంబ
• దుర్యోధనుడు
• రామదాసు

సినిమాలు
1934లో ఈస్టిండియా కంపెనీ సి.పుల్లయ్య దర్శకత్వంలో తీసిన ‘లవకుశ’ చిత్రంలో శ్రీరాముని పాత్రలో నటించాడు.
• 1936: సతీ సులోచన (1936 సినిమా)
• ద్రౌపది మాన సంరక్షణము (ధర్మరాజు)[2]
• 1944: సీతారామ జననం (జనకుడు)[3]
• 1934లో సి పుల్లయ్య దర్శకత్వం లో వచ్చిన లవకుశ సినిమాలో రాముడు వేష దారి .మాస్టర్ భీమారావు లవుడు ,మాస్టర్ మల్లేశ్వరరావు కుశుడు ,పారుపల్లి సత్యనారాయణ వాల్మీకి ,సీనియర్ శ్రీరంజని సీత ,ఈమని వెంకటరామయ్య లక్ష్మణుడు .సంగెతం ప్రభల సత్యనారాయణ ,రచన  బలిజేపల్లి లక్ష్మీకాంతం
• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –258
• 258-పాత లవకుశ సంగీతదర్శక ఫేం ,’’కల్లు మానండోయ్  ‘’పాట రచయిత-ప్రభల సత్యనారాయణ 
• ప్రభల సత్యనారాయణ పాతతరం తెలుగు సంగీతదర్శకులు. తెలుగులో ఘనవిజయం సాధించిన మొట్టమొదటి చిత్రం లవకుశ (1934)కు ఈయనే సంగీతదర్శకుడు. తరువాత వరవిక్రయము (సినిమా) కు సంగీతాన్నందించాడు. పూర్తిగా పిల్లలతో తీసిన అనసూయ (1936) చిత్రానికి కూడా ఈయనే సంగీతదర్శకుడు.[1]
• సీతారామ జననం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు రామునిగా నటించాడు; కానీ అతని గళం స్త్రీ గళంగా ఉండేది. అపుడు ప్రభల సత్యనారాయణ, ఓగిరాల రామచంద్రరావును కలసి సలహా తీసుకుని సరిదిద్దుకున్నట్లు అక్కినేని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు
చిత్రసమాహారం
• లవకుశ (1934) తమిళ చిత్రం
• అనసూయ (1936) తెలుగు చిత్రం
• గృహలక్ష్మి (1938) తెలుగు చిత్రం : ఇందులో రెండు పాటలు పాడాడు. అవి “కల్లుమానండోయి”, “లెండు భరత వీరుల్లారా” [4]
• వరవిక్రయము (సినిమా) (1939) హిందీ చిత్రం
• కాలచక్రం (1940) తెలుగు చిత్రం
• సీతారామ జననం (1944) తెలుగు చిత్రం[5]
•    సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –256

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –256

256-నటుడు ,గాయకుడు ,నాటక కృష్ణ ,భీష్మ పాత్రల ఫేం సినీ ,ద్రౌపది ,సావిత్రి నారడుడు వస్గిష్టుడు ఫేం,’పారుపల్లి వారి తమ్ముడు ,’గాన సరస్వతి ‘’-పారుపల్లి సత్యనారాయణ

జీవిత విశేషాలు
అతను కృష్ణా జిల్లా దివి తాలూకాలోని శ్రీకాకుళం లో లక్ష్మీనారాయణ, సీతమ్మ దంపతులకు 1906లో జన్మించాడు.

నాటకరంగం
అతను సావిత్రి (1933), లవకుశ (1934), శ్రీకృష్ణ లీలలు (1935) సినిమాలలో నటిస్తూ గానం చేసాడు. పృథ్వీపుత్ర, దశావతారాలు, భీష్మ, విరాటపర్వం, పాదుక మొదలైన చిత్రాలలో వివిధ పాత్రలలో నటించాడు. అతను తెనాలి కంపెనీలో చేరి ద్రౌపది, తులసి, అన్నపూర్ణ మొదలైన స్త్రీ పాత్రలు పోషించారు.

ఆ రోజుల్లో నాటకాలలో, చలనచిత్రాలలో అనేక పాత్రలు నటిస్తూ “సత్యనారాయణ గారు మా చిత్రంలో ఒక్క పది నిముషాలు కనపడినా చాలు … మా చిత్రానికి విలువ పెరుగుతుంది” అనుకునే స్థాయిలో అనేక చిత్రాలలో ప్రధాన పాత్రలు ధరించాడు. అతను వాల్మీకి వేషం వేసిన ఆనాటి ‘లవకుశ’ చిత్రం. విజయవాడ దుర్గాకళామందిరంలో ఒక ఏడాదిన్నర పైగా ఆడింది. ఆ చిత్రంలో అతను భాగీశ్వరిలో పాడిన “సాహసమేల ఈలీలా జానకి” అనే పాట, బేగడలో పాడిన “ఇది మన ఆశ్రమంబు” అనే పద్యం ఎంతో గుర్తింపు తెచ్చాయి. ఆ రోజుల్లో ఆయన అసంఖ్యాకంగా పాడిన పాటలు, పద్యాలు గ్రామ్ ఫోన్ రికార్డుల ద్వారా అలరించేవి. అతను నటించిన లవకుశ, దశావతారాలు, శ్రీకృష్ణలీలలు, బ్రహ్మరధం, 1944లో సీతారామ జననం (వశిష్టుడు)[1] లాంటి కొన్ని చలనచిత్రాలు ప్రజాదరణ పొందాయి.పుల్లయ్యగారి సతీ సావిత్రిలో నారద వేషం రక్తి కట్టించారు

అతని అన్నయ్య “గాయకసార్వభౌమ” పారుపల్లి రామకృష్ణయ్య పంతులు.

అతని మనుమడు పారుపల్లి సత్యనారాయణ కూడా గాయకుడు, శ్రీ శారదా అన్నమయ్య సంగీత విద్యాలయం వ్యవస్థాపకుడు. [2]

పాటలు
· సుజన జనావానా

· మధుసూదనా

· సత్యపాలనా ఘనా సాధుశీలుడే

· సాహసమేల

· మందం మందం (లవకుశ – 1934)

· ఈ చరణంబులే…[3]

· సశేషం

· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –255

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –255
255-కృష్ణ ,అర్జున శిశుపాల నాటక నతఫెం ,సతీ సావిత్రి సినీ సత్యవంతఫేం రంగభూషణ ,నాట్య విశారద -నిడుముక్కల సుబ్బారావు
నిడుముక్కల సుబ్బారావు (మార్చి 10, 1896 – ఏప్రిల్ 17,1968) రంగస్థల నటుడు, మైలవరం బాలభారతి నాటక సమా జననం
ఈయన 1896 మార్చి 10వ తేదీన విజయవాడలో జన్మించాడు.
రంగస్థల ప్రవేశం
మొట్టమొదట బందరు ‘చిత్రకళాభివర్దిని’ సామాజంలో బాలవేషాలలో నటించి తరువాత మైలవరం కంపెనీలో చేరి అఖండ ఖ్యాతి గడించాడు.
నటించిన పాత్రలు
శ్రీకృష్ణుడు, గయోపాఖ్యానంలో అర్జునుడు, శిశుపాలుడు, అశ్వనీదేవత (సుకన్య), భీష్మ, బబ్బిలి రంగారావు, జలంధరుడు, బిల్వమంగళుడు, ఖడ్గ నారాయణుడు, మన్మధుడు (అనసూయ), శ్రీరాముడు, భరతుడు, నారదుడు, గిరిరాజు (చండిక), క్రూరసేనుడు మొదలైనవి.
బిరుదులు
• రంగభూషణ
• నాట్య విశారద
మరణం
చివరి దశలో లారీ నడిపిస్తూ 1968, ఏప్రిల్ 17న మరణించాడు.
193౩ లో చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వం లో వచ్చిన సతీ సావిత్రి చిత్రం లో నిడుముక్కల సుబ్బారావు సత్యవంతుడు ,మిస్ రామతిలకం సావిత్రి గా నటించారు .నారదుడు పారుపల్లి సత్యనారాయణ ,యముడు వేమూరి గగ్గయ్య .చిత్రానువాదం మల్లాజోశ్యుల రమణ మూర్తి ..సత్యవంతుడుపాడిన ‘’ఈస్శ్వర సంకల్ప మేవ్వారేరుమ్గుడురు ఏరీతి ఎటులుండునో ?””’’పోయే నయ్యోఇపుడు ననుబాసి ‘’నా హృదయఫలకమున ఆ నాతి రూపు  ‘’,పాటలు బహుళ జనాదరణ పొందాయి .
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –254

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –254
254-రామదాసులో కమల ,చంద్రలేఖఫెం –జెమిని సరస్వతి
ఆమె అసలు పేరు సరస్వతి. కానీ జెమినీ స్టూడియోస్‌ నిర్మించిన చిత్రాల్లో నటించడంతో, జెమినీ స్టూడియో నిర్మించిన చంద్రలేఖ చిత్రంలో నటించడంతో ఆమెకి జెమినీ సరస్వతి అనే పేరు వచ్చింది. ఆ తర్వాత కాదల్‌ పడుత్తుమ్‌ పాడు చిత్రంతో నటిగా పరిచయం అయ్యారు. శివాజీ గణేషన్, రజినీకాంత్, కమలహాసన్‌ వంటి స్టార్స్ చిత్రాల్లో నటించారు. 400 చిత్రాల్లో, 1000 పైగా నాటకాల్లో ఆమె వివిధ పాత్రలతో అలరించారు. 1933లో కలకత్తా ఈస్ట్ ఇండియా కంపెని వారి ‘’రామదాసు ‘’సినిమాలో సరస్వతి రామదాసు భార్య కమల గా నటించారు .డైరెక్టర్ అక్తార్ నవాజ్ .ఆరణి సత్యనారాయణ రామ దాసు ఘంటసాల బలరామయ్యగారి ఒక సోదరుడు రాధాకృష్ణయ్య కబీరు ,మరో సోదరుడు ఘంటసాల శేషయ్య రాముడు గా నటించారు .తానేషా నెల్లూరు నాగరాజారావు ,ఆహామాక్ వంగర ,లక్ష్మణుడు ఎం ఎస్ రంగారావు ,సితారాబెగం రాం పాప .
సీనియర్‌ నటి జెమినీ సరస్వతి(94) కన్నుమూశారు. ఇటీవల శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడు కారైకుడికి చెందిన జెమినీ సరస్వతి 5వ తరగతి చదువుతున్న వయసులోనే నాట్యంపై ఆసక్తితో, సినిమాల్లో నటించాలనే ఆశతో చెన్నైకి వచ్చారు. చంద్రలేఖ చిత్రం ద్వారా డాన్సర్‌గా పరిచయమయ్యారు. .
వయసు మీద పడటంతో ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె అనారోగ్యానికి గురయి కన్నుమూశారు. జెమినీ సరస్వతి మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమ సంతాపం తెలియజేస్తుంది. సరస్వతికి దక్షిణామూర్తి, సెల్వరాజ్‌ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు.
సీనియర్‌ నటి జెమినీ సరస్వతి(94) వ ఏట కన్నుమూశారు
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -251

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -251
251-నాటక నటన శిక్షణ ,ప్రదర్శన చేసి పివి రాసిన గొల్లరామప్ప ను నాటకీకరించి ,నాటక సిలబస్ రూపొందించుకొని ,అర్ధశతాబ్దం ,పుష్ప ,భీమ్లా నాయక సినీ ఫేం –అజయ్ మంకేనపల్లి
అజయ్ మంకెనపల్లి రంగస్థల, సినిమా నటుడు, నాటక రంగ గురువు. పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించిన అజయ్ మంకెనపల్లి మధ సినిమా ద్వారా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించి,అర్థ శతాబ్దం,ఆకాశవాణి మొదలైన చిత్రాలలో నటించాడు.[1]
రంగస్థల ప్రస్థానం
అజయ్ క్రియేటివ్‌ థియేటర్‌ అనే సంస్థను 2016లో స్థాపించి నాటక రంగంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. తానే స్వయంగా నాటకాలు రచించి దర్శకత్వం వహించి థియేటర్‌ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ సహకారంతో నాటకరంగంలో పరిశోధన చేస్తున్న అజయ్ మంకెనపల్లి, తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు నాటకాలలు శిక్షణనిస్తూ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రచించిన గొల్ల రామవ్వ కథను నాటకీకరించి.. ఆ నాటకానికి దర్శకత్వం వహించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పదికి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. రఘుబాబు జాతీయ నాటకోత్సవాలలో గొల్ల రామవ్వ నాటకానికి ఉత్తమ ప్రతినాయకుడు , బెస్ట్‌ సపోర్టింగ్‌ క్యారెక్టర్‌గా రెండు అవార్డులు అందుకున్నారు. షేక్‌స్ఫియర్‌ నాటకాన్ని తెలుగులో నాటకీకరించి ప్రదర్శించారు. ఇప్పటివరకు 500 మందికి పైగా నేటి తరం నూతన నటీనటులకు శిక్షణ ఇచ్చి నటనపై ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు. నాటకరంగం లోనే కాకుండా తనదైన ముద్రను సినిమారంగంలో ఉండేలా అనేక చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు పది సినిమాల్లో గుర్తించదగ్గ పాత్రల్లో నటించారు.
తన క్రియేటివ్‌ థియేటర్‌[2]<nowiki> ద్వారా నటనపై ఆసక్తి ఉన్న ఎంతో మంది యువతి యువకులను నటులుగా తయారుచేస్తున్నాడు. నటన అంటే కేవలం అనుకరణ కాదని, అందులో జీవించడం ద్వారానే సహజంగా నటించగలరు అనే విషయాన్ని బలంగా నమ్మిన వ్యక్తి అజయ్. అదే తన క్రియేటివ్‌ థియేటర్‌ వర్క్‌ షాప్‌ ద్వారా కొత్త నటులకు నేర్పుతున్నారు. తన కంటూ ఒక సిలబస్‌ రూపొందించుకొని తనదైన ప్రత్యేక ముద్రను నాటక రంగంలో కనబరుస్తున్నారు. క్రియేటివ్‌ థియేటర్‌ ఇప్పటి వరకు మూడు వర్క్‌ షాప్‌లు నిర్వహించింది. క్రియేటివ్‌ థియేటర్‌ తయారుచేసిన నటులతోనే ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత మెర్సీ మార్గరెట్‌ రచించిన అసమర్ధుడు[3][4]నాటకం అజయ్ మంకెనపల్లి దర్శకత్వంలో నాటకం రూపొందించారు. అది ఇప్పటికే రెండు సార్లు రవీంద్రభారతిలో ప్రదర్శించబడింది. మెర్సీ రాసిన మరో నాటికం త్రిపుర శపథం కూడా అజయ్ మంకెనపల్లి దర్శకత్వంలో రవీంద్ర భారతిలో జనవరి 5న ప్రదర్శించబడింది.
నటించినవి
నాటకాలు:
1. గాడ్‌ మంకీ డెవిల్‌
2. ఏ మిడ్‌ సమ్మర్‌ నైట్స్‌ డ్రీమ్‌
3. ఆలోచన, 7 మార్పు
4. పలనాటి యుద్ధం
5. నిశ్శబ్దం
6. జ్యోతిరావు పూలే
7. నాయకురాలు
8. బతుకమ్మ
9. రజాకార్‌
10. నోటు భారతం
11. జయ జయహే తెలంగాణ
12. గొల్ల రామవ్వ
13. స్వక్షేత్రం
14. గాలి గోపురం
15. కాగితం పులి
16. గబ్బర్‌ సింగ్‌
17. జంబుద్వీపం
18. లోకా సమస్తా సుఖినోభవంతు
దర్శకత్వం వహించిన నాటకాలు
1. అసమర్ధుడు
2. త్రిపుర శపథం
3. గొల్ల రామవ్వ
4. గాడ్‌ మంకీ డెవిల్‌
5. ఏ మిడ్‌ సమ్మర్‌ నైట్స్‌ డ్రీమ్‌
6. నానాజాతి సమితి
7. ఆలోచన
8. మార్పు
నటించిన సినిమాలు
1. అర్ధ శతాబ్దం
2. ఆకాశవాణి
3. ఘోడా
4. పుష్ప
5. ఉస్తాద్‌
6. సైరా నరసింహారెడ్డి
7. మధ
8. భీమ్లా నాయక్‌
బహుమతులు
1. తెలుగు విశ్వవిద్యాలయం – రంగస్థల యువ పురస్కారం 2021-2022
2. జాతీయ రఘుబాబు నాటకోత్సవాల్లలో గొల్ల రామవ్వ నాటకానికి గాను ఉత్తమ నాయకుడు, బెస్ట్‌ సపోర్టింగ్‌ రోల్‌)
3. యూత్‌ అవార్డు 2021
4. సింగిడి యంగ్‌ డిస్టింగ్విష్డ్‌ అవార్డ్స్‌

252-రంగస్థల ,టివి దర్శకుడు ,నంది అవార్డ్ విన్నర్ ,బావాబా పన్నీరు ,చీకటి సూర్యులు ,రైతురాజ్యం ,బతుకమ్మ సినీ నటన ఫేం –అమరేంద్ర బొల్లం పల్లి
అమరేంద్ర. బి రంగస్థల, టీవీ నటుడు, దర్శకుడు, సినిమా నటుడు.[1]
జననం – విద్యాభ్యాసం
అమరేంద్ర 1952, ఆగష్టు 8 న బొల్లంపల్లి వేంకటహరి, ఆండాళమ్మ దంపతులకు హైదరాబాద్లో జన్మించాడు. బి.ఏ. వరకు చదువుకున్నాడు. పి.జి. డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ లో చేరి నటన, దర్శకత్వంలో శిక్షణ పొందాడు.
వివాహం – పిల్లలు
కల్పనశ్రీతో 1977, జూన్ 7న అమరేంద్ర వివాహం జరిగింది. వారికి ఇద్దరు అమ్మాయిలు (స్పందన, భావన)
ఉద్యోగ జీవితం
వజీర్ సుల్లాన్ టొబాకో కంపనీలో సీనియర్ బ్లెండింగ్ అధికారిగా పనిచేసి, 1997లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు.
నాటకరంగ ప్రస్థానం
అమరేంద్ర, తన పెద్దన్నయ్య భాను ప్రకాష్ ప్రోత్సాహంతో పత్తర్ కే ఆన్సూ అనే హిందీ నాటకంలో నాటకరంగ ప్రవేశంచేశాడు.[2] వివిధ సంస్థలలో 4వేల వరకు నాటిక, నాటక ప్రదర్శనలు ఇచ్చాడు. మొదటిసారిగా ఎన్.ఆర్. నంది రాసిన వాన వెలిసింది నాటికకు దర్శకత్వం వహించాడు. 1972లో రవి ఆర్ట్స్ సంస్థ హైదరాబాద్ లో నిర్వహించిన నాటిక పోటీలలో ఉత్తమ దర్శకుడిగా బంగారు పతకం అందుకున్నాడు. అనేక నాటక పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించాడు.
1969లో ఆదర్శ యువభారతి అనే సంస్థను ప్రారంభించి, ఆ సంస్థ ఆధ్వర్యంలో నాటిక, నాటక ప్రదర్శనలు ఇస్తున్నాడు.
బహుమతులు
నంది బహుమతులు:
1. ఉత్తమ ప్రతినాయకుడు – నంది నాటక పరిషత్తు – 2016[3]
పురస్కారాలు – సత్కారాలు:
1. తెలంగాణ థియేటర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ సత్కారం[4]
టీవిరంగ ప్రస్థానం
తూర్పు పడమర, మిస్టరీ, జీవన తీరాలు, ధరణికోట, ధూర్జటి, పోతన, ఫ్యాక్షన్ – ఫ్యాక్షన్, కాశీమజిలీ కథలు, ఊహల పల్లకి, మాయాబజార్, మంచుపర్వతం, ఉషోదయం, విధి, పద్మవ్యూహం, ఎండమావులు, అనురాగదార, ఓ అమ్మకథ, బుజ్జి – బజ్జిబాబు, కథా స్రవంతి, శ్రావణీ సుబ్రహ్మణ్యం వంటి దాదాపు 250 సీరియళ్లలో నటించాడు.
సినీరంగ ప్రస్థానం
అమరేంద్ర నటించిన ఆందమే ఆనందం నాటిక చూసిన జంధ్యాల విచిత్రప్రేమ సినిమాలో అమరేంద్రకు అవకాశం ఇచ్చాడు. ఆ తరువాత బావా బావా పన్నీరు, విషజ్వాల, చీకటి సూర్యులు, కూలన్న, రైతురాజ్యం, ఊరుమనదిరా, భీముడు, వేగుచుక్కలు, గంగమ్మ జాతర, వీరివీరి గుమ్మడి పండు, అమ్మమీద ఒట్టు, బతుకమ్మ, వీర తెలంగాణ, పోరు తెలంగాణ, రాజ్యాధికారం[5] మెదలైన సినిమాలలో నటించాడు.
253-రంగస్థల ,హరికధా కళాకారుడు ,నారద ,లక్ష్మణ ఫేం ,సక్కుబాయి లో శివయోగి ,ధర్మరాజు సినీ ఫేం,హరికధా కంఠీరవ  –చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్
చొప్పల్లి గా ప్రసిద్ధిచెందిన చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ సుప్రసిద్ధ హరికథా కళాకారుడు, రంగస్థల, సినిమా నటుడు.[1]
ఈయన విజయనగరం జిల్లా లోని చొప్పల్లి గ్రామంలో సెప్టెంబరు 19 1905 తేదీన జన్మించాడు. వైణిక విద్వాంసుడైన చొప్పల్లి నరసింహం, సూరమాంబ ఈయన తల్లిదండ్రులు. ఆనాడు విజయనగరం మహారాజైన ఆనంద గజపతి నాటక సమాజంలో నటించి ప్రజల, ప్రభువుల మన్ననలు పొందినవాడు నరసింహం. తండ్రి ప్రోత్సాహం చొప్పల్లిని నటునిగా తీర్చిదిద్దాయి.
విజయనగరం మహారాజా కళాశాలలో ఎస్.ఎస్.ఎల్.సి. పాసయ్యాడు. తర్వాత శ్రీవాణీ విలాస్ అమెచ్యూర్ కంపెనీలో చేరి అనాసపురపు గోపాలరావు సరసన రసపుత్ర విజయం నాటకంలో వీరమాత పాత్ర పోషించి మొదటిసారిగా రంగస్థల ప్రవేశం చేశాడు. తర్వాత ప్రహ్లాదలో నారదుడు, లవకుశలో లక్ష్మణుడుగా పాత్రలు పోషించాడు. తర్వాత ప్రసిద్ధ నటులైన యడవల్లి, పారుపల్లి, ఆంజనేయులు మొదలైన వారితో కలిసి ద్రౌపదీ వస్త్రాపహరణం, గయోపాఖ్యానం, సక్కుబాయి మొదలైన నాటకాలలో నటించాడు. ముఖ్యంగా సక్కుబాయిలో శివయోగి, పాండవ నాటకంలో ధర్మరాజు పాత్రలు ఆయనకు అఖండమైన ప్రఖ్యాతిని చేకూర్చాయి.
చొప్పల్లి తొలినాటి చలనచిత్ర రంగంలో ప్రవేశించి సక్కుబాయి (1935) సినిమాలో శివయోగి పాత్రను, ద్రౌపదీ వస్త్రాపహరణం (1936) లో ధర్మరాజు పాత్రను, కచ దేవయాని (1938) లో శుక్రాచార్యుడుగా, రుక్మిణీ కళ్యాణంలో అగ్నిద్యోతనుడుగాను, మీరా బాయి (1940) లో రూపగోస్వామి మొదలైన పాత్రలు ధరించి కీర్తిని గడించాడు.
1929లో మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో హరికథకుడిగా ప్రవేశించి అనేక హరికథ లను గానం చేశాడు. పండితుల చేత “హరికథా కంఠీరవ” అనే బిరుదును పొందారు.
   సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –248

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –248

248-తెలుగు నాటక రంగ రూప శిల్పి ,ఫణి,రాగరాగిణి నాటక ఫేం ,నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా విజిటింగ్ ఫాకల్టి,అగ్నిప్రవేశం ,స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ సినీ ఫేం –అడబాల

అడబాల (ఫిబ్రవరి 9, 1936 – మార్చి 14, 2013) రంగస్థల నటుడు, రూపశిల్పి, లలిత కళా సమితిలో స్థాపక సభ్యుడు, రంగస్థల అధ్యాపకుడు.[1

ఈయన 1936, ఫిబ్రవరి 9 న తూర్పు గోదావరి జిల్లాలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు సత్యమ్మ, వెంకన్ననాయుడు.

రంగస్థల ప్రస్థానం
నాటకరంగానికి రూపశిల్పిగా సుపరిచితులు. ఆ శాఖలో లోతుపాతులు కూలంకషంగా, శాస్త్రీయ పద్ధతులలో అధ్యయనం చేసి నైపుణ్యం సంపాదించాడు. జాతీయ స్థాయిలో నాటక విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఆహార్యంలో మెళకువలు బోధించాడు. సీనియర్ మేకప్ ఆర్టిస్టులలో ఆడబాల ముఖ్యులు. ఈయన బి.ఏ పట్టభద్రుడు. డాక్టర్ గరికపాటి రాజారావు వద్ద నటనలోను, ఆదర్శ నాట్యమండలి, పాలకొల్లుకి చీఫ్ మేకప్ ఆర్టిస్టు అయిన మెషక్‌ వద్ద మేకప్‌లోనూ శిక్షణ పొందాడు.[2]

అడబాల బాల్యదశ నుండే నాటకాల్లో వేషాలు వేశాడు. విద్యార్థి దశలో భమిడిపాటి ఇప్పుడు అనే నాటికలో శానయ్య పాత్ర ధరించి శభాష్ అనిసించుకున్నాడు. 1940 నుంచీ పినిసెట్టి శ్రీరామమూర్తి నిర్వహించిన ఆదర్శ నాట్యమండలి పక్షాన ప్రదర్శించిన పల్లెపడుచు, అన్నాచెల్లెలు తదితర నాటకాల్లో పాల్గొన్నాడు. మద్రాస్లో రైల్వేశాఖ ఉద్యోగం కె. వేంకటేశ్వరరావు శిక్షణలో ర.స.న సమాఖ్యలో ఫణి, రాగరాగిణి వంటి ప్రతిష్ఠాత్మక నాటకాలలో పాల్గొన్నాడు. పలుచోట్ల ఉత్తమ నటుడిగానూ, హాస్య నటుడిగానూ బహుమతులు అందుకున్నాడు. 1966లో సికింద్రాబాద్ వచ్చిన అడబాల 1967లో ఆంధ్ర లలిత కళాసమితిని స్థాపించిన వ్యవస్థాపక సభ్యుడు. ఎ.ఆర్. కృష్ణ ఆధ్వర్యంలో చాలా నాటకాల్లో పాల్లొన్నాడు. అందులో ముఖ్యమైనది మాలపల్లి. నేరము- శిక్ష, కప్పలు, నీలా తెరలు, లేపాక్షి, ఆశ్రయం, అరణి, వీలునామా మొదలైన నాటకాలు, మానవుడు, పెళ్ళిచూపులు, పగ, అమ్మ, రాజీవం, రాతిమనిషి మొదలైన నాటికలు నటుడిగా అడబాలకు పేరు తెచ్చాయి. అడబాల కొన్ని టీవీ సీరియల్స్‌లో, అగ్నిప్రవేశం, స్టూవర్టుపురం పోలీసుస్టేషన్ మొదలైన చిత్రాల్లో కూడా నటించాడు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి విజిటింగ్ ఫాకల్టీగా చేశాడు. ఉస్మానియా, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని రంగస్థల కళల శాఖలో విజిటింగ్ లెక్చరర్ గా పనిచేశాడు. ఇతని శిక్షణలో అనేక మంది శిష్యులు ఆహార్యంలో నైపుణ్యం సంపాదించారు.

రూపశిల్పిగా
ఆదర్శ నాట్యమండలి నాటకాలకు అప్పట్లో మేకప్ చేస్తున్న మాస్టారు అడబాల అసక్తిని గమనించి, మేకప్ లో తొలి పాఠాలు నేర్పి ప్రోత్సహించాడు. ఆనాటి నుండి అటు నటన, ఇటు రూపశిల్పం రెండీంటినీ నిర్వహిస్తూ వచ్చాడు.

మరణం
ఈయన మార్చి 14, 2013న మరణించాడు.

249-చలం గారి తమ్ముడిభార్య ,బళ్ళారి రాఘవ పిలుపుతో సంప్రదాయం వదలి నాటక రంగ ప్రవేశం చేసి ,ప్రహ్లాద నాటక లీలావతి ఫేం,రాఘవతో కలిసి చంద్రగుప్త ,రామదాసు లలో నటించి ,రైతుబిడ్డ ,పెద్దమనుషులు సినీ ఫేం ,గాంధి డాక్యుమెంటరి వ్యాఖ్యాత –కొమ్మూరి పద్మావతీ దేవి

కొమ్మూరి పద్మావతీదేవి ( జూలై 7, 1908 – మే 9, 1970) తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి.

పద్మావతీదేవి చెన్నై లో 1908 జూలై 7 న సంఘసంస్కర్తల కుటుంబంలో జన్మించింది. ఈమె తల్లితండ్రులు సంఘసంస్కరణోద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తూ సంస్కరణ వివాహాం చేసుకున్నారు. వారి వివాహన్ని స్వయంగా కందుకూరి వీరేశలింగం పంతులు నిర్వహించారు. తల్లితండ్రులు పద్మావతిదేవికి చదువుతో పాటూ సంగీతం కూడా నేర్పించారు. పద్మావతిదేవికి 14 యేళ్ల వయసులో గుడిపాటి వెంకట చలం తమ్ముడు కొమ్మూరి వెంకటరామయ్యతో వివాహం జరిగింది. ఈమె కూమార్తె ఉషారాణి భాటియా కూడా రచయిత్రి.

తెలుగు నాటకరంగంలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టిన బళ్ళారి రాఘవ రంగస్థలం పైకి సంసార స్త్రీలను ఆహ్వానించినప్పుడు ఈమె సంప్రదాయపు సంకెళ్ళను త్రెంచుకుని నాటకరంగం మీద కాలుపెట్టారు. ఈమె ప్రహ్లాద నాటకంలో లీలావతి పాత్ర పోషించేవారు. ఆమె రామదాసు, తప్పెవరిది, సరిపడని సంగతులు, చంద్రగుప్త, ఆ లోకం నుండి ఆహ్వానం మొదలైన నాటకాలలో రాఘవతో కలిసి సముచిత పాత్రలలో నటించారు. మహాత్మా గాంధీ డాక్యుమెంటరీ చిత్రంలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

సినిమాల ప్రవేశంతో ద్రౌపదీ మానసంరక్షణం, రైతు బిడ్డ, సుమతి, పెద్ద మనుషులు చిత్రాలలో నటించారు. వీరు స్త్రీల సమస్యల మీద ఎన్నో రేడియో ప్రసంగాలు చేశారు.

మరణం
ఈమె చెన్నై లో 1970 మే 9 తేదీన పరమపదించారు.

250-ముదినేపల్లి పంచాయితీ ప్రెసిడెంట్ ,ఎక్సేల్సియర్ నాట్యమండలి ,నవభారత ,శ్యామల నాట్య మండలి స్థాపకుడు ,డైరెక్టర్ ,త్రిపురనేని వారి ‘’ఖూనీ ‘’నాటక ఫేం ,పల్లెటూరు ,పుట్టిల్లు ,పిచ్చిపుల్లయ్య సినీ ఫేం –కోడూరి అచ్చయ్య

కోడురి అచ్చయ్య చౌదరి ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు.

వీరు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా ముదినేపల్లిలో జన్మించారు. చిన్నతనం నుండి నాటకాలంటే సరదా పడి తీవ్రంగా కృషిచేశారు. వీరు నాటకరంగంలో ప్రవేశించేముందు కృష్ణాజిల్లా బోర్డు రాజకీయాలలో తనమునకలవుతూ వుండేవారు. ముదినేపల్లి పంచాయతీ బోర్డు అధ్యక్షునిగా సుమారు పన్నెండు సంవత్సరాలు వ్యవహరించారు.ముదినేపల్లిలో ఎక్సెల్షియర్ క్లబ్బును స్థాపించి దాని ఆధ్వర్యాన మూడేండ్లపాటు చెడుగుడు, బ్యాడ్‌మింటన్ పోటీలు నిర్వహించారు. అయితే గ్రామ రాజకీయాలతో విసుగు చెంది ఆయన ఆ రంగం నుండి తప్పుకుని తన దృష్టిని నాటకరంగంవైపు మళ్ళించారు[1].

నాటకరంగం
1939 ప్రాంతాలలో ఎక్సెల్షియర్ నాట్యమండలిని స్థాపించి తెలుగుతల్లి, ఆశాజ్యోతి, సత్యాన్వేషణం అనే సాంఘిక నాటకాలకు స్వయంగా దర్శకత్వం వహించి ఊరూరా ప్రదర్శింపచేశారు. అనేక షీల్డులు, ప్రశంసలు పొందారు. నిజానికి ఈయన బాల్యం నుండే నటునిగా పేరు పొందారు. తమ తొమ్మిదేళ్ల వయసులో వడాలి అగ్రహారం జగన్నాథస్వామి కళ్యాణోత్సవాలలో పెంజెండ్ర నాటక సమాజం వారు ప్రదర్శించిన కుశ లవ నాటకంలో రిహార్సల్ లేకనే లవుని పాత్రను అభినయించి సాటి నటబృందాన్ని ఆశ్చర్యచకితులను చేశారు. నాటక రచనలోని ప్రత్యక్షరం పూర్వాపరార్థాలు తెలుసుకుని పాత్ర స్వభావాన్ని అవగాహన చేసుకుని నాటకీయతలో పాత్రను సజీవంగా నిలపడం ఈయన ప్రత్యేకత. తాను స్థాపించిన ఎక్సెల్షియర్ నాట్యమండలిలో స్త్రీ పాత్రలు ధరించే అక్కినేని నాగేశ్వరరావు సినిమా రంగానికి వెళ్ళిపోవడంతో స్త్రీపాత్రలకు స్త్రీలను పెట్టుకుని నాటకాలాడడంలో వున్న సాధక బాధకాలను తట్టుకోలేమని భావించి ఆ నాట్యమండలినే రద్దు చేశారు. ఈయన కృష్ణాజిల్లా ప్రజా నాట్య మండలికి దర్శకుని బాధ్యతను నిర్వహించి మొదట సుంకర వాసిరెడ్డి రచించిన “ముందడుగు” నాటకాన్ని ప్రదర్శించారు. తర్వాత గుడివాడలో రావూరి రచించిన పరితాపం నాటకాన్ని తయారుచేసి ఆంధ్ర నాటక పరిషత్తులో ప్రదర్శించారు. ఈ సమయంలోనే మెరికల వంటి ఉత్తమ నటీనటులను ఈయన తీర్చిదిద్దారు. పెదపాలపర్రులో నవభారత నాట్యమండలి, గుడివాడలో శ్యామల నాట్యమండలులను వీరు స్థాపించారు. ఈ మండలులద్వారా అనేక సాంఘిక నాటకాలు ప్రదర్శించడమే కాక, త్రిపురనేని రామస్వామి చౌదరి గారి “ఖూనీ” నాటకాన్ని రంగస్థలిపై ప్రదర్శించి రక్తి కట్టించిన ఖ్యాతి దక్కించుకున్నారు. వీరు పిల్లల కోసం కొన్ని నాటికలు, పెత్తందారు, ధర్మచక్రం, విజయభేరి మొదలైన నాటకాలను స్వయంగా రచించారు.

సినిమా రంగం
వీరు చలనచిత్ర రంగంలో ప్రవేశించి పల్లెటూరు, పుట్టిల్లు, కన్నతల్లి, వయ్యారి భామ, లక్ష్మి, పరివర్తన, పిచ్చిపుల్లయ్య, బాల సన్యాసమ్మ కథ మొదలైన సినిమాలలో విభిన్నమైన పలు పాత్రలు ధరించారు. అయితే అక్కడి వాతావరణం నచ్చక సినిమా రంగంలో అన్ని అవకాశాలు వుండి కూడా, మిత్రులు బలవంతపెట్టినా ఆ రంగాన్ని విడిచిపెట్టి తిరిగి గుడివాడ వెళ్ళి అనేక నాటక సమాజాలకు దర్శకత్వం వహించారు.

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –247

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –247
247-బెజవాడ రేడియో ప్రొడక్షన్ అసిస్టెంట్ ,బలిపీతం లో సినీ ప్రవేశం చేసి ,జంధ్యాలతో నాలుగుస్తంభాలాట ,ఆహానాపెల్లంటా,శ్రీవారికి ప్రేమలేఖలు వగైరాలలలో చొక్కాలు చి౦పుకొని తల గోడ కేసి కొట్టుకొని ,బ్రహ్మానందానికి ఆరగాఆరగా అరగుండు గీయించి,,వేలుతో సుత్తి కొట్టించుకొని ,శ్రీలక్ష్మి సంగీతం తో బాధపడినా బాలకృష్ణ అబ్బాయ్ కి   బాబాయ్ గా నవ్వించిన  –సుత్తి వీరభద్రరావు అనే మామిడిపల్లి వీరభద్రరావు
సుత్తి వీరభద్ర రావుగా ప్రసిద్ధిగాంచిన మామిడిపల్లి వీరభద్ర రావు (జూన్ 6, 1947 – జూన్ 30, 1988) తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో, నాటక కళాకారుడు.
బాల్యము
వీరభద్ర రావు తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు, ప్రథమ సంతానం. అతనికి ఇద్దరు చెల్లెళ్ళు. స్వస్థలం గోదావరి జిల్లా. తండ్రి ఉద్యోగ నిమిత్తం విజయవాడకు తరలి వెళ్ళాడు. విజయవాడలో ఉన్న ఎస్.ఆర్.ఆర్ అండ్ సి.వి.ఆర్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు.
వృత్తి
చిన్నతనము నుంచి నాటక రంగం మీద వున్నా మక్కువతో, తండ్రి చూసిన ఉద్యోగావకాశాలను కాదనుకుని, నటుడిగా అటు నాటకాలలో, ఉద్యోగరీత్యా ఆకాశవాణిలో స్థిరపడ్డాడు. సరదాగా మిత్రుని దగ్గరకు వెళ్ళిన వీరభద్రరావుని మాదాల రంగారావు బలిపీఠం సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేయించారు. మిత్రుడు, శ్రేయోభిలాషి జంధ్యాల దర్శకత్వములో వచ్చిన నాలుగు స్తంభాలాట చిత్రంతో చిత్రసీమలో స్థిరపడ్డాడు. 1988లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చూపులు కలసిన శుభవేళ చిత్రం ఆఖరి చిత్రం.
ఆకాశవాణి
ఆకాశవాణి నుండి ఎందరో కళాకారులు సినీ రంగానికి వెళ్ళి పేరు తెచ్చుకున్నారు. అలాంటివారిలో వీరభద్రరావు ఒకరు. అతనికి ‘ సుత్తి ‘ పదం పేరులో భాగమైంది. సినీరంగంలో చేరి 50కి పైగా చిత్రాలలో నటించాడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రొడక్షన్ అసిస్టెంట్ గా చేరి రెండు దశాబ్దాలు నాటక విభాగంలో చాలాకాలం పనిచేశాడు. పనిచేసి 1980లో చిత్రపరిశ్రమలో చేరారు. 1988 జూన్ 30 న వీరభద్రరావు మదరాసులో కన్నుమూశారు.
చిత్రసీమ
ఇతడు నటించిన తెలుగు చిత్రాల పాక్షిక జాబితా:
1. నాలుగు స్తంభాలాట (1982)
2. మంత్రి గారి వియ్యంకుడు (1983)
3. మూడు ముళ్ళు (1983)
4. రెండుజెళ్ళ సీత (1983)
5. ఆనంద భైరవి (1984)
6. కాంచన గంగ (1984)
7. మెరుపు దాడి (1984)
8. శ్రీవారికి ప్రేమలేఖ (1984)
9. పుత్తడి బొమ్మ (1985)
10. స్వాతిముత్యం (1985)
11. చంటబ్బాయి (1986)
12. శాంతినివాసం (1986)
13. అహ! నా పెళ్ళంట! (1987)
14. రాక్షస సంహారం (1987)
15. చిన్ని కృష్ణుడు (1988)
16. చూపులు కలిసిన శుభవేళ (1988)
17. వివాహ భోజనంబు (1988)
మరణం
1988లో చూపులు కలసిన శుభవేళ చిత్రానికి హైదరాబాదు లోఒక పాటని చిత్రీకరిస్తున్నప్పుడు కాలు బెణికింది. మధుమేహంతో ఉన్న వీరభద్రరావు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించగా, చిత్రీకరణ పూర్తి అవ్వగానే విశ్రాంతి కోసం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చేరాడు. ఒక రాత్రి నిద్రకోసం ఇచ్చిన ఇంజక్షను వికటించి గుండెపోటు వచ్చింది. అవే అతని ఆఖరి క్షణాలు. అది 1988, జూన్ 30 తెల్లవారుఝామున జరిగింది.
సుత్తి గారబ్బాయి మామిడిపల్లి చక్రవర్తి చెప్పిన సుత్తిఅనే స్తుతి
అసలు మనం ఎవరం’… ‘తండ్రీ కొడుకులం’…‘కాదు భారతీయులం’.. ‘నీ నూనె నీ నూనే నా నూనె నా నూనే’… హైదరాబాద్, ముస్తాబాదు, సికిందరాబాదు’…‘నీ నవరంధ్రాల్లోను మైనం కూరతానురా తలకు మాసిన కుంకా’… ఇటువంటి అనేక హాస్య సంభాషణలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచారు సుత్తి వీరభద్రరావు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నాటక విభాగంలో హీరోగా నటించిన వీరభద్రరావు, జంధ్యాల మార్కు సినిమాలతో సుత్తి వీరభద్రరావుగా తెలుగు సినీ ప్రపంచంలో స్థిర పడి  పోయారు. వేలుతో కలిసి సుత్తి జంటగా ప్రేక్షకుల గుండెల్లో నేటికీ సుత్తి కొడుతూనే ఉన్నారు. నేడు(జూన్‌ 30)  సుత్తివీరభద్రరావు వర్థంతి. ఈ సందర్భంగా ఆయన కుమారుడు మామిడిపల్లి చక్రవర్తితో ఈ వారం సినీ పరివారం.
నాన్నగారికి మేం ఇద్దరు పిల్లలం. నేను, నా తరవాత చెల్లాయి విజయనాగలక్ష్మి. నా కంటె రెండేళ్లు చిన్నది. అమ్మ పేరు శేఖరి. నాన్నగారు 1971లో ఆలిండియా రేడియోలో చేరారు. నేను 1972లో పుట్టాను. నేను పుట్టాక నాన్నకు ప్రమోషన్‌ వచ్చిందని అందరితోనూ సంతోషంగా అనేవారట. మేం విజయవాడ కృష్ణలంకలో ఉండేవాళ్లం. సినిమాలలో నాన్న మామూలు వీరభద్రరావు నుంచి సుత్తి వీరభద్రరావు అయ్యాక అమ్మను అందరూ ‘సుత్తి ఆంటీ’ అని సరదాగా పిలిచేవారు. నాన్నకి సినిమా అవకాశాలు పెరగటంతో 1982లో ఆకాశవాణి ఉద్యోగం విడిచిపెట్టేసి  చెన్నై షిఫ్ట్‌ అయ్యాం. కాబట్టి ఎనిమిదో క్లాసు నుంచి చెన్నైలోనే నా చదువు కొనసాగింది. పదో తరగతిలో ఫస్ట్‌ క్లాసు వచ్చినందుకు నాన్న సంబరపడ్డారు.  నాన్న చనిపోయేనాటికి నేను ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాను. అమ్మ చాలా మొండి మనిషి. నాన్న మరణం తాలూకు బాధను దిగమింగి, ధైర్యంగా మమ్మల్ని ముందుకు నడిపించింది.
ఇద్దరిని పోగొట్టుకున్నాను
ఎమ్‌సెట్‌లో 3000 ర్యాంకు వచ్చినా మంచి కాలేజీలో సీటు రాలేదు. నాన్న కంప్యూటర్‌ సైన్స్‌ చదవమని చెప్పారు. అందులో సీటు రాకపోవటం తో, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉద్యోగం చేస్తూ,  నైట్‌ కాలేజీలో బీఎస్సీ ఫిజిక్స్‌ చదువుకున్నాను. నేను బీఎస్సీలో చేరినప్పుడు దగ్గరి బంధువులంతా ‘బోడి బీఎస్సీ’ అని వెటకారమాడారు. అటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు ‘కొందరికి దూరంగా ఉంటేనే బాగుపడతాం’ అనిపించింది. కొద్దిగా స్థిరత్వం వచ్చాక, పై చదువుల కోసం అమెరికా వెళ్లి, అక్కడ పి.జి. డిప్లమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ చేసి, నిలదొక్కుకున్నాక, ఇండియా వచ్చేశాను. చెల్లి ఎమ్మెస్సీ మాథమేటిక్స్‌ చేశాక 2002లో వివాహం చేశాను. నా జీవితంలో త్వరగా నాన్నని పోగొట్టుకోవడం ఒక దురదృష్టమైతే, చెల్లిని పోగొట్టుకోవటం మరో బాధాకర సంఘటన. ఆమెకు బ్రెస్ట్‌ క్యాన్సరు వచ్చి కన్నుమూసింది. చెల్లెలికి ఒక కూతురు. పేరు తనుశ్రీ. పదో తరగతి చదువుతోంది.
బాధ్యతలు తీసుకున్నాను
నాన్న పోవడం వల్ల ఒక కొడుకు మీద బాధ్యతలన్నీ వచ్చి చేరతాయి. అందుకు నేను కూడా అతీతం కాదు. జీవితంలో ఒక్కో మెట్టు ఎదుగుతున్నప్పుడు నాన్నను మిస్‌ అయ్యాననే భావన కలుగుతూనే ఉంటుంది. అంతలోనే ఆయన వెంట ఉన్నట్టు భావించుకుంటాను. నా వివాహం జరిగాక, యు.కె వెళ్లి కొంతకాలం తరవాత వెనక్కు వచ్చి, 2008లో సొంత కంపెనీ ప్రారంభించాను. ప్రస్తుతం ‘ప్రొడక్ట్‌ సర్వీస్‌ మేనేజ్‌మెంట్‌’ చేస్తున్నాం.
విజయవాడలో…
విజయవాడలో ఉన్న రోజుల్లో నాన్న హనుమంతరాయ గ్రంథాలయంలో వేసే నాటకాలకు వెళ్లేవాడిని. కన్యాశుల్కం నాటకం చూసినట్టు గుర్తు. చెన్నైలో నాన్నతో గడిపిన నాలుగు సంవత్సరాలు నాకు గోల్డెన్‌ పీరియడ్‌. ఆ టైమ్‌లో సినిమా షూటింగులు, డబ్బింగులకు నాన్నతో వెళ్లేవాడిని.  శబరిమలకి వెళ్లినప్పుడు మా కారుకి ప్రమాదం జరిగింది. దేవుడి దయ వల్ల బయటపడ్డాం. అది నిజంగానే దేవుడి మహిమేనేమో అనిపిస్తుంది. నాన్నతో నాలుగు సార్లు శబరిమలకు వెళ్లడం మరచిపోలేని సంఘటన.
అందుకోసమే ఉండిపోయాం
నాన్న పోయేనాటికి నాన్నకు కొంతమంది సుమారు నాలుగు లక్షలు బాకీ ఉన్నారు. ఎవరెవరు ఇంతెంత ఇవ్వాలో నాన్న ఒక లిస్టు రాసి పెట్టారు. వాటిని తిరిగి రాబట్టుకోవటం కోసం చెన్నైలోనే ఉండిపోదాం అంది అమ్మ. నాలుగేళ్లు తిరిగితే మూడు లక్షలు తీసుకురాగలిగాను. పొద్దున్నే వెళ్లి నిర్మాతల దగ్గర నిలబడాల్సిందే. కొంతమంది నిర్మాతలు పరవాలేదు మరికొందరు ఇబ్బంది పెట్టారు.   ఆ అనుభవమే నా భవిష్యత్తుకు పునాది అనుకుంటాను. ఇదంతా చూసి, జంధ్యాలగారు బాధపడి, నిర్మాతల బదులు ఆయన ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అమ్మ స్నేహితులు సపోర్ట్‌గా నిలబడ్డారు.
దీపావళి నాన్నతోనే
నాన్న షూటింగుల్లో ఎంత బిజీగా ఉన్నా, దీపావళికి మాత్రం మాతోనే గడిపేవారు. ఉదయమంతా షూటింగ్‌లలో బిజీగా ఉన్నప్పటికీ, చీకటి పడకుండా ఇంటికి వచ్చేసేవారు. నాన్న నటించిన చిత్రాలలో ‘పుత్తడిబొమ్మ’ బాగా ఇష్టం. ఆ సినిమాలో పెళ్లిలో ఒక పద్యం చదువుతారు. చాలా నవ్వొస్తుంది. ఆ చిత్రానికి నాన్నకు అవార్డు కూడా వచ్చింది. ‘రెండు రెళ్లు ఆరు’, ‘బాబాయ్‌ అబ్బాయి’ చిత్రాలలో నాన్న తన పాత్రను ఇంప్రొవైజ్‌ చేశారు. ‘పడమటి సంధ్యారాగం’ చిత్రంలో నాన్న డబ్బింగ్‌ చెప్పిన విధానం బావుంటుంది. కళాకారుడు కష్టాలన్నీ మరచిపోయి, వేదిక మీద ఆనందం పొందుతాడు. ఆ తరవాత ఆ ఆనందం వారి మీద స్వారీ చేస్తుంది. అందువల్లే నాన్న ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసి ఉంటారు. ఏమైనప్పటికీ నాన్నను తలచుకోవటం నాకు ఆనందంగా ఉంది.
మా దగ్గరే ఉన్నారన్న భావన…
ఎన్నడూ బాధ్యతల నుంచి పారిపోలేదు. అమ్మ ఆశీర్వాదంతో ఇంటి బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చాను. నా భార్య పేరు కిరణ్మయి చావలి. తను ఆయుర్వేదిక్‌ డాక్టర్‌. మాకు ఒక అమ్మాయి. పేరు అనన్య. నాన్న సినిమాలు టీవీలో వస్తుంటే మా అమ్మాయికి చూపిస్తుంటాను. మేం ఆ సినిమాలు  చూస్తున్నంతసేపు నాన్న మా దగ్గరే ఉన్నారన్న భావన కలుగుతుంది. నా పుట్టినరోజు నాడు నాన్న సినిమా టీవీలో వస్తే నాన్న నన్ను ఆశీర్వదించినట్లు అనుభూతి చెందుతాను. నాకు క్రియేటివ్‌ ఫీల్డ్‌ మీద ఇంటరెస్ట్‌ ఉంది. అది బహుశ నాన్న ప్రభావం కావొచ్చు. కార్టూన్లు, స్కిట్స్‌ చేశాను. ఇది హాబీ మాత్రమే. ‘బాబాయ్‌ అబ్బాయ్‌’ చిత్ర షూటింగ్‌కి Ðð ళ్తున్నప్పుడు మొదటిసారి నాన్నతో విమానం ఎక్కాను. అది నా జీవితంలో మరచిపోలేని రోజు. ఆ చిత్రంలో నాన్న ‘సీతారామ సంగ్రామం’ ఘట్టంలో ఆడవేషం వేసి పాట పాడతారు. ఆ తరవాత నాన్నకి దండ వేయాలి. నన్ను వేయమన్నారు. ఆ దృశ్యం ఎప్పటికీ మరచిపోలేను.
– సంభాషణ: వైజయంతి పురాణపండ
ఫొటోలు: షేక్‌ రియాజ్, ఏలూరు
  సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

ఆత్మ లింగ శతకం

ఆత్మ లింగ శతకం
‘’శ్రీ మదనంత సనాతన అచల బోధ సిద్ధాంత సద్గురు దత్తాత్రేయ పర౦ప రాచార్యులైన ఆకుల గురు మూర్తి యోగీంద్ర విరచిత ‘’ఆత్మ లింగ శతకం విజయనగర రామానుజ ముద్రాక్షర శాల లో ముద్రింపబడింది .125పద్యాల ఈశతకం ఎప్పుడు ముద్రి౦పబడిందో ,వెల ఎంతో తెలియదు .కవి గారి విశేషాలు లేవు..’’అఖిల జీవన సంగ ఆత్మలింగ ‘’అనేది మకుటం .అన్నీ గీత పద్యాలే .
‘’శ్రీ పరశివ నీదు శృంగారతత్వంబు –నీ మహీ తలంబు నెచ్చు గాను -నేను చెప్పబూన నేర్చితి నీ కృప –నఖిల జీవన సంగ యాత్మ లింగ ‘’అని కవి శతకం మొదలుపెట్టి ,తానేమీ శాస్తజ్నుడను ,పండితుడినికాదని ,వంకలు ఎంచకుండా ఆదరం గా చూడమని కోరాడు .మొదట జగములేక మూడు రేకుల చెట్టు –తుదనుకొమ్మలైదుతూగులాడి-కొమ్మకోమ్మలందు కోటి కాయలు గాచే ‘’అన్నాడు తాత్వికంగా .పత్రం పుష్పం ఫలం వేరు కూడా లేవు .అది వేత్తలకు కూడా తెలీని రహస్యం .మాయకు మూలం లేదు తెలియరాదుకూడా .మమత తో మద అహంకారాలుపుట్టాయి .పంచ వన్నెల పంజరం లో మంచి చిలుక మఠం తీర్చి ,మాణిక్యాలమాటల మూటలు పలుకుతుంది .ముక్తి కాంత చిక్కులు పెడుతుంది .అల్పమతులకు చిక్కదు.చూపు మనసులో పెట్టి చూడాలి .రెండుకొండలమధ్య రేవతి అనే చుక్క ,చుక్క మధ్యలో సుధపురం , పురం లో పురహరుడు కనిపిస్తాడు .
ధారణా దారి తెలిసిన యోగి ,మేరువు చేరి మేను మరచి ,తానుతాను అనే తలపే మర్చి ,పొతే మళ్ళీ జన్మించడు .’’తోలు కొండ దీని తొమ్మిది వందలు –గండుపులులు చుట్టూ గాచి యుండు –కొండ శిఖరమందు కోమలి యొకతుండు’’.అదికామరూపి దాన్ని కామించి ,కొండేక్కిపులుల వాత బడ్డారు ‘’అని అన్యాపదేశంగా చెప్పాడు .నల్లతామరాకు మధ్య రంధ్రం లో కుండలుపెట్టి పాము గుడ్లు పెట్టి –రెండు పిల్లల్ని ఈని రాత్రి పగలు అరుస్తోంది .అదే అఖిల వేదార్ధం .వాటం తెలిసి మాయ మాతను దాటాలి .విషయ గుణాలలో ఉన్నది విషమే .ఏదైనా ఏకాగ్ర చిత్తం తో చేస్తేనే చెల్లుబాటవుతుంది .తత్వ వేత్త అల్ప తలపు లేకుండా నిత్యం ఒకే రీతిగా నిజసమాధిలో ఉంటాడు .
కాయ సిద్ధికోరి ,గహనాలు చేరి ,వాయు భక్షణం చేస్తే ,మాయతనువు మట్టి పాలౌతుంది .’’బంటు లింద్రియములు పనులెల్ల జేయంగ –మనసు మంత్రిగాను ,మసలు చుండు –తననుతాను గన్న తత్వంబు తద్రూపు ‘’అంటాడు .ఆత్మజ్ఞానం అనే అగ్నిలో కాలితే తత్వవేత్త తనువూ భూ సమాధి తప్పక చేయాలి .యోగిది నిద్ర కాదు నిర్వికల్ప సమాధి .కఠిననమనస్కులకు ఆచలయోగం అంటుకోదు .తుదీ మొదలూ లేదు తుర్యమూ తానుకాదుఅదీ పరమాత్మ రూపం .’’తన్ను తానూ గనదు –తానేది గనబోడు-మూర్చ నొందబోదు –మూర్ఖులకందదు .జడలుపెంచి జపతపాలు చేసినా అందుకోలేరు .కారణం శివుడు ,కార్యం జీవుడు .
చివరగా ‘’మంగళము మీకు మహిప్రకాశ –మంగళంబు జేసి మరిమరి మ్రొక్కెద
అవని నా కవిత్వ మాచంద్ర తారార్క-మగు విధంబుగాను నార్య మీకు –సమర్పణంబు జేసి యానంద మొందితి’’అంటూ కవి అచల బోధతత్వాన్ని నింపిన ఈ ఆత్మ లింగ శతకాన్ని పూర్తీ చేశాడు .
గహనమైన వేదాంతాన్ని అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లు రాసిన ఆకులగురుమూర్తి సత్కవి యోగీంద్రుడు ధన్యుడు .చదివి మనమూ ధన్యత చెందుతాం .ఈకవినీ, శతకాన్ని పరిచయం చేసే అదృష్టం నాకు దక్కింది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-4-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –245

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –245
245- నాటక సత్యభామ ఫేం ,రామదాసు తానీషా దేవదాసుధర్మన్న ,వస్త్రాపహరణ ,విదురుడు గా సినీ ఫేం-ఆరణి సత్యనారాయణ
ఆరణి సత్యనారాయణ (అరణి సత్యనారాయణ) (1898 నవంబరు 11 – 1969 జూలై 2) తెలుగు సినిమా, రంగస్థల నటుడు. తెలుగు సినిమా ప్రారంభ కాలంలో కొన్ని సినిమాలలో నటించాడు. [1
జీవిత విశేషాలు
అతను 1898లో గుంటూరు జిల్లా సంగడి గుంట గ్రామంలో జన్మించాడు. అతను 1912లో తన 14వ యేట గయోపాఖ్యానం నాటకంలో సత్యభామ పాత్రలో నటించాడు.
మూకీ సినిమాల కాలంలో తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించాడు. అతనిని 1921లో ఆర్.ఎస్.ప్రకాష్ చిత్రసీమకు పరిచయం చేసాడు. తరువాత అతను ఘంటసాల బలరామయ్య నిర్మించిన రామదాసు (1933) (‘దేవదాసు’లో ధర్మన్న పాత్రధారి) సినిమాలో నటించాడు. [2] అతను 1936లో సరస్వతి టాకీస్ నుండి వచ్చిన ద్రౌపది వస్త్రాపహరణం సినిమాలో నటించిన విదురుని పాత్రకు గుర్తింపు పొందాడు.
అతను కనకతార, బాలయోగిని, ధర్మాంగద, రత్నమాల, లైలా మజ్ను చిత్రాలలో వివిధ పాత్రలలో నటించాడు.
అతను వినోదా పిక్చర్స్ లో అకౌంటెంత్ గా చేరాడు. వినోదా పిక్చర్స్ సినిమాలైన దేవదాసు, శాంతి సినిమాలలో నటించాడు.
సినిమాలు

  1. రామదాసు (1933) …. తానీషా
  2. బాలయోగిని (1936/I)
  3. ద్రౌపది వస్త్రాపహరణం (1936) … విదురుడు
  4. కనకతార (1937)
  5. చంద్రిక (1940)
  6. రత్నమాల (1947)
  7. ధర్మాంగద(1949)
  8. లైలా మజ్ను(1949)
  9. శాంతి (1952)
  10. దేవదాసు (1953) …. ధర్మన్న
    సశేషం
    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-22-ఉయ్యూరు
    మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –246
    246-నటుడు నిర్మాత ,విక్రమార్క్ విజయం ,రాజద్రోహి నిర్మాణ ఫేం –పింజల సుబ్బారావు
    పింజల సుబ్బారావు ప్రసిద్ధి చెందిన చలనచిత్ర నిర్మాత. ఇతని స్వస్థలం మచిలీపట్నం.

సినిమారంగం
1957లో ఇతడు సినిమాలలో నటించాలని మద్రాసు చేరుకున్నాడు. ఐదేళ్లపాటు పలు చిత్రాలలో చిన్నచిన్న వేషాలు వేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణా ఫిలిమ్స్ సంస్థలో ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా చేరి రామాంజనేయ యుద్ధం, సతీ సుకన్య చిత్రాలకు పనిచేశాడు. తరువాత కొంతకాలం చిత్రాల క్రయవిక్రయాది వ్యాపారాలు చేశాడు. పిమ్మట చలనచిత్ర నిర్మాణరంగంలో ప్రవేశించాడు[1].
ఇతడు నిర్మించిన సినిమాలు:

  1. రాజద్రోహి
  2. హంతకులొస్తున్నారు జాగర్త
  3. రణభేరి
  4. పేదరాశి పెద్దమ్మ కథ
  5. లక్ష్మీ కటాక్షం
  6. సుగుణసుందరి కథ
  7. విక్రమార్క విజయం
  8. రౌడీలకు రౌడీలు
  9. పిల్లా? పిడుగా?
  10. సీతాకళ్యాణం
  11. సీతారామ వనవాసం
  12. అడవి మనుషులు
  13. లక్ష్మీపూజ
  14. మహాశక్తి
  15. త్రిలోక సుందరి
  16. రాణీ ఔర్ జాని (హిందీ)
  17. యే రిస్తీ నా తుహై (హిందీ)
    సశేషం
    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-22
Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –242,243,244

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –242,243,244
242,-243,244-నటన నాట్యాలతో నాలుగు భాషలలో అలరించిన ‘’ట్రావెంకూర్ సిస్టర్స్ ‘’-లలితా ,పద్మిని ,రాగిణి
ట్రావెన్‌కోర్ సిస్టర్స్ అంటే మలయాళం, తమిళం, తెలుగు, హిందీ మరియు కన్నడ చిత్రాలలో నటీమణులు, నృత్యకారులు మరియు ప్రదర్శకులు అయిన లలిత, పద్మిని మరియు రాగిణి ముగ్గురిని సూచిస్తుంది.
ట్రావెన్‌కోర్ సోదరీమణులు గురు గోపీనాథ్ మరియు గురు T. K. మహాలింగం పిళ్లై వద్ద నృత్యం నేర్చుకున్నారురాగిణి క్యాన్సర్‌తో 1976లో మరియు లలిత 1982లో మరణించారు. పద్మిని 2006లో మరణించారు. భారతీయ వార్తాపత్రికలలో డజన్ల కొద్దీ సినిమాలు మరియు కథనాలు మినహా వారికి సంబంధించిన కొన్ని పత్రాలు మిగిలి ఉన్నాయి. ట్రావెన్‌కోర్ సోదరీమణులు తిరువనంతపురంలోని పూజప్పురాలోని ‘మలయ కాటేజ్’ అనే ఉమ్మడి కుటుంబంలో పెరిగారు. ట్రావెన్‌కోర్ సోదరీమణులు ప్రముఖ అందాల సుందరి నారాయణి పిళ్లై కుంజమ్మకు మేనకోడళ్లు, ఆమె కందమఠానికి చెందిన కులీన భూస్వామి కేశవ పిళ్లైని వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ట్రావెన్‌కోర్ రాజును తిరస్కరించింది మరియు ఆమె ద్వారా నటి సుకుమారి తల్లి సత్యభామ అమ్మ మరియు ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి సంబంధించినది. వీరికి ట్రావెన్‌కోర్ సోదరీమణులు అనే పేరు వచ్చింది. ఉదయ్ శంకర్ తాను చేయాలనుకుంటున్న డ్యాన్స్ ఆధారిత చిత్రంలో నటించడానికి సోదరీమణులను చెన్నై (అప్పటి మద్రాస్)కి పిలిచాడు. పద్మిని మరియు ఆమె సోదరీమణులు ప్రముఖ భారతీయ నృత్యకారుడు గురు గోపీనాథ్ శిష్యులు.
కుటుంబానికి మాతృస్వామ్య అధిపతి కార్త్యాయిని అమ్మ, వీరి భర్త చేరాలా అలియాస్ ‘పెనాంగ్ పద్మనాభ పిళ్లై’ లేదా P K పిళ్లైకి చెందిన పాలకున్నతు కృష్ణ పిళ్లై, వీరికి ఆరుగురు కుమారులు ఉన్నారు, వీరిలో సత్యపాలన్ నాయర్ (బేబీ) అనేక ప్రారంభ మలయాళ చిత్రాలకు ప్రముఖ నిర్మాత. మరో కుమారుడు రవీంద్రన్ నాయర్ కుమార్తె లతికా సురేష్ మలయాళ టీవీ కార్యక్రమాలకు ప్రముఖ నిర్మాత. వారు 1955 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ప్రదర్శించారు
13.
242-లలిత
ఈమె 1930, డిసెంబరు 12న కేరళ రాష్ట్రానికి చెందిన ట్రవన్కోర్ సంస్థానంలో తిరువనంతపురంలో గోపాలపిళ్లె, సరస్వతి అమ్మలకు జన్మించింది. ఈమె 1938లో అదిథన్ కనవు అనే తమిళ చిత్రంద్వరా సినిమా రంగప్రవేశం చేసింది. ఈమె తెలుగు, మళయాలం, తమిళ, హిందీ చిత్రాలలో నటించింది. ఈమె చెల్లెళ్లు పద్మిని, రాగిణులు కూడా నర్తకులుగా, సినీనటులుగా రాణించారు. ఈమె తన సోదరీమణులతో కలిసి వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకుంది[2]. ఈమె తన సోదరీమణులకంటే ముందుగా సినిమా రంగంలో ప్రవేశించింది. ఎక్కువగా మలయాళ సినిమాలలో నటించి వ్యాంపు పాత్రలలో ఎక్కువ పేరు సంపాదించింది. సినిమా నటి శోభన ఈమె మేనకోడలు. ఈమె 1983లో మృతి చెందింది
విడుదలైన సంవత్సరం సినిమా పేరు ఇతర నటులు దర్శకుడు
1943 పతిభక్తి
పి.ఎస్.శ్రీనివాసరావు, దాసరి సుబధ్ర పి.ఎస్.శ్రీనివాసరావు
1950 బీదలపాట్లు
చిత్తూరు నాగయ్య, పద్మిని
కె.రామనాథ్
1951 పెళ్లికూతురు
ఎన్.ఎస్.కృష్ణన్, పద్మిని ఎన్.ఎస్.కృష్ణన్
1952 కాంచన
కె.ఆర్.రామస్వామి, పద్మిని, ఎం.ఆర్.సంతానలక్ష్మి ఎస్.ఎమ్.శ్రీరాములు
1952 సింగారి
టి.ఆర్.రామచంద్రన్, పద్మిని, రాగిణి
1953 అమ్మలక్కలు
ఎన్.టి.రామారావు,పద్మిని,బి.ఆర్.పంతులు
డి.యోగానంద్
1953 ఒక తల్లి పిల్లలు
శ్రీరాం, టి.ఎస్.దొరైరాజ్, పద్మిని, పి.శాంతకుమారి ఎ.ఎస్.ఎ. స్వామి
1953 దేవదాసు
అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి
వేదాంతం రాఘవయ్య
1955 అంతా ఇంతే
శివాజీ గణేశన్, పద్మిని, రాగిణి
ఆర్.ఎం.కృష్ణస్వామి
1955 విజయగౌరి
ఎన్.టి. రామారావు,పద్మిని,రాగిణి డి.యోగానంద్
1960 శివగంగ వీరులు
ఎస్.వరలక్ష్మి,కమలా లక్ష్మణ్, ఎం.ఎన్.రాజం
1961 విప్లవ స్త్రీ
ఆనందన్, ఎం.ఆర్.రాధా,పండరీబాయి
ఎం.ఎ.తిరుముగం
దేవదాసు లో చంద్రముఖి పాత్రకు లలితా జీవం పోసి చిరస్థాయి తెచ్చింది .సానుభూతి పొందే పాత్ర .
243-పద్మిని
పద్మిని ప్రముఖ సినిమా నటి, నర్తకి. ఈమె భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ఈమె, ఈమె సోదరీమణులు లలిత, రాగిణి ముగ్గురూ కలిసి ట్రావన్‌కోర్ సిస్టర్స్గా ప్రసిద్ధి చెందారు.
ఈమె 1932, జూన్ 12వ తేదీన జన్మించింది. ఈమె తొలిసారి తన 14వయేట కల్పన అనే హిందీ సినిమాలో నర్తకిగా నటించింది. తరువాత 30 సంవత్సరాలు తెలుగు, తమిళ, హిందీ, మళయాల భాషలలో సుమారు 250 సినిమాలలో నటించింది. ఈమె శివాజీ గణేశన్, ఎం.జి.రామచంద్రన్, ఎన్.టి.రామారావు, రాజ్‌ కపూర్, షమ్మీ కపూర్, ప్రేమ్‌ నజీర్, రాజ్‌కుమార్, జెమినీ గణేశన్ వంటి పెద్ద నటులతో కలిసి నటించింది. ఎక్కువగా శివాజీ గణేశన్‌తో 59 చిత్రాలలో నటించింది[1].
ఈమె అమెరికాలో స్థిరపడిన రామచంద్రన్ అనే డాక్టరును 1961లో వివాహం చేసుకుని తాత్కాలికంగా నటనకు విరామం ఇచ్చి కుటుంబ జీవితంపై, భరతనాట్యంపై దృష్టిని కేంద్రీకరించింది. 1977లో న్యూ జెర్సీలో శాస్త్రీయ నృత్యశిక్షణ కొరకు పద్మిని స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే పేరుతో ఒక డ్యాన్స్ స్కూలును ప్రారంభించింది. ప్రస్తుతం ఈ స్కూలు అమెరికాలోని భారత శాస్త్రీయ నృత్య శిక్షణా సంస్థలలో అతి పెద్దదిగా పేరుపొందింది. సినిమా నటి శోభన ఈమె మేనకోడలు.
ఈమె చెన్నై లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2006, సెప్టెంబరు 24 తేదీన గుండెపోటుతో మరణించింది
14.
15.
విడుదలైన సంవత్సరం సినిమా పేరు ఇతర నటులు దర్శకుడు
1950 తిరుగుబాటు
సి.హెచ్. నారాయణరావు, శాంతకుమారి
పి.పుల్లయ్య
1950 బీదలపాట్లు
చిత్తూరు నాగయ్య, లలిత
కె.రామనాథ్
1951 ఆడ జన్మ
సి.హెచ్. నారాయణరావు, బి.ఎస్.సరోజ జి.ఆర్. రావు
1951 చంద్రవంక
కాంచన్, కనకం
1951 పెళ్లికూతురు
ఎన్.ఎస్.కృష్ణన్, లలిత ఎన్.ఎస్.కృష్ణన్
1952 కాంచన
కె.ఆర్.రామస్వామి, లలిత ఎస్.ఎం.శ్రీరాములు
1952 ధర్మ దేవత
శాంతకుమారి, రేలంగి వెంకట్రామయ్య
పి.పుల్లయ్య
1952 సింగారి
టి.ఆర్.రామచంద్రన్, లలిత, రాగిణి
1953 అమ్మలక్కలు
ఎన్.టి.రామారావు, లలిత
డి.యోగానంద్
1953 ఒక తల్లి పిల్లలు
టి.ఎస్.దొరైరాజు, లలిత ఎ.ఎన్.ఎ.స్వామి
1953 ప్రపంచం
చిత్తూరు నాగయ్య, జి.వరలక్ష్మి
ఎస్.ఎల్.రామచంద్రన్
1954 అమర సందేశం
అమర్‌నాథ్, శ్రీరంజని
ఆదుర్తి సుబ్బారావు
1955 అంతా ఇంతే
శివాజీ గణేషన్, లలిత, రాగిణి ఆర్.ఎం.కృష్ణస్వామి
1955 విజయగౌరి
ఎన్.టి.రామారావు, లలిత, రాగిణి డి.యోగానంద్
1956 అమరజీవి
శివాజీ గణేషన్, సావిత్రి
టి.ప్రకాశరావు
1956 సాహస వీరుడు
ఎం.జి.రామచంద్రన్, పి.భానుమతి డి.యోగానంద్
1958 వీరప్రతాప్
శివాజీ గణేశన్
టి.ప్రకాశరావు
1959 గొప్పింటి అమ్మాయి
శివాజీ గణేశన్, రాజసులోచన
1959 వీరపాండ్య కట్టబ్రహ్మన
శివాజీ గణేశన్, ఎస్.వరలక్ష్మి
బి.ఆర్.పంతులు
1960 దేసింగురాజు కథ
ఎం.జి.రామచంద్రన్, పి.భానుమతి
పి.ఆర్.రఘునాథ్
1961 అనుమానం
శివాజీ గణేశన్
కృష్ణన్ – పంజు
1961 కత్తిపట్టిన రైతు
ఎం.జి. రామచంద్రన్
ఎ.ఎస్.ఎ.స్వామి
1961 కన్యకా పరమేశ్వరీ మహత్మ్యం
శివాజీ గణేశన్
ఎ.ఎస్.ఎ.స్వామి
1961 మాయా మశ్చీంద్ర
నిరూపా రాయ్
బాబూభాయ్ మిస్త్రీ
1962 ఏకైక వీరుడు
ఎం.జి.రామచంద్రన్, అంజలీదేవి
నటేశన్
1962 స్త్రీ జీవితం
శివాజీ గణేశన్, రాగిణి
ఆర్.ఎస్.మణి
1963 రాణీ సంయుక్త
ఎం.జి.రామచంద్రన్, రాగిణి డి.యోగానంద్
1966 మోహినీ భస్మాసుర
ఎస్వీ.రంగారావు, కాంతారావు
బి.ఎ.సుబ్బారావు
1967 ముద్దు పాప
శివాజీ గణేశన్ కె.ఎస్.గోపాలకృష్ణ
1967 వసంత సేన
అక్కినేని నాగేశ్వరరావు
బి.ఎస్.రంగా
1968 విజయకోట వీరుడు
జెమినీ గణేశన్, వైజయంతిమాల
ఎస్.ఎస్.వాసన్
1969 రాజ్యకాంక్ష
జెమినీ గణేశన్, రాగిణి
జి.విశ్వనాథం
244-రాగిణి
భారతీయ సినిమానటి, నర్తకి. ఈమె ట్రావన్‌కోర్ సిస్టర్స్ గా ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిలలో చివరి సోదరీమణి.
ఈమె 1937, మార్చి 27న కేరళ రాష్ట్రానికి చెందిన ట్రవన్కోర్ సంస్థానంలో తిరువనంతపురంలో గోపాలపిళ్లె, సరస్వతి అమ్మలకు జన్మించింది. ఈమె తెలుగు, మలయాళం, తమిళ, హిందీ చిత్రాలలో నటించింది. అనేక నాటకాలలో కూడా నటించింది. ఈమె అక్కలులలిత, పద్మినిలు కూడా నర్తకులుగా, సినీనటులుగా రాణించారు. ఈమె తన సోదరీమణులతో కలిసి వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకుంది[1]. సినిమా నటి శోభన ఈమె మేనకోడలు. ఈమె మాధవన్ థంపిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు లక్ష్మి, ప్రియ అనే కుమార్తెలు కలిగారు. ఈమె భర్త ఈమెను వదిలి 1974లో అమెరికా వెళ్ళాడు. కానీ ఈమె కేన్సర్‌ బారిన పడ్డ తరువాత తిరిగి వచ్చాడు. ఈమె బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతూ 1976లో మృతిచిందింది.12:26 22-04-2022
  విడుదలైన సంవత్సరంసినిమా పేరుఇతర నటులుదర్శకుడు1952సింగారిటి.ఆర్.రామచంద్రన్, లలిత, పద్మిని1955అంతా ఇంతేశివాజీ గణేశన్డి.యోగానంద్1957వరుడు కావాలిజగ్గయ్య, పి.భానుమతి,అమర్‌నాథ్పి.ఎస్.రామకృష్ణారావు1958పులి చేసిన పెళ్లిసత్యం, ముత్తయ్యపి.భాస్కరన్1961స్త్రీ జీవితంశివాజీ గణేశన్,పద్మినిపి.భాస్కరన్1963రాణీ సంయుక్తఎం.జి.రామచంద్రన్, పద్మినిడి.యోగానంద్1965చలాకీ పిల్లశ్రీరాం, టి.ఆర్.రామచంద్రన్, తంగవేలుకె. సోము1969రాజ్యకాంక్షజెమినీ గణేశన్, పద్మినిజి.విశ్వనాథం1974కోటివిద్యలు కూటికొరకేనగేష్, లక్ష్మికె.బాలచందర్
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment