మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –241

1. మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –241
2. 241-చరిత్ర కారుడు నటుడు ,ఒకరోజు రాజు సినీ దర్శక ఫేం –ఆమంచర్ల గోపాలరావు
3. ఆమంచర్ల గోపాలరావు (1907 – 1969) స్వాతంత్ర్య సమరయోధులు, చరిత్రకారులు, చలనచిత్ర దర్శకులు.
4. వీరు సెప్టెంబరు 26 తేదీన కావలిలో జన్మించారు. బి.ఎ., బి.ఎల్. పట్టాలను పొందారు. వీరు 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో ఖద్దరు విక్రయించి కార్యకర్తగా పనిచేశారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1952లో ఆంధ్రోద్యమంలో స్వామి సీతారాంలో కలిసి తీవ్రంగా కృషిచేశారు.బెజవాడ గోపాల రెడ్డ్ సమకాలికులు
5. గుంటూరు జిల్లా యూత్ లీగ్ నాయకత్వం వహించాడు .1952లో ప్రత్యెక ఆంద్ర ఉద్యమంలో పని చేశాడు
6.    మంచి రచయిత గోపాలరావు  మాట పట్టింపు, మల్లమ్మ ఉసురు, అపరాధి మొదలైన నాటికలను, హిరణ్య కశిపుడు, విశ్వంతర మొదలైన నాటకాలను రచించారు. కొన్ని హిందీ చలనచిత్రాలకు సహాయ దర్శకులుగా పనిచేశారు. తెలుగులో కాలచక్రం (1940), ఒక రోజు రాజు (1944) అనే చిత్రాలకు దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలకు కళా దర్శకులుగా పనిచేశారు. హిందీ సినిమాలకూ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు
7. చిత్రకళలో ప్రత్యేకంగా ప్రకృతి దృశ్య చిత్రణ అంటే వీరికి ప్రత్యేకమైన అభిమానం అజంతా, ఎల్లోరా శిల్పాల గురించి అనేక వ్యాసాలు రాశారు. లేపాక్షి దేవాలయ కుడ్య చిత్ర సంపదను గూర్చి ఆంగ్లంలో ఒక గ్రంథాన్ని రచించారు.
8. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా’’కార్మికుల కార్యక్రమం లో  కొంతకాలం పనిచేశారు.
9. మరణం
10. వీరు 1969 ఫిబ్రవరి 7 తేదీన పరమపదించారు
11. సశేషం
12. మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -5(చివరిభాగం )

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -5(చివరిభాగం )
పంజే రాసిన సముదాయం లో 14గద్యరచనలు ,కధలు ఉన్నాయి .పురాణ శ్రవణ స్వాతిశయం ,ఒక వైద్యుడు వైద్యం కోసం గ్రామాలకు వెళ్లి అందమైన వంటలక్క ను ఏర్పాటు చేయమని అడగటం అది బెడిసికొట్టటం .మోటుహాస్యం తోకూడా రాశాడు .భార్యపై అనుమాన పడ్డ భర్త కనువిప్పు ఆమె ఎలా కలిగించిందో ఒక కథ .విజయ నగర సామ్రాజ్యం లో జరిగిన ఒక కథ ,ఔరంగజేబు కాలం నాటి శైలిని కథ ,దుర్గావతి ,దీవగిరికి చెందిన వీరమతి వంటి వాటిలో సాహసం ,ప్రేమ అచంచల త్యాగం చూపాడు .చండికా రహస్య సమాజ లో దేవి చౌదరాణి గురించి చెప్పాడు .
  అబద్ధపు దినచర్య ఆయన ఇన్స్పెక్టర్ గా ఉన్న అనుభవాలు .ప్రభుత్వ అధికారులు పాములు జెర్రులు కొండ చిలువలు అని ఉపాధ్యాయ లోకం అనుకొంటుంది . ఇన్స్పెక్టర్ మాత్రం అపాయం లేని వాళ్ళు వాళ్ళ దృష్టిలో .నల్లజాతి వారిని అంటే హరిజనులను అభివృద్ధిలోకి తీసుకు రావాలని ఆయన దృక్పధం .రకరకాల ఉపాధ్యాయులు వారి బోధనా గురించి వివరించాడు .మంచి ఉపాధ్యాయులు , వారికి సమాజం ఇచ్చే గౌరవం కళ్ళకు కట్టించాడు .
  ప్రకీర్ణాలు
అక్షరాభ్యాస పుస్తకాలు రేఖా చిత్రాలు కథలు కూడాపంజే రాశాడు శిశుసాహిత్యం లో .వీటిని మాక్మిలన్ కంపెని  బాసెల్ మిషన్ బాలసాహిత్య మండలి ప్రచురించాయి .బాసెల్ వాళ్ళు కోరినట్లు ఆంగ్ల –కన్నడ నిఘంటువు పరిష్కరించి విస్తరించాడు .దీనిఆదాయంతో మంగుళూరు లోని గణపతి పాఠశాలలో జిల్లాస్థాయి శిశు సమ్మేళనం జరిపాడు .అప్పటికి ఇదే మొదటిది .కిట్టెల్ రాసిన కన్నడ –ఇంగ్లీష్ నిఘంటు పరిశోధనా చేసి వెయ్యి పదాలు అదనంగా చేర్చగలిగాడు .శబ్ద మణి దర్పణం కు చేసిన పరిష్కరణ అత్యుత్తమమైనది .
  ఉపాధ్యుడుగా ,ఇన్స్పెక్టర్ గా ఉన్నప్పుడు పంజే విద్యా విషయ పత్రిక ఒకటి నడిపాడు .ఉపాధ్యాయులకు విద్యా బోధనా గురించి ,సామాన్యులకు బడులలో విద్యా బోధన ఎలా జరుగుతుందో తెలుసుకోవటానికి వ్యాసాలూ రాసేవాడు రాయి౦చేవాడు .బోధన అంటే ఏమిటి అనే మొదటిపుస్తకాన్ని దక్షిణ కన్నడ జిల్లా ప్రాధమిక పాఠ శాలనుంచి ప్రచురించాడు .శిక్షణ కన్నా బోధన అనే పదం విస్త్రుతమైన్దికనుక ఆయనకు బాగా నచ్చినది .బెత్తాలవాడకం ఇష్టపడేవాడు కాదు .
  కవిత్వం
పంజే రాసిన గీతాలు శ్రవణానందంగా ఉంటాయి .సరళసుందర భాష ,రీతి ,అవసరమైతే నీతి ఉంటాయి .హృదయాలను కరిగించే గీతాలు రాశాడు .ఆయన ‘’దక్షిణపు గాలి ఆట’’ కు మించినది కన్నడ సాహిత్యం లో లేనే లేదు .హోలేయర హాడు ‘’అంటే మాలవారి గీతాలలో దీన జన స్థితినిని చూపేవి .మేము యాచకులం కాదు మాకు ఏవి కావాలో ఇవ్వాల్సిన బాధ్యత మీది. లేకపోతె మేమే లాక్కో వాల్సి వస్తుంది అంటూ వారిలో చైతన్యం చూపించాడు .దేశభక్తి రగుల్కొల్పే ప్రబోధ గీతాలెన్నో రాశాడు .
విద్యకు సరైన వాతావరణం కల్పించటం ,ప్రతిభను గుర్తించి ప్రోత్సహించటం ,విద్యారంగ వాతావరణాన్ని శుద్ధి చేయటం ,వ్యక్తిత్వ వికాసం కలిపించటం ,అందర్నీ సమానంగా చూసే సహృదయత ,బీదల దళితుల దీనుల ను ఉన్నత విద్యావంతులతో ,శిష్యులతో సమానంగా చూడటం ,సృజనాత్మక శక్తి పెంపొందించటం లో ఆనాడు మంగుళూరులో పంజే మంగేష్ రావు ,మైసూర్ లో టి ఎస్ . వెంకణ్ణయ్య ప్రాతస్మరణీయులుగా నిలిచారు .
  ఆధారం –వి సీతారామయ్య కన్నడ రచనకు శ్రీ ఆర్వియెస్ సుందరం గారి తెలుగు అనువాద పుస్తకం –పంజే మంగేష రావు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-4-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -4

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -4
కన్నడ సాహిత్య సమ్మెళన అధ్యక్షుడు
1929ను౦చి సాహిత్యకారులు పంజే ను కన్నడ సాహిత్య సమ్మెళన అధ్యక్షుడు
గా ఉండమని కోరుతూనే ఉన్నారు .చాలాకాలం ఒప్పుకోలేదు చివరకు మంగుళూరు వెళ్లి బ్రతిమాలి ఒప్పించారు .పాత హైదరాబాద్ రాష్ట్రం లోని రాయచూర్ లో జరిగిన సమావేశానికి ఆయన చేసిన అధ్యక్షోపన్యాసం అందర్నీ మెప్పించింది .ప్రాచీన మధ్యయుగ ఆధునిక కవితారీతుల్ని ఆయన గొప్పగా విశ్లేషించాడు .భవిష్యత్తు గురించి అందంగా ఆశగా భావించాడు .ధ్వని ,లయ గురించి సోదాహరణ ప్రసంగం చేశాడు .ధార్వాడ ,హైదరాబాద్ లలో ఆయన చేత ఉపన్యాసాలిప్పి౦చి స్పూర్తి కలిగించారు .ఆయన ఆంగ్లపాఠం చెబితే మరపురాని అనుభూతిగా ఉండేది .
చివరి రోజులు
తగినంత పెన్షన్ వస్తోందికనుక చివరి రోజులు హాయిగా గడిచాయి పిల్లలంతా సెటిలయ్యారు .పెద్దకొడుకు పని చేసే జంషెడ్ పూర్ ,చిన్నకొడుకు పని చేసే పాట్నా కూడా ఆయనకు నచ్చలేదు .హైదరాబాద్ లో రెండవ కొడుకు దగ్గర ఉండటానికి ఇష్టపడ్డాడు .ఇది పిల్లలకు అందుబాటులో ఉండే ప్రదేశం అని ఆయన అనుకొన్నాడు అలాగే 25-10-1937 న పంజే మరణించిన రోజు పిల్లలందరూ దగ్గరే ఉన్నారు .మాస్తి గారి తనకిష్టమైన పద్యాన్ని ఎప్పుడూ చదువుకొనేవాడు –దాని అర్ధం –ఇంక ఈవూరికి పగళ్ళు లేవు .తన రోజు దగ్గరైందని కళ్ళుమూసుకొని ,ఇంకనాకు చాలు అని చల్లబడింది .కన్నడాన్ని అమితంగా ప్రేమించే సారస్వత కొంక ణీయుడిని కన్నడ దేశం కోల్పోయింది .1974లోఫిబ్రవరి 8-9తేదీలలో పంజే శతజయంతి జరిపారు .ఆయన పుట్టిపెరిగిన బంత్వాల్ లో స్మారక ఫలకం నిర్మించారు .మంగుళూరు లోనూ ఘనంగా ఉత్సవాలు జరిపారు .ఆయనపై స్మారక సంపుటం ‘’తె౦కణ గాళి’’అంటే దక్షిణ గాలి ప్రచురించారు ‘ .
రచనా సర్వస్వం
చిన్నప్పుడే పంజే పత్రికలకు మారుపేర్లతో రాసేవాడు ‘’హరటమల్ల ‘’అంటే వదరుబోతు పేరుతోసారస్వత విమర్శన వ్యాసాలూ రాసేవాడు .ఇది అప్పటికి కొత్త సాహిత్య ప్రక్రియ .పానుగంటి వదరుబోతు వ్యాసాలూ మనకు గుర్తుకు వస్తాయి .సువాసిని పత్రికలో ఆయనవే ముఖ్య రచనలు .ఆయన పెట్టుకొన్న ‘’కవిశిష్య ‘’పేరు దేశమంతా మారుమోగింది .
ఆయన శతజయంతి సందర్భంగా వెలువడిన ఆయన రచనలు సాహిత్య విమర్శ,ప్రశంస ఉన్నవి .చారిత్రిక విశేషాలు శాసనాధారంగా రాసినవీ ఉన్నాయి .నాగరుల రాజధాని ని సంగీతపురమనీ ,భల్లాట పురం అనీ అనేవారట .సాళ్వదేవరాయలు ,విద్యానందుడు గురించి తెలియని విషయాలు తెలిపాడు .కన్నడ బయ్య నుంచి సంస్కృత ‘’భైర’’వచ్చిందన్నాడు .భారతేశ వైభవం పుస్తకం లో ఆడంబర శైలి కనిపిస్తుంది .సాళ్వరాసిన ‘’రసరత్నాకరం ‘’అలమ్కారగ్రంధం ,కోటీశ్వరుని ‘’జీవంధర షట్పది లో ఆనాటి భావ ధోరణలు వెలికి తీశాడు .ధన్యకుమార చరిత ‘’లో 1450నాటి రచయిత ఆదియప్ప గురించి రాశాడు .జైన వేమన్న ,పార్తీ సుబ్బా ,నందలికే లక్ష్మీ నారాయణప్ప యక్షగానాలు రాశారని వివరించాడు .భట్టాలకుని శబ్డాను శాసనం కు ముందుమాటగా బిలిగి లోని ఒకశాసనం ఉందన్నాడు .
కన్నడ సాహిత్యం లో రావాల్సిన మార్పుల్ని ‘’హాసదారి ‘’అంటే కొత్తమార్గం లో వివరించాడు .నారణప్ప కన్నడ భారతం ,లక్ష్మీశుని జైమిని భారతం సర్వజ్నుని ‘’ఓ నామ పధ్ధతి లో ఉన్న వయోజన విద్యా విజ్ఞానాలను తెలిపాడు .నారాయణప్ప భారతానికి నరసింహా చార్ తో,జైమిని భారతానికి శ్రీ కంఠయ్య తో కలిసి సంపాదకత్వం వహించాడు .కుమార వ్యాస భారతం భామిని షట్పది లో రాసిన వాటిలొఅత్యుత్తమమైన్ది .కృష్ణునిపై భక్తితో ‘’కృష్ణ రాయన చరిత ‘’అని పేరుపెట్టాడు .మనీషి అయిన శ్రీ కృష్ణ చరితం ఇది .మధ్యయుగ సాహిత్యం లో దీన్ని మించింది లేదు .అలాగే నందలికే లక్ష్మీ నారాయణ గురించికూడా పంజే విశిష్టంగా రాశాడు .రామాశ్వమేథ కూడా అలాంటి గొప్పరచనే .సాహిత్య విలువలున్న గద్య రచన .ఓనామ పద్ధతిలో సర్వజ్ఞుని త్రిపదలు పెద్దలకు పిన్నవారికీ ఎలా విద్యా విజ్ఞాన బోధకాలో మహా గొప్పగా వివరించాడు .
పదార్ధం అంటే ఏమిటి సరదారచన ..బీల్కోడు వ్యంగ్యరచన .పొగాకు గురించి గొప్పరచన చేశాడు .అక్బర్ సభలో కొందరుపోగాకు ని నిషేధించాలి అంటే బీర్బల్ ‘’దానికి ఒకటే శిక్ష .ఎప్పుడు పొగాకు కంటికి కనిపించినా ,దాని తలవైపు నిప్పు ముట్టించి ,అది కాలి పొగ ,నుసి అయ్యేదాకా మనం చూడాలి హుజూర్ ‘’అన్నాడట పాదు షాతో సహా అందరు కడుపు చక్కలయ్యేట్లు నవ్వకేం చేస్తారు .అదే పంజే రాసిన ‘ధూమ్రతత్వపు తత్వమసి ‘’ .అలాగే ‘’రైతి ‘’పదం ఎలా ఏర్పడుతుందో సరదాగా చెప్పాడు –‘’పెళ్లి అయిపోయి చాలారోజులైనా , అల్లుడి స్నేహితులు మామగారింట్లో తిష్ట వేస్తె ,పిల్లమేక తల్లి మేక పొదుగును అందుకోలేక ,దాని గడ్డం కింద ఉన్న పొదుగులుపట్టుకొని వేలాడినట్లు వర్ణమాల నేర్పించటానికి ‘’రైతి ‘’చెబుతారు అన్నాడు .టిబెట్ ను ‘’టాప్ హాట్ ‘’అనే దానినుంచి ,ఎవరెస్ట్ ను ఎవర్ అనేదానికి సూపర్లేటివ్’’ తమ’’ చేరిస్తే ఎవరెస్ట్ వచ్చినట్లు వస్తువులపెర్లు స్థల నామాలు ఎలా వస్తాయో సాధించి చూపించాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-4-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –238

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –238

238-పౌరాణికనాటక కర్త ,సినిమా సంభాషణ ,పాటల కర్త,రామాంజనేయ ,కృష్ణా౦జ నేయఫెం –తాండ్ర సుబ్రహ్మణ్యం

తాండ్ర సుబ్రహ్మణ్యం నాటక రచయిత, సినిమా రచయిత.

రచనలు

  1. పతితపావన (సాంఘిక నాటకం)
  2. కృష్ణగారడి[1] (పౌరాణిక నాటకం)
  3. జెండాపై కపిరాజు (నాటకం)
  4. సతీసులోచన (నాటకం)
  5. శ్రీరామాంజనేయ యుద్ధం (నాటకం)[2]
  6. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (నాటకం)[3]
  7. మహిషాసురమర్ధని (నాటకం)[4]
  8. భీమార్జున గర్వభంగం[5]
  9. శకుంతల

సినిమాలు

  1. పతిభక్తి
  2. భీమాంజనేయ యుద్ధం
  3. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం
  4. పార్వతి విజయం
  5. నాగార్జున
  6. సతీ తులసి [6]
  7. మహారథి కర్ణ
  8. మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –239

239-చట్టానికి కళ్లులేవు సినీ ఫేం దర్శకుడు –ఎస్.ఎ.చంద్ర శేఖర్

ఎస్.ఎ.చంద్రశేఖర్ ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు, రచయిత. ఇతడు ముఖ్యంగా తమిళ చిత్రాలకు పనిచేశాడు.[3] ఇతడు సట్టం ఒరు ఇరుత్తరై (1981) అనే తమిళ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[4] ఇతడు వేట్రి, నాన్ సిగప్పు మనిధన్, ముత్తం, సట్టం ఒరు ఇరుత్తరై వంటి అనేక విజయవంతమైన సినిమాలను తీశాడు.

వ్యక్తిగత జీవితం
ఎస్.ఎ.చంద్రశేఖర్ తమిళనాడు రాష్ట్రంలోని, రామేశ్వరం నగరంలోని “తంగచిమదం” అనే ప్రాంతానికి చెందినవాడు.[2] ఇతడు కర్ణాటక సంగీత కళాకారిణి శోభను వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించింది. కొన్ని సినిమాలలో పాటలు పాడింది. కొన్ని సినిమాలకు కథను సమకూర్చింది. ఇతని కుమారుడు విజయ్ కూడా తమిళ సినిమా నటుడు, గాయకుడు.[5] ఇతని దర్శకత్వంలో వెలువడిన “నాలయ తీర్పు” అనే సినిమాతో విజయ్ వెండితెర జీవితాన్ని ప్రారంభించాడు. ఇతని కుమార్తె విద్య రెండేళ్ల వయసులోనే మరణించింది.[6] ఇతని సమీప బంధువులు ఎస్.ఎన్.సురేందర్ నేపథ్య గాయకుడిగా, విక్రాంత్ నటుడిగా సినిమాలలో పనిచేస్తున్నారు.

సినిమా రంగం
ఇతడు తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో 70కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. నిర్మాతగా ఏడు చలన చిత్రాలను నిర్మించాడు. 17 తమిళ సినిమాలకు కథను అందించాడు. 44 సినిమాలకు స్క్రీన్‌ప్లే వ్రాశాడు. అంతే కాక 15 సినిమాలలో నటించాడు కూడా. ఇతడు తెలుగులో “చట్టానికి కళ్లులేవు”, “బలిదానం”, “పల్లెటూరి మొనగాడు”, “దేవాంతకుడు”, “దోపిడి దొంగలు”, “ఇంటికో రుద్రమ్మ” సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతని సినిమాలలో విజయ కాంత్, విజయ్, రజనీకాంత్, చిరంజీవి, శోభన్ బాబు, విష్ణువర్ధన్, అంబరీష్, శంకర్ నాగ్, మిథున్ చక్రవర్తి, జితేంద్ర, ధనుష్ మొదలైన హీరోలు నటించారు. విజయశాంతి, రోహిణి, త్రిష, ముచ్చర్ల అరుణ, ఆరతి, మేఘనా నాయుడు, రాధిక, పూనమ్ కౌర్, రంభ, ప్రియాంక చోప్రా, అభిరామి, మీనా, సిమ్రాన్ మొదలైన నటీమణులు ఇతని సినిమాల్లో నటించారు. ఇతడు ఎక్కువగా విజయకాంత్, విజయ్‌లతో సినిమాలు తీశాడు. ఇతని కుమారుడు విజయ్ ఇతని దర్శకత్వంలో 16 పైచిలుకు సినిమాలలో నటించాడు. ఎస్. శంకర్, ఎం.రాజేష్, పొన్‌రామ్‌, రజినీ మురుగన్ తదితరులు ఇతని వద్ద సహాయకులుగా పనిచేసి ఆ తరువాత దర్శకులుగా రాణించారు.[7][8]

వివాదాలు
ఇతడు ఒక ఆడియో రిలీజింగ్ ఫంక్షన్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కాడు. తిరుపతి దేవస్థానంలో ప్రజలు దేవునికి ముడుపుల పేరుతో లంచం ఇస్తున్నారని, భగవంతుడు భక్తుల కోరికలన్నీ తీర్చేటట్టయితే ఇక ఎవరూ చదువుకోవలసిన అవసరం లేదని ఇతడు చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. హిందు మున్నాని అనే సంస్థ ఇతని వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని, ఇతనిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో హిందూ మున్నాని హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్ట్ న్యాయాధికారి ఇతనిపై కేసు నమోదు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించాడు[9].

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-4-22-ఉయ్యూరు

  1. మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –240
  2. 240-చలన చిత్ర నటుడు రచయిత,దేవాంతకుడు ఫేం –తోటపల్లి మధు
  3. తోటపల్లి మధు తెలుగు చలనచిత్ర రచయిత, నటుడు. చిరంజీవి కథానాయకుడిగా 1984లో వచ్చిన దేవాంతకుడు చిత్రం ద్వారా రచయితగా తెలుగు చలనచిత్రరంగంలోకి అడుగుపెట్టాడు.[1][2]

జననం
మధు 1963, ఫిబ్రవరి 27న విజయవాడలో జన్మించాడు.

సినిమారంగ ప్రస్థానం
చిరంజీవి కథానాయకుడిగా 1984లో వచ్చిన దేవాంతకుడు చిత్రం ద్వారా 19 ఏళ్ల వయసులోనే రచయితగా తెలుగు చలనచిత్రరంగంలోకి అడుగుపెట్టిన మధు 190కి పైగా చిత్రాలకు కథ, మాటలు అందించాడు.[3] 45 సినిమాలలో విలన్ పాత్రలు పోషించాడు.

రచయితగా

  1. వెంకటా ఇన్ సంకట (2009)
  2. మహారథి – కథ, సంభాషణలు (2007)
  3. 123 (2002)
  4. హనుమాన్ జంక్షన్ – సంభాషణలు (2001)
  5. అంకుల్ – సంభాషణలు (2000)
  6. కృష్ణ బాబు – సంభాషణలు (1999)
  7. కంటే కూతుర్నే కను- సంభాషణలు (1998)
  8. పెళ్ళిపందిరి – సంభాషణలు (1997)
  9. మమా బాగున్నావా – సంభాషణలు (1997)
  10. రాయుడుగారు-నాయుడుగారు – సంభాషణలు (1996)
  11. రాముడొచ్చాడు – సంభాషణలు (1996)
  12. మాయా బజార్ – సంభాషణలు (1995)
  13. శుభమస్తు – సంభాషణలు (1995)
  14. రిక్షావోడు – సంభాషణలు (1995)
  15. అల్లరి పోలీస్ – సంభాషణలు (1994)
  16. బంగారు కుటుంబం – సంభాషణలు (1994)
  17. అల్లరి అల్లుడు – కథ, సంభాషణలు (1993)
  18. చిత్రం భళారే విచిత్రం – సంభాషణలు (1992)
  19. ప్రెసిడెంటు గారి పెళ్ళాం – సంభాషణలు (1992)
  20. మామగారు – సంభాషణలు (1991)
  21. కలికాలం – సంభాషణలు (1991)
  22. అంకుశం – సంభాషణలు (1990)
  23. భలే దంపతులు – సంభాషణలు (1989)
  24. సాక్షి – సంభాషణలు (1989)
  25. యముడికి మొగుడు – సంభాషణలు (1988)
  26. కొత్త పెళ్ళికూతురు – సంభాషణలు (1985)
  27. శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం – సంభాషణలు (1985)
  28. డాకు – సంభాషణలు (1984)
  29. దేవాంతకుడు – సంభాషణలు (1984)

నటుడిగా[మార్చు]
· సోడ గోలీసోడ (2018)

  1. నా లవ్ స్టోరీ (2018)
  2. యాత్ర (2019)
  3. గల్ఫ్ (2017)
  4. గౌతమ్ నంద (2017)
  5. పటేల్ సర్ (2017)
  6. సుప్రీమ్ (2016)
  7. శ్రీశ్రీ (2016)
  8. నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ (2016)
  9. సినిమా చూపిస్త మావ (2015)
  10. మహారథి (2007)
  11. అల్లరి పిడుగు (2005)
  12. లక్ష్మీనరసింహా (2004)
  13. మాయా బజార్ (1995)

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మల్ల మార్తాండ ,కలియుగ భీమ,ఇండియన్ హెర్క్యులస్  కోడి రామ మూర్తి నాయుడు

మల్ల మార్తాండ ,కలియుగ భీమ,ఇండియన్ హెర్క్యులస్  కోడి రామ మూర్తి నాయుడు

— కోడి రామ్మూర్తి నాయుడు (1882 – 1942) ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు, మల్లయోధులు.[1][2] ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు.[3]

బాల్యము
తెలుగు దేశంలో ప్రఖ్యాత తెలగ వీర యోధ వంశాలలో కోడి వారి వంశం ఒకటి, ఈ వంశ పరంపరలోని శ్రీ కోడి వెంకన్న నాయుడు వీరి తండ్రి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేరణతోవిజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణస్వామి దగ్గర పెరిగారు. అక్కడ ఒక వ్యాయామశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే ఇతడు ఛాతి పై 1 1/2 టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగాడు. మద్రాసులో సైదాపేట కాలేజిలో ఒక సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చి విజయనగరం శిక్షణ తర్వాత వ్యాయామోపాధ్యాయుడుగా సర్టిఫికేట్ అందుకుని, విజయనగరంలో తాను చదివిన హైస్కూలులో వ్యాయామ శిక్షకుడుగా చేరాడు.* విజయనగరం జిల్లా వెబ్ సైటులో కోడి రామ్మూర్తిని గురించిన వ్యాసం

సర్కస్ కంపెనీ
విజయనగరంలో పొట్టి పంతులు అనే మిత్రుని సహకారంతో సర్కస్ కంపెనీ నెలకొల్పాడు. తుని రాజాగారి నుండి సంపూర్ణ సహకారం లభించింది. రామమూర్తి సర్కస్ సంస్థ పలుచోట్ల ప్రదర్శనలిచ్చి మంచిపేరు తెచ్చుకున్నది. తెలుగు జిల్లాల్లో ప్రదర్శనల తర్వాత 1912లో మద్రాసు చేరాడు. పులులు, ఏనుగులు, గుర్రాలు, చైనా, జపాన్ కళాకారుల సహకారం ఆయనకు లభించాయి. రామమూర్తి ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. శరీరమునకు కట్టిన ఉక్కు గొలుసును, ఊపిరితిత్తులలో గాలిని పూరించుకుని ముక్కలుగా తుంచి వేశాడు. రెండు కార్లను రెండు భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకునేవాడు. కార్లను శరవేగంగా నడపమనేవాడు. కార్లు కదలకుండా పోయేవి. ఛాతీ పై పెద్ద ఏనుగును ఎక్కించుకునేవాడు. 5 నిమిషాల పాటు, రొమ్ముపై ఏనుగును అలాగే ఉంచుకునేవాడు. తండోపతండాలుగా ప్రజలు వారి ప్రదర్శనలు చూచేవారు.

ప్రముఖులు ఇచ్చిన బిరుదులు[మార్చు]
పూనాలో లోకమాన్య తిలక్ గారి కోరిక మేరకు ప్రదర్శనలిచ్చాడు. తిలక్ రామమూర్తిగారికి మల్లమార్తాండ, మల్లరాజ తిలక్ బిరుదములిచ్చారు. విదేశాలలో భారత ప్రతిభను ప్రదర్శించమని ప్రోత్సహించాడు తిలక్.
హైదరాబాద్ లో ఆంధ్రభాషా నిలయం పెద్దలు ఘనసత్కారం చేసి జగదేకవీర బిరుదమిచ్చారు.
అప్పటి వైస్రాయి లార్డ్ మింటో, రామమూర్తిగారి ప్రదర్శనలను చూడాలని వచ్చాడు. రామమూర్తి అప్పట్లో ఆంజనేయ ఉపాసనలో వుండినందున పది నిమిషాలు వేచాడు. రామమూర్తి ప్రదర్శనలను చూచి ముగ్ధుడయ్యాడు. తానే పరీక్షించాలనుకుని తన కారును ఆపవలసిందని కోరాడు. కారులో కూర్చుని లార్డ్ మింటో కారును నడపసాగాడు. త్రాళ్ళతో కారును తన భుజాలకు కట్టుకున్నాడు. అంతే, కారు ఒక సెంటీమీటర్ కూడా కదలక పోయింది. ఈ సంఘటనతో వైస్రాయి ప్రశంసలను, దేశమంతటా గొప్ప పేరును సంపాదించాడు రామమూర్తి నాయుడు.
అలహాబాదులో అఖిల భారత కాంగ్రెస్ సభ జరిగింది. రామమూర్తి సర్కస్ అక్కడ ప్రదర్శనలిచ్చింది. జాతీయ నాయకులెందరో చూచి ఆనందించారు. పండిత మదనమోహన మాలవ్యా ఎంతగానో మెచ్చుకున్నారు. విదేశాలలో ప్రదర్శనలివ్వమని ప్రోత్సహించారు.
విదేశాలలో ప్రదర్శన
సర్కస్ కంపెనీ బాగా పెరిగింది. రామమూర్తిగారు 1600 మంది గల తన బృందంతో లండన్ వెళ్ళి ప్రదర్శనలిచ్చారు. సుప్రసిద్ధ మల్లుడైన గామా పహిల్వాన్ తమ్ముడు ఇమామ్‌ బక్షీ ఆ బృందంలో వుండేవాడు.

లండన్లో రాజదంపతులు జార్జిరాజు, రాణి మేరి, రామమూర్తిగారి ప్రదర్శనలను చూచి తన్మయులయ్యారు. రామమూర్తిగారిని తమ బక్కింగి హామ్‌ రాజభవనానికి ఆహ్వానించి, విందు ఇచ్చిన తర్వాత ‘ఇండియన్ హెర్కులస్’ బిరుదంతో సత్కరించారు. ఆ విధంగా బ్రిటిష్ రాజదంపతులచే, గౌరవింపబడిన భారతీయులలో మొదటి వాడు కోడి రామమూర్తి నాయుడు. రామమూర్తి గారు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలలో పలు ప్రదర్శనలిచ్చారు.

స్పెయిన్ దేశంలో ‘కోడె పోరాటం’ (బుల్ ఫైట్) చాలా ప్రసిద్ధమైంది. ఈ పోరాటం చాల భీకరంగా ఉంటుంది. రామమూర్తిగారిని ఆ పోరులో పాల్గొనమన్నారు. అట్టి పోరాటంలో ఏలాటి అనుభవంలేని రామమూర్తిగారు ‘ సరే ‘ అన్నారు. రామమూర్తిగారు రంగంలో దుకారు. దూసుకుని వస్తున్న కోడె కొమ్ములను పట్టుకుని క్షణాల్లో క్రింద పడవేశారు. కోడెచిత్తుగా పడిపోయింది. వేలాది ప్రేక్షకుల హర్షధ్వానాలతో స్టేడియం మార్మోగింది.

జపాన్, చైనా, బర్మాలలో రామమూర్తిగారి ప్రదర్శనలు ఎంతో వైభవంగా సాగాయి.

బర్మాలో వున్నపుడు రంగూన్లో ప్రదర్శనలిచ్చారు. అసూయగ్రస్తులు కొందరు రామమూర్తిగారిని చంపాలనుకున్నారు. ఎలాగో ఈ విషయం గ్రహించిన రామమూర్తిగారు ప్రదర్శనను ఆపి మరుసటి రోజే మాతృదేశం వచ్చారు. కోడి రామమూర్తిగారు కోట్లు గడించారు. అంత కంటే గొప్పగా దాన ధర్మాలకు, జాతీయోద్యమాలకు ఖర్చు చేశారు.

భారతదేశం అంతటా రామమూర్తిగారి పేరు ప్రతిధ్వనించింది. అమెరికా వెళ్ళాలనుకున్నారు. కాని వెళ్ళలేదు. ప్రతిరోజూ పత్రికల్లో రామమూర్తిగారి ప్రశంసలుండేవి. రామమూర్తి నాయుడుగారు పండిత మదన మోహన మాలవ్యాగారి అతిథిగా ఏడాదిపాటు బెనారస్ లో ఉన్నారు. ఆయన శాకాహారి. భారతదేశంలో అతి విశిష్టమైన వ్యాయామ విద్యాసంస్థను ప్రారంభించాలనుకున్నారు. కాని ఆ ప్రయత్నం ఫలించలేదు.

కీ.శే. మేడేపల్లి వరాహనరసింహస్వామిగారు రచించిన దానిని బట్టి రామమూర్తిగారు కాలిపై రాచపుండు లేచినందున కాలుతీసివేయవలసి వచ్చింది. సేకరించిన ధనం కరిగిపోయింది. శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఎటువంటి మత్తుమందును (క్లోరోఫామ్‌) తీసుకోలేదు. ప్రాణాయామం చేసి నిబ్బరంగా వుండిపోయారు.

చివరిరోజులు బలంఘర్, పాట్నాలో కలవాండి (ఒరిస్సా) పరగణా ప్రభువు పోషణలో వుండి 16.1.1942 తేదీన కన్ను మూశారు నాయుడుగారు.[4] తెలుగువారే కాక భారతీయులందరూ గర్వించదగిన మహనీయుడు, దేశభక్తుడు, ‘కలియుగ భీమ’ కోడి రామమూర్తి నాయుడుగారు.

వరవిక్రయం, మధుసేవ వంటి గొప్ప సాంఘిక నాటకాలను రచించిన, విఖ్యాత నాటక కర్త కాళ్ళకూరి నారాయణరావుగారు, కోడి రామమూర్తిగారి ఆప్త మిత్రులు. నాయుడుగారిని ప్రశంసిస్తూ ” సాధు పథవర్తి సన్మిత్ర చక్రవర్తి రమ్యతరకీర్తి శ్రీ కోడి రామమూర్తి ” అన్నారు. మన పురాణాలలో బల శబ్దానికి భీముడు, ఆంజనేయుడు పర్యాయ శబ్దాలైనట్లు ఆంధ్ర ప్రదేశంలో ఇతడి పేరు బలానికి పర్యాయపదంగా పరిగణించబడింది. తన చివరి రోజుల్లో రామ్మూర్తి నాయుడు బలంఘీర్ పాట్నాలో కల్వండే పరగణా ప్రభువు పోషణలో జీవితం గడుపుతూ మరణించారు.

శ్రీకాకుళంలో స్థాపించిన కోడి రామమూర్తి విగ్రహం
బలప్రదర్శన విశేషాలు[మార్చు]
గట్టిగా ఊపిరి పీల్చుకుని కండలు బిగించి, తన ఛాతీకి చుట్టిన ఉక్కు తాళ్ళను తెంచేవారు.
ఛాతీ మీదకు ఏనుగును ఎక్కించుకుని ఐదు నిముషాల పాటు నిలిపేవారు.
రెండు కార్లను వాటికి కట్టిన తాళ్ళు రెండు చేతులుతో పట్టుకుని కదలకుండా ఆపేవారు.
ఒంటి చేత్తో రైల్ ఇంజను ఆపిన ఘనుడు.
బిరుదులు

కోడి రామమూర్తి విగ్రహం గురించిన సమాచారం
ఆనాటి ఇంగ్లండు పాలకులైన కింగ్ జార్జ్, క్వీన్ మేరీలు రామ్మూర్తి నాయుడి బల ప్రదర్శనకు అబ్బురపడి, ‘ఇండియన్ హెర్క్యులెస్’ అనే బిరుదును ప్రసాదించారు. ఇంకా కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ వంటి బిరుదులను కూడా సొంతం చేసుకున్నరు.[5]

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -22-4-22-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -3

. కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -3
పాఠశాల పర్యవేక్షణాధికారి
ఉపసహాయ పర్యవేక్షణాధికారిగా పంజే ను దక్షిణ కన్నడ కాసర గోడ్ లో నియమించారు .ప్రస్తుతం ఇది కేరళ లో ఉంది .మూడు R లు బోధించటం లో దిట్ట కనుక ఈ పదవి దక్కింది .మంచి ఇంట్లో కాపురం పెట్టాడు .ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గా ఆయన బాగా పేరు పొందాడు .కొడుకులు మంచి విద్యలు నేర్చి ఉద్యోగాలలో స్థిరపడ్డారు .పెద్దకొడుకు ముకుంద భిలాయ్ లో రెండవవాడు గోపాల రావు హైదరాబాద్ లో అడ్వ కేట్ గా స్థిరపడ్డాడు .మూడవ వాడు రామారావు అనుకోకుండా బస్ యాక్సిడెంట్ లో చనిపోయాడు .కూతురు అనసూయ లండన్ లో సాహిత్యం లో డిగ్రీ పొందిన వాడిని పెళ్ళాడి బొంబాయిలో ఉంటోంది .చివరిపిల్ల శాంత రామేశ్వరరావు హైదరాబాద్ లో ఉంటోంది .
పర్యవేక్షణకు కాలినడకన లేక ఎడ్ల బండీలో వెళ్ళాల్సి వచ్చేది. వెంట ఒక వంటవాడు ,సేవకుడు ఉండేవారు .జానపద గేయాలు కధలు సామెతలు సేక రించాటానికి వాళ్ళు సాయం చేసేవారు .మద్రాస్ విద్యా శాఖ కు ఎజి బోర్న్ అనే విద్యా సంస్కర్త వచ్చి బోధనలో ప్రత్యక్ష విధానం ప్రవేశపెట్టాడు .ఇది బాగా నచ్చింది పంజే కు .దీనివల్ల ఉపాధ్యాయ విద్యార్ధులకు పని భారం తగ్గి ,నేర్చే కాలమూ తగ్గింది .
  కాసర గోడ్ మలేరియా ప్రాంతం .అయినా మారుమూల గ్రామ స్కూల్స్ ను పర్యవేక్షించిన ఉక్కుమనిషి .ఆయన కోసం బదులు ఆసక్తిగా ఎదురు చూసేవి .బోధనలో పాటలు డాన్సులు ,ఆటలు కధలు తో మంచి ఉత్సాహం కలిగించేవాడు .’’ఒక పర్యవేక్షణాదికారి అసంబద్ధపు దిన చర్య ‘’అనే పుస్తకం లో తన అనుభవాలు రాశాడు .రాయచూరు కన్నడ సాహిత్య పరిషత్ లో అధ్యక్ష ఉపన్యాసమిస్తూ ‘’సాహిత్య ,భాష ,గ్రామీణాభి వృద్ధి మొదలైనవి ఉపాధ్యాయుల చేతులలో ఉన్నాయి .వాళ్ళను సభ్యులుగా చేర్చాలి .వారి చొరవ వలన ప్రతి బడీ సాహిత్య పరిషత్ భవనం అవుతుంది .వారి వ్రాతప్రతులు కరదీపికలౌతాయి .గ్రామీణ యువ ఉపాధ్యాయులే  నా నిజమైన స్నేహితులు ‘’అన్నాడు .
  మళ్ళీ మంగుళూరు కు బదిలీ అయ్యాక ఆయన నూతన విధానాలకు మున్సిపాలిటి ,సమితి అధ్యక్షులు వగైరా ముఠా అడ్డు కట్ట వేశారు  .కానీ  ఆయన వచ్చాక ఆయన్ను ఆపగలిగే వారే లేకపోయారు .తర్వాత ట్రయినింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ అయ్యాడు .తన కార్యదీక్షతో ఇందులో విప్లవాత్మకమార్పులు తెచ్చాడు .ఉపాధ్యాయుల్ని సేవకులుగా కాకుండా మనుషులుగా గౌరవించేవాడు .పెత్తందార్లు ,మొండివాళ్ళు ఆయన్ను జిల్లానుంచి తోలేసేదాకా నిద్రపోలేదు .పంజే అభి వృద్ధిపనులకు అడ్డగించటం పై అధికారులకు ఇష్టం లేదు .ఆయనవలననే విద్యా వ్యవస్థ కుసుమిస్తోందని నమ్మారు .ఐ యేట్స్ ఆయన్ను కొడగు జిల్లాకు బదిలీ చేశాడు .ఇక్కడా రాజీలేని తన నూత్న విద్యా బోధనా అమలు పరచాడు .తర్వాత మేర్కరా లో కేంద్ర ఉన్నత పాఠశాలకు ముఖ్యోపాధ్యాయుడయ్యాడు .ధోవతి ,కోటు ,తలపాగా వేషం లో ఉన్న పంజేను చూసి వాళ్ళు తేలికగా తీసుకొన్నారు  .క్రమంగా వాళ్ళే దారికొచ్చారు స్థానిక సంఘ సంస్థలలో సభ్యుడయ్యాడు .గౌరవ ప్రేమలకు పాత్రుడయ్యాడు ‘
కొడగుజిల్ల ముఖ్యపట్టణం మేర్కరా లో కాపురం పెట్టాడు .ఆర్ధిక ఇబ్బందులు లేవు .కాసర్గోడులో ఉన్నప్పుడు ‘’నాగర హావే ‘’-నాగుపామా అనే అపూర్వ మనోహర గీతాన్ని పిల్లలకోసం రాసి పాడి పాడించాడు .భారత స్వాతంత్ర్య కాంక్ష ఆయన గీతాలలో ఉంటుంది .హత్తరి హాడు అనే గీతం లో కొడగు వారి జాతీయ పర్వాన్ని ,సౌందర్యం ,ప్రజలగురించి వర్ణించాడు .ఎక్కడ పని చేసనా జానపద గీతాలు ఐతిహ్యాలు సేకరించటం ఆయన హాబీ .
పత్రిక ,ప్రచురణ రంగాలు
ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ గా రిటై రై,మంగుళూరు లోని  కద్రిలో కాపురమున్నాడు .తర్వాత ఇదే సాహిత్య వేత్తలకు  పుణ్యస్థలమైంది .1927లో మంగుళూరులో కన్నడ సాహిత్య సమావేశాలు జరిగితే పంజే అండగా నిలిచాడు .బాసెల్ మిషన్ వాళ్ళు విద్యా విషయకపనులు ,ప్రచురణ చూసిపెట్టమని కోరితే చేశాడు .కన్నడ భాషా వ్యాకరణం ప్రచురించమని కోరితే అంగీకరించి చేశాడు దీనితో యూరోపియన్ విధానాలు ,అక్కడి బాలసాహిత్య విషయాలు తెలుసుకోవటానికి ఆయనకు బాగా తోడ్పడింది .1902లో ఆయన బావమరిది బెనెగల్ రామారావు ‘’సువాసిని ‘’వారపత్రిక సంపాదకుడు .ఈ రామారావు భారత రిజర్వ్ బాంక్ కు నాల్గవ గవర్నర్ .ఈయన సంతకం తోనే నోట్లు ముద్రి౦ప బడేవి  . సువాసిని లో  ముఖ్యరచనలు పంజే వే .బాలసాహిత్యం జానపద సాహిత్యం అభి వృద్ధికి ‘’చోదియాల్ బైల్ ‘’అనే సంస్థ ఏర్పడింది  ,గొప్ప బాలసాహిత్యం వచ్చింది .చారిత్రక శాసనవిషయాలపైనా రాశాడు .’’హరటే మల్ల ‘’పేరుతొ అప్పటికి కొత్తవైన రచనా చిత్రాలు ,పారడీలు ,వ్యంగ్య రచనలు రాశాడు .ఎన్ ఎం కామత్ ,శంకరయ్య మాస్తి వెంకటేశయ్య౦గార్ వగైరా మహా మహులతో పరిచయ మేర్పడింది  .
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, రచనలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –237

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –237
237-మిస్టర్ ఆసియా ,మిస్టర్ హెర్క్యులస్ ,మిస్టర్ ఇండియా అయిన కసరత్తు వీరుడు ,పౌరాణిక ఆంజనేయుడు –అర్జా జనార్ధనరావు
అర్జా జనార్ధనరావు (డిసెంబర్ 21, 1926 – నవంబర్ 4, 2007) ప్రసిద్ధ తెలుగు నాటక, సినిమా నటుడు. ఇతడు ఎక్కువగా పౌరాణిక చిత్రాలలో హనుమంతుడు వేషంతో మంచిపేరు సంపాదించుకున్నాడు. హనుమ అనగానే గుర్తువచ్చే విదంగా ఆయన నటన ఉండేది.
జీవిత విశేషాలు
ఇతని స్వస్థలం కాకినాడ. అక్కడే బి.ఎ., బి.ఎస్.సి చదువుకున్నాడు. చదువుకొనే సమయంలోనే ఇతనికి నాటకరంగంలో కొంత అనుభవం కలిగింది. ఇతనికి చిన్నతనం నుండి ఆటలమీద, కసరత్తులు చేయడం మీద ఉత్సాహం ఉండేది. ఆ ఉత్సాహమే ఇతడిని మిస్టర్ ఆసియా, మిస్టర్ హెర్క్యులస్ (1954), మిస్టర్ ఇండియా (1955)గా ఎన్నిక చేసింది. ఇతడు శబ్దగ్రహణ శాఖలో డిప్లొమా చదివి కొన్నాళ్ళు శ్యామలా స్టుడియోలో రికార్డిస్ట్‌గా పనిచేశాడు.
నటించిన సినిమాలు
• లవకుశ (1963)
• శ్రీకృష్ణావతారం (1967)
• వీరాంజనేయ (1968)
• శ్రీ రామాంజనేయ యుద్ధం (1974)
• ముత్యాల ముగ్గు (1975)
• శంకరాభరణం (1979)
• త్యాగయ్య (1981)
• శ్రీ ఆంజనేయ చరిత్ర (1981)
• దేవాంతకుడు (1984)
డిటెక్టివ్ నవలా రచయిత విశ్వప్రసాద్ కథ, మాటలు సమకూర్చిన, 1969 జూలై 25న సినిమా విడుదలైన, కృష్ణ, గుమ్మడి, ఎస్వీ రంగారావు, వాణిశ్రీ లు ప్రధాన పాత్రధారులుగా ఉన్న జగత్ కిలాడీలు’ చిత్రంలో జనార్ద‌న‌ రావు భిన్నమైన పాత్రలో నటించారు. ఈ సందర్భంగా రామాంజనేయ యుద్ధం చిత్రంలో ఒక పాటను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జనార్ద‌న‌ రావు … ఆంజనేయ పాత్రలో లీనమై నటించగా, ఆ సన్నివేశంలో, ఆయన హావభా వాలు నాటి సినిమా ప్రియులు ఎన్నటికీ మరచి పోలేనివి. 1975లో పొట్లూరి వెంక‌ట‌ నా‌రా‌యణ, ఎన్‌.‌ఎస్‌.‌మూర్తి కలిసి శ్రీరా‌మాం‌జ‌నేయ యుద్ధం పేరుతో కలర్‌ సినిమా నిర్మిం‌చారు.‌ బాపు దర్శ‌కత్వం వహిం‌చిన సిని‌మాకు ముళ్ల‌పూడి వెంక‌ట‌ర‌మణ మాటలు రాయ‌కుండా ఉన్న అరు‌దైన సినిమా శ్రీ రామాం‌జ‌నేయ యుద్ధం.
బాపు−‌ఎన్టీ‌ఆర్‌ కాంబి‌నే‌ష‌న్‌లో వచ్చిన తొలి సినిమా శ్రీరా‌మాం‌జ‌నేయ యుద్ధం.‌ గతంలో గబ్బిట వెంక‌ట‌రావు రాసిన పద్య‌నా‌ట‌కం‌ లోని పద్యా‌లను యధా‌త‌ధంగా వాడ‌డంతో సంభా‌ష‌ణలు కూడా అతని చేత రాయిం‌చారు.‌ ఎన్టీ‌ఆర్‌ రాము‌డిగా, అర్జా జనా‌ర్ద‌న‌రావు ఆంజ‌నే‌యు‌డుగా, బి.‌సరో‌జ‌దేవి సీతగా, ధూళి‌పాళ్ల యయా‌తిగా నటిం‌చిన ఈ చిత్రా‌నికి కె.‌వి.‌మహ‌దే‌వన్‌ సంగీతం సమ‌కూ‌ర్చారు.‌ ఇందులో ఆంజ‌నే‌యుడు ఆల‌పించే రెండు ఆర్ధ్ర‌మైన పాట‌లను వినూ‌త్నంగా ఉంటుం‌దని రఘు‌రా‌మయ్య చేత పాడిం‌చారు.‌ వాటిలో మొద‌టిది ‘రామ నీల‌మేఘ శ్యామా కోదం‌డ‌రామా’ కాగా, రెండ‌వది ‘శరణు శర‌ణయా జాన‌కి‌రామా, కరు‌ణ‌ జూ‌పవా మారు‌తిపై సాకేత సార్వ‌భౌమా’ అనే పాట.‌ ఈ రెండవ పాటకు కె.‌వి.‌ మహ ‌దే‌వన్‌ ఒక హిందీ పాట బాణీని అను‌క‌రిం‌చడం వింతగా చెప్పు‌కు‌న్నారు.‌ అందుకు కారణం.‌.‌.‌మహ‌దే‌వన్‌ ఎప్పుడూ ముందుగా ఇచ్చే బాణీకి పాట స్వర‌ప‌ర‌చ‌ లేదు.‌ కవి రాసిన ఎటు‌వంటి పాట‌కైనా అద్భు‌తంగా బాణీలు కట్టటం మహ‌దే‌వన్‌ నైజం.‌ తద్భి‌న్నంగా ‘సాకేత సార్వ‌భౌమా’ పాటకు మహ‌దే‌వన్‌ అను‌క‌రిం‌చిన హిందీ పాట 1964లో రాజశ్రీ ప్రొడక్షన్స్‌ నిర్మాత తారా‌చంద్‌ బర‌జాత్యా సత్య‌న్‌బోస్‌ దర్శ‌క‌త్వంలో నిర్మిం‌చిన సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రం ‘దోస్తీ’లో మహ‌మ్మద్‌ రఫీ పాడిన ‘చాహూంగా మై తుజ్హే సాంఝ్‌ సవేరే.‌.‌.‌ఫీర్‌ భి కభీ ఆబ్‌ నామ్‌ కో తేరే ఆవాజ్‌ మై న దూంగా’ మహ‌దే‌వన్‌ అను‌క‌రిం‌చడాన్ని విశేషంగా చెప్పుకుంటారు.
(నవంబర్ 4 అర్జా వర్ధంతి)
రామాంజనేయ యుద్ధం లో అర్జా ప్రతికదలిక మాట భక్తీ స్పోరకం .హావభావాలు చిరస్మరణీయం .రఘురామయ్య పాడిన రెండు పాటలు తెలుగుసినీ గీత చరిత్రలో చెరగని సంతకాలు ఆఫీల్ ఆయన పాడటం వల్లనే వచ్చింది బహుశా ఎవరూ అంత భావంతో పాడగలిగే వారు కాదేమో అలా పాడించే నేర్పు బాపుది.బాపు గారి ముత్యాలముగ్గు లోనూ అర్జా హనుమ పాత్ర మలుపులు తిప్పేదే .చిన్నారీ అంటూ ఆపిల్లను లాలించి బుజాలకు ఎత్తుకోవటం అద్భుతం .అల్లు కోతినే మరపించే మహా నటన ప్రదర్శించి హాట్సాఫ్ అనిపించాడు .శంకరాభరణం లో రౌడీ పాత్ర .సానుభూతికోల్పోయేది.బాపు త్యాగయ్య లో త్యాగూ కు చాలా సపోర్టివ్ పాత్ర .సీతారాములకు ‘’త్యాగ దర్శనం ‘’చేయించే పాత్ర సార్ధకం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -21-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –236 •

  1. అనుజన్ముండటంచు సంతతము నాకానందసంజాత (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  2. అనుపమ వీర సింహుడని ఆలులమందు ప్రశస్తి – పద్యం -మాధవపెద్ది
  3. అవశిష్ఠంబులు దీర్చి సర్వము పరిత్యాగము గావించి (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  4. ఆలము సేయబూని నిటలాక్షుడు నన్నెదిరించు (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  5. ఇటు ఇటు ఓ రాజా ఇటు ఎటు ఎటు ఓ రాజ ఎటు రారాదా – ఎల్.ఆర్.ఈశ్వరి – రచన: డా. సినారె
  6. కలన జయింపలేక బలగర్వమడంగియు చింత (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  7. కలలన్ని ఫలియించె ఈనాడే తలపులు చిగురించె ఈ నాడే – పి.సుశీల – రచన: డా. సినారె
  8. కాళీచిత్తసరోజబంబహర గంగా శశాంక ప్రియా – వెంకట్రావు – రచన: తాండ్ర
  9. జపమేమి జేసెనో జనక మహారాజు కల్యాణరాముని కాళ్ళు (పద్యం) – ఘంటసాల – రచన:తాండ్ర
  10. జయ జయ జానకిరామ రఘుకుల సోమా పావన – ఘంటసాల,సరోజిని – రచన: రాజశ్రీ
  11. ధరణి శ్రీరామచంద్రుడే దైవమేని సీత భూజాత లోకమాత (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  12. నేనే నేనే మధుగీతి నవరసపూరిత నవవిలాసవతి నేనే – పి.సుశీల,ఎల్.ఆర్.ఈశ్వరి – రచన: ఆరుద్ర
  13. పండెన్ దుష్టచతుష్ఠయంబునకు పాపంబు ఆపదలు (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  14. పలికే రాగం పిలిచే భావం నేనేలే నింగిలోన నేలపైన నేనేలే – ఎల్.ఆర్.ఈశ్వరి – రచన: డా. సినారె
  15. ప్రాంచితకీర్తిశాలి యగు పాండునృపాలుడు నాదు తండ్రి (పద్యం) – మాధవపెద్ది – రచన:తాండ్ర
  16. రామనామ సుధా మధురాతి మధుర పావానాక్షరసేవ (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  17. రామా రఘుకుల సోమా.. శ్రీరామ జయరామా నీలనీరద కోమల – ఘంటసాల- రచన: తాండ్ర
  18. వీరుడనే ధీరుడనే వినవే ఓ భామా ఔనన్నా కాదన్నా – పి. శ్రీరామ్ – రచన: రాజశ్రీ
  19. సిగలోన విరిసిన సౌగంధికా చెలికింత తొందర ఏల – ఘంటసాల,పి.సుశీల – రచన: డా. సినారె
  20. సిగలోన విరిసిన సౌగంధికా చెలిమికే నీవే ( బిట్ ) – ఘంటసాల,పి.సుశీల – రచన: డా. సినారె
  21. సురభామినీ సౌదామినీ కలహంస ఓలే ఇటురావే – ఘంటసాల – రచన: డా. సినారె
    సశేషం
    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-22-ఉయ్యూరు

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –236
236-వెయిట్ లిఫ్టింగ్ను అంతర్జాతీయ స్థాయికి చేర్చి ,9స్వర్ణ ,12జాతీయ అవార్డ్ లు పొంది ,ఆసియాక్రీడలలో రజతం పొంది ,హేల్సేంకి ,వార్సా ,మెల్బోర్న్ ,జకార్తా పోటీలలో ప్రధమ స్థానం పొంది ,భీమాంజనేయ యుద్ధం లో ఆంజనేయుడు గా నటించిన అర్జున అవార్డ్ గ్రహీత –కామినేని ఈశ్వర రావు
• జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో, కృష్ణా జిల్లా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకొని వెళ్ళిన ఘనత, అర్జున అవార్డు గ్రహీత శ్రీ కామినేని ఈశ్వరరావు గారికే దక్కుతుంది. భారతదేశంలోని అనేక నగరాలలో, భారత వెట్ లిఫ్టింగ్ ఫెడెరేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలలో 9 పసిడి పతకాలూ, భారతదేశంలో 12 జాతీయ రికార్డులను సాధించిన మొదటి భారతీయుడు శ్రీ ఈశ్వరరావు కావటం విశేషం.[మూలాలు తెలుపవలెను]
• వీరు భట్ల పెనుమర్రు గ్రామంలో 1926, ఆగస్టు-28వ తేదీన ఒక రైతు కుటుంబంలో జన్మించారు. వెయిట్ లిఫ్టింగ్ లో గోసాలలోని గురువు శ్రీ రంగదాసుగారి వద్ద, శిక్షణ పొందినారు. జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో కోల్ కతా, చెన్నై, ముంబై, కొత్త డిల్లీ, జబల్ పూర్ మొదలగు నగరాలతో పాటు, విదేశాలలోని హెల్సింకీ (ఫిన్లెండు), వార్సా (పోలెండ్), మెల్బోర్న్ (ఆస్ట్రేలియా), జకార్తా (ఇండోనేషియా) మొదలగు చోట్ల జరిగిన పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచారు. 1951లో కోల్ కతాలో జరిగిన అన్ని విభాగాలలోనూ, శరీర సౌష్టవ పోటీలలోనూ, పసిడి పతకాలు సాధించారు. 1963లో అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చేతుల మీదుగా “అర్జున” అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా నిలిచారు.
• ఎన్నో రికార్డులు:- 1951లో ఆసియా క్రీడలలో, ఇంతవరకూ ఏ భారతీయుడూ సాధించని రజత పతకాన్ని ఈయన వెయిట్ లిఫ్టింగులో సాధించారు. దేశంలో 12 జాతీయ రికార్డులు, ఆసియా ఖండంలో 4 రికార్డులు స్థాపించిన తొలి భారతీయుడు. ఈయన కృష్ణా జిల్లా క్రీడా సంఘానికి కార్యదర్శిగా పనిచేశినారు. వీరికి చలనచిత్ర రంగంలో గూడా ప్రవేశం ఉంది. “భీమాంజనేయ యుద్ధం” అను చిత్రంలో వీరి ప్రత్యర్థి శ్రీ దండమూడి రాజగోపాలరావుతో పోటీగా ఆంజనేయ పాత్ర ధరించి పలువురు ప్రశంసలు పొందినారు. వీరు 1977, నవంబరు-7న గుండెపోటుతో కన్నుమూశారు.
• కుటుంబ నేపథ్యం:- వీరి ఇద్దరు సంతానం. కుమారుడు డాక్టర్ కె.పిరావు, హాంగ్ కాంగ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. కుమార్తె శ్రీమతి వసుంధర, విజయవాడలో గృహిణిగా ఉన్నారు.
• యోధానుయోధులు:- గతంలో ఆంధ్రప్రదేశ్ లో, వెయిట్ లిఫ్టింగ్ అంటే కృష్ణాజిల్లా నే గుర్తుకు వచ్చేది. జిల్లాకు చెందిన శ్రీ కామినేని ఈశ్వరరావు, శ్రీ దండమూడి రాజగోపాలరావు వంటి యోధానుయోధులు, జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకొని వచ్చారు. వీరితోపాటు బొబ్బా వెంకటేశ్వరరావు, ఎం.పి.రంగా, మాదు వెంకటేశ్వరరావు, సంపత్, రామస్వామి, అచ్యుతరావు వంటి ఎందరో వెయిట్ లిఫ్టర్లు 1945-70 మధ్య జిల్లాకు మంచిపేరు తీసుకొని వచ్చారు.
• మహాలక్ష్మీ మూవీస్ వారి భీమాంజనేయ యుద్ధం చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకుడు వి.వి.రామచంద్ర. ఈ చిత్రంలో భీముని పాత్రను దండమూడి రాజగోపాల్, ఆంజనేయుని పాత్రను కామినేని ఈశ్వరరావు ధరించారు. ఇంకా ఈ చిత్రంలో ద్రౌపదిగా ఎస్.వరలక్ష్మి, నలకూబరునిగా కాంతారావు, రంభగా కాంచన, సౌదామినిగా రాజశ్రీ, మరియూ కైకాల సత్యనారాయణ, రమణారెడ్డి మొదలైనవారు నటించారు. ఈ చిత్రానికి తాండ్ర సుబ్రహ్మణ్యం కథను అందించగా, కె.వి.నాగేశ్వరరావు కళాదర్శకత్వం, టి.వి.రాజు సంగీతం నిర్వహించారు.
• చలం నారదుడిగా
• ఈ చిత్రంలో హాస్య నటుడు చలం నారదుడు పాత్రలో కనిపిస్తాడు. చలం ఈ పాత్ర వెయ్యటం అదే మొదటిసారి చివరిసారి కూడా!

పాటలు, పద్యాలు

  1. అనుజన్ముండటంచు సంతతము నాకానందసంజాత (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  2. అనుపమ వీర సింహుడని ఆలులమందు ప్రశస్తి – పద్యం -మాధవపెద్ది
  3. అవశిష్ఠంబులు దీర్చి సర్వము పరిత్యాగము గావించి (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  4. ఆలము సేయబూని నిటలాక్షుడు నన్నెదిరించు (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  5. ఇటు ఇటు ఓ రాజా ఇటు ఎటు ఎటు ఓ రాజ ఎటు రారాదా – ఎల్.ఆర్.ఈశ్వరి – రచన: డా. సినారె
  6. కలన జయింపలేక బలగర్వమడంగియు చింత (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  7. కలలన్ని ఫలియించె ఈనాడే తలపులు చిగురించె ఈ నాడే – పి.సుశీల – రచన: డా. సినారె
  8. కాళీచిత్తసరోజబంబహర గంగా శశాంక ప్రియా – వెంకట్రావు – రచన: తాండ్ర
  9. జపమేమి జేసెనో జనక మహారాజు కల్యాణరాముని కాళ్ళు (పద్యం) – ఘంటసాల – రచన:తాండ్ర
  10. జయ జయ జానకిరామ రఘుకుల సోమా పావన – ఘంటసాల,సరోజిని – రచన: రాజశ్రీ
  11. ధరణి శ్రీరామచంద్రుడే దైవమేని సీత భూజాత లోకమాత (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  12. నేనే నేనే మధుగీతి నవరసపూరిత నవవిలాసవతి నేనే – పి.సుశీల,ఎల్.ఆర్.ఈశ్వరి – రచన: ఆరుద్ర
  13. పండెన్ దుష్టచతుష్ఠయంబునకు పాపంబు ఆపదలు (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  14. పలికే రాగం పిలిచే భావం నేనేలే నింగిలోన నేలపైన నేనేలే – ఎల్.ఆర్.ఈశ్వరి – రచన: డా. సినారె
  15. ప్రాంచితకీర్తిశాలి యగు పాండునృపాలుడు నాదు తండ్రి (పద్యం) – మాధవపెద్ది – రచన:తాండ్ర
  16. రామనామ సుధా మధురాతి మధుర పావానాక్షరసేవ (పద్యం) – ఘంటసాల – రచన: తాండ్ర
  17. రామా రఘుకుల సోమా.. శ్రీరామ జయరామా నీలనీరద కోమల – ఘంటసాల- రచన: తాండ్ర
  18. వీరుడనే ధీరుడనే వినవే ఓ భామా ఔనన్నా కాదన్నా – పి. శ్రీరామ్ – రచన: రాజశ్రీ
  19. సిగలోన విరిసిన సౌగంధికా చెలికింత తొందర ఏల – ఘంటసాల,పి.సుశీల – రచన: డా. సినారె
  20. సిగలోన విరిసిన సౌగంధికా చెలిమికే నీవే ( బిట్ ) – ఘంటసాల,పి.సుశీల – రచన: డా. సినారె
  21. సురభామినీ సౌదామినీ కలహంస ఓలే ఇటురావే – ఘంటసాల – రచన: డా. సినారె
    సశేషం
    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-22-ఉయ్యూరు
Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –235

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –235
235-‘’ఇండియన్ టార్జాన్ ‘’ఆంధ్రా భీమ ‘’వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ ,నర్తన శాల భీముడు,మా గండిగుంట వాడు  –దండమూడి రామమోహనరావు
దండమూడి రాజగోపాలరావు (అక్టోబరు 16, 1916 – ఆగష్టు 6, 1981) భారతదేశానికి చెందిన వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, “ఇండియన్ టార్జన్” అన్న బిరుదు పొందారు.తెలుగు రంగస్థల, సినిమా నటుడు. ఈయన 1951లో ఢిల్లీలో జరిగిన ప్రథమ ఆసియా క్రీడోత్సవాలలో వెయిట్‌ లిఫ్టింగ్ పురుషుల సూపర్ హెవీవెయిట్ (+105 కేజీలు) వర్గములో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.[1] ఈయన 1963లో విడుదలైన నర్తనశాల[2] సినిమాలోనూ, 1965లో విడుదలైన వీరాభిమన్యు సినిమాలోనూ, భీముని పాత్ర పోషించాడు.
రాజగోపాలరావు, కృష్ణా జిల్లా, గండిగుంట గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. కోడి రామ్మూర్తి నాయుని స్ఫూర్తితో బరువులు ఎత్తటం ఒక వ్యాసంగంగా స్వీకరించాడు. కొంతకాలం బరువులెత్తడంలో శిష్ట్లా సోమయాజులు వద్ద శిక్షణ పొందాడు. ఆ తరువాత కొల్లి రంగదాసుతో పాటు సంచరిస్తూ అనేక రాష్ట్రాలు, దేశాలలో ప్రదర్శనలిచ్చాడు.
రాజగోపాలరావుకు అనసూయతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు – ఝాన్సీ లక్ష్మీబాయి, పూర్ణచంద్రరావు, శ్యాంసుందర్, బసవరాజ్, విజయలక్ష్మి. రాజగోపాలరావు 1981, ఆగష్టు 6న మరణించాడు. ఈయన పేరు మీదుగా, విజయవాడలో మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఇండోర్ క్రీడా ప్రాంగణానికి “దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం” అని నామకరణం చేశారు.[3] దీనిని అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య ప్రారంభించాడు.
ఆంధ్ర భీముడు…రాజగోపాలుడు
ఆటల పోటీల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన కొద్దిమంది భారతీయుల్లో దండమూడి రాజగోపాలరావు ఒకరు. మనదేశం స్వాతంత్య్రం పొందిన తొలినాళ్లయిన 1948లోనే మిస్టర్‌ ఆసియాగా గెలిచి భారతజాతికి వన్నెతెచ్చిన ఘనుడాయన. సోమవారం ఆయన వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. 
పెదపారుపూడి(పామర్రు): శరీర సౌష్టవ పోటీలో మిస్టర్‌ ఆసియా బిరుదును పొందిన తొలి ఆంధ్రుడే కాక తొలి భారతీయుడు దండమూడి రాజగోపాలరావు. ఆయన తొలి అంకంలో కొల్లి రామదాసు, సోమయాజులు తదితరుల వద్ద తర్ఫీదు పొంది 1938లో తొలిసారిగా పోటీల్లో పాల్గొని జిల్లా వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ కావడం ద్వారా శరీర సౌష్టవంపై దృష్టి పెంచారు. ఫలితంగా  1940లో మొదటిసారిగా రాష్ట్రస్థాయిలో చాంపియన్‌గా గెలుపొందారు. 1945లో జాతీయస్థాయిలో 320 పౌండ్ల బరువు ఎత్తి విజేతగా నిలిచారు. 1948లో జరిగిన ఆసియా శరీరసౌష్టవ పోటీల్లో గెలుపొంది మిస్టర్‌ ఆసియా బిరుదును సొంతం చేసుకున్నారు. 1945 నుంచి 1958 వరకు 13 ఏళ్లపాటు జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌గా గెలుపొందుతూ ఆంధ్రప్రదేశ్‌ కీర్తి పతాకాన్ని దశదిశలా ఇనుమడింపజేశారు.
1948లో జరిగిన కామన్‌వెల్త్‌ పోటీల్లో పాల్గొన్న తొలి ఆంధ్రుడు దండమూడి. రాష్ట్ర వెయిట్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌కు అనేక సంవత్సరాలపాటు ఉపాధ్యక్షుడిగా కొనసాగారు.
వెయిట్‌ లిఫ్టింగ్‌లోనే కాక బలప్రదర్శనలో విశేష ప్రతిభ కనబర్చారు. చాతికి గొలుసులు చుట్టి గాలిపీల్చడం ద్వారా చాతిని పెంచి వాటిని తెంపడం లాంటి సాహసకృత్యాలను దండమూడి అనేకం చేశారు. వెయిట్‌ లిఫ్టింగ్‌లో అర్జున అవార్డు గ్రహీత కామినేని ఈశ్వరరావు దండమూడి శిష్యుడిగానే శరరీ సౌష్టవంపై ఆసక్తి పెంచుకున్నారు. ఇదిలా ఉండగా వీరాభిమన్యు, నర్తనశాల తదితర చిత్రాల్లో భీముడి పాత్రను పోషించిన దండమూడి ప్రజల మన్ననలను చూరగొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు వ్యాయామశాలల ఏర్పాటుకు కృషిచేశారు. ఒలింపిక్‌ పోటీల అనంతరం విజయవాడలో ఉచిత వ్యాయామశాల నెలకొల్పారు. ప్రభుత్వం విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులో ఆయనకు ఇచ్చిన స్థలాన్ని మున్సిపల్‌ కార్పొరేషన్‌కు విరాళంగా ఇచ్చారు. దాంతో ఆయన పేరుతో కార్పొరేషన్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మించింది. వెయిట్‌ లిఫ్టింగ్‌లో ఆయన ‘ఆంధ్రభీమ, ఇండియన్‌ టార్జాన్‌’, ఇండియన్‌ హెర్క్యులస్,  జాయింట్‌ ఆఫ్‌ ఇండియన్‌ బిరుదులను పొందారు. అంతటి ఘనకీర్తిని కూడగట్టుకున్న ఆయన ఉయ్యూరు మండలంలో గండిగుంటలో 1916 అక్టోబర్‌ 14న జన్మించారు. ఉయ్యూరులో విద్యాభ్యాసం పూర్తిచేసి తర్వాత పెదపారుపూడి మండలం వానపాములలో తన సోదరి రంగమ్మ ఇంట ఉండి జాస్తి బాపయ్య, శిష్ట్లా సోమయాజులు ప్రభతుల ప్రోత్సాహంతో వెయిట్‌లిఫ్టింగ్‌ సాధన ప్రారంభించారు. 1981 ఆగస్టు 6న విజయవాడ లబ్బీపేటలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
కుటుంబ నేపధ్యం..
ఆయనకు ఐదుగురు సంతానం. వారిలో ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రెండో కుమారుడు అమెరికాలో, పెద్ద చిన్న కుమారులు విజయవాడలో స్థిరపడ్డారు. కుమార్తె అట్లూరి ఝాన్సీరాణి వానపాముల లో ఉంటూ  కొన్ని సంవత్సరాల క్రితం మరణించింది. ప్రస్తుతం ఆయన కూతురు మనుమడు రాజాజీ ఉంటున్నారు. మరో కుమార్తె ఆయన స్వగ్రామమైన గండిగుంటలో నివాసముంటున్నారు.
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –234

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –234
234-తన కళ్ళ తోనే ప్రేక్షక హృదయాలను గెలిచి ,రియలిస్టిక్ ‘’కళ్ళు ‘’సినిమాతో అదే ఇంటిపేరుగా మారి ,పగలు ఉద్యోగం ,రాత్రి నాటకాలేస్తూ,పేద కళాకారులకు సాయం చేసిన –కొల్లూరి చిదంబరం  ,
ళ్ళు చిదంబరం (అక్టోబర్ 10, 1945 – అక్టోబరు 19, 2015) తెలుగు హాస్య నటుడు. ఈయన మొదట నాటకరంగంలో నటించి, ఎం.వి.రఘు కళ్ళు చిత్రం లోని గుడ్డివాని పాత్ర ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యాడు. ఏప్రిల్ ఒకటి విడుదల చిత్రంలో పాత టీవీలు అమ్మేవాడి పాత్ర పోషించాడు. చిన్న పాత్ర ఐనా దానిద్వారా మంచి గుర్తింపు పొందాడు.[1]
నేపథ్యము
కళ్లు చిదంబరం అసలు పేరు కొల్లూరి చిదంబరం. 1945, అక్టోబర్ 10 న విశాఖపట్నంలో జన్మించాడు. ఆయన కళ్లు చిత్రం ద్వారా తెలుగు సినిమాల్లో తెరంగేట్రం చేశాడు. తన మొదటి సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకుని కళ్లు చిదంబరంగా గుర్తింపు పొందాడు. ఆయన 300లకు పైగా సినిమాల్లో నటించాడు. కళ్లు, అమ్మోరు, చంటి, గోల్‌మాల్ గోవిందం (1992), మనీ, పెళ్ళిపెందిరి, పవిత్రబంధం, పెళ్ళి చేసుకుందాం (1997), ఆ ఒక్కటీ అడక్కు, ఏప్రిల్ 1 విడుదల, గోవిందా గోవిందా, అనగనగా ఒక రోజు, అదిరిందయ్యా చంద్రం, అడవిచుక్క (2000), తొలిపరిచయం, చంటిగాడు (2003), ఐతే ఏంటి (2004), అతడెవరు (2007) తదితర చిత్రాల్లో నటించాడు. ప్రత్యేకమైన పాత్రలు పోషించి గుర్తింపు పొందారు.
మరణ0
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2015, అక్టోబరు 19 సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు[2].
కళ్లు లేని వాళ్ల ధీనావస్త ఎలా ఉంటుంది? అందునా పేదరికంలో ఉంటే ఇక వాళ్లకు దిక్కెవరు? అలాంటి  కొన్ని జీవితాల్లో ఎమోషన్‌ని అద్భుతంగా ఆవిష్కరించిన రియలిస్టిక్ సినిమా ‘కళు’్ల (1988). శివాజీ రాజా, ఎన్.జె.భిక్షు, రాజేశ్వరి, కళ్లు చిదంబరం కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గ్రేట్ సినిమాటోగ్రాఫర్ ఎం.వి.రఘు దర్శకత్వం వహించారు. డి.విజయ్‌కుమార్ నిర్మించారు. ఈ ఏడాదితో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది ఈ మేటి చిత్రరాజం.  ఇందులో శివాజీ రాజా నటనకు, గొల్లపూడి మారుతిరావు సంభాషణలకు చక్కని పేరొచ్చింది. ఈ సినిమాతోనే చిదంబరం కాస్తా ‘కళ్లు చిదంబరం’గా మారారు.
ఇండియన్ పనోరమ విభాగంలో ఈ సినిమా అప్పట్లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలోనూ ప్రదర్శితమైంది. ఉత్తమ చిత్రంగా, ఉత్తమ తొలి చిత్ర దర్శకత్వం విభాగాల్లో నందులు దక్కాయి. ఉత్తమ దర్శకుడిగా రఘు ఫిలింఫేర్ అందుకున్నారు. ఈ సినిమా పాటలు, సంగీతం మరో అద్భుతం. “చీకటోళ్ల లోకంలో కొత్త పొద్దు పొడుపురా.. అమావాస్య లోగిలిలో దీపావళి జాతరా..!” అంటూ ఎస్.పి.బాలసుబ్రమణ్యం స్వీయ ఆలాపనలో స్వరపరిచిన పాట హైలైట్. సీతారామశాస్త్రి రాసిన ఈ మెలోడీ హైలైట్.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది కామెడీ యాక్టర్స్ ఉన్నారు కానీ కొందరు మాత్రమే వల్ల అ హావభావాలతో, రూపురేఖలతో మనందరికీ బాగా గుర్తుండి పోతారు అలాంటి కమెడియన్ గా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఒక నటుడు ఎవరు అంటే అది కళ్ళు చిదంబరం గారు.ఆయన కళ్ళు అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఆ సినిమాలోని నటనకి నంది అవార్డు కూడా వచ్చింది ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించారు అయితే మొదటి నుంచి కళ్ళు చిదంబరం గారికి నటన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో తను పొద్దంతా జాబ్ చేస్తూ రాత్రి వేళల్లో నాటకాల్లో నటించేవారు చాలా రోజుల పాటు అలాగే చేయడంతో తన కళ్ళు అలా అయిపోయాయి అని ఆయన ఎప్పుడూ చెప్పుకొస్తూ ఉండేవారు కానీ ఆయన కళ్ళు అలా ఉండడం వల్లే సినిమాల్లో కమెడియన్ గా మంచి అవకాశాలు వచ్చాయి.
ఆయన తెలుగు సినిమాల్లో చేసిన కామెడీకి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఫలానా క్యారెక్టర్ ఉంది అంటే అది కళ్ళు చిదంబరం గారే చేయాలి అనేంతగా ఆయన నటనని చూపించి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించారు.ఆయన తెలుగులో చాలా సినిమాల్లో నటించారు ముఖ్యంగా ఎస్.వి కృష్ణారెడ్డి, ఇ.వి.వి సత్యనారాయణ, రేలంగి నరసింహారావు, కోడి రామకృష్ణ గారి సినిమాల్లో ఎక్కువగా నటించారు.ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చేసుకుందాం సినిమా లో కూడా కళ్ళు చిదంబరం ఒక మంచి క్యారెక్టర్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

తనదైన కామెడీతో జనాలు అందరికీ చాలా దగ్గర అయిపోయాడు.అలాగే కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు సినిమా లో మంచి క్యారెక్టర్ పోషించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు చివర్లో అయితే సౌందర్య రౌడీ చేతిలో ఇబ్బంది పడుతుంటే బొట్టు పెట్టమ్మా అనే డైలాగు చాలా ఫేమస్ అయిపోయింది.
ఆ ఒక్క సినిమాతో కళ్ళు చిదంబరం కొన్ని రోజులపాటు స్టార్ గా ఇండస్ట్రీలో గుర్తింపు పొందాడు.అయితే తను నటుడిగా నటిస్తూ సినిమాలో నాటకాల్లో వచ్చే డబ్బులతో పేద కళాకారులకు సహాయం చేసేవాడు తను మాత్రం తను చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన డబ్బు మాత్రమే తన జీవనానికి వాడుకొనేవాడని చెప్పేవాడు.అయితే ఆయన్ని ఇండస్ట్రీకి చెందిన చాలామంది చాలాసార్లు సన్మానించారు.ఇక కళ్ళు చిదంబరం చాలా మంది పేద కళాకారులకు కూడా తనకు తోచినంత సహాయం చేస్తారని చాలా మంది చెప్పుకుంటారు.
కళ్ళు చిదంబరం గారు 2015లో అనారోగ్యం కారణం వల్ల కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే ఆయనకి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు.కళ్ళు చిదంబరం ఇండస్ట్రీలో అందరితో చాలా కలివిడిగా ఉండేవాడు అని ఎవరితో ఎప్పుడు గొడవలు పెట్టుకునే వాడు కాదని అసలు కాంట్రవర్సీ లోనే నిలిచే వాడు కాదని ఇప్పటికీ చాలా మంది అంటుంటారు.

అయితే కళ్ళు చిదంబరం చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి చెందిన ఆయన కొడుకులు ఎవరు ఇండస్ట్రీకి రాలేదు ఫ్యూచర్ లో వస్తే రావచ్చు ఏమో.ఇండస్ట్రీలో అప్పుడు చాలా మంది కామెడీ యాక్టర్స్ ఉన్నప్పటికీ తనకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ తో జనాల్ని నవ్విస్తూ ఉండేవారు కన్ను డిఫరెంట్ గా ఉండడమే అతనికి ప్లస్ అయిందని ఆయన చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పారు.బ్రహ్మానందం
  బ్రహ్మానందం లేక మల్లికార్జునరావు ?బాంక్ ఆఫీసర్ గా ఉన్న సినిమాలో లోన్ కోసం వచ్చి నియోజకవర్గ ప్రజలను,కాకపొతే ఇద్దరు భార్యలు ,చాలకపోతే ,పిల్లల్నీ  హామీ గా పెడతాను అనే సన్ని వేశం కడుపుబ్బా నవ్విస్తుంది .ఇలా ఎన్నెన్నో పాత్రలలో తనదైన ముద్ర వేసి చిరకాలం గుర్తుండిపోయే చిరస్మరణీయ నటన ప్రదర్శించాడు కళ్ళు తో పాటు డైలాగ్ డెలివరీ కూడా తమాషా గా ఉండటం తో ‘’డబుల్ ప్లస్ పాయింట్ ‘’అయింది.అందుకనే అడిగి మరీ కేరక్టర్ ఇచ్చేవారు ఇండష్ట్రీ లో  .మానవత్వమున్న మంచి నటుడు కళ్ళు చిదంబరం .
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -2

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -2
విద్యాభ్యాసం
బంట్వాల్ పట్టణలక్షణాలన్నీ ఉన్న పల్లె ప్రాంతం .అక్కడి సుమారు 40సారస్వత బ్రాహ్మణ కుటుంబాలలో పంజే కుటుంబం ముఖ్యమైంది .రామప్పయ్యగారి పిల్లలు దైవభక్తీ సరస సౌజన్యాలకు పేరుపొందారు .పెద్దన్న కృష్ణారావు అభిప్రాయాలు,అలవాట్లలో గంభీరుడు .మంగేష్ రెండవ వాడు .తమ్ముళ్ళు శివరావు ,శ్రీనివాసరావు ,రాఘవేంద్ర ,తండ్రి చనిపోయేనాటికి పసి బిడ్డ చిన్న తమ్ముడు అందరూ మెరికల్లాంటి వాళ్ళు .చుట్టుప్రక్కలవారితో కలుపు గోలుగా ఉండేవారు .పచ్చని వాతావరణం ,నేత్రావతి సోయగాలు వారిని ఆకర్షించేవి .పంజే కు చురుకు తక్కువ .ఈత బాగా వచ్చినా చిన్నతమ్ముడు మునిగిపోతుంటే రక్షించటానికి వెళ్లి తానె మునిగాడు ..శంకర్ కూడా దూకి మునిగిపోగా దారిలో వెళ్ళే వారొకరు చూసి అందర్నీ కాపాడాడు .పంజే దైవభక్తితో ఇంట్లో ,గుడిలో నేర్చిన మంత్రాలుచదువుతూ ఉండేవాడు .తల్లినుంచి మరాటీ ,కన్నడ భక్తీ గీతాలు,సూక్తులు నేర్చాడు .స్వరం బాగుండేది .హాస్యంగా మాట్లాడి అందర్నీ నవ్వించే వాడు .ఆశుకవిత్వం లో పంజే సోదరులు దిట్టలు .సమస్యా పూరణం లో ఘటికులు .
పంజే తనకు వచ్చిన చదువు ఇతరులకు సులభంగా బోధించేవాడు .ఆయన ముఖ్యోపాధ్యాయుడుగా ఉన్న స్కూల్ లో ఆయన స్నేహితులు అనుసరించేవారు .ఆయన కవితా ప్రయోగాలు చాలాకాలం అక్కడి వారు జ్ఞాపకం ఉంచుకొన్నారు .ఇంటిపనులలో తల్లికి సాయం చేసేవాడు .స్వామి రధోత్సవానికి స్నేహితుల్ని పోగు చేసి హడావిడి చేసేవాడు .
ఉన్నత విద్యకోసం మంగుళూరులో తల్లివైపు బంధువుల ఇంట్లో ఉన్నాడు .మంచి స్కాలర్షిప్ లు పొందాడు .ప్రైవేట్లు చెప్పి కావలసిన డబ్బు సంపాదించేవాడు .కాగితంతో సహా అన్నిటికి కటకట.ఒకే పేజీలో రెండు సార్లు రాసేవాడు .గీతకు గీతకు మధ్య ఇంకు మార్చి రాసేవాడు .తనదగ్గర లేనిపుస్తాకాలు ఇతరుల దగ్గర తెచ్చి చదివి ఇచ్చేసేవాడు .జ్ఞాపక శక్తి,ధారణా బాగా ఎక్కువ .1892లో దాయాదుల వ్యాజ్యాలతో కలత చెంది తండ్రి చనిపోయాడు .వార్త తెలిసి అప్పటికే చివరి పడవ వెళ్ళిపోగా నడుచుకుంటూ వెళ్లి తండ్రిని చివరి చూపు చూసి ఆశీర్వాదం పొందాడు .చనిపోతూ తండ్రి ‘’మద్య౦ ముట్ట వద్దు . నిర్మలంగా నిజాయితీగా జీవించు. అన్నదమ్ముల్నిఅక్క చెల్లెళ్ళను జాగ్రత్త గా చూసుకో ‘’అని హితవు చెప్పాడు .చివరిదాకా నిజాయితీగా వీటిని పాటించాడు .
పెద్దన్న మద్రాస్ లో చదివి డిగ్రీ పొంది ,పెళ్లి చేసుకొని బొంబాయి స్టేట్ లో ఉద్యోగం లో చేరాడు .క్షణం తీరిక ఉండేదికాదు అన్న కృష్ణారావు కు .1894లో పంజే ఒక ప్రసిద్ధ కన్నడ పండితుడి చెల్లెల్ని పెళ్ళాడి ,ఎఫ్ ఎ పాసై పై చదువు కు కుటుంబ పోషణకు ప్రయత్నాలు చేసి ,లెక్కలలో డిగ్రీ పొందాలని ఉన్నా ,మంగుళూరు లో ఉన్న ఒకే ఒక డిగ్రీ కాలేజి సెయింట్ ఎలోషియస్ కాలేజిలో కన్నడ చరిత్ర అర్ధ శాస్త్రాలతో తృప్తి పడాల్సి వచ్చింది .పూర్తిగా డిగ్రీ పొందకుండా నే రెండు పార్ట్లు పాసై ,ప్రభుత్వకాలేజిలో సహోపాధ్యాయుడుగా ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉండటం వలన చేరి అందరికీ ఆశ్చర్యం కలిగించాడు .
ఉద్యోగం
పై ఉద్యోగానికి పంజే తో పోటీపడింది నందలికే లక్ష్మీ నారాయణప్ప తర్వాత కన్నడ సాహిత్యానికి గొప్ప సేవ చేసినవాడు .వీరిద్దరూ ఒకరికొకరు పోటీ అని తెలియదు .నందకిలే కు తనవలన అవకాశం పోయిందని తెలుసుకొని పంజే ఆయనకు ఒక తియ్యటి లేఖ రాస్తూ ‘’వడ్లు దంచే రోకలిని కన్నడ సాహిత్యాన్నీ బోధించటానికి ఎన్నుకున్నారు .నెమలి పింఛం తో తయారైన చిత్రకారుని కుంచెను చెవిలో గూలి తీసుకోవటానికి వదిలిపెట్టారు ‘’అని రాశాడు ఆతర్వాత ఇద్దరూ మంచి మిత్రులయ్యారు .అనేక వేదికలపై ఆయన్ను’’దక్షిణ కన్నడ జిల్లాలో నిజమైన కవి ‘’అని కీర్తించాడు .
పంజే జీతం నెలకు 20రూపాయలు .తల్లి పెద్దన్నయ్య దగ్గరకు ,ఒకసోదరుడు చదువుకోసం మద్రాస్ కు వెళ్ళగా పంజే ,భార్య,పిల్లలే మంగుళూరులో ఉన్నారు .వచ్చిన దానితోనే గుట్టుగా సంసారం లాగించేవాడు .కొంతకాలాని పంజే సోదరులిద్దరూ చనిపోయారు .కు౦గి పోయాడు కాని నిగ్రహించుకొన్నాడు .ఒక కవితాత్మక తత్వ గీతం రాశాడు .పంజే హెడ్మాస్టర్ అయి , జీతం మరో పది పెరిగి కొంత ఇబ్బంది తగ్గింది .ఉపాధ్యాయుడుగా స్థిర పడాలంటే ఎల్టి కావాలి అందుకని మద్రాస్ లో బంధువుల ఇంట్లో భార్యా ,పిల్లల్ని ఉంచి, తాను దక్షిణ కన్నడ విద్యార్ధి కూటం లో చేరి తొమ్మిదినెలలలో ట్రెయినింగ్ పూర్తయి ఎల్టి డిగ్రీ తీసుకొని మంగుళూరు చేరి ,ప్రభుత్వోద్యోగం లో స్థిరపడ్డాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-4-22-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –233 233-అవ్వయ్యార్ తో సినీ ప్రవేశం చేసి 15వందల పలుభాషా చిత్రాలలో నటించి ,జాతీయఅవార్డ్ పొంది హాలీవుడ్ సినిమాలో నూ నటించి ,బక్క నరసింహం అని తమిళనాట ,జుట్టు నరసింహం అని తెలుగు నోట అనిపించుకొన్న –ఓమకుచ్చి నరసింహన్

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –233

233-అవ్వయ్యార్ తో సినీ ప్రవేశం చేసి 15వందల పలుభాషా చిత్రాలలో నటించి ,జాతీయఅవార్డ్ పొంది హాలీవుడ్ సినిమాలో నూ నటించి ,బక్క నరసింహం అని తమిళనాట ,జుట్టు నరసింహం అని తెలుగు నోట అనిపించుకొన్న –ఓమకుచ్చి నరసింహన్

తెలుగు, తమిళ, మళయాల, కన్నడ మొదలైన 14 భారతీయ భాషలలో 1500 చలనచిత్రాలలో పనిచేశాడు. “ఇండియన్ సమ్మర్” అనే హాలీవుడ్ సినిమాలో కూడా నటించాడు. తెలుగు సినిమా రంగంలో “జుట్టు నరసింహం”గా స్థిరపడిన ఈ నటుడు తమిళ సినిమాలలో “ఓమకుచ్చి నరసింహన్”(బక్క నరసింహన్)గా సుపరిచితుడు.

ఇతడు తమిళనాడు రాష్ట్రం, కరూర్ జిల్లా, కట్టలై గ్రామంలో 1931లో జన్మించాడు. తన 13వ యేట అవ్వయార్ చిత్రంలో మొదటిసారి నటించాడు. చదువు పూర్తి చేసిన తరువాత కొంతకాలం జీవితభీమా సంస్థలో పనిచేశాడు. తర్వాత తన గురువు, నటుడు సురుళి రాజన్ ప్రోత్సాహంతో 1969లో తిరుకళ్యాణం అనే తమిళ సినిమాతో పునఃప్రవేశం చేశాడు. ఇతనికి భార్య సరస్వతి, కుమార్తెలు విజయలక్ష్మి, నిర్మల, కుమారుడు కామేశ్వరన్ ఉన్నారు. ఇతడు గొంతు కేన్సర్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన 78వ యేట 2009, మార్చి 11న మరణించాడు[1].

. ఏడాది కాలంగా గొంతు క్యాన్సర్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈయన ఆరోగ్యం క్షీణించి బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మంగమ్మగారి మనవడు వంటి చిత్రాల్లో కేవలం జుట్టుతోటే కామిడీ చేసిన ఆయన్ని మరిచిపోవటం కష్టమే. కొంతకాలం పాటు ఆయన పాత్ర లేకుండా రచయితలు సినిమా రాసేవారు కాదు. ఆ క్రమలంనే ఆయన సుమారు 1,500 తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాను పూర్తి చేసారు. ‘జుట్టు’ నరసింహంగా ఇక్కడ మనవాళ్లు గుర్తుపెట్టుకుంటే తమిళంలో ‘ఓమకుచ్చి నరసింహన్‌’ (బక్క నరసింహం) గా అలరించారు. ఇక ఆయన భారతీయ భాషలే కాకుండా ‘ఇండియన్‌ సమ్మర్‌’ అనే హాలీవుడ్‌ సినిమాలోనూ నటించటం విశేషం. తమిళంలో ప్రముఖ దర్శకుడు విసు దర్శకత్వం వహించిన ‘సంసారం అదు మిన్సారం’ చిత్రంలో నటనకుగాను జాతీయ అవార్డు అందుకోవ డం విశేషం. . చదువు పూర్తయ్యాక ఎల్‌ఐసీలో కొంతకాలం ఉద్యోగం చేశారు. తన గురువు, నటుడు సురుళి రాజన్‌ ప్రోత్సాహంతో 1969లో ‘తిరు కళ్యాణం’ తమిళ చిత్రంతో పునఃప్రవేశం చేశారు.

నటించిన తెలుగు సినిమాలు
· మంగమ్మగారి మనవడు (1984)

· కాష్మోరా (1986)

· అత్తగారూ స్వాగతం (1986)

· మన్నెంలో మొనగాడు (1986)

· ముద్దుల కృష్ణయ్య (1986)

· కృష్ణ లీల (1987)

· చక్రవర్తి (1987)

· సంసారం ఒక చదరంగం (1987)

· జీవన జ్యోతి (1988)

· దొరవారింట్లో దొంగోడు (1988)

· మురళీకృష్ణుడు (1988)

· రక్తతిలకం (1988)

· స్టేషన్‌ మాస్టర్ (1988)

· బాల గోపాలుడు (1989)

· ముద్దుల మావయ్య (1989)

· ఇదేం పెళ్లాం బాబోయ్ (1990)

· జస్టిస్ రుద్రమ దేవి (1990)

· పోలీస్ భార్య (1990)

· విష్ణు (1990)

· బలరామకృష్ణులు (1992)

· మావూరి మహారాజు (1994)

· మాతో పెట్టుకోకు (1995)

· పవిత్ర బంధం (1996)

· ఒకే ఒక్కడు (1999)

· దేవి (1999)

· భలేవాడివి బాసు (2001)

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –232 -నటనకు ఊపిరులూది ,ఎందరోనటులను తీర్చి దిద్ది ,నటిస్తూనే ఊపిరి వదిలేసిన ధన్యమూర్తి,యాక్టింగ్ గురువు ,దర్శకుడు –దీవి శ్రీనివాస దీక్షితులు

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –232

232-నటనకు ఊపిరులూది ,ఎందరోనటులను తీర్చి దిద్ది ,నటిస్తూనే ఊపిరి వదిలేసిన ధన్యమూర్తి,యాక్టింగ్ గురువు ,దర్శకుడు –దీవి శ్రీనివాస దీక్షితులు

దీవి శ్రీనివాస దీక్షితులు ప్రముఖ కమెడియన్, రైటర్ ఉత్తేజ్ బంధువైన డీఎస్‌ దీక్షితులు పూర్తి పేరు దీవి శ్రీనివాస దీక్షితులు. 1956లో దీవిహనుమంతాచార్యులు, సత్యవతమ్మ దంపతులకు గుంటూరు జిల్లా, రేపల్లెలో 1956, జులై 28 న జన్మించాడు. . నటుడిగా, యాక్టింగ్ గురుగా ఆయన ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే.

‘మురారి’ సినిమాతో పాపులర్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘మురారి’ చిత్రంలో పూజారి పాత్రలో నటించడంతో ఆయన ‘మురారి’ దీక్షితులుగా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. ఇంద్ర, ఠాగూర్‌, అతడు, వర్షం, పలు తెలుగు చిత్రాల్లో నటించారు. సంస్కత, తెలుగు భాషలలో రంగస్థల కళల్లో ఎం.ఏ. డిగ్రీలు పొందాడు. రంగస్థల నటుడిగా, అధ్యాపకుడిగా పేరు గడించాడు. రేపల్లెలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరరుగా పనిచేశాడు.

రంగస్థల ప్రస్థానం

నాటక రంగంలో సేవలు ఆంధ్రప్రదేశ్ థియేటర్ ఇన్‌స్టిట్యూట్‌లో డిప్లమా పూర్తి చేశారు. శకుంతలం, హరిశ్చంద్ర, కీలు బొమ్మలు లాంటి నాటకాల్లో నటించడంతో పాటు గోగ్రహణం, కొక్కొరొక్కో, వెయింటింగ్ ఫర్ గోడాట్ లాంటి నాటకాలకు దర్శకత్వం వహించారు.

ఆల్ ఇండియా రేడియోలో నటుడిగా పాల్గొన్నాడు. టి.వి.లో ఈయన నటించిన “ఆగమనం” సీరియల్ కు దాదాపు అన్ని నంది అవార్డులు లభించాయి. 2019లో మాటీవిలో వచ్చిన సిరిసిరిమువ్వలు ఈయన చివరి సీరియల్. ఎల్లమ్మ, మురారి, ఇంద్ర, ఠాగూర్, ప్రాణం, వర్షం, అతడు, గోపాల గోపాల బెండు అప్పారావు మొదలగు చిత్రాలలో నటించాడు

యాక్టింగ్ గురువుగా అక్కినేని యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్, రవీంద్ర భారతిలోని మీడియా యాక్టింగ్ సంస్థల్లో గురువుగా సేవలు అందించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ఆయన వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు.

ప్రముఖ తెలుగు సినీ, టీవీ, రంగస్థల నటుడు, యాక్టింగ్ గురు డీఎస్‌ దీక్షితులుదీక్షితులు 2019, ఫిబ్రవరి 18 సోమవారం సాయంత్రం నాచారంలోని రామకృష్ణ సినీ స్టూడియోస్‌లో ‘సిరిసిరి మువ్వలు’ సీరియల్ షూటింగులో నటిస్తూనే గుండెపోటుకు గురై మరణించాడు.[2][3][4]

మూలాలు

నాచారంలోని ఓ ఆసుపత్రికి దీక్షితులు తరలించారు. అయితే మర్గమధ్యంలోనే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఊహించని ఘటనతో ఒక్కసారిగా అంతా షాకయ్యారు.

ఈ విషయం తెలిసి హైదరాబాద్‌లోని దీక్షితులు నివాసానికి వేలాదిగా ఆయన శిష్యులు తరలి వస్తున్నారు. దీక్షితులు అంత్యక్రియలు తెనాలి పక్కన ఉన్న ఆయన స్వస్థలం కొల్కలూరులో దహన క్రియలు జరుగుతాయి.

ఊపిరి కూడా నటనకే అంకితం చేశారు ‘‘దీక్షితులు మాస్టారు మరణం ఎంతో బాధించింది. నేను నటిస్తూ నటిస్తూ పోవాలని ఉందని నాగేశ్వరరావు ఎప్పుడూ అనే వారు. అది వారి విషయంలో జరుగలేదు కానీ… దీక్షితులుగారి విషయంలో జరిగింది. దీక్షితులుగారు తన జీవితాన్ని, సంపాదనను, సర్వస్వాన్ని ఆఖరు ఊపిరి కూడా నటనకే అంకితం చేశారు. ఆయన మరణం బాధ కలిగించినా.. ఆయనకు నటనపట్ల ఉన్న అంకిత భావం ఆశ్చర్యం కలిగిస్తుంది.” అని సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు.

అవార్డులు – పురస్కారాలు

  1. శ్రీ కృష్ణతులాభారం పద్యనాటకానికి దర్శకత్వం వహించి 1999 నంది నాటకోత్సవాలలో ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ దర్శకుడు బహుమతులు
  2. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు
  3. గరికపాటి రాజారావు మెమోరియల్ అవార్డు
  4. రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం
  5. చైతన్య ఆర్ట్ థియేటర్ అవార్డు

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -1

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -1

వి సీతారామయ్య కన్నడ రచనకు డా.ఆర్వీ ఎస్ సుందరం తెలుగు అనువాదం ‘’పంజేమంజేష్ రావు ‘’పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడెమి 1981లో ప్రచురించింది వెల-4రూపాయలు .

పంజే మంగేష్ రావు పుట్టిన దక్షిణ కన్నడ జిల్లా మద్రాస్ ప్రావిన్స్ లో ఉండేది .పాలన మైసూర్ దే అయినా ఆజ్ఞలన్నీ మద్రాస్ నుంచే వచ్చేవి .కేరళకూడా అప్పుడు అందులోదే .

 పంజే సారస్వత బ్రాహ్మణుడు .మాతృభాష కొంకణి .మంగుళూరు లో వ్యవహార భాష తుళు.ఇది గుర్తింపు పొందనికన్నడ భాష .కొంకణిలో రోమన్ కేధలిక్ ,ప్రోటష్టంట్ అనే క్రైస్తవ భాష ,ఉచ్చారణలో తేడాఉన్న గౌడ సారస్వత భాష ఉన్నాయి .దక్షిణ కన్నడ జిల్లాలో ఉడిపి వరకు శైవ వైష్ణవులలో తుళు వాడుకభాష .గౌడ సారస్వతులకు వ్యాపారం బాంకింగ్ పరిశ్రమ రవాణా ఉన్నాయి .వీరిమధ్య పెళ్ళిళ్ళు జరిగిన దాఖలా లేదు .మతపరంగా ద్వైతం ,అద్వైతం అవటం కూడా కారణం కావచ్చు .హవ్యక బ్రాహ్మణులు పాత కన్నడం సంస్కృతం లలో దిట్టలు .ఐకమత్యమూ లేదు. కన్నడం కూడా వీరిని కలిపి ఉంచలేక పోయింది .హవ్యకేతరులలో బుద్ధి సూక్ష్మత ,ఉత్సాహం ఎక్కువ .వీరు మలయాళీయులతో తమిళులతో పోటీ పడాల్సి వచ్చేది .అందరికి న్యాయ ,కేంద్రస్థానం మాత్రం మద్రాస్ .స్కూళ్ళల్లో  బోధన కన్నడం .దక్షిణ భారతం లో రెండు చివర్లలో అంటే పశ్చిమాన మంగుళూరు ,తూర్పున మద్రాస్ ల మధ్యలో బెంగుళూరు ఉంటుంది .

  సారస్వతులు అందగాళ్ళు తెలివి తేటలున్నచిన్న శాఖ .మేదాపర జ్ఞాన సంపాదనలో విశిష్టులు .శాంతి ,మానవతా దృక్పధం ఎక్కువ .సాహిత్య కళా వైజ్ఞానిక ,రాజకీయ ,పాలన వ్యవహారాలలో అఖండులు .వారిలో ఆత్మీయత బాగా ఎక్కువ ,దక్షిణ కన్నడ జిల్లాకు బయట  బాంబే ధార్వాడ  ,బెంగుళూరు మద్రాస్ లలో బాగా వ్యాపి౦చారు  .అవి ఉన్నత విద్యకు సంస్కృతికి కేంద్రాలుగా ఉండేవి .సారస్వతులకు తమిళ మళయాళ కొంకణి ,మరాటా కన్నడాలలో మంచి పరిచయం ఉంటుంది .మరాటీ మీద కొందరికి ఎక్కువ పక్షపాతం ఉండేది .

 తుంగ భద్రకు ఈవల అవతల ఉన్న కన్నడ సీమ  లో అప్పట్లో కన్నడానికి పెద్ద ప్రాముఖ్యత ,గౌరవం లేదు .శుద్ధ కన్నడ ప్రాంతం మైసూరు లోనూ ఇదే పరిస్థితి .1870నుంచి మైసూర్ పాలన మద్రాస్ కు చెందిన దివాన్ల చేతిలో నే ఉండేది .మైసూర్ వారు ఇంగ్లీష్ ను బాగా ఆదరించారు .1799వరకు ఈ రెండుప్రాంతాలు ముస్లిం పాలకుల అధీనం లో ఉండటం  వలన ఇస్లాం ప్రభావం కూడాఎక్కువె .కన్నడం పై అభిమానం మాత్రం లోపల్లోపల ఉండిపోయింది .బెంగాల్ మహారాష్ట్ర లలో వచ్చిన కొత్త భావనలు కన్నడ పండితులు ,సాహిత్యవేత్తలు జీర్ణించు కోవటం మొదలు పెట్టారు .తమకున్న ఇంగ్లీష్ పరిజ్ఞానం తో ప్రాంతీయ భాషలో సృజనాత్మక శక్తిని ఆధునిక విజ్ఞాన సాధనంగా మలచటానికి ప్రయత్నించారు. అదృష్ట వశాత్తు దక్షిణ కన్నడ జిల్లాలో పంజే వంటి వారు కన్నడ భాషాభి వృద్ధికి పాటుపడే మహనీయులను సమీకరించారు .వివేకి సృజన శీలి అయిన పంజే సృజనాత్మక సాహిత్య సృష్టికి నిర్విరామ కృషి చేశాడు .

 పుట్టుక

22-2-1874 న సాంస్కృతిక ధార్మిక సాంప్రదాయ మధ్యతరగతి కుటుంబలో పంజే జన్మించాడు .పుణ్యక్షేత్రమైన సుబ్రహ్మణ్యానికి దగ్గర పల్లెటూరు లో పుట్టాడు .తర్వాత కుటుంబం 30మైళ్ళ దూరం లో ఉన్న బంట్వాల్ కు వచ్చి స్థిరపడింది .ఇది దక్షిణకన్నడ౦లొ నేత్రావతీ నది ఒడ్డున ఉంది .తండ్రి రామప్పయ్య దైవ భక్తుడు .తల్లి శాంత ఆదర్శ గృహిణి .తండ్రి మరణం తర్వాత ఆమె నలుగురుకోడుకులు ,ఇద్దరు కూతుళ్ళను పెంచి పెద్ద చేసింది .పితృ సంబంధ వ్యాజ్యాలలో ఆస్తి హారతి కర్పూరం అయింది .దేవాలయ అర్చకుడైన తండ్రి సంపాదనే అందరికి ఆధారం .తన ఆభరణాలు అమ్మి పొదుపు చేసిన డబ్బు సాయంతో ఒక ఇల్లు కట్టించింది .చిన్న కుటీరాలు రెండుకట్టి అద్దెకిచ్చి ఆ అద్దె డబ్బుతో పిల్లల్ని చదివించింది .అందరి గౌరవం మన్ననలు పొందిన ఇల్లాలామే .విజ్ఞాన ఖని అయిన ఆమె వద్దకు అనేకులు సలహాలకోసం వచ్చేవారు .భర్త ధర్మబద్ధ జీవిటం గడిపి పేరు పొందాడు .ఇలాంటి చక్కని వాతావరణం లో పంజే పెరిగాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-4-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –231

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –231

231-ఇద్దరమ్మాయిలు సినీ దర్శకుడు –పుట్టన్న

1970లో ఇద్దరు అమ్మాయిలు 1970లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి కప్పు బిలుపు (1969) అనే కన్నడ సినిమా మాతృక. ఇందులో వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసి అక్కినేని నాగేశ్వరరావుశోభన్ బాబుల సరసన నటించింది.

వాణిశ్రీ ద్విపాత్రాభినయం నాగేశ్వరరావు శోభన్ బాబు హీరోలు .రంగారావు గుమ్మడి సూర్యకాంతం నాగయ్య అల్లు వగైరా ఇతర నటులు .కధ-ఆర్యాంబ పట్టాభి .సంభాషణలు నరసరాజు .సంగీతం మహదేవన్ .దాశరధి ,కొసరాజు పాటలు రాశారు తెలుగులో సూపర్ హిట్ సినిమా .డైలాగ్స్ బాగా పేలాయి రెండు విభిన్న పాత్రలలో వాణిశ్రీ నట విశ్వరూపం చూపింది .పాటలన్నీ బాగా పాప్యులర్ అయ్యాయి .ముఖ్యంగా దాశరధి రాసిన –‘’నా హృదయపు కోవెలలో ,నా బంగారు లోగిలిలో ‘’బాగా మెప్పుదలపొందింది .ఈ సినిమా నేను కనీసం నాలుగు సార్లు అయినా చూసి ఉంటాను .ఇంతకీ డైరెక్టర్ ఎవరో చెప్పలేదు .పుట్టన్న .అంటే ఎస్.ఆర్ .పుట్టన్న కనగల్ –కర్నాటక ప్రముఖ దర్శకుడు .

 పుట్టన్న 1-12-1933లో పుట్టి 5-6-1985న చనిపోయాడు .అసలుపేరు శుభ్ర వేష్టి రామస్వామయ్య సీతారామ శర్మ .కానీ ఎస్ ఆర్ పుట్టన్న కనగాల్ గా ప్రసిద్ధుడు .కన్నడ సినిమాను కదిలించిన గొప్ప దర్శకుడు .మైసూర్ రాష్ట్రం లో కనగాల్ అనే చిన్న గ్రామం లో పేద బ్రాహ్మణ కుటుంబం లో పుట్టాడు .పొట్టకోసం టీచర్ గా క్లీనర్ గా చిన్న చిన్న పనులు చేశాడు .వీటివలన దియేటర్ లకు సినిమాలకు దగ్గరయ్యాడు .ప్రముఖ దర్శకుడు బి ఆర్ పంతులు వద్ద కారు డ్రైవర్ గా చేరి అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు .మొదటిసినిమా1957లో వచ్చిన  రత్నగిరి రహస్యం .నాగలక్ష్మిని పెళ్ళాడి అయిదుగురు సంతానానికి తండ్రి అయ్యాడు .కానీ 1970 లో ఆరతి అనే ప్రముఖ నటిని ప్రేమించి పెళ్ళాడాడు .యశశ్వినికి జన్మనిచ్చి తర్వాత ఇద్దరూ వేరయ్యారు .

1981లో రంగనాయకి సినిమా డైరెక్ట్ చేసినా హిట్ కాకపోయినా క్లాసిక్ అనే పేరొచ్చింది .ఆరతి ని వదిలేశాక పనిలేకుండా ఏడాదిన్నర గడిపాడు .తర్వాత శుభ మంగళ ,ధర్మ సేరె అనే బ్లాక్ బస్తర్ సినిమాలకు డైరెక్ట్ చేశాడు తర్వాత తీసిన మానస సరోవర బాగా ఆడలేదు ,అమృతకలిగే రుణ ముక్తాలు కూడా ఆవరేజ్ అనిపించాయి ,గజ్జేపూజ ,శరపంజర .చారిత్రాత్మక ,పౌరాణిక చిత్రాల ను చాలాగోప్పగా డైరెక్ట్ చేసిన పుట్టన్న చరిత్ర సృష్టించాడు కన్నడ ఫిలిం అసోసియేషన్ కు మొట్టమొదటి  డైరెక్టర్ పుట్టణ్ణ.మూడు సార్లు కన్నడ ఫిలిం ఫేర్ అవార్డ్ లు పొందాడు పుట్టన్న.బెస్ట్ స్క్రీన్ ప్లే కు ,బెస్ట్ ఫీచర్ ఫిలిం కు ,రెండుసార్లు జాతీయ స్థాయి అవార్డ్ లు పొందాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –229

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –229

229-ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నాదురై ,కరుణానిధి లతో తమిళ సిని స్క్రిప్ట్ రాయించుకొని ,తెలుగులో లేతమనసులు హిట్ చిత్ర దర్శకజంట,కలైమామణి అవార్డ్ గ్రహీతలు –కృష్ణన్ –పంజు

ఆర్.కృష్ణన్ (1909–1997), ఎస్.పంజు (1915–1984), జంటగా కృష్ణన్ – పంజు పేరుతో పిలువబడే భారతీయ సినిమా దర్శకులు. ఈ జంట హిందీ, దక్షిణ భారతీయ భాషలలో 50 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు.[1]దర్శకజంట,కలైమామణి అవార్డ్ గ్రహీతలు –కృష్ణన్ –పంజు

జీవిత విశేషాలు
ఆర్.కృష్ణన్ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై పట్టణంలో 1909, జూలై 18న జన్మించాడు.[2] మొదట్లో ఇతడు కోయంబత్తూరులోని పక్షిరాజా స్టూడియో (అప్పట్లో కందన్ స్టూడియోగా పిలువబడేది) లో లాబొరేటరీ ఇన్‌ఛార్జిగా పనిచేశాడు.[3] ఇతని కుమారుడు కె.సుభాష్ కూడా చలనచిత్ర దర్శకుడుగా పనిచేశాడు[4].

ఎస్.పంజు అసలు పేరు పంచాపకేశన్. ఇతడు కుంభకోణం సమీపంలోణి ఉమయాల్ పురంలో 1915, జనవరి 24న జన్మించాడు.[2] ఇతడు దర్శకుడిగా మారడానికి పూర్వం పి.కె.రాజాశాండో వద్ద సహాయ ఎడిటర్‌గా, ఎల్లిస్ ఆర్. దంగన్ వద్ద సహాయ దర్శకునిగా పనిచేశాడు. ఇతడు పంజాబి పేరుతో కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశాడు.[3][5][6]

వృత్తి
వీరిరువురూ కందన్ స్టూడియోలో పి.కె.రాజా శాండో దర్శకత్వం వహించిన మనునీధి చోళన్ (1942) అనే తమిళ సినిమాలో పనిచేశారు.[5] ఆ సమయంలో వీరిరువురూ మంచి మిత్రులుగా మారారు. వీరి పనితనాన్ని గమనించి రాజాశాండో తన తరువాతి ప్రాజెక్టు పూంపావై వీరికి ఆప్పజెప్పాడు. ఆ విధంగా పూంపావై (1944) దర్శకులుగా ఈ జంట మొదటి చిత్రం అయ్యింది.[7] 1947లో ఈ జంట పైతియక్కరన్ అనే సినిమాకు దర్శకులుగా పనిచేశారు.[8] 1949లో వీరు మిష్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ అనే అమెరికన్ రొమాంటిక్ కామెడీ సినిమా ప్రేరణతో నల్లతంబి అనే సినిమాను తీశారు. ఆ సినిమాకు సి.ఎన్.అన్నాదురై స్క్రిప్ట్ వ్రాశాడు. ఇది అతని మొదటి సినిమా. తరువాతి కాలంలో ఇతడు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[9] 1952లో వీరు దర్శకత్వం వహించిన పరాశక్తి సినిమాకు తమిళనాడుకు మరో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎం.కరుణానిధి సంభాషణలు వ్రాశాడు.[10][11] వీరు భాభీ, షాదీ వంటి హిందీ సినిమాలు కుడా దర్శకత్వం వహించారు. వీరికి 1960లో కలైమామణి పురస్కారం లభించింది.[1]

మరణాలు
1984, ఏప్రిల్ 6వ తేదీన ఎస్.పంజు చెన్నైలో మరణించాడు.[8] పంజు మరణం తర్వాత కృష్ణన్ ఏ సినిమాను తీయలేదు. అతడు 1997, జూలై 15వ తేదీన మరణించాడు.[1

తెలుగులో లేతమనసులు ,కాశ్మీర్ బుల్లోడు ,హిందీలో భాభీ ,బర్ఖా ,బిందియ ,మన్ మౌజి సుహాగ్ సిందూర్ ,షాదీ లాడ్లా తమిళం లో పూమ్ పావై ,నల్లతంబి ,పరాశక్తి ,రక్త కన్నీర్ ,కులదైవం ,తిలకం ,అన్నై,చక్రవర్తి వంటి అనేక హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు

230-పుణ్యవతి దర్శకుడు –దాదా మిరాశి

దాదా మిరాశి దర్శకత్వం లో నరసరాజు స్క్రిప్ట్ రాయగా రామారావు ,కృష్ణకుమారి శోభన్ రంగారావు హరనాద్ వగైరా నటించగా ఘంటసాల సంగీతం లో 1967 లో వచ్చిన చిత్రం పుణ్యవతి .నారాయణ రెడ్డి పాటలు .ఎంత సొగసుగా ఉన్నావు ,మనసుపాడింది ,ఇంతేలే నిరుపేదలు ,ఉన్నావా ఓ దేవా ఘంటసాల సుశీల స్వరమాదుర్యం లో ఆనంద వర్షం లో తడిపేశాయి .విషాదం గూడుకట్టుకొన్న పాట ఘంటసాల గానం లో మరోలోకం లోకి తీసుకు వెడుతుంది .

తమిళం లో దాదా మిరాశి డైరెక్ట్ చేసిన ‘’రాజ వీటు పిళ్ళై’’తెలుగులో పూలపిల్లగా 1968లో విడుదలైంది .తిరుమలేశ్వర ప్రోడక్షన్స్ పై షణ్ముగం,చెంగల్ రాయుడు నిర్మించారు .జైశంకర్ ,జయలలిత ,జయభారతి ముఖ్యనటులు .మాటలు రాజశ్రీ .సంగీతం ఎం ఎస్ సుబ్బయ్యనాయుడు ,రాజారాం.

1967లో దాదా దర్శకత్వం లో నిర్దోషి వచ్చింది .రామారావు సావిత్రి అంజలి వగైరా నటులు .నారాయణ రెడ్డి పాటలు ఘంటసాల సంగీతం .’’మల్లిక లారా మాలిక లారా మౌనముగా ఉన్నారా –మాకధలే విన్నారా ‘’సూపర్ డూపర్ హిట్ సాంగ్ .చిన్నారి క్రుష్ణయ్యరారా ,మా కన్నుఅల్లో వెలుగు నీవేరా ‘’కూడా హిట్ సాంగ్

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –229229-ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నాదురై ,కరుణానిధి లతో తమిళ సిని స్క్రిప్ట్ రాయించుకొని ,తెలుగులో లేతమనసులు హిట్ చిత్ర దర్శకజంట,కలైమామణి అవార్డ్ గ్రహీతలు –కృష్ణన్ –పంజు 

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –229
229-ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నాదురై ,కరుణానిధి లతో తమిళ సిని స్క్రిప్ట్ రాయించుకొని ,తెలుగులో లేతమనసులు హిట్ చిత్ర దర్శకజంట,కలైమామణి అవార్డ్ గ్రహీతలు –కృష్ణన్ –పంజు 
ఆర్.కృష్ణన్ (1909–1997), ఎస్.పంజు (1915–1984), జంటగా కృష్ణన్ – పంజు పేరుతో పిలువబడే భారతీయ సినిమా దర్శకులు. ఈ జంట హిందీ, దక్షిణ భారతీయ భాషలలో 50 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు.[1]దర్శకజంట,కలైమామణి అవార్డ్ గ్రహీతలు –కృష్ణన్ –పంజు 
జీవిత విశేషాలు
ఆర్.కృష్ణన్ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై పట్టణంలో 1909, జూలై 18న జన్మించాడు.[2] మొదట్లో ఇతడు కోయంబత్తూరులోని పక్షిరాజా స్టూడియో (అప్పట్లో కందన్ స్టూడియోగా పిలువబడేది) లో లాబొరేటరీ ఇన్‌ఛార్జిగా పనిచేశాడు.[3] ఇతని కుమారుడు కె.సుభాష్ కూడా చలనచిత్ర దర్శకుడుగా పనిచేశాడు[4].
ఎస్.పంజు అసలు పేరు పంచాపకేశన్. ఇతడు కుంభకోణం సమీపంలోణి ఉమయాల్ పురంలో 1915, జనవరి 24న జన్మించాడు.[2] ఇతడు దర్శకుడిగా మారడానికి పూర్వం పి.కె.రాజాశాండో వద్ద సహాయ ఎడిటర్‌గా, ఎల్లిస్ ఆర్. దంగన్ వద్ద సహాయ దర్శకునిగా పనిచేశాడు. ఇతడు పంజాబి పేరుతో కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశాడు.[3][5][6]
వృత్తి
వీరిరువురూ కందన్ స్టూడియోలో పి.కె.రాజా శాండో దర్శకత్వం వహించిన మనునీధి చోళన్ (1942) అనే తమిళ సినిమాలో పనిచేశారు.[5] ఆ సమయంలో వీరిరువురూ మంచి మిత్రులుగా మారారు. వీరి పనితనాన్ని గమనించి రాజాశాండో తన తరువాతి ప్రాజెక్టు పూంపావై వీరికి ఆప్పజెప్పాడు. ఆ విధంగా పూంపావై (1944) దర్శకులుగా ఈ జంట మొదటి చిత్రం అయ్యింది.[7] 1947లో ఈ జంట పైతియక్కరన్ అనే సినిమాకు దర్శకులుగా పనిచేశారు.[8] 1949లో వీరు మిష్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ అనే అమెరికన్ రొమాంటిక్ కామెడీ సినిమా ప్రేరణతో నల్లతంబి అనే సినిమాను తీశారు. ఆ సినిమాకు సి.ఎన్.అన్నాదురై స్క్రిప్ట్ వ్రాశాడు. ఇది అతని మొదటి సినిమా. తరువాతి కాలంలో ఇతడు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[9] 1952లో వీరు దర్శకత్వం వహించిన పరాశక్తి సినిమాకు తమిళనాడుకు మరో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎం.కరుణానిధి సంభాషణలు వ్రాశాడు.[10][11] వీరు భాభీ, షాదీ వంటి హిందీ సినిమాలు కుడా దర్శకత్వం వహించారు. వీరికి 1960లో కలైమామణి పురస్కారం లభించింది.[1]
మరణాలు
1984, ఏప్రిల్ 6వ తేదీన ఎస్.పంజు చెన్నైలో మరణించాడు.[8] పంజు మరణం తర్వాత కృష్ణన్ ఏ సినిమాను తీయలేదు. అతడు 1997, జూలై 15వ తేదీన మరణించాడు.[1
తెలుగులో లేతమనసులు ,కాశ్మీర్ బుల్లోడు ,హిందీలో భాభీ ,బర్ఖా ,బిందియ ,మన్ మౌజి సుహాగ్ సిందూర్ ,షాదీ లాడ్లా తమిళం లో పూమ్ పావై ,నల్లతంబి ,పరాశక్తి ,రక్త కన్నీర్ ,కులదైవం ,తిలకం ,అన్నై,చక్రవర్తి వంటి అనేక హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు
230-పుణ్యవతి దర్శకుడు –దాదా మిరాశి
దాదా మిరాశి దర్శకత్వం లో నరసరాజు స్క్రిప్ట్ రాయగా రామారావు ,కృష్ణకుమారి శోభన్ రంగారావు హరనాద్  వగైరా నటించగా ఘంటసాల సంగీతం లో 1967 లో వచ్చిన చిత్రం పుణ్యవతి .నారాయణ రెడ్డి పాటలు .ఎంత సొగసుగా ఉన్నావు ,మనసుపాడింది ,ఇంతేలే నిరుపేదలు ,ఉన్నావా ఓ దేవా ఘంటసాల సుశీల స్వరమాదుర్యం లో  ఆనంద వర్షం లో  తడిపేశాయి .విషాదం గూడుకట్టుకొన్న పాట ఘంటసాల గానం లో మరోలోకం లోకి తీసుకు వెడుతుంది .
తమిళం లో దాదా మిరాశి డైరెక్ట్ చేసిన ‘’రాజ వీటు పిళ్ళై’’తెలుగులో పూలపిల్లగా 1968లో విడుదలైంది .తిరుమలేశ్వర ప్రోడక్షన్స్ పై షణ్ముగం,చెంగల్ రాయుడు నిర్మించారు .జైశంకర్ ,జయలలిత ,జయభారతి ముఖ్యనటులు .మాటలు రాజశ్రీ .సంగీతం ఎం ఎస్ సుబ్బయ్యనాయుడు ,రాజారాం.
1967లో దాదా దర్శకత్వం లో నిర్దోషి వచ్చింది .రామారావు సావిత్రి అంజలి వగైరా నటులు .నారాయణ రెడ్డి పాటలు ఘంటసాల సంగీతం .’’మల్లిక లారా మాలిక లారా మౌనముగా ఉన్నారా –మాకధలే విన్నారా ‘’సూపర్ డూపర్ హిట్ సాంగ్ .చిన్నారి క్రుష్ణయ్యరారా ,మా కన్నుఅల్లో వెలుగు నీవేరా ‘’కూడా హిట్ సాంగ్
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –228 228- కావ్య శిల్పి ,రేడియో అనౌన్సర్ ,’’మానవుడు చిరంజీవి ‘’మూకాభినయ ఎక్స్పర్ట్ ,రణభేరి పంజరం లోపాప వంటి చిత్ర దర్శకుడు నిర్మాత ,కధారచయిత –టివి రామాయణ లఘు చిత్ర నిర్మాత -గిడుతూరి సూర్యం

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –228

228- కావ్య శిల్పి ,రేడియో అనౌన్సర్ ,’’మానవుడు చిరంజీవి ‘’మూకాభినయ ఎక్స్పర్ట్ ,రణభేరి పంజరం లోపాప వంటి చిత్ర దర్శకుడు నిర్మాత ,కధారచయిత –టివి రామాయణ లఘు చిత్ర నిర్మాత -గిడుతూరి సూర్యం

గిడుతూరి సూర్యం (1920-1997) రచయిత, కవి, సినిమా దర్శకుడు, నిర్మాత, స్వాతంత్ర్యసమరయోధుడు, అభ్యుదయ మానవతావాది. పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించాడు. ఆకాశవాణిలో అనౌన్సరుగా పనిచేస్తూ అనేక నాటికలు, నాటకాలు, సంగీత రూపకాలు రచించాడు. ఇతను రాసిన “మానవుడు చిరంజీవి” మూకాభినయ నాటికను రష్యా సినిమా బృందం చిత్రంగా చిత్రీకరించారు. గిడుతూరి సాహితీ పేరిట నాటకాలు, నాటికలు సంపుటాలుగా వెలువరించాడు.

సినిమా రంగం
రణభేరి, ఆస్తికోసం, కథానాయకురాలు, విక్రమార్క విజయం, పేదరాశి పెద్దమ్మ కథ, అమృతకలశం,నేను – నా దేశం, పంచ కళ్యాణి దొంగల రాణి, పంజరంలో పసిపాప, సంగీత లక్ష్మి, స్వామిద్రోహులు మొదలైన చిత్రాలకు దర్శకునిగా పనిచేశాడు. రాజేశ్వరి చిత్రానికి అనిసెట్టి సుబ్బారావుతో కలిసి పాటలను వ్రాశాడు. పంజరంలో పసిపాప, పంచ కళ్యాణి దొంగల రాణి సినిమాలకు కథ, చిత్రానువాదం సమకూర్చాడు. పంచ కళ్యాణి దొంగల రాణి చిత్రాన్ని నిర్మించాడు.

మనదేశంలో దూరదర్శన్ ప్రసారాలు ప్రారంభం కానున్న తొలిరోజులలో టి.వి కోసం భారతీయ నటులతో, రష్యన్ సాంకేతిక నిపుణులతో నలుపు తెలుపుల్లో మొట్టమొదటిసారిగా ‘రామాయణం’ లఘుచిత్రాన్ని నిర్మించాడు. ఇతడు మంచి చిత్రకారుడు కూడా. 1949లో ఇతడు హైదరాబాదు కుద్బీగూడలో పద్మశాలి ప్రింటింగ్ ప్రెస్‌ను స్థాపించాడు. ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకునిగా కూడా కొంతకాలం పనిచేశాడు. ఇతని రచనలు సుజాత, తెలుగు స్వతంత్ర, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఉదయిని, ఆనందవాణి తదితర పత్రికలలో ప్రచురితమయ్యాయి.

రచనలు

  1. చక్రఘోష (కావ్యం)
  2. నా విశ్వవిద్యాలయాలు (అనువాదం – మూలం:మాక్సిం గోర్కీ)
  3. అమృతమూర్తి
  4. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీవారి దివ్యసూక్తులు
  5. అమ్మా (కథ)
  6. కుమారుడి మరణం (కథ)
  7. త్యాగమూర్తి (కథ)
  8. పతిత (కథ)
  9. రజ్జు సర్ప భ్రాంతి (కథ)
  10. లోకం పోకడ (కథ)
  11. మానవుడు చిరంజీవి (మూకాభినయ నాటకము)

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –227 227-హాస్య బ్రహ్మ గారబ్బాయి ,మహా హాస్య రచయిత.కీర్తి శేషులు ,దంత వేదాంతం నాటక సృష్టికర్త ,150సినిమాలకు కధలందించి , 6 వేల సంవత్సరాల కాలెండర్ రూపొందించిన గణితమేదావి ,జ్యోతిష్ శాస్త్ర వేత్త,దృశ్యకావ్య ధురీణ –భమిడిపాటి రాదా కృష్ణ

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –227

227-హాస్య బ్రహ్మ గారబ్బాయి ,మహా హాస్య రచయిత.కీర్తి శేషులు ,దంత వేదాంతం నాటక సృష్టికర్త ,150సినిమాలకు కధలందించి ,

6 వేల సంవత్సరాల కాలెండర్ రూపొందించిన గణితమేదావి ,జ్యోతిష్ శాస్త్ర వేత్త,దృశ్యకావ్య ధురీణ –భమిడిపాటి రాదా కృష్ణ

భమిడిపాటి రాధాకృష్ణ బహుముఖ ప్రజ్ఞశాలి. భమిడిపాటి రాధాకృష్ణ 3 నాటకాలు, 6 నాటికలు రచించగా అవి కన్నడ, తమిళ, హిందీ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇదేమిటి, కీర్తిశేషులు, మనస్తత్వాలు, భజంత్రీలు, దంత వేదాంతం వంటి నాటికలు, నాటకాలు వ్రాశారు. రావుగోపాలరావు ‘కీర్తిశేషులు’ లోని ఒక పాత్రద్వారా మంచి పేరు తెచ్చుకుని సినీ పరిశ్రమలోనూ అడుగుపెట్టాడు.
· , నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు ప్రోద్బలంతో సినీ రంగంలోకి ప్రవేశించి 150 సినిమాలకు కథలందించారు. ఇందులో కె.విశ్వనాథ్‌ తొలి చిత్రమైన ఆత్మగౌరవం కూడా ఉంది. బ్రహ్మచారి, కథానాయకుడు, కీర్తిశేషులు, మరపురాని కథ, విచిత్ర కుటుంబం, పల్లెటూరి బావ, ఎదురులేని మనిషి, గోవుల గోపన్న, సీతారామ కళ్యాణం, నారీనారీ నడుమ మురారి, కాలేజీ బుల్లోడు వంటివితో సహా తెలుగు చిత్రాలకు కథలు వ్రాశారు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ లకు ఆయన సన్నిహితుడు. 1994 తర్వాత క్రమంగా ఆయన సినిమా రంగానికి దూరమయ్యారు.

· తనకు ఎంతో ఇష్టమైన గణిత రంగంపై మక్కువ చూపారు. భమిడిపాటి రాధాకృష్ణ క్యాలెండర్‌ పేరిట క్రీస్తుపూర్వం 45 నుంచి క్రీస్తుశకం 5555 వరకు అంటే ఆరు వేల సంవత్సరాల క్యాలెండర్‌ రూపొందించారు. జ్యోతిషరంగంలో కూడా ఆయనకి పట్టు ఉంది. సంఖ్యాశాస్త్రపరంగానే కాకుండా చిన్నారుల నామకరణ సమయంలో బియ్యంలో రాసే అక్షరాలను బట్టి కూడా ఆయన జాతకాలు చెబుతారనే పేరుంది.

· ఆయన 79 సంవత్సరాల వయస్సులో రాజమండ్రిలో మరణించారు . ఆయనకు భార్య, ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

సాహిత్య రచనలు
· భజంత్రీలు (నాటకం)

· దంత వేదాంతం (నాటకం)

· కీర్తిశేషులు (నాటకం)[2]

· మనస్థత్వాలు (నాటకం)

· తరం-అంతరం (నాటకం)

సినిమా రంగం

  1. ఆత్మ గౌరవం (1965) (డైలాగ్స్ రచయిత)
  2. మరపురాని కథ (1967)
  3. కథానాయకుడు (1969)
  4. అల్లుడే మేనల్లుడు(1970)
  5. ఆడజన్మ (1970)
  6. బొమ్మా బొరుసా (1971)
  7. రామరాజ్యం (1973)
  8. ఆడపిల్లల తండ్రి (1974)
  9. అల్లుడొచ్చాడు (1976)
  10. పొగరుబోతు (1976)
  11. మనిషి రోడ్డున పడ్డాడు (1976)
  12. సాహసవంతుడు (1978)
  13. షోకిల్లా రాయుడు (1979)
  14. నారి నారి నడుమ మురారి

అవార్డులు
· జంద్యాల మెమోరియల్ అవార్డ్. దృశ్యకావ్య ధురీణ బిరుదాంకితుడు .

·

కాలచక్రంతో పాటు గ్రహగతులనూ, జ్యోతిశ్శాస్త్రాన్నీ కూలంకషంగా అధ్యయనం చేసి అక్షరాలకూ, సంఖ్యలకూ బ్రహ్మముడులు వేస్తూ ఒక వ్యక్తి పేరులోంచి వారు పుట్టిన సమయాన్ని వెలికి తీసేందుకు తెలుగు భాషలోని 24 లక్షల 9 వేల 428 గుణింతాలతో కూడిన ఒక నిర్దిష్ట సూత్రం రూపొందించి దాని ఆధారంగా జాతకాలను అధ్యయనం చేస్తూ జ్యోతిశ్శాస్త్రంలో ఓ వినూత్న ధోరణిని ప్రవేశపెట్టి ఆ శాస్త్రం యొక్క విలువను ప్రపంచానికి అందిస్తూ ఎందరికో భవిష్యన్మార్గదర్శకం చేసింది ఒక ఆంధ్రుడేనంటే అది మనకు గర్వకారణం కదూ….

తప్పుల తడకలతో నడకలు సాగిస్తున్న ప్రపంచ కాలచక్రానికి గతులు సరిచేసే నిమిత్తం 45 బి.సి నుంచి 5,555 ఎ.డి వరకూ ఆంగ్ల క్యాలెండర్‌ను సరిదిద్ది భమిడిపాటి కేలెండర్‌ను రూపొందించిన మేటి విజ్ఞానవేత్త మన తెలుగుబిడ్డేనంటే ఈ ఘనతను మనం ఆస్వాదించవద్దూ ….

సూర్యుని చుట్టూ భూమి చేసే భ్రమణానికి పట్టే సమయం 365.25 రోజులనీ లేదా 365.2425 రోజులంటూ ప్రపంచం ఇప్పటి వరకూ నమ్ముతున్న సూత్రాలను తిరగరాసి, ఈ భ్రమణానికి 365.2422 రోజులు పడుతుందంటూ గణిత సూత్రాల ఆధారంగా నిరూపించి నిర్ధారించిన మహా శాస్త్రవేత్త, సాటిలేని ఈ జ్యోతిశ్శాస్త్ర ఘనాపాటి మన భమిడిపాటి రాధాకృష్ణ.

పుట్టిన తేదీ మరియు సమయంతో సహా ఒక జాతకాన్ని నలుగురైదుగురు జ్యోతిష్కులకిస్తే ఒకొక్కరూ ఒక్కో రకమైన అసంబద్ధ ఫలితాలను పేర్కొంటూ జ్యోతిశ్శాస్త్రంపై ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి తప్పుదోవ పట్టిస్తున్న తరుణమిది. ఈ నేపథ్యంలో పలువురు జ్యోతిష్య, పంచాంగ పండితుల బండారం బయటపెట్టడం ద్వారా ఈ శాస్త్రం కల్పితం కాదని, భాషా వ్యాకరణ, ఖగోళ, గణితశాస్త్ర సూత్రాలతో అనుసంధానమై నిర్దిష్ట ఫలితాలను నిక్కచ్చిగా అందించే విజ్ఞాన గని అని నిరూపించి తన వాస్తవిక దక్పథాన్ని నిరూపించుకున్న వ్యక్తిత్వం ఆయన సొంతం.

అటు నాటక – సినీరంగాల్లో మేటి రచయితగా సగానికి పైగా జీవితాన్ని సన్మాన, సత్కార్యాలతో గడిపిన శ్రీభమిడిపాటి రాధాకృష్ణ వ్యాకరణ, ఖగోళ, గణితశాస్త్రాలను అనుసంధానించి అధ్యయనం చేయడం ద్వారా జ్యోతిశ్శాస్త్ర మూలాలను మర్ధించి మేటి జ్యోతిశ్శాస్త్రవేత్తగా రాణించారు. విజ్ఞాన వీచిక అయిన శ్రీరాధాకృష్ణ అనుభవ గుళికలను ఎన్టీయార్‌, అమితాబ్‌బచ్చన్‌ వంటి వారితో సహా పలువురు విదేశీయులు సైతం అందుకొని అచ్చెరువొందారు. ఈ అపూర్వ విజ్ఞానవేత్త జీవిత విశేషాలను మీ కోసం అందించడం మా వంతు, ఆస్వాదించడం మీ వంతు.

పండిత పుత్ర
పండిత పుత్ర పరమ శుంఠ అన్న నానుడిని తిరగరాస్తూ అలనాటి హాస్యబ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వరరావుగారి ఏకైక పుత్రులైన శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ 14-11-1929 వ తేదీన రాజమండ్రిలో జన్మించారు. ఇక్కడి శ్రీ వీరేశలింగం ఉన్నత పాఠశాలలోను, తరువాత రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలోను విద్యాభాస్యం చేసి, 1949లో బీ.ఎస్సీ పట్టభద్రులయ్యారు. తండ్రి శ్రీ కామేశ్వరరావు ఖ్యాతిగాంచిన హాస్య రచయిత కాగా… వారి రచనాభినివేశాన్ని తన జీన్స్‌లోనూ జీర్ణించుకున్నారు. రాధాకృష్ణ.

వెయ్యికి పైగా ….
నాటక రంగం వరకూ చూస్తే …. రాసింది తక్కువే అయినా అన్నీ వాసికెక్కిన రచనలే కావడం శ్రీ రాధాకృష్ణలోని రచనా తృష్ణకు తార్కాణం. ఆయన మొదటి రచన భజంత్రీలు నాటిక. దీన్ని మొదటిసారిగా 25-2-1950 వ తేదీన రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజి పూర్వ విద్యార్థి వార్షికోత్సవ సందర్భంలో ప్రదర్శించారు. ప్రేక్షకుల ఆదారాభిమానాలు పుష్కలంగా లభించడంతో, ఆ ఉత్సాహంతోనే మనస్తత్వాలు, అంతా ఇంతే, దంత వేదాంతం, పెళ్ళి పందాలు, పేటెంటు మందు అనే ఆరు నాటికలు – ఇదేమిటి?, కీర్తిశేషులు, దైవ శాసనం అనే మూడు నాటకాలను రచించారు. ఇందులో 6 నాటికలు, 3 నాటకాలు ఆంధ్రదేశంలో అపూర్వ జనాదరణ పొందుతూ, ప్రతీ ఒక్కటీ వెయ్యి ప్రదర్శనలకి పైగా ప్రదర్శింపబడి నాటకరంగ ఖ్యాతిని ఇనుమడింప చేశాయి. ఇవిగాక తరం-అంతరం అనే మరో నాటిక కూడా వీరి కలం నుండి జాలువారింది.

అపురూప నాటకోత్సవం
1950 నుంచి 1970 వరకు ఆంధ్ర దేశంలో జరిగిన అనేక నాటిక నాటక పరిషత్తులలో, ఈ ఆరు నాటికలు, 3 నాటకాలు ఉత్తమ శ్రేణిలో ఎన్నో బహుమానాలు అందుకున్నాయి. దైవశాసనం నాటకం, గుడివాడలో జరిగిన 29వ ఆంధ్ర నాటక కళాపరిషత్తు మహాసభలో ఉత్తమ, రచన బహుమతిని పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని, 28-1-1952న రాజమండ్రిలో జరిగిన సన్మానసభలో, ఆ సభకి అధ్యక్షత వహించిన శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి ఆధ్వర్యాన, శ్రీ రాధాకృష్ణకి దృశ్య కావ్య ధురీణ అనే గౌరవ పురస్కారం జరిపారు. 1985లో జనవరి 12, 13, 14, 15 తేదీలలో రాజమహేంద్రవరంలో శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ నాటకోత్సవం జరిపించి, శ్రీ రాధాకష్ణ రచించిన 3 నాటకాలు, 6 నాటికలు వరసగా ప్రదర్శించడం ద్వారా రాజమండ్రి మయూరి కళాసమితి వారు తెలుగు నాటకరంగ చరిత్రలో మరో కొత్త ప్రయోగానికి నాంది పలికారు.

సినీరంగంలో అగ్రతాంబూలం
ఆత్మగౌరవం చిత్ర సంభాషణల రచయితగా, తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీ రాధాకష్ణకు లభించిన ప్రోత్సాహంతో మరో 150 చిత్రాలకు కథ, సంభాషణలు అందించారు. కథానాయకుడు, విచిత్ర కుటుంబం, బ్రహ్మచారి, ఎదురులేని మనిషి, గోవుల గోపన్న, సీతారామకళ్యాణం, బొమ్మాబొరుసా, నారీ నారీ నడుమ మురారి మొదలైనవి ప్రముఖ చిత్రాలలో కొన్ని మాత్రమే.

శ్రీ గుళ్ళ పూడి విజయకుమార్ చెప్పిన సంగతులు

ది భమిడిపాటి కేలెండర్‌
శ్రీ రాధాకృష్ణకి గణితశాస్త్రం అన్నా, ఆ శాస్త్ర పరిశోధనలన్నా చాలా మక్కువ. ఆ ఉత్సాహంతోనే, 45 ఆ.ఇ. నుంచి 5555 అ.ఈ వరకు రోజు వారి ఇంగ్లీషు కేలెండరును రూపొందించారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న ఇంగ్లీషు కాలెండర్‌లో తప్పు ఉందని రుజువు చేసి, దానిని సరి చేసుకొనే విధానాన్ని సూచిస్తూ 1990లో ది భమిడిపాటి కేలెండర్‌ను ఆంగ్లంలో పుస్తక రూపంలో ప్రచురించారు. జపాన్‌ మరియు లండన్‌ వంటి విదేశాల్లో ఈ క్యాలెండర్‌ విడుదలై, విక్రయించబడి సంచలనం సష్టించింది. ప్రపంచంలో ఇటువంటి ప్రయత్నం ఇదే తొలిసారికాగా వీరి అపూర్వ కృషి విజ్ఞులు, విమర్శకుల మన్ననలందుకుంది. ఇది ఆంధ్రులందరకూ గర్వకారణం.

పేరులోనే ఉంది…
జ్యోతిష్య శాస్త్రంలో కూడా గణితశాస్త్రం ముఖ్యమైన స్థానాన్ని అందుకుందన్న విషయాన్ని తీవ్ర అధ్యయనం, పరిశోధనల పిమ్మట రుజువు చేసుకున్న తదుపరి శ్రీ రాధాకృష్ణ ఆ జ్యోతిష్య శాస్త్రంలో పరిశోధనలు జరిపి – పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరులోంచి ఆ వ్యక్తి పుట్టిన సమయాన్ని గంటలు, నిమిషాల్లోనే గాక సెకన్లతో సహా శాస్త్రీయంగా తీసుకువచ్చారు. అపూర్వమైన ఈ కషిని, దేశ, విదేశాల్లో కూడా ప్రస్తుతించారు.

నిజం దిశగా…
జ్యోతిశ్శాస్త్రంలో పూర్వం నుంచీ ఉన్న ఆ శాస్త్ర గ్రంథాలైన సారావళి, బృహజ్జాతకం, పరాశర గ్రంథం, జాతక మార్తాండ, జాతక సర్వస్వం, జాతక చంద్రిక, కేరళీయం ఇత్యాది గ్రంథాల్లో నిర్దిష్ట అంశంపై పరస్పర విరుద్ధమైన ఫలితాలు పేర్కొనబడడం శ్రీ రాధాకృష్ణ గమనించారు. అనంతరం వాస్తవిక దక్పథంతో ఈ శాస్త్ర గ్రంథాల నిగ్గు తేల్చేందుకు 40 ఏళ్ల పైబడిన వారికి చెందిన 2,600 జాతకాలు, 72 మంది కవలల జాతకాలు సేకరించి పై గ్రంథాలు మరియు తన పరిశోధనల ప్రకారం అధ్యయనం చేసి నిర్దిష్ట ఫలితాలను చెబుతూ విశ్వసనీయ ప్రమాణాలకు నూరుశాతం చేరువగా జ్యోతిశ్శాస్త్రాన్ని తీసుకెళ్లారు. ఇది అపూర్వం.

అందుకున్న పురస్కారాలెన్నో…
నాటక – సినీ రంగాలకు తానందించిన విశిష్ట రచనలకు ఫలంగా రేలంగి ఆర్ట్స్‌ అకాడెమి, చాట్ల శ్రీరాములు ధియేటర్‌ ట్రస్టు (లైఫ్‌ అఛీవ్‌మెంట్‌ పురస్కారం), తెలుగు విశ్వ విద్యాలయం వంటి ఎన్నెన్నో సంస్థల నుంచి అత్యుత్తమ గౌరవాలను శ్రీరాధాకృష్ణ అందుకున్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో ఉత్తమ హాస్య రచయితగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీయార్ నుంచి పురస్కారం అందుకున్న శ్రీరాధాకృష్ణకు రాష్ట్ర ప్రజలు విశాఖలో కనకాభిషేకం చేసి నాటక – సినీ రంగాలను గౌరవించారు.

మరణాన్ని సైతం…
తన మరణాన్ని సూచించేలా అన్యాపదేశంగా సెప్టెంబర్ 4వ తేదీన గంట కోట్టేస్తానని ముందుగానే తన డైరీలో రాసుకున్న రాధాకృష్ణ రాతలు ఆయన నుదుటి మీద గీతలేనని ఎవరూ ఊహించలేకపోవడం గమనార్హం.

  • సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –226

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –226
226-మల్లీశ్వరి సినిమాలో పెద్దనామాత్యుడు ,రేడియో అన్నయ్య ,బాలానందం స్థాపకుడు –న్యాపతి రాఘవరావు
226 న్యాపతి రాఘవరావు (ఏప్రిల్ 13, 1905 – ఫిబ్రవరి 24, 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు, రచయిత.[1] – చాలామంది న్యాయపతి రాఘవరావు అని పొరబాటు పడుతారు .న్యాపతి రాఘవరావు అనేదే కరెక్ట్.వికీపీడియాలో కూడా పొరబాటున న్యాయపతి అనే రాశారు .
న్యాయపతి సుబ్బారావు ఆంద్ర భీష్మ బిరుదాంకితులు .స్వాతంత్ర్య సమరయోధులు .సంస్కరణ వాది,సాహితీ వేత్త
న్యాపతి రాఘవరావు  బిఎన్ రెడ్డి తీసిన మల్లీశ్వరి సినిమాలో పెద్దనామాత్యుడు గా నటించాడు .ఆతర్వాత నకా ఏమైనా సినిమాలలో నటించారో లేదో తెలియదు .మల్లి నాగరాజు లు ఒక సాయంత్రం బందీ మీద సంతకు వెళ్లి ,మాంచి గాలీవాన లో ఒక గుహలో తలదాచు కొంటారు అప్పుడు మల్లీశ్వరి అయిన భానుమతి కాలక్షేపం కోసం ‘’పిలచినా బిగువటరా ‘’జావళి పాడుతూ ,అభినయిస్తుంది .అనుకోకుండా కృష్ణ దేవరాయలు (శ్రీ వాత్సవ ),పెద్దనామాత్యుడు (న్యాపతి రాఘవరావు )అక్కడికి వస్తారు .మల్లి నృత్యం వారిద్దరికీ కనులపండువుగా కనిపిస్తుంది .అప్పుడు పెద్దన ‘’భళిరా ఎన్నాడుజారే నీ భువికి ‘రంభా రాగిణీ రత్నమేఖలయో ’అనే పద్యం ఆమెను గురించిపాడుతాడు .కృష్ణశాస్త్రి గారి రచన ఇది .
విశేషాలు
1905వ సంవత్సరం ఏప్రిల్ 13 న ఒరిస్సాలోని బరంపురం లో జన్మించాడు. తండ్రి న్యాపతి రామానుజస్వామి ప్రముఖ న్యాయవాది. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసాడు. 1934 లో కామేశ్వరితో పెళ్ళయింది. రేడియో అక్కయ్యగా ప్రుగాంచిన న్యాపతి కామేశ్వరి ఈమెయే. రాఘవరావుకి బాల్యం నుంచి పిల్లలంటే ప్రాణం. వారికి కథలు చెప్పటమన్నా, నటించి చూపటమన్నా మహా ఇష్టం. పాఠశాలలో వక్తృత్వ పోటీల్లో కథలు చెప్పే పోటీల్లో ప్రథమ బహుమతులన్నీ అతని సొత్తే.
రేడియో అన్నయ్య
డిగ్రీ అయ్యాక, మద్రాసు లో ది హిందూ పత్రికలో విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల తరువాత, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపై చేరాడు. ఆ రోజుల్లో బీ.బీ.సీ లోని పిల్ల కార్యక్రామాల తరహాలో మనదేశంలో కూడ రేడియో చిన్న పిల్లల కొరకు రేడియో ప్రసారలను ఆరంబించాలని అప్పటి ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంది. మద్రాసు రేడియోలో పిల్లల కార్య క్రమాలను దుర్గాబాయి దేశముఖ్ నిర్వహించేవారు. 1933 లో రాఘవ రావు, కామేశ్వరి జంటకు ఆ అవకాశం వరించింది. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందారు. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్…….. పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాపతి కామేశ్వరి అండగా నిలిచి ఆ కార్యక్రమాలను విజయవంతం చేసి రేడియో అక్కయ్య గా పేరొందారు. రేడియోలో పనిని వారు ఉద్యోగంగా కాకుండా ఒక ఉద్యమంగా భావించారు.
ఆటవిడుపు కార్యక్రమానికి శ్రోతల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దాంతోపాటే ఆ కార్యక్రమంలో పాల్గొనే పిల్లల సంఖ్యకూడా ఎక్కువ కావటంతో పది సంవత్సరాలలోపు పిల్లలకి శనివారం బాలానందం అనీ, పది సంవత్సరాలు పైబడిన వారికి మరో కార్యక్రమం పెట్టి బాలబాలికల సృజనాత్మక శక్తిని పెంపొందించే ప్రయత్నంలో ఈ రేడియో అన్నయ్య ఎంతో కృషి చేశాడు. వారిని ఒడిలో కూర్చోపెట్టుకుని లాలించి, ముద్దాడి, ముద్దు ముద్దు పాటలు పాడిస్తూ, వారి పాట కనుగుణంగా నోటితో రకరకాల ధ్వనులను చేస్తూ మధ్య మధ్యలో అగ్గిపెట్టితో చిత్రవిచిత్ర ధ్వనులు చేస్తూ ఆ కార్యక్రమం వింటున్న వారికి గిలిగింతలు పెట్టేవాడు. వాస్తవానికి ఆ కార్యక్రమం కోసం పిల్లలకన్నా పెద్దలే ఆతృతగా వేచి చూసేవారు.
రచనలు
రేడియో అన్నయ్య సృష్టించిన పాత్రల్లో మొద్దబ్బాయి, పొట్టిబావ, చిట్టిమరదలు, దొడ్డమ్మ శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయన బూరెల మూకుడు, కొంటె కిష్టయ్య, పిల్లలకే స్వరాజ్యం వస్తే, చీమ కథ, ఏనుగొచ్చిందేనుగు, బడి గంట, మడతకుర్చీ, రామూ సోమూ, పిల్లల దొంగ ఇంకా అనేక హాస్య నాటికలు, గమ్మత్తు నాటికలు, చిట్టి నాటికలు దాదాపు పన్నెండు వందలకు పైగా రచించి వాటిని పిల్లలతో వేయించాడు. దాదాపు పది చలన చిత్రాలలో కూడా పిల్లలచే వేషం వేయించాడు. అనేక గ్రామఫోను రికార్డులు ఇచ్చి పిల్లల బంగారు భవిష్యత్తుకు ఎవరూ, ఏ సంస్థా , ఏ ప్రభుత్వమూ చేయనంత కృషి సలిపాడు. 1940లో మద్రాసులో ఆంధ్ర బాలానంద సంఘం స్థాపించాడు.
బాలల కోసం పత్రిక
రేడియో కార్యక్రమాల అనంతరం అన్నయ్య చేపట్టిన మరో బృహత్కార్యం బాలల కోసం “బాల” పత్రిక ను ప్రచురించడం. అంతవరకూ పిల్లల కంటూ ఒక పత్రిక లేదు. బాలకేసరి అనే పత్రిక కొంతకాలం వచ్చినా అది వెంటనే ఆగిపోయింది. రేడియో అన్నయ్య పిల్లల పత్రిక అవసరం గుర్తించి 1945లో బాల పత్రిక స్థాపించి బాల సాహిత్యంలో అనేక ప్రయోగాలు చేశాడు. అది అపారమైన ప్రభావాన్ని చూపింది.
ఆంధ్ర బాలానంద సంఘం
రేడియో అన్నయ్య స్థాపించిన ఆంధ్ర బాలానంద సంఘం విజయభేరి మ్రోగించింది. 1956లో హైదరాబాదు లో బ్రాంచి కూడా వెలిసింది. అనంతరం ఈ విజయం గ్రహించి బాలబాలికల పత్రికల సంఘాల అవశ్యకతను గుర్తించి అనేక బాలానంద సంఘాలు ఏర్పడ్డాయి. బాలపత్రికలు ఎన్నో వెలిశాయి. జవహర్ బాలభవన్ (1966), ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ (1976) స్థాపనకు ఆయన విశేషమైన కృషి చేశాడు. ఆ సంఘంలో అనేక చక్కని కార్యక్రమాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. సంగీతం , నాట్యం, నాటకం, మేజిక్. హిప్నాటిజం రంగాల్లో కూడా శిక్షణనిస్తూ అదొక బాలల దైవమందిరంగా అలరారుతోంది.
బాలబాలికల ప్రగతికై పాటుబడిన న్యాపతి రాఘవరావుకు సంతానంలేదు. రేడియో అన్నయ్య , అక్కయ్యల కున్న లక్షల ఆస్తిని ఆంధ్ర బాలబాలికలకే ధారాదత్తం చేశారు. బాలబాలికల ఆటపాటలకు, సహజమైన వాళ్ళ కళాకౌశలానికి ప్రోత్సాహం అందించే వేదిక ఉండాలన్న ఆయన ఆశయానికి రూపకల్పనయే ప్రభుత్వం స్థాపించిన బాలల అకాడమీ.
మరణం
బాలానందం రేడియో అన్నయ్య 1984 ఫిబ్రవరి 24 న స్వర్గస్థుడైనాడు.
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –225

• 225-మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –225
• 225-పండంటికాపురం సినీ దర్శక ఫేం ,అఖిలభారత పురస్కార గ్రహీత,కుటుంబ కధా చిత్ర దర్శకుడు  –పి.లక్ష్మీ దీపక్
• 1972లో జి హనుమంతరావు పద్మాలయా బానర్ పై కృష్ణ విజయనిర్మల రంగారావు అనాలి గుమ్మడి జమున మొదలైన తారాగణం తో పి.లక్ష్మీదీపక్ దర్శకత్వం లో వచ్చిన ‘’పండంటికాపురం ‘’సినిమా ఆల్ టైంరికార్డ్ గా నిలిచి నేషనల్ ఫిలిం అవార్డ్ పొందింది . ఇందులో పాటలన్నీ సూపర్ హిట్ . సంగీతం కోదండపాణి.గోపి పాటలు రాశాడు .లక్ష్మీ దీపక్ తెలంగాణా లో పుట్టాడు .
పాటలు
1. ఆడే పాడే కాలంలోనే అనుభవించాలి తేనెలూరు – పి.సుశీల, ఎస్.పి. బాలు
2. ఇదిగో దేవుడు చేసిన బొమ్మా ఇది నిలిచేదేమో – ఎస్.పి. కోదండపాణి, పి.సుశీల
3. ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు – సుశీల, ఎస్.పి. బాలు
4. ఏవమ్మా జగడాల వదినమ్మో ఎగిరెగిరి పడతావు ఏందమ్మో – ఎస్.పి. బాలు, సుశీల
5. బాబూ వినరా అన్నాతమ్ముల కథ ఒకటి కలతలు లేని నలుగురు కలసి సాగించారు పండంటి కాపురం (సంతోషం) – ఘంటసాల బృందం
6. బాబూ వినరా అన్నాతమ్ముల కథ ఒకటి కలతలు లేని (విషాదం) – ఘంటసాల
7. మనసా కవ్వించకే నన్నిలా, ఎదురీదలేక కుమిలేను నేను, సుడిగాలిలో చిక్కినా నావలా – పి.సుశీల

• ఈ సినిమాతర్వాత లక్ష్మీ దీపక్ –ధైర్యవంతుడు ,తెలుగునాడు ,మహాపురుషుడు ,ధర్మచక్రం ,సన్నాయి అప్పన్న ,ఏడడుగుల అనుబంధం ,కార్తీక దీపం వంటి హిట్ చిత్రాలు డైరెక్ట్ చేశాడు ఇవికాక విన్తిల్లు సంతగోల ,ఈ కాలపు పిల్లలు ,నాకూ స్వాతంత్ర్యం వచ్చింది ,వయసొచ్చిన పిల్ల ,హారతి ,ఇంటికోడలు ,లైటర్ వీణ లో దర్శకత్వం వహించాడు తర్వాత గొప్ప చిత్రం ‘’గాంధీ పుట్టిన దేశం ‘’1973లో డైరెక్ట్ చేశాడు

• కృష్ణం రాజు ,లత ప్రమీల ,ప్రభాకరరెడ్డి ,పద్మనాభం నిర్మలమ్మ నటించారు .సంగీతం కోదండ పాణి .నారాయణ రెడ్డి శ్రీశ్రీ మైలవరపు గోపి పాటలు రాశారు .గోపీ రాసిన ‘’గాంధీ పుట్టిన దేశంరఘురాముడు ఏలిన రాజ్యం ‘’గీతం సుశీల గానం చేసి కలకాలం గుర్తుంది పోయేట్లు చేసింది .నారాయణ రెడ్డి రాసిన ‘’ఎవరిని అడగాలీ బాపూ మూగగుండేలో యేమని అడగాలి ‘’అర్ధవంతమైన గీతం శ్రీశ్రీరాసిన ‘’ఓరోరి గుంటనక్క ‘’దాశరధి రాసిన ‘’వలపే వెన్నెలలలాగా ‘’బాగా పాప్యులర్ అయ్యాయి .
• గూడు పుతాణి,జగత్ జంత్రీలు కూతురు కాపురం ,పచ్చని సంసారం సినిమాలు కూడా హిట్ చేశాడు లక్ష్మీ దీపక్ డైరెక్ట్ చేసి .
•   సశేషం
• మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-4-22-ఉయ్యూరు

• •         
• •         
• •         
• •         
• •         
• •         
• •         
• •         



,




Posted in రచనలు, సినిమా | Tagged | Leave a comment

2000 నాటక ప్రదర్శనలిచ్చిన నాటక నటి బిజీ టివి నటి -నాగమణి

2000 నాటక ప్రదర్శనలిచ్చిన  నాటక నటి బిజీ టివి నటి -నాగమణి 
— నాగమణి ప్రసిద్ధ రంగస్థల నటి.

జననం

1959జూన్ 6 న తూర్పు గోదావరి జిల్లాముమ్మిడివరం గ్రామంలో జన్మించారు.

రంగస్థల ప్రస్థానం

తన పదహారవ ఏట చదువెందుకు అనే వయోజన విద్యా ప్రచారక నాటికతో రంగస్థల ప్రవేశం చేసింది. తొలిదశలో ఎర్రంశెట్టి సుబ్బారావు దగ్గర అభినయరీతుల్లో మెళకువలు నేర్చుకున్న ఈవిడకి కన్యాశుల్కం నాటకం గుర్తింపు తెచ్చింది. ఆ నాటకంలో బుచ్చమ్మగా, మధురవాణిగా, పైటకూళ్లమ్మగా నటించింది. జె.వి. సోమయాజులుజె.వి.రమణమూర్తి వంటి ప్రముఖులతో నటించారు.

అత్తిలి కృష్ణారావు, బాబీ, కృష్ణ చైతన్య, కె.ఎస్.టి. శాయి, తల్లావజ్ఝుల సుందరం, తాళ్లూరి శివరామకృష్ణారావు, రామనాథం వంటి దర్శకుల నాటకాలలో విభిన్న పాత్రలు పోషించారు.

తన నట జీవితంలో 200 నాటకాలతో 2000ల ప్రదర్శనలు ఇచ్చింది.

స్వీయ దర్శకత్వంలో నాలుగో సింహం నాటికను హైదరాబాద్ లో జరిగిన నంది నాటకాలలో ప్రదర్శించారు.

ప్రస్తుతం టీవి ధారావాహికల్లో నటిస్తున్నారు.

నటించిన నాటకాలు

  1. సంధ్యాఛాయ
  2. అడవి దివిటీలు
  3. గారడి
  4. పావల
  5. భయం
  6. అసురసంధ్య
  7. డామిట్ కథ అడ్డం తిరిగింది
  8. రాజా ఈడిపస్
  9. సామ్రాట్ అశోక
  10. మహోదధి
  11. చీకటింట్లో నల్లపిల్లి
  12. హిరోషిమా
  13. శ్రీకృష్ణ రాయబారం (పద్య నాటకం)
  14. మైరావణ (పద్య నాటకం)

మొదలైన నాటకాలు

  మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -14-4-22-ఉయ్యూరు 

Posted in సమీక్ష | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –224 · 224- బకావళి గా గులేబకావళి లో పరిచయమైన రత్న –నాగరత్నం

 మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –224

·         224- బకావళి గా గులేబకావళి లో పరిచయమైన రత్న –నాగరత్నం

 ‘కలల అలలపై తేలెను మనసు మల్లె పూవై’ అంటూ సాగే ‘గులేబకావళి కథ’ చిత్రంలోని ఈ యుగళ గీతం వింటూ ఉంటే నిజంగానే మన మనస్సులు మల్లె పూలలా గాలిలో తేలిపోతున్నట్లే ఉంటుంది. ఈ పాటలో యన్.టి.ఆర్. శృంగారాభినయంతో పోటీపడి నటించింది ఆయన పరిచయ౦ చేసిన నూతన నటి నాగరత్నం (రత్న). ఈమె ప్రఖ్యాత సినీ నటి జి. వరలక్ష్మికి అక్క కూతురో లేక అన్న కూతురో నంటారు. యస్.వి. రంగారావు నటించిన మోడరన్ థియేటర్స్ వారి ‘మొనగాళ్ళకు మొనగాడు’చిత్రంలో చలం సరసన కూడా ఈమె నటించింది. ‘గులేబకావళి కథ’లో తడిసిన బట్టలతో కొలనులోనుంచి బయటకు ఠీవిగా నడచివచ్చేటప్పుడు ఈ ‘మదేభయాన’ మెల్లగా, పొందికగా, గంభీరంగా వేసే అడుగులు మళ్ళీ, మళ్ళీ చూడాలనిపిస్తాయి. ఆ చిత్రంలో ఈమె గంధర్వరాజు (మిక్కిలినేని) కుమార్తె. ఈ చిత్రానికి సముద్రాల రాఘవాచార్య (జూనియర్) రాసిన మాటలు, సి.నారాయణ రెడ్డి రాసిన పాటలు ప్రాణం. మంద్రంగా సాగే ఈ Slow Song ని పరిచయం చేయబూనడం నిజంగా మీ కళాభినివేశానికి మచ్చు తునక. చిన్ననాటి నుంచీ ఈ పాటంటే నాకూ ప్రాణం.నాకెప్పుడూ ఈ పాట నాలుకపై ఆడుతూనే ఉంటుంది. మీరు ఈ పాటను అక్షరీకరించే క్రమంలో మూడు చిన్నపొరపాట్లు దొర్లాయి. ‘ఎగసిపోదునో చెలియా.’అని , ‘ఝుమ్మనిపించే వెందుకు ?’అని, ‘సడి సవ్వడి’ అనీ వాటిని సవరించుకోవాలి. బహుశా టైపింగులో దొర్లిన భాషాపరమైన ఈ చిన్న తప్పిదాలదేముందిగానీ, ప్రధానంగా మీరు సవరించుకోవాల్సిన రెండు అవగాహనాపరమైన తప్పిదాల్ని పేర్కొనడం మాత్రం ఇక్కడ ఎంతైనా అవసరం. ‘గులేబకావళి కథ’ చిత్రానికి జంట సంగీత దర్శకులు జోసఫ్- కృష్ణమూర్తి. మీరు పేర్కొన్నట్లు విజయా కృష్ణమూర్తి కాదు. నేషనల్ ఆర్ట్ థియేటర్ (యన్. ఏ. టి.) బ్యానర్ పై యన్.టి. ఆర్. నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన చిత్రమిది. చిత్రం టైటిల్స్ లో యన్. టి. ఆర్. తమ్ముడు త్రివిక్రమరావు నిర్మాత అని పేర్కొన్నా, దర్శకుడి పేరుండదు.ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించినట్లు యన్.టి.ఆర్. ఆ తరువాత పలు సందర్భాల్లో పేర్కొన్నారు. యన్. టి. ఆర్. ఇదే బ్యానర్ పై నిర్మించిన ‘పాండురంగ మహాత్యం’ చిత్రానికీ, యన్. టి. ఆరే స్వస్తిశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ‘రేచుక్క- పగటిచుక్క’ చిత్రానికీ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. కాని, ‘గులేబకావళి కథ’ చిత్రానికి మాత్రం దర్శకులు యన్. టి. ఆరే. కనుక పాట చిత్రీకరణకు మీరు ఆయనకే హాట్సాఫ్ చెప్పాలి, కానీ కే. కామేశ్వరరావుకు కాదని మనవి.
– రవీంద్రనాథ్  అని నాగ రత్నం ను పరిచయం చేశారు రవీంద్ర నాథ్.

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –222 222-సెభాష్ సత్యం సంగీత దర్శకుడు ‘’మెకోలమెకోలా బం బుక బం ‘’పాట ఫేం –విజయా కృష్ణమూర్తి

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –222

 222-సెభాష్ సత్యం సంగీత దర్శకుడు ‘’మెకోలమెకోలా బం బుక బం ‘’పాట ఫేం  –విజయా కృష్ణమూర్తి

శభాష్ సత్యం

ఈ చిత్రంలోని పాటలకు విజయా కృష్ణమూర్తి సంగీతం కూర్చాడు.జి.విశ్వనాధం దర్శకుడు .మాటలు ఆత్రేయ రాస్తే ,పాటలు ఆత్రేయ ,దాశరధి ,కొసరాజు రాశారు .కృష్ణ ,రాజశ్రీ జంట .

No. Title Lyrics గాయకులు Length
1. “నాలో నిన్ను చూడు” పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 4:00
2. “మెకొలా మెకొలా బుం బుంక బుం” పి.సుశీల 5:00
3. “ఇటు రావె రావె బంగారు చిలకమ్మ” ఎల్.ఆర్.ఈశ్వరి, ఎ.ఎల్.రాఘవన్ 2:35
4. “కలలు నిజాలై కనులు వరాలై” పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 4:00
5. “ఎక్కడికో ఎందుకో ఈ పరుగు” ఘంటసాల 5:00
6. “కాలు వేసావా కాటు వేస్తాను” పి.సుశీల

·         223-గులేబకావళి సంగీత దర్శకుడు ‘’నన్ను దోచు కొందువటే వన్నెల దొరసాని ‘’’’’మదనా సుందర నా దొరా ‘’’సలామ లెకుం సాహెబుగారు ‘’పాటల ఫేం –జోసెఫ్ కృష్ణ మూర్తి

గులేబకావళి కథ

·         నేషనల్ ఆర్ట్ ధియేటర్ నందమూరి త్రివిక్రమ రావు నిర్మాతగా యోగానంద్ దర్శకత్వం లో రామారావు ,జమున నటించిన ఈ చిత్రం లో సినారె తోలి సారి తెరంగేట్రం చేశాడు .’’నన్నుదోచు కొందువటే వన్నెల దొరసానీ ‘’సాంగ్ సూపర్ డూపర్ హిట్ .కధ,మాటలు సముద్రాల .జమున యుక్తిమతి గా ,నాగరత్నం బకావలి గా నటించారు  ఈ చిత్రకథను మూకీ చిత్రంగా ఒకసారి (1924), హిందీలో రెండు సార్లు (1932, 1963), తమిళంలో రెండు సార్లు (1935 1955), పంజాబీలో ఒకసారి (1939), తెలుగులో రెండు సార్లు (1938, 1962) లో నిర్మించారు.

ఈ సినిమాకు సంగీతదర్శకత్వం జోసెఫ్ కృష్ణమూర్తి వహించగా, పాటలన్నీ సి.నారాయణ రెడ్డి రాశారు. జోసెఫ్ కృష్ణమూర్తికి సంగీత దర్శకునిగానూ, సినారెకు గేయ రచయితగానూ ఇదే తొలిచిత్రం.[2]
·         అంబా జగదంబా నా ఆర్తినే ఆలించవా.. ఏడి నా కన్నయ్య - పి. లీల
·         అనురాగపయోనిధి ఓ జననీ నీ పదమేనమ్మి ( పద్యం) - ఘంటసాల
·         ఈ ఆటలింక సాగవు మాముందు దొరబాబులంతా బందీలికముందు - ఎస్. జానకి బృందం
·         ఉన్నది చెబుతా వింటారా నే నన్నది ఔనని అంటారా - బి.వసంత బృందం
·         ఒంటరినై పోయాను ఇక ఇంటికి ఏమని పోను - ఘంటసాల
·         ఓ మదనా సుందరా నా దోరా నామది నిన్నుగని పొంగినదిరా - పి.సుశీల
·         కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై ఎగసిపోదునో చెలియా - ఎస్.జానకి, ఘంటసాల
·         - రచన: సి.నారాయణ రెడ్డి; గానం: ఘంటసాల, పి.సుశీల
·         మాతా జగన్మాతా ఓ మాతా జగన్మాతా నీకన్నా లోకంలో నాకెవరు - ఘంటసాల
·         సలామాలేకుం సాహెబుగారు బలే షోకుగా వచ్చారా - ఎస్. జానకి, ఘంటసాల బృందం
·         విన్నావా తత్వం గురుడా కనుగొన్నావా సత్యమ నరుడో నరుడా - బి. గోపాలం
·         సశేషం 
·         మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-4-22-ఉయ్యూరు 

·          

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –221 · 221-దేవ దాసు ,లైలా మజ్ఞు సంగీత దర్శకత్వ ఫేం –సి ఆర్ .సుబ్బరామన్

· 221-దేవ దాసు ,లైలా మజ్ఞు సంగీత దర్శకత్వ ఫేం –సి ఆర్ .సుబ్బరామన్

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –221

· సి.ఆర్.సుబ్బరామన్ లేదా సి.ఆర్.సుబ్బురామన్ (1921 – 1952) సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకులు. వీరు చిన్ననాటి నుండే ప్రతిభావంతులుగా హార్మోనియం వాద్యంలో నిపుణత పొంది హెచ్.ఎం.వి. మ్యూజిక్ కంపెనీలో హార్మోనిస్టుగా సేవలు అందించారు. పియానోలో కూడా పట్టు సాధించారు. సుబ్బరామన్‌ తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు సంతతికి చెందినవాడు.[1] మదురై సమీపంలోని చింతామణి ఆయన స్వస్థలం. శంకర్‌గణేశ్‌ ద్వయంలోని శంకర్‌, సుబ్బరామన్‌కు తమ్ముడు.

· 1943లో తమిళనాడు టాకీస్ సంస్థ వారు చెంచులక్ష్మి చిత్రాన్ని నిర్మించారు. చిత్ర నిర్మాణ సమయంలో చిన్నయ్య మరణించడం, తరువాత ఆ బాధ్యతలు స్వీకరించిన ఎస్.రాజేశ్వరరావు తప్పుకోవడం జరిగింది. దానితో సముద్రాల రాఘవాచార్య గారి ప్రోత్సాహంతో వీరు మిగిలిన పాటలు పూర్తి చేశారు.

· తరువాత తెలుగులో విడుదలైన రత్నమాల చిత్రానికి సంగీతం చేకూర్చి మధురమైన బాణీలతో అందరినీ అలరించారు. ఈ చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వీరి వద్ద సహాయకులుగా చేరారు. లైలా మజ్ను చిత్రం వీరిని ఆకాశానికెత్తింది. ఆ చిత్రానికి అరేబియన్ సంగీత పోకడలను ప్రవేశపెట్టారు. అలాగే పాశ్చాత్య సంగీతాన్ని మిళితం చేసి తెలుగు తెరకు నూతన వరవడిని దిద్దారు. సుబ్బరామన్‌కు సహాయకులుగా పనిచేసినవారంతా తరువాత గొప్ప సంగీతదర్శకులయారు. వారిలో ముఖ్యులు ఘంటసాల, విశ్వనాథన్‌, రామమూర్తి, సుసర్ల దక్షిణామూర్తి (వయొలిన్‌ వాయించేవారు), ఆర్‌.ఎస్‌.గోవర్ధనం, సుబ్రహ్మణ్యం (మేండొలిన్‌) రాజు, లింగప్ప తదితరులు.

· 1950లో వినోదా వారి చిత్ర నిర్మాణ సంస్థలో భాగస్వామి అయ్యారు. ఆ సంస్థ తెలుగు చిత్రాలలో మణిపూసగా పేర్కొనబడే దేవదాసు చిత్రాన్ని 1953లో విడుదల చేశారు. ఆ చిత్రానికి వీరి సంగీతం అత్యుత్తమమైనది.

· చిన్ననాటి నుండి బాధిస్తున్న మూర్ఛవ్యాధితో వీరు 1952 సంవత్సరంలో 29వ ఏట పరమపదించారు. ఆయనకు బాగా తాగుడు అలవాటుండేది. దేవదాసు చిత్రనిర్మాణంలో ఆయన ఒక వాటాదారు. ఈయన దేవదాసు సినిమా నిర్మాణం పూర్తికాకుండానే మరణించాడు.[2] ఆయనతో వివాహేతరసంబంధం ఉన్న ఒకావిడ ద్వారా సహనిర్మాతలు 1952లో ఆయనకు విష ప్రయోగం చేసి చంపించారని వదంతి.

విశేషాలు
· రీరికార్డింగ్‌ జరుగుతున్నప్పుడు తెరమీద చిత్రం చూస్తూ సుబ్బరామన్‌ “ఆశువుగా” పియానో మీద వాయించేవారట

చిత్రసమాహారం
· ప్రజారాజ్యం (1954)

· చండీరాణి (1953)

· దేవదాసు (1953)

· ధర్మదేవత (1952)

· ప్రేమ (1952)

· స్వప్నసుందరి (1950)

· శ్రీ లక్ష్మమ్మ కథ (1950)

· లైలా మజ్ను (1949)

· బాలరాజు (1948)

· రత్నమాల (1947)

· చెంచులక్ష్మి (1943)

· సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –218 218-వాహినీ చిత్రాల సంగీత దర్శకుడు ,సువర్ణమాల అదృష్ట దీపుడుసినిమా ల మ్యూజిక్ డైరెక్టర్ –అద్దేపల్లి రామారావు

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –218

218-వాహినీ చిత్రాల సంగీత దర్శకుడు ,సువర్ణమాల అదృష్ట దీపుడుసినిమా ల మ్యూజిక్ డైరెక్టర్ –అద్దేపల్లి రామారావు

-అద్దేపల్లి రామారావు అలనాటి ప్రముఖ చలనచిత్ర సంగీతదర్శకుడు. ఈయన ఓగిరాల రామచంద్రరావు, సాలూరి రాజేశ్వరరావు వద్ద కొన్ని చిత్రాలకు ఆర్కెస్‌ట్రా నిర్వాహకునిగా పనిచేశాడు, అదీ ఎక్కువగా వాహినీ వారి చిత్రాలకు. అలనాటి ప్రముఖ సంగీతదర్శకుడు ఎస్.పి.కోదండపాణి రామారావు సంగీతం అందించిన నా యిల్లు (1953) చిత్రంతో బృందగాయకునిగా చిత్రసీమకు పరిచయమయ్యాడు.[1]లనాటి సంగీత దర్శకుడు –అద్దేపల్లి రామారావు

సంగీతదర్శకునిగా
· సువర్ణమాల (1948)

· అదృష్టదీపుడు (1950)

· నా యిల్లు (1953)

· బంగారు పాప (1954)

· చింతామణి (1956)

ఆర్కెస్‌ట్రా నిర్వాహకునిగా
· గుణసుందరి కథ (1949)

· పేరంటాలు (1951)

· మల్లీశ్వరి (1951)

· పెద్ద మనుషులు (1954)

· మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –219

· 219-కవి ,రోషనారా ,తారా శశాంకం నాటక రచయిత,సినీ మాటలరచయిత ,బారిష్టర్ పార్వతీశం ,పత్ని సినీ సంగీత దర్శకుడు –కొప్పరపు సుబ్బారావు

జననం
ఈయన గుంటూరు జిల్లా అన్నవరం (పె.నం.)లో జన్మించాడు.

నాటకరంగ ప్రస్థానం
1921లో ఈయన వ్రాసిన చారిత్రక కల్పనాత్మక నాటకం రోషనార బాగా ప్రాచుర్యం పొందింది కానీ ఇది వివాదాస్పదమై సామాజిక వర్గాలలో ఉద్రిక్తలకు దారితీయటం వలన దీన్ని ప్రభుత్వం నిషేధించింది.[1] సుబ్బారావు హెచ్.ఎం.వి. వారి తెలుగు సంగీత విభాగానికి అధినేతగా పనిచేస్తూ ఒకేసారి పెక్కుమంది కళాకారులను ఆహ్వానించి ప్రజాదరణ పొందిన నాటకాలను, గేయాలను రికార్డు చేయిస్తుండేవారు.[2]

రచనలు
నాటకాలు

· తారా శశాంకం

· రోషనార

· నేటి నటుడు

· చేసిన పాపం[3]

· వసంతసేన

· నూర్జహాన్

· అల్లీ ముఠా (1944)

· శాస్త్రదాస్యం (1944)

· ఇనుపతెరలు[4]

సినిమారంగం
ఇతడు కొన్ని తెలుగు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.[5]

· పత్ని (1942) (సంగీత దర్శకుడు)

· భక్తిమాల (1941) (సంగీత దర్శకుడు)

· బారిష్టరు పార్వతీశం (1940) (సంగీత దర్శకుడు)

· చండిక (1940) (సంగీత దర్శకుడు, మాటల రచయిత)

· మాతృభూమి (1939) (సంగీత దర్శకుడు)

· . మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –220

· 220-మొదటి టాకీ భక్త ప్రహ్లాద సంగీత దర్శకుడు ,సుశీలను గాయనిగా పరిచయం చేసిన తొలితరం సంగీత దర్శకుడు – హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి

· అలనాటి తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. ఈయన సెప్టంబర్ 1914 వ సంవత్సరాన, కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట అనే ఊరిలో జన్మించారు. ఈయన పూర్తి పేరు “హోస్పేట రామశేష పద్మనాభ శాస్త్రి”. తొలుత ఈయన ఒక హార్మోనియం వాద్యకారుడు, రంగస్థల సంగీతదర్శకుడు. ఆయన మొట్టమొదటి తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. తెలుగులో మొట్టమొదటి టాకీ భక్త ప్రహ్లాద (1931)కు ఈయనే సంగీతదర్శకుడు. తెలుగే కాక ఇతర దక్షిణభారతీయ భాషా చిత్రాలకు కూడా ఈయన పనిచేశారు. కన్నడ రంగస్థల, చలనచిత్ర నటుడు ఆర్.నాగేంద్రరావు తొలి కన్నడ టాకీ సతీ సులోచన (1934) కి పద్మనాభశాస్త్రిని సంగీతం సమకూర్చడానికి కుదుర్చుకున్నారు, కానీ తర్వాత నాగేంద్రరావే ఆ పనిని చేశాడు, పద్మనాభశాస్త్రి అయనకు సహాయకునిగా పనిచేశాడు. మన తెలుగు సినిమా సంగీతానికి పునాది రాయి వేసిన వ్యక్తి హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి. ఈయన పూర్వీకులు పదహారణాల తెలుగువారు. అయితే తాత ముత్తాత లంతా హోస్పేటలో స్థిరపడిపోయారు. తమిళ చిత్రం కంకణమ్ (1947) తో గాయని పి.లీలను చలనచిత్ర రంగానికి పరిచయం చేశారు. శ్రీకృష్ణ తులాభారం (1955) చిత్రంలో సత్యభామ వేషం ధరించిన నటగాయని ఎస్.వరలక్ష్మి ఈయన సంగీతదర్శకత్వంలో స్థానం నరసింహరావు రచించిన సుప్రసిద్ధమైన మీరజాలగలడా నాయానతి పాట ఆలపించింది. 1970 వ సంవత్సరం వరకు కూడా ఈయన సంగీత విభాగంలోనే పనిచేసారు. కె.వి.మహదేవన్ కొన్నాళ్లపాటు పద్మనాభ శాస్త్రిని తన దగ్గరే పెట్టుకున్నారు. ఎంతో మంది సంగీత దర్శకులకు, సంగీత కళాకారులకు శిక్షణ ఇచ్చిన తొలితరం సంగీత దర్శకుడీయన. ఈయన సెప్టెంబర్ 14, 1970 వ సంవత్సరంలో కన్నుమూశారు.ద్మనాభ శాస్త్రి

చిత్రసమాహారం

  1. భక్త ప్రహ్లాద (1931)
  2. చిత్రనళీయం (1938)
  3. తెనాలి రామకృష్ణ (1941)
  4. ఘరానా దొంగ (1942)
  5. సుమతి (ఎన్.బి.దినకర రావుతో) (1942)
  6. [::kn:ರಾಧಾರಮಣ|రాధా రమణ] (1942)
  7. తాసిల్దార్ (1944)
  8. కంకణం (తమిళం) (1946)
  9. బిల్హణ (తమిళం) (1946)
  10. రక్షరేఖ (1949)
  11. నిర్దోషి (1951)
  12. పేద రైతు (1952)
  13. మంజరి (1953)
  14. శ్రీకృష్ణ తులాభారం (బాబు రావుతో) (1955)
  15. నాగపంచమి (ఎస్.వి.వెంకట్రామన్ తో) (1956)
  16. ప్రేమే దైవం (విజయభాస్కర్ తో) (1957)
  17. [::kn:ಪ್ರೇಮದ ಪುತ್ರಿ (ಚಲನಚಿತ್ರ)|ప్రేమద పుత్రి] (1957)
  18. అన్బే దైవం
  19. సతీ సావిత్రి (మరో ఏడుగురు సంగీత దర్శకులతో) (1957)
  20. భక్త రామదాసు (నాగయ్య, ఓగిరాల, అశ్వత్థామతో) (1964)

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-4-22-ఉయ్యూరు

·

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –217 217-‘’ఎన్నాసారు వాడూ డైలాగ్ ఫేం ,’’మీ అమ్మావాడు నాకోసం కని’’ ఉంటాడు ‘’’’పాట ఆగిందా మీ ఆట గోవిందా ‘’సాంగ్ ఫేం విలక్షణ హాస్యనటుడు –కెవి.

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –217

217-‘’ఎన్నాసారు వాడూ డైలాగ్ ఫేం  ,’’మీ అమ్మావాడు నాకోసం కని’’ ఉంటాడు ‘’’’పాట ఆగిందా మీ ఆట గోవిందా ‘’సాంగ్  ఫేం విలక్షణ హాస్యనటుడు –కెవి.చలం

మద్రాసు తెలుగు యాసను పట్టుకుని హాస్యం కలిపి ప్రాచుర్యం కల్పించి నవ్వించిన హాస్యనటుడు కె.వి.చలం. మామూలుగా అతను సరదాగా ఆ మాటలు మాట్లాడుతూ జోక్స్‌ చెప్పేవాడు. అల్లూరి సీతారామరాజు (1974) చిత్రంలోని పిళ్లే పాత్ర ఆ తెలుగులోనే మాట్లాడుతుంది. కె.వి.చలం ఆ పాత్ర ధరించి, ఆ భాష మాట్లాడ్డంలో గట్టివాడనిపించుకుని పేరు తెచ్చుకున్నాడు. అలాగే శివరంజని (78) సినిమాలోనూ చిత్రనిర్మాత పాత్రలో బాగా నవ్వించాడు. ఆ మాటలతో ఆ సినిమాలో ” మీ అమ్మావాడు నాకోసం కని ఉంటాడు” అనే పాట కూడా వుంది. (యాసతోనూ ఆ భాషలోనూ పాడింది బాలసుబ్రహ్మణ్యం) చాలా అలరించింది.

సినీ జీవితం

·          

చలం ముందు చిన్న చిన్న వేషాలు వేసినా, మొదటి నుండి హాస్యనటుడు కాడు. చిన్నప్పుడే కొంత నాటకానుభవం ఉంది. వ్యాపారరీత్యా మద్రాసు వచ్చాడు. మద్రాసు వచ్చిన తరువాత సినిమాల మీద మోజు పెంచుకున్నాడు. మద్రాసులో కూడా చిన్న చిన్న నాటకాల్లో వేశాడు. డాక్టర్‌ రాజారావు గారి బృందంలో నటించాడు. ఇంకొకరి ‘యాస’లో మాట్లాడ్డం సరదా ఉండేది. దాని కోసం చాలా సాధన చేసేవాడు. చలం విచిత్రమైన యాసలలో మాట్లాడటం చూసి హాస్య పాత్రలు ఇచ్చారు.

పేరు తెచ్చిన సినిమాలు

విజయావారి హరిశ్చంద్ర (1965)లో చిన్న వేషంలో కనిపించడంతో సినిమా ప్రవేశం జరిగినా, తేనె మనసులు (1965)తో బాగా తెలిశాడు. అందులో ఇంగ్లీషును తెలుగులా మాట్లాడే మేనేజరు వేషం వేసి “కమ్ము హియరూవాడ్డూయూ వాంటూ” అని చెప్పిన సంభాషణలకు చక్కటి నవ్వు వచ్చింది. అలాగే అతను బందిపోటు దొంగలు (1968) లో కూడా ‘మిస్టర్‌ అమెరికా’ అనే పాత్ర ధరించాడు. వచ్చీరాని తెలుగులో, ఇంగ్లీషు కలుపుతూ మాట్లాడే ఈ పాత్ర కూడా అతనికి రాణింపు తెచ్చింది. అక్కడి నుంచి కె.వి.చలం కమేడియన్‌గా మారి, వందకు పైగా చిత్రాల్లో హాస్య పాత్రలు ధరించాడు. కన్నెమనసులు (1966), స్త్రీ జన్మ (1967), నేనంటే నేనే (1968), మరపురాని కథమనుషులు మారాలిప్రేమకానుకభలే రంగడు (1969), పెద్దక్కయ్య (1970), వంటి చిత్రాల్లో హాస్యం మిళాయించిన పాత్రలు చేసి పేరు తెచ్చుకున్నాడు.దాసరి చిత్రం చిల్లరకొట్టు చిట్టెమ్మలో పాత్ర కె.వి.చలానికి మంచి పేరు తెచ్చింది.ఈయన కుమార్తె ‘దేవి’ కొన్ని చిత్రాల్లో నటించింది.

శైలి

చలం హాస్యం అనగానే అతిగా చేసేవాడు కాదు. ముఖ్యంగా సంభాషణ చెప్పడంలో తమాషా చేసేవాడు. భాషేమిటో తెలియనీయకుండా, చైనారష్యాలు, మలయాళం, బెంగాలీ మాట్లాడేవాడు. ఆ భాష వరసా, తీరూ అంతా సహజంగా వుండడంతో అతనికి ఆ భాష వచ్చుననే అంతా అనుకునేవాళ్లు. అతని కృషి అంతా అందులోనే. ఆ భాషలతో కాకపోయినా, మామూలు హాస్యపాత్రలు కూడా నటించాడు.

మరణం

సరదాగా మాట్లాడుతూ, తానూ నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ తిరిగిన కె. వి. చలం- దుర్మరణం పొంది అందర్నీ దిగ్భ్రాంతుల్ని చేశాడు! రాత్రివేళ, రైలుపట్టాలు దాటుతూ ఎలక్ట్రిక్‌ ట్రెయిన్‌ కింద పడి చలం ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెల్లారేసరికి విని, సినిమారంగం నివ్వెరపోయింది. అతని అకాలమరణానికి ఎంతగానీ బాధపడింది. అతని అంతిమయాత్ర చాలా గొప్పవాడికి జరిగినంత ఘనంగా జరిగింది. దాసరి నారాయణరావు పూనుకొని, ఘనమైన వీడ్కోలు జరిపించి, అతని కుటుంబాన్ని ఆదుకున్నారు

 సెట్స్ లో విడిగానూ స్పాంటేనియస్ గా డైలాగ్స్ కూర్చుకొని చెప్పటం చలం ప్రత్యేకత .ఒక సినిమాలో దాసరి ఆయనకు డైలాగులు రాయకుండా ‘’నువ్వే ఎదో ఒకటి మాట్లాడు ‘’అంటే అప్పటికప్పుడు సృష్టించిమాట్లాదిందర్నీ పగలబడి నవ్వేట్లు చేశాడు .ఒకసారి ఎవరో పెద్దాయన చనిపోతే దినం రోజునసినీ ప్రముఖుల్ని అందర్నీ ఆహ్వానించారు శోభన్ చలం కూడా ఉన్నారు .పిండాలను పళ్ళెం లోపెట్టి కాకులకోసం ఎదురు చూస్తుంటే అవి రావటం లేదు .అందరూ ఆకలితో ఉన్నారుఇన్తలొ చలం ‘’అవేమన్నా చలం ,మాడా లనుకోన్నారా పిలవగానే పరిగెత్తుకు రావటానికి ?’’అనగానే నవ్వులే నవ్వులు .శోభన్ ఎప్పుడూ చలాన్ని పిలిపించుకొని అతని స్పాంటేనియస్ జోకులతో చక్కగా కాలక్షేపం చేసేవాడు

చిలకా గోరింక సినిమా షూటింగ్ లో కొత్తహీరో కృష్ణం రాజు ఎస్వి రంగారావు కు దళాగ్ ఎలాచేప్పాలో చెప్పగాఎక్కదొ మండి,ఆయన భీష్మించుకు కూర్చుంటే ఎవరికీ ఏమి చేయాలో తోచకపోతే చలం వెళ్లి  రంగారావు తో ‘’మీకు సలహైస్తే ఇక్చాదుకానేఆ కొత్త హీరో నాకు సలహైస్తాడేమిటండీ’’అనగానే రంగారావు పిచ్చగానవ్విశూటింగ్ కొనసాగించాడు .తనమీద తను జోకులు వేసుకోవటం కూడా చలం ప్రత్యేకత .అజాత శత్రువు .అలాంటి కెవి చలం దారుణంగా చంపబడ్డాడు .ఆ మిష్టరీ విడిపోలేదు.రైల్వే యాక్సి డెంట్ మాత్రం కాదు . 

తెలుగు చిత్ర పరిశ్రమ లో ఏ జనరేషన్ లో అయినా డజన్ల కొద్దీ కమెడియన్స్ ఉండటం చాల సహజం అయిన విషయం, కానీ ఎవరి ప్రత్యేకత వారిది, పద్మనాభం, రాజబాబు, చలం, సమకాలికుడు అయిన కే.వీ.చలం తన తమిళ యాస తెలుగు తో చాల పాపులర్ అయ్యారు. కే.వి. చలం గారు కొన్ని విదేశీ భాషలు కూడా మాట్లాడే వారు తెలియని వారు నిజమయిన భాష అనుకొనే విధంగా భ్రమింప చేసే వారు, అయన సెట్ లో ఉంటె నవ్వులే నవ్వులు.కే.వి.చలం గారు వ్యాపార రీత్యా మద్రాసు చేరారు, కానీ విధి మరియు నటన పట్ల ఆయనకు ఉన్న మక్కువ సినిమా వైపు నడిపించింది.అల్లూరి సీతారామ రాజు, శివరంజని చిత్రాలలో వారు పోషించిన తమిళియన్ పాత్రలు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి.దాసరి గారు కే.వి. చలం గారికి మంచి మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. అందాల నటుడు శోభన్ బాబు గారి కి అత్యంత సన్నిహితం అయినా నటుడు కే.వి.చలం గారు. వెండి తెర మీద బయట కూడా నవ్వులు పూయించిన కే.వి.చలం గారి జీవితం అర్ధాంతరం గ కోడంబాకం రైల్వే ట్రాక్ పైన ముగిసిపోయింది. అయన జీవితం ఒక నవ్వుల పుష్ప గుచ్ఛం అయితే, అయన మరణం మాత్రం ఒక మిస్టరీ గ మిగిలింది. తెలుగు చిత్ర పరిశ్రమను విషాదం లో ముంచిన అయన మరణం చివరగా అయన అంతిమ యాత్ర కూడా ఒక సినిమా కు పనికి వచ్చింది.మరణించే వరకు నటించటం కాదు, మరణానంతరం కూడా తేరా మీద కనిపించిన ఒకే ఒక నటుడు కే.వి. చలం గారు. అయన చనిపోయిన టైం లో దాసరి గారి డైరెక్షన్ లో “అద్దాల మేడ” అనే సినిమా  లో నటిస్తున్నారు, ఆ సినిమా ఇతివృత్తం మొత్తం ఒక సినిమా షూటింగ్ ఆధారితం, అవుట్ డోర్ షూటింగ్ కోసం ఒక గ్రామానికి వెళ్లిన చిత్రం యూనిట్ కు విచిత్రం అయినా అనుభవాలు ఎదురు అవుతాయి. తనకు అత్యంత ప్రీతిపాత్రుడు అయిన చలం గారి మరణం కూడా అక్కడ జరిగిన ఒక సంఘటన గ చిత్రీకరించారు దాసరి గారు.మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ పాలుగొన్న అయన అంతిమ యాత్ర ను చిత్రీకరించి ఆ సినిచిత్రీకరించి ఆ సిని  మా లో చూపించారు దాసరి గారు. ఇంత కంటే గొప్ప నివాళి ఏముంటుంది ఒక నటుడికి. 

Posted in సినిమా | Tagged | Leave a comment

  మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –తేనే మనసులు సినిమాలో నటులు -205నుంచి 216వరకు

  మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –తేనే మనసులు సినిమాలో నటులు -205నుంచి 216వరకు

  అంతా కొత్తవాళ్లే నటించిన తోలి తెలుగు చలన చిత్రంబాబూ మూవీస్ ’’తేనెమనసులు ‘’

ముళ్ళపూడి:- 

  బాబూమూవీస్‌ సంస్థ రూపొందింది. ఆంధ్ర దేశాన్ని ఊపివేసిన “మంచిమనసులు” చిత్రం పుట్టింది.

ఆ విజయోత్సాహంలోంచే ఆంధ్రులు ఈనాడు సగర్వంగా “మాది” అని చెప్పకుంటున్న “మూగమనసులు” జన్మించింది. అందులోంచే, రేపు ప్రేక్షకులు, పరిశ్రమ సుహృదయపూర్వకంగా స్వీకరించనున్న బాబూమూవీస్‌ బహుమతి – “తేనెమనసులు” నటబ్బందం రూపొందబోతున్నది. 

     చొరబడ్డపుడు ఆదుర్తికి సుబ్బారావే తోడు. మూగమనసులు” షూటింగుకు పాపికొండల సుడిగుండాల మధ్యకు పడవ మీద వెళ్ళిపోతున్న సుబ్బారావుకు చుక్కాని అదుర్తే. వాళ్ళకి గురి కుదిరితే, మరొకళ్ళ మాటవినరు. అసలు వాళ్ళిద్దరికీ భయం లేదు. యే భయం లేదు. ప్రాణభయం, ఆరోగ్య భయం, డబ్బు భయం లేవు. ఉన్నదల్లా పని గురించిన భయం. పీరు గురించిన భయం. ఒకళ్ళను నొప్పిస్తామన్న భయం. ఇవాళ అర్థబలం అంగబలం, దండిగా ఉండగా ఆయనకెంత ధైర్యసాహసాలున్నాయో, అవి రెండూ లేనినాడూ అంతే ఉండేవి. ఆదుర్తినీ సుబ్బారావునీ వేరుచేసి మాట్లాడడం, పాలూ నీరూ వేరు చెయ్యడంకన్న కష్టం. వ్యక్తిగా ఆయన జీవించే ప్రతి క్షణానికీ దర్శకుడుగా ఆయన చిత్రించే చిత్రం ప్రతి అంగుళం మీద ప్రభావం వుంటుంది. చైతన్యం, వేగం, ఉత్సాహం, ఆనందం వ్యక్తి లక్షణాలు. ఆయన చిత్రాలు కూడా అంత చైతన్యవంతంగా వుంటాయి. గంటకి గంటన్నర వేగంతో పరిగెడతాయి. ఆ చైతన్యం ఆ ఉత్సాహం నీరసంగా కూర్చున్న ప్రేక్షకుడిని కూడా లేపి నిటారుగా కూర్చోబెడుతాయి. జీవితంలో ఆయన ఎన్నో కష్టాలుపడ్డా ఎప్పుడూ ఆనందంగా తిరిగాడు జిడ్డు, తోముడూ ఎరగడు. అందుకే ఆయన చిత్రంలో విషాద సన్నివేశాలు విసుగెత్తకుండా ఉంటాయి. ఆసలు చలన చిత్రాలు ప్రధానంగా ప్రజల వినోదం కోసమేనని ఆయన నమ్మకం. జీవితానికి కూడా అందంగా (ఫ్రేము కడితే చూడడానికి అందంగా ఉంటుందని, అలాగే ఉండాలని ఆయన వాదం. సినిమా కళ కాదని వాదం, ‘కాదుసుమా కళ కాదు సుమా అంటాడు ఆయన నవ్వి కాదన్నంత మాత్రాన కాదని కాదు. నిజమైన కళ అనేది చాలా వ్యక్తిగతమైనది. కొద్దిమందికే అందుతుంది. అందరూ చూసి ఆనందించేది పై అర్థం ప్రకారం ఐతే కళకాదు. ఇదీ ఓ కళే అని ఒప్పుకుంటే, చాలా గొప్ప కళ అంటారు. అందుకే అన్ని వర్గాల స్థాయిల అభిరుచులవారూ ఆనందించదగిన సర్వజనరంజన శృతిలో మేళవించి ప్రస్తరిస్తారాయన.

“తేనెమనసులు”కు కొత్త నటులు కావాలని బాబూ మూవీస్‌ వారు ఒకే ఒక్కసారి ప్రకటన చేయగానే నాలుగైదు వారాలలో ఐదువేల మంది ఫోటోలతో దరఖాస్తులు పంపారు. వారిలో జొత్సాహిక నటులు, విద్యార్థులు, అధ్యాపకులు, ఏడెనిమిది నందల జీతం తెచ్చుకునే పెద్ద ఉద్యోగస్తులు ఎందరో వున్నారు. 

  ‘వీరిలో నుండి నూటయాభై మందిని ఎన్నిక చేసి, వారికి మద్రాసు, హైదరాబాదులలో ్కీన్‌టెస్టులు తీశారు. అంటే ఒక్కొక్కరిచేత ఒక్కొక్క ఘట్టం నటింపచేసి సినిమా తీశారు. ఆ చిత్రాలన్నిటినీ రెండు వారాలపాటు తిరిగి ప్రదర్శించి చూసి వారిలో పన్నెండుమందిని ఎన్నుకున్నారు. వీరుకాక అర్హులు, సమర్జులు ఇంకా ఎందరో ఉన్నారు.

‘తేనెమనసులు’ కథ దృష్ట్యా అందులో పాత్రలకు తగిన వారిని ఎన్నుకోవాలి కాబట్టి, అది ఒక ప్రధాన సూత్రంగా ఈ పన్నెండుగురి యెన్నిక జరిగింది. వీరిలో కొందరికి రంగస్థల అనుభవం వుంది. కొందరికి లేదు. 

అందరికీ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, కో డైరెక్టర్‌ కె.విశ్వనాథ్‌, నృత్య దర్శకుడు హీరాలాల్‌ మూడు నాలుగు మాసాల పాటు శిక్షణ ఇచ్చారు. కూర్చొనడం, లేవడం, నడవడం దగ్గర నుండి నృత్యాల వరకూ నేర్పారు. సంభాషణలు చెప్పడం, నటించడం రెండూ పరస్పర సమన్వయంతో నడపడం వగైరాలు నేర్పారు. 

నటులందరూ ఉత్సాహవంతులు, సమర్జులు. ఆసక్తితో అన్నీ నేర్చుకున్నారు. కష్టపడి సాధన చేశారు. ఈ కృషి అంతా కలిసి అత్సంత మనోహరమైన “తేనెమనసులు” రూపం దాల్ఫింది. 

·         205-సుకన్య

·         ఇందులో భానుమతి పాత్రను ధరించింది. గోదావరి నడి బొడ్డున కల రాజమండ్రిలో పుట్టింది. విజయనగరంలో చదువు సంజెలు నెరిపింది. తిరిగి రాజమండ్రి చేరింది. నాటకానుభవం బొత్తిగా లేదు. కాని సినిమాల్లో ఛాన్సు లభిస్తే నటించాలనే మనసు వుండేది. అందుకే ఈ అమ్మాయికి “తేనెమనసులు” ఛాన్సు కష్చిదది ఆదుర్తి సుబ్బారావు ప్కీన్‌ టెస్ట్‌ చేసి -“అమ్మాయి, నీవు సెలక్ట్‌ అయ్యావు, నెక్టు టబ్రైనులో బయలుదేరి రా ‘ అన్నారు. టెలిగ్రామ్‌ చేరిన తరువాత “%వచ్చిన వన్స్‌ టైన్‌లోనే బయలుదేరి సక్సెస్‌ అయ్యింది. భానుమతి పాత్రలో నటించి – సైకిలెక్కి చక్కరకొడ్డూ మనల్ని చక్కలిగింతలు పెడ్తుంది. 

·           తర్వాత చాలా సినిమాలలో నటించింది

·         206-సంద్యారాణి

·         ఈ+ రాణి కృష్ణానదీ తీరాన, ఆంధ్రదేశం నడుమ వున్న విజయవాడ నుండి వచ్చింది. పియు.సి. చదువుకుంది. ఆటా వచ్చు, పాటా వచ్చు. తెలుగే కాక ఇంగ్లీషు, హిందీ, బెంగాళీ భాషల్లో క్షుజ్ణంగా మాట్లాడగలదు, పోట్లాడగలదు. అయితే ఈ చిత్రంలో చాలా ఓర్పుగా, నేర్పుగా నటించింది. ఈ [ అమ్మాయికి నాట్యంగూడా బాగా వచ్చు. హైస్కూలులో ఓ మారు ఓ నాటకంలో వాళ్లందర్ని ఆడియన్స్‌గా కూర్చోబెట్టి – తానే పెద్ద పెద్ద వేషాలు వేన్తూ అభినయిన్లూ వెప్పిన్తూండేది. సినిమాలంటే చిన్నప్పటినుండి తెగ పిచ్చీ, తరగని పిచ్చీ కావటం వల్ల నటించాలనే అభిలాష పెచ్చు పెరిగి పోయింది. రానీ అయితే మొదటి షూటింగునాడు గద్గద స్వరంతో చెప్ప వలసిన డైలాగు చెప్పలేక అధైర్య పడి పోయింది.డైరక్షరూ, కో డైరక్షరూ ఎంతగానో ధైర్యం నూరి పోశారు. ఆమెయే స్వయంగా లెక్కకు మించిన గ్లాసులు మంచినీళ్లు, కాఫీ గట్రా తాగి నంటబట్టించుకుని ఆ సన్ని వేశాన్ని అవలీలగా నటించి వేసింది. ఇహ ఈవిడకు నటన వెన్నతో పెట్టిన విద్యయి కర్చురది, సంధ్యారాణి సినిమా రాణి అయి కూర్చుంది. ‘తేనెమనసులు”లో సీతగా నటించింది.

·          తర్వాత ఇద్దరుమోనగల్లు ,మరపురాని కధ,శ్రీకృష్ణావతారం ,సుడిగుండాలు ,నేనేంటే నే నే ,వి౦తకాపురం ,ప్రతీకారం ,పగసాధిస్తా బస్తీ కిలాడీలు ,ప్రేమ జీవులు ,బస్తీ బుల్ బుల్ ,శ్రీకృష్ణ విజయం ,శ్రీ కృష్ణ సత్య ,మహమ్మద్ బీన్ తుగ్లక్ ,స్త్రీ గౌరవం సినిమాలలో నటించింది .అక్కినేని ఆదుర్తి కలిసి తీసిన సినిమాలలో హీరోయిన్ గా సమర్ధవంతంగా నటించింది .

·         207-రామ్మోహన్

·         ఈ చిత్రంలో చిట్టిబాబు పాత్రను నటించినా – ఇద్దరు అమ్మాయిలను (సంధ్యారాణి, సుకన్య) అమాంతం ప్రేమించేసి, ప్రేమింప చేసుకున్న గట్టి వాడు! పాపం చిన్నప్పుడు ఒకటో అరో నాటకాల్లో నటించి వుంటాడు. అంతకు తప్ప మళ్లీ ప్రాయం వచ్చాక స్టేజీ ఎక్తీ ఎరుగడు. , ఇంటరీ శడియట్‌ చదువుకుని హైదరాబాద్‌ విమాన నంన్బలో వెకానిక్‌గా వని మద్రాసు చేరింది. సినిమాల్లో నటించాలనే అభిలాష  చేస్తుండేవాడు. సినిమాల్లో నటించాలనే అభిప్రాయం బలమై కూర్చుంది. అసలే కండలు దీరిన మనిషి బలవంతుడైనప టికీ – ఆ అభిప్రాయం ధాటికి తట్టుకోలేకపోయాడు. వెంటనే “తేనె లు కొత్త తారల ప్రకటనకు దరఖాస్తు వేశాడు. ఛాన్సు వచ్చింది. అయితే మొదటి రోజు సెట్టులో తీసిన చిత్రాన్ని (రషెస్‌) చూసిన తర్వాత బలేగా ఖంగారు పడిపోయాడట. తెరపై జూసుకుని గజగజ వణికి పోయాడట. తనేమో సరిగ్గా చేయలేదేమో అనుకున్నాడట. సరిగ్గా చేయకపోతే డైరక్షరు “ఓకె అంటాడా? బడిలో పిల్లాడికి చెప్పినట్లు చెప్పడం-తన్నో నటునిగా తీర్చి దిద్దినదంటాడు. నదురూ బెదురూ లేకుండా నటించాడు.

·         208-కృష్ణ

·         ఈ+ అబ్బాయిది తెనాలి. కామ్‌గా బి.కామ్‌. చదివాడు. కొద్దిగా నాటకానుభవం ఉంది. సినిమాల్లో నటించాలనే అనుభవమూ ఉంది. అందుకే కొన్నాళ్లు మద్రాసులోని టి.నగర్‌ వాసాలను పట్టుకుని తిరిగే “షె వాడు. సరియైన అవకాశం చిక్కక తానూ చిక్కి తెనాలి చేరుకున్నాడు. ఆ లోగా బాబూ మూవీస్‌ వారి ప్రకటన వచ్చింది. దరఖాస్తు వేశాడు. ఖా రమ్మంటే రమ్మన్నారు. నటించాడు- యన నర్తించాడు కూడా. నృత్యం చేసేటప్పుడూ, పాటకు లిప్‌మూమెంట్‌ యిచ్చేటప్పుడూ చాలా కష్టపడ్డానంటాడు. నృత్య దర్శకుడు 1 1 హీరాలాల్‌, దర్శకుడు శ్రీ సుబ్బారావు, కో దర్శకుడు విశ్వంగారలు తన్ను గురించి – నటనలోని మెరుగులను గురించీ చాలా కష్టపడ్డారంటాడు. చిత్రం పూర్తయిన తరువాత తన నటనను చూసుకుని చాలా తేలిక టలు కృష్ణు ఇందులో బసవరాజుగా నటించాడు. ( ఈ ఘట్టమనేని శివరామకృష్ణ సూపర్‌స్టార్‌ అవడం, అలా సూపర్‌స్టార్‌ అవడానికి ముందు జరిగిన ఆ ఘట్టాలన్నీ అందరికీ తెలిసినవే. ఈ సినిమాలోని “వన్‌ టూ త్రీ ఫోర్‌ పాటలో తనకు – ప్రముఖ హాస్యనటుడు, ఆ తర్వాత దర్శకుడూ అయిన పద్మనాభం ప్లేబ్యాక్‌ పాడరని కృష్ణగారికి అప్పట్లో తెలియదట. ఈ విషయం “హాసం” ద్వారానే తెలుసుకున్నానని ఆయన అన్నారు. ఆ వివరాలు హాసం 25వ సంచికలో చదివిన పాఠకులకు గుర్తుండే ఉంటుంది.)   

·          

·         తర్వాత కృష్ణ ఎంత ఎదిగాడో ఎన్నెన్ని సినిమాలలో నటించాడో నిర్మించాడో డైరెక్ట్ చేశాడో మనకు తెలుసు .కృష్ణ ఒక సినీ సామ్రాజ్యాన్నే సృష్టించాడు స్వయం శక్తితో

·         209-పి.వెంకటేశ్వరరావు

·         “ఈయనది మచిలీవట్నం. హిందూ కళాశాలలో బి.ఏ. ప్యాన్‌ అయ్యాడు. . పూనాలో ఎం.ఏ. చదివారు గానీ పూర్తి చేయలేదు. ఒకటిన్నర దశాబ్దాల నుంచీ నాటకాల్లో నటిస్తున్నారు. ఆంధ్ర నాటక కళాపరిషత్తులోనూ, ఇతర పరిషత్తుల్లోనూ |] మూడు నాలుగు సార్డు ఉత్తమ హాస్య . నటునిగా బహుమతులను పొందారు. | ఇదేమిటి” నాటకంలోని ప్రసాద్‌ | “పాత్రకు వీరినే ఘనంగా చెప్పుకోవాలి. లా ఆ నాటకాన్ని శ్రీ ఆదుర్తి సుబ్బారావు చూసి న అవకాశాన్నిచ్చారు. పైగా ఆ నాటకం నాడే వాగ్దానం కూడా చేసేశా వేషమిస్తానని. ఉద్యోగం విజయవాడలో – పోస్టు అండ్‌ కల్‌ “తేనెమనసులు’లో చిట్టిబాబు అన్న రంగారావుగా “నస ఊత పదంతో గిలిగింతలూ పెట్టారు. 

 తర్వాత చాలా సినిమాలలో కేరక్టర్ యాక్టర్  గా జీవించాడు రంగస్థలం కళాకారుడు, నటుడు పి. వెంకటేశ్వర రావు(90) కన్నుమూశారు. గత ‍ కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య లక్ష్మీ, ఏడుగురు పిల్లలు ఉన్నారు.  పి.వెంకటేశ్వర రావు పూర్తిపేరు పిసుపాటి వేంకటేశ్వర రావు. తొలుత రంగస్థలం కళాకరుడిగా పరిచయం అయిన ఆయన తేనె మనసులు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు.ఆ తర్వాత కన్నెమనసులు, ఆత్మీయులు, మరోప్రపంచం, సుడిగుండాలు, మట్టిలో మాణిక్యం, ముత్యాలముగ్గు వంటి అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. గతంలో ఇదేమిటి అనే నాటకంలో నటించి ఉత్తమ హాస్యనటుడిగా అవార్డు అందుకున్నారు.

210- జి ఎస్.ఆర్ మూర్తి

 ఈశయనది విజయవాడ. ర.స.న, సమాఖ్యలో రాటుదారిన మనిషి ముదిగొండ లింగమూర్తి వ్రాసిన “ఎంకన్న కాపురం” నాటకంలో వెంకన్నగా మద్రాసులో నటించి, అందర్నీ మెప్పించి ఉత్తమ నటుని బహుమతిని పట్టుకుపోయారు. “రాగరాగిణి” నాటకంలో కూడా ప్రశంసనీయంగా నటిస్తారు. 927 నంలో జన్మించారు. “తేనె జ్ర మనసులు’లో నరసరాజుగా నటించారు. వీరి పేరు గిడుగు సీతారామచంద్రమూర్తి, ఎన్‌.ఎన్‌.ఎల్‌.ని.చదివిన .తరువాత విశాఖపట్నంలో కొంతకాలం, మిలటరీలో కొంతకాలం చేశారు. ఉద్యోగం విజయవాడలోని ఆంధ్రా సిమెంటు కంపెనీలో. ఈయన ‘దొంగ వీరుడు” నాటకంలో వృద్ద జమీందారు పాత్రను అమోఘంగా నటిస్తారు. 1005ు పైగా సార్లు ఆ నాటకాన్ని ప్రదర్శించి వుంటారు.

211-పుష్పకుమారి

 కృష్ణా జిల్లా గుడివాడ తాలుకా విన్నకోట [గ్రామంలో పుట్టింది. గుడివాడలో పెరిగింది. ప్రస్తుతం మకాం కూడా స్ట ఆ గుడివాడే! నాట్యం బాగా వచ్చు. చాలా నాటకాల్లో నటించింది. అనేక పరిషత్సభలలో నేక సమాజాల వారితో పాల్గొని – లెక్కకు మించిన బహుమతులను సంపాదించింది. తీరిక సమయాలలో సినిమా చూడటం హాబీ అయి -ఆఖరికి నినిమాల్లో నటిస్తే , బాగుండుననే నిర్ణయానికి వచ్చింది. …తేనెవుననులు’ చితం ఆ వరాన్ని ౯ ప్రసాదించింది. మనకు వరంగా (వరలక్ష్మి) ఈ చిత్రంలో ఈమె సాక్షాత్కరిస్తుంది. –

 తర్వాత బాపు విక్టరీ మధుసూదనరావు విఠాలాచార్య ,విశ్వనాద్,బానుమతి విజయనిర్మల ,బిఎ సుబ్బారావు మొదలైన దర్శకులవడ్డ అగ్రశ్రేణి నటీ నటులతో నటించింది .కొన్ని సినిమాలు –ఆత్మగౌరవం అవేకళ్ళు ,బ్రహ్మ చారి ,మంచి కుటుంబం ,భలేరంగడు విచిత్ర కుటుంబం ,బాలరాజు కధప్రేమ నగర్ ,కాలం మారింది ,సతీసావిత్రి ,శుభలేఖ వగైరా .

212-ఎం.వి.చలపతి రావు

ఆస్తమానూ అడ్డగాడిదా, గాడిదా అంటూ భార్యా బిడ్డల్ని గాడిదల్ని చేస్తూ వచ్చే వీరభద్ర స్వామి పాత్రను ధరించాడీయన. విజయవాడ రైల్వేలో ఉద్యోగం. ఈయన చాలా పొట్టి మనిషే అయినా నటనలో మాత్రం గట్టి థ్‌ మనిషి – గడుగ్గాయి. నాటకాల్లో నటించడమంటే స్మ మహా పండుగ ఈయనకు. బందరులో 1 ప్రదర్శించిన “ఇదేమిటి హాస్య నాటికలో ప్రెసిడెంటు వేషం వేశాడు. ఈ వేషం, సి అభినయం శ్రీ ఆదుర్తి సుబ్బారావు కి బాగా ఖా. నచ్చింది. అదే ‘తేనెమనసులు’ చిత్రంలో అవకాశం లభించడానికి మార్గమయ్యింది. ఈయన అనేక పరిషత్తులలో పాల్గొని ఉత్తమ హాస్య నటునిగా బహుమతు లందుకున్నారు. 

తర్వాత ఇలాగే ముసలి పాత్రలు చాలాధరించాడు .

213–రాధాకుమారి

ఈ+మెది విజయనగరం. విజయనగరం రాఘవ నాటక పోటీల్లో పాల్గొని చాలాసార్లు ఉత్తమ నటిగా బహుమతులను తెచ్చుకుంది. నవ్వించే వేషాలు, కవ్వించే వేషాలు, ఏద్బే వేషాలు, ఏడిపించే వేషాలు, హాస్య వేషాలు, లాస్య వేషాలు, గయ్యాళి వేషాలు, నెయ్యాలి వేషాలు లాంటివన్నీ వేసింది

   గతంలో హైదరాబాద్‌లో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్తులో ప్రదర్శించిన ‘నాలుగిళ్ల చావడి’ పాత్రను నటించి – ఉత్తమ నటిగా బహుమతిని ‘ నంపాదించింది. ఈ చిత్రంలో , నాగరత్నమ్మగా కనిపిస్తుంది. (ఈ కుమారి . ప్రముఖ నటుడు, రచయిత అయిన రావి జీ కొండలరావు గారికి శ్రీమతి కూడా. ఇటీవల విడుదలైన ‘ఒకరికి ఒకరు’ చిత్రంలో బామ్మగా వేసిన సంగతి పాఠకులీపాటికి గుర్తు పట్టివుంటారు.)

 -గయ్యాళితనం, సాత్వికత్వం ఇవి రెండూ కలబోసిన పాత్రల్లో నటించి మెప్పించారు. సహాయనటిగా, హాస్యనటిగా తెలుగు తెరపై తనదైన ముద్రవేసారు. ఇప్పటి వరకు ఈమె సుమారు 400కి పైగా సినిమాలలో నటించి అందరి మన్ననలు పొందింది.కేవలం చలనచిత్రాల్లోనే కాకుండా పలు ధారావాహికల్లోను నటించారు. అనువాద కళాకారిణిగానూ ఆమె వంద సినిమాలకు పనిచేసారు.

ఈమె మొదటిసారిగా ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో అందరూ నూతన తారలతో తయారైన తేనె మనసులు (1965) సినిమాలో నటించింది. ఈ చిత్రంలో 20 ఏళ్ళ వయసులో హీరో కృష్ణ కు సవతి తల్లిగా నటించి మెప్పించింది.

కొంతకాలం విరామం తర్వాత మరla 2002 నుండి తిరిగి డి. రామానాయుడు పిలుపు మేరకు నువ్వు లేక నేను లేను తో సినిమాలలో నటించడం ప్రారంభించారు

శ్రీ కృష్ణ విజయం ,మొల్ల ,విచిత్రబంధం ,కన్నెమనసులు రంగులరాట్నం ,బృందావనం వగైరా .

214-కోనేశ్వరరావు

పసితనంలో కోనేశ్వరరావు పదిమంది మాటా, చేతలను అనుకరించి – అభినయించి మెప్పించడాన్ని నేర్చుకున్నాడు. ఆ ఉత్సుకత, ఉత్సాహము మ… నాటకాల్లో నటునిగా చేసింది. బందరులోని _ వసంతవనిలో సభ్యునిగా వుంటూ “అపరాజిత, . ‘ఫణి” ఆదిగా గల నాటకాల్లో వేషాలు వేసి ‘ పరిషత్సభలలో పాల్గొని ప్రజులు సంపాదించాడు. ‘. ఇంటర్‌మీడియట్‌ చదువుకున్నాడు గాని ఉద్యోగాలేవీ చేయలేదు. సినిమాల్లో నటిద్దామనే క్షే పనిగా పెట్టుకుని – కొన్నాళ్లు మద్రాసులో మకాము పెట్టి తిరిగి బందరు చేరుకున్నాడు. అదృష్టం బాగుండి ‘తేనెమనసులు’లో అవకాశం లభించి – శ్రీనివాసరావు పాత్రను ధరించాడు. అనేక పర్యాయములు మద్రాసులోని ఏ.ఐ.ఆర్‌. నాటకాల్లో పాల్గొన్నాడు.

215-వాణీ బాల

ఈమెది కూడా మచిలీపట్నమే! ‘వసంతవని” నాటక సమాజంలో సభ్యురాలే! అనేక నాటకాల్లో అనేక పాత్రలను ధరించి విశేషంగా బహుమతులను పుచ్చుకుంది. విజయవాడ, మద్రాసు,ఢిల్లీ, హైదరాబాద్‌, బొంబాయిల్లాంటి నగరాలల్లోని రంగ స్థలాలపై అనేక నాటకాల్లో ప్రధాన పాత్రలు ధరించింది. మద్రాసులో ప్రదర్శించిన “అపరాజిత నాటకంలో ఉత్తమనటిగా ఎన్నుకోబడింది. “తేనెమనసులు’లో జానకమ్మగా నటించింది.

216-రోజారాణి

  స్ఫంతవూరు తెనాలి అటగాని కొంతకాలం వీళ్ల నాన్నగారు మద్రాసులో పనిచేశారట. అప్పుడే యీ రోజా ఆదివారం రోజున జరిగే పిల్లల రేడియో కార్యక్రమాల్లో పాల్గొంటూండేదట. ఇప్పుడు హైదరాబాద్‌లో పదో క్లాసు చదువు కొంటోంది. బడి నాటకాల్లో వేషాలు వేసింది. కాబట్టి సినిమాల్లో కాస్తా బాగుండునని తలంచింది. మరి ఎలాగా? “తేనె మనసులు” చిత్రంలో “చిన్ని” అనే చిన్న వేషాన్ని యిచ్చారు. చాలా పెద్దగా చేసి పెద్దల్ని, చిన్నల్ని మెప్పించింది. (తర్వాత ఈ అమ్మాయి పెరిగి పెద్దయ్యాక హైద్రాబాద్‌ దూరదర్శన్‌లో ఉద్యోగం చేస్తూ ఆ చిన్ని తెరపై కూడా ఎన్నోసార్లు కనిపించి, అక్కడే పనిచేస్తున్న శాంతిస్వరూప్‌ని వివాహం చేసుకుంది.)

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -203 · 203-మచి రోజు ,పెళ్లి రోజు సినీ దర్శకుడు ,టీ.వీ .అసిస్టెంట్ డైరెక్టర్ –ఎం.ఎస్.శ్రీరాం

     మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -203

· 203-మచి రోజు ,పెళ్లి రోజు సినీ దర్శకుడు ,టీ.వీ .అసిస్టెంట్ డైరెక్టర్ –ఎం.ఎస్.శ్రీరాం

· విజయవాడ రేడియో కేంద్రం లో 1977లో U.P.S.C ప్రోగ్రాం ఎక్సి క్యూటివ్ గా చేరి రెండేళ్ళ తర్వాత కడపకు బదిలీ అయ్యాడు .అక్కడినుంచి మద్రాస్ దూరదర్శన్ కేంద్రానికి ట్రాన్స్ఫర్ అయ్యాడు .అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రమోషన్ పొందాడు .దురదృష్టవశాత్తు అక్కడే మరణించాడు అకస్మాత్తుగా .ఈమని శంకర శాస్త్రి గారికి మేనల్లుడు శ్రీరాం .మంచి సంగీతకార్యక్రమ రూపకర్త .

· సినీ రంగ ప్రవేశం చేసి మంచి రోజు ,పెళ్లి రోజుసినిమలు దర్శకత్వం చేశాడు .వీటి హీరోయిన్ జమున ..సూర్య చిత్ర వారి మంచి రోజులో జమున ,రామకృష్ణ నాయికా నాయికలు .సంగీతం దర్శకత్వం ఎం ఎస్ .శ్రీరాం .కధ-.పిబి శ్రీనివాస్ .మాటలు అప్పలాచార్య –పాటలు ఆత్రేయ ,పిబి శ్రీనివాస్ .

· 1968లో పెళ్లిరోజు చిత్రం విడుదలైంది జమున ,హరనాద్ జంట జమున డబల్ రోల్ గీరోయిన్ ఇందులో .రాజశ్రీ రచన .సంగీతం డైరెక్షన్ –ఎం ఎస్ శ్రీరాం ‘’జమున పాడిన ‘’పెళ్లి వారమండి ఆడపెళ్ళి వారమండి ‘’పాటఆరోజుల్లో సూపర్ హిట్ .

· సశేషం

· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -202 202-నాటక దశరధ ,ధర్మరాజు ఫేం ,సంగీత విద్వాంసుడు ,సినీ హరిశ్చంద్ర ఫేం –అద్దంకి శ్రీరామమూర్తి

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -202

202-నాటక దశరధ ,ధర్మరాజు ఫేం ,సంగీత విద్వాంసుడు ,సినీ హరిశ్చంద్ర ఫేం –అద్దంకి శ్రీరామమూర్తి

అద్దంకి శ్రీరామమూర్తి (సెప్టెంబరు 21, 1898 – 1968) తెలుగు నాటక, సినిమా నటుడు, సంగీత విద్వాంసుడు.పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి శిష్యుడు .

జననం
ఈయన గుంటూరు జిల్లా కల్వకుర్తి గ్రామంలో సెప్టెంబరు 21, 1898 సంవత్సరంలో జన్మించాడు.

రంగస్థల ప్రవేశం
బాపట్ల ఉన్నత పాఠశాలలో చదివాడు. చదువుకునే రోజుల్లోనే బడిపిల్లలు ప్రదర్శించిన గయోపాఖ్యానం నాటకంలో ప్రపథమంగా సహదేవుడు పాత్రలో నటించాడు. సహదేవుడు పాత్రతో ప్రారంభమైన నటజీవితం దశరథుడి పాత్రతో పరాకాష్ఠకు చేరుకుంది. తర్వాత రాజమండ్రి లోని కృత్తివెంటి నాగేశ్వరరావు గారి నాటక సమాజంలో మూడేళ్ళు వివిధ పాత్రలు ధరించాడు. సంగీతం మీద ఎక్కువ ఆసక్తి ఉండటం వల్ల విజయవాడలో పాపట్ల కాంతయ్య, పారుపల్లి రామకృష్ణయ్య ల వద్ద పదేళ్ళు సంగీతం నేర్చుకొని సంగీత విద్వాన్ గా పేరుతెచ్చుకొన్నాడు. బి.టి.రాఘవాచార్యులు వద్ద నాటక కళలోని మెళకువలు నేర్చుకొన్నాడు. అనేక పాటకచేరీలు నిర్వహించాడు. పాటలు పాడడంలో విశిష్టమైన బాణీ సృష్టించుకున్నాడు. ఎంతటి పద్యమైనా ఈయన పాడితే ఇట్టే అర్థమైపోయేది. ప్రసిద్ధ నటులు హరి ప్రసాదరావు, బళ్ళారి రాఘవ ల సరసన ప్రముఖ పాత్రలు ధరించి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందాడు. ఈయన పాడిన పద్యాలు, కృతులు, శ్లోకాలు గ్రామఫోను రికార్డులుగా ఇవ్వబడి విశేష ప్రచారం పొందాయి. ఈయన ధర్మారాజు, దశరథుని పాత్రలకు పేరొందాడు. పాండవ ఉద్యోగ విజయం నాటకంలో ధర్మరాజు పాత్రను వేసేవాడు. 1913 నుంచి 1920 వరకు స్టార్ థియేటర్ సమాజం తరపున నాటకాలు ప్రదర్శించాడు. అనంతరం వరుసగా రాజమండ్రి హిందూ నాటక సమాజం, బందరు బాలభారతి సంఘం, మైలవరం మోతే కంపెనీ లలో ప్రధాన భూమికలు ధరించాడు. కాకినాడలో జరిగిన పాదుకాపట్టాభిషేక నాటక పోటీలలో ఈయన నటించిన దశరథుడి పాత్రకు సువర్ణ పతకం అభించింది.

శాకుంతలం లో కణ్వమహర్షి ,హరిస్చంద్రలో హరిశ్చంద్ర ,వీరబాహు గా ,పాదుకలో దశరధుడు ,కురుక్షేత్రం లో ధర్మరాజు గాఎనలేని కీర్తి సాధించారు .50ఏళ్ళు ఆంద్ర నాటకరంగాన్ని సుసంపన్నం చేసిన నట శిరోమణి అద్దంకి .

సినిమా నటుడిగా

హరిశ్చంద్ర సినిమాలో హరిశ్చంద్ర పాటలో అద్దంకి శ్రీరామమూర్తి. ఒక పాట, సన్నివేశం.

తన తొలి సినిమా, పసుపులేటి కన్నాంబ సరసన పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన హరిశ్చంద్ర సినిమాలో హరిశ్చంద్రుని పాత్రలో నటించి మంచిపేరు తెచ్చుకున్నాడు. అప్పటివరకు హరిశ్చంద్ర పాత్రలో డి.వి. సుబ్బారావు, హరిప్రసాదరావు లను చూడడా డానికి జనం అలవాటు పడినా అందుకు భిన్నంగా పుల్లయ్య హరిశ్చంద్ర పాత్రకు శ్రీరామమూర్తిని ఎంపికచేశాడు. చలనచిత్ర రంగంలో ప్రవేశించి సుమారు 25 చిత్రాలలో నటించి అసమాన నటుడుగా కీర్తి సంపాదించాడు. ఈయన ధరించిన పాత్రలలో జీవించి ఆ పాత్ర ప్రేక్షక హృదయాలకు హత్తుకునే విధంగా నటించేవాడు. పాదుకా పట్టాభిషేకం సినిమాలో దశరథుని పాత్ర పోషించాడు.

మరణం
నాటకరంగంలో ప్రేక్షకలోకాన్ని సమ్మోహనపరచిన అద్దంకి అవసాన దశలో పక్షవాతంతో బాధపడి 1968లో మరణించాడు.

నటించిన సినిమాలు
· బ్రహ్మరధం (1947)

· మాయా మచ్చీంద్ర (1945)

· పాదుకా పట్టాభిషేకం (1945)

· కృష్ణ ప్రేమ (1943)

· సత్యభామ (1942)

· భక్తిమాల (1941)

· భోజ కాళిదాసు (1940)

· మహానంద (1939)

· సారంగధర (1937) – రాజరాజ నరేంద్రుడు

· హరిశ్చంద్ర (1935)

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -201 201-వేణుగాన విద్వాంసుడు ,సంగీత దర్శకుడు ,కంపోజర్ ,రచయిత,మూడు ఖండాలలో అనేకసార్లు కచేరీలు చేసిన –ఏల్చూరి విజయరాఘవరావు

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -201

201-వేణుగాన విద్వాంసుడు ,సంగీత దర్శకుడు ,కంపోజర్ ,రచయిత,మూడు ఖండాలలో అనేకసార్లు కచేరీలు చేసిన –ఏల్చూరి విజయరాఘవరావు

ఏల్చూరి విజయరాఘవ రావు (నవంబర్ 3, 1925 – నవంబర్ 30, 2011) ప్రముఖ భారతీయ సంగీతకారుడు,వేణుగాన విద్వాంసుడు,సంగీత దర్శకుడు,కంపోజర్ రచయిత.[1].ఆయన అత్యంత ప్రతిభావంతుడు. సంగీత లోకంలో చాలా గొప్పవాడు. మహాత్మాగాంధీనే తన రామధున్‌ కార్యక్రమం ద్వారా మెప్పించినవా డు. ఖండాంతర ఖ్యాతినార్జించినవాడు. ప్రపంచంలోని ఐదు ఖండాలలో మూడు ఖండాలలో ఒకసారి కాదు ఎన్నోసార్లు ఆయన సంగీత కచేరీలు నిర్వహించాడు. శ్రోతల నుంచి బహుళ విశేష ప్రశం సలు పొందాడు. ఆయన వేణునాద రికార్డులు ఇంగ్లండులోనూ, పారిస్‌లోనూ లభిస్తాయి.ప్రాచుర్యం పొందాయి.

జీవిత విశేషాలు
విజయరాఘవ రావు గారు శ్రీ ఏల్చూరి రామయ్య,సుబ్బాయమ్మ దంపతుల ద్వితీయ సంతానంగా 1925, నవంబర్ 3 న జన్మించారు. ఆయన పసి బిడ్డగా ఉండగానె తండ్రి కాలం చేశారు. వీరి అన్నగారు నయాగరా కవుల్లో ఒకరైన శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు. తండ్రి గారి నుంచి ఆయనకు సంగీతాభిమానం సంక్రమించింది.ఆయనకు తెలుగు, ఇంగ్లీష్, హిందీలతో బాటుగా బెంగాలీవంటి ఇతరభాషలు కూడా క్షుణ్ణంగా వచ్చు. విజయరాఘవరావు తన కళాజీవితాన్ని భరతనాట్యంతో మొదలు పెట్టినప్పటికీ, ఆయన వేణువునేకాక, వాద్యబృంద నిర్వహణనూ, మెళుకువలనూ, స్వరరచననూ, సంగీతప్రసంగాలనూ అద్భుతంగా నిర్వహించారు. ఇవన్నీకాక సుబ్రహ్మణ్యంగారి సోదరుడిగా తెలుగు కవిత్వమూ, కథలూ, ఇంగ్లీషులో రచనలూ చేశారు.[2]

కళాకారునిగా
బాల్యంలో నరసరావుపేటలో ఎకరాల కొద్దీ విస్తరించిన పెద్ద చెరువు నిండుగా నీళ్లతో తొణికిసలాడుతూ పలనాడు రోడ్డు వెంబడే ఉండేది. చెరువు కట్ట దగ్గర్లోనే ఏల్చూరి రామయ్య గారి ఇల్లు రాళ్ళబండి వారి వీధిలో ఉండేది. ఆ వీధికి పక్కగానే యాదవుల వీధి ఉంది. చెరువు కట్ట మీద యాదవుల పిల్లలతో కూడి వారి వద్దనే వేణువు వాయించడం నేర్చుకున్న విజయరాఘవరావు గారికి ప్రాథమికంగా గురువు ఎవరూ లేరు. అయితే గొల్ల పిల్లలతో చేరి కూడా అల్లరి చేయకుండా విద్యను మాత్రమే గ్రహించే వారు. తర్వాతి రోజుల్లో శాస్త్రీయ సంగీత కచేరిలు చూసి, ఇంటికి వచ్చి సాధన చేసేవారట.[3] ఆయన సంగీతానికి శ్రోతలుగా అనిసెట్టి కృష్ణ, నరసరావు పేట లోని కన్యకా పరమేశ్వరీ గ్రంథాలయ నిర్మాత, విద్యావేత్త మస్తాన్ గార్లు ఉండేవారు. అనిసెట్టి కృష్ణ గారి ప్రేరణతో ఆ తర్వాత ఆయన మద్రాసు వెళ్ళి కళా క్షేత్రంలో సంగీతం, రుక్మిణీదేవి అరండేల్ గారి వద్ద భరత నాట్యం అభ్యసించారు. అక్కడికి వచ్చిన ప్రఖ్యాత నర్తకులు ఉదయ శంకర్ గారి దృష్టిని ఆకర్షించి వారి నృత్య బృందంలో నర్తకుడిగా దేశ విదేశాలూ తిరిగారు. ఆ ప్రదర్శనలు ఇస్తున్నపుడే ఒకసారి రష్యాలో నాట్య ప్రదర్శన అనంతరం వేణు గానంతో అక్కడి శ్రోతల్ని అబ్బుర పరిచారు. ఆ సందర్భంలోనే ఉదయ శంకర్ గారి సోదరుడు పండిట్ రవి శంకర్ తన శిష్యుడిగా స్వీకరించి హిందూస్తానీ సంగీత ప్రపంచంలోకి ఆయన్ని ఆహ్వానించారు. అక్కడితో ఆయన ప్రతిభ మరింతగా విస్తరించింది.[3] సితార్ విద్వాంసుడైన రవిశంకర్‌వద్ద సంగీతం నేర్చుకున్న విజయరాఘవరావు ఆయనకు నికరమైన శిష్యుడు ఎందుకంటే కేవలం రాగతాళాలేకాక మొత్తం భారతీయసంస్కృతినీ, అందులోని వివిధ అంశాలనూ పరిశీలించి, అర్థంచేసుకునే సామర్థ్యం ఆయనకు అలవడింది. రవిశంకర్ స్వయంగా సంగీతరచన చేసిన అనూరాధా, గోదాన్, మీరా మొదలైన హిందీ చిత్రాల రికార్డింగ్‌లన్నిటిలోనూ రావుగారు ప్రధానపాత్ర నిర్వహించారు. ఫిల్మ్స్ డివిజన్‌వారి అసంఖ్యాకమైన డాక్యుమెంటరీల సంగీతంలో ఆయన రేడియోశబ్గాల దగ్గర్నుంచీ, రకరకాల ప్రపంచవాద్యాలదాకా అనేకం వాడి విజయవంతమైన ప్రయోగాలు చేశారు.[4] తెలుగువారికన్నా, ముంబాయి, ఢిల్లీ ఇంకా ఉత్తరభారతదేశ ప్రముఖ నగరాలలో సంగీత విద్వత్ప్రముఖుడిగా గొప్పఖ్యాతినార్జించినవాడు.1945 నుండి 1958 వరకు ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో విజయరాఘవరావు సంగీత ప్రయోక్తగా, వాద్యబృంద కార్యక్రమ సంవిధాన కర్తగా పనిచేశారు.

ముఖ్య ఘట్టాలు
గాంధీజీ హత్య జరిగినపుడు బిర్లా భవన్‌ ప్రార్థన సమావేశపు ప్రసార కార్యక్రమానికి శబ్దగ్రాహక యంత్రాలు, సిబ్బంధి ఎంతో శ్రద్ధా నిమగ్నతతో సంసిద్ధమై ఉండగా భయంకరమైన తుపాకి కాల్పులు, సభా స్థలిలో హాహాకారాలు, రోదనలు, విషాదోద్వేగ కలకలం, వీధుల్లో జనం ఆందోళనతో ఉరుకులు పరుగులు తీస్తూ మూలమైన సంక్షభ సూచకంగా పెడుతున్న కేకలు, ఆక్రందనలు ఆకాశవాణి ప్రసారయంత్రాలు విన్పించడం ప్రారంభమైంది. అప్పుడు ఆకాశవాణి కార్యాలయం ఉద్యోగులంతా నిర్ఘాంతపోయారు. నిలువెల్లా సంచలించారు. ఎవరికీ ఏం చేయాలో, అసలేం జరిగిందో తెలియలేదు. అప్పుడు విజయరాఘవరావు ఉద్యోగ బృందానికంతా స్థైర్యం కలగజేసి ‘రఘుపతి రాఘవ రాజారాం’ అనే గీతాన్ని శృతిలయబద్ధంగా ఎడతెగకుండా వాద్యసంగీత రూపంగా ప్రసారం చేయించారు. మధ్యలో చిన్న ప్రకటనేమైనా ప్రసారం చేసినా ఆ తర్వాత 24 గంటలు ఈ ప్రార్థన సందేశ గీతిక ప్రసారమవుతూనే ఉంది. దీనిని స్వరపరచినది రాఘవరావే. ఆ తరువాత మహాత్మాగాంధీ సంస్మరణ నివాళిగా ఇది సంప్రదాయ నిబద్ధమైంది.[5]

1950 ప్రాంతాలలో సర్దార్‌ పటేల్‌ కొద్ది రోజులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండేవారు. అప్పుడు వరసగా కొన్ని రోజులు తనను సంగీతంతో సేదదీర్చవలసిందని పటేల్‌ మహాశయుడు విజయరాఘవరావును కోరారు. సాయంకాలం ఒక గంట విజయరాఘవరావు, ఉస్తాద్‌ అల్లారాఖా తబలా వాద్యసహకారంతో పటేల్‌ మహాశయుడి మనస్సును స్వస్థపరచేవారు, రంజింపజేసేవారు.[5]

అమెరికాలో
అమెరికాలో వాషింగ్టన్, డి.సి.లో ‘కార్నెజీ హాల్‌’ అని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సభా భవనం ఉంది. ప్రపంచ ప్రసిద్ధులైన కళాకారుల గాన సభలు అక్కడ జరుగుతవి. అక్కడ సంగీత కచేరీ నిర్వహించడం జీవిత సాఫల్యంగా భావిస్తారు ప్రసిద్ధ కళాకారులు. విజయరాఘవరావు కార్నెజీ హాల్‌లో వారి ఆహ్వానంపై వేణునాదం విన్పించారు.

అమెరికాలో జార్జియా రాష్ట్రంలో భారతీయ సంగీతం, సంస్కృతి, జ్ఞాన సాధన, చింతనధారలను ప్రచారం చేసే ఒక పత్రిక వెలువడుతున్నది. ముఖ్యంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి కార్యక్రమ నిర్వహణ విశేషాలను ప్రకటిస్తుంది ఈ పత్రిక. పన్నెండేళ్ళ కిందట ‘అట్లాంటా’ నగరంలో ‘ఇండియన్‌ క్లాసికల్‌ మ్యూజిక్‌ సొసైటీ ఆఫ్‌ గ్రేటర్‌ అట్లాంటా అనే సాంస్కృతిక సంస్థ విజయరాఘవరావు సంగీత కచేరీ ఏర్పాటు చేసింది. ఆయన గొప్ప నర్తకుడు కూడా. దేశవిదేశాలలో అనేక నృత్యప్రదర్శనలిచ్చాడు. పసిపిల్లల వంటి పరమ ఉల్లాస ప్రవృత్తి ఆయనది.

సోనీ కంపెనీ వాళ్ళు విజయ రాఘవరావు హంసధ్వని గంటన్నరసేపు ఆలపించగా రికార్డు చేసరు. ‘భువన్‌ షోమ్‌’ కూడా నాకు వారు ప్రదర్శించి చూపారు. ఏల్చూరి విజయరాఘవరావు ఇంగ్లీషులో, తెలుగులో కవిత్వం రాశారు, కథలు రాశారు. 1991 జనవరి- ఫిబ్రవరి ఇండియన్‌ లిటరేచర్‌ (సాహిత్య అకాడమి)లో వారి సాహిత్య ప్రస్థాన వ్యాసం ప్రచురితం. అందులో సంగీత సా హిత్యాలలో ఆయన ప్రజ్ఞ, హదయ వైశాల్యం ఎంతో గొప్పగా ఆవిష్కృతమైనాయి.

అవార్డులు
ఆయనకు 1970 లో భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక అవార్డు అయిన పద్మశ్రీ వచ్చింది.[6] 1982 లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.[7] జాతీయ అంతర్జాతీయ స్వర్ణ పతక సమ్మానితుడు.

వ్యక్తిగత జీవితం
ఆయన 1947 లో శ్రీమతి లక్ష్మి వి.రావును వివాహమాడారు. ఆయనకు నలుగురు పిల్లలు, తొమ్మిదిమంది మనవళ్ళు.sident of the United States.

ఎన్నెన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం చేశారు .స్వయంగా నటులు .ఉదయ శంకర్ తో కలిసి పని చేశారు .ఈయన కుమారుడు మురళీ ధర్ విజయవాడ రేడియోలో డ్యూటీ ఆఫీసర్ గా చేశారు .పద్యకవి కూడా .ఇక్కడ రాజీనామా చేసి న్యు ఢిల్లీ వెంకటేశ్వర కాలేజిలో తెలుగు లెక్చర్ చేశారు .పి.హెచ్ డి.చేశారు .పురాణ వ్యాఖ్యానం లో దిట్ట .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-200 ·

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-200

·         200-మల్లీశ్వరి కృష్ణ దేవరాయలు ,మహా సాహిత్యవేత్త ,రేడియో అసిస్టెంట్ డైరెక్టర్-శ్రీ వాత్సవ-2

     శ్రీవాత్సవ గురించి యామిజాల జగదీశ్ ,గొల్లపూడి మారుతీరావు చెప్పిన మరిన్ని విశేషాలు

ప్రభుత్వ ఉద్యోగాలలోనో, ఆకాశవాణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలలోనో పనిచేసేవారు ఇంకొక చోట సొంత పేరుతో రాయడానికి వీలులేని పరిస్థితులలోనో, భద్రత కోసమో కలంపేర్లను ఉపయోగించుకుంటారు.
ఆకాశవాణిలో పనిచేసిన యండమూరి సత్యనారాయణ ‘శ్రీవాత్సవ’ పేరుతో రచనలు చేశారు. తెలుగు స్వతంత్ర వార పత్రికలో ప్రతి సంవత్సరం ఆయనచేసిన సాహిత్య సింహావలోకనాలు చాలా ప్రసిద్ధాలు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 1956లో నాటక ప్రయోక్తగా ప్రవేశం చేసి 12 సంవత్సరాల పాటు ఎన్నో నాటకాలు ప్రసారం చేశారు. కూచిపూడి నాట్య సంప్రదాయానికి ఊపిరిపోసింది బందా. కేంద్ర సంగీత నాటక అకాడమీ, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ సభ్యత్వాలు లభించాయి. అభినవకృష్ణ, నటశేఖర బిరుదులతో సత్కరించారు. ఉత్తమనటుడుగా 1963లో రాష్ట్రపతి అవార్డు పొందారు. రేడియో నాటికలు సంపుటిగా ప్రచురించారు. కూచిపూడి నృత్యంపై వీరి రచన ప్రామాణికం

1968 డిసెంబరు 3న నాటకరంగంలో ధృవతార రాలిపోయింది. ఇప్పటికీ కూచిపూడిలో బందా వర్థంతి ఏటా జరుగుతుంది. కూచిపూడిలో సిద్దేంద్ర కళాక్షేత్ర నిర్మాణానికి ఆయన కృషి అపారం.

వీరి తర్వాత జ్ఞప్తికి తెచ్చుకోవలసిన వ్యక్తి ఆమంచర్ల గోపాలరావుగారు వీరు నాటక విభాగ ప్రయోక్తగా విజయవాడలో పనిచేసి పదవీ విరమణ చేశారు. చాలాకాలం మదరాసులో కూడా పనిచేశారు.యండమూరి సత్యనారాయణ (శ్రీవాత్సవ) 1913 }} శ్రీవాత్సవగా ప్రసిద్ధి చెందిన యండమూరి సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా పసలపూడిలో 1913 మే 21న జన్మించారు. ఉన్నత విద్యాభ్యాసం గావించిన సత్యనారాయణ ఆకాశవాణిలో విజయవాడ, మదరాసు కేంద్రాలలో కార్యక్రమ నిర్వహకులుగా చాలాకాలం పనిచేశారు. ఆపైన అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా ఢిల్లీ బదలీ అయి వెళ్ళారు.

ఘంటసాల వేంకటేశ్వర రావు 1944  సెప్టెంబర్ ఇరవైన మొదటిసారి రేడియోలో పాడారు. ఆ తరువాత అనేక సార్లు ఆయన లలితసంగీత కార్యక్రమాల్లో, సంగీత నాటకాల్లో పాల్గొంటూ వచ్చారు. దీపావళి పండుగ కోసం సముద్రాల రాఘవాచార్యులు రాసిన ‘వెలుగు వెల్లువ’ అనే సంగీత నాటకంలో ఘంటసాల, భానుమతి ప్రధాన పాత్రధారులు. విశ్వనాధ రాసిన ‘కిన్నెరసాని’ సంగీత నాటకానికి ఘంటసాల సంగీతం సమకూర్చారు. ‘లైలా మజ్నూ’ నాటకంలో ఘంటసాల మజ్నూ పాత్ర పోషించారు. అందులో ఆయన పాడిన ‘గుడారమెత్తివేశారు’, ‘ఎందు చూచినగాని లైలా…’ అనే పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.(రచన: యండమూరి సత్యనారాయణ, సంగీతం : రజని). 1945 లో ఘంటసాల పాడిన రజని గేయం ‘ఘనాఘనా గర్జింపవొ..’ అనే పాట  ఢిల్లీ నుంచి జాతీయ కార్యక్రమంలో ప్రసారమయింది.  ఏరి రచనలకు కేం[ద  పురస్కారం లభించింది. పెళ్లాడే బొమ్మ, తీరని కోరికలు నాటకాలు, నాగరిక, చెట్లు గేయ సంపుటిని రచించారు. వీరు 1968 మార్చిలో ఢిల్లీలో చనిపోయారు. వీరి కుమారులు రామచంద్రరావు జర్నలిస్టుగా విజయవాడలో స్థిరపడ్డారు,

ఉష కిరణాలు

గొల్లపూడి మారుతీరావు

1959-63 వరకూ ఆంధ్రప్రభలో పనిచేసి 1963 జనవరి 17న హైదరాబాదు రేడియో స్టేషన్లోకి అడుగుపెట్టాను. అప్పుడక్కడ రజనీకాంతరావుగారు పనిచేస్తున్నారు. ఇంకా దేవులపల్లి కృష్ణశాస్త్రి, నాయని సుబ్బారావు, మునిమాణిక్యం నరసింహారావు, బుచ్చిబాబు, యండమూరి సత్యనారాయణ, అయ్యగారి వీరభద్రరావు, ఆచంట నారాయణ మూర్తి, భాస్కరభట్ల కృష్ణారావు, స్థానం నరసింహారావు, న్యాపతి రాఘవరావు, దాశరథి – ఇలా ఎందరో మహానుభావుల సమక్షంలో నౌఖిరీ. నిజానికి అది ఉద్యోగం కాదు. వైభవం. అప్పటికి రజనిగారు పాటలు రాసి, బాణీలు చేయగా పాటలను చిరస్మరణీయం చేసిన ఒక తరం వెళ్లిపోయింది. ఎస్. వరలక్ష్మి, టంగుటూరి సూర్యకుమారి, శాంతకుమారి – ఇలాగ. నా జీవితంలో అదృష్టం – తర్వాతి కాలంలో మళ్లీ వారందరితోనూ పరిచయాలు ఏర్పడ్డాయి. కొందరితో పనిచేశాను. ఓ ముప్ఫై సంవత్సరాల తర్వాత ఇంగ్లండులో కెంట్‌లో మిత్రులు డాక్టర్ వ్యాకరణం రామారావు గారింట్లో సూర్యకుమారి గారిని కలిశాను. ‘‘మీ అందరివల్లే నేను రేడియోలో చేరాను’’ అని ఆమెకు గుర్తు చేశాను.

మద్రాసు కేంద్రంలో తెలుగు శాఖలో నాటక శాఖను కీ.శే.యండమూరి సత్యనారాయణ (శ్రీవాత్సవ) నిర్వహించేవారు. ఆయన గొప్ప రచయిత. షహరజాద్ – అరేబియన్ నైట్స్ – వేయిన్నొక్క రాత్రుల కథలు, లైలామజ్ను, షిరీజ్ ఫర్‌హద్ లాంటి ఇతివృత్తాలతో నాటకాలు రాసేవారు. వాటిలో పాటలూ, సంగీత రచనా రజనీయే.

ఏటా వార్షిక సాహిత్య సమీక్షలు రాసిన యండమూరి సత్యనారాయణ ఆకాశవాణి మద్రాసులో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా చిరకాలం పనిచేశారు. వారి కలం పేరే ‘శ్రీవాత్సవ’, ‘ఆనంద నిలయమ్’ 1954లో ఒకసారి, 1957లో మరోసారి మద్రాసు, విజయవాడ కేంద్రాలలో.. ప్రసారమైంది. ఇందులో ఆరు ప్రధాన పాత్రలు – తండ్రి, తల్లి, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు. వంగర వెంకట సుబ్బయ్య, ఎన్.ఉదయలక్ష్మి, వావికొలను కృష్ణకుమారి, కాటూరి అన్నపూర్ణగార్లు రెండుసార్లు పాల్గొనడం విశేషం. 1954లో వై.జోగారావు, ఎ.ఎస్. గిరిగార్లు నటించగా 1957లో అవే పాత్రలను ఎ.పుండరీకాక్షయ్య, పేకేటి శివరామ్‌గార్లు చేశారు. వంగర, పుండరీకాక్షయ్య, పేకేటి గార్లు సినిమారంగంలో కూడా ప్రసిద్ధులని గమనించాలి.

 శ్రీవాత్సవ విమర్శకులుగా పేరు తెచ్చుకొన్నారు. భారతి, జయంతి, ఆంధ్ర పత్రిక తదితర పత్రికలలో సాహిత్య సింహావలోకనాలు ఏటా ప్రచురించేవారు. ఉష:కిరణాలు, శారదాధ్వజం గ్రంథాలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1966లో బహుమతి ప్రకటించింది. తంజావూరు నాయకరాజుల సాహిత్య భాషను శారదా ధ్వజంలో వివరించారు. ఆనాటి సాంఘిక సాంస్కృతిక రాజకీయ చారిత్రక స్థితిగతులు ఆయన ఆ గ్రంథంలో విశ్లేషించారు. జలతారు జాబిల్లి పేరుతో బాలలకు ఒక పుస్తకం వ్రాశారు. వయోజన విద్యావ్యాప్తిలో భాగంగా టెలివిజన్ కథ రంగురంగుల పూలు అనే గ్రంథాలు వ్రాశారు.

అలనాటి గాయని ఏ.పి.కోమల

రేడియో కార్యక్రమాలు నిర్వహించు యండమూరి సత్యనారాయణ చాలా సుప్రసిధ్ధులు.పాతతరం రేడియో శ్రోతలందరికీ ఆయన గురించి బాగా తెలుసు .ఆయన కార్యక్రమం ప్రారంబం కావడానికి పది నిముషాలు ముందు పాట రాసేవారు .ఆ పాటని అప్పటికప్పుడు నేర్చు కొని ఆమె పడేవారు .దాంతో ఆమె ప్రతిభని గుర్తించి 1944లో రేడియో ఆర్టిస్ట్ ఉద్యోగం ఇచ్చారు .అప్పుడామెకు 50 రూపాయల జీతం .అప్పుడు రెండో ప్రపంచ యుద్దం జరుగుతు ఉండటంతో వార్ అలెవన్సుస్ కింద మరో 14 రుపాయాలు కలిపి మొత్తం 64 రూపాయలు జీతం ఇచ్చారు .ఆమె మొదటి సంపదనే అదే . స్వతంత్రం వచ్చే వరకు ఎప్పటి ట్రిప్లికేన్ నుంచి లాగుడు రిక్షా లో ఎగ్మూరు స్టేషన్ కి వెళ్లి ,రిక్షా అతనికి నెలకి రెండు రూపాయలు ఇచ్చేవారు .అప్పటికి అందరికి తెలిసిన తాత ఉమామహేశ్వర రావు అప్పట్లో రేడియో అనౌన్సర్ గ పనిచేసారు .
త్యాగయ్యలో లో తొలి పాట ……

యామిజాల జగదీశ్

ఇది అరవై ఏళ్ళ పైమాటే. గోరాశాస్త్రిగారు చలంగారిపై అలిగి శ్రీవాత్సవ గారితో ఓ విమర్శ రాయించారు. శ్రీవాత్సవ గారి అసలు పేరు యండమూరి సత్యనారాయణ రావుగారు.

ఈ వ్యాసంతో అప్పట్లో వాదవివాదాలు జరిగాయి. ఈ వివాదాల వ్యవహారాలలో బి.వి. నరసింహారావుగారు, కె.కె. నాయుడుగారు తదితరులు పాల్గొన్నారు.
అయినప్పటికీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారితో శ్రీవాత్సవగారి విమర్శకు ఓ దీటైన జవాబు ఇప్పించడానికి చిన్నారావుగారు, నరసింహారావుగారు, వజీర్ రహ్మాన్ గారు శాస్త్రిగారింటికి వెళ్ళారు.  
చిన్నారావుగారు చిత్రకారులు. నరసింహారావుగారు స్త్రీ వేషధారణతో మంచి నర్తకిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం గడించినవారు. రహ్మాన్ గారేమో అప్పుడే కాకినాడలో డిగ్రీ పూర్తి చేసారు. చలంగారంటే గాఢమైన అభిమానమున్నవారు.
ఈ ముగ్గురి విజ్ఞప్తితో శాస్త్రిగారు ప్రజామాతలో సాహిత్యభాణం అనే శీర్షికతో ఓ వ్యాసం రాశారు. “భాణం” అంటే ఇక్కడో మాట చెప్పుకోవలసి ఉంది. సంస్కృత రూపక భేదాలలో ఓ ప్రక్రియ. ఎదుటి వారి పాత్రల సంభాషణలను తనే ప్రస్తావిస్తూ చేసే సంభాషణ. మరొక మాటేమిటంటే, భారవిలో భా అంటే భావుక, ర అంటే రచన, వి అంటే విమర్శ.ఈ విషయం గొర్రెపాటి వెంకట సుబ్బయ్యగారు 1958 ప్రాంతంలో ప్రచురించిన చలం జీవితం – సాహిత్యం అనే పుస్తకంలో ఉన్న విషయాన్ని ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు తమ వ్యాసంలో పేర్కొన్నారు.
ఆ రోజుల్లో శాస్త్రిగారి వ్యాసం ఓ సంచలనం సృష్టించింది.
చలంగారిని విమర్శించిన శ్రీవాత్సవగారు  ఈ వ్యాసాన్ని చదివిన తర్వాత శాస్త్రిగారింటికి వెళ్ళి “మీ ప్రతిస్పందన చాలా బలంగా ఉంది” అన్నారు.
మరోవైపు, చలంగారు శాస్త్రిగారికి ఓ ఉత్తరం రాస్తూ చలానికి విలువ కట్టిన రచనగా తెలిపారు.

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-200 · 200-మల్లీశ్వరి కృష్ణ దేవరాయలు ,మహా సాహిత్యవేత్త ,రేడియో అసిస్టెంట్ డైరెక్టర్-శ్రీ వాత్సవ

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-200 · 200-మల్లీశ్వరి కృష్ణ దేవరాయలు ,మహా సాహిత్యవేత్త ,రేడియో అసిస్టెంట్ డైరెక్టర్-శ్రీ వాత్సవ

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-200

· 200-మల్లీశ్వరి కృష్ణ దేవరాయలు ,మహా సాహిత్యవేత్త ,రేడియో అసిస్టెంట్ డైరెక్టర్-శ్రీ వాత్సవ

· శ్రీ వాత్సవ గా ప్రసిద్ధి చెందిన యండమూరి సత్యనారాయణ తూర్పు గోదావరి జిల్లా పసలపూడి 1913లో మే21న జన్మించారు .ఉన్నత విద్య పూర్తీ అయ్యాక ఆకాశవాణి విజయవాడ ,మద్రాస్ కేంద్రాలలో కార్యక్రమ నిర్వాహకులు గా చాలాకాలం సేవ చేశారు . అసిస్టెంట్ డైరెక్టర్ గా ఢిల్లీ వెళ్ళారు .

· శ్రీ వాత్సవ సాహిత్య విమర్శకులుగా విశేష కీర్తి పొందారు .భారతి ,జయంతి ,ఆంద్ర పత్రిక మొదలైన పత్రికలలో ప్రతి ఏటా’’ సాహిత్య సింహావలోకనం ‘’రాసి ప్రచురించేవారు .ఆయన రాసిన ఉషః కిరణాలు ,శారదా ధ్వజం గ్రంధాలకు 1966లో ఆంద్ర ప్రదేశ సాహిత్య అకాడెమి బహుమతి లభించింది .తంజావూర్ నాయక రాజుల సాహిత్యభాషను ‘’శారదాధ్వజం ‘’లో వివరించారు .ఆనాటి సాంఘిక ,సాంస్కృతిక రాజకీయ ,చారిత్రిక స్థితి గతులను అందులో చక్కగా విశ్లేషించారు .’’జలతారు జాబిల్లి ‘’అని బాలలకోసం ఒక పుస్తకం రాశారు .వయోజన విద్యా వ్యాప్తికోసం టెలివిజన్ కు ‘’రంగు రంగుల పూలు, ‘’కత్తి’’గ్రంధాలు రాశారు .వీటికి కేంద్ర ప్రభుత్వ పురస్కారాలు లభించాయి.పెళ్ళాడే బొమ్మ ,తీరని కోరికలు నాటకాలు ,నాగరిక ,చెట్లు గేయ సంపుటి రచించారు .

· బి ఎన్ రెడ్డి దర్శకత్వం లో వచ్చిన ఆల్ టైం క్లాసికల్ చిత్రం ‘’మల్లీశ్వరి ‘’లో కృష్ణ దేవ రాయలుగా అద్భుతంగా నటించి రాజసం వీరం దాన దయాగుణాలను ప్రస్ఫుటంగా వ్యక్తీకరించారు .ఆతర్వాత మరికొన్ని సినిమాలలోనూ నటించారు .

· మల్లిక (చిన్నపుడు బేబీ మల్లిక, పెద్దయ్యాక భానుమతి), నాగరాజు (చిన్నపుడు మాస్టర్ వెంకటరమణ, పెద్దయ్యాక నందమూరి తారక రామారావు) బావా మరదళ్ళు. ఒక చిన్నపల్లెలో కలసి పెరిగారు. ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. నాగరాజు శిల్పి. మల్లిక మంచి గాయని. ఒకసారి వారు వర్షం వచ్చినపుడు ఒక పాతగుడిలో ఉండగా అక్కడికి మారువేషంలో ఆ దేశపురాజు శ్రీకృష్ణదేవరాయలు (శ్రీవత్సవ), ఆయన ఆస్థాన కవి అల్లసాని పెద్దన (న్యాపతి రాఘవరావు)వస్తారు. అతిధులకు మల్లిక, నాగరాజు ఆహారం సమకూర్చి ఆదరిస్తారు. మల్లీశ్వరి జావళి నృత్యాన్ని చూసి ఆనందిస్తాడు నాగరాజు. శ్రీకృష్ణదేవరాయలు, వారి ఆస్థాన కవి బృందం కూడా ఆ నృత్యాన్ని చూసి ఆనందపడతారు. వారిని సాగనంపుతూ నాగరాజు వేళాకోళంగా మా మల్లికి రాణివాసం పల్లకి పంపించండి అని అంటాడు.

· ఇక్కడే ‘’పిలచినా బిగువటరా ‘’ జావళి కృష్ణశాస్త్రి గారు రాయగా భానుమతి పాడుతూ అభినయిస్తుంది .రాయలు పెద్దన మురిసిపోతారు .

· 1969లో 56వ ఏట శ్రీ వాత్సవ ఢిల్లీ లో మరణించారు . ఈయన కుమారుడు యండమూరి రామచంద్రరావు జర్నలిస్ట్ గా బెజవాడలో ఉన్నారు .

· ఉగాది వచ్చింది అంటే శ్రీ వాత్సవ సాహిత్య సింహావలోకనం కోసం ప్రతి సంవత్సరం ఎదురు చూసే వాళ్ళం .అంత బాగా రాసేవారు .

· సశేషం

· అనుకోకుండా ఈ శీర్షిక మొదలుపెట్టి ఇవాల్టికి 200మంది మరపురాని సినీ మహానుభావులపై రాయగలిగాను .ప్రస్తుతం కొన్ని రోజులు విరామం .తర్వాత మిగిలిన వారి గురించి రాస్తాను

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-199199-రంగస్థలనటుడు ,ప్రయోక్త ,నాట్యకళా పోషకుడు ,కూచిపూడిసిద్దేంద్ర కళాక్షేత్ర నిర్మాత నిర్వాహకుడు ,బాలనాగమ్మ ,సారంగధర సినీ నటుడు ,కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డీ ,రాష్ట్రపతి పురస్కార గ్రహీత,అభినవ కృష్ణ  –బందా కనకలింగేశ్వరరావుబందా కనకలింగేశ్వరరావు

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-199
199-రంగస్థలనటుడు ,ప్రయోక్త ,నాట్యకళా పోషకుడు ,కూచిపూడిసిద్దేంద్ర కళాక్షేత్ర నిర్మాత నిర్వాహకుడు ,బాలనాగమ్మ ,సారంగధర సినీ నటుడు ,కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డీ ,రాష్ట్రపతి పురస్కార గ్రహీత,అభినవ కృష్ణ  –బందా కనకలింగేశ్వరరావు
బందా కనకలింగేశ్వరరావు, (జనవరి 20, 1907- డిసెంబరు 3, 1968) సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు.
ఇతను కృష్ణా జిల్లాలోని ఆటపాక గ్రామంలో జన్మించారు. ఆటపాకలో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత బందరు నోబుల్ కళాశాలలో చదివి, మద్రాసు లా కళాశాల నుండి 1932 లో బి.ఎల్. పట్టా పుచ్చుకున్నారు. 1934లో మొదట న్యాయవాదిగా పనిచేసి, తరువాతి కాలంలో నాటక ప్రదర్శనమే వృత్తిగా చేసుకున్నారు.ఇతను నాటకాలలో అనేక పాత్రలు పోషించాడు. వాటిలో బాహుకుడు, బిల్వమంగళుడు ఇష్టమైనవి.
ఏలూరులో 1938లో నాటక కళాశాలను స్థాపించి పలువురు నటులకు శిక్షణ ఇచ్చారు. ప్రభాత్ థియేటర్ అనే సంస్థను స్థాపించి నాటక ప్రయోక్తగా నూతన ప్రదర్శన రీతులను ప్రవేశపెట్టారు. తెలుగు సినిమా ప్రపంచంలో మొదటి తరం సినిమాలైన బాల నాగమ్మ, ద్రౌపదీ మానసంరక్షణం, పాదుకా పట్టాభిషేకం (1945 సినిమా), సారంగధర (1937 సినిమా) సినిమాలలో నటించాడు.కూచిపూడి నాట్యకళకు ఎనలేని సేవచేశారు. ప్రభుత్వ సాయంతో కూచిపూడి గ్రామంలో సిద్ధేంద్ర కళాక్షేత్రం నెలకొల్పి నిర్వహించారు.[1] ఈ కళ గురించి ప్రముఖ పత్రికలలో వ్యాసాలు రాసి దాని ప్రాధాన్యాన్ని అందరికీ తెలియజేశారు.[2] 1956 లో ఆకాశవాణిలో నాటక ప్రయోక్తగా పనిచేసి మంచి నాటకాలను, నాటికలను ప్రసారం చేశాడు. వీరు ఆటపాక గ్రామంలో ఒక శివాలయాన్ని, ఒక చెరువును తవ్వించారు, ఒక వేద పాఠశాలను స్థాపించారు.
ఇతను 1964 లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును గెలుపొందాడు. వీరి ఉత్తమ నటనకు రాష్ట్రపతి అవార్డు లభించింది.వీరికి ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
వీరి జన్మ శతాబ్ది ఉత్సవాలను హైదరాబాదులో 2006-07 సంవత్సరాలలో ఘనంగా నిర్వహించారు.
  ఏలూరులో కొంతకాలం న్యాయవాదిగా ఉన్నారు .తాలూకా బోర్డ్ సభ్యులయ్యారు .నాటకాలు ఆరవప్రాణం .కృష్ణ పాత్రకు పెట్టిందిపేరు .సారంగధర ,బిల్వమంగళపాత్రలకు జీవం పోశారు .బళ్లారిలో చిత్ర నలీయం నాటకం లో బాహుకుడుగా నటింఛి ,బళ్ళారి రాఘవ ప్రశంసలు పొందారు .ఎన్నో పౌరాణిక ,చారిత్రకనాటకాలు ప్రదర్శించారు .కణ్వ ,అభిమన్యు ,ప్రతాపరుద్ర ,గిరీశం అల్లూరి ,పాత్రలను దీటుగా పోషించారు .ఈయన తండ్రి శ్రీశైలంగారు కొల్లేటి లంక కరణం .బియేబందరులో పూర్తీ చేసి ,మద్రాస్ లో లా చదివి ,ఏలూరులో ప్రాక్టీస్ పెట్టి ‘’ప్రభాత్ ధియేటర్స్ ‘’నాటక సమాజం స్థాపించి 40ఏళ్ళు నిర్వహించారు .
  ద్రౌపదీ మాన సంరక్షణం సినిమాలో కృష్ణ పాత్రతో సినీ అరంగేట్రం చేసి ,సారంగధర ,పాడుక ,కాలచక్రం బాలనాగమ్మ లలో నటించారు .సినిమా పద్ధతులు అలవాట్లు నచ్చక ,1942లో ఏలూరు తిరిగి వచ్చారు .నాటక రంగ పరిశీలనకోసం 1955లో రష్యా ,ఫిన్లాండ్ ,జెకోస్లోవేకియా దేశాలు పర్యటించారు .
  1956 విజయవాడ ఆకాశవాణి కేంద్రం లో నాటక ప్రయోక్తగా చేరి 12ఏళ్ళు  అవిరళకృషి చేసి ఎన్నెన్నో అద్భుత నాటకాలను ప్రసారం చేశారు .కూచిపూడి నాట్య సంప్రదాయానికి ప్రాణం పోశారు .కేంద్ర సంగీత నాటక అకాడెమి ,ఆంధ్రప్రదేశ్ నాటకాకదేమి సభ్యత్వాలు ఆయనను వరించాయి .అభినవ కృష్ణ ,నటశేఖర బిరుదులు పొందారు ..ఉత్తమ నటుడుగా 1963లో రాష్ట్రపతి అవార్డ్ అందుకొన్నారు .రేడియో నాటికలను ఒక సంపుటిగా ప్రచురించి  శాశ్వతత్వాన్ని  చేకూర్చారు ,కూచి పూడి నృత్యం పై బందా గారి రచన పరమ ప్రామాణికం .1968 డిసెంబర్ 3 నాటక ధ్రువతార బందా కనుమూశారు ,అప్పటినుంచి ప్రతియేటా బందా వర్ధంతి కూచిపూడిలో జరుపుతున్నారు
  నేను విజయవాడ ఎస్ ఆర్ అర సివి ఆర్ కాలేజిలో ఇంటర్ 1956-58లో చదువుతున్నప్పుడు బందాగారు మా ఆహ్వానం పై వచ్చి R -4 లో కృష్ణ పాత్ర ధారణ చేసి అలరించటం ఇంకా గుర్తు ఉంది .అప్పుడే రజని ,వింజమూరి కనకదుర్గ గార్లు కూడా లలిత గీతాలు పాడగా విని ఆనందించాం. కూచిపూడి సిద్ధేంద్ర కళా క్షేత్ర నిర్మాణం ఆయన చేతులమీదుగా జరగటం దాని ఆవిష్కరణ వేడుకలకు కూచిపూడి వెళ్లి చూడటం నాకు మరువరానిఅనుభవం .బందా ఒక లిజెండరీ మహాపురుషుడు .
   సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-4-22-ఉయ్యూరు 

1. ↑




• 

       
•         

• —






• 

       
•         

• —

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-198198ప్రముఖ సాహితీవేత్త ,నటుడు రచయిత,రేడియో ఉద్యోగి ,ఏకాంబరం ఫేం ,అమెరికా అబ్బాయి సినిమాకు  కధ అల్లినకళారత్న అవార్డీ –జీడిగుంట రామచంద్ర మూర్తి

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-198
198ప్రముఖ సాహితీవేత్త ,నటుడు రచయిత,రేడియో ఉద్యోగి ,ఏకాంబరం ఫేం ,అమెరికా అబ్బాయి సినిమాకు  కధ అల్లినకళారత్న అవార్డీ –జీడిగుంట రామచంద్ర మూర్తి
జీడిగుంట రామచంద్ర మూర్తి ప్రముఖ సాహితీవేత్త.[1] రేడియో నాటకాలు రాయడం, వాటిల్లో నటించడం; కథలు, నాటికలు, నవలలు, సినిమాలకు సంభాషణలు, అనువాద వ్యాసాల రచన… ఇలా అన్నింట్లో తన కలానికున్న సత్తా చాటారు జీడిగుంట రామచంద్రమూర్తి.
జీవిత విశేషాలు
ఆయన ప్రముఖ తెలుగు రచయిత. ఆయన ఆలిండియా రేడియో, హైదరాబాదు కేంద్రంలో 28 సంవత్సరాలపాటు తన సేవలనందించారు.[3] కేవలం రచనపై ఉన్న ఆసక్తితోనే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని ఆకాశవాణిలో అడుగుపెట్టి పదవీ విరమణ వరకు అందులోనే ఉండిపోయారాయన[2].
రేడియో రచయితగా
ఆయన “కుటుంబ నియంత్రణ” విభాగంలో స్క్రిప్ట్ రచయితగా, తర్వాత “నాటక విభాగం”లో కార్యక్రమ నిర్వహణాధికారిగా పనిచేశారు. అప్పుడే దాదాపు 40 నాటికల్ని, నాటకాల్ని రాసి ప్రసారం చేశారు. అలాగే ప్రయోక్తగా మల్లాది వెంకటకృష్ణమూర్తి (మందాకిని), ముదిగొండ శివప్రసాద్ (అనుభవ మంటపం), వాసిరెడ్డి సీతాదేవి (ఉరితాడు), యండమూరి వీరేంద్రనాథ్ (నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య) లాంటి ప్రముఖ రచయితల నవలలను రేడియో నాటకాలుగా ప్రసారం చేశారాయన[2]. రేడియోలో ఆదివారాల్లో వచ్చే “కార్మికుల కార్యక్రమం”లో “బాలయ్య”గా ఆయన పాత్ర పోషించారు. చిన్నక్క, ఏకాంబరం పాత్రలతో పాటు బాలయ్యగా శ్రోతలు ఆయనను ఆదరించారు. సుమారు నాలుగేళ్లు ఈ కార్మికుల కార్యక్రమాన్ని నిర్వహించి రికార్డు సృష్టించారు. అప్పట్లో ప్రతి ఆదివారం సంక్షిప్త శబ్దచిత్రం శీర్షిక తో ప్రసారమయ్యే తెలుగు చలనచిత్రాల కూర్పు కూడా చేసేవారు.
సినీరంగ ప్రవేశం
ఆయన ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన అమెరికా అబ్బాయి సినిమాకు కథ రాసారు. దుక్కిపాటిగారికి రేడియో వాళ్లంటే ఎంతో అభిమానం. ఆ చిత్రానికి ప్రముఖ రేడియో ఆర్టిస్ట్ ఎర్రమనేని చంద్రమౌళి మాటలు రాశారు. తర్వాత ఈ ప్రశ్నకు బదులేది, పెళ్లిళ్లోయ్ పెళ్లిళ్లు అనే సినిమాలకు సంభాషణలు రాశారు. మరో మాయాబజార్, అమృత కలశం చిత్రాలకు సహ రచయితగా వ్యవహరించారు. టెలివిజన్ లో బాగా ప్రేక్షకాదరణ పొందిన ‘మనోయజ్ఞం’ సీరియల్‌కు 40 ఎపిసోడ్లకు స్క్రిప్ట్ రాశారు.[2]
రచనలు
• నిన్నటి కొడుకు కథలు[4]
• ఆశ్రుఘోష (నాటకం)- 2004 తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ అవార్డు లభించింది.[5]
• ప్రేమకు మిగిలింది
• గోదానం
• అమూల్యం
• నిన్నటి కొడుకు
• అమ్మకో ముద్దు
• జీడిగుంట రామచంద్రమూర్తి కథలు
• వెండితెర సాక్షిగా
• గుడిలో పువ్వు
• జీవన వాహిని (నవల)
• అనుభూతులు అనుబంధాలు (నవల)
• నల్ల మల్లి (నవల)
• మూడు నాటికలు
^ బావా బావా పన్నీరు
• తాతాధిత్తై తధిగిణతోమ్
” శ్రీ అంజనేయం ^ నేనూ నా జ్ఞాపకాలు
వ్యక్తిగత జీవితం
ఆయనకు ముగ్గురు కొడుకులు. ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉంటారు. రెండో కుమారుడు జీడిగుంట శ్రీధర్ టీవీ సీరియళ్లలో నటుడు. అలాగే వెండితెరపై వర్ధమాన నటుడు వరుణ్ సందేశ్ ఆయన పెద్ద కుమారుడు విజయసారథి కుమారుడు.[6] మనుమరాలు వీణా సాహితి కూడా పాటల రచయిత్రి. ఆమె అలా మొదలైంది సినిమాలో పాటలను వ్రాసారు.
అవార్డులు
• ప్రతి సంవత్సరం చాట్ల శ్రీరాములు నెలకొల్పిన “ప్రతిభా పురస్కారం” 2015 సంవత్సరానికి గానూ లభించింది.[7]
• 2015 మన్మధ నామ సంవత్సర కళారత్న పురస్కారాన్ని “సాహిత్యం” విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందజేసింది.[8]
• సారా నిషేధ ఉద్యమంపై రచించిన ‘పరివర్తన’కు ఉత్తమ రచయితగా నంది అవార్డు.
• ‘ఊర్మిళ-ఉగాది రచనల పోటీ’కు ద్వితీయ ఉత్తమ రచయితగా నంది అవార్డు.
• దూరదర్శన్‌లో ప్రసారమైన ‘పునరపి’ సీరియల్‌కు ఉత్తమ టెలీఫిల్మ్ రచయితగా నంది అవార్దు.
• ‘భర్తృహరి సుభాషిత కథలు’ లఘుచిత్రాలకు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు
• “గుండెపోటు” అనే కథకు 2007 సంవత్సర సోమేపల్లి సాహితీ పురస్కారం అందుకున్నారు.
మరణం
శ్రీ రామచంద్ర మూర్తి గారు తన 80వ యేట 2020,నవంబర్ 10న హైదరాబాదులో కేర్ (Care) ఆసుపత్రిలో Covid-19 చికిత్స పొందుతూ మరణించారు[9].
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-4-22-ఉయ్యూరు
1. ↑




Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-197

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-197
• 197-అఖిలాంధ్ర రైతు సభ ,ఆంద్ర నాటక కళాపరిషత్ కీలక బాధ్యతలు ,హేతువాది సహాయనిరాకర ఉద్యమ నేత ,ప్రజామిత్ర సంపాదకుడు ,మాలపల్లి ,రైతుబిడ్డ
• నిర్మాత ,దర్శకుడు ,పల్నాటి యుద్ధం దర్శకుడు,ఫిలిం చేంబర్ అధ్యక్షుడు  –గూడవల్లి రామబ్రహ్మం
• గూడవల్లి రామబ్రహ్మం (జూన్ 24, 1902 – అక్టోబర్ 1, 1946) ప్రఖ్యాత సినిమా దర్శకుడు, సంపాదకుడు. సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు, అంతకు మించిన సామాజిక ప్రయోజనముందని మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాల ద్వారా చాటిన దార్శనికుడు.హేతువాది
జీవిత విశేషాలు

1898 జూన్ 24న కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలములోని నందమూరు గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు గూడవల్లి వెంకయ్య – బాపమ్మల కలిగిన ఆరుగురు పిల్లలలో రామబ్రహ్మం చిన్నకొడుకు. తొలి తెలుగు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ స్వగ్రామం కూడా నందమూరే. రామబ్రహ్మం చదువు ఇందుపల్లి, గుడివాడ, బందరు లలో సాగింది. అతనికి 18 ఏళ్ళ వయసులో (1920)లో ఇందుపల్లి గ్రామానికి చెందిన కోగంటి నాగయ్య కుమార్తె శారదాంబతో వివాహం జరిగింది. తర్వాత ఆయన చదువు మానేసి తన మామగారింట్లో విదేశీ వస్త్రాలను దహనం చేసి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు.
1924లో ఫ్రెండ్స్ అండ్ కో అనే పేరుతో ఒక స్టేషనరీ షాపు ప్రారంభించాడు. అయితే ఆ షాపు వ్యాపారానికి బదులుగా రచయితలు, కళాకారుల సమావేశాలకు, చర్చలకు ఒక మంచి కేంద్రంగా తయారయింది. దాంతో వ్యాపారం తగ్గిపోయి 1930లో మూసివేయవలసి వచ్చింది. ఆయన 1931లో అఖిలాంధ్ర రైతు మహాసభను ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడి హోదాలో నిర్వహించాడు. 1934లో ఆంధ్ర నాటక పరిషత్ చతుర్థ సమావేశాలకు కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. దీనికి నాట్యకళ ప్రపూర్ణ బళ్ళారి రాఘవ అధ్యక్షులు. ఆయన కమ్మ కుల చరిత్ర అనే పుస్తకం వ్రాశాడు. ఆ పుస్తకం వ్రాయడం కోసం కమ్మ కులం గురించి అవసరమైన సమాచారం సేకరించడానికి కడపకు వెళ్ళాడు. అక్కడ ఆయన గండికోట పట్ల ఆకర్షితుడై ఆ కోట గురించి పరిశోధన చేసి ‘గండికోట పతనం’ అనే నాటకం వ్రాశాడు. ఈ నాటకం అనేక నగరాల్లో ప్రదర్శించబడి మంచి ప్రజాదరణ పొందింది.
ప్రజామిత్ర
ఆయన మద్రాసు నుంచి ‘ప్రజామిత్ర’ వారపత్రికను పదేళ్ళ పాటు నడిపాడు. ఆ రోజుల్లో మద్రాసుకు వెళ్ళే తెలుగు రచయితలు, కళాకారులకు ప్రజామిత్ర ఆఫీసే సమావేశ ప్రదేశమైంది. అంతవరకు రాజకీయ పత్రికగా నడిచే ప్రజామిత్రను సంగీత, సాహిత్య, నాటక, చిత్రకళా వ్యాసాలతో ఒక అపురూపమైన పత్రికగా రామబ్రహ్మం తీర్చిదిద్దారు. ఆయన ప్రజామిత్ర లోనే కాక సమదర్శిని, వాది లాంటి ఇతర పత్రికల్లో కూడా ఆర్టికల్స్ వ్రాశాడు.
సముద్రాల రాఘవాచార్య, కుర్రా సుబ్బారావులు ఇతనికి సహాయపడుతుండేవారు. నార్ల వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రభలో చేరక మునుపు 1937లో ఇతనికి సహాయ సంపాదకునిగా పనిచేశారు. ఆ తరువాత ఆండ్ర శేషగిరిరావు, ముద్దా విశ్వనాథం, బోయి భీమన్నలు కూడా పత్రికా సహాయ సంపాదకులుగా పనిచేశారు.
తాపీ ధర్మారావు, వేలూరి శివరామశాస్త్రి, త్రిపురనేని గోపీచంద్ మొదలైన వారు సాహిత్య వ్యాసాలు రాసేవారు. సంఘాన్ని నిష్కర్షగా విమర్శించి సంచలనం కలిగించే రచనలతో పత్రిక సాగించాలి. అపూర్వ విషయాలతో పత్రిక విజ్ఞాన సర్వస్వం అనిపించుకోవాలి అనే లక్ష్యాలతో రామబ్రహ్మం సమర్ధులైన రచయితల సహకారంతో పత్రికను నిర్వహించేవారు.
సినిమా జీవితం
ఆయన ఆసక్తి సినిమాల మీదకుమళ్ళాక ఆయన పత్రికారంగాన్ని వదిలి పెట్టి సారథిచిత్ర అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఆయన 1934లో తీసిన శ్రీ కృష్ణ లీలలు చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర వేయించడం కోసం రామబ్రహ్మం, నిర్మాత పి.వి.దాసు కలిసి రాజేశ్వర రావు అనే నటుడిని బెంగుళూరు నుంచి తీసుకు వచ్చారు. తర్వాత 1936లో విడుదలైన ద్రౌపదీ వస్త్రాపహరణం సినిమాలో కూడా ఆయన పనిచేశాడు. ఈ అనుభవాలతో చిత్రనిర్మాణ కళ తనకు పట్టుబడిన తర్వాత, పౌరాణిక చిత్రాల జోరులో కొట్టుకుని పోతున్న జనం అభిరుచులను మార్చడానికి సాహసించి సఫలుడైన ధీశాలి గూడవల్లి. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం మాలపిల్ల ఆయన తీసిన తదుపరి చిత్రం. సారథిచిత్ర బ్యానర్ మీద రామబ్రహ్మం నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా 1938లో విడుదలైంది.
మాలపిల్ల

దక్షిణాది రాష్ట్రాల్లో బ్రాహ్మణేతరుల ఆత్మగౌరవ సంరక్షణ ఉద్యమంతో బాటు గాంధీజీ హరిజనోద్ధరణ ఉద్యమం కూడా జోరుగా సాగుతున్న నేపథ్యంలో రామబ్రహ్మం కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మాలపిల్ల చిత్రాన్ని ఉన్నత ప్రమాణాలతో నిర్మించాడు. అసలు సిసలు సామాజిక ప్రయోజనం గల చిత్రంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన చిత్రం మాలపిల్ల. జస్టిస్ పార్టీ వారి సమదర్శినితో బాటు ప్రజామిత్ర పత్రికకూ సంపాదకుడైన రామబ్రహ్మం పత్రికల కన్నా సినిమాయే శక్తివంతమైన ప్రచార సాధనమని గుర్తించి ఊపిరిపోసిన చిత్రమిది. ఆనాడు దేశాన్ని పట్టి ఊపేస్తున్న హరిజనోద్యమాన్ని రామబ్రహ్మం తన సినిమాకు ఇతివృత్తంగా తీసుకుని,గుడిపాటి వెంకటచలంతో కథారచన చేయించాడు. ఈ సినిమాకు తాపీ ధర్మారావు సంభాషణలు వ్రాశాడు.చలం, ధర్మారావు ఇద్దరూ ఆనాటి సమాజంలో చలామణి అవుతున్న అర్థం లేని ఆచారాలను అపహాస్యం చేసిన వారే. మాలపిల్ల చిత్రం లోని పాటలకు భావకవి బసవరాజు అప్పారావు కావ్యగౌరవం కల్పించాడు.ఇందరు ప్రముఖుల సౄజనాత్మక భాగస్వామ్యంతో తయారైన మాలపిల్ల తెలుగు నాట అఖండ విజయం సాధించింది. జస్టిస్ పార్టీ నేతృత్వంలో 1920వ దశాబ్దంలో బ్రాహ్మణేతరుల ఆత్మగౌరవ సంరక్షణ ఉద్యమం జోరుగా నడిచిన ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం ఘన విజయం సాధించింది.
మాలపిల్ల చిత్రం కాంచనమాలను సూపర్ స్టార్ ను చేసింది. పౌరాణిక చిత్రాల జోరులో ప్రప్రథమంగా ఒక సమకాలీన సమస్యను ఇతివృత్తంగా తీసుకుని నిర్మించిన ఈ చిత్రం అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు భాషాప్రాంతాల్లోనే గాక ఇతర భాషా ప్రాంతాల్లో కూడా పెద్ద హిట్. నాటి గాయని, నటి సుందరమ్మతో కలిసి ఆమె పాడిన నల్లవాడే గొల్లపిల్లవాడే సూపర్ హిట్ అయింది. అప్పటికింకా భాషాదురభిమానం తలెత్తక పోవడంతో దక్షిణభారతమంతటా ఆ పాట జనం నాలుకలపై నర్తించింది.
ఆ నాటి సమాజంలో ఈ సినిమా తీవ్ర సంచలనం కలిగించింది. ఈ చిత్రానికి వ్యతిరేకంగా తెలుగునాట కరపత్రాల పంపిణీ జరిగింది. అప్పట్లో బెజవాడలో జరిగిన ఒక ‘నిరసన మహాసభ ‘ బ్రాహ్మణులు మాలపిల్లను చూడరాదని తీర్మానించింది. అయినా దొంగచాటుగా ఆ సినిమాను చూసి వచ్చిన యువబ్రాహ్మణులకు తల్లిదండ్రులు వీధిలోనే శుద్ధి స్నానం చేయించి గానీ ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. రామబ్రహ్మం కూడా “మాలపిల్ల ను చూడడానికి వచ్చే పిలక బ్రాహ్మణులకు టికెట్లు ఉచితం” అంటూ అగ్రహారాలలో కరపత్రాలు పంచాడు. ఆయన తీసిన తదుపరి చిత్రం రైతుబిడ్డ
రైతుబిడ్డ
మాలపిల్ల తర్వాత జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతుబిడ్డ తీసి రామబ్రహ్మం తన సాహస ప్రవృత్తిని మళ్ళీ చాటుకున్నాడు. 1925 లో ఆవిర్భవించిన ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం ఛత్రం క్రింద జాగృతులైన సన్నకారు రైతులు తమ హక్కుల సాధనకు నడుం కట్టారు. 1937లో మద్రాసులో కాంగ్రెసు ప్రభుత్వం నియమించిన కమిటీ ఒకటి భూమికి యజమాని రైతేనని తీర్మానించింది. ఈ చారిత్రక నేపథ్యంలో రామబ్రహ్మం రైతుబిడ్డను నిర్మించాడు.
ఈ సినిమాకు రామబ్రహ్మం స్వయంగా కథ సమకూర్చగా త్రిపురనేని గోపీచంద్ మాటలు వ్రాశాడు. కొసరాజు పాటలు వ్రాయగా, జమీన్ రైతు ఉద్యమంలో నెల్లూరు వెంకట్రామానాయుడు వ్రాసిన గీతాలను కూడా ఈ సినిమాలో వాడుకున్నారు. సంగీత దర్శకుడు బి.నరసింహారావు.
ఈ సినిమాకు వ్యతిరేకత సనాతన వర్గాలకంటే బలంగా జమీందార్ల నుంచి ఎదురైంది. మాలపిల్లను ప్రభుత్వం నిషేధించలేదు. కానీ జమీందార్లు రైతుబిడ్డ సిన్మాను ప్రభుత్వం చేత నిషేధింపజేయగలిగారు. ఇంకో విచిత్రమేమిటంటే జమీందార్ల ఘాతుకాలను నిరసించిన ఈ సినిమాను నిర్మించినది ఒక జమీందారు. ఈ చిత్ర నిర్మాత అయిన చల్లపల్లి రాజా జమీందార్ల పార్టీ అయిన జస్టిస్ పార్టీలో ఒక వర్గానికి నాయకుడు. పార్టీలో ఆయన ప్రత్యర్థి వర్గానికి నాయకుడైన మీర్జాపురం రాజా ఈ చిత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, తిరోగమన ధోరణిలో అనేక జానపద, పౌరాణిక చిత్రాలను నిర్మించాడు.
రైతుబిడ్డ చిత్రాన్ని జమీందార్ల ఒత్తిడిపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించినా ఆ చిత్రం ప్రతిబింబించిన స్ఫూర్తి కాలక్రమంలో విజయం సాధించింది. 1955లో విడుదలై ఘనవిజయం సాధించిన రోజులు మారాయి చిత్రాన్ని రైతుబిడ్డకు కొనసాగింపు అనుకోవచ్చు. ఇటువంటి చిత్రాల ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమైన కోస్తా రైతాంగ చైతన్యం కాలక్రమంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి వెన్నుదన్నుగా నిలిచింది. కులవ్యవస్థ నిర్మూలన సందేశం ఇవ్వడం కోసం కూడా రామబ్రహ్మం నడుం కట్టాడు. పల్నాటి బ్రహ్మనాయుడు పాత్ర ద్వారా ఈ సందేశాన్ని ఇవ్వడానికి పల్నాటి యుద్ధం సినిమా తీశాడు.
తీసిన సినిమాలు
• మాలపిల్ల (1938) నిర్మాత, దర్శకుడు
• రైతుబిడ్డ (1939) రచయిత, దర్శకుడు
• ఇల్లాలు (1940) దర్శకుడు
• అపవాదు (1941) దర్శకుడు
• పత్ని (1942) దర్శకుడు
• పంతులమ్మ (1943) దర్శకుడు
• మాయలోకం (1945) దర్శకుడు
• పల్నాటి యుద్ధం (1947) దర్శకుడు

“రామబ్రహ్మం, బి.ఎన్.రెడ్డి తమకున్నలాంటి సంస్కృతే ప్రేక్షకులకు ఉన్నట్లుగా భావించేవారు తప్ప వారిని వెర్రివెంగళప్పలుగా చూడలేదు.” -కొడవటిగంటి కుటుంబరావు.
ఇతర వివరాలు
• రామబ్రహ్మం 1942-43, 1944-45 సంవత్సరాలలో రెండు సార్లు దక్షిణ భారత ఫిలిం వాణిజ్యమండలి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
• రామబ్రహ్మానికి మధుమేహం వ్యాధి ఉంది. పల్నాటి యుద్ధం భారీ సినిమా నిర్మాణ సమయంలో (1946) హఠాత్తుగా అతనికి పక్షవాతం వచ్చింది. ఎన్ని మందులు వాడినా వ్యాధి తగ్గకుండా అక్టోబరు 1న కాలధర్మం చేశారు.
• విజయవాడలో ఈడ్పుగంటి లక్ష్మణరావు కార్యదర్శిగా, అక్కినేని నాగేశ్వరరావు గౌరవాద్యక్షునిగా ‘గూడవల్లి రామబ్రహ్మం సినీ కళాసాగర్’ అనే సంస్థను స్థాపించి సుమారు పది సంవత్సరాలు నాటక, సినీ రంగాలకు సేవచేశారు.
• తెనాలిలో రామబ్రహ్మం 30వ వర్ధంతి సందర్భంగా 1976 అక్టోబరులో ‘రామబ్రహ్మం సంస్మరణ సంఘం’ ఏర్పడి అతనితో సాన్నిహిత్యం ఉన్న ప్రముఖులతో విలువైన వ్యాసాలు రాయించి ‘స్మారక సంచిక’ను ప్రచురించారు.
• విజయవాడ గాంధీనగర్ లోని అలంకార్ సెంటర్ లో రామబ్రహ్మం కాంస్య విగ్రహాన్ని 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ఆవిష్కరించారు.
   సశేషం
మీ గబ్బిట దుర్గాప్రసాద్ -11-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-196• 196-చంద్ర లేఖ విలన్  ,కొండవీటి వీరుడుఫేం,విమానం నడిపిన పైలట్ ,సాహిత్య పట్టభద్రుడు ,నాట్య పిపాసి ‘’సాహసమే జీవిత పు బాటరా సత్యమే నీ లక్ష్యమని చాటరా’’ పాట రంజనుడు’’-రంజన్విమానం   నడపగల,  ప్రయాణించగల మొదటి తమిళ సినిమా హీరో.

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-196
• 196-చంద్ర లేఖ విలన్  ,కొండవీటి వీరుడుఫేం,విమానం నడిపిన పైలట్ ,సాహిత్య పట్టభద్రుడు ,నాట్య పిపాసి ‘’సాహసమే జీవిత పు బాటరా సత్యమే నీ లక్ష్యమని చాటరా’’ పాట రంజనుడు’’-రంజన్
విమానం   నడపగల,  ప్రయాణించగల మొదటి తమిళ సినిమా హీరో.
 
70 ఏళ్ల క్రితం SS వాసన్‌ తెరకెక్కించిన చంద్రలేఖ సినిమాలో విలన్‌గా నటించిన రంజన్, ఈరోజు చాలా మంది హీరోలు కూడా గొప్పగా చెప్పుకోలేని అనేక నైపుణ్యాలను సాధించామనారాయణ వెంకటరమణ శర్మగా జన్మించిన రంజన్, దర్శకుడు SS వాసన్ యొక్క మాగ్నమ్ ఓపస్ చంద్రలేఖ (1948)లో అంతర్భాగం. విలాసవంతంగా మౌంట్ చేయబడిన హిస్టారికల్ అడ్వెంచర్ డ్రామాలో అతను విలన్‌గా నటించాడు, ఇది విడుదలైనప్పుడు భారతదేశంలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన చిత్రం.

చంద్రలేఖకు దాదాపు రూ.30 లక్షలు ఖర్చయ్యాయి, ఆ రోజుల్లో భారీ మొత్తం, దీన్ని తయారు చేయడానికి ఐదేళ్లు పట్టింది. నిర్మాత-దర్శకుడు వాసన్ తన ఆస్తిని తనఖా పెట్టి ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి స్నేహితుల సహాయం కోరవలసి వచ్చింది. 2010లో, కొంతమంది నిపుణులు అంచనా ప్రకారం, అద్భుతమైన డ్రమ్ డ్యాన్స్ నంబర్‌కు ప్రసిద్ధి చెందింది, ఇది భారతీయ సినిమాల్లోనే మొదటిది, దీని ధర $28 మిలియన్లకు (ప్రస్తుత మార్పిడి రేటు ప్రకారం సుమారు రూ.140 కోట్లు) ఉండవచ్చని అంచనా వేశారు.

చంద్రలేఖ రంజన్‌ని ఖ్యాతి గడించింది మరియు చివరికి అతనికి హిందీ చిత్రసీమలోకి ప్రవేశించడానికి తలుపులు తెరిచింది. అయితే, రంజన్ ఇతర చిత్రాలలో కూడా అద్భుతమైన పని చేశాడని చాలామందికి తెలియదు. మరీ ముఖ్యంగా, ఈ రోజు కూడా చాలా మంది హీరోలు గొప్పగా చెప్పుకోలేని అనేక నైపుణ్యాలను సంపాదించిన నిజమైన హీరో అతను.
పాత్రికేయుడు మరియు చలనచిత్ర చరిత్రకారుడు పరాశక్తి మాలి ఇలా అన్నారు, “రంజన్ కుటుంబం తమిళనాడులోని శ్రీరంగం నుండి వచ్చింది. అతను బ్రాహ్మణుడు, అయ్యర్. ఆ వ్యక్తి మృదుస్వభావి మరియు ఉన్నత విద్యావంతుడు. మీరు ఎల్లప్పుడూ కప్పు కోసం స్వాగతం పలుకుతారు. కాఫీ, స్నాక్స్ మరియు చాట్ గురించి. కానీ అతను తన కుటుంబం గురించి చర్చించకుండా ఉండెను.”

1918లో మద్రాసులో జన్మించిన రంజన్ సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అతను కళాశాలలో ఉన్నప్పుడు నాటకాలలో పాల్గొనేవాడు మరియు ఒక నాటకంలో అతని నటన జెమినీ స్టూడియోస్ ఉద్యోగి అయిన వేప్పత్తూరు కిట్టు దృష్టిని ఆకర్షించింది, అతను అతన్ని రాఘవాచారి వద్దకు రిఫర్ చేసాడు, అతను అతనికి అశోక్ కుమార్ చిత్రంలో అవకాశం ఇచ్చాడు ( 1941), ఇందులో MG రామచంద్రన్ కూడా నటించారు, తరువాత తమిళ సినిమాలో పెద్ద స్టార్‌గా మరియు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగారు.
అయితే, అశోక్ కుమార్ కంటే ముందు విడుదలైన ఎస్ సౌందరరాజన్ దర్శకత్వం వహించిన ఋష్యశృంగర్ (1940) రంజన్‌ని బాగా పాపులర్ చేసింది. పెద్దయ్యాక ఆడవాళ్ళతో కలవకుండా అడవిలో పెరిగే ముని కొడుకు కథతో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

మాలి మాట్లాడుతూ, “రంజన్ అద్భుతమైన డ్యాన్సర్. నిజానికి, అతను మంచి డాన్సర్‌గా ఈరోజు మీకు తెలిసిన కమల్ హాసన్ కంటే చాలా గొప్పవాడు. మేము మాట్లాడుతున్నప్పుడు, అతను ఒకసారి నాతో చెప్పాడు, అతని హృదయం నృత్యంలో ఉందని మరియు సినిమా దాని పక్కనే ఉంది. రంజన్ డాన్స్‌ని ఎంతగానో ఇష్టపడ్డాడు, వాస్తవానికి అతను నాట్యాంజలి అనే పేరుతో ఒక ప్రచురణను తీసుకువచ్చాడు.
బహుశా అతను డ్యాన్స్‌ని ఎంతగానో ఇష్టపడినందున మరియు అతను క్రాఫ్ట్‌ను బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల, రంజన్ వ్యక్తిత్వంలో కొంత ఆకర్షణ ఉంది, అది అతను చాలా మృదువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. వాస్తవానికి, SS వాసన్ అతని మృదువైన, దాదాపు స్త్రీ స్వభావం కారణంగా చంద్రలేఖ యొక్క క్రూరమైన విలన్‌గా అతనిని నటించడానికి మొదట సంకోచించాడని నమ్ముతారు. అయితే రంజన్ ఎంత మంచి నటుడో ఉక్కు, దుర్మార్గపు విలన్ పాత్రకు సరిపోయేలా తనను తాను పూర్తిగా మార్చుకోగలిగాడు. నిజానికి ఈ సినిమా ఇంత సక్సెస్ కావడానికి అతని పాత్ర నిర్దాక్షిణ్యం కూడా ఒక కారణం.
చరిత్రకారుడు మాలి మాట్లాడుతూ, “రంజన్ పూర్తిస్థాయి ప్రొఫెషనల్. “అతను నటనకు అవసరమైన అన్ని నైపుణ్యాలను నేర్చుకున్నాడు. అతను విమానం కూడా నడపగలడని చాలా మందికి తెలియదు. నిజానికి, అతను విమానంలో ప్రయాణించగల మొదటి తమిళ సినిమా హీరో. అతను ఇక్కడ [మద్రాసులో] ఫ్లయింగ్ క్లబ్‌లో సభ్యుడు. అతను అద్భుతమైన విలుకాడు కూడా. అతను చాలా మంచివాడు, అతని షాట్‌లు చాలా అరుదుగా వాటి మార్క్‌ను కోల్పోతాయి. దాని గురించి చెప్పాలంటే అతను తెలివైన షూటర్ మరియు తుపాకీలను నిర్వహించగలడు. రంజన్ గుర్రపు స్వారీలో కూడా ప్రవీణుడు, అతను దాని కోసం నేర్చుకున్నాడు. సినిమాలు.”
వాస్తవానికి, అన్నింటికంటే, అతను కూడా అందంగా ఉన్నాడు. “ఒక్క సమస్య ఏమిటంటే, అతను సాధారణ బ్రాహ్మణ యాసను కలిగి ఉన్నాడు మరియు దానిని వదిలించుకోవడం అతనికి చాలా కష్టమైంది.”

ఈ నటుడు హిందీకి వెళ్లడానికి ముందు తమిళంలో అనేక ముఖ్యమైన ప్రదర్శనలు ఇచ్చాడు. చంద్రలేఖలో ఆయన పోషించిన పాత్ర కాకుండా దక్షిణాదిలో ఆయనకు గుర్తుండిపోయే సినిమా ఏదైనా ఉందంటే అది మంగమ్మ శపథం (1943). SS వాసన్ నిర్మించారు, కానీ ఆచార్యగా ప్రసిద్ధి చెందిన TG రాఘవాచారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రంజన్ ద్విపాత్రాభినయం చేశారు.
సినిమా కథ ఒక పేద స్త్రీ అహంకారి యువరాజు ద్వారా కొడుకును కనాలని ప్రతిజ్ఞ చేసి, ఆ తర్వాత కొడుకు తన తండ్రిని బహిరంగంగా కొరడాతో కొట్టడం. రంజన్ ఈ చిత్రంలో తండ్రి మరియు కొడుకులుగా నటించారు, అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. అది ఎంత గొప్పగా చేరిందో, అది రంజన్ మరియు వసుంధరా దేవి, చిత్ర హీరోయిన్ మరియు లెజెండరీ నటి వైజయంతిమాల తల్లిని ఇంటి పేర్లుగా మార్చింది.

అతను హిందీ చిత్రసీమలోకి ప్రవేశించిన తర్వాత, రంజన్‌కు అంతే అద్భుతమైన పరుగు వచ్చింది. అయితే, ఒకానొక సమయంలో, అతని అదృష్టం తగ్గిపోయినప్పుడు, అతను తమిళ సినిమాకి తిరిగి వచ్చాడు మరియు శాలి వాహనంతో సహా కొన్ని చిత్రాలలో నటించాడు, అది సహేతుకమైన విజయాన్ని సాధించింది. అతను చెన్నై నగరంలో ఒక ఇంటిని కలిగి ఉన్నాడు, అతను బొంబాయికి వలస వెళ్ళే ముందు దానిని విక్రయించినట్లు మూలాలు చెబుతున్నాయి. అతను 12 సెప్టెంబర్ 1983న USలో గుండెపోటుతో మరణించినట్లు నమ్ముతారు.
కొండవీటి దొంగ (1958 సినిమా)
కొండవీటి దొంగ తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా.

పాటలు
ఒక్కరికి ఇద్దరయా ఇవి కలికాలపు బుద్దులయా నీ ఒళ్ళే బరువు
చక్కని పిల్ల కంటపడితే సరసాలాడే ఓ పోకిరి పిల్లడ నీవు బలే చిక్కుల్లో
జగమున మగువలింక దీక్షపూను కాలమిది శతృవుల నణచుటకై
తమలపాకు సున్నము పడుచువాళ్లకందము – పి.బి.శ్రీనివాస్, కె.రాణి
దణ్ణం పెడితే తలపై మొట్టే కాలం ఇదికాదు బావా కాలానికి
పల్లెటూరి రైతులారా.. అయ్యా పట్నాల బాబులారా
వింత మనుషులు మగవారు కోతలెన్నో కోస్తారు సింహమొచ్చిన
వుల్లాసాల పాటలే సొంపుగొలుపు ఆటలే కెరటములే – కె. జమునారాణి బృందం
సాహసమే జీవిత పూబాటరా సత్యమే నీ లక్ష్యమని చాటరా – ఘంటసాల
అంజలీ దేవి, రంజన్ నటించిన రాజా మలయ సింహ, కొండవీటి దొంగ చిత్రాలు

https://en.wikipedia.org/wiki/Ranjan_(actor)
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-195 · 195-కృష్ణప్రేమ కృష్ణుడు ,కుంకుమరేఖ హీరో ,వనవాస అర్జునుడు పాండవీయ ధర్మరాజు ,,భూకైలాస్ శివుడు ,అన్నమయ్య తండ్రి ,యమలీల బ్రహ్మ ,రామరాజ్య వశిష్టుడు ,అల్లూరి అగ్గిరాజు మల్లీశ్వరి తాత .చెల్లెలికాపురం నేరముశిక్ష నిర్మాత ,అందరి మన్ననలు పొందిన ఇంజనీర్ స్వర్ణ నంది పురస్కార గ్రహీత –మన్నవ బాలయ్య

· 195-కృష్ణప్రేమ కృష్ణుడు ,కుంకుమరేఖ హీరో ,వనవాస అర్జునుడు పాండవీయ ధర్మరాజు ,,భూకైలాస్ శివుడు ,అన్నమయ్య తండ్రి ,యమలీల బ్రహ్మ ,రామరాజ్య వశిష్టుడు ,అల్లూరి అగ్గిరాజు మల్లీశ్వరి తాత .చెల్లెలికాపురం నేరముశిక్ష నిర్మాత ,అందరి మన్ననలు పొందిన ఇంజనీర్ స్వర్ణ నంది పురస్కార గ్రహీత –మన్నవ బాలయ్య

· మన్నవ బాలయ్య (1930 ఏప్రిల్ 9 – 2022 ఏప్రిల్ 9) తెలుగు సినిమా నటుడు, నిర్మాత. ఎక్కువ సహాయ పాత్రలు పోషించాడు. కొన్ని సినిమాలకు కథ, పాటలు కూడా అందించాడు.

జీవిత విషయాలు
గుంటూరు జిల్లా వైకుంఠపురం (అమరావతి) శివారు గ్రామం చావపాడులో గురవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు ఏప్రిల్ 9, 1930లో జన్మించాడు[1].[2] బాలయ్య మెకానికల్ ఇంజినీరింగులో బి.ఇ 1952లో పూర్తి చేశాడు. 1957 వరకు మద్రాసు, కాకినాడ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్చరర్‌గా పనిచేశాడు.

చిత్రరంగం
మద్రాసు గిండీ కళాశాలలో చదువుకునే రోజుల్లో నాటకాల్లో నటించాడు. మిత్రుల ప్రోద్బలముతో చిత్రాల్లో నటించాలనే కోరిక గలిగి తాపీ చాణక్య సహకారముతో చిత్రసీమలో అడుగు పెట్టాడు. 1958లో ఎత్తుకు పై ఎత్తు సినిమాలో నాయక పాత్ర వేశాడు. తరువాత భాగ్యదేవత, కుంకుమరేఖ చిత్రాల్లో నటించాడు. భూకైలాస్ చిత్రంలో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో శివునిగా నటించే అవకాశం వచ్చింది. అటు తరువాత చెంచులక్ష్మి, పార్వతీకల్యాణం నుండి నేటి వరకు 350 పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించాడు. 1970లో అమృతా ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించి నేరము-శిక్ష, అన్నదమ్ముల కథ, ఈనాటి బంధం ఏనాటిదో (1977) లాంటి మంచి చిత్రాలు నిర్మించాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము చెల్లెలి కాపురం చిత్రాన్ని ఉత్తమ చిత్రముగా ఎంపిక చేసి బంగారు నంది పురస్కారము బహూకరించింది. స్వీయ దర్శకత్వంలో పోలీస్ అల్లుడు (1994), ఊరికిచ్చిన మాట (1981) నిర్మించాడు. 1991లో మద్రాసు నుండి హైదరాబాదు వచ్చాడు. చిత్రాల్లో, టి.వి. సీరియల్స్ లోనూ నటిస్తున్నాడు. 2000 సంవత్సరములో తీసిన “పల్లెవాసం-పట్నవాసం”కు ప్రభుత్వ ఉత్తమ సీరియల్ అవార్డ్ లభించింది. అంకురం చిత్రంలో నటనకు వంశీ-బర్కిలీ వారి ఉత్తమ క్యారెక్టర్ అవార్డ్ లభించింది. ఈనాటి బంధం ఏనాటిదో సినిమాకు కథ, చిత్రానువాదం, పాటలు అందించాడు.[3]

నటించిన చిత్రాలు
1950లు
· 1958 ఎత్తుకు పైఎత్తు

· 1958 పార్వతీ కళ్యాణం

· 1959 భాగ్యదేవత

· 1959 మనోరమ

1960లు
· 1960 కుంకుమరేఖ

· 1960 చివరకు మిగిలేది – ప్రకాశరావు

· 1961 కృష్ణ ప్రేమ

· 1962 మోహినీ రుక్మాంగద

· 1963 ఇరుగు పొరుగు

· 1963 తల్లి బిడ్డ

· 1964 బభ్రువాహన

· 1964 బొబ్బిలి యుద్ధం

· 1964 వివాహబంధం

· 1965 పాండవ వనవాసం – అర్జునుడు

· 1966 మొనగాళ్ళకు మొనగాడు[4]

· 1966 శ్రీకృష్ణ పాండవీయం – ధర్మరాజు

· 1967 అగ్గిదొర

· 1967 రక్తసింధూరం

· 1968 వీరపూజ

· 1968 సర్కార్ ఎక్స్‌ప్రెస్

1970లు
· 1970 లక్ష్మీ కటాక్షం – వినయదండుడు

· 1971 విక్రమార్క విజయం

· 1971 నిండు దంపతులు

· 1973 నేరము – శిక్ష

· 1974 అల్లూరి సీతారామరాజు – అగ్గిరాజు

· 1974 కృష్ణవేణి

· 1976 భక్త కన్నప్ప[5]

· 1977 ఒకే రక్తం

· 1977 ఈనాటి బంధం ఏనాటిదో

· 1977 కురుక్షేత్రం – ధర్మరాజు

· 1978 చిరంజీవి రాంబాబు – 1978

· 1978 ప్రేమ-పగ

· 1978 రాజపుత్ర రహస్యం

· 1979 గంగా భవానీ

· 1979 నామాల తాతయ్య

· 1979 ముత్తయిదువ

1980లు
· 1987 జగన్మాత

· 1988 పృథ్వీరాజ్

· 1988 ప్రాణ స్నేహితులు

· 1988 మహారాజశ్రీ మాయగాడు

1990లు
· 1992 అంకురం –

· 1992 పెద్దరికం – సాంబశివుడు

· 1993 గాయం

· 1994 యమలీల – బ్రహ్మ

· 1996 పెళ్ళి సందడి

· 1996 జాబిలమ్మ పెళ్ళి

· 1997 అన్నమయ్య

· 1997 దేవుడు

· 1997 మా ఆయన బంగారం

· 1999 సాంబయ్య

2000లు
· 2002 ధనలక్ష్మీ ఐ లవ్ యూ

· 2002 మన్మథుడు

· 2003 ఒకరికి ఒకరు

· 2004 మల్లీశ్వరి – రామ్మోహనరావు

· 2004 విజయేంద్ర వర్మ

· 2005 ధన 51

· 2006 సామాన్యుడు

· 2007 గజి బిజి

· 2007 యమగోల మళ్ళీ మొదలైంది

· 2009 మిత్రుడు

2010లు
· 2011 శ్రీరామరాజ్యం – వశిష్ఠుడు

· 2012 నందీశ్వరుడు

· 2012 దేవరాయ

నిర్మించిన చిత్రాలు
· 1971 చెల్లెలి కాపురం

· 1973 నేరము – శిక్ష

· 1978 ప్రేమ-పగ

· 1980 చుట్టాలున్నారు జాగ్రత్త

· 1981 ఊరికిచ్చిన మాట

· 1983 నిజం చెబితే నేరమా

మరణం
92 ఏళ్ల బాలయ్య అనారోగ్యంతో 2022 ఏప్రిల్ 9న హైద‌రాబాదులో క‌న్నుమూశారు. ఇదే రోజు ఆయ‌న పుట్టిన‌రోజు కూడా.[

·

· 300సినిమాలలో నటించాడు కొన్నిటికి దర్శకత్వం ,నిర్మాత ,రచనకూడా చేశాడు .బహుముఖ ప్రజ్ఞాశీలిగా ,చిత్రరంగంలో పెద్దన్నయ్యగా బాలయ్య గౌరవం పొందాడు .ఆయన పోషించిన పాత్రలు ,నిర్మించిన చిత్రాలు ఉదాత్తమైనవి .

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-194

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-194

· 194-గ్లిజరిన్ బాటిల్ ఎప్పుడూ దగ్గరుంచుకొనే కన్నీటి నటి –డబ్బింగ్ జానకి

· డబ్బింగ్ జానకి దక్షిణభారత చలన చిత్ర నటి. ఈమె దాదాపు 600 చిత్రాలలో నటించింది. ఎక్కువగా తల్లి పాత్రలను పోషించింది. సాగర సంగమం చిత్రంలో కమల్ హాసన్ తల్లిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకొంది.

నేపధ్యమ
వీరిది పెద్దాపురం లోని మధ్యతరగతి కుటుంబం. అక్కడ దగ్గర ఎక్కువగా నాటకాలు వేసేవారు. ఈమె నాలుగో తరగతిలో ఉన్నప్పుడు తెలిసిన వాళ్లు ఒకరు ఓ పాత్ర ఉందంటూ తీసుకెళ్లారు. అప్పట్నుంచి నాటకాలతో బిజీ అయిపోయింది. ఏడో తరగతితో చదువు ఆపేసింది. ప్రస్తుతం ఈవిడ చెన్నైలో ఉంటున్నది. షూటింగ్, డబ్బింగ్ ఉంటే హైదరాబాద్ వస్తుంది. ఈవిడ ఇద్దరు కొడుకులు. కోడళ్లూ, మనవలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది.

నట జీవితము
పదహారేళ్లు వచ్చేప్పటికి ఈమెకు పెళ్త్లెంది. భర్తది మిలటరీ ఉద్యోగం. ఆయనకీ నాటకాలంటే ఆసక్తి. పెళ్లయ్యాక తన నుంచీ ప్రోత్సాహం లభించింది. అయితే అప్పటికే వీరు చెన్నైలో స్థిరపడ్డారు. ఓసారి బస్సులో వెళుతుంటే ఏవీఎమ్ సంస్థలో పనిచేసే ఓ సహాయ దర్శకుడు ఈమెను చూసి ‘సినిమాల్లో నటిస్తారా’ అని అడిగారు. ఈమె భర్త అంగీకరించారు. అలా 1958లో ‘భూ కైలాస్’లో చెలికత్తె పాత్రతో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తరువాత నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలుపడింది. ఆర్థిక ఇబ్బందులూ ఉండటంతో గ్రూపు డాన్సర్‌గా కూడా చేసేది. తమిళం, తెలుగు అగ్ర దర్శకులూ, నటులందరితో కలిసి పనిచేసింది. చాలా సినిమాల్లో ఈమె కంటే పెద్దవాళ్లకే అమ్మగా కనిపించింది.

పేరు వెనుక చరిత్ర
శంకరాభరణం సినిమా విజయోత్సవ వేడుక విజయవాడలో జరిగింది. ఆ కార్యక్రమానికి ఈమె, షావుకారు జానకి, గాయని ఎస్. జానకి వెళ్లారు. ‘వేదిక మీదకు జానకిగారు రావాలి’ అని మైకులో చెప్పేసరికి ముగ్గురూ లేచి నిలబడ్డారు. అప్పుడు డబ్బింగ్ జానకి అని అవతలి వ్యక్తి అనడంతో.. ఆ రోజు నుంచి ఈమె పేరుకు మొదట్లో డబ్బింగ్ వచ్చి చేరింది.

విశేషాలు
· ‘మాతృ దినోత్సవం’ వచ్చిందంటే ’20వ శతాబ్దం’ చిత్రం లోని ‘అమ్మను మించి దైవమున్నదా’ పాట టీవీల్లో కచ్చితంగా వస్తుంది. అందులో సుమన్ తల్వార్కి తల్లిగా ఈవిడ చేసిన పాత్రకి మంచి పేరొచ్చింది.

· ఈవిడ చేసిన సినిమాల్లో తొంభై శాతం వరకూ కంట తడిపెట్టించే సెంటిమెంటు పాత్రలే. గ్లిజరిన్ బాటిల్ ఎప్పుడూ పక్కన ఉండాల్సిందే. సెట్‌లో ఏడ్చీ ఏడ్చీ ఇంటికి వెళ్లేసరికి కళ్లు ఎర్రగా వాచిపోయేవి. ఒకసారి ‘రక్తకన్నీరు’ నాటకం వేసినప్పుడు ఏకథాటిగా మూడు గంటలు ఏడవాల్సి వచ్చింది. ఆ నాటకం పూర్తయ్యేసరికి కళ్లలో నీళ్లు ఇంకిపోయాయి.

· ఈవిడ నటించిన సినిమాల్లో బాగా నచ్చినవంటే ‘జంబలకిడి పంబ’లోని పాత్ర… ‘రామాయణంలో పిడకల వేట’లోని గయ్యాళి అత్త పాత్ర.

· సెట్‌లో మర్చిపోలేని సందర్భమంటే ‘నిండు సంసారం’ సినిమా చిత్రీకరణలో ఈవిడ చెట్టు మీద నుంచి నీళ్లలో దూకాలి. అసలే ఈవిడకు నీళ్లంటే భయం. దర్శకుడు చెప్పినప్పుడు కాకుండా ముందుగానే దూకడంతో డూప్ ఆర్టిస్టు ఈవిడను పట్టుకోలేదు. నీళ్లలో పడిపోయింది. తరువాత యూనిట్ సభ్యులు కాపాడారు కానీ నీళ్లు బాగా మింగడంతో స్పృహ కోల్పోయింది. ప్రాణం పోతుందేమోనని చాలామంది భయపడిపోయారు.

నటించిన చిత్రాలు
తెలుగు (పాక్షిక జాబితా)
· గీతాంజలి

· సాగర సంగమం

· జీవనవేదం (1993)

· 20వ శతాబ్దం (1990)

· చెవిలో పువ్వు (1990)

· అనసూయమ్మ గారి అల్లుడు (1986)

· ఆలయశిఖరం (1983)

· హోమం (2008)

·

· డబ్బింగ్ జానకి ఎన్నో టివి షోలలో సీరియల్స్ లో నటించి మెప్పించింది .ఆమెకు అంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది .

· సశేషం

· శ్రీరామనవమి శుభా కాంక్షలతో

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-193

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-193

· 193-1500 తెలుగు తమిక ,కన్నడ సినిమాలలో నటించిన హీరో ల అమ్మ –పండరి బాయి

· పండరీబాయి (1930 – 2003) కన్నడ, తెలుగు సినిమా నటి. ఈవిడ కర్ణాటకలో భట్కల్ అనే ఊరిలో 1930లో జన్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో ఈవిడ 1500 పైగా చిత్రాలో నటించారు. శివాజీ గణేశన్, రాజ్‌కుమార్ సరసన కొన్ని చిత్రాలలో నటించారు. తెలుగులో చాలా చిత్రాలలో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావులకు తల్లిగా నటించారు.దాదాపుగా అరవై ఏళ్ళలో పండరీబాయి నటించని తెలుగు సినిమాలు అరుదు .నిండుగా ఆప్యాయంగా అచ్చమైన తల్లి గా పాత్రలలో జీవించిన నటీ మణి.చూడగానే పూజ్యభావం కలుగుతుంది .మనసులోని మాతృప్రేమను ధారగా కురిపించి తన్మయులను చేస్తుంది .

నటించిన తెలుగు సినిమాలు
· శ్రీ ఏడుకొండలస్వామి (1991)

· అయ్యప్పస్వామి మహత్యం (1989)

· గడుగ్గాయి (1989)

· పిన్ని (1989)

· దొంగ రాముడు (1988)

· మరణ శాసనం (1987)

· శ్రీ మంత్రాలయ రాఘవేంద్రస్వామి మహత్యం (1987)

· అష్టలక్ష్మి వైభవం (1985)

· ఝాన్సీ రాణి (1985)

· రగిలేగుండెలు (1985)

· ఇదే నా సవాల్ (1984)

· నాగ భైరవ (1984)

· బాబులుగాడి దెబ్బ (1984)

· భలే రాముడు (1984)

· వసంత గీతం (1984)

· ఆడదాని సవాల్ (1983)

· అమరజీవి (1983)

· అమాయకుడు కాదు అసాధ్యుడు (1983)

· ధర్మ పోరాటం (1983)

· కలియుగ దైవం (1983)

· కోటీశ్వరుడు (1983)

· మాయగాడు (1983)

· పల్లెటూరి పిడుగు (1983)

· రఘురాముడు (1983)

· శ్రీరంగనీతులు (1983)

· రాధా మై డార్లింగ్ (1982)

· అజిత్ (1982)

· కలవారి సంసారం (1982)

· వయ్యారి భామలు వగలమారి భర్తలు (1982)

· చట్టానికి కళ్ళు లేవు (1981)

· టాక్సీ డ్రైవర్ (1981)

· దారి తప్పిన మనిషి (1981)

· రామలక్ష్మణులు (1981)

· కిలాడి కృష్ణుడు (1980)

· కొత్తపేట రౌడీ (1980)

· గజదొంగ (1980)

· గురు (1980)

· త్రిలోక సుందరి (1980)

· ధర్మచక్రం (1980)

· పసుపు పారాణి (1980)

· బంగారులక్ష్మి (1980)

· మహాలక్ష్మి (1980)

· రామ్ రాబర్ట్ రహీమ్ (1980)

· రాముడు – పరశురాముడు (1980)

· సంధ్య (1980)

· సన్నాయి అప్పన్న (1980)

· సర్దార్ పాపారాయుడు (1980)

· సూపర్‌మ్యాన్ (1980)

· హరే కృష్ణ హలో రాధ (1980)

· హేమా హేమీలు (1980)

· దొంగలకు సవాల్ (1979)

· బుర్రిపాలెం బుల్లోడు (1979)

· మూడు పువ్వులు ఆరు కాయలు (1979)

· ప్రియబాంధవి (1979)

· లక్ష్మీ పూజ (1979)

· విజయ (1979)

· వేటగాడు (1979)

· శంఖుతీర్థం (1979)

· శృంగార రాముడు (1979)

· సొమ్మొకడిది సోకొకడిది (1979)

· బందిపోటు ముఠా (1978)

· చదరంగం (1978)

· దేవదాసి (1978)

· దొంగల వేట (1978)

· డూ డూ బసవన్న (1978)

· కాలాంతకులు (1978)

· లంబాడోళ్ళ రాందాసు (1978)

· లాయర్ విశ్వనాథ్ (1978)

· మూడు పువ్వులు ఆరు కాయలు (1978)

· నిండు మనిషి (1978)

· ప్రేమ చేసిన పెళ్ళి (1978)

· సాహసవంతుడు (1978)

· స్వర్గసీమ (1978)

· టాక్సీ డ్రైవర్ (1978)

· దొంగలకు దొంగ (1977)

· ఈనాటి బంధం ఏనాటిదో (1977)[1]

· గీత సంగీత (1977)

· మా ఇద్దరి కథ (1977)

· మనవడి కోసం (1977)

· ఒకే రక్తం (1977)

· పాలాభిషేకం (1977)

· సీతారామ వనవాసం (1977)

· రామరాజ్యంలో రక్తపాతం (1976)

· అమెరికా అమ్మాయి (1976)

· భద్రకాళి (1976)

· బంగారు మనిషి (1976)

· లలిత (1976)

· మా దైవం (1976)

· ముత్యాల పల్లకి (1976)

· నేరం నాదికాదు – ఆకలిది (1976)

· రాజు వెడలె (1976)

· సీతమ్మ సంతానం (1976)

· స్వామి ద్రోహులు (1976)

· అన్నదమ్ముల కథ (1975)

· ఆస్తికోసం (1975)

· డాక్టర్ శివ (1975)

· కథానాయకుని కథ (1975)

· మొగుడా పెళ్ళామా (1975)

· పద్మరాగం (1975)

· పుట్టింటి గౌరవం (1975)

· రక్త సంబంధాలు (1975)

· రాముని మించిన రాముడు (1975)

· సంతానం – సౌభాగ్యం (1975)

· తోటరాముడు (1975)

· అల్లూరి సీతారామరాజు (1974)

· దేవదాసు (1974)

· జన్మ రహస్యం (1974)

· కృష్ణవేణి (1974)

· పెద్దలు మారాలి (1974)

· రామయ్య తండ్రి (1974)

· గౌరవం (1973)

· హేమరెడ్డి మల్లమ్మ (1973)

· నేరము శిక్ష (1973)

· దైవ సంకల్పం (1972)

· కోడలు పిల్ల (1972)

· మరపురాని తల్లి (1972)

· మాతృమూర్తి (1972)

· నిజం నిరూపిస్తా (1972)

· పండంటి కాపురం (1972)

· రంగమ్మ శపథం (1972)

· భళే రాణి (1971)

· ప్రతిధ్వని (1971)

· సంపూర్ణ రామాయణం (1971)

· భగీరథి (1969)

· మనస్సాంతి (1969)

· సువర్ణభూమి (1969)

· అమ్మ (1968)

· పాలమనసులు (1968)

· పోస్టుమన్ రాజు (1968)

· అనురాధ (1967)

· ప్రేమలో ప్రమాదం (1967)

· పుణ్యవతి (1967)

· శ్రీ పురంధర దాసు (1967)

· చంద్రహాస (1965)

· సి.ఐ.డి. (1965)

· సత్య హరిశ్చంద్ర (1965)

· అన్నపూర్ణ (1964)

· భక్త శబరి (1960)

· రాజభక్తి (1960)

· గృహలక్ష్మి (1959)

· కులదైవం (1956)

· భక్త మల్లికార్జున (1955)

· వదిన (1955)

· మనోహర (1954)

· గుమస్తా (1953)

· పరాశక్తి (1952)

· మర్మయోగి (1951)

· వాణి (1943)

· సశేషం

· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-4-22

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-192

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-192

· 192-అవ్వయ్యార్ గా జీవించిన –సుందరంబాళ్

· 1953లో విడుదలైనశూలమంగళం సుబ్బు దర్శకత్వం వహించి .శ్రీమతి కే బి సుందరంబాల్ ,ముఖ్య పాత్ర పోషించిన జెమిని వారి ‘’అవ్వయ్యార్ ‘’తమిళచిత్రం తెలుగులోనూ డబ్బింగ్ పొంది అఖండ విజయం పొందింది .మురుగన్ మహా భక్తురాలు అవ్వయ్యార్ .ఎం డి పార్ధసారధి ,ఆనదరం ,మాయవరన్ వేణు సంగీతం కూర్చారు .అవ్వయార్ రాసిన గీతాలతోపాటు పాపనాశనం శివం ,కొత్తమంగళం సుబ్బు పాటలు రాశారు .

· ఒక వీధి వీధి అంతా ఆరోజుల్లోనే లక్షన్నర రూపాయలు పెట్టి సెట్ వేసి చిత్రీకరించారు .అవ్వయ్యార్ కుటుంబ సభ్యులనుంచి విషయ సేకరణ చేసి స్క్రిప్ట్ లో ఉపయోగించారు .10వేలమంది జూనియర్ ఆర్టిస్ట్ లతో నటిమ్పజేశారు .అవ్వయ్యార్ భక్తిగీతాలు తమిళ సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి .ప్రారంభ గీతం తమిళనాడు గొప్ప తనాన్ని వర్ణిస్తుంది .అవ్వయ్యార్ అంటే తమిళ మాత అనే నమ్మకం .ఆమె ఆరాధ్యదైవం మురుగన్ అంటే కుమారస్వామి అంటే శరవణభవ .పాటలు పద్యాలు అన్నీ అవ్వయ్యార్ పాత్రధరించిన సుందరంబాల్ గానం చేసింది .మ్యూజికల్ హిట్ సినిమా .తెలుగు డబ్బింగ్ కూడా ఆంధ్రలో గొప్ప విజయం సాధించింది .

· అవ్వయ్యార్‌
తమిళంలో అవ్వయ్యార్‌ అంటే గౌరవనీయులైన మహిళ అని అర్థం. తమిళ సాహిత్యంలో ఈ పేరుతో సుమారు ముగ్గురు కవయిత్రులు ఉన్నారు. వారిలో ఒకరు 1 వ శతాబ్దంలో జీవించినట్లు, 59 పద్యాలు రచించినట్లు ఆధారాలు ఉన్నాయి. అవ్వయ్యార్‌-2 చోళ వంశ పాలనా సమయంలో(10వ శతాబ్దం) జీవించారు. రోజువారీ జీవితంలో చేయకూడని, చేయాల్సిన పనుల గురించి సామాన్య భాషలో పద్యాలు రచించారు. ఆమె రాసిన పద్యాలు నేటికీ తమిళ పాఠ్య పుస్తకాల్లో దర్శనమిస్తున్నాయి. తను ఎంతో ఙ్ఞాన సంపదను కలిగి ఉన్నానని, ఇక నేర్చుకోవాల్సిందేమీలేదని చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మారువేషంలో వచ్చిన మురుగన్‌ ఙ్ఞానసముపార్జన నిత్యప్రవాహం వంటిదని, నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆమెకు బోధ చేయడంతో మరలా విద్యాభ్యాసం ప్రారంభించిందని, చిన్నారుల కోసం పుస్తకాలు రాసిన మొదటి వ్యక్తిగా నిలిచిందని చరిత్ర చెబుతోంది.శైవ క్షేత్రాలన్నీ కాలినడకన దర్శించి అక్కడి దైవాలపై తనకు వచ్చిన అతి తేలికైన తమిళభాషలో పద్యాలు రాసింది అవి ఈనాటికీ జనుల నాలుకలమీద నర్తిస్తున్నాయి జాతిమతకుల భేదాలులేకుండా భక్తితొ అందర్నీ ఏకం చేసింది

· ఇలా క్షేత్ర దర్శనం చేస్తూ అలసిపోయి ఒకరోజు ఒక అడవిలో చెట్టు దగ్గర కోవెలలో కూర్చుంటే సుబ్రహ్మణ్యస్వామి గోప వేషం లో వచ్చి ‘’ఏంకావాలి అవ్వా ‘’అంటే ‘’నువ్వేమైనా ఆర్చేవాడివా ,తీర్చే వాడివా ?”’అంది .’’మురుగా అనిపిల్చావు కదా అందుకే వచ్చా ‘’అన్నాడు .’’నేను పిలిచిన్దిసుబ్రహ్మణ్యస్వామిని ‘’ ‘’అంటుంది .నాపేరుకూడా మురుగా అందుకే వచ్చా అంటాడు .ఇద్దరిమధ్య వాదోపవాదాయు జరిగిఅవ్వయ్యార్ ఓడిపోతుంది .అప్పుడు మురుగా ‘’నీ కేం కావాలో చెప్పు ‘’అంటాడు .’’వేడి వేడి పళ్ళు కావాలి తెస్తావా ?’’అడిగింది .అదెంతపని అని ప్రక్కనే ఉన్న చెట్టెక్కి పళ్ళు దులిపాడుఅవి కిందపడ్డాయి .అవ్వ వాటిని ‘’ఉఫ్ ఉఫ్అంటూ ఊదుకొని తిన్నది ‘’అవ్వా బాగా వేడిగా ఉన్నాయా పళ్ళు ‘’?అనగా ‘’నాయనా నిన్ను గుర్తి౦చ లేదు నా మురుగన్ నువ్వే ‘’అని నమస్కరించి స్తోత్రం చేస్తుంది .అ౦దులోభావం ‘’నా జన్మ జన్మాల తపస్సు ఫలం సుబ్రహ్మణ్యుడు ‘’అని .

·

· తెలుగు డబ్బింగ్ కు మాటలు పాటలు పద్యాలు ఎవరు రాశారో తెలీదు .

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-4-22

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-191

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-191
• 191-యువ నటి ,నిర్మాత –వాసంతి బి .ఏ.
• వాసంతి తెలుగు చలన చిత్ర నటీమణులలో ఒకరు. ఈవిడ అసలు పేరు లక్ష్మీరాజ్యం. ఈవిడ కొన్ని చిత్రాల నిర్మాత కూడా. ఈవిడ బి.ఏ. చదివారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం లోని తిమ్మసముద్రం గ్రామం ఈవిడ స్వస్థలం. ఈవిడ ‘లా’ చదువు తున్నప్పుడు “తేన్నిలవు” అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఔట్‌డోర్ షూటింగు కోసం కాశ్మీర్ వెళ్ళవలసి రావడం చేత ఈమె లా పూర్తి చేయలేకపోయింది. ఆ తరువాత బలేపాండ్యన్, ఎన్నదాన్ ముడివు మొదలైన తమిళ చిత్రాలలోను, పాదుకా పట్టాభిషేకం, అమ్మైకాన మొదలైన మళయాల చిత్రాలలోను, అనేక తెలుగు చిత్రాలలోను నటించారు.
నటిగా
• విరిసిన వెన్నెల (1961) – తొలి సినిమా
• మహాకవి కాళిదాసు (1960)
• సిరిసంపదలు (1962)
• మంచి మనసులు (1962)
• ఆరాధన (1962)
• దక్షయజ్ఞం (1962)
• పునర్జన్మ (1963)
• సవతి కొడుకు (1963)
• వివాహబంధం (1964)
• శభాష్ సూరి (1964)
• నవగ్రహ పూజా మహిమ (1964)
• కీలుబొమ్మలు (1965)
• గుడిగంటలు (1965)
• ఉయ్యాల జంపాల (1965)
• సుమంగళి (1965)
• ఆత్మగౌరవం (1966)
• పల్నాటి యుద్ధం (1966)
• శ్రీమతి (1966)
• వీరాంజనేయ (1968)
నిర్మాతగా
• భలేపాప (1971)
• మేమూ మనుషులమే (1973)
• కల్పనాలయా పేరిట వాసంతి నిర్మించిన భలేపాప సినిమాలో రంగారావు,హరనాద్ కేఆర్ విజయ పద్మనాభం ,రేలంగి వగైరాలున్నారు సంగీతం ఆర్ సుదర్శనం .దర్శకత్వం కే ఎస్ ప్రకాశరావు .వీటూరి రాసిన ఎల్ ఆర్ ఈశ్వరిపాడిన  ‘’వయసు పదహారు నా వలపు  సెలయేరు ‘’బాగుంటుంది .చిట్టిపాపా చిరునవ్వులపాప పాట అనిసెట్టి రాస్తే సుశీల పాడింది .అయ్యలారా అమ్మలారా మా అమ్మనేవరైనా చూశారా పాత సినారె రాయగా ఘంటసాల గానం చేశారు
కల్పనాలయా బానర్ పై వాసంతి తీసిన ‘’మేమూ మనుషులమే ‘’సినిమా కె.బాపయ్య డైరెక్ట్ చేయగా కృష్ణం రాజు జమున నటించారు .మంచి ఆలోచన రేకెత్తించే చిత్రం .ఆత్రేయ రాసిన ‘’ఏమంటున్నది ఈగాలీ ?ఎగిరే పైటను అడగాలి ‘’పాట సుశీల బాలు పాడారు ఎం ఎస్ విశ్వనాధం మ్యూజిక్ .ఈగీతం సూపర్ హిట్ అయింది .
•  

•   సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

శ్రీ ఆలూరు కోన రంగనాయక శతకం

శ్రీ ఆలూరు కోన రంగనాయక శతకం
అనే శతకాన్ని తాడిపత్రి  వాస్తవ్యులు శ్రీ యమ చిడంబరయ్య  రచించి కడపలోని తమ భాగాధేయుడు కావ్య పురాణ తీర్ధ,విద్వాన్  శ్రీ జనమంచి వెంకట సుబ్రహ్మణ్య గారి చే పరిష్కరింప జేసుకొని 1934లో ముద్రించారు .మకుటం రంగ నాయకా . ,ఉత్పలమాల లతో అల్లిన భక్తీ శతకం .ఘటికా సిద్దుడైన శ్రీ ఘటికాచలేశ్వరుడే  తన ఆధి వ్యాధులను తీర్చగల సమర్ధుడని నమ్మిసేవిస్తే తగ్గి ఆరోగ్యం చేకూరినందువలన  కవి ఈశతకం రాసి స్వామికి సమర్పించినట్లు కవి చెప్పాడు .
  మొదటిపద్యం –‘’శ్రీ రఘుకుల వార్ధికులశేఖర మన్మధ కోటి సుందరా –కార ధరాత్మజాహృదయ కామిత పూర,మునీన్ద్రమానసా
ధార ధరాధరా దనుజ దైత్యహరా జగదేకవీర నా –కోరిక దీర్పు మొక్కటియకూరిమి తోడుత ‘’రంగనాయకా ‘’  .నీకధలు వింటూ నిత్యధ్యానం చేస్తూ ఉన్నవారు ఏ కులం లో ఉన్నా వారి బాధలు తొలగిస్తావు .పూర్వం విభీషణుడు శరణు అనగానే కాపాడావు .కోపం పోగొట్టి శా౦తం ఇచ్చి బుధజన సేవ ఇచ్చి నా ఆపదలు హరించు .’’మానము పోవు జీవనం మంచిదికాదు బిరాన ప్రాణమే మాన సుఖాలిస్తుంది .బుద్ధి పాడయిపోయింది .మనసు ఒక చోటనిలవటం లేదు .’’శ్రీరమణ వెంకట నాయకా ‘’అంటే అన్నీ సుఖాలే ఇస్తావు .అంటాడు .
‘’చప్పుడు కాని లోపల ను సన్నతలంపు లుగాని దాహమున్-జెప్పగరాని యాకలియు ,జిన్నని పిల్లలు భార్య యంచు నే –‘’స్రుక్కుతూఉన్నాను .’’నీ దయగల్గ నన్ ధనము నిర్మల తేజము జ్ఞానసంపదల్ –శ్రీ దయితా లభించును ‘’అని గట్టి నమ్మకంతో చెప్పాడు .’’శ్రీ రఘురామ సర్వ సుర సేవిత నామ సురారి భీమ దు –ర్వార పరాక్రమక్రమ ,సువర్ణ సుపర్ణ విహార రామా ‘’నా కోరికలు తీర్చు అని వేడుకొన్నాడు .’’నా టక్కరి బుద్ధి కోరికలతో తా౦డవమాడుతుంది ‘’అక్కటా నీ చరిత్ర ఒక్కనాడైనా నామనసులోకి రాలేదు క్షమించి కాపాడు .జాతి నీతి శాస్త్రం నిర్మలత్వం  లేకపోయినా  ‘’నీ స్మరణ పల్మరు జేసిన వారి బ్రేమతో నేతరియైన వత్సలత నెంతువు రంగనాయకా ‘’అని నమ్మకం తో ఉన్నాడు
‘’నా శిరస్సుకొట్టు ,దేహం తెగగొట్టు ,ఆలుపిల్లలను పట్టు .పొట్టకూటికి బట్టకు బెట్టక –నీపాదాలుపట్టాను వదలను నన్ను రక్షించు .’’కుండలి శాయి వైన నీ భజన పనికిరాదని దుర్జనులు మొండి శిఖండులై ముక్తిమార్గం తెలుసుకోలేక ‘’పాషన్డులైపాపులై యమలోకం లో బాధలనుభావిస్తారు .
‘’ఉత్పల పద్యపుష్పముల నుంచితి హారము గూర్చి నీ మెడన్ –సత్పురుషుల్ సుహారముల జాలగ నియ్యరే ఎత్తుకెత్తుగా-సత్పధ గామిగాక నుతి సన్నుతి కెక్కునె యంచు నెంచకీ –నీ ఉత్పల మాలికాళిగొను మోపికతో నిక రంగనాయకా ‘’  అని కవి శతక సమర్పణ చేశాడు గడుసుగా .
  ఈ శతకం లో కవి తనను గురించి ఏమీ చెప్పుకోలేదు .రంగనాయకుని గురించీ ప్రత్యేకంగా చెప్పలేదు .వెలకూడా తెలియదు .కానీ పద్యాలన్నీ రసబంధురాలే .సరలపద సంజాతాలే.భక్తిభావ సుమవిలసితాలే .చక్కని ధారాశుద్ధి మనసులను ఆకర్షిస్తుంది .ఈకవి ఈశాతకం గురించి మనవాళ్ళు ఎవరూ ఎక్కడా పేర్కొన్నట్లు లేదు .పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది .
ఇప్పుడు ఆలూరు కోన శ్రీ రంగనాయక స్వామి దేవాలయం గురించి తెలు అనంతపురానికి 67 కిమీల దూరంలో ఉంది. ప్రకృతి ప్రియులకు ఈ ప్రాంతం భలే నచ్చేస్తుంది. కొండ పైభాగాన 400 ఏళ్లకు పైబడిన చరిత్ర గల హజీ వలీ దర్గా ఉంది. ఇక్కడి జలపాతాలు పర్యాటకులను ఆహ్లాదాన్ని అందిస్తాయి. ఇక్కడి ఆలూరు రంగనాయక స్వామి దేవాలయం కూడా చూడదగినదిసుకొందాం –
అసుర సంహార దోషపరిహారం కావించడానికి ఒక శివలింగాన్ని ప్రతిష్టించమని చెప్పాడు విశ్వామిత్రుడు. తాటకిని సంహరించి, ఆమె ప్రాణాలు వదిలిన స్ధలంలో శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడానికి నిశ్చయించుకుని తగిన చోటు కోసం వెదికాడు రాముడు. పెన్నానది ఒడ్డున అడుగుపెట్టిన రాముడు ఒక చిన్న ప్రాంతంలో ఉన్న ఒక బుగ్గలో కైలాసనాధుడు స్వయంభువ లింగరూపంలో దర్శనమివ్వడంతో పరమానందభరితుడయ్యాడు. పరుశురాముడు పూజించిన స్వయంభువు లింగం అదే అని తెలుసుకున్న విశ్వామిత్రుడు ఆ లింగాన్ని అక్కడే ప్రతిష్ట చేయమని చెప్పాడు. ఆ లింగాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు భక్తితో చేశాడు రాముడు. అసుర సంహారం వల్ల అదీ ఒక స్త్రీని సంహరించినందువల్ల పొందిన దోషం పరిహారమయ్యింది. ఆ తర్వాత అయోధ్యకు వెళ్ళే మార్గంలో విశ్వామిత్రుడి మార్గదర్శకత్వంలో రాముడు జనక మహారాజు కుమార్తె జానకిని స్వయంవరంలో గెలిచి పరిణయమాడాడు శ్రీరాముడు.
తాటకికి మోక్షం శ్రీరాముడి పరిణయం ఈ దృశ్యాలన్నిటిని విశ్వామిత్రుడు తన దివ్యదృష్టితో ఏనాడో తెలుసుకున్న విషయాలు. తాటకికి మోక్షప్రాప్తి లభించిన చోటే ఈనాడు తాడిపత్రిగా పరిగణించబడుతుంది. ఇక్కడ రాముడు ప్రాణప్రతిష్ఠ చేసి పూజించిన లింగాన్ని రామలింగం అంటారు. ఆలయం నిర్మించబడింది. క్రీ.పూ. 1460 సంవత్సరంలో మొదలైన ఆలయనిర్మాణం క్రీ.పూ 1475 సంవత్సరంలో ముగిసింది. బుక్కా రామలింగస్వామి ఆలయం పేరున పిలువబడుతుంది. ఒక అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం చూడగలం. విశ్వామిత్రుడు యాగం జరిపిన అరణ్య ప్రాంతం తాడిపత్రికి దగ్గరలో వున్న కొండ చరియపై నెలకొన్న ఆలూరుకోన అని అంటారు. పురాణకధ ప్రకారం ఈ పుణ్యక్షేత్రం 14వ శతాబ్దంలో పాలించిన ఎర్రమ్మ తిమ్మరాజు అనే రాజు ఆలయాన్ని నిర్మించారు.
ఆ ఆలయంలో తాటకికి మోక్షాన్నిచ్చిన వైకుంఠవాసుడు శ్రీరాముడికి కులదైవమైన శ్రీరంగనాధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.కొండపై చిన్న ఆలయ ద్వారం దాకా మనం వాహనాల్లో వెళ్ళగలిగేంత సౌకర్యంగా ఉన్నాయి రహదారులు. తాడిపత్రి నుండి ఆరు కి.మీ దూరంలో ఉన్న ఆల్లొరు కోన దట్టమైన అడవిలో పక్షులు కలకలరవాలు మధ్య ప్రయాణం చేయాలి. సహజమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ కోనను చేరుకోవచ్చు. ఆలయ దరిదాపులకు వెళ్ళినప్పుడు ఎక్కడో జలపాతం సవ్వళ్ళు మంద్రంగా వినిపిస్తాయి. సుమారు 50 మెట్లు ఎక్కి వెళ్తే ఒక మండపం ఆ తర్వాత ఆలయగోపుర ద్వారం గుడి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన వసార చివర బలిపీఠం, ధ్వజస్తంభం, గరుడ ్భగవాన్‌ సన్నిధి. గరుడ భగవాన్‌ శ్రీరంఘనాధుని సేవలoోనిరంతరం తన్మయత్వంతో ఉన్నట్టు దర్శనమిచ్చే శ్రీ రంగనాయక విగ్రహం.
  గరుడ భగవాన్‌ ఎదుట ఒక మండపం ఆ తర్వాత గర్భగుడి. భక్తుల కోరికలను తీర్చే ఈ శ్రీరంగనాధుడు పడమటి దిక్కున శిరస్సు నుంచుకొని తూర్పువైపుకి కాళ్ళు పెట్టుకుని శేషశయనంపై పవళించిన విగ్రహం పాదాల వద్ద శ్రీదేవి, భూదేవి కూర్చున్నట్టున్న విగ్రహాలు దర్శనమిస్తాయి. నాభియందు బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు. మాములుగా శేషశయనంపై పవళించే శ్రీరంగనాధుని విగ్రహాలు మట్టితో తయారు చేసినవే. కాని ఈ క్షేత్రంలో వున్న శయనించిన శ్రీరంగనాధుడి విగ్రహం నల్లరాతితో చెక్కిన విగ్రహం. వైష్ణవ గురువైన శ్రీరామానుజల వారికి గర్భగుడి నిర్మించారు.
బయటి ప్రాకారంలో వరుసగా శంఖుచక్రాలు దర్శనమిస్తాయి. ప్రతి సంవత్సరమూ చైత్రంలో బ్రహ్మోత్సవము జరుగుతుంది. ధ్వజారోహణ, సింహవాహనము, హనుమాన్‌ వాహనములపై స్వామి వారి ఊరేగింపు పురవీధులలో జరుగుతుంది. రధోత్సవము, కళ్యాణోత్సవము మొదలైనవి చాలా ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరాముడి కులదైవమైన శ్రీరంగనాధుడే ఈ ప్రాంతం లోని ప్రజలకు ఇష్టదైవం. ఇంటి దైవముగా బాసిల్లుతున్నాడు. తమ కోర్కెలు తీర్చే ఈ దేవుడికి ముడుపులు చెల్లించడానికి ఎందరో భక్తులు అనంతపురం, ధర్మవరం, బళ్ళారి, కదిరి, నుండే కాక ఆంధ్ర రాష్ట్రములో పలు చోట్ల నుండి కూడా వస్తారు. ఆలయంలో వాయువ్య మూలలో ఎప్పుడూ ఊరే బుగ్గలో స్నానం చేసి స్వామిని దర్శించి కానుకలను, ముడుపులను చెల్లించి ప్రశాంతంగా ఆలయం వెలుపలికి వస్తారు భక్తజనులు. పచ్చని చెట్ల మధ్యన ప్రకృతి సౌందర్యంతో నెలకొన్న ఈ ఆలయంలోని శ్రీరంగనాధుని దర్శించి స్వామి వారి అనుగ్రహం పొందుతాం.
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-4-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-190 190-నటి ,భరత నాట్య కళాకారిణి ,నర్తనశాల ,పూజాఫలం ,గుండమ్మకధ ల హీరోయిన్ వర్జీనియా యూనివర్సిటి బడ్జెటింగ్ అధికారిణి –ఎల్.విజయ లక్ష్మి

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-190

• 190-నటి ,భరత నాట్య కళాకారిణి ,నర్తనశాల ,పూజాఫలం ,గుండమ్మకధ ల హీరోయిన్ వర్జీనియా యూనివర్సిటి బడ్జెటింగ్ అధికారిణి –ఎల్.విజయ లక్ష్మి
• ఎల్.విజయలక్ష్మి 1960వ దశకములోని తెలుగు సినిమా నటి, భరతనాట్య కళాకారిణి. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషలలో వందకు పైగా సినిమాలలో నటించింది.
• ఈమెకు నాట్యం అంటే ఎంతో ఆసక్తి. ఈమె సరైన భరతనాట్యం గురువు కోసమే, వీరి కుటుంబం పూణే నుండి చెన్నై తరలి వచ్చింది. త్వరగా నేర్చుకునే చురుకుదనం ఉన్న విజయలక్ష్మి అనతికాలంలోనే చక్కని నాట్యకళాకారిణిగా తీర్చిదిద్దుకుంది. ఈమె ఆరంగేట్రానికి, తనకు స్ఫూర్తినిచ్చిన నాట్యకళాకారిణి కుమారి కమల కూడా హాజరైంది. ఈమె నాట్యం చూసి ఈమెకు తొలిసారిగా తెలుగు సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత తమిళంలో కూడా నటించే అవకాశాలు వచ్చాయి.
• 1960వ దశకపు చివర్లో వచ్చిన ఈటి వరై ఉరవు ఈమె చివరి చిత్రం. ఆ చిత్ర నిర్మాణ సమయంలో విజయలక్ష్మి సోదరుని స్నేహితుడు, విజయలక్ష్మి ఫోటోను చూసి ఆమెను ప్రేమించాడు. పెళ్ళి ప్రతిపాదన చేశాడు. అందుకు విజయలక్ష్మి తల్లితండ్రులు అంగీకరించడంతో 1969లో మనీలాలో పనిచేస్తున్న వ్యవసాయ శాస్త్రజ్ఞుడు సురజిత్ కుమార్ దే దత్తాను పెళ్ళిచేసుకొని మనీలాలో స్థిరపడింది. మనీలాలో ఖాళీ సమయంలో చేసేదేమి లేక వ్యవసాయశాస్త్రంలో ఉన్నత చదువులు ప్రారంభించింది.[1]
• విజయలక్ష్మి 1991లో అమెరికాలో స్థిరపడి, అకౌంటింగ్ విద్యను అభ్యసించి ప్రస్తుతం అమెరికాలోని వర్జీనియా పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయంలో బడ్జెటింగ్ అధికారిగా పనిచేస్తున్నది.[2]
చిత్ర సమాహారం[మార్చు]
• జగదేక వీరుని కథ (1961) – నాగ పుత్రిక
• ఆరాధన (1962) – నాట్యకత్తె
• గుండమ్మ కథ (1962 – పద్మ
• మహామంత్రి తిమ్మరుసు (1962) – చిన్నాదేవి
• శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ (1962)
• నర్తనశాల (1963) – ఉత్తర
• పునర్జన్మ (1963)
• షబ్నమ్ (హిందీ) (1964)
• పూజాఫలం (1964)
• బబ్రువాహన (1964) – సుభద్ర
• బొబ్బిలి యుద్ధం (1964)
• రాముడు భీముడు (1964)
• పరమానందయ్య శిష్యుల కథ (1966)
• నసీహత్ (హిందీ) (1967)
• శ్రీకృష్ణావతారం (1967)
• భక్త ప్రహ్లాద (1967)
• చిత్రలేఖ.

చక్కని నటనకు ,హావభావాలకు పటిష్టమైన నృత్యానికి చిరునామాగా నిలచింది ఎల్ విజయ లక్ష్మి .సభ్యత సంస్కారాలతో మెప్పించింది .అందం ఆమెకు పెట్టనికోట అయింది .ముద్దుముద్దు పలుకులతో అలరించింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-189 · 189-‘’మా తెలుగు తల్లికీ మల్లెపూదండ ‘’’’దేశమును ప్రేమించుమన్నా ‘’గాయని ,చతుర్భాషా చిత్ర నటి ,విదేశాలలో భారతీయ సంగీత శిక్షణాలయాలు నెలకొల్పి,నృత్యకళసంగీతం పై వర్క్ షాపులు నిర్వహించి బ్రాడ్వే అవార్డ్ పొందిన విదుషీమణి –టంగుటూరి సూర్యకుమారి

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-189

·         189-‘’మా తెలుగు తల్లికీ మల్లెపూదండ ‘’’’దేశమును ప్రేమించుమన్నా ‘’గాయని ,చతుర్భాషా చిత్ర నటి ,విదేశాలలో భారతీయ సంగీత శిక్షణాలయాలు నెలకొల్పి,నృత్యకళసంగీతం పై వర్క్ షాపులు నిర్వహించి  బ్రాడ్వే అవార్డ్ పొందిన  విదుషీమణి –టంగుటూరి సూర్యకుమారి

·         టంగుటూరి సూర్యకుమారి (నవంబర్ 131925 – ఏప్రిల్ 252005) అలనాటి తెలుగు సినిమా నటి, ప్రసిద్ధ గాయకురాలు.

జీవిత విశేషాలు

ఈమె 1925 నవంబర్ 13 నాడు రాజమండ్రిలో జన్మించింది. ఈమె ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు యొక్క తమ్ముడు టంగుటూరి శ్రీరాములు కూతురు. 1937లో మద్రాసు వచ్చి, సినీరంగ ప్రవేశము చేసింది. 1952లో ఆమె తొలి మద్రాసు అందాలసుందరి (మిస్ మద్రాసు) అయినది.[1] మూడో ఏటనుంచే పాటలుపాడేది. పన్నెండు, పదమూడేళ్ళ ప్రాయంలోనే ఆమె ‘రైతుబిడ్డ‘ సినిమాలో నటించింది. సూర్యకుమారి రూపం, కంఠస్వరం రెండూ బాగా ఉండడంచేత, అప్పటికే పెదనాన్న ప్రకాశం సభల్లో ప్రార్థన గీతాలు పాడుతూండడం చేత సినిమావారి పిలుపు వచ్చింది. సాంప్రదాయ నియమ, నిష్టలుగల కుటుంబమవడంచేత కొంత వ్యతిరేకత ఎదురయ్యింది. ఊగిసలాట అనంతరం సూర్యకుమారి సినిమాల్లోకి వచ్చి తెలుగుతమిళకన్నడహిందీ నాలుగు భాషల్లోనూ మొత్తం ఇరవై ఆరు సినిమాల్లో నటించింది.

లలిత గీతాలు యాభై, దేశభక్తిగీతాలు యాభై మొత్తం నూరు గ్రామఫోను రికార్డులు ఇచ్చింది. అలాగే ఒక యాభై దాకా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల సినిమాల్లో తన గొంతుతో పాడిన పాటల రికార్డులు ఉన్నాయి

చంద్రహాస (1941) సినిమాలో టంగుటూరి సూర్యకుమారి పాడిన ముదముగ పాట

నటన కంటే సూర్యకుమారి పాడిన దేశభక్తి గీతాలు, లలితగీతాలు, అష్టపదులు వంటివాటికి ఎక్కువ ప్రజాదరణ లభించడంచేత ఆమె పాట కచ్చేరీలు తరుచూ చేస్తూండేది. ఆంధ్రలోని చాలా ఊళ్ళలో లలిత సంగీత కచ్చేరీలు చేసింది. పేరు ప్రతిస్టలు, ప్రజాదరణ ఆమెకు తృప్తినివ్వలేదు. ఏదో ప్రత్యేక కృషి చెయ్యాలన్న తపన, మూడు నాలుగేళ్ళపాటు కరతాళ ధ్వనులకు, ప్రశంసలకు దూరంగా ఉండి, చదువుమీద దృష్టి కేంద్రీకరించి, ప్రైవేటుగా కేంబ్రిడ్జి సీనియర్ పరీక్ష వ్రాసి, ప్రథమశ్రేణిలో పాసైంది.[2]

సూర్యకుమారి కంఠ, రంగూ, రూపం ఆకర్షణీయంగా ఉన్నా, మామూలు అమ్మాయిలకంటే కొంచెం పొడవుగా ఉండటం చేత, సినిమా రంగంలో సమస్య అయ్యింది. ఆనాటి సగటు హీరోలు ఈమె కంటే ఓ చూపువాసి పొట్టిగా ఉండటంచేత కాస్త ఇబ్బంది. అదీ కాక ఈమె బ్రాహ్మణ కుటుంబం, అందులోనూ పేరుపొందిన రాజకీయ కుటుంబం నుంచి రావటమే కాదు, ప్రేమ సన్నివేశాలు హీరోయిన్ మీద హీరో చెయ్యి వెయ్యడం, ఇత్యాదివి ఒప్పుకొనేవారు కాదుట. అందువల్ల గొప్ప చాతుర్యం ఉండి కూడా సూర్యకుమారి సినిమాల్లో సుస్థిరత పొందలేక పోయింది.

తెలుగు, తమిళము, కన్నడ, హిందీ భాషా చిత్రాలలో నటించిన సూర్యకుమారి మంచి గాయకురాలు కూడా. స్వాతంత్ర్యోద్యమ సమయములో మా తెనుగు తల్లికి మల్లెపూదండదేశమును ప్రేమించుమన్నా మొదలైన అనేక దేశభక్తి గీతాలు పాడింది. ప్రకాశం పంతులు ఈమె కళాభిరుచిని బాగా ప్రోత్సహించాడు. శాస్త్రీయ సంగీతం నేర్పించాడు. అతను ఏ సభకు వెళ్ళినా ఈమెను ఆ సభకు తీసుకెళ్ళి జాతీయ గీతాలు పాడించేవాడు. 1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్టావతరణ సభలో నెహ్రూ, రాజాజీ, ప్రకాశం ప్రభృతుల సమక్షంలో వందేమాతరం, ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ పాటలు ఆలపించి అందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. వీటితో పాటు’స్వప్నజగతిలో ఛాయావీణ’ మొదలైన లలిత గీతాలు, అడవి బాపిరాజు గారి ‘ప్రభువుగారికీ దణ్ణం పెట్టూ’, ‘రావోయి చిన్నవాడా’ మొదలైన జానపద గీతాలు కూడా పాడుతుండేది. హెచ్.ఎం.వి. తదితర గ్రామఫోన్ కంపెనీలు ఈమె పాటలను రికార్డు చేశాయి. ప్రముఖ గాయనిగా పేరుతెచ్చుకుంది.

ఇతర దేశాలలో వ్యాపించిన ఖ్యాతి

1960 దశకంలో ఈమె లండను వెళ్ళి అక్కడ ‘ఇండియన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ సంస్థను స్థాపించింది. ఇందులో భారతీయ పాశ్చాత్య కళలను, కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, పరస్పర సదవగాహన పెంపొందించం ముఖ్య ఆశయం. 1968లో ఈమె కృషిని బ్రిటిషు రాణి గుర్తించింది. 1969లో గాంధీజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తూ సెయింట్ పాల్ కెథెడ్రల్ లో గానం చేసిన ప్రథమ భారతీయ వనిత ఈమె. ఈమె నార్వేస్వీడన్హాలెండ్స్పెయిన్కెనడాఅమెరికామొదలైన పలు దేశాలలో భారతీయ సంగీత శిక్షణాలయాలు నెలకొల్పి, వందలాది కళాకారులను తయారుచేశారు. అమెరికాలో బ్రాడ్వే థియేటరులో విశ్వకవి రవీంద్రుని ‘కింగ్ ఆఫ్ ది డార్క్ ఛాంబర్’ నాటకంలో రాణి పాత్ర ధరించి, బ్రాడ్వే అవార్డు పొందిన మొదటి భారతీయ వ్యక్తి. ఈ నాటకాన్ని న్యూయార్కులో ఎనిమిది నెలలపాటు ప్రదర్శించి, అటు తరువాత ఆఫ్రికాలో నాలుగు నెలలు పర్యటించింది. కొలంబియా యూనివర్సిటీలోనూ, లండను యూనివర్సిటీ విద్యాసంస్థలలోను, బ్లాక్ థియేటరులోను భారతీయ నృత్యకళ సంగీతంపై వర్క్ షాపులు నిర్వహించింది. ప్రాచ్య, పాశ్చాత్య నృత్య సంగీతాలకు మధ్య సుహృద్భావ సేతువుగా అంతర్జాతీయ కీర్తినందిన మధురగాయని ఈమె.

అవార్డులు

1975లో హైదరాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభ ఈమె సేవలను గుర్తించి సత్కరించింది. 1979లో రాజ్యలక్ష్మి అవార్డుతో ఈమెను గౌరవించింది.

అస్తమయం

లండను లోని ప్రముఖ చిత్రకారుడు హెరాల్డ్ ఎల్విన్తో వివాహమైంది. 1973లో లండనులో స్థిరపడిన ఈమె ఏప్రిల్ 252005 న లండనులో మరణించింది.

సినిమాల జాబితా

·         విప్రనారాయణ (1937)·         అదృష్టం (1939)·         రైతుబిడ్డ (1939)·         జయప్రద (1939)·         దేవత (1941)·         అబ్ల (1941) – హిందీ·         చంద్రహాస (1941)·         దీనబంధు (1942)·         భక్త పోతన (1942)·         భాగ్యలక్ష్మి (1943)·         కృష్ణప్రేమ (1943)·         కటకం (1947) – తమిళము·         గీతాంజలి (1948)·         సంసారనౌక (1948) – తమిళము·         భారతి (1949) – కన్నడ·         అదృష్టదీపుడు (1950)·         మరదలు పెళ్లి (1952)·         వతన్ (1954) – హిందీ·         ఉడాన్ ఖటోలా (1955) – హిందీ·         బాంబే ఫ్లైట్ 417 (1956) – ఆంగ్లము·         భక్త రామదాసు (1964·         భారతి (1949) – కన్నడ·         అదృష్టదీపుడు (1950)·         మరదలు పెళ్లి (1952)·         వతన్ (1954) – హిందీ·         ఉడాన్ ఖటోలా (1955) – హిందీ·         బాంబే ఫ్లైట్ 417 (1956) – ఆంగ్లము·         భక్త రామదాసు (1964)

  లండన్ లో సెటిల్ అయిన ఆంధ్ర మేధావి, కవి, రచయితా ,విమర్శకుడు ఇంగ్లీష్ సాహిత్యంపై ఉద్గ్రంధాలు రాసిన శ్రీ గూటాల కృష్ణమూర్తి గారు  సూర్యకుమారిపై ఒక అద్భుత గ్రంధాన్ని ఎన్నో విలువైన సమాచారాలతో ఫోటోలతో వెలువరించారు .ఈ పుస్తకం వచ్చిందని సరసభారతి కి ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి తెలియ జేస్తే ,ఆయన శ్రీ బాపు గారికి చెబితే ,బాపు గారు ఆ అరుదైన పుస్తకాన్ని నాకు పంపారు .చిన్నప్పటి నుంచి సూర్యకుమారి పాటలంటే ఇష్టపడే నాకు ఇది అమూల్య బహుమతి .బాపుగారికి ,మైనేనిగారికి కృతజ్ఞతలు అప్పుడే చెప్పాను .మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాను .మాధుర్య లాలిత్యాలకు సూర్యకుమారి పెట్టింది పేరు ఆంద్ర దేశపు కీర్తి విదేశాలలో వ్యాపింపజేసిన విదుషీమణి ఆమె .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment