శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.12వ భాగం.19.7.22
Video link
శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.12వ భాగం.19.7.22
Video link
భారతీ నిరుక్తి 14వ భాగం.19.7.22
Video link
శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ. 11వ భాగం.18.7.22
Video link
గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-12
కాంగ్రెస్ రెండవ సదస్సు తర్వాత కలకత్తాలో దాదాభాయ్ నౌరోజీ అధ్యక్షత న జరిగిన సభలో ఇండియన్ అసోసిఏషన్ అందులో విలీనమై జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది .భారతీయుల్ని నామినేట్ చేయకుండా ఎన్నికలలో నిలిచి గెలిచేట్లు చేయాలనే డిమాండ్ వచ్చింది .విదేశీ యంత్రాంగం కింద మగ్గడం అనే కాంగ్రెస్ మాటలకు లార్డ్ డఫ్రిన్ కు కోపమొచ్చి విరుచుకుపడ్డాడు .మోతీలాల్ కాంగ్రెస్ ను సమర్ధించాడు .డఫ్రిన్ కాంగ్రెస్ ను ‘’సూక్ష్మమైన అల్ప సంఖ్యాక వర్గానికి ‘’ప్రాతినిధ్యం వహిస్తోందని అనటం మోతీలాల్ కు నచ్చక కాంగ్రెస్ తో చేతులు కలిపాడు .1888అలహాబాద్ కాంగ్రెస్ సదస్సుకు ఖద్దరు బట్టలతో హాజరయ్యాడు .ఐయే ఎస్ పాసైన భారతీయులు లండన్ లో ఒక ఏడాది శిక్షణ పొందాలి అన్నదాన్ని వ్యతిరేకించాడు .అందరూ ఆయన్ను అభినందించారు .కాంగ్రెస్ లో చర్చలు సరిగ్గాజరగాకపోవటం ,భారత్ ఇంగ్లాండ్ లమధ్య సయోధ్యతకే తంటాలు పడటం ఆయనకు నచ్చలేదు .పాలనలో బ్రిటిష్ వారితో సమానాధికారాలకోసమే అర్రులు చాచటమూ నచ్చలేదు .మైనారిటీల మానవ హక్కులు చాలా విలువైనవనీ వాటిని బల ప్రదర్శనతోనే సాధించుకోవాలని ఆయన నమ్మి ,పత్రికలో దాన్ని వ్రాసేవాడు .
ప్రభుత్వం ముస్లిం వేర్పాటు వాదాన్ని వెనకేసుకొచ్చింది .సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ద్వారా పోటీ రాజకీయ పక్షాన్ని రూపొందించారు .హిందువులు ,ముస్లిములు వేర్వేరు జాతులనీ ,కనుక ప్రభుత్వం ఏర్పడితే బెంగాలీ బాబుల ఆదిపత్యం పెరిగి ముస్లిం లకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేశాడు .’’ఉన్నత కుటుం బీకులు తమ ధన మాన ప్రాణాలను దిగువ శ్రేణి ప్రజలకు నమ్మి ఇవ్వరు ‘’అని వ్యంగ్య బాణాలు వేశాడు .దీనికోసం 1888లో ‘’యునైటెడ్ ఇండియన్ పేట్రియాటిక్ అసోసియేషన్ ‘’ను కాంగ్రెస్ కు పోటీగా స్థాపించాలనుకొని హిందూ ముస్లిం ఉన్నతవర్గాలవారితో ఏర్పాటు చేశాడు .1878లోనే అమీర్ అలీ అనే సంపన్న ముస్లిం బారిస్టర్ ‘’సెంట్రల్ నేషనల్ మహామ్మదీన్ అసోసియేషన్ ‘’ను ప్రభుత్వం లో ముస్లిం భాస్వామ్యాన్ని పెంచటానికి ఏర్పరచాడు .నామినేషన్ లద్వారానే లాభం పొందాలని అతడి ఆలోచన.దీనివల్ల బెంగాల్ లో కాంగ్రెస్ అంత పటిష్టం కాదు అనే భావన కలిగింది .స్థానిక ,ప్రాంతీయ సమస్యలను చర్చించటానికి కాంగ్రెస్ అంతగా అభి రుచి చూపకపోవటమూ మరోకారణం .కరువు కాటకాలు వరదలు ఒకదానితర్వాత ఒకటి వచ్చి మీద పడటం తో గ్రామీణ రైతాంగానికి దిక్కు తోచటం లేదు .తేయాకు తోటల్లోకి బలవంతంగా కూలీలను తెప్పించి శ్రమ దోపిడీ చేస్తోంది ప్రభుత్వం .బెంగాల్ ప్రజలు పేదరికం లో అల్లాడి పోతుంటే కాంగ్రెస్ అసలేమీ పట్టించుకోవటం లేదు .ఈ మొండి వైఖరి వలన 1887’’బెంగాల్ ప్రోవిన్షియల్ కాంగ్రెస్’’ఏర్పడక తప్పిందికాదు .అణగారిన ప్రజలు రైతులు కూలీల తరఫున విద్యాధికులు ఉద్యమిస్తేనే తప్ప వారికి న్యాయం జరగదని మోతీలాల్ మొదలైన వారు భావించారు .ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వంకోసం కాంగ్రెస్ కంటే బెంగాలీలే పట్టు బట్టారు .అన్ని గ్రామాలూ జిల్లాలు కలకత్తా తో సమానంగా నిలిచాయి .ఈకార్యకలాపాలను అమృతబజార్ పత్రికలో కవరేజ్ బాగా వచ్చేది .శిశిర్ కుమార్ ఇంగ్లీష్ భాష మధ్యతరగతి వారికి హాయిగా అర్ధమయ్యేది .భారతీయ ప్రత్యామ్నాయ పదాలు కూడా మధ్యమధ్యలో వాడేవారు .ఈ ఇంగ్లీష్ ను ఇంగ్లీష్ వారు ‘’బాబూ ఇంగ్లీష్ ‘’అని ముఖం చిట్లించేవారు .
ప్రజా జీవన రంగం లో
1887 లో పబ్లిక్ సర్వీస్ లపై సుప్రీంకోర్ట్ ‘’రాయల్ కమిషన్ ‘’ఏర్పాటు చేయగా ,మోతీలాల్ సాక్షిగా హాజరై ముందుగా పోస్టల్ డిపార్ట్ మెంట్ గురించి మాట్లాడుతూ అందులో ఉద్యోగులంతా ఆంగ్లేయులే అనీ ,అవినీతి నిలయంగా మారిందని ,సమర్ధ భారతీయులతో ఈశాఖను నింపాలని చెప్పాడు .ఆతర్వాతనే భారతీయులను తీసుకోవటం మొదలుపెట్టారు .పోస్టల్ డైరెక్టర్ జనరల్ ‘’హాగ్ ‘’రాజీనామా చేసేశాడు .18-20మధ్య వయసున్నవారిని ఆ డిపార్ట్ మెంట్ లో పెద్దపెద్ద పదవుల్లో నియమిస్తే అనుభవం లేక పాలన సరిగ్గా జరగదు .వాళ్ళంతా తల్లి గర్భం లో 12ఏళ్ళు ఉన్న ఆష్టావక్రులై ఉంటేనే అది సాధ్యం అని వ్యంగ్యం గా అన్నాడు .మోతీలాల్ చేసిన ఈ వ్యాఖ్యలకు పాఠకుల నుంచి అనూహ్యమైన మద్దతు లభించింది .ఒక యూరపియన్ ఆకాశ రామన్న ఉత్తరం పత్రికకు రాస్తూ-‘’మోతీలాల్ !పబ్లిక్ కమీషన్ ఎదుట నీ వాగుడు చదివిన వారికి మీ దుర్మార్గజాతి ఎలాంటి నీచులో తెలిసింది .అక్కడి యూరోపియన్ పెద్దమనుషులు బూటు మడమలతో నీ వీపు మోగించ లేదు అంటే ఆశ్చర్యంగా ఉంది .మీ బెంగాలీలకు అదే శాస్తి జరగాలి .మీ అంత నికృష్టజాతి భూమ్మీద లేదు .మెకాలే ఏమన్నాడో తెలుసా ?మీ (ముద్రించటానికి వీల్లేని బూతు )అందర్నీ ఇంగ్లీష్ ప్రభుత్వం కనుక సహిస్తోంది .బెంగాలీలు దగుల్బాజీలు లుచ్చాలు ,మోసగాళ్ళు వాళ్ళందర్నీమించి నువ్వు నీ వాళ్ళు నీజాతి పరువు తీసేశారు ‘’అని అక్కసు వెళ్ళ గక్కాడు .అమృత బజార్ పత్రికలో ఆ లేఖను ముద్రించి చివరగా ‘’ఈ లేఖ ఒక యూరోపియన్ కానీ పోస్టల్ ఆఫీసర్ కాని రాసి ఉంటాడు .అదే నిజమైతే ఆబూతులన్నీ అతనికి ఉద్యోగామిచ్చిన పెద్దమనిషికే తగలాలి .దీన్ని ఆయనకు ఉచిత కానుకగా ఇస్తున్నాం ‘’.అని రాశారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-7-22-ఉయ్యూరు
· మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -305
· ‘’అనువాద కోవిదాగ్రణి’’ శరత్ నవలలకు ఆంధ్రత్వం అద్దిన ,కార్తవరాయనికద ,కార్తీకదీపం సినీ ఫేం,సాహిత్య అకాడెమి పురస్కారగ్రహీత –మద్దిపట్లసూరి
· మద్దిపట్ల సూరి ( జులై 7, 1916 – నవంబర్ 19, 1995) రచయిత, అనువాదకుడు, సాహితీవేత్త. 1993 లో సాహిత్య అకాడమీ అనువాద బహుమతి తో వీరిని సత్కరించారు.
జీవిత సంగ్రహం
అనువాద కోవిదాగ్రణిగా ప్రసిద్ధులయిన “మద్దిపట్ల సూరి” తెనాలి సమీపంలో సంస్కృతాంధ్రవిద్యలకి ఆటపట్టయిన అమృతలూరులో జులై 7, 1920నాడు జన్మించారు. అనేక సుప్రసిద్ధ నవలలు బెంగాలీ, హిందీ భాషలనుండి తెలుగులోకి స్వతంత్ర నవలలు అనిపించేంత సహజంగా అనువాదాలు చేసి అనువాద కోవిదాగ్రణి అని పేరు పొందారు. దేశీ కవితామండలి ఆధ్వర్యంలో ప్రచురించిన శరత్ చంద్ర ఛటర్జీ నవలలు, దేవదేసు, పరిణీత అనువాదాలకు బొందలపాటి శివరామకృష్ణగారికి దోహదం చేసారు. చివరిదశలో ఉద్యోగం లేక, ధనాభావంవల్ల కొంతమంది ప్రసిద్ధులకు కొన్ని ప్రసిద్ధ రచనలు రాసి పెట్టారు. మాధవపెద్ది గోఖలే సూరిగారిని చిత్రరంగంలో ప్రవేశపెట్టేరు 1958లో. ప్రముఖ నటుడు యం. ప్రభాకరరెడ్డి, సూరి మిత్రులయినతరువాత అనేక చిత్రాలలో పని చేసేరు. ప్రభాకరరెడ్డి సూరిగారికి అనేకసందర్భాలలో ఆర్థిక సహాయం చేసారు. ఇటీవల “”సమరేశ్ బసు”” మహాభారత కథాకల్పన శాంబుడు, “”విభూతిభూషణ్ బందోపాధ్యాయ”” చరిత్రాత్మక రచన పథేర్ పాంచాలి నవలలకు ఆయన చేసిన అనువాదాలు పునర్ముద్రిస్తున్నారు. “”విశ్వవాణి””కోసం నిమ్నవర్గాల సముద్ధరణకు కులరాహిత్యాన్ని ప్రబోధించే జీవనలీల గ్రంథాన్ని 1959 లో రాసారు. నవంబరు 19, 1995 తేదీన సూరి మరణించారు.
విద్య
అన్నగారూ వ్యాకరణశిరోమణీ అయిన రామవరపు కృష్యమూర్తిశాస్త్రిగారివద్ద శ్రౌతస్మార్తాలను చెప్పుకున్నారు. ఉన్నత పాఠశాల చదువు నచ్చక, కలకత్తా వెళ్ళి బెంగాలీల చలిత్ భాషను, గౌడుల సంస్కృతాంధ్ర గ్రంథాలను, అలంకారశాస్త్రము అధ్యయనం చేసారు. అక్కడే జుగాంతర్ ప్రభావంమూలాన ఆధునిక భావజాలానికి లోనై, పుట్టుబిరుదు “శాస్త్రి”ని తొలగించి డిగ్రీలు లేని పాండిత్యంతో మద్దిపట్ల సూరిగా వెనక్కి వచ్చారు.
అనువాదాలు[మార్చు]
సూరిగారి అనువాదాలలో అధికభాగం సాహిత్య ఎకాడమీ పురస్కారాలు అందుకున్నవారి రచనలే. వారి శైలి సంస్కృతం వన్నెమీరిన వ్యావహారికం. రవీంద్రనాథ్ టాగోర్ 21 ప్రసిద్ధకథలకు సూరి అనువాదాలు రవీంద్ర కథావళ అన్నపేరుతో 1968 లో ప్రచురించారు. ఈ సంకలనానికి సోమనాత మిత్ర అవిస్మరణీయమైన పీఠిక, ఈ అనువాదాలు సుప్రసిద్ధమయినవి. బి.యస్.ఆర్ ఈ పుస్తకానికి సమీక్ష రాస్తూ, “పోస్ట్ మాస్టర్, కాబూలీవాలా అనువాదాలను చదివి చెమ్మగిల్లని వారుండరు,” అని వ్యాఖ్యానించారు. సూరిగారి హాస్యప్రియత్వంగురించి ఏల్చూరి మురళీధరరావు ఇలా వ్యాఖ్యానించారు, “సూరిగారు సరస హాస్యప్రియులు. గంగూలీ & గంగూలీ అన్న కథలో వ్యాపారనష్టాలను పూడ్చుకోవటానికి కాళీమంత్రం అష్టోత్తరం రాయమని ఎవరో సలహా ఇస్తారు. మోసాలు అలవాటయిన గంగూలీ పన్నెండు నామావృత్తులతో ఒక రబ్బరుస్టాంపు చేయించి, దాన్ని తొమ్మిదిసార్లు కొట్టి దేవతకే టోపీవేద్దామనుకొంటాడు. మరొక కథలో రైలుప్రయాణంలో సంప్రదాయ కుటుంబపెద్ద తమతో ఒక నవయువకుడి పలకరింపు చొరవను సహింపలేకపోతాడు. రైల్లో వంటచేస్తుండగా కూతురి చీరకు నిప్పంటుకొంటే ఆ యువకుడు చూసి రక్షిస్తాడు. కుటుంబం వారంతా అతన్ని ఆదరిస్తారు. యువతీయువకులకు ప్రేమభావం అంకురిస్తుంది. రాత్రివేళ మాటలు కలుస్తాయి. అంతలో అతని స్టేషను వస్తుంది. హడావుడిగా దిగిపోతూ ఆమె వివరాలడుగుతాడు. ఆమె సమాధానం వినబడకుండానే రైలు కదిలిపోతుంటుంది. ఇంకో కథలో ఒక సంపన్న బ్రాహ్మణయువకుడు పెద్దలు కుదిర్చిన ఆధునికభావాల యువతి మల్లికను చేసుకొంటాడు. ఆమె అతని వేషభాషలను మార్చి, మాంసాహారం కూడా అలవాటుచేస్తుంది. ఎంత ప్రేమ చూపినా ఆమెను సంతృప్తిపరుపలేక అతను విహ్వలుడు కావటాన్ని ఎంతో రమ్యంగా చిత్రీకరిస్తారు.”
ఇతని కొన్ని అనువాద రచనలు:
· అనురూపాదేవి రాసిన “మంత్రశక్తి” నాటకానికి అనువాదం 1959
· నిరుపమాదేవి రాసిన శ్యామలికి అనువాదం. 1959
· తారాశంకర్ బెనర్జీ రాసిన జల్ సాగర్ నవలకి అనువాదం, 1960. దేశీ కవితామండలి ప్రచురణ.
· తారాశంకర్ బెనర్జీ నవల ఉత్తరాయణ్ కి అనువాదం. ఇది రెండవ ప్రపంచయుద్ధం యొక్క దారుణఫలితాలను చిత్రీకరించిన విషాదాంత నవల. (1962)
· నీహార్ రంజన్ గుప్త నవల మాయామృగం, (1962)
· ఆప్తమిత్రులు అనువాదం, (1966)
· బిమల్ కర్ రాసిన అసమయ్ నవలను సమయం కాని సమయం అన్నశీర్షికతో అనువదించేరు, 1968
· శరత్ చంద్ర ఛటర్జీ రాసిన స్వయంసిద్ధ తెలుగులో అత్యుత్తమ అనువాద నవలగా ప్రసిద్ధి చెందింది.
· వనఫూల్ నవలకి అనువాదం రాత్రి. (1958)
· తారాశంకర్ బందోపాధ్యాయ రాసిన “గణదేవత” నవల.1970
సినిమారంగంలో కృషి
· కార్తవరాయని కథ. రోమియో జూలియట్, రాజస్థానచరిత్రల ఆధారంగా రూపొందించినది, (1958).
· రమాసుందరికి సంభాషణలు.
· వరకట్నం (1962)
· మా వదిన (1967)
· మాతృ దేవత (1969)
· భలే తమ్ముడు (1969)
· పచ్చని సంసారం (1970)
· విచిత్ర దాంపత్యం (1971)
· పండంటి కాపురం, (1972). ఈ చిత్రం రజతోత్సవం చేసుకుంది.
· గృహప్రవేశం (1982)
· కార్తీకదీపం
· పచ్చని సంసారం
· ధర్మాత్ముడు
· గాంధీ పుట్టిన దేశం
· రాధా మై డార్లింగ్
పురస్కారాలు
· “కలకతార్ కాఛేఈ” అనువాదానికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం
· సాహిత్య అకాడమీ అనువాద బహుమతి (1993)
· సశేషం
· మీ- గబ్బిట దుర్గాప్రసాద్-18-7-22-ఉయ్యూరు
Video link
గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-11
పత్రిక మార్పులకు కారణాలు -2
బ్రిటిష్ లిబరల్స్ చెప్పీ మాటలు నిజమే నని సురెంద్రనాద్ నమ్మాడు .విదేశీ ప్రభుత్వం పై అంతటి నమ్మకం ఉంచరాదని గ్రహించలేకపోయాడు.బ్రిటన్ లో టోరీ పార్టీ ఓడిపోవటం తో లార్డ్ లిట్టన్ పదవి ముగిసింది .లార్డ్ రిప్పన్ వచ్చాడు .రాగానే వెర్నాక్యులర్ చట్టం1861లో రద్దు చేశాడు .ప్రజలలో సురేంద్ర పలుకుబడి బాగా ఉంది .1878లో ఘోష్ సోదరులు’’ ఆనంద బజార్ ‘’అనే మతప్రాతిపాదిక బెంగాలీ వార పత్రిక ప్రారంభించారు .1922లో సురేష్ చంద్ర మజుందార్ ,,ఫ్రఫుల్లకుమార్ సర్కార్ లు దీన్ని దినపత్రికగా మార్ఛి విశేష ప్రాచుర్యం కలిగించారు .
నమ్మిన వారికి గుణపాఠం
విషయజ్ఞుడు రాజకీయజ్ఞుడు అయిన రిప్పన్ స్థానిక స్వపరిపాలన ప్రవేశపెట్టాడు .ఇది రాజకీయ ప్రజావివేచనకు తోడ్పడింది .జిల్లాబోర్డులేర్పడి బోర్డ్ అధ్యక్షుడికి అధికారాలు వచ్చాయి .అన్నిరకాల అధికారాలు ఆయనకిందే ఉండేవి .స్థానిక బోర్డులు ఏర్పరచి జిల్లా బోర్డు లకింద పని చేసేట్లు చేశారు .పట్టణ మునిసిపాలిటీలకు మెజార్టీ సభ్యులు ఎన్నుకోనేవారు .స్థిరపడ్డాక అనధికారులు అధ్యక్షులయ్యారు .రిప్పన్ భారతీయ విద్యా కమీషన్ ఏర్పాటు చేసి ,దాని తీర్మానాలను అమలు చేశాడు .’’పాలకుడు నిజాయితీ పరుడు అయినా ,విదేశీపాలన నిజాయితీగా సాగే వీలు లేదు ‘’అని చెప్పిన అమృతబజార్ పత్రికమాట నిజమై రిప్పన్ విఫలమయ్యాడు .యూరోపియన్ల గర్జన ఎక్కువై ,1883లో ఆయన డార్జిలింగ్ నుంచి వస్తుంటే వైస్రాయ్ భవనం గేటు వద్ద ఆయన్ను బండబూతులు తిట్టారు .దీనిపై పరమానంద దత్’’ఆంగ్లో ఇండియన్లు పెద్ద కుట్ర పన్ని ,ప్రభుత్వ చట్టాన్ని రద్దు చేయకపోతే , సెంట్రీల దాడి చేసి ,వైశ్రాయిని చాంద్ పాల్ ఘాట్ వద్ద స్టీమర్ లోకి బలవంతంగా ఎక్కించి ,గుడ్ హాప్ అగ్రం మీదుగా ఇంగ్లాండ్ కు తరలించాలని ప్లాన్ ‘’అని రాశాడు .బ్రిటన్ గవర్నమెంట్ జోక్యం చేసుకొని జిల్లా మేజిస్ట్రేట్ ,సెషన్స్ జడ్జి ల అధికారాలను ప్రకటించటం తో వివాదం సమసిపోయింది .తర్వాత చేసిన చట్టం లో యూరోపియన్ అధికారుల అధికారాలు పెంచారు .అన్ని రాయితీలు వారికి లభించాయి .
చట్టం ముందు అందరూ సమానులే అనే రోజు వస్తుందని భావించిన ఇండియన్ లకు ఈ ‘’ఇల్బర్ట్ బిల్ ‘’ఆశనిపాతం అయింది .అయితే మోతీలాల్ అమృతబజార్ పత్రిక ఒక గట్టి గుణ పాఠం నేర్చుకొన్నారు .ఒక కేసులో సాలగ్రామ వివాదం లో దాన్ని కోర్టులో ప్రవేశపెట్టాలన్న జస్టిస్ నోరిస్ న్యాయమూర్తి పదవికి అనర్హుడు అని ది బెంగాలీ పత్రికలో సురేంద్ర వ్యాసం రాస్తే ,రెండు నెలలు శిక్ష పడితే హిందువులు ఆయనకు పూర్తీ మద్దతు ప్రదర్శించి ఆగ్రహంతో ఊగిపోయి తీవ్ర నిరసనలు చేయాటం తో ఆయన కీర్తి మరింత పెరిగింది .1883లో విడుదలకాగానే డిసెంబర్ లో కలకత్తాలో ఇండియన్ అసోసియేషన్ అఖిలభారత జాతీయ సభ జరూపగా ,భారత మిత్రుడు w.s.బ్లాంట్ ‘’ఇది జాతీయ పార్లమెంట్ ఆవిర్భావానికి మొదటి మెట్టు ‘’అన్నాడు .1870లోనే శిశిర్ కుమార్ ‘’జాతీయ పార్లమెంట్ ‘’ను సూచించాడు .1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన తర్వాత కాన్ఫరెన్స్ అందులో విలీనమైంది .అమృత౦ దీన్ని బలపరచింది .1884లో సెంట్రల్ ఇండియా గవర్నర్ జనరల్ ఏజెంట్ సర్ లేపెలో గ్రిఫిన్ అక్రమాలను పత్రిక బయట పెట్టింది .ఆరోపణలు రుజువై రాజీనామా చేసి ,వెళ్ళియాడు .
1889లో మరోస్కూప్ బయటికి లాగింది పత్రిక .కాశ్మీర్ మహారాజు ను గద్దె దించటానికి వెనకున్న కారణాన్ని తెలిపే విదేశాంగ శాఖ రహస్యపత్రాన్ని బయటపెట్టి ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది .గిల్గిత్ ప్రాంత ఆక్రమణ ఇందులో ముఖ్యమని చెప్పింది .దేశంలో తీవ్రలజడి జరిగి ప్రజాగ్రహం ఉప్పెన అవగా గత్యంతరం లేక మళ్ళీ రాజును కాశ్మీర్ గద్దె నెక్కించారు .ఇంతకల్లోలం లోనూ పత్రికకు ఇబ్బందికలగలేదు .అప్పటికి అధికార రహస్య చట్టం లెదు కనుక పత్రిక జోలికి రాలేకపోయింది ప్రభుత్వం .బెంగాల్లో బెంగాలీ, అమృత బజార్ పత్రికలూ అగ్రస్థానం లో ఉన్నాయి .ప్రాంతీయ పత్రికలూ జాతీయోద్యమానికి కొమ్ము కాశాయి .బెంగాలీ పత్రికలలో బంగబాసి -1881,సంజిబాని -1883,హితబాది 1891 విశేష ప్రచారం పొందాయి ..మొదటిది హిందూధర్మాన్ని రెండోది బ్రహ్మసమాజాన్ని ,మూడోది హిందూ సంస్కరణ వాదాన్ని బలపరిచేవి .మహారాష్ట్రలో హిందూ ప్రకాష్ ,మహారాట్ట,కేసరి ,కాల్ పత్రికలూ బొంబాయ్ లో బొంబాయి సమాచార్ ,జయ్-ఇ-జయ్ షెడ్,,రాస్త్ గుప్తార్ ,మద్రాస్ లో దిహిందూ ,స్వదేశీమిత్రన్ ,ఉత్తరాభారత్ లో దిట్రిబ్యూన్ పత్రికలూ జనజాగృతిచేసేవి .1890లో కేసరి మహారాట్ట పత్రిలకు ఎడిటర్ గా ఉన్న బాలగంగాధర తిలక్ తన గురువు అమృతబజార్ పత్రకా సంపాదకుడు శిశిర్ కుమార్ అని గర్వంగా చెప్పుకొన్నాడు –‘’ఆయనను తండ్రిగా నేనుభావిస్తా .ఆయన నన్నుకుమారుడిగా భావిస్తారు ‘’అని రాశాడు తిలక్ 1917లో.
విద్యావంతులైన దేశీయులను విశ్వాసం లోకి తీసుకోవాలని రిప్పన్ ,మరికొందరు భావించి ముగ్గురు అధికారులు ఏవో హ్యూమ్ ,సర్ డబ్ల్యు వెడర్ బర్న్ ,డబ్ల్యు ఎస్ బ్లంట్ లు ముందుకొచ్చి అఖిలభారత వ్యవస్థ ఏర్పాటుకు సూచించి,1883లో హ్యూమ్ దేశంలోని దేశంలోని అత్యున్నత విద్యావంతులుగా ఎంపికైన మేధావులకు ఒక బహిరంగ లేఖ రాస్తూ –‘’మీకూ మీదేశానికి మరింత అధిక స్వాతంత్ర్యాన్ని ,నిష్పాక్షిక పాలనా వ్యవస్థను ,పాలనలో విస్తృత భాగ స్వామ్యాన్నీ సాధించటానికి పోరాటం చేయండి .కార్యాచరణ ఎలా ఉండాలో ఆలోచించండి .ఆత్మత్యాగం స్వార్ధ రాహిత్యం తిరుగులేని మార్గాలు ‘’అన్నాడు .ఆతర్వాత రిప్పన్ స్థానం లో వచ్చిన లార్డ్ డఫ్రిన్ ఈ మేధావుల సమావేశాన్ని 1885 డిసెంబర్ లో బొంబాయి లో జరిపాడు .అప్పుడే భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించింది .కలకత్తాకు చెందిన ప్రముఖ బారిస్టర్, సంస్థ అధ్యక్షుడు డబ్ల్యు సి బెనర్జీ తోపాటు ‘’దిఇండియన్ మిర్రర్ ,నబ బిభాకర్ పత్రిక సంపాదకులు మాత్రమె బెంగాల్ నుంచి ఆ సభకు హాజరయ్యారు .ఆహ్వానం వచ్చినా ,తీరికలేక సురెంద్రనాద్ బెనర్జీ వెళ్ళలేదు .ఇంకెవరినీ ఆహ్వానించినట్లు లేదు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-7-22-ఉయ్యూరు
మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -304
304 త్రిపురనేని గోపీ చ౦ద్ కుమారుడు ,-మాభూమి హీరో ,ఫిదాలో ఇద్దరుకూతుళ్ళ పెళ్ళికాని తండ్రి –సాయి చ౦ద్
త్రిపురనేని సాయిచంద్ తెలుగు చలనచిత్ర నటుడు, డాక్యుమెంటరీ సినిమాల రూపకర్త.[1] రచయిత త్రిపురనేని గోపిచంద్ కుమారుడు. సంఘసంస్కర్త, హేతువాది అయిన కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరికి మనుమడు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో ప్రసిద్ధ దర్శకుడు గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన మాభూమి చిత్రంతో తెలుగు చలనచిత్రరంగంలో నటుడిగా ప్రవేశించాడు. ఆ చిత్రంలో కథానాయకుడు రామయ్య పాత్రలో మరుపురాని నటనను కనబరిచాడు. ఆ తర్వాత శివ, అంకురం మొదలగు తెలుగు సినిమాల్లో నటించాడు. శివ చిత్రంలో నటి అమలకు అన్నయ్యగా నటించాడు. నటనకు దూరమై మైత్రి కమ్యూనికేషన్స్ స్థాపించి కొన్నాళ్ళపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సందేశాత్మక డాక్యుమెంటరీలు తీస్తూ ఢిల్లీలో గడిపారు[2]. పాతికేళ్ళ విరామం తరువాత మళ్ళీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా చిత్రంతో నటుడిగా పునఃప్రవేశం చేశాడు. నిజజీవితంలో బ్రహ్మచారి[3]గా మిగిలిపోయిన సాయిచంద్, ఫిదా చిత్రంలో ఇద్దరు కూతుళ్ళ తండ్రిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.[4]
బాల్యం, విద్యాభ్యాసం
సాయిచంద్ 1956 మార్చి 12న త్రిపురనేని గోపీచంద్, శకుంతలా దేవి దంపతులకు కర్నూలులో జన్మించాడు. ఈ దంపతులకు మొత్తం అయిదు మంది సంతానం. వీళ్ళందరిలో సాయిచంద్ చివరివాడు. తండ్రి గోపీచంద్, ఆయన తండ్రి త్రిపురనేని రామస్వామి పేరొందిన రచయితలు. సాయిచంద్ కి ఆరేళ్ళ వయసులో తండ్రి మరణించాడు. పదేళ్ళ వయసులో తల్లి కూడా మరణించింది. అప్పటి నుంచి మాతామహుడైన (తల్లికి తండ్రి) నారయ్య సమక్షంలో పెరిగాడు. చిన్నతనంలో తండ్రి రచనలు చదవడం ప్రారంభించాడు.
గోరా ప్రారంభించిన వాసవ్య పాఠశాలలో చదువుకున్నాడు. ఆ పాఠశాల నిర్వాహకురాలు, గోరా కోడలైన హేమలతా లవణం ఊయనకు తన పేరు, తండ్రి పేరు కలిసొచ్చేలా సాయిచంద్ అని పేరు మార్చింది.[5]
ఫిల్మోగ్రఫీ
సాయిచంద్ నటించిన తెలుగు చిత్రాల పాక్షిక జాబితా:
· మాభూమి (1980)
· ధర్మవడ్డీ (1982)
· పెళ్లీడు పిల్లలు (1982)
· మంచుపల్లకీ (1982)
· ఆడవాళ్లే అలిగితే (1983)
· ఈ దేశంలో ఒకరోజు (1983)
· రంగులకల (1983)
· విముక్తి కోసం (1983)
· ఈ చదువులు మాకొద్దు (1984)
· శివ (1989)
· అంకురం (1992)
· ఫిదా (2017)
· సైరా నరసింహారెడ్డి (2018)
· చెక్ (2021
· ఉప్పెన 2021
· విరాటపర్వం (2022)
· పండిత పరమేశ్వర ఐ నవల ,విశ్వనాధవారి నవలలు దాక్యు మెంటరీ లుగా తీసి చిరస్మరణీయం చేశాడు సాయి చంద్.
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-7-22-ఉయ్యూరు
Video link
గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-10
పత్రిక మార్పులకు కారణాలు
ఇండియన్ సివిల్ సర్వీస్ వారి విమర్శలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి .ప్రభుత్వ వ్యవహారాల రూపకల్పనలో తమకు ఎక్కువ భాగస్వామ్యం కావాలని వారు కోరుతున్నారు .దీన్ని ఒప్పుకొంటే తమపని ఖాళీ అనుకొన్నది ప్రభుత్వం .అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ నలుగురు బ్రిటిష్,నలుగురు అనధికార ,ఇద్దరు భారతీయ అధికార ,ఇద్దరు అనధికార సభ్యులతో ‘’బెంగాల్ విధాన పరిషత్’’ ఏర్పాటు చేశాడు .సామ్రాజ్య విస్తరణ విధానాలు పత్రికలలో విమర్శలుగా రాకూడదని ,వైశ్రాయికి అసలు తెలియకూడదని ప్రభుత్వం వారి భావన .రష్యా భారత్ పై కన్నేసిందని అనుకోని లార్డ్ లిట్టన్ ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించే ప్రయత్నం లో 1870లో తలమునకలై ఉన్నాడు .కాశ్మీర్ మహారాజుకు ఆయుధాలు సరఫరా చేసి ,చిత్రాల్ లోకి సైన్యాన్ని దించమని ప్రేరేపించాడు .కాశ్మీర్ అజేయ రాజ్యం .అధిక పన్నుల భారం తో ఇండియా కునారిల్లుతోంది .దుర్భిక్షాలు ఇబ్బంది పెడుతున్నాయి .ఈరెండిపైన వైశ్రాయిదృష్టి లేదు .అప్పటి బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ సర్ ఆప్లె ఏడెన్ లంచాలు ఎరచూపి ఇంగ్లీష్ పత్రికల నోళ్ళు నొక్కటానికి ప్రయత్నించాడు .హిందూ పేట్రియట్ పత్రిక ఎడిటర్ కృపతో, దాస్ పాల్ ను లొంగదీసుకొన్నాడు .యితడు శిశిర్ కుమార్ కు కబురు చేశాడు .తనమాటవింటే ప్రభుత్వం లో ప్రాతినిధ్యం కల్పిస్తానని ఆశపెట్టాడు .దీనిపై మోతీలాల్ రాస్తూ ‘’నువ్వు ,నేను ,కృపతో దాసు కలిసి బెంగాల్ని పాలిద్దాం .నేను చెప్పినట్లు పత్రిక నడపటానికి దాస్ ఒప్పుకొన్నాడు .నువ్వూ ఒప్పుకో .పెట్రియట్ కు ఇస్తున్నట్లే నీకూ ముట్ట చెబుతాం .ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నువ్వు ఏదిరాసినా ము౦దు నాకు పంపు .ప్రభుత్వం ఎక్కువకాపీలు కోనేట్లు చేస్తా .నిర్వహణలో దాస్ తో పాటు నిన్నూ సంప్రదిస్తా ‘’అని ప్రతిపాదించాడని చెప్పాడు మోతీలాల్ .
నిజంగా అప్పుడు శిశిర్ కుమార్ చాలా పేద వ్యక్తీ .కలకత్తా సమాజం లో ఆయన స్థితి గొప్పదేమీ కాదు కూడా .తంతే గారెల బుట్టలో పడే చాన్స్ వచ్చింది .కానీ ఆయన ఆలోచనలు వేరుగా ఉన్నాయి .కృతజ్ఞతలు తెలుపుతూ ‘’అయ్యా !ఈ భూమి మీద కనీసం ఒక్కడైనా నిజాయితీ కల జర్నలిస్ట్ ఉండటం చాలా అవసరం ‘’అన్నాడు ఇంకేముంది అవతలివాడు ఆగ్రహోదగ్రుడయ్యాడు.వ్యంగ్యంగా ‘’నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా .బెంగాల్ అ త్యున్నత అధికారిని నేను ఎప్పుడైనా సరే నిన్ను జైల్లోపెట్టి ఆరునెలలు ఉంచగలను .నీపత్రికను మూటాముల్లె తో సహా జేస్సూర్ పంపెయగలను ‘’అన్నాడు ఎడెన్.అవి వట్టిమాటలుకావు అప్పటికే ‘’వెర్నాక్యులర్ యాక్ట్ కింద ప్రభుత్వం పై ఎలాంటి విమర్శరాయమని జిల్లా మేజిష్ట్రేట్ కు లేదా పోలీస్ కమీషనర్ కు లిఖిత పూర్వకంగా తెలియజేయాలి పూచీకత్తుగా కొంతసొమ్ము కట్టాలికూడా .ఉల్లంఘిస్తే ఈడబ్బు తిరిగిరాదు .కోర్టుకు వెళ్ళే అవకాశాలూ ఉండవు .ఇదంతా ముఖ్యంగా అమృత బజార్ పత్రిక పైన పెట్టిన గురిమాత్రమే .ఈ చట్టం అమలుకు పూర్వమే పూర్తిగా ఇంగ్లేష్ లో పత్రిక నడిపారు ఘోష్ బ్రదర్స్ .చట్టం పరిధినుంచి తప్పించుకోవటం వలన ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అని ఎదుర్కొన్నారు .’’పూర్తిగా ఇంగ్లీష్ లో ప్రచురించే పత్రిక లార్డ్ గారి యాక్ట్ కంటే అతీతమైంది ‘’అన్నాడు మోతీలాల్.వాడికి ఎక్కడోకాలి మిత్రులవద్ద గొణిగాడు .పత్రిక ఇంగ్లీష్ లో రావటం ఒక వారం ఆలస్యం అయిఉంటే ఈ నిబంధనలన్నీ అమలు చేసేది ప్రభుత్వం .వాళ్ళ తిత్తి తీసేవాడిని ‘’అని లబో దిబోమన్నాడట .
21-3-1878లో అమృత బజార్ పత్రిక పూర్తిగా ఇంగ్లీష్ లో ప్రచురితమైంది అందులో సంపాదకీయం లో శిశిర్ కుమార్ ‘’మాతృభాషలో పత్రికకు స్వస్తి చెప్పటం అనివార్యమైంది .మిత్రుల అభిమానుల సూచనలు పాటించాం .ఈమార్పు దేశానికి ప్రయోజనమా కాదా అనేది కాలమే నిర్ణయిస్తుంది .ఐతే స్వేచ్చా స్వాతంత్ర్యాలతో ఒక ఆంగ్ల పత్రిక అవసరం .ఎన్నో అగ్నిపరీక్షలు తట్టుకోన్నాం .ప్రజాహృదయ స్పందన ప్రజాజాగృతి స్వేచ్చా స్వాతంత్ర్య హక్కు లకోసం పాటు పడే పత్రిక మనది. ఇకపైన కూడా మీ సంపూర్ణ సహకారం లభించాలని భగవంతుని ప్రార్దిస్తున్నాం ‘’అని తెలిపాడు అన్యా పదేశంగా .
కపట చట్టం వలన ప్రజలు తీవ్ర నిరశన తెలిపారు .1875,లో శిశిర్ కుమార్ మోతీలాల్ కల్సి ప్రజా సమైక్యతకు ‘’ఇండియన్ లీగ్ ‘’స్థాపించారు .1876 సురేంద్రనాధ బెనర్జీ ఇండియన్ అసోసియేషన్ స్థాపించాక దీన్ని రద్దుచేశారు .ఆయన 1869లో ఇంగ్లాండ్ లో సివిల్ సర్వీస్ పాసై నా, వయసు తప్పుగా ప్రకటించాడని నియామకం ఉపసంహరించారు .దీనిపై కోర్టులో పోరాడి విజయం సాధించాడు .1871లో ఆయన్ను సిల్హెట్ లో అసిస్టెంట్ డిష్టిక్ట్ మీజిస్ట్రేట్ గా పోస్టింగ్ ఇచ్చారు .యూరోపియన్ లతో పాటు సమాన స్థాయి పొందాడు .కన్నుకుట్టిన ప్రభుత్వం నిరాధార ఆరోపనలు చేసి సర్వీస్ నుంచి తొలగించారు .ఇదొక పెద్ద వివాదమై ఆయన మళ్ళీ లండన్ లో అప్పీల్ చేసినా ఓడిపోయి ,బారిస్టర్ హక్కుకూడా కోల్పోయాడు .ఇదొక గోప్పమలుపైంది ఆయన జీవితం లో .
‘’ ఎ నేషన్ ఇన్ మేకింగ్ ‘’అనే తనపుస్తకం లో ఆయన ‘’మనం చాలాహీనంగా హేయంగా బతుకుతున్నాం .మనతప్పుల్ని తెలుసుకొని మన వ్యక్తిగత హక్కుల్నీ ,జాతి హక్కుల్నీ పరిరక్షించుకొంటూ గమ్యం వైపుకు సాగుదాం .మీ అందరికి నేను సహాయకుడిగా ఉంటాను ‘’అన్నాడు .ఆయన వజ్ర సంకల్పం వాక్ చాతుర్యం అందర్నీ ఆకర్షించాయి .ఆనందమోహన్ బోస్ నాయకత్వాన స్టూడెంట్స్ అసోసియేషన్ లో చేరాడు .ఆయన్ను ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటన్ కాలేజిలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా నియమించాడు .ఈయన ‘’దిబెంగాలీ ‘అనే పత్రిక స్థాపించి తనభావ ప్రకటనకు ఉపయోగించుకొన్నాడు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -15-7-22-ఉయ్యూరు
నిర్మాణాత్మక కార్యకర్త ,స్వాతంత్రోద్యమ ,గ్రందాలయోద్యమనాయకుడు శ్రీ ముదిగొండ జగ్గన్న శాస్త్రి
ముదిగంటి జగ్గన్న శాస్త్రి, స్వాతంత్ర్య సమరయోధులు, పత్రికా సంపాదకులు, రచయిత
గోదావరి జిల్లాలో స్వాతంత్య్రోద్యమ కాలంలో ముదిగంటి జగ్గన్నశాస్త్రి ఎన్నో నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు నిర్వహించి త్యాగజీవనుడిగా పేరు తెచ్చుకున్నారు. స్వాతంత్య్ర యోధుడిగా గుర్తింపు పొందారు. పల్లెటూరి గ్రంథమండలి కొంతకాలం నిర్వహించారు. సార్వజనిక ఎన్నికలప్పుడు ఆయననందరూ విస్మరించారు. ఆయన ఏదైనా ప్రయత్నం చేస్తే ఫలితముంటుందేమోనని ఢిల్లీ వచ్చారు. దుర్గాబాయిని కలుసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందేమోనని ఆమెను కలుసుకోవటానికి ప్రయత్నించారు. కానీ ఆయన నిరాడంబరుడు. అందుకు కావలసిన దారీతెన్నూ కూడా తెలియనివాడు. అందువల్ల అప్పట్లో ఢిల్లీలో భౌతిక విజ్ఞాన కేంద్రం సంస్థలో (నేషనల్ ఫిజికల్ లేబరేటరీస్) ఉన్నతాధికారి పదవి నిర్వహిస్తున్న స్వామి జ్ఞానానందను కలుసుకున్నారు. స్వామి జ్ఞానానంద బాల్యంలో శాస్త్రి గారి సహాధ్యాయి. అప్పటికే స్వామి విదేశాలలో భౌతిక పరమాణు విజ్ఞానంలో గొప్ప శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. జవహర్లాల్ నెహ్రు ఆహ్వానంపై ఆధ్యాత్మిక జీవితాన్ని వదిలి భారతీయ వైజ్ఞానిక రంగాన్ని ఆధునికావసరాలకు పటిష్టంగా రూపొందించడానికి తన విజ్ఞానాన్ని వినియోగించడానికి ముందుకు వచ్చిన గొప్ప దేశభక్తుడాయన. జవహర్లాల్కు ఆయనంటే గొప్ప గౌరవం.
జగ్గన్న శాస్త్రి గారు స్వామీజీని కలుసుకోగా, ఆయన ఇటువంటి విషయాలలో ఏమీ పరిజ్ఞానం లేనివారు కనుక శాస్త్రిగారిని దుర్గాబాయి నివాసానికి తీసుకువెళ్ళారు. ఆమె స్వామీజీకి భక్తి ప్రపత్తులతో వందనం చేసి తనకు కబురుచేస్తే తానే వచ్చేదాన్ని కదా అని శాస్త్రిగారిని కూడా ఆదర గౌరవాలతో ఉపచరించింది. తర్వాత శాస్త్రిగారిని అందుకు సంబంధీకులైన పార్టీ ప్రముఖుల వద్దకు తీసుకువెళ్ళింది. ఆయనకు ఎన్నికలలో పోటీ చేయడానికి కావలసిన గుర్తింపు కోసం ఎంతో సహకరించింది. కానీ ఆయనకు టికెట్ మాత్రం లభించలేదు. ఈ విషయం ముదిగంటి జగ్గన్న శాస్త్రి గారు స్వామి జ్ఞానానంద జీవిత చరిత్రకు పరిచయ వాక్యాలు రాస్తూ స్మరించుకున్నారు.
ముదిగంటి జగ్గన్న శాస్త్రి గార్లవంటి రచయితలు గాంధేయులు; గాంధేయ సాహిత్యాన్ని తెలుగువారికి అందించడంలో కృషిచేసినవారు.
డాక్ట ర్ రాధా కృష్ణన్ గాంధీజీ సప్తతి జన్మదినోత్సవానికి తయారుచేసిన “గాందీ _ గాంధీత్ త్రము” అన్న (గంథానికి “యహోత్తాజీ”ి అన్న “పేరుతో ముదిగంటి జగ్గన్న శాస్త్రిగారి అనువాదం ముఖ్యమైనవి.
గాంధి నీతిమందిరి (1926) అన్న (గంథంలో అవాదో అకారాదిగా గాంధిగారి (పవచనాలు యివ్వబడ్డాయి. ముదిగంటి జగ్గన్న శాస్త్రీ, శనివారపు సుబ్బారావు గార్ల సంపాదకత్వాన వెలు వడిన యీ (గంథంలో Young India, Navajivan పత్రిక లలో గాంధి గారు (వాసిన (పవచనాలు -సీకరించి (వకటించబడ్లాయి.
జగ్గన్న గారు తణుకులో పల్లెటూరు (గంథమౌాల ప్రారంభించారు . కాని ఆదరణ తక్కు_వై పోయినది, “1925 లగాయతు 1981 వరకు పల్లెటూరు (గంథమండలి పేరిట షుమారు 15 పుస్తకములను (వాసి ఆంధ భాపామతల్లీని సేవించితిని.”” వేలూరి శివరామ శాొ(న్త్హ్ గారు విశ్వదాత ( పేరణవల్ల గాంధీగారి “ఆత్మకథ” ను భాపాంతరీక రించినాడు, జగ్గన్న ‘శా స్రిగా రు స్యయము గా నే నెహూ గారి “ఆత్మకథ నుఅనువదించి నాడు. ఇది మొదటి దానికం టే సాఫీగాఉంది, ఈ. రచన గూర్చి డాక్టరు పట్టాభిగారిట్లాఅన్నారు. “ఆంగ్ల గంథ మ లను తెనిగించునప్పుడు, తెనుగు తర్జుమా లాగా ఉండక మూలమే తెనుగా అనివీంచవలెసు.” జగ్గన్న గారు అనేక మార్లు శ్రికృన్ణజన్మస్థానా నికి పోయిన వాడు!
జగ్గన్న శాస్త్రి గారు మానవ యంత్రము ,ఉద్యోగమూ ,గాంధీ సూక్తులు ,గాంధీ -గారడీ ,గాంధీ హృదయం ,సంతోషములేక ?నెహ్రు ఆత్మకధ ,కురళ్ లేక తిరువల్లువార్ సూక్తులు ,వినాయకసావర్కార్ ,రామ తీర్ధ మొదలైన ఉత్తమ గ్రంధాలు రాశారు .ఇంతకంటే వారిపై సమగ్ర విషయాలు తెలియలేదు
—
శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు గారి నా జీవిత కథ.7వ భాగం.14.7.22 n
Video link
గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-9
వలస
అమృతబజార్ పత్రికకు మూడేళ్ళలోనే విస్తృత పాఠకలోకమేర్పడింది .అభిప్రాయాలు వ్యాసాలూ సూటిగా ఉండటం ,కౌలుదార్ల ,భూస్వాముల సమస్యలు చర్చించటం తో అభిమానపాత్రమైంది .పత్రికకు ఆర్ధిక సాయం అందించటానికి జనం క్యూ కట్టారు .1871లో బెంగాల్ అంతటా మలేరియా కోరల్లో చిక్కింది .బెంగాల్ లో ఇదే మొదలు అంటువ్యాధి ప్రబలటం ..జేస్సూర్ జిల్లా అతలాకుతలమైంది .అమృతబజార్ గ్రామం లో ప్రతి యింటినీ బాధించింది .నిర్దిష్టమైన చికిత్స లేదు. కర్పూరం అప్పుడు అందరాని వస్తువు .దేశవాళీ మందులతో ఉపశమనం పొందినా మళ్ళీ తిరగబెట్టేది .అనేకమంది చనిపోవటం సోకినవారి కాయకస్టా నికి పనికి రాని నీరసంతో ఉండటం జరిగింది .దీనికి తోడూ వరదలూ ముంచెత్తాయి .పంటనాశనం పశునష్టం లెక్కలేకుండా పోయింది .నీరు నిలిచి మలేరియా దోమలకు అవాసాలుగా మారాయి .పత్రిక కూడా కష్టాలపాలైంది .కార్మికులూ బాధపడి ముద్రణ కుంటుపడింది .వర్షాకాలం వరదలు మరీ భీభత్సం సృష్టించాయి .
కనుక పత్రికను కలకత్తాకు తరలించాలని ఘోష్ సోదరులు భావించి ,చేతిలో దమ్మిడీకూడా లేక ప్రెస్ అమ్మేయాల్సి వచ్చింది .మోతీలాల్ దగ్గరవున్న రెండువండలు ,ఊర్లో షావుకారు దగ్గర అప్పు చేసిన మరోవంద మొత్తం మూడు వందల రూపాయలతో 30మంది కల ఆకుటుంబం కలకత్తా చేరి,బజార్ క్వార్టర్ లో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని దిగారు .మళ్ళీ పత్రిక ముద్రించాలని సంకల్పం కలిగి ,ఒక ప్రెస్ 600రూపాయలకు అమ్మకానికి వస్తే ,శిశిర్ కుమార్ చాకచక్యం తో కమీషన్ ఏజెంట్ గా మారి 800 రూపాయలు సంపాదించగా ప్రెస్ కొన్నారు .ఈచేతి యంత్రాల ప్రెస్ తో కలకత్తాలో మొదటి అమృతబజార్ పత్రికను 21-9-1871న ముద్రించారు .ఇందులో శిశిర్ కుమార్ ‘’ఎన్నో వ్యయప్రయాసలు పడి,పత్రిక స్థాపించి నిలబడి అందరి మన్ననలు పొంది పల్లెనుంచి ఇప్పుడు తప్పని సరి పరిస్థితుల్లో ఈ పట్టణం నుంచి ముద్రిస్తున్నా మా అభిప్రాయాలలో మార్పెమీలేదు.కలకత్తా పౌరులు దయాపూరిత హృదయాలతో పత్రికను ఆహ్వానించాలని కోరుతున్నాం ‘’అని రాశాడు .1874వరకు తామున్నబౌ బజార్ లోని ఇంటి నుంచే పత్రిక ముద్రించారు .1874లో ఉత్తరకలకత్తా లోని బజార్ క్వార్టర్స్ లో విశాలమైన పురాతనమైన ఇంటిని అద్దెకు తీసుకొని .జర్నలిజం చరిత్ర చరిత్ర సృష్టించిన ఈపత్రిక ఉన్న గృహం కాశీం బజార్ మహారాజుది .నెలకు 40రూపాయలు అద్దె.50ఏళ్ళు ఇక్కడి నుంచే అమృతతబజార్ పత్రిక వెలువడటం మరో చరిత్ర ప్రసిద్ధమైన విషయం .ఇదే ఘోష్ సోదరుల నివాసంకూడా..తర్వాత అదే వీధిలో స్వంతభవనం కట్టుకొన్నా ,దీన్ని అద్దె భవనంగానే ఉంచుకొన్నారు .
దేశీయోద్యమం లో ఎందరెందరో మహానుభావులు దేశ ,విదేశాలనుంచి ఈ ఇంటికి వచ్చేవారు .ప్రఖ్యాత బెంగాలీకవి నవీన్ చంద్ర ఈ భవనం గురించి రాస్తూ శతాబ్ద కాలం మరమ్మతులు ఎరగని భవనం అన్నాడు .మెమరీస్ ఆఫ్ మోతీలాల్ పుస్తకం లో పరమానంద దత్తు ‘’కింద ,పై అంతస్తులనిండా ప్రింటింగ్ కు సంబంధించిన సామగ్రి గుట్టలు గుట్టలుగా ఉండేది .దుర్వాసన ,దుమ్ముతో ఉండేది .అపరిశుభ్రత కు నిలయం మెట్లు చాలాయిరుకు .మెట్లను కానీ గదులనుకానీ ఒక్కసారి కూడా ఊడ్చిన దాఖలాలు లేవు .మొదటి అంతస్తు వరండాలో మట్టికొట్టుకుపోయిన టేబుల్,విరిగిన కుర్చీపై మొకాళ్ళమధ్య గడ్డాన్ని ఆనించి ఒక చిన్న మనిషి ‘’బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించే అపార సామర్ధ్యం కల వ్యక్తీ కూర్చున్నాడు .మోతీలాల్ అనే ఈ సామాన్యవ్యక్తి ఒక మామూలు కాగితం ,సాదా పెన్ను తో రాజకీయ ఆయుధాలు విసురుతున్నాడు .ఆయన మకిలి పట్టిన ఎర్ర బోర్దరున్న సాదా పంచ ,బొత్తాలులేని తెల్లచొక్కాతో ఉన్నాడు.ఆయన పక్కన మరో బెంచి, నల్లులమయమైన ఒక చెయ్యివిరిగిన ఇంకో పాతకుర్చీ ఉన్నాయి .సీలింగ్ ల పై మరకలు సాలె గూళ్ళు ,గోడలపై ఉమ్మి మరకలు ,ఇంకా ఎన్నెన్నో మచ్చలు ఉన్నాయి .గది అంతా దర్రీ పరిచి దానిపై దుప్పట్లు పరిచారు .దుప్పట్లు వగైరాలు ‘’మేము చాకలాడి మొహం చూసి ఎరగం ‘’అని మొత్తుకొంటున్నాయి.అలాంటి గదిలో తమ పాదముద్రలతో పవిత్రం చేయని దేశ ప్రముఖుడు ఎవరూ లేరు .లోపలిగదులు మరీ దారుణం అని విన్నాను ‘అని రాశాడు .
ఘోష్ కుటుంబం కలకత్తా చేరేనాటికి దాని జనాభా 10లక్షలు .బెంగాలీలమెజారిటి తక్కువ -1.3శాతం .రాజకీయ వాణిజ్యాదికారాలన్నీ బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉన్నాయి .టెలిగ్రాఫ్ రైల్వేలకూ వారే అధిపతులు .వ్యాపార వాణిజ్యాలలో కొద్దిమంది అమెరికన్లు యూదులు గుజరాతీలు ,ముస్లిం లు ఉండేవారు .కార్మికులంతా బీహార్ యుపి ఒరిస్సా ల నుంచి వచ్చిన వారే .బెంగాలీలలో ఎక్కువమంది గుమాస్తాలు టీచర్లు లాయర్లు డాక్టర్లు .ఇంగ్లీష్ విద్యకు ఆనగరం గొప్ప కేంద్రంగా ఉంది .1872నాటికి జిల్లా ముఖ్య పట్టణాలైన జెస్సోర్ ,ఢాకా,కృష్ణనగర్ ,మిడ్నపూర్ ,మెమెన్ సింగ్ ,ర౦గపూర్ ,పాట్నా లలో జాతీయోద్యమం జీర్ణించు కొన్న విద్యావంతుల వర్గం ఏర్పడింది .స్టేట్స్ మన్,ఇండియన్ డైలీ న్యూస్ ,దిఇంగ్లీష్ మాన్ పత్రికలు బ్రిటిష్ వారికి కొమ్ముకాసేవి .దిహిందూ ,పెట్రియట్,ఇండియన్ మిర్రర్ ,దిబెంగాలీ అనే ఇంగ్లీష్ పేపర్లు బాగా ప్రాచుర్యం పొందాయి .బెంగాలీ పత్రికారంగానికి సోంప్రకాశ్ , వారపత్రిక సులభ ఫా సమాచార్ ,అమృతబజార్ పత్రిక ప్రాతి నిధ్యం వహించాయి .పత్రిక నడపటం ఈ మహానగరం లో చాలాకష్టంగా ఉండేది .దీనికి తోడూ ఆదాయం పై పన్ను పెంచి ప్రభుత్వం మరీ ఇబ్బంది పెట్టింది .దీన్ని అన్ని పత్రికలూ నిరశి౦చాయి .అమృతబజార్ పత్రిక మాత్రమె సమర్ధించగా ,చాలామంది ధనికులు ఆ పత్రిక కొనడం మానేశారు .దిగువ తరగతి ఆడాయవర్గాలు పత్రికే ను బాగా ఆదరించి వెన్ను దన్నుగా నిలబడ్డారు .రాజాదిగంబర సింగ్ లాంటి సంపన్నులు పత్రిక సర్క్యులేషన్ పెంచటానికి బాగా కృషి చేశారు .కలకత్తా హైకోర్ట్ ప్రముఖ న్యాయమూర్తి ద్వారకానాద్ మిత్రా కూడా అండగా నిలిచాడు .కానీ ఆయన ఒకసారి ‘’మీ పత్రికలో ఉగ్రవాదం అంతర్లీనంగా ఉంది ముందుముందు ప్రమాదంగా మారచ్చు ‘’అని అంటే ‘ప్రజలలో వారి అస్తిత్వాన్ని తెలుసుకోనేట్లు చేసి ,వివేచనా దేశ భక్తీ కలిగించటం మా పత్రిక లక్ష్యం ‘’అని శిశిర్ కుమార్ దీటుగా బదులిచ్చాడు .ఈ విధానాన్నే తర్వాతకాలం లో అన్ని పత్రికలూ అనుసరిచటం వలన అమృతబజార్ పత్రిక మార్గ దర్శనం చేసింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-7-22-ఉయ్యూరు
భారతీ నిరుక్తి.9వ భాగం.14.7.22
Video link
Video link
గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-8
అమృతబజార్ పత్రిక ఆవిర్భావం -2
ప్రజలపై పాలకులు ,అధికారులు చేస్తున్న అన్యాయాలను బహిర్గతం చేస్తూ ,కొద్దికాలం లోనే అమృతబజార్ పత్రిక బాగా ప్రాచుర్యం పొందింది .దొరలకు ఎక్కడో కాలి ఘోష్ కుటుంబానికి గుణపాఠం చెప్పాలని అనుకోగా పత్రిక మిత్రవర్గం బాగా విస్తరించింది .న్యాయవాదుల అధ్యాపకుల ప్రజల మద్దతు బాగా వచ్చింది .నాలుగు నెలలకే పత్రికపై పరువు నష్టం దావా వచ్చింది .పత్రికలో ఒక మిత్రుడు యూరోపియన్ అధికారిపై విమర్శ రాయటమే కారణం .ఎడిటర్ పై కేసుపెట్ట టానికి ప్రాసిక్యూషన్ తటపటాయించి ,మోతీలాల్ ను సాక్షిగా పెట్టారు .మాజిష్ట్రేట్ స్వయంగా క్రాస్ ఎక్సామినేషన్ చేసినా సంపాదకుడు ఎవరో తేలలేదు .ఎవరు సంపాదకుడు అని అడిగితె మోతీలాల్ పెట్టి నాలుగు నెలలే అయింది ఇంకా సంపాదకుడిని పెట్టలేదని చెప్పాడు .శిశిర్ కుమార్ సంపాదకుడు అని అంటున్నారు అనగా, బాగా రాస్తాడుకనుక అలా ప్రజలు భావించారు అని సమాధానం .ఆయన ఇంగ్లీష్ బాగా రాయగలడా అంటే ,బాగా జీతాలు తీసుకొనే ప్రభుత్వ ఆఫీసర్లకంటే బాగా రాయగలడు అని సమాధానం ..పత్రిక తరఫున డిఫెన్స్ వకాల్తా కలకత్తాకు చెందిన ప్రముఖ ప్లీడర్ మదన్ మోహన్ ఘోష్ .ఎనిమిది నెలలు కేసుకోనసాగి ఘోష్ సోదరులు నిర్దోషులని కోర్టు తేల్చింది .అయితే ముద్రాపకుడికి ఆరునెలలు రచయితకు ఏడాది శిక్షపడింది .సాక్ష్యాధారాలు గల్లంతు చేశారని మళ్ళీ ప్రాసిక్యూషన్ సాగితే కేసు విఫలమైంది .ఘోష్ సోదరులు ఈ దావాతో తీవ్రంగా ఆర్ధిక చిక్కుల్లో పడ్డారు .మిత్రుల ప్రోద్బలం తో పత్రిక యధావిధిగా కొనసాగింది .
1869లో ఇంగ్లీష్ లో కూడా పత్రిక వెలువడి ద్విభాషా పత్రిక అయింది .అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సిలో బెంగాల్ బీహార్ ఒరిస్సాలు కూడా ఉండేవి .పత్రిక బాగా విజయం పొందింది .1871కి ఆర్ధికంగా బలపడింది .సిబ్బందికి మంచి జీతాలిస్తూ అనవసర ఖర్చులు తగ్గించుకోవటమే ఈ విజయ రహస్యం .సగటు ప్రజల హృదయాలలో అమృతబజార్ పత్రిక సుస్థిర స్థానం సంపాది౦చి౦ది .నిరాడంబరత్వం ఘోష్ కుటుంబానికి ఆదర్శం .
తూర్పు భారతం లో కీర్తనలకు మంచి పేరుంది .శిశిర్ కుమార్ ద్విపద కర్తకూడా .చైతన్యుని జీవిత చరిత్రను ‘’అనియామివై ‘’కావ్యంగా రాశాడు .బెంగాలీ సాహిత్యం లో ఇదొక గొప్ప ఇతిహాసం .గ్రామం లో ఉన్నప్పుడూ ,కలకత్తా లో ఉండగానూ ఘోష్ కుటుంబం లో సాయంత్రం వైష్ణవ భజనలు తప్పక జరిగేవి .
ఘోష్ సోదరులు ఆధ్యాత్మిక చింతనపై కూడా దృష్టిని కేంద్రీకరించారు .మోతీలాల్ చిన్నతమ్ముడు హీరాలాల్ ఎప్పుడూ ఏదోపోగొట్టుకోన్నవాడిగా విచారంతో ఉంటూ 1886లోఆత్మా హత్య చేసుకొన్నాడు .తండ్రిమరణం తో పాటు ఈతమ్ముడి మరణం వలన కుటుంబంలో విచారం పెరిగింది .శిశిర్ అమెరికావెల్లి భూతవైద్యం నేర్చుకోవాలి అనుకొంటే ,మిత్రులు దానికి సంబంధించి జ్ఞానాన్ని అందించారు .తర్వాత ఆధ్యాత్మిక సదస్సులు నిర్వహించాడు .1908 లో హిందూ స్పిరిట్యువల్ అనే మేగజైన్ లో ఆయన రాస్తూ ‘’ఇక్కడే లో ఆధ్యాత్మిక వాదాన్ని మనమే మొదలుపెట్టాం .సదస్సులు గోష్టులు గ్రామాల్లోనే జరిపాం .ఇవి తెలుసుకొని కలకత్తాలోని మిత్రులు బాగా ప్రచారం చేసి దేశం లో తీవ్ర సంచలనం కలిగించారు .పల్లెలకు పట్టణాలకు సమాచారం బాగా చేరింది .అమృతబజార్ గ్రామం లో చనిపోయిన వారితో ప్రజలు మాట్లాడుతున్నారు అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ‘’అని తెలిపాడు .
భూతవైద్యం ,అతీత శక్తుల విజ్ఞానం నేర్చుకొనే సమయం మోతీలాల్ కు లభించలేదుకానీ మిగిలిన సోదరులు అందులో నిష్ణాతులయ్యారు .హేమంతకుమార్ కొడుకు మృణాల్ కాంతి 1954లో చనిపోయే నాటికి ఆరంగంలో గణనీయంగా అభి వృద్ధి చెందాడు .మరణానంతర జీవితం పై అతడు రాసిన ‘’పరలోక్ కధా’’పుస్తకం విపరీతంగా అమ్ముడయింది .జాతర ,ఆరుబయట రంగస్థలాలు బాగా ఉన్న ఆకాలం లో ఘోష్ సోదరులు తమ గ్రామం లో రంగస్థల నాటకాలను బాగా ప్రోత్సహించి పోషించారు .ఉన్నతప్రమాణాలతో వారి నాటకాలు ఉండేవి .ప్రసిద్ధి చెందిన నటులు అనేకప్రాంతాలనుంచి వచ్చి నటించేవారు .’’నీల్ దర్పణ్’’నాటకరచయిత దీనబంధు మిత్రాకూడా ఈనాటకాలలో పాల్గొనే వాడు .ఆగ్రామ ప్రజల్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకు వెళ్ళే కృషి ఘోష సోదరులు చేశారు .
1869లో మోతీలాల్ వివాహం నాదియాజిల్లాలోని కుమారఖలికి చెందిన వధువు తో జరిగింది .సోదరులు బ్రహ్మ సమాజ సభ్యులు కాకపోయినా ఛాందసులు కక్షకట్టి క్రైస్తవం పుచ్చుకున్నారనే కట్టు కధ ప్రచారం చేసి పెళ్ళికూతురు వాళ్ళకూ తెలిపారు .అందులో నిజానిఆలు వారు గమనించి ‘’లైట్ తీసుకొని ‘’ హాయిగా పెళ్లి చేసి సుఖాంతం చేశారు .గ్రామీణ కక్షలు ఎలా ఉంటాయో ఎంత విపరీతానికి వొడగట్టుతారో మోతీలాల్ వివాహం రుజువు చేసింది .ఈ దంపతులకు 1876’’సజల నయన ‘’అనే కూతురు పుట్టింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-7-22-ఉయ్యూరు
శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు గారి నా జీవిత కథ 5వ భాగం.12.7.22
సుమారు పది హేను రోజులక్రితం కీ.శే .ముళ్ళపూడి వెంకటరమణ గారి అర్ధాంగి శ్రీమతి శ్రీదేవి గారు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి ,తాను రాసిన భాగవతం పుస్తకం ఆవిష్కరణ జరుపుతున్నామని ,అవగానే ప౦పిస్తానని చెప్పారు. శుభం భూయాత్ అన్నాను .న్యాయంగా ఆమె నాకు అలా చెప్పాల్సిన పని లేదు అది వారి సౌజన్యమే . నాకంటే మా శ్రీమతి ఆపుస్తకం రాక కోసం ఎదురు చూసింది ఆమె రామాయణం చదివిన అనుభూతితో .అన్నట్లుగానే నిన్న సాయంత్రమే ‘రమణీయ శ్రీ భాగవతం ‘’-దశావతారాలు ‘పుస్తకం అందింది .అందిందని వాయిస్ మెసేజ్ లో తెలియజేశాను .ఇవాళ ఉదయం చదివి, స్పందిస్తున్నాను .
బాపు –రమణ లు రామాయణ భాగవతాలను పుడిసిళ్ళ కొద్దీ గ్రోలిన వారు .వారిద్దరుఏదిరాసినా ,గీసినా ,చెప్పినా వాటిలోని పరమార్ధమే అంతరార్ధంగా ఉంటుంది .ఆ తానులోని వారే శ్రీదేవి గారు .ముందుగా ‘’రమణీయ రామాయణం ‘’రాసి తమ రామాయణ భక్తి తాత్పర్యాలు నిరూపించారు .ఇప్పుడు ఈ భాగవత మందారమకరందం తానూ గ్రోలి ,మనకూ పంచి పెట్టారు .ఆనాడుసూతుడు శౌనకాది మునులకు పురాణాలు ప్రవచిస్తే ,ఈనాడు ‘’స్త్రీ సూతుడు ‘’సూతి’’ అనచ్చా ?శ్రీదేవిగారు మనవళ్ళకు మనవరాళ్ళకేకాక సమస్త బాలబాలికలకు హృదయంగమంగా ఈ దశావతారాలను ఆధారంగా చేసుకొని భాగవత కథా పరమార్ధాలను వాళ్ళ స్థాయిలో ‘ఒక నానమ్మ,ఒక అమ్మమ్మ ఒక అవ్వ ‘’ బువ్వ పెడుతూ ముద్దుగా చెప్పినట్లు హృద్యంగా చెప్పారు . వ్యాసుడు, తెలుగు వ్యాసుడు పోతన్నగారు బుద్ధుడి గురించి చెప్పలేదు కనుక తానూ ఆయన జోలికి పోలేదన్నారు . .దశావతారాలను శీర్షికగా పెట్టి జయదేవుని అష్టపదిలోని అవతార శోక్లాలను సందర్భోచితంగా ,చిత్రాలతో సహా పొందు పరచారు .పోతన్న గారి రసగుళికల వంటి పద్యాలను చేర్చి రచన రక్తి కట్టించారు .పిల్లలు అడిగే ప్రశ్నలకు జవాబు చెబుతున్నట్లుగా ,కథనం చేయటం ఆకర్షణీయం .అవతార పరమార్ధాలనూ చక్కగా విడమర్చి చెప్పారు .మత్స్యా వతార ఆవశ్యకత గురించి చెబుతూ ‘’వేదాలు సృష్టి నిర్మాణానికి మూలాధారాలు .సమస్త విజ్ఞానం,శాస్త్రాలు వాటిలో ఉన్నాయి .మన బతుకుకు కావాల్సిన విజ్ఞానం అంతా వాటిలో ఉన్నాయి. అవి లేకపోతె గందరగోళమే.సోమకాసురుడు వేద విజ్ఞానాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఆధిపత్యం చలా ఇంచటానికి వేదాలను దొంగిలించాడు .అందరికీ అందు బాటులో ఉండాల్సినవి ఒక్కడి చేతిలో ఉంటె అనర్ధం కనుక విష్ణువు మత్స్యా వతారం పొంది వాడిని, సంహరించి వేదోద్ధరణ చేశాడు ‘’ అని మనసుకు హత్తుకునేట్లు చెప్పారు .లోకాస్సమస్తా స్సుఖినో భవంతు అన్న మన ఆదర్శాన్ని వివరించారు .వ్యాసుడు వరాహావతారం ము౦దుచెప్పి ,నారసింహ కూర్మ వామనావతారాల తర్వాత మత్స్యావతారం చెప్పాడు అని కూడా వివరించారు .పోతనగారు కూడా అలానే చెప్పారు మిగిలినవారెవరూఅలా చెప్పలేదు .
అశ్వత్ధామ చేసిన పరమకిరాతకానికి కొడుకుల్ని పోగొట్టుకొన్న ద్రౌపది వాడి కర్కశ హృదయం కరిగిపోయేట్లు దుఃఖిస్తూ ‘’ద్రోణునితో శిఖిం బడక ద్రోణ కుటుంబిణి యున్నదింట ‘’వీడిని కట్టి తెచ్చినందుకు ఆతల్లి ఎంత పరితపిస్తోందో అని సహ వేదన చూపించి పాండవుల్ని బ్రాహ్మణ హింస పాపం అని చెప్పి వారించిన పోతనగారి పద్యం ఉదాహరించటం సందర్భ శుద్ధి, వెయ్యి మాటలపెట్టు ఆ పద్యం .
నారసి౦హావతారం లో ప్రహ్లాద చరిత్రలో పోతనగారి రంగారు బంగారు పద్యాలు వివరిస్తూ తేనెల సోనలు అందింఛి పోతనకవితామృతాన్ని పంచారు .గజేంద్ర మోక్షం ,వామనావతారం ల లో బాపు గారి కమనీయ చిత్రరాజాలూ పొందుపరచి కళ్ళకు కట్టించారు .’’రవి బి౦బ౦బుప మింప పాత్రమగు ఛత్రమై ,శ్రవణాలంకృతియై’’పద్యానికి’’ బామ్మ ‘’అదే నండీ బాపుగారి బొమ్మ అత్యద్భుతంగా పండింది . ధర్మ విగ్రహుడు ,మర్యాదా పురుషోత్తముడు అయిన శ్రీరాముని రామావతారం ఆమెకు కొట్టిన పిండే.రాముని శివధనుర్భంగం ,బాపు రమణీయ చిత్రంతో పరమ రామణీయకమైంది .సుందరకాండలో సీతామాత ను హనుమ దర్శించటం చరితార్ధకం గా ఉంది చిత్రంతో సహా .బాపుగారి మాగ్నం ఓపస్ చిత్రం శ్రీరామ పట్టాభిషేకం అన్ని భావాల సమ్మిళనం .దాన్ని వివరించిన విధానమూ ఒక నిధానం గా ఉంది .
శరశ్చంద్ర ప్రభువు శ్రీ కృష్ణావతారం శారీరక మానసిక ఆహ్లాద ఆనంద ప్రదానం .ఆ పేరులోనే అనంతమైన ఆకర్షణ ఉంది .పులకింతే కలుగుతుంది .కన్నయ్యకతలు పిన్నయ్యలకు మహారుచి .అంతే రుచికరంగా వర్ణించారు .’’అమ్మా మన్ను తినంగ నే శిశువునో ‘అన్న పద్య భావం, బాపు దానికి తగినట్లు గీసిన చిత్రం కనులకు మిరుమిట్లు గొల్పేవే .బాల కిట్టమ్మ నోటిలోయశోద చూసిన సకల భువనాలు,పొందిన లోకోత్తర అనుభూతి చిత్ర హృదయం చిత్త హృద్యంగా ఉన్నాయి . గోపాలురతోకలిసి ‘’కిత్తమూర్తి మామయ్య ‘’చల్దులు ఆరగించటం ,తెలుగు ఊరగాయలు తినటం పోతనగారు తెలుగు భోజనం రుచి చూపించారు దానినే శ్రీ దేవి గారిక్కడ పొందుపరచారు .ఇక్కడ నాకొక విషయం జ్ఞాపకం వస్తోంది .కరుణశ్రీ గారు ‘’భాగవత వైజయంతిక ‘’లో ఈ ఘట్టాన్ని పేర్కొని, వ్యాసుడు ‘’కృష్ణయ్యా !నువ్వు మరీ తెలుగు వాడివి అయిపోయావయ్యా ‘’అని వెండి గడ్డాన్ని నిమురుకొంటూ ,ముసిముసి నవ్వులు నవ్వాడట.కాళీయయమర్దనమూ బాగుంది చిత్రంతో పాటు .రాసలీలా విలాసాన్నీ రసకందాయంగా ,పోతన శృంగారరస భరిత పద్యాలనాధారంగా రాయటం బాగుంది .’’కిటియై కౌగిట చేర్చెను –వటుడై వర్ధిల్లి కొలిచే వడి కృష్ణుం డై-ఇట పద చిహ్నము లిడెకిం-దటిబామున నేమి నోచితిమమ్మ ధరిత్రీ ‘’అని తమకు దక్కని ఆదివ్యానుభూతి భూమాతకు దక్కిందని అది ఆమె పూర్వ జన్మ సుకృతమనీ భావి౦చారు గోపికలు .మురళీ గానం లో లోకమంతా పరవశించింది .అలాగే శ్రీ కృష్ణ కర్ణామృతం లోని లీలాశుకుని భక్తి పారవశ్య శ్లోక౦’’అ౦గనామంగనా మంతరే మాధవో –మాధవం మాధవం చాంతరే ణా౦గనే-ఇత్ధ మాకల్పితే మండలే మధ్యగః –సంజగౌ వేణునా దేవకీ నందనః ‘’ చేర్చి మనోహరం చేశారు .ఆనీబిసేంట్ చెప్పినట్లు రాసక్రీడ ‘’రిబాల్ట్రీ’’కాదు అది జీవేశ్వరాను బంధం . ‘’.రుక్మిణీ కల్యాణం ,శ్యమంతకోపాఖ్యానం ,నరకాసురవధ ,సత్య అవక్ర ధనుష్ పాండిత్యం ,ఆమె ‘’రోష రాగోదయా విరాట భ్రుకుటి,మందహాసములతో చూపించిన వీరం ,శృంగారం ను మురిపెంగా వర్ణించి సత్యాకృష్ణుల గాఢ అనుబంధాన్ని బాపు బొమ్మ ఆధారంగా రక్తి కట్టించారు .కల్కి అవతారంతో సమాప్తి చేస్తూ,ఫలశ్రుతికూడా చెప్పి అర్ధవంతమైన శ్లోకం పొందు పరచారు –‘శిష్ఠ జనావన దుష్టహర ఖగ తురగోత్తమ వాహన తే –కల్కి రూప పరిపాల నమో భక్తం తే పరిపాలయ మాం –నామ స్మరణా దన్యోపాయం నహి పశ్యామో భవతరణే –రామహరే కృష్ణ హరే తమనామ వదామి సదా నృహరే ‘’.
కృష్ణ పరమాత్మ జగద్గురువు .’’ది లార్డ్ ఆఫ్ ఆటం మూన్స్ ‘’-శర శ్చంద్రప్రభువు’’.ప్రేమ ప్రేమకోసం ,విధి కర్తవ్య నిర్వహణకోసం అనే సత్యాన్ని ప్రపంచ చరిత్రలో మొదటి సారిగా గ్రహించి ప్రకటించిన ప్రధమ ఆచార్యుడు .ఆదర్శ గార్హత్యం ,ఆదర్శ సన్యాసం ఆయనలో చూస్తాం .ది మాస్టర్ స్టేట్స్ మన్ ,ది అన్ క్రౌన్డ్ మోనార్క్ ,దికింగ్ మేకర్ హు హాడ్ నో ఆమ్బిషన్ ఫర్ హింసెల్ఫ్ .ఆయన రసో వై సః‘’అన్నారు స్వామి త్యాగీశానంద .ఇలాంటి లోకోత్తర పురుషుని క్రీ డావిన్యాసమే భాగవతం. భక్తి ప్రకాశం .సుందర పుష్పం .భక్తి సిద్ధాంత మహాద్భుతసారం .ఇంతటి ఉత్కృష్ట గ్రంథాన్ని అత్య౦త సులభశైలిలో అరటి పండు వలిచి పెట్టినట్లు ,ముఖ్యమైన కథలైన అజామిళ ,అంబరీష ,కుచేలాదులను కూడా రసవత్తరంగా వివరించి పరమభాగవతోత్తమురాలై ధన్యురాలయ్యారు శ్రీదేవి గారు .పోతన గారు చేయిపట్టుకొని నడిపించినట్లుంది .మా నూజివీడు రసాలు ,పనసతొనలు ,తెనేతోమాగిన తియ్యమామిడి ,పచ్చకర్పూరం వేసిన పరమాన్నం తిన్నట్లు ,పంచదార పానకం తాగినట్లు అనుభూతి కలుగుతుంది . దశావతారాల విష్ణు మూర్తి ముఖ చిత్రం ,పాలనురగవంటి స్వచ్ఛ మైన కాగితాలపై స్కాలిత్యం లేని ముద్రణ పుస్తకానికి మరింతశోభ చేకూర్చాయి .అందుకే ‘రమణీయం దశావతార శ్రీ దేవీ భాగవతం కమనీయం ‘’అన్నాను . కలం దించకుండా మరిన్ని అర్ధవంతమైన ,మన సంస్కృతీ ప్రతి బి౦బాలైన రచనలు శ్రీదేవి గారు చేయాలని ఆశిస్తున్నాను .శుభం భూయాత్ .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-7-22-ఉయ్యూరు
భారతీ నిరుక్తి.7వ భాగం.12.7.22
Video link
గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-7
మోతీలాల్ ఘోష్ బాల్యం విద్య
28-10-1847 న మోతీలాల్ ఘోష్ బెంగాల్ లోని పాలువా –మగురా అనే ఉన్నతకాయస్త మధ్యతరగతి కుటుంబం లో జన్మించాడు. తల్లిపేరు అమృతమయీ పేరిట ఆ గ్రామం ‘’అమృత బజార్ ‘’గా మారింది .తండ్రి హరినారాయణ ఘోష్ జేస్సూర్ పట్టణం లో ప్లీడర్ .యుగాలక్రితం ఉన్న రాజప్రతినిధి పేర ఆ పట్టణం కు ఆ పేరువచ్చింది .ఆనాటి ఒక భూస్వామి ఆరాజ్యాన్ని అక్బర్ కలిపేసుకో బోతుంటే సేనలతో పోరాడినందుకు ఆపేరు .మరో పౌరుషం గల రాజు సీతారాం ఆస్థానం కూడా అక్కడే ఉంది.యితడు స్వతంత్ర ప్రతిపత్తికోసం ప్రయత్నించి విఫలుడయ్యాడు .మోతీలాల్ పుట్టినప్పుడు ఈ జిల్లాకు చాలా ప్రాముఖ్యం ఉంది .ఇది ఇండిగో భారీఉత్పత్తి కేంద్రం కూడా .తాడిచెట్లనుంచి చక్కర ,బెల్లం ఉత్పత్తి చేసేవారు .దీని సరిహద్దు సుందర్బన్ అవతల బంగాళాఖాతం ఉంది .ఇవన్నీ వారి బాగా పండే బంగారు భూములు .ప్రభుత్వ ఉప్పు కర్మాగారాలు కూడా ఎక్కువే .ఈజిల్లా ఎగువ ప్రాంతాలలో శతాబ్దాలక్రితంనుంచి గ్రామలేర్పరచుకొని గ్రామస్తులున్నారు .వీరు దిగువ ప్రాంతాలలో వరి పండించే వారు .అందువల్ల దేశీయ పరిశ్రమలు క్షీణించినా ఆప్రభావం ఇక్కడ లేదు .వీరి అవసరాలు చిన్నవి నిరాడంబరులు కూడా .1915లో తన వృద్ధాప్యం లో మోతీలాల్ గత స్మృతులను నేమరేసుకొంటూ ‘’నేటి ఘోరాలకు అతీతంగా ఆనాడు జీవితం ఆదర్శంగా గడిచింది .ఆయన స్వగ్రామం బ్రిటీష్ వారు ‘’కబోదాక్ ‘’గా పిలచిన కలాక్షి నది చాలా ప్రసిద్ధమైంది .ఇక్కడ ఆయనబాల్యం ఉల్లాసంగా గడిచింది .
తండ్రి ఎనిమిదిమంది సంతానంలో నాలుగోవాడు మోతీలాల్ ..పెద్దన్న బసంతకుమార్ మంచి జ్ఞాని .తనవిజ్ఞానాన్ని తమ్ములకు అందించేవాడు .వారికి జర్నలిజం లో ఆసక్తి కలగటానికి ఆయనే కారణం .1862లో ఆయన ‘’అమృత ప్రభాహిని ‘’అనే సంస్కృత పత్రికపెట్టి ,పక్షపత్రికగా నడుపుతూ ,సైన్స్ సాహిత్యం ,పరిశ్రమలు వ్యవసాయం మొదలైన వాటిపై విలువైన సమాచారం అందించాడు .ప్రారంభించిన కొద్దికాలానికే ఆయన చనిపోవటంతో పత్రిక ఆగిపోయింది ..రెండవ అన్న హేమంతకుమార్ కలకత్తా వైద్య కళాశాలలో డాక్టరీ చదువుతూ తండ్రి 1864లో చనిపోవటంతో ఆర్దికంగా కుటుంబం దెబ్బతినటం వలన డిగ్రీ తీసుకోకుండా చదువు విరమించాడు .మూడవ అన్న శశి కుమార్ ప్రఖ్యాత జర్నలిస్ట్ గా విశేష కీర్తి పొందాడు .మోతీలాల్ ను తీర్చి దిద్దాడు వీరి తమ్ముడు హీరాలాల్ చిన్నప్పుడే చనిపోయాడు రాం లాల్ కూడా కొద్దికాలమే బతికాడు అందరికంటే చిన్నవాడు గోలప్ లాల్ పత్రికా సంపాదకత్వ బాధ్యతలను మోతీలాల్ తర్వాత చేబట్టి పత్రికా సంపాదకత్వ సంప్రదాయం నిలబెట్టాడు .మోతీలాల్ పెద్దన్నగారి దగ్గరే మొదటి పాఠాలు నేర్చాడు స్థానిక పాఠాశాలలో అన్ని తరగతులు చదివి ,హైస్కూల్ విద్యకు నడియాజిల్లా కేంద్రమైన కృష్ణ ఘర్ వెళ్ళాడు .ఆజిల్లా నీలిపంటకే కాక ,మిషనరీలకూ ,సనాతన సంస్కృత ఇతిహాస గ్రంధ అధ్యయనానికీ కేంద్రం .అర్ధ –భూస్వామ్య సంపన్నులైన నాడియా మహారాజ సంపన్న కుటుంబాలకు నిలయం కూడా .మహారాజా కృష్ణ చంద్ర పేరిట ఆపేరోచ్చింది .ప్లాసీ యుద్ధంలో ఈయన బ్రిటిష్ వారిని సమర్ధించాడు .విద్య విజ్ఞానాలను బాగా పోషించాడు .ఇంగ్లీష్ ఇక్కడ బాగా వ్యాప్తి చెందింది .1860లో బ్రహ్మ సమాజానికి చెందిన నాయకులు బ్రహ్మర్షి దేవేంద్రనాధ టాగూర్ ,కేశవ చంద్ర సేన్ లు సందర్శించారు .వారి ఉపన్యాసాలు హిందూ యువతను ఆకర్షించి బ్రహ్మసమాజ సంస్థ ఏర్పడింది .మోతీలాల్ కూడా చేరాడు .సంఘ సంస్కరణలను బలపరచాడు .హిందూమత ప్రాతిపదికను మాత్రం అన్నల్లాగానే వదులుకోలేదు .
ప్రవేశ పరీక్ష పాసై స్థానిక కాలేజిలో ఆర్ట్స్ కోర్సు లో చేరాడు మోతీలాల్ .కాలేజీ శలవలకు ఇంటికి నడిచే వెళ్ళేవాడు తిరిగి అలానే వచ్చేవాడు .రానుపోను 160కిలోమీటర్లు .రైలు బస్ సౌకర్యాలు అప్పుడు లేవు .తండ్ర మరణంతో వచ్చిన ఆర్దికసమస్యల వలన ఫైనల్ పరీక్ష రాయలేకపోయాడు .అదే జిల్లాలో పిల్ జంగా అనే ఊరిలో కొత్తగా పెట్టిన నఇంగ్లీష్ హైస్కూల్ హెడ్ మాస్టర్ గా చేరిపని చేశాడు .ఆరోగ్యం దెబ్బతిని స్వగ్రామం చేరాడు .అన్నగార్లు ప్రారంభించిన ఉన్నత పాఠశాల బాలికల పాఠశాల ,వయోజన మహిళా పాఠశాల వ్యవహారాలు చూశాడు .అగ్రామ అగ్రవర్ణ నాయకులు వీరి సంస్కరణలను దుయ్యబట్టారు .సోదరులు హరిసభ ,బ్రహ్మ సభలు పెట్టి వారి వాదాలను తిప్పికొట్టారు .తర్వాత వీరు వైష్ణవం స్వీకరించారు .
సోదరుడు భాస్కరకుమార్ అకాల మరణం నాటికి హేమంతకుమార్ శశికుమార్ లు ఆదాయం పన్ను డిప్యూటీ కలెక్టర్లుగా ప్రభుత్వోద్యోగాలలో ఉన్నారు .అయినా ప్రజా చైతన్యం కోసం జర్నలిజం చేబట్టారు .1867లో రాజీనామా చేసి ,బెంగాలీలో ‘’అమృత బజార్ ‘’పత్రిక నడపటానికి నిర్ణయింఛి స్వగ్రామం చేరారు ఆశతాబ్దం లో అదొక సంచలనమే అయింది .
అమృతబజార్ పత్రిక ఆవిర్భావం
20-2-1868న అమృత బజార్ పత్రిక విడుదల చేశారు .ఇది ముగురన్నదమ్ముల ముద్దు చెల్లెలు .ఒక గ్రామం నుంచి వెలువడిన పత్రిక .ఎలా మొదలు పెట్టారో మోతీలాల్ ఇలా చెప్పాడు –‘’కలకత్తా దగ్గర ఒక వ్యాపారి ప్రింటింగ్ కోసం యంత్ర పరికరం కొని వ్యాపారం లో విఫలుడై ,చనిపోగా ,ఆయనభార్య వాటిని అమ్మేయాలనుకోగా అప్పుడు అన్నలుకొని జేస్సూర్ లోని చిన్న గ్రామ అమృతబజార్ కు తెచ్చారు .వాటిలో విలువైన ప్రింటింగ్ ప్రెస్ అయిన ‘’బెలీన్ ప్రెస్ ‘’ఉంది .ఖరీదు 32రూపాయలు .ఊళ్ళో ఉన్న వడ్రంగి సాయంతో దాన్ని బిగించారు .అరిగిపోయిన టైపులతో కేసులను స్టాండ్ మీద అమర్చారు .ఇలాగా ఒక కుగ్రామంలో అమృతబజార్ పత్రిక ముద్రణాలయం ఏర్పడింది ‘’అని చెప్పాడు .
తర్వాత కలకత్తా వెళ్లి ముద్రణ విధానం నేర్చుకొన్నారు .పత్రిక మొదలెట్టాక స్టిక్కులు చేతిలోపట్టుకొని,తమ రచనలు తామే టైప్ చేసుకొంటూ ప్రతులు తామే ముద్రించేవారు .గ్రామంలో కొందరికి కంపోజింగ్ ,ముద్రణా నేర్పినా సోదరులు అన్నిపనులు తామే చేసుకొనేవారు .స్టిక్ లు చేతిలోపట్టుకోవటం ,ముద్రణకు యంత్రం తిప్పటం ,రోలర్స్ టైపులు ఎక్కించటం ,కాగితం ,మాట్రి స్ లు తయారు చేయటం అంతా యజమానులే చూసుకోనేవారు .కాగితం తయారు చేయటంలో విఫలం అయినా నాణ్యమైన ఇంకు తయారు చేసుకొన్నారు .వారపత్రికగా దాని సైజు 2 ½ క్రౌన్ సైజ్ .అమృతం అంటే అమృతమూ తేనే ,బజార్ అంటే మార్కెట్ .ఈ మూదూకలిస్తే తేనే ను పంచి ఇచ్చే పత్రిక అని అర్ధం .అమృతం అంటే విషం కూడా కనుక అమృతాన్నీ విషాన్నీ కూడా ఇచ్చే పత్రిక .రుజు దృష్టి ఉన్నవారికి అమృతం ,వక్ర దృష్టి ఉన్నవారికి విషం పంచి పెడుతుందని యజమానులమనోభావం .రాసేదీ గుద్దేదీ వాళ్ళే కనుక కొంతకాలానికే సర్క్యులేషన్ 500దాకా పెరిగింది పత్రిక .ప్రచారం ప్రజలలో బాగా వ్యాపించి ,ప్రభుత్వం దాన్ని నిశితంగా పరిశీలించటం మొదలెట్టింది .త్వరలోనే పత్రికపై కత్తి కట్టింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-7-22-ఉయ్యూరు
శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు గారి నాజీవిత కథ .2వ భాగం.9.7.22 గబ్బిట దుర్గా ప్రసాద్ ఫేస్బుక్ ద్వారా లైవ్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
Video link
గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-6
1837లో జమీందార్లు స్వంత సంఘం ఏర్పాటు చేసుకొని ,1839 రామమోహన రేయ్ మిత్రుడు రివ్రెండ్ ఆడం ఏర్పాటు చేసిన బ్రిటిష్ ఇ౦డియాసొసైటీకి అనుబంధంగా మార్చారు .ఇంగ్లాండ్ వెళ్ళిన ద్వారకానాద టాగూర్ అక్కడి బ్రిటిష్ లేబరలిస్ట్ జార్జిథాంప్సన్ ను తీసుకువచ్చాడు .ఆయన సూచనపై 1843లో బెంగాల్ బ్రిటిష్ ఇండియాసోసైటీఎర్పాటు చేశారు .థాంప్సన్ భారత దేశ రాజకీయ విజ్ఞాన వ్యాప్తికి నాంది పలుకగా ,ఒకటి సంపన్నులకు మరోటి మేధా సంపన్నులకు ప్రాతి నిధ్యం వహించాయి .వీటివల్ల జమీందారీ సోసైటీ , బెంగాల్ సొసైటీలు ఏమీ అభి వృద్ధి పొందింది లేదు .
1849లో డ్రింక్ వాటర్ చేతూన్ స్థానిక కోర్టుల పరిదిలోకి బ్రిటిషర్లను కూడా చేర్చాలని బిల్లు ప్రవేశ పెట్తిన తర్వాత కానీ దేశం లో రాజకీయోద్యమం ఊపందుకోలేదు .బిల్లు ఆమోదం పొందిన కార్యాచరణ జరగలేదు .బ్రిటిష్ ప్రయోజనాలకోసం బిల్లు రద్దు చేశారు .దీనితో రెండు సంఘాలు కలిసిపోయి బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ గా ఏర్పడ్డాయి .ఇది సంస్కరణల తో ఉన్న రాజకీయ సంస్థ .ఇలాగే మద్రాస్ బొంబాయి పూనాలలో కూడా ఏర్పడ్డాయి .తమ ఉనికిని ఈ సంస్థ చాటుకొని శాసన సభలలో భారతీయులను చేర్చాలనీ ,ఇంగ్లాండ్ ,ఇండియాలో ఒకేసారి ఇండియన్ సివిల్ పరీక్షలు జరపాలనీ ,బ్రిటన్ లో పుట్టిన వారితో సహా చట్టం ముందు అందరూ సమానమే అన్న సూత్రాన్ని ఆమోదించాలని వత్తిడి తెచ్చారు .1861లో బ్రిటిషర్ల హక్కులన్నిటినీ భారతీయ మాజిష్ ట్రెట్లుకాని న్యాయమూర్తులుకాని విచారణ జరుపరాదు అనే ఒక్క మినహాయింపుతో రద్దు చేశారు .1882-83లో బిల్లుపైఆ౦దోళనయెక్కువై పరిస్థితులు క్లిష్టమయ్యాయి .
సిపాయిల తిరుగు బాటును ప్రముఖులవర్గం ప్రభుత్వాన్ని బలపరచటం ఆశ్చర్యకరమైన విషయం ..అయితే తర్వాత వారిలోనూ ఒక కుదుపు వచ్చి౦ది.హిందూ పెట్రియట్ సంపాదకుడు హరిశ్చంద్ర ముఖర్జీ ‘’భారతీయుల సమస్యలు భారతీయులే పరిష్కరించుకొనే సమయం వచ్చింది .తిరుగుబాట్లు ఆంగ్లేయులకు అలవాటై పోయాయి .స్వదేశస్తుల భాగస్వామ్యం లేకపోతె ఇలానే ఉంటుంది ‘’అని రాశాడు .అప్పటికి ఇంకా దేశానికి స్వాతంత్ర్యం రావాలి అనే డిమాండ్ రాలేదు .తమకు, బ్రిటిషర్లకు సమానహక్కులే కోరారు .శక్తి వంతమైన జాతీయోద్యమం అవసరం అయింది .
భారతీయ సంపదను దోచుకొంటూ తమ దేశానికి తరలిస్తూ ,అక్కడి ప్రభుత్వానికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు .కంపెనీ మాజీసైనికాదికారి విలియం బోల్డ్స్ కలకత్తాలో 1776లో ఒక ఇంగ్లీష్ వార్తా పత్రిక పెట్టాలనుకొని సన్నాహాలు చేసుకొని భంగపడ్డాడు .కంపెనీ భయపడి ఆయన్ను ఇంగ్లాండ్ పంపించేసింది .జే ఎ హక్ అనే మరో ఇంగ్లీష్ వాడు ‘’ది బెంగాల్ గెజిట్ ‘’ప్రారంభించి దాన్ని ప్రభుత్వ బాకా పత్రికగా మార్చాడు .ఇది జర్నలిజం లో నీచాతి నీచంగా భావించారు .1786నాటికి బెంగాల్ లో 4,మద్రాస్ లో 1ఇంగ్లీష్ పేపర్లు ఉండేవి .1789లో బొంబాయిలో మొదటి వార్తాపత్రిక వచ్చింది .ఈ పత్రికల ఎడిటర్లు అందరూ ఆంగ్లేయులే .ఏ సంపాదకుడైనా ప్రభుత్వాన్ని అధికారుల్ని అందులో విమర్శిస్తే వాళ్ళను అర్జెంట్ గా లండన్ తోలేసేవారు .ప్రెస్ లపై ఆంక్షలు ఎక్కువగా ఉండేవి .19వ శతాబ్ది ప్రారంభానికి కలకత్తాలో 7 వార్తా పత్రికలున్నాయి.1813-18మధ్య ప్రచురణ రంగం లో మిషనరీలుకూడా అడుగుపెట్టారు . దిగ్ దర్శన్ అనే బెంగాలీ మాస పత్రిక ,సమాచార దర్పణ్ అనే బెంగాలీ వార్తా పత్రిక ,ది ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అనే ఇంగ్లీష్ మంత్లీ మిషనరీలు స్థాపించారు .ఇవన్నీ అధికారుల కను సన్నలలో మెదిలేవే .1818లో ఆంక్షలు ఎత్తి వేయగా రామమోహన రాయ్ ,జేమ్స్ ,సిల్క్ బకింగ్ హాం ,లు పత్రికలూ స్థాపించారు .కలకత్తా జర్నలో బకింగ్ హాం ఈస్ట్ ఇండియా కంపెని అక్రమ పాలన ను తూర్పారపట్టాడు .ప్రభుత్వం మండిపడి,1823లో ఆయన్ను లండకు తరిమేశారు .కానీ ఆయన అక్కడ కూడా తన ఉద్యమాన్ని కొనసాగించాడు .
రామమోహన రాయ్ బెంగాలీలో సామ్బాద్ కౌముది ,పర్షియన్ లో మీరతుల్ అక్బర్ ,ఇంగ్లీష్ లో ‘’బ్రాహ్మణకాల్ మేగజైన్ ‘’స్థాపించి నడిపాడు .ఇవన్నీ కొద్దికాలం చాలా స్వేచ్చగా నడిచాయి .దీన్ని రాయ్ బాగా సద్వినియోగ పరచుకొన్నాడు .1823లో పత్రికా స్వాతంత్ర్యం పోయింది .భారతీయ పత్రికలకు రాయితీలు చాలా తక్కువగా ఉండేవి .సనాతన హిందూ ధర్మపత్రికలకు స్వేచ్చ బాగానే ఉండేది.సంస్కరణ వాద పత్రికలలో విమర్శక విషయాలు లేకపోతేనే అనుమతించేవారు .1830కి బెంగాల్ లో ఇంగ్లీష్ లో దినపత్రికలు వార ,పక్ష మాసపత్రికలు 33 ఉండేవి .భారతీయ పత్రికలూ 16మాత్రమె .ఇవికూడా ఎక్కువకాలం సాగలేదు .మిగిలినవి వ్యాపార ప్రకటనతో సరిపెట్టుకున్నాయి .
1835లో ఆంక్షలు ఎత్తేయటం తో విరుద్ధభావప్రచారాలకు వివిధ పత్రికలమధ్య పోటీ ఉండి,సిద్ధాంత పరమైన ఘర్షణలతో జర్నలిజం ఉండేది .హిందూ మితవాదులు సంస్కర్తలు ,మిషనరీలు కలం యుద్ధం లో మునిగిపోయారు .1850నుంచి బెంగాల్ పత్రికలూ ప్రభుత్వ విధానాలపై ప్రభావం చూపించటం మొదలు పెట్టాయి .1853లో హరిశ్చంద్ర ముఖర్జీ స్థాపించిన ‘’హిందూ పేట్రియట్’’ తప్పు చేసినవారి పాలిటి సింహస్వప్నం లా ఉండేది .విద్యాసాగర్ గారి బెంగాలీ వారపత్రిక ‘’సోం ప్రకాశ్ ‘’ మరో పత్రిక ఇండియన్ మిర్రర్ పక్షపత్రిక లు నీలి విప్లవాన్ని వ్యతిరేకించి మార్గదర్శనం చేశాయి .1862లో బెంగాలీ అనేది వారపత్రికగా మొదలై ,సురేంద్రనాధ బెనర్జీ నాయకత్వం లో జాతీయోద్యమానికి కొమ్ము కాసి ప్రముఖ పత్రిక గా రూపు దాల్చింది .
మోతీలాల్ ఘోష్ ఆయన అన్నయ్య ప్రజాజీవితం లో ప్రవేశించే నాటికి బెంగాల్ పరిస్థితులన్నీ పై విధంగా ఉన్నాయి .ఈ సోదరులు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వారు .జాతీయోద్యమంలో గ్రామీణ పేదప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న వీరి నాయకత్వం లో ఆ ప్రజల భావాలకు దర్పణంగా నిలిచారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-7-22-ఉయ్యూరు
గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-5
ఈశ్వర చంద్ర విద్యాసాగర్ స్త్రీ విద్యను ప్రోత్సహి౦చాడు.క్రిష్టియన్ మిషనరీ బాలికల స్కూల్స్ లో క్రిష్టియన్ కుటుంబాలకు ,తక్కువ కులాల పిల్లలకే ఎక్కువ ప్రవేశం .మతమార్పిడి నేర్పేవారు .విద్యా సాగర్ మిత్రులతోకలిసి గవర్నర్ జనరల్ కౌన్సిల్ లో న్యాయ విభాగం సభ్యుడు ‘డ్రింక్ వాటర్ బెధూన్’’ సహాయం తో 1849లో హిందూ బాలికల విద్యాలయం స్థాపించాడు .తర్వాత తొమ్మిదేళ్ళ కాలం లో వేర్వేరు చోట్ల స్వయం కృషితో 36 బాలికా స్కూళ్ళు స్థాపించాడు .బ్రహ్మ సమాజికులు ఎన్నో ప్రభుత్వేతర బాలికా విద్యాలయాలు స్థాపించారు .హేతువాది అయిన విద్యాసాగర్ పశ్చిమ ,భారతీయ తత్వ శాస్త్రాలను అధ్యయనం చేయటానికి వీలుగా సంస్కృత కళాశాల విద్యార్ధులకు ఇంగ్లీష్ బోధించాలని సూచించాడు .ప్రజా సంక్షేమ విద్య ఆయన ధ్యేయం .విద్యావంతుల్ని పాలకవర్గ సభ్యులనుగా మార్చటం ఆయనకు ఇష్టం లేదు.ఆయనే ఒక రోల్ మోడల్ గా నిలిచాడు .నిరాడంబర వస్త్రధారణ ,పశ్చిమ దేశాలలోని నైతిక సాంప్రదాయక విలువల అనుసరణ ఆయనను ఆదర్శవంతుని చేశాయి .బెంగాలీ సాహిత్యానికి మార్గదర్శి అయ్యాడు .19వ శతాబ్దికి ముందు బెంగాలీ సాహిత్యమంతా అత్యున్నత కవితామయమే .వచనం ప్రాచుర్యం పొందలేదు .అన్యమత ప్రచారానికి ,,బ్రిటన్ నుంచి వచ్చిన ఆంగ్లప్రభుత్వోద్యోగులకు బెంగాలీ పాఠ్య గ్రంధాలు తయారీకి మాత్రమె వచనం వాడేవారు .వేదాంత సిద్ధాంత వివరణలకు రాజకీయ సాంఘిక పరిణామాల వ్యాఖ్యానానికి రామమోహన రాయ్ వచనాన్నిఎక్కువగా వాడాడు .ఆయన రాసిన 432 గ్రంథాలలో 15పాఠ్య గ్రందాలు౦డటం విశేషం .ఇందులో ఎక్కువగా సంస్కృత ఇంగ్లీష్ గ్రంథాలకు అనువాదాలు ,అనుసరణలు ఉన్నాయి .ప్రాధమిక స్థాయి నుంచి ఉన్నతపాఠశాల స్థాయివరకు ఆయనే పాఠ్యగ్రంథాలు రాశాడు .ఇప్పటికీ అవి చెలామణి లో, బోధనలో ఉన్నాయి .
బెంగాలీ వచనం బంకిం చంద్ర చటర్జీ రచనలలో పరిపక్వస్థాయి పొందింది .కవిత్వం తప్ప ఆయన ముట్టని సాహితీ ప్రక్రియే లేదు .కలకత్తా యూనివర్సిటి మొదటి పట్టభద్రుడు ఆయన .. సంస్కృత ఆంగ్లాల తోపాటు పాశ్చాత్య తత్వశాస్తాలలోనూ లోతైన పాండిత్యం ఉన్నవాడు .ఇంగ్లిష్ ఫిక్షన్ బాగా అర్ధం చేసుకొని జతీయతాభావంతో రచనలు చేశాడు .మతం పై చక్కని విమర్శనాత్మక సందేశమిచ్చాడు .సాటిమానవ సేవ ఉత్తమంగా భావించి సేవలందించాడు .భగవద్గీతకు భాష్యం రాస్తూ కో౦టే,జార్జి స్టువార్ట్ మిల్ ప్రతిపాదించిన ‘’పాజిటివ్ హ్యూమనిజం’’ ను భగవద్గీత లోని నిష్కామ కర్మలను మేళవించి శక్తివంతమైన సంఘ సేవా సూత్రాన్ని తయారు చేశాడు .జాతీయ భావాలతో తన ఆశయాలను వందే’’ మాతరం గీతం’’ లో పొందు పరచాడు .భారత జాతీయవాదులకు ,విప్లవకారులకూ కూడా వందేమాతర గీతం స్పూర్తి దాయకమైంది నవలాకారునిగా ,వ్యాసకర్తగా తత్వ వేత్తగా ,సామాజిక దార్శనికునిగా ,,జాతీయవాదిగా , సిద్ధాంత కర్తగా మన సంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రాతినిధ్యం వహించిన మేధావి బంకిం చంద్రుడు .
చరిత్రకారుడైన మైఖేల్ మధుసూదన దత్తు జాతీయతాభావంగా బెంగాలీ కవిత్వాన్ని కొత్తదారులు తొక్కించాడు .ఇంగ్లీష్ సాహిత్యం ,పాశ్చాత్య శాస్త్ర సాహిత్యాలలో నిష్ణాతుడైన దత్తా చిరస్మరణీయమైన ఇతిహాసాలను ,నాటకాలను పాటలను బెంగాలీలో రాశాడు .అలాగే హేమ చంద్ర బంద్యోపాధ్యాయ ,రంగాలాల్ బెనర్జీ ,నవీన్ చంద్ర సేన్ ,బీహారీలాల్ చక్రవర్తి కూడా .వీరందరి రచనలలో బంకిం ఆశయాలే అంతర్వాహినిగా ఉన్నాయి .దత్తు నాటకాలకు గొప్పవరవడి పెట్టాడు .దీనబందుమిత్రా రాసిన ‘’నీల్ దర్పణ్’’నాటకం దేశ వ్యాప్త ఆందోళనకు కారణమైంది .గిరీష్ చంద్రఘోష్ కలకాలం నిలిచే నాటకాలు రాశాడు .1872లో బెంగాలీ నాటకకళ అస్తిత్వం లోకి వచ్చాక సామాజిక దురన్యాయాలు ప్రభుత్వ దమనకాండ అవినీతి ,జాతీయోద్యమ స్పూర్తి తో అనేక నాటకాలు వచ్చి జనం లో చైతన్యం తెచ్చాయి .రవీంద్రనాథ టాగూర్ సాహిత్య రంగ ప్రవేశం చేసి కవిగా .కథకునిగా నవలాకారునిగా నాటకకర్తగా ,పాటలకర్తగా వ్యాసకర్తగా ,జాతీయవాదిగా సమీక్షకునిగా గొప్ప విమర్శకునిగా రవీంద్ర సంగీత సృష్టికర్తగా 19వ శతాబ్దంలో భాను దీప్తితో ప్రకాశించాడు .
రాయ్ కాలం లోనే రాజకీయ వివేచన మొదలై ౦ది. ఆఖ్యాతి అంతా ఆయన పత్రికలదే..ప్రజలను చైతన్య పరచి ప్రజాభిప్రాయాలకు దర్పణంగా నిలిచాయి .1823లో ప్రెస్ ఆర్డినెన్స్ ను నిరశిస్తూ చేసిన పోరాటం చిరస్మరణీయం ,ప్రజాస్వామ్యానికి మేలుకొలుపు .క్రైస్తవ న్యాయ శాస్త్రాల ద్వారానే క్రైస్తవుల్ని విచారించటానికి వీలుకలిగించే 1827జ్యూరీచట్టాన్ని నిరసిస్తూ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించాడు .భారత్ ను బలప్రయోగం తో అణచాలనుకోవటం అవివేకం ,అసాధ్యం అని కూడా అన్నాడు .ప్రభుత్వానికి రెండే రెండు ప్రత్యామ్నాయలున్నాయని అందులో ఒకటి –భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యానికి ప్రయోజనాలు చేకూర్చే అనుకూల మిత్రదేశంగా వ్యవహరించాలా ,2లేకపోతె బద్ధ శత్రువులాగా బ్రిటిష్ ప్రభుత్వానికి శిరో భారాన్ని తెప్పించేదిగా ఉండాలా ఏదోఒకటి తేల్చుకోమని సవాలు విఇరాడు రాయ్ .తర్వాత ఫ్రెంచ్ విప్లవకారుల ఆదర్శాలతో ఉత్తేజితులైన ‘’డిరోజయన్స్ ‘’రంగంలోకి దిగారు ,పత్రికలపై ఆంక్షలు ఎత్తేయమని ఉద్యమించారు .1835లో గత్యంతరం లేక ప్రభుత్వం ఆర్డినెన్స్ ను రద్దుచేసింది .తర్వాతప్రభుత్వంలో అత్యున్నత మైన ఉద్యోగాలలో భారతీయులను నియమించాలని మరో డిమాండ్ మార్మోగింది .ప్రభుత్వం 1843లో ఈ డిమాండ్ ను ఆమోదించింది .ఇలా క్రమ౦గా ప్రభుత్వం ఒక్కటొక్కటిగా ప్రజల డిమాండ్ లను ఒప్పుకొని అమలు పరచటం ప్రారంభమై ప్రభుత్వం కిందచేయిగా ,ప్రజావాణి పై చేయిగా మారటం ప్రారంభమైంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-7-22-ఉయ్యూరు
రేపటి నుంచి శ్రీ అయ్యదేవర వారి జీవిత చరిత్ర ప్రత్యక్ష ప్రసారం
సాహితీ బంధువులకు శుభ కామనలు .ఇవాల్టితో డా కె.ఎం. కేసరి గారి ‘ముచ్చట్లు ”పూర్తయ్యాయి . ఇది భారత స్వాతంత్ర్య అమృతోత్సవ సంవత్సరం కనుక రేపటి నుంచి 7-7-22 గురువారం సాయంత్రం సరసభారతి ఫేస్ బుక్ లో ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధులు, ఆంధ్రప్రదేశ్ తొలి శాసన సభాధ్యక్షులు ,,బహు గ్రంధ కర్త శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు గారి ”నా జీఇతం ”ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని తెలియ జేస్తున్నాను -దుర్గా ప్రసాద్ -6-7-22
భారతీ నిరుక్తి.1వ భాగం
Video link
గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్ -4
లార్డ్ మెకాలే ,ఆయన సహచరులు 1835లో ప్రవేశపెట్టిన విద్యా పద్ధతిలో రెండు లోపాలున్నాయి. 1-దేశీయ భాషల అధ్యయనం పూర్తిగా విస్మరించ బడింది .2-గ్రామీణులకు ఆధునిక విద్య నేర్చే అవకాశం లేదు .దీన్ని సరిదిద్దటానికే ప్రైవేట్ వ్యక్తులు రంగంలోకి దిగాల్సి వచ్చింది .రామ మోహన్ రాయ్ ,ఈశ్వర చంద్ర విద్యా సాగర్ లవలన బెంగాలీ సాహిత్యం వృద్ధి చెందింది .విద్యా ,సాహిత్యాభి వృద్ధికి బెంగాల్ దేశం వీరికి ఎంతో రుణ పడి ఉంది .విలియం కెరీ ,జాషువా మార్ష్ మాన్ మిషనరీలు కూడా గొప్ప సేవ చేశారు .1800లో బెంగాలీ లో కొద్ది పేజీలతో ఒక మిషనరీ పత్రిక ప్రారంభించాడు .1844 ఇంగ్లీష్ పూర్తిగా వాడుకలోకి వచ్చేసింది .ఇంగ్లీష్ పరిజ్ఞానామ్ వలన కొత్త మేధావి వర్గం ఏర్పడింది .ఈ వర్గం సాంప్రదాయిక పంథాకే కట్టుబడి ఉంది .పట్టణ వర్గం తిరస్కరించింది .1857లో కలకత్తా బొంబాయ్ మద్రాస్ లలో యూని వర్సిటీలేర్పడ్డాయి ..అప్పుడే మొదటి స్వాతంత్ర్య సంగ్రామం అనే సిపాయీ తిరుగుబాటు జరిగింది .దేశీయులు పూర్తిగా ఆంగ్లేయులకు విదేయులైపోతారనే భయం ఎక్కువైంది .బ్రిటన్ లో ఆశలు మోసులేత్తాయి.క్రమంగా మిషనరీలపై వ్యతి రేకత పెరిగింది .పురాతన సంస్కృతిని పరిరక్షి౦చు కోవాలన్న జిజ్ఞాస బాగా పెరిగింది .రాజకీయార్ధిక మత ప్రతిఘటనకు బీజాలు వేసింది రామమోహన్ రాయ్ .ఇది సంస్కృతికి సబంధించింది అనికూడా గ్రహించాడు .సకల మత సారాన్ని మొట్టమొదటగా అధ్యయనం చేసింది ఆయనే .తాత్విక స్థాయిలో సర్వమత ఐక్యతకు నాంది పలికాడు .ఆధ్యాత్మిక మానవతా వాదం తో పాశ్చాత్య భౌతిక వాదాన్ని ఎదుర్కొన్నాడు .స్వామి వివేకానంద ,రవీంద్రనాథ టాగూర్ గాంధీ ,సర్వే పల్లి రాదా కృష్ణలు ఆధ్యాత్మిక మానవతా వాదాన్ని ముందుకు తీసుకు వెళ్ళారు .రాయ్ కాలం లోనే ఇదే ఆధునిక భారతీయ వివేచనకు మూలం అయింది .దీనికి ఆధునిక శాస్త్ర విజ్ఞానం జోడిస్తేనే దేశ భవిష్యత్తు ఉంటుందని రాయ్ భావించగా వివేకానంద బలపరచాడు .రాయ్ భారత సమాజం లోని అసమానతలు ముందుగా గుర్తించాడు .ప్రభుత్వం దేశ సమైక్యతకు భంగం కలిగించటమూ గమనించాడు .వసుదైకకుటుంబ భావన వ్యాప్తికావాలని ఆశించాడు .అందుకే ముందుగా సతీ సహగమనం ను వ్యతిరేకించాడు .మహిళా విమోచన స్త్రీలకూ ఆస్తిహక్కు కోసం బహుభార్యాత్వ నిషేధం బాల్య వివాహాల నిషేధాలను వితంతు వివాహాలను బలపరచాడు .
దేశం లో జర్నలిజం అభి వృద్ధికి పాటు పడిన మొదటి వ్యక్తీ రాయ్ .బెంగాలీలో ‘’సంబాద్ కౌముది -1821,పర్షియన్ లో ‘’మిరాత్ ఉల్-అక్బర్ ‘’1822 స్థాపించాడు .ఈ రెండు పత్రికలలో దేశ విదేశీయ వ్యవహారాలూ నిష్పాక్షిక జాతీయ వాదంతో వ్యాఖ్యానించాడు.అనేక సంస్కృత పవిత్ర గ్రంథాలు అనువదించాడు .’’వేదాంత సూత్ర ‘’,ఉపనిషత్ లను బెంగాలీలోకి అనువదించాడు .బెంగాలీ వచనానికి కొత్తరూపు ,దీప్తి కలిగించాడు .జాతీయవాద పత్రికా రంగానికి ఊపిరులూదాడు .పత్రికా స్వేచ్చకు ప్రభుత్వం సెన్సార్ విధిస్తే రద్దు కోసం పిటీషన్ పెట్టి ప్రీవీ కౌన్సిల్ దాకా వెళ్ళాడు .ఆ పిటీషన్ పత్రికా స్వాతత్రానికి ప్రమాణ పత్రం .సెన్సార్ షిప్ ను నిరశిస్తూ పర్షియన్ పత్రికను మూసేశాడు .సెన్సార్ ఆర్డినెన్స్ రద్దు కోసం భారతీయ మేధావి వర్గంతో భారీ రాలీ జరిపాడు రాయ్ .
హిందూ సమాజ నైతికతను పునరుద్ధరించటం లో కృత కృత్యుడు అయినా ,ఆయన సంస్కరణలు హిందూ సమాజం వ్యతిరేకించింది .ఆయన్ను వెలి వేసి ,జీవితాంతం ఏదో ఒక కేసులో ఇరికిస్తూనే ఉంది .అయినా ఆయసనాతన చాందసులను లక్ష్యపెట్టలేదు .1830లో ఆయన బ్రహ్మ సమాజ సభ్యులను కూడా వెలేశారు .19లో బ్రహ్మసమాజ వర్గానికి ,సనాతన చాందస వర్గానికి వాడ ప్రతివాదాలు జరుగుతూనే ఉన్నాయి .
హిందూ పునరుజ్జీ వన ఉద్యమం సంస్కరణ ఉద్యమ౦గా సాగింది .శ్రీరామకృష్ణ పరమహంస వసుధైక అస్తిత్వాన్ని ప్రపంచమంతా చాటారు .అన్ని పద్ధతులూ ఒకే దేవుని చేరుతాయని బోధించారు .అన్నిమత విశ్వాసాలు గొప్పవే .మానవ సేవే మాధవ సేవ .ఆయన శిష్యుడు స్వామి వివేకానంద మానవతా విలువలకు అంకితమై దీన జనోద్ధరణకు కంకబం కట్టుకొని ‘రామకృష్ణా మిషన్ ‘’ద్వారా గొప్ప కృషి చేశాడు .రాజకీయోద్యమం లో నిర్భీకత ,,క్రమ శిక్షణ ,స్వార్ధ రాహిత్యం ,అంకితంగా పని చేసే దీక్ష లను పాదుకొల్పిన మహోన్నత వ్యక్తీ స్వామి కానండుడే .దేశం ఆయనకు ఎంతో రుణపడి ఉంది .ప్రాక్ ,పశ్చిమ దేశాలలోని మంచి లక్షణాలను మేళవింపు దేశానికి అవసరమని ఉద్ఘాటించాడు .దీనివల్లనే నూతన సంస్కృతీ ఉద్భవం జరుగుతుందని ఆశించాడు .’’భారతీయ మత సూత్రాలతో ఐరోపా సమాజ వ్యవస్థ నిర్మిద్దాం ‘’అని ఎలుగెత్తి చాటాడు .జనాలకు హక్కులగురించి తెలియజేసి ,జాతీయతాభావం పురిగొల్పి సమైక్యపరచాలని సందేశమిచ్చాడు .రాయ్ సందేశం’’ వివేకా నంద వాణిద్వారా ప్రతిధ్వనించింది .దీనివలన దేశం ఆశ్చరంగా చైతన్య శిఖరారోహణం చేసింది .ఈ శతాబ్ది ప్రత్యెక వ్యక్తి స్వామి వివేకానంద .ఆయనవలన విద్యావంతులలో జాతీయతా భావం బాగా పెరిగింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-7-22-ఉయ్యూరు
డా. కె.ఎన్.కేసరి గారి ముచ్చట్లు.8వ భాగం
గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్ -3
నీల్ విప్లవ౦ –ఇండిగో రివోల్ట్ పై శిశిర్ కుమార్ ఘోష్’’కలిసికట్టుగా ఉంటూ రాజకీయ౦గా ఉద్యమిస్తూ నడవాల్సి ఉందని బెంగాల్ ప్రజలకు ఈ నీలి ఉద్యమమే బోధించింది .బెంగాల్ లో ఆంగ్లేయులకు తగిలిన మొదటి దెబ్బ ఇది .అతిగా చేస్తే ప్రజలు తిరగబడతారని పాలకులు మొదటి సారిగా గ్రహించారు .ఇక అణచి వేత సాగదు అని గ్రహించారు ఇంగ్లాండ్ లో ఇలాంటి అణచి వెతలే విప్లవాన్ని సృష్టించాయని గ్రహించారు .జీవచ్చవంగా అర్ధ శతాబ్దం పాటు అణగి ఉన్నబెంగాలీలను విప్లవోద్యమ సి౦హాలుగా మార్చింది అణచి వేతకు గురి చేసిన రైతుల నీల్ ఉద్యమమే .
1860లో ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు మొదలెట్టింది .మొదటి సారిగా ఒక భారతీయుడిని అధికార కమీషన్ సభ్యుడిగా ‘బ్రిటిష్ –ఇండిగో ప్లా౦టర్స్’’పై విచారణకు నియమించారు .ఈ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అందులో సూచనలు అమలు చేస్తూ క్రమంగా నీలి తోటల పెంపకం ఆపేశారు .బీహార్ లో చంపరాన్ జిల్లాలో గాంధీ నాయకత్వంలో పెద్ద సత్యాగ్రహం జరిగి 1917లో నీలి పెంపకం రద్దయింది .ఈ ఆందోళన సారధులలో ఒకరు జాన్ లార్మార్ అనే యూరోపియన్ ఉన్నాడు అంటే అవాక్కైపోతాం .
1686లో కలకత్తా లో హుగ్లీ నది ఒడ్డున జాన్ వార్నోక్ నెలకొల్పిన ఈస్ట్ ఇండియా కంపెని రాజకీయ ఆర్ధిక ,వాణిజ్య కార్యక్రమాలతో బలంగా పుంజుకొని విస్తరించి ,స్థానిక దళారుల మద్దతుతో బ్రిటిష్ వ్యాపారులు వాణిజ్యంలో విపరీతమైన సంపద పోగు చేసుకొన్నారు .స్థానిక ఏజేంట్లూ బాగా సంపాదించుకొన్నారు .తక్కువ పెట్టుబడి అధికవడ్డీ లతో అక్రమార్జన చేశారు .బ్రిటిష్ వారిద్వారా కలకత్తా లో బాగా బాగు పడింది ఈముఠా యే.జల్సారాయుళ్ళుగా ఆడంబర జీవితం గడిపారు ఈ ఏజెంట్లు .1793నాటి పర్మనెంట్ సెటిల్ మె౦ట్ల ద్వారా గొప్ప ప్రయోజనాలు పొంది ఎస్టేట్లు సంపాదించి విలాసవంతులై బ్రిటిష్ ప్రభుత్వం స్థిర పడటానికి కారకులయ్యారు .బ్రిటిష్ వారిని బలపరుస్తూ దేశం లో జరగాల్సిన సాంఘిక రాజకీయ ఆర్ధిక మార్పులను అడ్డుకున్నారు .
మొదట్లో ‘’ఫెరింగ్ –ఫిరంగీ ‘’సంస్కృతికీ ,ఆధునిక ప్రపంచ విజ్ఞానానికి దూరంగా ఉంటూ వచ్చిన వారు చదువులకు ,ఉద్యోగాలకు అవకాశాలు రావటం తో ఇంగ్లీష్ విద్యపై ఆసక్తి పెంచుకొన్నారు .కానీ కలకత్తాలో దాని చుట్టూ ప్రక్కల ఉన్న ద్వితీయ శ్రేణి ఉన్నత వర్గాలవారు చదువుల్లో వీళ్ళని వెనక్కి నెట్టేసి ముందుకు దూసుకు పోయారు.వీరే జాతిని జాగృతం చేసిన మహామహులు .మొగల్ ప్రాభవం తర్వాత 19వ శతాబ్దిలో భారతీయ సంస్కృతీ ఏమాత్రం ముందడుగు వేయలేదు .19వ శతాబ్ది మొదట్లో యూరప్ లో అమెరికాలో ప్రారంభమైన రాజకీయ సైద్ధాంతిక ఉద్యమాలగురించి ఎవరికీ పరిచయమే లేదు .ఆదేశాలలో జరిగిన భౌతిక విజ్ఞాన అభి వృద్ధి కూడా వీరికి తెలీదు .కారణం ముఖ్యంగా అక్షరాస్యత తక్కువ .అప్పుడు మనదేశం లో సంస్కృతం పర్షియన్ శాస్త్రాల అధ్యయనం దాదాపు శూన్యం .పర్షియన్ భాష ముస్లిం పాలకుల పాలనా భాషగా మాత్రమె ఉండేది .వేద,ఉపనిషత్తుల అధ్యయన విజ్ఞానం దేశం లో ఏవో కొన్ని ప్రాంతాలకే పరిమితం అయింది .సనాతన సూత్రాలను గుడ్డిగా అనుకరించటమే మతంగా చెలామణి అయింది ..నగర జీవితంలో నైతికత దిగజారి పోయింది .హిందూ మహిళలకు గౌరవం లేదు .బహు భార్యాత్వం గొప్ప ఫాషన్ అయింది .బాలికలను యువతులను పెళ్ళిళ్ళ పేరిట చరాస్తులుగా అమ్మటం విపరీతమైనది .స్త్రీలను పరదాల చాటున ఉంచటమూ లాంచనం అయింది వారికి స్వేచ్చ లేదు .సతీ సహగమనం గొప్ప ఆదర్శంగా చెలామణి అయింది .బలవంతపు సహగమనాలు పెచ్చు పెరిగి మహిళలకు శాపంగా మారింది .సహగమనం చేయని స్త్రీలు పుట్టి౦ ట్లోనో అత్తవారింట్లోనో పరాదీనపు బతుకులో కుంగి కృశించి పోయారు .భర్త ఆస్తికి భార్య న్యాయంగా వారసురాలు కాకుండా పోయింది .పిత్రార్జితం లోనూ వారికి వాటా దక్కేది కాదు .వితంతు వివాహం నిషిద్ధం అయింది .
ప్రభుత్వం దేశీయులకు ఇంగ్లీష్ చదువులు నేర్పిస్తున్నా ,ఆధునిక మానవజాతులు శాస్త్రీయ విజ్ఞానాల గురించి బోధించటం ఇష్టం లేకుండా పోయింది .దీనికి కారణాన్ని ఈస్ట్ ఇండియా కంపెని డైరెక్టర్ లియోనిల్ స్మిత్ ఇలా చెప్పాడు –‘’ఇంతవరకు మనం దేశాన్ని అనేక మతాలూ తెగలు పేరిట విడదీసి పాలించాం.విద్య పరమార్ధం ఈ వేర్పాటుకు స్వస్తి చెప్పటమే .మహామ్మదీయుల్ని హిందూ వ్యతిరేకుల్ని చేశాం .మతాలమధ్య ,కులాల మధ్య చిచ్చు రాజేశాం.విద్యద్వారా వారి మేధస్సు భావనా పటిమ పెంచటం అంటే ,వాళ్ళ బలాన్ని గుర్తి౦చేట్లు చేయటమే .అది మనకే ప్రమాదం ‘’అని చెప్పాడు .
అయినా,సబార్ది నెట్ హోదాలో ఇండియన్లకు అవకాశాలు ఇవ్వాల్సి రావటంతో ఇంగ్లీష్ విద్యా బోధనా కేంద్రాలను అతి తక్కువగానైనా ఏర్పాటు చేయటానికి బ్రిటిష్ పాలనా వ్యాపారులు అయిష్టంగానే అంగీకరించక తప్పలేదు .చతుష్పదులు మక్తాబ్ లకు సబ్సిడీ ,సౌకర్యాలు కలిగిస్తూ ,అప్పటి సంప్రదాయ విద్య నేర్పటమే పాలకుల ఆలోచన ..దీనితోపాటు మిషనరీలు ,కొందరు ప్రైవేట్ వ్యక్తులు కలకత్తాలోనూ పరిసర ప్రాంతాలలో స్కూళ్ళు ఏర్పాటు చేశారు .ప్రైవేట్ వ్యక్తులలో డేవిడ్ హేర్ అనే ఆంగ్లేయుడు ,రాజా రామమోహన రాయ్ లాంటి వారున్నారు .భారత ఆధునిక యుగారంభకుడు రామమోహన రాయ్ .మతప్రసక్తిలేని సార్వజనిక విద్య బోధించటానికి మొదటి కాలేజి కలకత్తాలో 1917లో ప్రారంభమైంది .ఆనగర ప్రముఖ భారతీయుల విరాలాళాతోనే దీన్ని స్థాపించారు .బొంబాయి మద్రాస్ లలో కూడా ఇంగ్లీష్ విద్య వ్యాప్తి చెందింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-7-22-ఉయ్యూరు
Video link
డా. కె.ఎన్.కేసరి ముచ్చట్లు.6వ భాగం