సంగీత సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం

సంగీత సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం

సరసభారతి 155 వ కార్యక్రమంగా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 174వ ఆరాధనోత్సవ౦ పుష్య బహుళ పంచమి 2-2-21 మంగళవారం సాయంత్రం 6.30గం.లకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో నిర్వహింపబడుతుంది .ఆ సాయంత్రం 6గం లకు శ్రీ త్యాగరాజస్వామికి అష్టోత్తర పూజ జరుగుతుంది .అనంతరం స్థానిక ,ఇతర ప్రదేశాలనుండి,ఉత్సాహం గా పాల్గొనే గాయనీ గాయకులు ’’ శ్రీ త్యాగరాజ పంచ రత్న కీర్తనలు ’’ గానం చేస్తారు .ఇతర కృతులతో అలరిస్తారు .

అమరగాయకులు స్వర్గీయ ఘంటసాల వేంకటేశ్వరరావు,పద్మ విభూషణ్ డా .మంగళం పల్లి బాల మురళీ కృష్ణ  ,ఇటీవలే మరణించిన పద్మ భూషణ్ శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం (బాలు )సంస్మరణ జరుగును .సాహిత్య ,సంగీతాభిమానులు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .

పాల్గొను గాయనీ గాయకులు

1-శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు –నిర్వాహకురాలు

2- శ్రీమతి వి.శాంతి శ్రీ –మ్యూజిక్ లెక్చరర్ –గుడివాడ

3-శ్రీమతి టేకుమళ్ళ చిదంబరి –ప్రముఖ సంగీత విద్వాంసురాలు , రేడియో, టివి గాయని –విజయవాడ

4-శ్రీ రొయ్యూరు సురేష్ –వర్ధమాన గాయకుడు –విజయవాడ

5-శ్రీమతి పి.పద్మజ –వర్ధమాన గాయని -ఉయ్యూరు

6-శ్రీమతి జి.మాధవి –గాయని ,,చిరంజీవి నితిన్-వర్ధమాన బాలగాయకుడు –ఉయ్యూరు

7- గానగంధర్వ స్వర్గీయ శ్రీ’’ బాలు’’ పై ప్రముఖ కవి, విమర్శకుడు శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారి ప్రసంగం (15 నిమిషాలు )

8-కార్యక్రమ నిర్వహణ –శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –సరసభారతి కార్యదర్శి

 శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి – శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి    శ్రీ గబ్బిట  వెంకట  రమణ     

గౌరవాధ్యక్షురాలు                      కార్య దర్శి                        కోశాధికారి

                        గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు -25-1-21-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 26-భూత దయాళు తూమాటి రామ భొట్లు 

మహా భక్త శిఖామణులు

26-భూత దయాళు తూమాటి రామ భొట్లు

 19వ శతాబ్దం లో గుంటూరు జిల్లా మద్దిరాల పాడు కమ్మవారి కులం లో జన్మించిన తూమాటి రామ భొట్లు తండ్రి నరసింహ చౌదరి తల్లి చిలకమా౦బ .భార్య పేరమ్మ .గురువు అద్దంకి తాతాచార్యులు .ఒకరోజు గురువుకు సాష్టాంగ నమస్కారం చేసి జీవితం తరించే ఉపాయం చెప్పమని కోరితే రామ తారక మంత్రం ఉపదేశించి దీక్షగా జపించమని ‘’నేను మీ వంశానికి గురు పీఠాదిపతిని .నీకు తారకం ఇచ్చి గురువు కూడా అయ్యాను .గురు దక్షిణ ఏమిస్తావు ?’’అని అడుగగా ‘’నా సర్వస్వం మీకు సమర్పించి మీ ఉచ్చిష్టం మాత్రమే తిని జీవిస్తాను ‘’అని సభక్తికంగా అంటే గురువు సంతోషించి ‘’నాకు అదేమీ వద్దు నిత్యం భూత దయతో ప్రవర్తించు చాలు ‘’అని హితవు చెప్పగా అలాగే ప్రవర్తిస్తానని ప్రమాణం చేశాడు రాం భొట్లు.

 తక్కెళ్ళ పాడు చేరిన రామ భొట్లు ను చూసి సంతోషించి మర్నాడు ఉదయం కొడుకును పిల్చి’’నాకు వయసు మీద పడు తోంది .నా చదలవాడ గ్రామాదికార పదవి తీసుకొని నాకు విశ్రాంతి ఇవ్వు ‘’అని కోరగా  సరే అని ,పూజాద్రవ్యాలతో ఆ ఊరిలోని శ్రీసీతారామాలాయానికి వెళ్లి స్వామిని అర్చించి, తీర్ధ ప్రసాదాలు తీసుకొని శివాలయానికీ వెళ్లి పార్వతీ పరమేశ్వరారాధన  చేసి ఇంటికి చేరి ఒక నిర్జన ప్రాంతం లో ఒక వస్త్రం పరచి దానిపై పక్షులకు ఆహారంగా వారి బియ్యం పోసి ,దాని చుట్టూ నీటి పాత్రలు పెట్టి ,దానికి కాపలా మనిషిని ఏర్పాటు చేసి రోజూ అలా చేశాడు .ఊర్లో అన్నం లేని బీద జనాలకు అన్నవస్త్రాలు ఇస్తూ భాగవత కాలక్షేపం చేస్తూ కాలం గడుపుతూ గొప్ప కీర్తి పొందాడు .

  శిధిల మైన చదలవాడ శివాలయం ప్రహరీ ధ్వజ స్తంభ ప్రతిష్టలు చేశాడు .చదలవాడ –పోతవరం దారిలో మద్దిరాలపాడు లో రెండు మంచి నీటి చెరువులను త్రవ్వించి ,తర్వాత పానకాల చెరువు ,రావలగుంట ,చిత్రచిత్ర గుంట,రామన చెరవు లింగాయ చెరువు అర్వగుంట చెరువులను బాగు చేయించి ఉపయోగం లోకి తెచ్చాడు .యాత్రికులకు కులమత విచక్షణ లేకుండా భోజన వసతి సౌకర్యాలు కల్పించాడు..చీర్వాన్ ఉప్పలపాటి నివాసి కుమ్మర వెంకటాద్రి మద్దిరాల గుడ్డి వీరడు అనే ఇద్దరు దొంగలు చౌదరిగారింట్లో సొత్తు దొంగిలించే ప్లాన్ వేశారు .చౌదరి గారి పెంకుటింటి కి పెంకు నేయిస్తుండగా ఈ దొంగలు కూలీలుగా పని చేస్తూ ,సాయంకాలం మండువాలో దాగి ,అర్ధరాత్రి అందరు నిద్రించే సమయంలో లోపలి ధనాగారం లోని నగా నట్రా దొంగిలించి ,ఎలాబయటపడాలో దారి తెలీక వెన్ను గాడి పై చేరగా ‘’గజ సింహ గమనుల ఖడ్గ తూణీ ధనుర్ధారుల శార్దూల విక్రమముల రాజ సింహుల –గుణరూప చేష్టితంబుల పరస్పర సమానుల  ,చారు చంద్ర ముఖుల ,రమణీయ మూర్తుల గమల పత్ర విశాల నయనుల సురభవ నంబు విడిచి –దరణికి వచ్చిన సురలకైవడి గ్రాలు వారి వీరుల భంగి వరలు వారి –రాజ భానులక్రియ దివ్య తేజము నహ –ర్నికాయ ము వెలిగి౦చు చున్నవారి –గ్రమతర కాక పక్ష ముల్ గలుగు వారి –మహిత కీర్తుల రామ లక్ష్మణుల జూచి ‘’ చౌదరి గారి సేవకులే వచ్చారేమో నని భావించి భయపడి వారి చేతుల్లో చావు తప్పదని నిర్ణయించుకొని ఇక జన్మలో దొంగతనం చేయమని శపథం చేసి కిందకి దిగి తప్పించుకొనే ప్రయత్నం చేస్తే అక్కడా ఇద్దరు మహా వీరులు కాపలా కాస్తూ ఉండటం చూసి ,ఇంటి సేవకులు దొంగలు దొంగలు అని కేకవేస్తే పట్టు బడ్డారు .చౌదరిగారు వారిద్దర్నీ ఏమీ అనకుండాఇచ్చి  రెండు రోజులకు సరిపడా గ్రాసం ఇచ్చి సత్కరించి పంపించారు .దొంగలకు రామ లక్ష్మణులు కనిపించటం అబ్బురంగా భావింఛి రామునితో ‘’ఎందరో ఇంద్రజాలకుల్ని చూశాను .కానీ నీలాంటి వారిని చూడలేదు –‘’గారడీ పెద్ద వీవు రాఘవా ‘’అని స్తుతించారు .వీరడి కూతురు మద్దిరాలలో ఇప్పటికీ ఉంది .వెంకటాద్రి భొట్లు గారు చనిపోయాక ఊరు వదిలి వెళ్లి పోయాడు

  గురువుగారికిచ్చిన మాట ప్రకారం భూత దయ పాటిస్తూ తూమాటి రామ భొట్లు చౌదరిగారు సార్ధక జీవితం గడిపి 70వ ఏట శ్రీరామ సన్నిధి చేరారు .

   సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -24-1-21-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం

సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం
సరసభారతి 155 వ కార్యక్రమంగా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 174వ ఆరాధనోత్సవ౦ పుష్య బహుళ పంచమి 2-2-21 మంగళవారం సాయంత్రం 6.30గం.లకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో నిర్వహింపబడుతుంది .ఆ సాయంత్రం 6గం లకు శ్రీ త్యాగరాజస్వామికి అష్టోత్తర పూజ జరుగుతుంది .అనంతరం స్థానిక ,ఇతర ప్రదేశాలనుండి,ఉత్సాహం గా పాల్గొనే గాయనీ గాయకులు ’’ శ్రీ త్యాగరాజ పంచ రత్న కీర్తనలు ’’ గానం చేస్తారు .ఇతర కృతులతో అలరిస్తారు .
అమరగాయకులు స్వర్గీయ ఘంటసాల వేంకటేశ్వరరావు,పద్మ విభూషణ్ డా .మంగళం పల్లి బాల మురళీ కృష్ణ ,ఇటీవలే మరణించిన పద్మ భూషణ్ శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం (బాలు )సంస్మరణ జరుగును .సాహిత్య ,సంగీతాభిమానులు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
పూర్తి వివరాలు తర్వాత తెలియ జేస్తాం .
<img class="j1lvzwm4" src="data:;base64, ” width=”18″ height=”18″ />
1
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 25-ప్రతాప కోటయ్య శాస్త్రి-2(చివరి భాగం )

మహా భక్త శిఖామణులు

25-ప్రతాప కోటయ్య శాస్త్రి-2(చివరి భాగం )

కోటయ్య శాస్త్రి గారు ఒకసారి భార్యతో భద్రాద్రి వెళ్లి సీతారామ దర్శనం తో పులకించి ,కొన్నాళ్ళు ఉండి ఒక రోజు గౌతమి స్నానం చేస్తుంటే  ,సికందరాబాద్ వ్యాపారి  ఒకాయన  దూడతో ఉన్న గోవు నుసద్బ్రాహ్మణుడికి  దానం చేయాలన్న సంకల్పం తో  ఉండగా శాస్త్రి గారు కనిపిస్తే ,గోదానం స్వీకరించమని కోరితే చిరునవ్వుతో అంగీకరించగా ద్రవ్యం తో సహా గోదానం చేసి ధన్యుడనయ్యానని ఆ వర్తకుడు సంతోషించాడు  . తనసమీపం లోనే కూర్చుని జపం చేస్తున్న ఒక బీద బాపని చూసి శాస్త్రిగారు వినయంగా చేతులు జోడించి ,తానెప్పుడూ ఊరు వదిలి తిరుగుతు౦టానుకనుక ,తన గోవును భరించి పోషణ చేయమని కోరి ఆ స్వర్ణ సురభిని ఆయనకు సదక్షిణగా సంర్పించగా ,భార్య మహాలక్ష్మమ్మ గారు ‘’మనమూ బీద వారమే .అయాచితంగా లభించిన సువర్ణ సురభిని ఇతరులకు అర్పించటానికి మీ మనసు ఎలా ఒప్పింది ?మీ నిర్లిప్తత మన కుటుంబానికి ముప్పు తెస్తోంది .ధన సంపాదన ఆలోచన లేకపోతె కుటుంబం ఆలో లక్ష్మణా అని అఘోరించాలి ‘’అని నిండా క్లాస్ పీకితే .చిరునవ్వుతో శాస్త్రీజీ ‘’హరి యందు జగములున్డును –హరి రూపము సాచు పాత్ర మందుండుశివం –కర మగు పాత్రము కలిగిన –నరయగ నది పుణ్య దేశ మనఘ చరిత్రా ‘’అన్న భాగవత పద్యం చదివి ‘’సత్పాత్రత ఎప్పుడూ లభించదు దొరికినప్పుడు సత్పాత్ర దానం చేయాలి ,సంతాన పోషణకు మనం కర్తలమా ?’’రక్షకులు లేని వారల-రక్షించచెద ననుచు జక్రి రాజై ఉండన్ –రక్షింప మనుచు నొకనరు –వక్షము ప్రా ర్ధింప నేల యాత్మజ్ఞులకున్’’అని ,’’జనకు౦డెవ్వడు జాతు డెవ్వడు ‘’అనేపద్యం –‘’చెలియా మృత్యువు చుట్టమే యముడు ‘’అని  మళ్ళీ పోతన గారి భాగవత పద్య౦  వినిపించి భార్యను సమాధాన పరచారు .కొన్ని రోజులు భద్రాద్రిలో గడిపి మళ్ళీ తన మన్నవ గ్రామానికి చేరారు .

  మహిమ గలవారుగా శాస్స్త్రి గారు కనిపించరు .కాని ప్రజలకు ఆయన అద్భుత శక్తి పై విపరీత విశ్వాసం ఉన్నది .ఒకసారి వల్లూరు జగన్నాధ రావు గారింట్లో కలశం పెట్టి నవరాత్రి పూజ చేస్తున్నారు .అప్పుడే శాస్త్రిగారు వస్తే ఆహ్వానించి భోజనం చేసి వెళ్ళమని యజమాని కోరాడు .ఇప్పుడే వస్తాను అని చెప్పి శాస్త్రి గారు వెళ్లి  యే వేళకూ రాకపోతే ,అప్పటిదాకా ఎదురు చూసి చెరువు స్నానానికి  వెళ్ళారేమో అని అక్క డేమైనా ప్రమాదం జరిగిందేమో అనే అనుమానం కలిగి కారణం నాగేశ్వరరావు అనే ఆయన్ను వెదకటానికి పంపారు .అక్కడ ఒక మరుగ్గా ఉన్న ప్రదేశం లో శాస్త్రిగారు కనిపించారు .ఆయన కళ్ళుమూసుకొని బాహ్య స్పృహ లేకుండా ధ్యానం లో ఉన్నారు .శరీరం నిండా గండు చీమలు పాకి నాయి .రావు గారు చూసి ఆశ్చర్యపోయి భయపడి ఆయన్ను పలకరించేధైర్యం లేక ,ఇంటికి వెళ్లి విషయం వివరించాడు .కాసేపటికి సమాధి నుంచి లేచి చీమలు దులుపుకొని గ్రామం లోకి చేరారు .ఇలా అంతర్ముఖులు అయ్యేవారు శాస్త్రి గారు .

  నిరపేక్షత ,సమత్వం ,సకలప్రాణులకు అన్నదానం  అనే భాగవత ధర్మాలను చక్కగా ఆచరించేవారు కోటయ్య శాస్త్రి .ఆయన వెంట ఎప్పుడూ కుక్కలు ఉండేవి .నిత్య సంతుష్టి నిత్య సంతోషం ఆయన లక్షణాలు .కాశ్యా౦తు మరణం ముక్తిఅని గ్రహించిన శాస్త్రిగారు చివరి రోజులలో కాశీలో గడపాలని గర్భవతి అయిన భార్యతో బయల్దేరి చేరి గంగాస్నానం  విశ్వేశ్వర దర్శనం చేసి కొన్ని రోజులుండి,త్రివేణీ సంగమం లో పవిత్ర స్నానాలు చేసి కొన్ని రోజులు ఉన్నారు .అయన వెంట వెళ్ళిన గ్రామకరణం పాండ్రంగి నాగేశ్వర రావు శాస్త్రిగారి అద్భుత శక్తి వివరించి  చెప్పారు .ప్రయాగలో ఒక కరోజు ఒంటరిగా లోతైన చోటుకు వెళ్లి ,మనుషులకు అందని నీటిపై తేలి ధ్యాన మగ్నులై ఉన్నారని ఎంతసేపటికీ రాకపోతే తానూ వెడితే ఆ దృశ్యం కనిపించిందని చెప్పాడు .బయటికి రాగానే అంతలోతుకు ఎందుకు వెళ్ళారని రావు ప్రశ్నిస్తే ‘’అక్కడ అసలు లోతే లేదు ‘’అని శాస్త్రిగారి జవాబు .

  త్రివేణీ సంగమం నుంచి గయ వెళ్ళారు .అక్కడ శాస్త్రి గారికి జ్వరం తగిలింది .నాలుగవ రోజు భార్యతో ‘’నేను ఈ శరీరం వదిలేస్తాను. విచారించకు.నీకు కూతురు పుడుతుంది  ‘’అని చెబూతూ ఉండగానే  బ్రహ్మ రంద్ర చేదన జరిగి పుణ్యాత్ముడు నిరీహుడు నిత్య సంతోషి శ్రీ ప్రతాప కోటయ్య శాస్త్రి గారు 1896గంగా పుష్కరాలకాలం లో నలభై రెండవ ఏట పరంధామ సన్నిధిని చేరారు .భార్యాపిల్లలు మన్నవ గ్రామం తిరిగి వచ్చారు .శాస్త్రిగారికి ఇద్దరుకొడుకులు ఒక కుమార్తె .ఇలాంటి పరమ యోగిని గురించి ఇంతకు  ముందు మనం విని ఉ౦డలేదు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-1-21-ఉయ్యూరు ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 25-ప్రతాప కోటయ్య శాస్త్రి-1

మహా భక్త శిఖామణులు

25-ప్రతాప కోటయ్య శాస్త్రి-1

గుంటూరు జిల్లా బాపట్లతాలూకా నాగండ్ల లో ప్రతాప కోటయ్య శాస్త్రి పుట్టాడు. తండ్రి జోగయ్య  శాస్త్రి .బాల్యం నుండి వైరాగ్య భావనతోనే ఉండేవాడు.వీధి బడిలో కొంతకాలం చదివినా చదువేమీ అబ్బలేదు .ఉపనయనం అయింది వేదం చదివాడో లేదో కూడా తెలీదు .దేనిపైనా ఆపేక్షా భావం లేదు .వినయ, సమత్వం మాత్రం అబ్బాయి .వ్యవసాయం మీదనే కుటుంబం గడుపుతోంది .పొలం పనులకు వెళ్ళినా పండించాలన్న ఆలోచన ,ఉత్సాహం పంటను చూసి ఆనందం ఏమీ ఉండేవి కావు .మెట్టపంటలే కనుక పండిన మొక్కజొన్న, జొన్న లను దారిన పోయే వారిని పిలిచి ఇచ్చేవాడు .పంటను పశువులు మేసినా పక్షులు వాలి తినేసినా పట్టేది కాదు .తమ పొలం వలన జీవ రాశులు బతుకుతున్నాయని సంతోష పడేవాడు .తల్లిదండ్రులు కోపించినా ఉదార బుద్ధి మారలేదు .

  కొటయ్యకు ఇరవై ఏళ్ళు వచ్చాయి. గొల్లపూడికి చెందిన కూరపాటి వెంకట్రాయుడు కూతురు మహాలక్ష్మమ్మ నిచ్చి పెళ్లి చేశాడు .కోడలు కాపురానికి వచ్చే సమయం రాగానే కొడుకుతో తండ్రి సోమరిగా ఉంటె సంసారం గడవదు కనుక ఎక్కడికైనా వెళ్లి డబ్బు సంపాదించుకొని రమ్మని చెప్పి కోటయ్య ను పంపాడు .డబ్బు సంపాదనకోసం ఆ రోజుల్లో అందరూ నైజాం పోవటం అలవాటు కనుక కోటయ్య కూడా నైజాం వెళ్ళాడు .సికందరాబాద్ సత్రం లో ఒక రాత్రి గడిపి ,మర్నాడు వీధుల్లో తిరుగుతుంటే ,గుర్రం నారాయణ అనే ధనవంతుడికి తీవ్రంగా జబ్బు చేసి ,ఎంతమంది డాక్టర్లు వచ్చి చూసి మందులు ఇచ్చినా తగ్గలేదు .అతనికుటు౦బ౦ ఆశ వదిలేసుకొన్నది .ఆ ఇంటి దగ్గర వచ్చే పోయే జనం తో మహా సందడిగా ఉంది .అందరితోపాటు కొటయ్యకూడా లోపలి వెళ్లి చూశాడు .కోటయ్య గొప్ప వైద్యుడనుకొని రోగి బంధువు ఈయన్ను మందు ఇవ్వమని కోరాడు .వైద్యం లో తనకు ఏమాత్రం ప్రవేశం లేదని నెత్తీ నోరూ మొత్తుకున్నా వినలేదు .తప్పని సరి పరిస్థితులలో దేవుడిపై భారం వేసి కోటయ్య శాస్త్రి ,తన దగ్గరున్న అక్షతల కుప్పె ను నీటిలో ఆరగ దీసి అదే సంజీవ తీర్ధం గా పని చేయాలని భగవంతుని ప్రార్ధించి రోగి నోటిలో పోశాడు .అక్కడే మూడు రోజులుండి తీర్ధమిచ్చాడు .నారాయణ కు స్వస్థత కలిగి ఆయనకు ఆయన బంధు మిత్రులకు కోటయ్య పై అమితమైన భక్తీ శ్రద్ధ కలిగాయి. నారాయణ గారి జబ్బు పూర్తిగా తగ్గాక వైద్య నారాయణ కోటయ్య శాస్త్రిని సత్కరించాలనుకొని ఆయనకు ఏం కావాలో కోరుకో మన్నాడు .ఏ రకమైన ధనా పేక్షా లేని శాస్త్రి తనను  కాశీ కి పంపమని కోరాడు.

  కోటయ్య అల్ప సంతోషానికి ఆశ్చర్యపడి నారాయణ అలాగే కాశీకి పంపి,కొంత డబ్బును కోటయ్య తండ్రికి పంపాడు ,కాశీ చేరి పరమపావని  గంగానదిలోని మణికర్ణిక ఘాట్ లో  పుణ్య స్నానం చేసి ,విశ్వేశ్వర సందర్శనం తో పులకించి నిత్యం అర్చిస్తూ ,తనకు ఈబాగ్యం కల్పించిన తండ్రికి  గుర్రం నారాయణకు కృతజ్ఞతలు చెబుతూ అన్నపూర్ణ సత్రానికి చేరాడు .అక్కడే ఉంటూ నిత్య గంగాస్నానం విశ్వేశ్వర దర్శనం తో కొన్ని నెలలు గడిపాడు .

  ఒక రోజు శ్రీ బాల సరస్వతి స్వామి కోటయ్య శాస్త్రి యోగ్యతను గుర్తించి ‘’నాయనా !నువ్వు దేవి అనుగ్రహానికి పాత్రుడవయ్యావు ‘’అని చెప్పి ,తన ఆశ్రమానికి తీసుకు వెళ్లి శ్రీ త్రిపుర సుందరి మహామంత్రం ఉపదేశించి అంగన్యాస కరన్యాసాలతో అభ్యాసం చేయించాడు .సద్గురు కటాక్షం వలన కోటయ్య కు మంత్రం సిద్ధి యోగ సిద్ధి కలిగాయి .పూర్వం కంటే అతి విరాగియై భక్తీ పెరిగి కొన్నేళ్ళ తర్వాత స్వగ్రామం రావటానికి ప్రయత్నం చేశాడు .కోటయ్య ఏమయ్యాడో అని తలిదండ్రులు అత్తమామలు అన్వేషణ సాగించారు .కోతకాలం తర్వాత కోటయ్య శాస్త్రి తండ్రి కోరినట్లు ధనంతో కాకుండా భక్తిజ్ఞాన ధన సంపన్నుడై ఇంటికి వచ్చి అందరికే పరమానందం కలిగించాడు .మామగారు తన ఇంటికి తీసుకు వెళ్ళాడు .ప్రపంచానికి పనికి వస్తాడు అని అతని శీల సౌశీల్యాదులను మెచ్చినా అసంతృప్తి తో ఉన్నాడు .

  భార్య కాపరానికి వచ్చినా కోటయ్య తామరాకు పై నీటి బొట్టు గానే ఉన్నాడు .అత్యంత నిష్టా గరిష్టుడైనాడు .వైరాగ్యం పెరిగిపోయింది .మొదటి కొడుకు పుట్టాడు.జన్మ నక్షత్రం మంచిది కాకపోవటం చేత శాంతి చేయాల్సి వచ్చింది .చేతిలో చిల్లిగవ్వ లేదు అధైర్యపడకుండా కాకుమానుకు చెందిన మాజేటి శేషయ్య అనే వర్తకు డి దగ్గరకు వెళ్లి నలభై రూపాయలు అప్పుగా ఇమ్మన్నాడు .తిరిగి తీర్చే స్తోమత అతడికి లేదని తెలిసి డబ్బు ఇవ్వలేదు .ఏమీ మాట్లాడకుండా గొల్లపూడి వెళ్ళాడు .శేషయ్య యధాప్రకారం ఆ సాయంత్రం శివాలయం కి వెళ్లి ఈశ్వర దర్శనం చేసి గుడి ముందు కాసేపు కూర్చున్నాడు .లోకోత్తర సౌందర్యవతి అయిన ఒక యువతి కనిపించి ‘’నా భక్తుడికి నలభై రూపాయలు అప్పు ఇవ్వనన్నావా ?’’అని అదృశ్యమైంది .ఆమె శాస్త్రిగారు ఉపాసించే లలితా పరమేశ్వరి  అమ్మవారు అని గ్రహించి శేషయ్య ,మర్నాడు ఉదయం కోటయ్య ఇంటికి వెళ్లి ‘’శాంతికోసం యెంతకావాలి శాస్త్రి గారూ ??’అని అడిగితే అ విషయాలేమీ తెలీని శాస్త్రి యాభై మందికి సరిపడా సామగ్రి కావాలి ‘’అని చెప్పగా  ఆ సామగ్రిని శాంతి నాటికీ గొల్లపూడికి చేర్పిస్తానని షావుకారు కోటయ్యకు  చెప్పి వెళ్ళాడు .

  అసలే ఉదా సీనంగా ఉండే కోటయ్య ,శేషయ్య పంపిస్తాడనే నమ్మకం కూడా ఉండటం తో ఏ ప్రయత్నమూ చెయ్యలేదు .శేషయ్య తానిచ్చిన వాగ్దానం మరచికోర్టు పనులతొందరలో  బాపట్ల వెళ్ళాడు .అందరూ మర్చిపోయినా అమ్మవారు మాత్రం మర్చిపోకుండా శేషయ్యకు గుర్తు చేసి’’వెంటనే వెళ్లి నీ వాగ్దానం తీర్చు ‘’అని ఆజ్ఞాపించింది .తనకేసు వాయిదా కోరామని ప్లీడరుకు చెప్పి ఆఘమేఘాలమీద ఇంటికి వెళ్లి ఆరాత్రే ధాన్యం దంపించి ,కావలసిన సామానుతో తానే బండీ లో సర్ది తెల్లవారే లోపు గొల్లపూడి బయల్దేరాడు .కోటయ్యగారు బ్రాహ్మణులను పిలవటానికి ఊళ్లోకి వెళ్ళాడు. ఇంతతంతు జరిపించే స్తోమత లేని కోటయ్య భార్యా వగైరా కాలూ చేయీ ఆడక అటూ ఇటూ ఇటూ తిరుగుంటే శేషయ్య బండీ సామానుతో దిగాడు. హమ్మయ్య అనుకోని ఊపిరి పీల్చుకున్నారు అందరూ .ఊరంతా తిరిగి కోటయ్య ఆలస్యంగా కొంపకు చేరాడు .శాంతి మాత్రం పూర్తయింది. బ్రాహ్మణ భోజనాలు జరగాలి .రెండు వందలమంది బ్రాహ్మణులు వచ్చారు. వంట మాత్రం యాభై మందికే చేయించారు. కోటయ్య గారి ఇల్లు నిప్పచ్చరంగా ఉండటం చూసి శేషయ్య ‘’ఎక్కడికైనా వెళ్లి బియ్యం తెమ్మంటారా ?’’అని కోటయ్య ను అడిగితే ఒక నవ్వు నవ్వి ‘’భయం లేదు అందరికీ సరిపోతుంది ‘’అని చెప్పి లోపలి వెళ్ళాడు .బ్రాహ్మణులు వరుసగా భోజనాలకు కూర్చున్నారు.వండిన పదార్ధాలు చాలవేమో అభాసు పాలౌతామేమో అని అనుమానిస్తూ విస్తళ్ళు వేయలేదు  కోటయ్య శాస్త్రి అన్నం రాశిని ఒక సారి చూసి ,తలూపి తనకు శాంతి పీటలపై అత్తవారు పెట్టిన కొత్త వస్త్రాన్ని నేతిగిన్నేలో ముంచి అగ్ని హోత్రం లో వేశాడు .హవ్యవాహనుడు సంతృప్తి చెందాడని కోటయ్యగారు సంతోషించారు .ఈ వెర్రి బాపని చూసి అందరూ నవ్వు కొన్నారు .కోటయ్య ఇదేమీ పట్టించుకోకుండా అమ్మవారికి అన్నపు రాశి నైవేద్యం పెట్టి మంత్రపుష్పం చెప్పి ‘’వడ్డన మొదలు పెట్టండి ‘’అని ఆనతిచ్ఛి తాను  అన్నం రాశి దగ్గరే నిలబడి పళ్ళాలనిండా అన్నం తోడి వడ్డించే వారికి అందించారు .యాభై మందికి మాత్రమె చేసిన పదార్ధాలు అందరికీ సంతృప్తిగా వడ్డించినా ఇంకా చాలా మిగిలిపోయి అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేసింది .కోటయ్య శాస్త్రిగారి భక్తీ మహాత్మ్యం అమ్మవారికి ఆయనపై ఉన్న అనుగ్రహం అందరూ ప్రత్యక్షం గా చూసి అప్పటి నుంచి ఆయన్ను ఆరాధనా భావంగా చూశారు .శేషయ్య కూడా సంతోషించి తన ఊరు వెళ్ళాడు.

  ఇంతటి నిర్లిప్తంగా ఉన్నా ,ద్వాదశి వ్రతం చేస్తూ ప్రతినెలా  ద్వాదశినాడు బ్రాహ్మణ సమారాధన చేసేవారు .తనకు నచ్చిన గృహస్తు నడిగి సంబారాలు తెచ్చి చేసేవాడు .ఈయన ముఖం చూసి లోభి కూడా ఉదారంగా సాయం చేసేవాడు .విద్య లేదు శాస్త్రజ్ఞానం లేదు డబ్బు లేదు వేష భాషలు ఆడంబరం ఏవీ లేకపోయినా  కోటయ్యను మహానుభావుడుగా భావించి ఆదరించేవారు ఊరిజనం .కొంతకాలానికి మన్నవ గ్రామ చేరారు అక్కడ బ్రాహ్మణ కుటుంబాలు ఎక్కువ .అందరూ వేదాధ్యయన సంపన్నులు కర్మిష్టులే ,అతిధి అభ్యాగత సేవా తత్పరులే .కోటయ్య శాస్త్రిగారిని ఆఊరి బ్రాహ్మణ్యం అత్యంత గౌరవాదరాలతో ఆహ్వానించి  ఘనంగా సత్కరించారు.తాను  నివసించటానికి ఇదే తగిన ఊరు అని నిశ్చయించి అక్కడే ఉండిపోవాలనుకొన్నారు .నిత్యం ఎవరో ఒక గృహస్తు పిలిచి భోజనం పెట్టి ఆతిధ్యమిచ్చేవాడు .

  కొన్ని నెలలు మన్నవ గ్రామం లో ఉండి,ఒక రోజు సప్తాహం చేయాలనే సంకల్పం కలుగగా బ్రాహ్మణ్యానికి  తెలిసి .ధాన్యరూపంగా చందాలు వేసుకొని కొంత ధాన్యం పోగేశారు .పూర్తిగా ధాన్యం సమకూరే దాకా ఉండలేకకోటయ్య శాస్త్రిగారు సప్తాహం మొదటి రోజు నుంచే అన్న సమారాధన ప్రారంభించారు .సప్తాహం పేరుతొ దీర్ఘ అన్నసత్రం జరిగింది .శాస్త్రి గారి మహత్తు గ్రహించి ఆయన భార్యాపిల్లల్నీ పిలిపించి మంచి ఇల్లు ఏర్పాటు చేసి కావలసిన జీవనం కల్పించారు .కుటుంబం ఇక్కడే ఉన్నా శాస్త్రిగారు గ్రామగ్రామం తిరుగుతూ ద్వాదశి సమారాధన మాత్రం నిరాటంకంగా సాగించేవారు .నల్లగా ఎత్తుగా లావుగా ఉండే శాస్త్రిగారు ప్రతి రోజూ ఉదయమే తటాక స్నానం చేసి  ,ఒడ్డున  కనులుమూసి ధ్యానమగ్నులై జపం చేసేవారు.అన్నికాలాల్లో అది క్రమ తప్పని విధి విధానం ఆయనది .చిన్న అన్గోస్త్రం లేక గోచి అదీ లేకపోతె దిగంబరంగా బాహ్య స్పృహ లేకుండా ధ్యానం లో గడిపేవారు .బీదవారు కనిపిస్తే తనకొల్లాయి గుడ్డ వారికిచ్చి దిగంబరం గా ఉండిపోయేవారు అంతటి నిరీహులాయన .ఆయన యోగ్యత గుర్తించి ఎవరైనా వస్త్రాలు ఇచ్చినా పేదలకే పంచి పెట్టేవారు .చీమలపుట్ట ల వద్ద బియ్యం చల్లేవారు కోపతాపాలకు కాదు దురాశ లేదు .ఉదార గుణ గరిష్టుడు .

 ఒక రోజు కొందరు బ్రాహ్మణులతో ఇంటికి వచ్చి భార్యను వంట అయిందా అని అడిగితె వండటానికి కొంపలో ఏమున్నాయి అని అనగా బ్రాహ్మణులని  చెరువుకు వెళ్లి  స్నానం చేసి రమ్మని పంపించి ,తనకు పరిచయమున్న మన్నవ బాపయ్య గారింటికి వెళ్లేసరికి రెండు జాములైంది .ఈయన వాలకం చూసి భోజనం చేసినట్లు లేదని గ్రహించి అడిగితె తన ఇంటికి నలుగురు బ్రాహ్మణులు వచ్చారు వారికి పెట్టకుండా ఎలా తింటాను అనగా మూడు తవ్వల బియ్యమిచ్చి పంపిస్తే ఇంటికి వెళ్లి భార్యకిచ్చి అన్నం వండించి చుట్టుప్రక్కల ఇళ్ళకు వెళ్లి పచ్చళ్ళు తెచ్చి  ఆబ్రాహ్మణులకు భోజనం పెట్టారు .ఇంట్లో ఏమీ లేకపోయినా దారిన పోయే బ్రాహ్మణులను పిలిచి ఏదో విధం గా భోజనం పెట్టేవారు కోటయ్య శాస్త్రి.

  సశేషం

మీ-గబ్బిట  దుర్గాప్రసాద్ -21-1-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి -3(చివరిభాగం

 

మహా భక్త శిఖామణులు

24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి -3(చివరిభాగం )

   కంచి వరద రాజ స్వామి సేవలో నిండా మునిగి ఉన్న సమయం లో ,శ్రీరంగం లోని శ్రీ రంగ నాథ స్వామి తనకు వెంకటాద్రి స్వామి సేవలు కావాలని అభిలషించాడు .ఒక రోజు స్వామికలలో కనిపించి తనకున్న అత్యంత విలువైన వజ్రకిరీటం దెబ్బతిన్నదని దాని స్థానం లో కొత్త కిరీటం తయారు చేయించే బాధ్యత వెంకటాద్రి స్వామి ఈ తీసుకోవాలని ఆదేశించాడు .ఆ కిరీటం కొలతలేమితో మన స్వామికి తెలియదు .ఏమి చెయ్యటానికీ పాలుపోక వరదరాజస్వామి పైనే భారం వేసి ,ఒక నమూనా కిరీటం తయారు చేయింఛి శ్రీరంగం తీసుకు వెళ్ళారు .తిరుక్కావేరిలో పవిత్ర స్నానం చేసి శ్రీరంగని దర్శించటానికి ఆలయానికి వెళ్ళారు .ఆలయం లో కోవిలన్నన్, భట్టార స్వామి మొదలైన ప్రముఖులు ఘన స్వాగతం ఇచ్చి స్వామి సన్నిధికి తీసుకు వెళ్ళారు .ఆలయం లో రంగనిపైనా ,అమ్మవారి  పైనాపున్నాగ వరాళి రాగం లో ‘’నిన్ను కోరియున్నా ‘’ కీర్తన రాసి పరవశంతో గానం చేసి ,తను తెచ్చిన మోడల్ వజ్రకిరీటాన్ని శ్రీరంగనికి సమర్పించారు  .ఆశ్చర్యంగా ఆయనకు సరిగ్గా చక్కగా సరిపోయి అందరికీ అద్భుతమని పించి వెంకటాద్రి స్వామి దైవభక్తికి ముగ్ధులయ్యారు .ఈ సంఘటనతో వెంకటాద్రి స్వామి కీర్తి శ్రీరంగం తో సహా అన్ని ప్రాంతాలలో మిన్న౦టి౦ది.

 పాండ్య కిరీటం తయారీకి పూనుకున్న వెంకటాద్రి స్వామి దానికి కావలసిన ధనం కోసం ప్రయత్నిస్తూ ,రోజుకు కనీసం పది రూపాయల విరాళమైనా రాకపోతే నిరాహార దీక్ష చేస్తానని నిర్ణయం ప్రకటించారు .విరాళాలు రాని రోజున డేర్ హౌస్ వెంకటస్వామి నాయుడు ,పుదుచ్చేరి అప్పాస్వామి నాయుడు తామే పది రూపాయలు సమర్పిస్తూ స్వామి కి నిరాహార దీక్ష శ్రమ కలగకుండా చేశారు .విరాళాల వెల్లువ సాగగానే ,పాండ్య కిరీట నిర్మాణ పనులు మొదలు పెట్టారు స్వామి .ఈ కిరీటానికి అమర్చటానికి  సరిపడే మరకత౦ అనే  పచ్చ రాయి కావాల్సి వచ్చి ,ఎక్కడ దొరుకుందా అని నిర్వేదం లో పడిపోయారు వెంకటాద్రి స్వామి .ఒక రోజు రాత్రి స్వప్నం లో స్వామి దర్శనమిచ్చి పాండ్యకిరీటానికి సరిపోయే ఎమరాల్డ్ కలకత్తా లో మాధవ సేట్ వద్ద ఉన్న ఇనుప బీరువాలో ఉత్తర మూల ఉన్నది అని తెలియ జేశారు .వెంకటాద్రిస్వామి భక్తుడు సహాయకుడు  కాశీదాస సావుకార్ కలకత్తాలోని మాధవ సేట్ కు ఉత్తరం ద్వారా విషయం తెలియ జేశాడు .ఉత్తరం చదివిన మాధవ సేట్,,తన బీరువాలో వెదికితే ఉత్తరం లో సూచించిన  చోటులోనే పచ్చ కనపడగా మహాదాశ్చ పడి తన తండ్రి తనకు తన కుటుంబ సభ్యులకూ ఎవరికీ తెలియకుండా దాన్ని అలా దాచి ఉంచటం భగవల్లీల అని భావించాడు .వెంటనే ఆమరకతాన్ని ,దానితో పాటు తన విరాళం గా వెయ్యి రూపాయలను మద్రాస్ పంపాడు .

  కిరీటం తయారు చేస్తున్న కంసాలి దురాశతో  విలువైన ఆ మరకతం  దాచేసుకొని సామాన్య రాయి అమర్చి తయారు చేశాడు .వెంకటాద్రి స్వామికలలో శ్రీరంగడు ప్రత్యక్షమై జరిగిన తప్పు చెప్పాడు .శిష్య బృందంతో ఆ కంసాలి ఇంటికి వెళ్లి గదమాయిస్తే ముందు అంతా అబద్ధం అని బూకరించి ,వెంకటాద్రిస్వామి శిష్యుడు అప్పా స్వామిరాజు వాడిని వీర బాదుడు బాదితే ,తప్పయిపోయిందని లెంపలేసుకొని క్షమాపణ కోరి ఆ అసలు పచ్చ రాయిని అప్పగించాడు .నకిలీ రాయిని తీసేసి అసలు మరకతాన్ని అందులో బిగి౦ప జేసి , శ్రీ రంగానికి  శిష్యులతో సహా తీసుకు వెళ్ళారు .1863 రుధిరోద్గారి సంవత్సర మార్గశిర శుద్ధ ఏకాదశి అంటే పరమ పథ ఏకాదశి అనగా ముక్కోటి ఏకాదశినాడు రంగరంగ వైభవంగా శ్రీరంగానాథునికి పాండ్య కిరీటం అమర్చారు  .

  చేయించే భక్తులు తేరగా దొరికితే రంగడికి కొదవేముంది .మళ్ళీ వెంకటాద్రి స్వామి కలలో కనిపించి మకరకుండలాలు చేయించమని ఆజ్ఞ జారీచేస్తే చెన్నై నగర వాసుల విరాళాలతో అలాగే చేయించి స్వామికి 1867 ప్రభవ సంవత్సర నవమి నాడు సమర్పించారు . అయిదు శిఖరాలతో బంగారు విమానాన్ని నెల్లూరు శ్రీ రంగ నాద స్వామి పునరుద్ధరణ పనులలో చేయించి అర్పించారు శ్రీ వెంకటాద్రి స్వామి .అలాగే తిరుక్కూడాల్ మల్లై స్థలశయన పెరుమాళ్,తిరు విదా విందై తాయార్ ,ఆండాళ్ దేవాలయాల జీర్ణోద్ధారణ కూడా దగ్గరుండి జరిపించారు వెంకటాద్రి స్వామి .

  వృద్ధాప్యం మీద పడుతుంటే శ్రీరంగంలోనే ఉండి,శ్రీరంగనాధ స్వామి సేవలో అందునా ,స్వయంగా తానే సానమీద గంధం నూరి చందనాలంకారం చేసేవారు .అతిరస ,వడ సురులమూడు ,పాలమూడు ప్రసాదాలు తానే వండి స్వామికి నైవేద్యం పెట్టేవారు వెంకటాద్రి నిత్యమూ .శ్రీరంగ నాచియార్ కు అరవన ప్రసాదం చేసి నిత్య నైవేద్యం పెట్టె ఏర్పాటు కూడా వెంకటాద్రి స్వామియే చేశారు .ఈ సేవలన్నీ నిరాటంకంగా జరగటానికి స్వామికి 25.35ఎకరాల మాగాణి ,రెండు మనాల మెట్ట భూమి 5,050 రూపాయలకుతిరుప్పరై తురి గ్రామం లో  కొన్నారు వెంకటాద్రి .ఆలయ ధ్వజస్తంభం పై ఈ వివరాలన్నీ చెక్కించారు .రంగ నాచియార్ కు కిరీటం చేయిస్తుండగా గోవర్ధనం రంగాచారి అనే మహాత్ముడు వచ్చి అమ్మవారిని దర్శించగా అక్కడి అధికారులు అర్చకలు అందరూ ఆయనను అమ్మవారి కిరీటం తయారీలో సాయం చేయమని కోరగా ,సరే అని చెప్పి కొన్ని నెలలలోనే తయారు చేయించి పంపించి వెంకటాద్రిగారి కోరిక తీర్చారు .మధుర దగ్గర తిరుమలిం చోరి సోమ చంద్ర విమానం పనులు ,పాండ్య నాడు దివ్య దేశ౦ పనులు కూడా చేశారు వెంకటాద్రి స్వామి .

  72 వ ఏట 1864 రక్తాక్షి సంవత్సర౦ లో వెంకటాద్రి స్వామి సన్యాసం స్వీకరించారు .త్రిదండం,కాషాయ  వస్త్రాలు ధరించి ‘’తిరు వెంకట రామానుజ జియ్యర్ ‘’అయ్యారు ..స్వామి సేవ తప్ప ఇతర వ్యాపకాలు లేకుండా జీవితాన్ని ధన్యం చేసుకొన్నారు వెంకటాద్రి స్వామి .ఈయన ప్రేమ ఆదరణ పొందిన మహా మహులలో 1866-1872 లోస్వామి గొప్పతనాన్ని తెలుసుకొని  సందర్శించిన మద్రాస్ గవర్నర్ లార్డ్ ఫ్రాన్సిస్ నేపియర్స్ ఉన్నాడు .గొప్ప వారు వచ్చినా  ఆయన ఏమాత్రమూ తన సేవ తపస్సు ధ్యానం నుంచి బయటికి వచ్చేవారు కాదు .జీవిత చరమాంకం లో శ్రీరంగం లో శ్రీరంగని సేవలో పూర్తిగా గడిపారు వెంకటాద్రి జియ్యర్ స్వామి .ఇహ జీవితం చాలించాలనే ఇచ్ఛ గాఢ మవగా రంగడు కలలో కనిపించి ,ఆయన సాయుజ్యానికి సమయం వగైరాలన్నీ చెప్పి అందరికీ తెలియ జేయించాడు .

  1877ధాతు నామ సంవత్సర సప్తమి సోమవారం అర్ధ రాత్రి అష్టాక్షర మంత్రం జపిస్తూండగా ,దివ్య జ్యోతి వెంకటాద్రి స్వామి వారి శిరస్సును చీల్చుకొని వెలువడి పరమాత్మలో కలిసిపోయింది .శ్రీరంగం దేవాలయం మహాత్మా వెంకటాద్రి స్వామివారి పార్ధివ దేహానికి విధి విధానంగా అంత్యక్రియలు నిర్వహించింది .ఈనాటికీ ఉత్సవాల సందర్భం లో రంగ నాయక దంపతులకు వెంకటాద్రి స్వామి తయారు చేయించిన కిరీటాలు అలంకరించి ఊరేగింపు జరుపుతారు .స్వామివారి ప్రసాద తీర్థాలను వెంకటాద్రి స్వామి వారి బృందావనానికి ఊరేగింపుగా తీసుకొని వెళ్లి సమర్పి౦చి మళ్ళీ ఆలయానికి చేరుస్తారు. కావేరీ నదీ తీరం లో అలవందార్ పడిత్తు రాయి లో వేంకటాద్రి స్వామి వారి స్మారక విగ్రహం ఏర్పాటు చేశారు .1977లో శతజయంతి ఉత్సవాలు ఘనం గా జరిపారు .నలనామ సంవత్సర మాఘ మాసం 28వ రోజు 11-3-77 వెంకటాద్రి స్వామి దివ్య తిది నిర్వహించారు .2006నుంచి మద్రాస్ ,లోకూడా ఆరాధన ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు  .ఆంధ్ర దేశం లో అందునా ఉత్తర కృష్ణాజిల్లా  జుజ్జూరు దగ్గర అల్లూరు లో జన్మించిన ఆలూరి వెంకటాద్రి  శ్రీ వెంకటాద్రి జియ్య౦గార్ గా  కీర్తిశిఖరాలు అందించి నిత్యం భవత్ దర్శనం తో తరించి స్వామి అడిగినవన్నీతయారు చేయించి కట్టు దిట్టమైన పూజ కైంకర్యవ్యవస్థ  ఏర్పాట్లు చేసి న దివ్య పురుషులు .

  సశేషం

మీ -గబ్బిట  దుర్గాప్రసాద్ -20-1-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి -2

మహా భక్త శిఖామణులు

24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి -2

భక్తులు వెంకటాద్రి ని  ఆయన తిరునామాలు ,కుడి చేతిలో తంబురా,ఎడమ చేతిలో తాళాలు ,పారవశ్యం తో కీర్తనలు గానం చేస్తుంటే స్రవించే  ఆనంద పరవశంగా వచ్చే ఆనంద బాష్పాలు  చూసి ‘’ శ్రీ వెంకటాద్రి స్వామి’’ అని భక్తితో పిలవటం ప్రారంభించారు .ఒకసారి వరదరాజస్వామి వెంకటాద్రి కలలో కన్పించి ,తనకు  వజ్ర కిరీటం చేయించి అమర్చమని ఆదేశించాడు .దీనికి చాలా డబ్బు ఖర్చు అవుతుదికనుక భూరి విరాళాలు సమర్పించే దాతలకోసం1835మన్మధ నామ సంవత్సర వైశాఖ శుద్దనవమి  నాడు మద్రాస్ వెళ్ళారు స్వామి .కైరవానిలో స్నానించి ,శ్రీ పార్ధ సారధి స్వామిని దర్శించి కామాస్ రాగం లో ‘’పార్ధసారధి పదభజన  చేయవే మనసా ‘’కీర్తన కూర్చి ఆర్తిగా పాడారు.ఈ ఆలయ అర్చకుడు శ్రీ షోల సింహపురం శేషా చార్య కు అతిధిగా ఉన్నారు .స్వామి వ్యక్తిత్వం అక్కడి వారు బాగా గ్రహించి వరదరాజ స్వామి వజ్ర కిరీటం కోసం విరాళాలు కురిపించారు .అర్చకస్వామి స్వయంగా 500 రూపాయలు సమర్పించగా ,కంచికి చెందిన వెంకట రంగం పిళ్ళై సుమారు పది తులాల స్వచ్చ బంగారం అందించాడు .అనుకున్న దానికంటే తక్కువ సమయం లోనే ధనం సమకూరటం వలన వెంకటాద్రి స్వామి పేరు ప్రఖ్యాతులు మద్రాస్ లో విశేష వ్యాప్తి  చెందాయి .

  వజ్ర కిరీటం  తయారవగానే మద్రాస్  పురవీధులలో,సెవెన్ హిల్స్ ప్రాంతం లో  ఊరేగించి,కంచికి చేరి ,తెల్లగొడుగు,ధ్వజం మేళతాళాలతో వేలాది పురజనులతో ఊరేగింపు జరిపి కనువిందు చేకూర్చారు .1858 కాళయుక్తి నామ సంవత్సర వైశాఖ పౌర్ణమి నాడు గరుడ సేవ రోజున శ్రీ కంచి వరద రాజ స్వామికి వజ్రకిరీటాన్ని సకల లాంచనాలతో అమర్చారు .ఆ సమయం లో వెంకటాద్రి స్వామి ఆనంద నృత్యం చేస్తూ ,కమాస్ రాగం లో ‘’నిగమ గోచరా స్వామీ ‘’ మధ్యమావతి రాగం లో ‘’పక్షి వాహనా స్వామీ ‘’కీర్తనలు రాసి సుమధురంగా గానం చేసి ధన్యత చెందారు.ఈనాటికీ ఆ వజ్రకిరీటాన్ని వెంకటాద్రి స్వామి సమర్పిత౦ గా భక్తులు చెప్పుకొంటారు .ఆ రోజు రాత్రి స్వామి స్వప్నం లో శ్రీ దేవి, భూదేవి కనిపించి తమకూ అలాంటి కిరీటాలే చేయించి పెట్టమని కోరారు .అచిరకాలం లోనే వారి కోరిక తీర్చారు వెంకటాద్రి స్వామి .వరదరాజ, శ్రీ దేవి భూదేవులు నగర వీధులలో ఊరేగింపు గా వజ్రకిరీటాలతో జగజ్జేగీయమానంగా ఊరేగుతుంటే జనాలకు చూడటానికి రెండు కళ్ళు చాలలేదు .ఆశోభకు కారణం వెంకటాద్రి స్వామియే.

  ఇంతటి అంకిత భావం తో పెరుమాళ్ళ సేవ చేస్తున్న వెంకటాద్రి స్వామి సేవలకు తగిన ప్రతిఫలం ఇవ్వాలని శ్రీ దేవరాజ స్వామి భావించి ,అర్చకత్వ విధానం సాంప్రదాయ బద్ధం గా నిర్వహించటానికి ఆచార్య అంగీకారుని గా చేయాలని భావించాడు  .వరదరాజ స్వామి వెంకటాద్రి స్వామి స్వప్నం లో దర్శనం అనుగ్రహించి ,వైష్ణవ సంప్రదాయ బద్ధమైన పంచ సంస్కారాలు పొందమని ఆదేశించాడు .స్వామి ఆజ్ఞా పాలనా నిమిత్తం కంచిలోని మనవాళ్ళ జీయర్  స్వామి ని దర్శించి సమాశ్రయనం అంటే పంచ సంస్కారాలు పొందారు .శ్రీ వెంకటాద్రి స్వామి .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-1-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సంగీత సద్గురుత్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం

సంగీత సద్గురుత్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం

సరసభారతి 155 వ కార్యక్రమంగా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 174వ ఆరాధనోత్సవ౦ పుష్య బహుళ పంచమి 2-2-21 మంగళవారం సాయంత్రం 6.30గం.లకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో నిర్వహింపబడుతుంది .ఆ సాయంత్రం 6గం లకు శ్రీ త్యాగరాజస్వామికి అష్టోత్తర పూజ జరుగుతుంది .అనంతరం స్థానిక ,ఇతర ప్రదేశాలనుండి,ఉత్సాహం గా పాల్గొనే గాయనీ గాయకులు ’’ శ్రీ త్యాగరాజ పంచ రత్న కీర్తనలు ’’ గానం చేస్తారు .ఇతర కృతులతో అలరిస్తారు .

అమరగాయకులు స్వర్గీయ ఘంటసాల వేంకటేశ్వరరావు,పద్మ విభూషణ్ డా .మంగళం పల్లి బాల మురళీ కృష్ణ  ,ఇటీవలే మరణించిన పద్మ భూషణ్ శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం (బాలు )సంస్మరణ జరుగును .సాహిత్య ,సంగీతాభిమానులు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .

 పూర్తి వివరాలు  తర్వాత తెలియ జేస్తాం . గబ్బిట దుర్గాప్రసాద్ -19-1-20-ఉయ్యూరు

Posted in సభలు సమావేశాలు | Leave a comment

మహా భక్త శిఖామణులు 24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి 

మహా భక్త శిఖామణులు

24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి

-భారద్వాజస గోత్రీకులైన ఆరువేల నియోగులు  శ్రీఆలూరి వెంకయ్య ,శ్రీమతివెంకమ్మ దంపతులకు ఆలూరి వెంకటాద్రి ,ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో  ఫాల్గుణ పౌర్ణమి పర్వదినాన అక్షయ నామ సంవత్సరం 1806లో కృష్ణా జిల్లా జుజ్జూరు పరగణా ఆలూరు లో జన్మించారు .ఆగ్రామం లో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పై బాల్యం  నుండీ అతి భక్తి ఉండేది .విద్యా గురువు లేకుండానే అనేక స్తోత్రాలు ,శాస్త్రాలు ఆబాల వెంకటాద్రికి అబ్బటం తలిదండ్రులను అమితాశ్చర్య చకితుల్ని చేసింది .తనకు సన్మార్గదర్శి దర్శి అయిన గురువు లభించాలని ఉబలాట పడుతున్న సమయం లో తూము నరసింహ దాసు గారి దర్శనం లభించి తారక నామ మంత్రోపదేశం చేసి ,హరినామ సంకీర్తన మార్గం లో ప్రవేశ పెట్టారు ..

   దీన ,నిర్భాగ్యులను ఉద్ధరించే సత్సంకల్పమున్న వెంకటాద్రి స్వామి ,శాయశక్తుల వారికి సహాయ సహకారాలు అందించేవారు .వైష్ణవ సంప్రదాయం లో ఉన్నారుకనుక పవిత్ర వైష్ణవ క్షేత్ర దర్శనం చేసేవారు .అలా భద్రాచలం వెళ్లి అయిదేళ్ళు నిర్విరామం గా శ్రీహరి నామ సంకీర్తన తో మునిగిపోయారు .స్వామి భక్తి యెంత పటిష్టమైనది అంటే స్వప్నం లోనూ , ,సామాన్యంగానూ  ఆయనకు శ్రీరామ చంద్రుడు సాక్షాత్కరించి సంభాషించి ఆయన గుణ గరిమను అభినంది౦చేవాడు .రామనామం కోటి దాకా రాసి ,కీర్తనలు రచించి తన్మయత్వంతో గానం చేసేవారు వెంకటాద్రి స్వామి .కల్యాణిరాగం లో వెంకటాద్రి స్వామి రచించిన ‘’శరణు శరణు ,శరణు శ్రీరామ రామ రామ చంద్ర ‘’కీర్తన లో శ్రీరామ వైభవం కళ్ళ ముందు నిలిపారు .పవిత్ర గోదావరి ,పరమ పవిత్ర అపర వైకుంఠంభద్రాద్రి ఆర్తత్రాణ శరణ్యుడు సీతారామ చంద్ర మూర్తి ని వదలి ఎక్కడికీ వెళ్లాలని అని పించేదికాదు స్వామికి.

  ధారణ నామ సంవత్సరం 1824లో వెంకటాద్రి స్వామి చైత్ర బహుళ సప్తమి నాడు తిరుమల చేరి ,పెరుమాళ్ళ పూలంగి సేవలో అయిదు సంవత్సరాలు ఆనందంగా స్వామి వారి సేవ చేసి,దివ్యనామ సంకీర్తన చేస్తూ ధన్యులయ్యారు  .’’ఇందిరా రమణ నీ విందు రారా ‘’కీర్తనను సహన రాగం లోరచించి భక్తి పారవశ్యం తో గానం చేశారు .పరమ ప్రీతి చెందిన శ్రీవారు స్వప్నం లో సాక్షాత్కరించి కంచి లో తన సేవ చేసుకోమని ఆదేశించారు .

  భగవదాదేశం ప్రకారం వెంకటాద్రి స్వామి కాంచీపురం చేరి  వేగవతి నదిలో పుణ్యస్నానం చేసి ,పేరుందేవి తాయార్ దర్శనం చేసి ‘’నిను నమ్మి ఉన్నా సేతమ్మ ‘’అని కాపీ రాగం లో కీర్తన రచించి ,గానం చేసి అమ్మవారికి అర్పించారు .వెంకటాద్రి స్వామి నిశ్చలభక్తికి మెచ్చిన వరదరాజ స్వామి శ్రీదేవీ భూ దేవీ సహితంగా వెంకటాద్రి స్వామికి దివ్య దర్శనమిచ్చాడు .పరవశం చెందిన వేంకటాద్రి స్వామి  ఆనంద నృత్యం చేస్తూ నాట రాగం లో ‘’జయ జలధర శ్యామ ‘’ మరియు ‘’దేవ దేవ శౌరే మురారే ‘’కీర్తనలు గానం చేసి తరించి భక్తులను తరి౦పజేశారు .

  పుష్ప కైంకర్యం నుంచి చందనం అలదటం కూడా చేస్తూ స్వామివారికి నిత్యం కాచిన పాలను అందించే ఏర్పాటు కూడా చేశారు వెంకటాద్రిస్వామి .బ్రహ్మ తీర్ధ  తట౦ పై సేన ముదలియార్ సన్నిధిలో ఉంటూ సేవలు అందజేసేవారు. ఆయన ఉన్న ఆ గదిని ఇప్పటికీ వెంకటాద్రి స్వామి గదిగా పిలుస్తారు .ఒక రోజు స్వామి సేవకు పూలతోటలో పుష్పాలు కోయబోతుంటే ,ఒకపాము ఆయనకాలిపై కాటు వేసింది. ఏమాత్రం కంగారు పడకుండా నిబ్బరం గా పేరుందేవి సన్నిధికి వెళ్లి కమాస్ రాగం లో ‘’కాపాడరా నన్ను ‘’అని కీర్తన రాసి పాడుతూ ,ధ్వజస్థంభ సమీపం లో అపస్మారకంగా పాముకాటు ప్రభావం వలన నేలపై పడిపోయారు .కాసేపటికి తేరుకొని దేవరాజ  సన్నిధి చేరి ,దర్శనం చేసి తీర్ధ ప్రసాదాలు తీసుకొని దైనందిన కృత్యం లో  గానం లో కీర్తనలలో నిమగ్నమయ్యారు.

  భిక్షాటనం లో జీవిస్తున్నా ,మహాదైశ్వర్య వంతులు,మహారాజులు  కూడాఇవ్వలేనంత భూరి సంపాదన ను వరదరాజ స్వామి సేవకు అందజేసేవారు వెంకటాద్రి స్వామి .తన శక్తి సామర్ధ్యాల గురించి ఆలోచించకుండా భగవంతుని అపార కరుణా దృష్టిపైనే నమ్మకం తో మహాద్భుతకార్యాలు సాధించి కీర్తిపొందారు స్వామి .భగవంతుని కి౦కరుడిగా తాను  చేస్తున్నాను అనే వినయం ఆయనది. అందులో తన గొప్ప దనం ఏమీ లేదు .తాను నిమిత్తమాత్రుడనే అను కొనేవారు .భక్తులు దాతలు అందజేసిన విరాళాలను జాగ్రత్త చేసి స్వామి కై౦కర్యాలకు అనువుగా ఖర్చు చేసేవారు.ఎక్కడా ఎప్పుడూ ఏ లోటు రానీయలేదు .

  దివ్య దేశమైన కంచి లో జీర్ణోద్ధరణ కార్యక్రమాలు నిర్వహించారు వెంకటాద్రి స్వామి .అందులో ముఖ్యమైనది విలక్కోలి పెరుమాళ్ సన్నిధి మండపం ,గోపుర నిర్మాణం .వేదవిద్యా వాప్తికోసం బాలురకు వేదాభ్యాసం కోసం ధార్మిక సంస్థను నెలకొల్పారు స్వామి .భక్తుల కానుకలనతో భూమికొని ,ఆ స్వామి భూములపై వచ్చే ఆదాయం తో వేద విద్య నేర్పించారు  .దూసి మామందూర్ లో ఆరోజుల్లో అత్యధిక ధరగా భావించే    5వేలరూపాయలతో పొలం కొని తాను ఏర్పాటు చేసిన ఎండోమెంట్ కు అందజేశారు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-1-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నీలాచలేశ్వర స్తవం

   నీలాచలేశ్వర స్తవం

శ్రీ కపిల కృష్ణ శర్మ కవి ‘’కర్మశ్రీ ‘’నామధేయం తో ‘’నీలాచలేశ్వర స్తవం ‘’ రచించి సర్వ సమైక్య భావ గరిష్టుడు ,అనవతర పర సేవా తంత్రుడు ,సత్పుణ్య శాలి ,దాన సద్ధర్మాదిమానవీయ నియమ పాలనా రతుడైన తన తండ్రి కపిల కామేశ్వరునికి అంకిత మిచ్చాడు .ఈపుస్తకం నరసాపూర్ లోని కమలాకుటీర్ పవర్ ప్రెస్ లో 1962లో ప్రచురితమైనది .

  కర్మశ్రీ కవి ‘’నా మనవి ‘’లో  ‘’శివభక్త శిఖామణి కాకతి ప్రతాప రుద్ర దేవ చక్రవర్తి కాలం లో కోటలోనే కాకుండా ,ఊరూరా పల్లెపల్లెలా వీధి వీధినా శివాలయాలు నెలకొల్ప బడినాయనీ , ఆలాయాదీశుడైన జగద్రక్షకుని పర్య వేక్షణ లో భారత దేశం సుభిక్షం గా వర్దిల్లిందనీ ,ఆకాలం లోనే ‘’నీలాద్రి దుర్గం ‘’ వెలసిల్లిందనీ ,అంతులేని వైభవం సాటిలేని వస్తుసామాగ్రి తో ,విలువైన వస్తు వాహనాలలో నీలాద్రి దేదీప్యమాన వైభవంగా వెలిగిందని కాలక్రమంగా భక్త చక్రవర్తి పాలన ముగిసిందని  చెప్పాడు .

  నట్ట నడివి లో గుట్టలు రాళ్ళు పై ఉన్న ఈ దివ్య మూర్తిని దర్శించటానికి దారీ తెన్నూ లేకపోవటం తో భక్తులు గుంపులుగా అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేవారు .సమర్ధులు ఉపేక్షిస్తే, అసమర్ధులు వాపోయేవారు .ఇలా ఎన్నో శతాబ్దాలు కాలగర్భం లో కలిసి పోయాయి .ప్రజల్లో స్వామి పై ఆలోచన రావటం ,స్వామి వైభవాన్ని గుర్తించటం ,రెట్టింపు ఉత్సాహంతో తిరునాళ్ళు నిర్వహించి ,పురాతన వైభవాన్ని మించిన వైభవం నీలాచలేశ్వరుని కి చేస్తూ ధన్యులయ్యారు .కవి గారు దర్శించి ,భక్త్యావేశం తో పులకించి ఈ స్తవ రూప కావ్యాన్ని రాశారు .కానీ తనకున్న కొద్దిపాటి సాహిత్య జ్ఞానం తో రాసిన కావ్యం కనుక తప్పులు సరి చేసి పరిష్కరించమని తండ్రిగారి ప్రేరణతో  కవి భూషణ , కవిశేఖర ,శ్రీ శిష్టా వెంకట సుబ్బయ్య కవీంద్రుని ఆశ్రయించి అంద జేశారు.వారు అచిరకాలం లోనే శుద్ధి చేసి కవి గారికిచ్చారు  .పుస్తకాన్ని బంధు మిత్ర హితుల సహాయంతో ముద్రించి పండితాభిప్రాయం సేకరించి కూర్చారు –శ్రీ శిష్టా వెంకట సుబ్బయ్యగారు –‘’18ఏళ్ళ బాలుడు ఇంతటి కవితా స్రవంతి ప్రవహింప జేశాడంటే ఆశ్చర్య పోయాను .భావాలు హృదయం గమాలు ,భగ వత్ప్రేరి తాలు కనుక వేదాంత విషయాలు కూడా  చక్కగా ప్రకటించాడు .వ్యాకరణం పై ఇంకాస్త శ్రద్ధ చూపించాలి .ఈ కవి .దీనితర్వాత ‘’కృష్ణ శతకం ‘’కూడా అనర్గళ ధారా ప్రవాహంగా రాశాడు’’ .అని మెచ్చారు .

పాలకొల్లు వాసి శ్రీ ఆండ్ర శేషగిరి రావు –‘’ఆవేశ హృదయుడైన ఈ కవి నా ప్రియ శిష్యుడు ,చిన్నవాడు .సంస్కృతాంధ్రాలలో పెద్దగా ప్రవేశం లేకపోయినా పద్యాలలో అనర్గళ ధారా శుద్ధి ఉంది .ఈ పద్యాలు చదువుతుంటే నాకు తన్మయత్వం కలిగింది .అమేయ కవితాదురంధరుడు అవుతాడు .ఈఆవేశం తోనే శ్రీ వెంకటేశ్వర నక్షత్ర మాల ‘’కృష్ణ శతకం కూడా కూర్చాడు ‘’.అని కీర్తించారు .

ఆత్రేయ విద్వాన్మహా కవి పండిత శ్రీ పామర్తి సూర్య ప్రకాశ శర్మ –‘’ప్రాక్తన పుణ్య పరిపాకం చేత ఈకవి గొప్ప భక్తి కావ్యం రాశాడు .గురు శుశ్రూష లేకుండా నే ,ఈకవి నాలుకపై సరస్వతీ దేవి చిందులు త్రొక్కింది .విద్యా వినయ సంపన్నుడైన కర్మ శ్రీ కవి వ్యాకరణం క్షుణ్ణంగా నేర్చి ,విద్యా వైశద్యం ఆర్జించి భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ కావ్యాలు రాయాలి ‘’అని ఆశీర్వదించారు. .

   కవి  శ్రీ కృష్ణ స్తుతి ,సరస్వతీప్రార్ధన,విఘ్నేశ్వర ,గురు  సుకవి సంస్తుతి చేసి,ఆతర్వాత తన వంశ చరిత్ర చెప్పాడు –తనతండ్రి కామేశ్వరుడు కాశ్యప గోత్రుడు ,సర్వ శాస్త్ర పురాణ సాహిత్య నిష్ణాతుడు పండిత ప్రశస్తి పొందినవాడు ఆంద్ర ఆంగ్ల సారస్వత కోవిదుడు ,సూనృత వాక్య పాలకుడు ,శక్తికి మించి దానధర్మాలు చేసినవాడు .తల్లి అన్నపూర్ణ సంప్రదాయ పరిరక్షకురాలు .అన్న భాస్కరుడు వదిన వెంకట రామణా౦బ తనను భక్తి కావ్యం రాయమని ఎప్పుడూ ప్రోత్సహించేవారు .రామరాయ ,విజయ లక్ష్మణ రావు అన్నలు .సూర్యారావు ,లక్ష్మీ నరసింహారావు తమ్ములు .పెద్దవదినన విజయ లక్ష్మి చిన్నవదినన నిర్మల .కవి మధ్యముడు కృష్ణ శర్మ .

  పిమ్మట నీలాచల విశేషాలు గద్యం లో చెప్పాడు –కీకారణ్యం లో నీలాచలం యోజనం దూరం వ్యాపించి ఉంటుంది .కదంబ కాదంబ క్రకచపత్ర  మొదలైన వృక్షాలతో ,ఖడ్గ శరభ శార్దూలాది మృగాలతో ,చిలుక గోరింక పావురాది పక్షి సంతానం తో ,త్రాచు ,పింజర రక్త పింజరాది సర్పాలతో,రత్న వైడూర్య వజ్ర గోమేధికాది నిధి నిక్షేపాలతో ,యక్ష గరుడ కి౦ పురుషాది  గణాలతో వ్యాపించి ఉంటుంది .అక్కడ ఏక శిలా ప్రాగ్భారం లో నాలుగుస్తంభాలపై ప్రాకారం తో నందీశ్వరుడు ముందు ధ్వజ స్తంభం ఉంటుంది .లోపల గర్భగుడిలో శ్రీ పరమేశ్వర ఆత్మలింగం నీలాచలేశ్వరుడు ,దానికి కుడివైపు పెద్ద పుట్ట ,దానిదగ్గర చతుర్గజం అనే శిల.దీని మధ్యలో రంధ్రం దానినుంచి నిరంతర జలప్రవాహం కనిపించి ఆశ్చర్య చకితుల్ని చేస్తాయి .మహా వైభవంగా శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి  ,ఈ శివుడిని చూడగానే కవిగారిలో భక్తి పెల్లుబికి దండకం ఒకటి-‘’శ్రీ దేవా దేవా మహానుభావా ,శంభో జటాజూట దారీ ,పురద్వంసకా అర్ధనరీశ్వరా , సత్క్రుతాంబో నిధీ ‘’అంటూ ధారాపాతంగా వచ్చేసింది .ఆ రాత్రి అక్కడే నిద్ర చేసి మర్నాడు ఉదయం  స్వామిని దర్శించి ,ఇంటికి వచ్చి ,ఈ స్తవాన్ని రాయటం మొదలు పెట్టాడు .ఆ స్తవ వైభవం చూద్దాం –మొదటి పద్యం –

‘’శ్రీ శ్రీ నమశ్శివాయా –సుశ్రీ విహరణ విలసిత సుక్షేత్రా –హే,శ్రీధర సంచయ భూ –షా శ్రీకైలాస వాస సద్గురు శంభో ‘’

‘’చంచలమైన దేహ మిల శాశ్వత –మంచును మూఢులౌచు –‘’అని అశాశ్వతాన్ని గురించి ఆలోచించే మనుసుల తీరు చెప్పి ,’’కాల కూట విషమ్ము కంఠమున ధరించి –సురకోటి కెవ్వాడు సుధ యొసంగె ‘’అని ఈశ్వరుని స్తుతించి ,మార్కండేయుని యముడి నుంచి కాపాడినవాడు –‘’కారుణ్య గుణాదికా  ,అభవ హే రాకేందు సద్భూషణా-నీకు మ్రొక్కెద గావుమయ్య కరుణన్ –నీలాద్రి వాసా హరా ‘’అని ఆర్తిగా ప్రార్ధించాడు .తన అజ్ఞానాన్ని –‘’బాలుడ జూడగా  దెలుగు బాసయు బూర్తిగ రాదయెట్లు శా-స్త్రాలను నేర్తు నేగతి-జ్ఞానము నూనుదు నాత్మశక్తిమై’’అని తన అశక్తత ప్రకటించుకొన్నాడు .ఒక భార్యనే భరించటం కష్టంగా ఉంటె గంగా పార్వతులతో ఎలా వేగుతున్నావని మేలమాడాడు .

‘’మృగనాభి పంకంబు బుగబుగల్ మెయి తోడ –నగ్ని జిమ్మెడు లలాటాక్షి తోడ-నిగనిగల్ వెదజల్లు నెమలి పి౦చము తోడ-పోలుపారు జాబిల్లి పూవు తోడ –గోప్యమై యొప్పు వైకుంఠ వాసము తోడ  -మహిత కైలాస దామంబు తోడ ‘’అంటూ ధారాప్రవాహం తో పద్యాలు సాగించాడు ,భక్తి కుమ్మరించాడు .శంకరుడు ఉబ్బు లింగం అనే మాట నిజం అన్నాడు –‘’శంకర భక్త సంతతి వశంకర నీల గిరీశ్వరా హరా ‘’అన్నాడు .చివరగా –‘’ఆత్మ విశ్వాసమే ముఖ్య మందు రట్లు –గాన  పూర్ణ విశ్వాసమున్ గడలు గొనగ –పల్కి నాడను నేనిట్లు పార్వ తీశ-నీలగిరి వాస కరుణా రసాలవాల ‘’అని చెప్పుకొని చివరి సీసపద్యం లో చివరగా –భావా తీత మనో నివాస  నగజా –భామా మణీహృద్విహా-రావారాశి గభీర ధీర ముని హృ-ద్రమ్యాబ్జవాసా నమో ‘’అంటూ నీలాచల స్తుతి పూర్తి చేశాడు కవి కర్మశ్రీ .

‘’ఇది చక్రవరం వేంకట రామరాయ   గురు కటాక్ష లబ్ధ కవితాదౌరేయ కాష్యపస గోత్ర పవిత్ర కపిల వంశా౦బుదీ సుధాకర శ్రీ కామేశ్వర సూర్య నారాయణార్య ప్రియ మధ్యమ పుత్రశ్రీ కృష్ణ శర్మ నామ ధేయ  ప్రణీతంబగు శ్రీ నీలాచలేశ్వర స్తవము సర్వము –ఓం తత్సత్ ‘’అని పూర్తి చేశాడు . ఈ శతకం లోకం ప్రచారం లో ఉన్నట్లుగాలేదు .మంచి కవన వైభవానికి భక్తీ ఆర్తికి నిలయంగా పదహారేళ్ళ యువకవి రాసిన స్తుతికావ్యం .సమాదరణీయం .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-1-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కవితా స్రవంతి

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర వైభవం తర్వాత ?

సాహితీ బంధువులకు శుభకామనలు .సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర వైభవం ‘’ ఈ నెల 22 శుక్రవారం తో పూర్తవుతోంది .

 23-1-21శనివారం నుండి ఉదయం 10 గం.లకు ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారంగా- 1-భావకవిత్వానికి మేస్త్రి కృష్ణ శాస్త్రి 2-అనుభూతి కవి  దేవరకొండ బాల గంగాధర తిలక్ 3-నాద బ్రహ్మ త్యాగయ్య 4-పుట్టపర్తి నారాయణాచార్యుల వారి ‘’ శివ తాండవం ‘’వరుసగా ఒకటి పూర్తయ్యాక మరొకటిగా ప్రసారమౌతాయి –దుర్గాప్రసాద్ -16-1-21-ఉయ్యూరు .

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆంధ్రా జాకీర్హుస్సేన్- డా.హుస్సేన్ అహ్మద్

 ఆంధ్రా జాకీర్ హుస్సేన్- డా.హుస్సేన్ అహ్మద్

తణుకు కంటి డాక్టర్ డా .హుసేన్ అహ్మద్ జీవిత కథ ను  తణుకు చారిత్రిక పరిశోధక బహు గ్రంథ రచయిత  శ్రీ కానూరి బదరీ నాథ్’’ ప్రశాంత పథకుడు డా .హుస్సేన్ అహ్మద్’’గా రాసి ఆవిష్కారం అయిన మర్నాడే  చర్లవారి పురస్కారం అందుకొన్న మల్లవరం లో మాకు జనవరి 10 ఆదివారం అందజేసి అభిప్రాయం రాయమని కోరారు .ఈ మధ్యాహ్నమే చదివి నా స్పందన తెలియ జేస్తున్నాను .

  “మొత్తం భారతదేశం నా ఇల్లు, ప్రజలందరూ నా కుటుంబం’’అన్న భారత మూడవ రాష్ట్ర పతి ,మహా విద్యావేత్త ,బేసిక్ విద్యా నిపుణుడు ,ఉత్తమ దార్శనికుడు ,భారత విద్యా విభాగ మార్గ దర్శి ,తన సంపద సర్వస్వం భారత దేశానికి ధారపోసిన మహోన్నత ఆదర్శ మార్గదర్శి ,జాతీయ ముస్లిం విద్యాలయ స్థాపకుడు డా.జాకీర్ హుస్సేన్  జ్ఞాపకం వక్చరు ఈ పుస్తకం చదువుతుంటే .అందుకే నా సమీక్ష వ్యాసానికి శీర్షిక ‘’       ఆంధ్రా జాకీర్ హుస్సేన్- డా.హుస్సేన్ అహ్మద్ ‘’అని పెట్టాను .బడరిగారు ఇప్పటికే ఎన్నో చారిత్రిక పుస్తకాలు జీవిత చరిత్రలు రాసి గొప్ప పేరు పొందారు .ఆయన అనుక్షణ పరిశీలకుడు అని ,అదొక హాబీ గా అలవాటు చేసుకొన్న రచయిత అని మనకు తెలుస్తుంది .డాహుస్సేన్ గారి పుట్టుపూర్వోత్తరాలను త్రవ్వి తీసి ,ఆయన విద్యావ్యాసంగపు సోపానాలు వివరించి ,ఉద్యోగ ప్రయాణం తెలిపి, ఆయన ఆదర్శాలు మాటలలో కాకుండా చేతలలో ఎలా నిలబెట్టారో వివరించి ,ఆయన ఉత్తమ గుణ గరిష్టతను పలు కోణాల్లో ఆవిష్కరించి డాక్టర్ గార్ని మనకు సన్నిహితులను  చేశారు .  .ఈ పుస్తకం అందరి వద్ద ఉండడుకనుక సంక్షిప్తంగా డాక్టర్ గారి వ్యక్తిత్వం ఉద్యోగ సేవాకార్యక్రమాలు బద్రిగారి రచన ఆధారంగా మీముందు ఉంచి అలాంటి ఉత్తమ వ్యక్తిని తెలుసుకోవటం లో మనం  మధురానుభూతి పొందాలని కోరుతున్నాను .

 హుస్సేన్ షేక్ మున్షీ అబ్దుల్ ఖాదర్ ,హుస్ నారా బేగం లకు డాక్టర్ గారు 5-12-1948లో తణుకు లో జన్మించి ,అక్కడికమ్మవారు ఉండే పాతూరులో శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఉండే నన్నయభట్టు మనుమడు కొమ్మనామాత్యుడి పేరున వెలసిన ‘’కొమ్మాయి చెరువు ‘’దగ్గర డాక్టర్ గారిది ఒక్కటే ముస్లిం కుటుంబం .అందుకే ప్రసాద్ గారితో వీరి కుటుంబానికి సత్సంబంధాలు ఏర్పడ్డాయి .తణుకు లో ప్రాధమిక విద్య ,హైస్కూల్ విద్యా పూర్తి చేసి ,12వ తరగతి 68శాతం మార్కులతోపాసై ,స్వయం ప్రతిభతో కాకినాడ రంగరాయ వైద్య కలాశాలలోచేరి ఉత్తీర్ణులై ,పిజి కోర్సు చేయాలనుకొంటే ఆర్ధిక స్తోమత లేదని తండ్రి అంటే స్కాలర్షిప్ తో చదువుతానని చెప్పి ,దేశంలోనే పెద్దది పేరు ప్రతిష్టలున్న ఉత్తర ప్రదేశ్ సీతా పూర్ ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ ఆఫ్త మాలజి లో చేరి ,నెలకు 900 రూపాయన ఉపకార వేతనం గా పొందుతూ మూడు వందలు మాత్రమే ఖర్చు చేసి ,మిగిలినది తండ్రిగారికి పంపుతూ కుటుంబానికి ఆసరాగా ఉన్నారు .1974లో పిజి పూర్తి చేసి అక్కడే అఫ్తమాలజిస్ట్ గా 1300 రూపాయల జీతం తో పని చేశారు .అక్కడే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మన మాజీ గవర్నర్  నారాయణ్ దత్త తివారి తో మంచి పరిచయం కలిగి ,ఆయన సాయం సంస్థకు లభించేట్లు చేసి ,హాస్పిటల్ చీఫ్ గా ఉంటూ తివారీ సాయంతో హాస్పిటల్ అభి వృద్ధికి రెండు ఎకరాల స్థలం సాధించి తొలివిజయం పొందారు హుస్సేన్ జీ .1977లోషాహిదా బేగం ను పెళ్ళాడి, ఇద్దరు పుత్రులు ఒక కుమార్తెకు జన్మనిచ్చి వారిని విద్యలో ఆరి తేరిన వారిని చేసి వివాహాలు జరిపించారు .

   1978లో సౌదీ అరేబియా వెళ్లి రియాద్ లో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో కంటి డాక్టర్ గా చేరి 20ఏళ్ళు పనిచేసి నియమబద్ద జీవితం తో అందరి అభిమానం పొందారు .అక్కడి నుండి తణుకు చేరి ముళ్ళపూడి వెంకట రమణమ్మ మెమోరియల్ హాస్పిటల్ లో చేరి ఇక్కడా ఇర్వి ఏళ్ళు సేవ చేసి మొత్తం 40 సంవత్సరాలు వైద్య సేవలో ధన్యులయ్యారు .60వ ఏట పదవీ విరమణ చేసినా ,సంస్థ ఒత్తిడితో  తో 73వ యేటకూడా సేవలందిస్తూనే ఉన్నారు సౌదీలో ఇండియన్ ఎంబసీతో కలిసి హుస్సేన్ దంపతులు ఒక స్కూలు స్థాపించిన అనుభవంతో తణుకు లోనూ వెనుకబడిన వారి విద్యావ్యాప్తికోసం 2001లో ఇండియన్ పబ్లిక్ స్కూల్ పెట్టి ,తర్వాత హైస్కూల్ గా అభి వృద్ధి చేసి , మోరల్ క్లాస్ లుకూడా నిర్వహిస్తూ ఆదర్శ విద్యాలయంగా తీర్చి దిద్దారు .మునిసిపాలిటి కో ఆప్షన్ సభ్యులై పాలనలో తమ అనుభవాన్ని అందించి తృప్తి చెందారు .సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి అధ్యక్షులై వయో వృద్ధులకు సంచార శకటం ఏర్పాటు చేసి ఇంటి వద్దే వైద్యం అందించారు .ఐఎం ఏ అధ్యక్షులుగా  రెండేళ్ళు  పని చేసి , ,లయన్స్ క్లబ్ మెంబర్ ,మానవత ,రామకృష్ణా సేవాసమితి వంటి సంస్థలలో సభ్యులై సేవలు అందించారు ‘

  డా హుస్సేన్ గారికి ఏకేశ్వరోపాసన పై నమ్మకమెక్కువ .దీనివలన ఇహపర ప్రయోజనాలు కలుగుతాయని నమ్మారు .ఇంటివద్ద ముస్లిం పద్ధతులను చక్కగా పాటిస్తారు ఖురాన్ ను అనుసరిస్తారు .గాలిబ్ ,కబీర్ గురజాడ మార్గం లో ప్రయాణిస్తూ ‘’సర్వ మానవ సౌభ్రాతృత్వం ,మానవ సేవ అలవరచుకొని కొనసాగిస్తున్నారు .సుగుణాల రాశిగా ,మతసామరస్య సాధకుడిగా కీర్తి గడించారు .ఆయన మార్గం శాంతి పథం.అందుకే ఆపేరు మీదనే బద్రి గారు డాక్టర్ గారి జీవిత చరిత్రరాశారు .చివరలో ప్రముఖుల అభిప్రాయాలను గుది గుచ్చారు .దీనివలన హుస్సేన్ గారి బహుముఖీన వ్యక్తిత్వం అన్ని కోణాలలో అర్ధం చేసుకోవటానికి అవాశం కలిగింది .డా హుస్సేన్ శతాధిక ఆయురారోగ్యం తో వర్ధిల్లి మానవ సేవలో మాధవ సేవ చేయాలని ఆశిద్దాం .

 రచయిత శ్రీ  బద్రి తళుకు లీనే తణుకు చరిత్ర ,అక్కడిముస్లిం ల చరిత్ర త్రవ్వి తీసి రాశారు .ఏకేశ్వరోపాసన గురించి చెప్పటానికి విస్తృతంగా భగవద్గీత ,బైబిల్ ,ఖురాన్ అధ్యయనం చేసి సారం అందించారు .ప్రభావ శీలుర జీవిత విశేషాలు క్రోడీకరించారు .వ్యక్తిత్వ విశ్లేషణ సమర్ధం గా  వివరించారు.పుస్తకం లో ప్రతి అంగుళం లోనూ బద్రిగారి అధ్యయన శీలం కనిపించి ఆశ్చర్య పరుస్తుంది. హుస్సేన్ గారి జీవితాన్ని చిత్రించటానికి ఇవన్నీ చక్కగా ఉపకరించి ,ఇద్దరికీ కీర్తి తెచ్చింది పుస్తకం .బద్రి గారిని అభినందిస్తూ మరిన్ని గొప్ప రచనలు ఆయన లేఖిని నుంచి వెలువడాలని ఆశిస్తున్నాను .

 రేపు భోగి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-1-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సంక్రాంతి శుభా కాంక్షలు 

సంక్రాంతి శుభా కాంక్షలు

సాహితీ బంధువులకు శుభకామనలు -రేపు 13-1-21 బుధవారం భోగి పండుగ ,14-1-21 గురువారం సంక్రాతి ,15-1-21 శుక్రవార0 కనుమ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

  కవితా ‘’త్రయి’’

 సర్వ సమర్ధులైన ముగ్గురు మహిళా మణులు తమ కిష్టమైన కవిత్వ ప్రక్రియలో త్రివిక్రమం చూపి ,తమ సేవా భావాన్ని చాటి ,తమలోని కళా మహిమను వెలువరిస్తూ ,సాటి కళాత్మక విలువలను మెచ్చుతూ ,తమ కిష్టమైన రంగం పేరును తమ కవితా శతానికి పేరుపెట్టి’’ కవితా ‘’త్రయి’’గా 2000 డిసెంబర్ లో వెలువరించి ‘’సహస్ర కవిమిత్ర త్రిపుర సంగమం ‘’గా వెలువరించి నిన్న 10 వ తేదీ ఆదివారం నాకూ మా శ్రీమతికీ మల్లవరం చర్ల దంపతుల వృద్ధాశ్రమం లో  చర్ల వారిసాహిత్య, సేవా  పురస్కారం అందజేసే సందర్భంగా   నాచేత ఆవిష్కరింప జేసి నాకు గొప్ప అదృష్టాన్ని కల్పించారు .ఆ ముగ్గురు విదుషీమణులే డా చర్ల సిస్టర్స్ ,శ్రీమతి నారుమంచి వాణి ప్రభాకరి డా చర్ల విదుల గారి శతకవితలు ‘’సేవా మంజరి ‘’గా ,డా చర్ల మృదులగారి కవితా శతం ‘’కవితా కలశం ‘’గా ,శ్రీమతి వాణీ ప్రభాకరి గారి  వంద కవితలు ‘’సంగీత సాహిత్య రవళి ‘’గా చోటు చేసుకొని మనోల్లాసం కల్గించాయి .

1-సేవా మంజరి –లో శ్రీమతి విదులగారు-అష్టనామాలతో వెలుగొందే వెనకయ్యను స్తుతించి నారాయణ స్తుతిచేసి మానవునిలో ద్వేషభావ వ్యాప్తి జరుగుతున్నందుకు వేదన చెంది ,సత్సంగం సన్మార్గ హేతువని తెలిపి ,,నాటికీ –నేటికే ఆకాశ మంత భేదముందని చెప్పి ,నిన్ను నువ్వు తెలుసోకోమని హితవు చెప్పి ,భగవంతుని సన్నిధిలోనే సుఖ శాంతులున్నాయని బోధించి ‘’మన ఆత్మ పరమాత్మ అంశం ‘’అని ఎరుక కలిగించి ,మనిషి తలచిందే పొందుతాడన్న గీతా రహస్యం విప్పి ,భగవ౦తునికి  అర్పించాల్సింది ‘’క్షమా పుష్పం ‘’అని వివరించి ,అభి షేకాలతో ఉక్కిరి బిక్కిరౌతున్న ‘’స్థాణువు’’ నిజంగానే రాయి అయిపోయాడని సానుభూతి చూపి ‘’స్వార్ధం అనే చీకటిని పారద్రోలి –నిస్వార్ధ దీపం వెలిగించి –లక్ష్య౦ అనే వెలుగులో పయనం సాగించు ‘’అని మానవుని ఉద్బోధించారు .’’కొందరికైనా అన్నం పంచాలి ‘’నా సేవఎందరికో అంకితం ‘’అంటూ తమ లక్ష్యాన్ని తెలిపారు .అమ్మ సుశీలమ్మ అనురాగాన్ని గుర్తు చేసుకొని ,వృద్ధాశ్రమం లో ఆన౦ద౦   ఆప్యాయత వెల్లి విరుస్తాయని భరోసా ఇచ్చారు .వర్షం ,ఆకాశం ,మెరుపు మనసు జీవనగతి మనసున్న మనిషి వనరుల విలువ తెలియటం ,పసి పిల్లల ప్రేమ మొదలైనవి మధురంమధురం మధురం అంటూ ‘’మధురాష్టకం ‘’చెప్పారు . వీణా ప్రాణి అయిన తనకు  సంగీతకళా కీర్తి నిచ్చినందుకు కృతజ్ఞతలు ప్రకటించారు .సంగీతం కంటే సేవామార్గమే ఇష్టమని విస్పష్టంగా ప్రకటించారు .మంచితనం యెంతఉన్నా ధనం కూడా ముఖ్యమే ఏపనికైనా ,అన్నదానమే తన జీవిత గతి ,పగడం దరించి కలతలను దూరం చేసుకోమనీ ,మనసుకు పచ్చి మిర్చి బజ్జీ ఆహ్లాదకరం భార్యా భర్త ,అన్న చెల్లీ ఒకరికొకరు బంగారమే అన్నారు .’’సరస్వతీ దేవి నుండి జాలువారిన ఒక అద్భుతమే విద్య ‘’అని చక్కని అర్ధం చెప్పారు .జీవితమార్గాన్ని సుగమం చేసుకోవటానికి ఉద్యోగం సోపానం ,అని ఉద్యోగ ధర్మం చెప్పారు .తమకిష్టమైన నువ్వుండలు,పూతరేకు వడియాలు మాగాయి లను రుచులూ రేట్లు తెలిపారు .కలరాఉండలు, ఏలకుల ఉపయోగాలు మిరియాలు ములగాకు ,బిళ్ళగన్నేరు, బొప్పాయి ఆకులలో వైద్యగుణాలు తెలియజేశారు .ఆకలి ఎలా ఉంటుందంటే ‘’ప్రాణం పోయినట్లు ,నరాలులాగి మంతకలిగి ,తలనొప్పి కాళ్ళు పీకుడు కళ్ళు బైర్లు కమ్మి ,మనసు భ్రమించటం ‘’గా ఉంటుందని గొప్పగా చెప్పారు .అందర్నీ మెప్పించేది సంస్కారమే అన్నారు .తానుచదివిన ఉస్మానియా మేనియా ను అభి వర్ణించారు .జ్ఞానిగా మనిషి మెలగాలనీ బోధించి నాయక హాస్య నటుల్ని,స్టార్ ఫిష్ అందాన్ని ,పచ్చడీ సాంబారు బిర్యాని  లను రొ౦బా  మెచ్చి,కూర్మావతార రహస్యం విప్పి చెప్పి ,చంద్రుని కాంతి చలువదనాన్నీ వేద విజ్ఞానాన్నీ   మనస్పూర్తిగా ఆరాధనాభావంగా చెప్పి ముగించారు .కాదేదీ కవిత కనర్హం అన్నది విదులగారి సిద్ధాంతం .దాన్ని  సరళమైన భాషలో  చెప్పి సార్ధకం చేశారు డా విదుల .

2-కవితా కలశం –లో డా చర్లమృదులకుమారి –గణపతి ప్రార్ధనతో వినాయకునీ , తమ తండ్రిగార్నీ స్తుతించి,సరస్వతీ ప్రార్ధన చేసి ,గోదారి మహిమ అభివర్ణించి వసంత మహాత్మ్యాన్ని కొనియాడి ,తనభావ జాలాన్ని ఎరిగించి ,తన అన్వేషణ ఒకలక్ష్మీ బాయి ,కస్తూర్బా ,దుర్గాబాయ్ ,గార్గీ, మైత్రేయి మొదలైన వనితా రత్నాలను అన్వేషణ చేశారు .ఆధునిక స్త్రీ ‘’కురులలో పూలు ,కంటికాటుక ,నుదుట బొట్టు,గాజులగలగల ‘’కనపడకపోవటం తో బాధ పడ్డారు .స్త్రీ ద్వాదశ రూప వైభవాన్ని వర్ణించారు .అశ్లీల సినిమాలు చూస్తే వేదనా  భరితనై తపించి పోతాను’’అని   తన సున్నిత హృదయం ఆవిష్కరించారు .ఇంగ్లీషు ఉగాది పై వ్యామోహం నచ్చలేదు .ఈయుగ లక్షణం అంతు పట్టలేదు .బాలిక ఈశ్వరుని పుత్రిక గా కనిపించింది .అమానుషం నశించి శౌర్య ,మానవత్వాలు పెరిగి సహన ,శాంతులు పరిఢవిల్లాలని ఆకాంక్షించారు .గ్రంథాలయం ‘’పవిత్ర దేవాలయం –జాతి మత భేదాలు పోగొట్టే పవిత్రాలయం ‘’అన్నారు .విహార యాత్రలో భేదాలు అదృశ్యం ఐకమత్యం ప్రత్యక్షం పరిశీలన సాక్షాత్కారం  .యువతకు సత్యాహి౦సలే ఆకర్షణ కావాలి .ధర్మం పై ఆకర్షణ పెరగాలని ఆకాంక్షించారు .విశాఖ సాహితీ వైభవాన్ని భారతమాత ను మధురమైన బాల్యాన్ని నెమరేసుకొన్నారు .’’ఆనంద నికేతన్ గాంధీ గారు కలలుగన్న గ్రామం ‘’అని  ఆరాధనాభావంతో అన్నారు .అన్నదానమహిమను ,చెబుతూ ‘’నీవు జీవిస్తూ ఇతరులను జీవింప జేయటం ‘’అనే పవిత్ర నిర్వచనం చెప్పారు .రైలులో ఆడవారి ప్రత్యేక బోగీ చివర ఉండటాన్ని తప్పు పట్టారు .మహాత్యాగి గణపతి శాస్త్రి గారినీ ,సేవా పరీణ సుశీల గారిని స్మరి౦చి పితా మాతృ నివాళి ఇచ్చారు .శ్రీరాముడు ‘’నవమి చంద్రుడు ‘’అని కొత్త భావంగా చెప్పారు .అమ్మది పరవళ్ళు తొక్కే ప్రేమ .గాంధీని సచివుడుగా ఉన్న తండ్రి ని వ్యాస వాల్మీక కాళిదాసు ల మూర్తి స్వరూపమని కీర్తిస్తూ ‘’విలువైన భారతీయసంస్క్రుతిని –ఆర్ష ధర్మ సూత్రాలలో పొందు పరచి -‘ఆంధ్రావనిలో కీర్తి గాంచిన పుణ్య మూర్తి ‘’అని కీర్తి కిరీటం పెట్టారు.’’విద్య దానమే నా లక్ష్యం ‘’అని స్పష్ట పరచి  ఆనాటి మరచెంబు  బూరెలు ,బొప్పాయి పండు ,మురళి ,అరటి పువ్వు ,వివిధ ఆహారాలు వివరించి ,గురు స్మరణ చేశారు .’’పాపం, అన్యాయం  చేయ వద్దని’’కరోనా సందేశంగా తెలిపారు  .చివరగా లక్ష్మీ తులసిని ‘’సర్వ తీర్దాలు ,సకల దేవతలు సర్వ వేదాలు పురాణాలు ,అన్ని తీర్దాలు ‘’ఉన్నాయని ఆమె పూజ సకల సంపత్  దాయకమని ముగించారు .

3-సంగీత సాహిత్య రవళి –లో శ్రీమతి వాణీ ప్రభాకరి –తాను అయిదు వరల్డ్ రికార్డ్ అవార్డీ నని చెప్పుకొని విజయం దేశ పురోగతికి మూలమని ఉత్తమమార్గం లో నడవమని భారతీయుడికి హితవు చెప్పి ,వాట్సాప్ ,విశ్వరూపాన్ని వేయి విదాలమెచ్చి ,’’ఆనందమే అందము ,ఆరాధనే ఐశ్వర్యం ‘’అని ,జాతిని విజ్ఞాన వంతులుగా తీర్చే అధ్యాపకులకు వందనమొనర్చి ,విశ్వం లో శాంతి కాంతి విరబూయాలని ఆకాంక్షించారు .ప్రతి అక్షరం మనిషి ప్రాణమే అన్నారు .తమ తణుకు పట్టణాన్ని ‘’తళుకుల పురి ,తారకాపురి కవులకు కళలకు నిలయం ‘’  అని గొప్పగా చెప్పగా  నాతో తణుకు నన్నయ పీఠం  మూడు సార్లు సాహిత్యోపన్యాసం చేయించిన విజయబాంక్ ఆఫీసర్ జి .ఎల్ మూర్తి గారు గుర్తుకు వచ్చారు .ఆసభల్లోనే  రసరాజు గారిని మొదటి సారి చూశాను .కట్నం లేకుండా పెళ్లి చేసుకొన్నతన అత్తింటి వారి మంచి తనాన్ని నారు మంచి వాణి గారు మననం చేసుకొని సహృదయతకు నీరాజనం పట్టారు .గూగుల్ ఆంటీ కి హాట్సాఫ్ చెప్పారు .ఆంధ్రుల ఆవకాయ కారానికి నమస్కారం పెట్టి ,ఇంటి వంటను మెచ్చి,శ్రమైక జీవన సౌందర్యాన్నిలాల్ సలాం పెట్టి ‘’జీవన వేదం నా సంగీత నాదం ‘’అని పలికి ,కళలు ,కలలు, కథలు సార్ధకం కావాలని కోరారు .జిహ్వను కీర్తించారు .తమగ్రామం కాకర పర్రు ‘’వేదం ,పండిత మడి,ఆచరణలకు పుట్టినిల్లు ‘’అన్నారు .తాతగారింటినీ అమ్మను,నాన్న, గురుదేవుడిని  రైతన్నను సంస్మరించారు. సప్తవర్ణాలు కలిసి తెలుపు రంగు అయినట్లు అన్నిజాతులూ కలిస్తే ఒకే జాతి అని  సైన్టిఫిక్ గా చెప్పారు ,  తిలక్ పోస్ట్ మాన్ పై కవిత్వం రాస్తే ఈమె పేపర్ బాయ్ ,పోస్ట్మన్ ,సూర్యగ్రహణ మేడే కార్మికులకు సహృదయ వందనం చేశారు .’’స్త్రీ వాదమే స్త్రీ వేదం –స్త్రీ నాదం  ప్రగతికి జీవనాదం ‘’అన్నారు .కల్తీ ప్రపంచం చూసి కలవర పడ్డారు .అంతర్జాల కవిత్వానికి హారతి పట్టారు .’’సమాజ సేవలో ముఖ్యపాత్ర నవ్వుదే’’అని నవ్వు రహస్యం విప్పారు .సమాజం లో సంధించిన బాణం నేటి స్త్రీ .’’అవార్డ్స్ పంట వాణి ఇంట –సాహిత్య సంగీత చిత్ర కళ’’లలో ఎన్నో అవార్డులు రివార్డ్ లతో వాణి గారిల్లు  తళతళా,మిలమిలా.మధ్య మావతి రాగం లా ఈ కవితలు మనోల్లాసం కళ ,సంస్కృతీ ,వైభవంగా ఉన్నాయి .

  ఈ ముగ్గురు తమ కవితలకు సార్ధకమైన శీర్షికలు పెట్టి కమ్మని కవితలతో న్యాయం చేకూర్చి నందుకు అభినందనలు .అందమైన ముఖ చిత్రం కవిత్వాలకు మరింత వన్నె తెచ్చింది .అందరు చదివి ఆన౦దించాల్సిన పుస్తకం .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -11-1-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ చర్ల గణపతి శాస్త్రి గారి సాహిత్య ,శ్రీమతి చర్ల సుశీలగారి సేవాపురస్కార ప్రదాన సభ విశేషాలు

10-1-21ఆదివారం ఉదయ౦  ధనుర్మాస సందర్భంగా త్ల్లవారుజామున 3-30గం లేక్ లేచి స్నాన స౦ధ్యా పూజాదికాలు పూర్తి చేసుకొని ,మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో స్వామివార్లకు ఉదయం 5గం.లకు అరిసెలతోప్రత్యేకపూజ జరిపించి ,ఇంటి వద్ద టిఫిన్ తిని కాఫీ తాగి ,ఉదయం 8-30గం.లకు రెండు కార్లలో నేనూ ,మా శ్రీమతి ప్రభావతి ,సరసభారతి కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి శ్రీ శ్రీనివాస శర్మ దంపతులు మా కోడలు శ్రీమతి రాణి ,సరసభారతి కార్యవర్గ సభ్యులు శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు గారు,ఒక కారులో, మా అబ్బాయి వెంకటరమణ , కోడలు శ్రీమతి మహేశ్వరి ,జాగృతి సంస్థ  నిర్వాహకులు శ్రీమతి రాజీవి శ్రీమతి కనకమహా లక్ష్మి ఒక కారులో బయల్దేరి తేలప్రోలు  ఏలూరు దెందులూరు మీదుగా మా గబ్బిట వారి అగ్రహారం రామారావు గూడెం లో మా స్థలం లో శ్రీ కొలచిన ప్రసాద రావు శ్రీమతి భారతి దంపతులు నిర్మించిన శ్రీ భక్తాంజనేయ స్వామి కి ఉయ్యూరునుంచి తెచ్చిన తమలపాకులు చామ౦తి పూలతో అష్టోత్తర సహస్ర నామ పూజ చేసి  తెచ్చిన, కట్టిన పుష్పమాలలతో స్వామిని అలంకరించి  మంత్రపుష్పాదులు పూర్తిచేసి ఉదయం 11గం.లకు భీమడోలు ,చాగల్లు మీదుగా మల్లవరం చేరటానికి ట్రాఫిక్ ,రోడ్లు వంతెనల నిర్మాణం దారి మళ్లింపు సమస్యలను ఎదుర్కొని మధ్యాహ్నం 1-30కు మల్లవరం శ్రీ చర్ల గణపతి శాస్త్రి శ్రీమతి చర్ల సుశీల స్మారక వృద్ధాశ్రమం కు ఉదయం 10గం లకు చేరాల్సింది , మూడున్నరగంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 1-30కి చేరాం  .అప్పటికే వారి సమావేశాలు పూర్తయి ,భోజనాలు చేసి మా కోసం ఎదురు చూస్తున్నారు .మాకు కూడా భోజనాలు వడ్డించగా తిన్నాం .రచయిత శ్రీ బద్రి దంపతులకు సరసభారతి పుస్తకాలు అందించి బద్రి గారు తాము రాసిన పుస్తకాలు ఇవ్వగా తీసుకొన్నాం .ఉయ్యూరు నుంచి 200 లడ్డూలు తయారు చేయించితెచ్చి  వృద్ధాశ్రమం లో పంచమని చర్ల సిస్టర్స్ కు  అందజేశాం .

https://photos.google.com/u/1/share/AF1QipN-gRHi8M90jJ6BMs8Fg7aNTKBskYI4yfIt0gucWBNQNn3f0PgBwPztiq-XymwmPA?key=ZGZ4WXZPNXJxYzgzczNQdmVlTU1yR0lYb3YyaXZR

  మధ్యాహ్నం 2-30కు

డా చర్ల విదుల గారి అధ్యక్షతన గణపతి శాస్త్రిగారి 113 జయంతి పురస్కార సభ జరిగింది .శ్రీమతి వాణీ ప్రభాకరి ప్రార్ధన గీతం శ్రావ్యంగా ఆలపించారు .మమ్మల్నిద్దర్నీ వేదికపైకి .ఆహ్వానించి  శాలువా ,జ్ఞాపిక,పుష్పమాలలతో   శ్రీ ఆనంద్ దంపతులు ,మాద్దరికీ చెరొక సీల్డ్ కవర్ అందజేయగా  డా.చర్లమృదుల డా విదుల సిస్టర్స్ ఆత్మీయ సన్మానం చేసి  నాకు కళాప్రపూర్ణ  బ్రహ్మశ్రీ చర్ల గణపతిశాస్త్రి గారి సాహిత్య పురస్కారం ,మా శ్రీమతి ప్రభావతికి శ్రీమతి చర్ల సుశీల సేవా పురస్కారం అందజేశారు .శ్రీమతి వాణీ ప్రభాకరి  రాసిన అభినందన బిరుదు సన్మాన పత్రాలను మాకు గౌరవంగా అందజేసి ,నాకు ‘’ఆధునిక ఆంద్ర భోజుడు ‘’’బిరుదును ,మా శ్రీమతికి ‘’ఆధునిక ఆదర్శ మహిళ’’ బిరుదు ప్రదానం చేస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు ,వీణా రవళి శ్రీమతి వాణీ ప్రభాకరి గారి చేత హర్షధ్వానాల మధ్య ప్రకటింప జేశారు .సరసభారతి చేస్తున్న సాహిత్య, ఆధ్యాత్మిక కృషిని చర్ల సిస్టర్స్,శ్రీమతి వాణి సభాముఖంగా  తెలియజేశారు . శివలక్ష్మి దంపతులు జాగృతి నిర్వాహకులు మమ్మల్ని రోజా పుష్పమాలలతో శాలువాలతో ఘనంగా సత్కరించి అభిమానం చూపారు .

  నేను మాట్లాడుతూ ‘’గణపతి శాస్త్రి గారి వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి బహు భాషా వేత్త ,మహాత్ముని ఆదర్శాలైన సత్యాహి౦సలను  ఖద్దరు ధారణా జీవితాంతం  త్రికరణ శుద్ధిగా పాటించి భారత స్వాతంత్రోద్యమం లో ఉత్సాహంగా పాల్గొని .చేసిన సేవలకు ప్రభుత్వమిస్తానన్న భూమిని ,పెన్షన్ ను తిరస్కరించిన ఆదర్శమూర్తి వినోబా భూదానయజ్ఞానికి తనస్వంతభూమి అయిదు ఎకరాలు దానం చేసిన త్యాగామయులు ఉత్తమ ఉపాదాయాయులు విజ్ఞానాత్మక ,కర్తవ్య బోధగా రాసిన బహు గ్రంధకర్త ,అస్పృశ్యత ను నిరసిస్తూ తన ఇంట్లో  అస్ప్రుశ్యునికి  స్థానం కలపించిన ఆదర్శమూర్తి ,సాహిత్య సేవకు కళాప్రపూర్ణ ,కేంద్ర సాహిత్య అకాడెమి పురాస్కారం  పొందిన విజ్ఞాన దాత ,ఆర్ష విజ్ఞాన సర్వస్వం ,దాని వ్యాప్తికి అహరహం కృషి సల్పిన సంస్కారి ,నిగర్వి అనుక్షణ సేవాతత్పరులు అయిన కళాప్రపూర్ణ పద్మ శ్రీ చర్ల గణపతి శాస్త్రి గారి సాహితీ పురస్కారం  అ౦దు కొంటున్నందుకు  నాకూ ,ఆపన్నులపాలిటి అన్నపూర్ణ ,సేవాతత్పర  చారుశీల శ్రీమతి చర్ల సుశీల సేవాపురస్కారం మాశ్రీమతి శ్రీ మతి ప్రభావతి అ౦దుకొంటున్నందుకు  గర్వంగా ఉందనీ వినమ్రంగా స్వీకరిస్తున్నామని ,సమాజ సేవే ఉచ్చ్వాస నిశ్వాసాలైన డా చర్ల సిస్టర్స్ తలిదండ్రుల ఆదర్శాన్ని పాటిస్తూ సమాజ సేవ చేసి అభినందనలు   అందుకోవటం మనకు గర్వకారణమనీ  మాటల కంటే చేతలతో ప్రజా హృదయాలను గెలుస్తున్నారని ‘’చెప్పాను .            విశాఖ నుంచి వచ్చిన శ్రీ ఆనందరావు దంపతులు ,తమ తల్లిగారు ఆశ్రమానికి అందజేసిన 1 కోటి రూపాయల ధనాన్ని, చర్ల సిస్టర్స్ కు అందజేయటమేకాక అమెరికానుంచి స్నేహితులు పంపిన నూతన వస్త్రాలను ఆశ్రమం లోని మహిళకు తమ చేతుల మీదుగా అంద జేసి ఎందరికో ప్రేరణ కలిగించారు  .ఈ దంపతులకు సరసభారతి పుస్తకాలు అందించి శాలువా కప్పి అభినంది౦చాము .మరో ప్రముఖులు ఆశ్రమానికి 15 వేల రూపాయలు అందించారు .అక్కడి ప్రముఖులకు కూడా సరసభారతి పుస్తకాలు అందజేసి ,అందరికీ వీడ్కోలు చెప్పి ,సాయంత్రం 4గంటలకు బయల్దేరి  తణుకు మీదుగా ఉయ్యూరు చేరే సరికి రాత్రి 8-30అయింది .మా రమణ తెచ్చిన ఇడ్లీలు తిని కాస్త విశ్రాన్తితీసుకోన్నాం పోద్దుతినుంచీ పాల్గొన్న కార్యక్రాల ఫోటోలు అందరికీ పంపి ఈ వ్యాసం రాశాను. రాస్తూ వారిచ్చిన కవర్ లో ఏముందో అని చూస్తె చేరి మూడు వేల రూపాయలు ఉన్నాయని  గ్రహించి ఆశ్చర్యపోయాం. శ్రీ ఆనంద్ దంపతుల వితరణకు కృతజ్ఞతలు తెలియ జేస్తూ –

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-1-20-ఉయ్యూరు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 23-భద్రాద్రి ‘’అన్నపూర్ణ సత్ర’’ నిర్వాహకుడు -వెంకట రమణ బ్రహ్మ చారి

మహా భక్త శిఖామణులు

23-భద్రాద్రి ‘’అన్నపూర్ణ సత్ర’’ నిర్వాహకుడు -వెంకట రమణ బ్రహ్మ చారి

      జనన విశేషాలు

గుంటూరు జిల్లా అలవలపాడు లో ఆరు వేల నియోగుల కుటుంబం లో పుట్టిన వెంకట రమణ బ్రహ్మ చారి తండ్రి సుబ్బ రామయ్య .పొట్టిగా సన్నగా ,ఎప్పుడూ ధావళీ గోచీ తో  మాత్రమే తిరిగేవాడు .గోదావరి నుండి నీళ్ళు మోసుకొని వచ్చి ,తన సత్రానికి అందించే వాడు .ఆసత్రానికి యజమాని వంటవాడు నీళ్ళవాడు ,పూజారి సేవకుడూ అన్నీసుబ్బ రామయ్యే   .ఆల్ ఇన్ వన్.15వ ఏట భార్య చనిపోతే కొడుకును తీసుకొని భద్రాచల సీతారామ కల్యాణం చూడటానికి వెళ్లి చూసి ఆన౦దం పొంది అక్కడే ఉండి పోవాలనుకొని ,భిక్షా పాత్ర చేబట్టి వచ్చేదానితో తానూ కొడుకు జీవిస్తూ అతిధి అభ్యాగతులను కూడా ఆదరిస్తూ ,కొంతకాలానికి చనిపోయాడు .

     భద్రాద్రిఅన్న పూర్ణ సత్రం

 అన్న పూర్ణ ఉపాసకుడైన వెంకట రమణ తండ్రి మార్గం లోనే,శునక సూకరాలకూ ఇంతపెడుతూ  జీవిస్తూ ధన్యుడయ్యాడు.21వ ఏట ‘’అన్నపూర్ణ సత్రం ‘’అనే పేరుతొ ఒక కుటీరాన్ని యాత్రికులకు ఒక పాకను నిర్మించి ,దేవమందిరంగా మరో గుడిసె వేసి అన్నదానం నిర్విఘ్నంగా సాగిస్తూ క్రమంగా సత్రాన్ని పెద్ద అన్న దాన  సత్రంగా  మార్పు చెందించాడు .వంటపాత్రలు మొదలైన సామగ్రి కూడా బాగా సమకూర్చాడు .బ్రహ్మ చారి చేతిలో చిల్లి గవ్వ లేదు .ఆ వూరు వదలి ఎక్కడికీ వెళ్ళే వాడు కాదు .సత్రం అరణ్య౦ దగ్గరలో ఉండటం ,ధనవంతులు అక్కడ లేకపోవటం  ఇబ్బందే కానే సత్రం మూడు పూలు ఆరుకాయలుగా దిన దినాభివృద్ధి చెంది అందరికీ ఆశ్చర్యం కలిగించింది .తూము నరసింహదాసు గారు పూజించిన అర్చా మూర్తుల పూజ ను బ్రహ్మ చారి గారు భక్తీ శ్రద్ధలతో అర్చిస్తున్నారు .

   శ్రీరామమహిమ

  ఒకసారి సీతారామ కల్యాణానికి అనుకోకుండా వేలాది యాత్రికులు వచ్చి గోదావరీ స్నానం చేసి ఈ సత్రానికి భోజనాలకు వచ్చారు .వండిన పదార్ధాలు చాలా స్వల్పం గానే ఉన్నాయి .అంతమందికి చాలవని భయపడుతూ వంటవాళ్లు భగవరాదనలో ఉన్న బ్రహ్మ చారి గారికి .ఆయన చాలా నిబ్బరంగా వంట శాలకు వెళ్లి ‘’శ్రీరామానుగ్రహం ఉంటే మనకు తరుగు లేదు .ముందు వడ్డన పని మొదలు పెట్టండి ‘’అని చెప్పి ,ఆ పదార్ధాలపై ఒక వస్త్రం కప్పి , చేతులు జోడించి నందీశ్వర సాన్నిధ్యం పొంది ‘’భగవానుని గుణగానం చేసి ,నరసింహదాసు గారి అర్చా వైభవం ఎవరు పొందారో ,నా పూర్వజన్మ సుకృతం తో నాకు నాపూజలో ఆత్మ స్వరూపుడుగా ఉన్నడో,ఆ శ్రీ రామ చంద్ర మూర్తి ఈ అన్నోదకాల చేత  భూత సంతృప్తి గావించి అనుగ్రహించుగాక ‘’అని చెప్పి యాత్రికులతో –

‘’తక్కువ లేదు నాకు నిరతంబు సుదర్శన చక్ర ధారియై –ప్రక్కల నిల్చి లోపముల బారగా దోలుచు ,సౌఖ్య సంతతుల్ –మిక్కిలి కూర్చు మించు దయ మేలు లొనర్చెడి రాము డుండ –నాకెక్కడి లేము లెక్కడివి,ఇష్ట ఫల వ్యతి రేక సంగతుల్ ‘’అని చెప్పి వడ్డన మొదలుపెట్టమని వంటవారికి చెప్పి తన పూజా మందిరం లోకి వెళ్లి స్వామికి మంత్రం పుష్పం చెప్పి పూజ ముగించారు .పంచ భక్ష్య పరవాన్న విందు భోజనాలు తృప్తిగా ఆరగించి బ్రహ్మచారి గారి ప్రభావాన్ని స్తుతిస్తూ సీతారామ దర్శనం చేసి కల్యాణ౦  చూసి ,నిత్యం ఈ సత్రం లోనే భోజనం చేసి ,బ్రహ్మచారి గారి సత్కారాలుపొంది సంతృప్తిగా స్వగ్రామాలకు వెళ్లి పోయారు .

  మారు వేషాలలో   రామ లక్ష్మణ దర్శనం

ఇంకో సారి ఉత్సవాల రోజుల్లో ఒఅ రోజు పగలు రెండు జాములవరకు వంట పదార్ధాలు లేకపోవటం తో వంటవాళ్లు భయపడి పారి పోయారు  ,రామపాదాలపై వ్రాలి ‘’ఈ కష్టాన్ని ఎలా తీరుస్తావో నీదే భారం ‘’అంటూ స్తోత్రగానాలు చేసి –‘’తిరు రేఖ లేర్పడ తిరునామములు బెట్టి –దౌత వస్త్రంబులు దనర గట్టి –తులసి పేరులు మెడ దులకరి౦పగ దాల్చి-ననెమ్మేన గంధంబు నెరి దగిల్చి -వెడ  నుత్తరీయముల్ నడుములకు న్జుట్టి-పూల దండలు శిఖ వ్రేలగట్టి –కుడి చేత జపమాల కొమరొప్పగా బూని – ఎడమచే బళ్ళెము లెనగ న౦ది –గక్ష భాగంబుల బుస్తకముల బూని-నలుపు నెరుపు గల మేను లరచు చుండ –బొడుగు గల వైశ్యు లిరువురు వడివడిగ వచ్చి – రా భూసురోత్తమ వసతి కడకు ‘’ వారిద్దరూ బ్రహ్మ చారి దగ్గరకు వెళ్లి నమస్కరించి ‘’అయ్యా !ఒకసారి సీతారాములకు మా ఆపద తీరితే రెండు వందల రూపాయలు మొక్కు చెల్లిస్తామని మొక్కుకొని అది తీర్చు కోవటానికి  ఇప్పుడు వచ్చాం’’అని చెప్పి ఒకపళ్ళెం నిండా ఉన్న ఆడబ్బు రెండు కొబ్బరి కాయలు తాంబూలం కర్పూరం సమర్పించగా బ్రహ్మ చారి గారు పరమానందం తో కొబ్బరికాయలు కొట్టించి హారతిప్పించి ,కట్నం చదివించి ,వారిద్దరిని అన్నప్రసాడం భోజనం చేసి వెళ్ళమని కోరి వారిది ఏవూరో చెప్పమంటే ‘’మేము తూర్పు దేశ వైశ్యులం కుటుంబం తో సహా వచ్చి గోదారి తీరాన మీ కుటీరం లో ఉన్నాం .మొక్కు తీర్చుకొని స్వామి దర్శనం చేసి వెడతాం .మా వాళ్ళు మా కోసం ఎదురు చూస్తుంటారు ‘’అని చెప్పి అదృశ్యమయ్యారు .ఆ ధనం తో పదార్ధాలు తెప్పించి వంటవాళ్లు లేకపోవటం తో తాననే గరిటకు పని చెప్పుదామని అనుకొంటుంటే –‘’పవిత్ర గోదావరి స్నానం చేసి నుదుట విభూతి తో పిలక జుట్టు  నీర్కావి ధోవతి తడిపొడి బట్టలతో ,అన్గోస్త్రాలతో చేతులలో ఉదకపాత్రలతో వేదపనసలు చదువుతూ సత్రం ఎక్కడుంది అని వెతుకుతూ ఇద్దరు వచ్ఛి ‘’బీదవాళ్ళం వంట చేస్తాం .మీ సత్రం లో వంట పని మాకు ఇవ్వండి .మాపని మీకు ఎప్పుడు ఇష్టం లేకపోతె అప్పుడే వెళ్ళిపోతాం ‘’అని చెప్పి బ్రహ్మ చారి చేతిలో ఉండే రెండు జలపాత్రలనూ చేరోకటి తీసుకొని స్నానానికి గోదావరికి వెళ్ళారు .బ్రహ్మచారి గారు పూజామందిరం లో భగవంతుని లీలకు కృతజ్ఞతలు చెప్పుకోనగా ,వారిద్దరూ వచ్చి అద్భుతంగా వంటలు చేయాగా ,స్వామికి సహస్రనామార్చన చేసి నైవేద్యం పెట్టి ‘’రంగ!ఆరగింపు ‘’అని వేడగా ,ఎక్కడి నుంచో ఒక పాము సర్రున వచ్చి  నైవేద్యాన్ని ఆఘ్రాణించి బ్రహ్మ చారి గారి తొడపై కెక్కి హాయిగా ఆడింది ,భోజనాలు పూర్తయ్యాయి .ఆ ఇద్దరు వంట కుర్రాళ్ళు గోదావరికి వెళ్లి వస్తామని చెప్పి మళ్ళీ రాలేదు .సర్పమూ మాయమైంది .

  అంటూ భోజనం చేయకుండానే రామ మంత్రం  జపిస్తూ ,తెల్లవార్లూ జాగారం చేశారు .మర్నాడు ఉదయం ఈ వార్త తెలుసుకొన్న పురజనులు వచ్చి శ్రీరామ దర్శనం పొందిన ఆయనను అభినందించారు .

    గోదారి నీరే నెయ్యి

  మరో సారి ఒక బ్రాహ్మణ సమారాధనకు నెయ్యి లేదు .అభ్యాగతులను భోజనానికి కూర్చోమని చెప్పి ,ఇద్దరు వంట వాళ్లకు చెరో నేతిపాత్రలిచ్చి  ‘’’గోదావరికి వెళ్లి  ఈ రెండు పాత్రలనిండా నెయ్యి అప్పుగా ఇవ్వమని చెప్పి నీటిని నింపుకొని రండి ‘’అని పంపారు .వాళ్ళు ఇంటికి వచ్చేలోపు నీరు నెయ్యిగా మారిపోయి ఆశ్చర్యం కలిగించింది .దానితో వడ్డన పూర్తి చేసి అందరికీ సంతృప్తిగా అన్న సమారాధన  జరిపించారు .

         గురు- శిష్యులు

  ఈ సత్రం లోనూ ,మరికొన్ని చోట్లా ఊరు పేరు లేని ఒక పిచ్చి వాడు తిరిగే వాడు .సన్నగా పొడుగ్గా చామనచాయతో చింపిరి బట్టలతోమూట, చిళ్ళ పెంకుల హారం తో  ఉండేవాడు .బ్రహ్మ చారిగారు అతడిని అత్యధికంగా ప్రేమించేవారు .ఆయన ఎవరు అని ఎవరైనా అడిగితె ‘’నా గురువు ‘’అనిచేప్పేవారు .అతడిని అడిగితే ‘’బ్రహ్మ చారి నా శిష్యుడు ‘’అనేవాడు  అతడికి భోజనం పెడితే కానీ ,బ్రహ్మ చారిగారు భోజనం చేసేవారు కాదు .అతడు అన్నం తింటుంటే వెంట రెండు కుక్కలు ఉండి అవికూడా తినేవి .ఇలా నిరతాన్న దానాన్ని వెంకట రమణ బ్రహ్మచారి 40 ఏళ్ళు నిర్విఘ్నంగా నిర్వహించి ,ఈ భారమంతా వకీలు తుంగతుర్తి నరసింహారావు గారికి అప్పగించి క్రీ శ.1919లో శ్రీరామ రంగైక్యం పొందారు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-1-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 22-కూర్మ దాసు -2(చివరి భాగం )

మహా భక్త శిఖామణులు

22-కూర్మ దాసు -2(చివరి భాగం )

కడప,  వేమవరం,నరసరావు పేట  సప్తాహాలు

కడప సప్తాహం లో ఒక రోజు గజోతోవం జరుగుతుంటే ,భక్తుల హారతులతో చలువ పందిళ్ళు ఒక్క సారిగా అంటుకొని మండగా ,ఒక కొత్త యువకుడు గజవాహనం నుంచి అవతరించి ,మంటలను ఆర్పేసి అదృశ్యమయ్యాడు .భగవదనుగ్రహం గా భావి౦చారందరూ .

  వేమ వరం సప్తాహం లో సప్తాహం చివర జరిగే అవభ్రుద స్నాన సమయం లో ,కూర్మ దాసు కు దగ్గరగా ఉన్న తాడేపల్లి రత్తయ్య మనవడు తటాకం లో పడి చని పోబోతుంటే ,ఆయనకు ఆ జన్మ విరోధి అయిన ఒకాయన వచ్చి ప్రాణాపాయం నుంచి కాపాడి రత్తయ్యకు ఆనందం కలిగించాడు .తను ఒక నూతన పురుషుని ప్రోద్బలం తో ఈపని చేశానని అతడు చెప్పాడు .నరసరావు పేట సప్తాహం నియోగి వైదీకి తగాదాలు లేకుండా సవ్యం గా సాగిపోయింది .అన్నదమ్ముల్లా అంతా కలిసి క్రతు విజయానికి తోడ్పడ్డారు .

        రామకోటి సమర్పణ

 రామకోటి ని భద్రాద్రి రాముడికి సమర్పించటానికి బయల్దేరితే ,చాప రాళ్ళ పల్లి ,మొలకలపల్లి మధ్యలో భక్తులు ఒళ్లుమరచి భజనలు చేస్తుంటే మృదంగ ధ్వనులు మిన్ను ముట్టాయి .రామ ప్రభువు దాసు గారికి సాక్షాత్కరించగా ఆయన స్తుతి తో సాయంకాలం దాటింది క్షుత్పిపాసలు మరచిపోయి భక్త యాత్రికులు పరమానందం పొందారు .మర్నాడు ఉదయం భద్రాద్రి చేరి సంరంభంగా శ్రీరామకోటి సమర్పించి కృతార్దులయ్యారు .

   ఇతర సత్ర యాగాలు

 సికందరాబాద్ సప్తాహం లో గుండా మహారాజు దగ్గర శ్రీ పాండురంగ మంత్రోప దేశం పొంది ,ఆప్రభావం తో లింగ గూడ,గొసవీడు లలో సప్తాహాలు చేసి ధన్యుఅలయ్యారు దాసు .గొసవీడు సత్ర సమయం లో యాత్రికులకు దాసు గారు ఒక్కొక్క లడ్డు మాత్రమె వడ్డించే ఏర్పాటు చేశారు .మారు అడిగితె ఎవరూ మాట్లాడటం లేదు ఇంతలో ఒక తేజో మూర్తి వచ్చి దాసుగారితో ‘’లడ్డూలు చాలవని అను కొంటున్నావా ?దైవానుగ్రహం తో కావలసినన్ని వస్తాయి .అడిగినవారందరికీ ఎన్నికావాలంటే అన్ని వడ్డించమని చెప్పు ‘’అని చెప్పి అంతర్హితుడయ్యాడు .ఇది శ్రీరామ మహిమాప్రభావమే .ఎన్ని లడ్డూలు వేసినా రాసి తరగటం లేదట .గొప్ప వింతగా చెప్పుకొన్నారు .

        దాసుగారి ఇతర సేవాకార్యాలు

  లింగ గూడసత్రం లో మగవాళ్లు వెంక బడగా ముందు వచ్చిన ఆడవారు ఆకలికి ఆగలేక భోజనాలు చేస్తుంటే ,కమ్మగా వంటవారు వండి వడ్డిస్తుంటే ఒక లావు పాటి ఆయన వచ్చి ఆకలి అని గోల చేస్తే దాసుగారు ప్రత్యేకంగా కూర్చోపెట్టి వడ్డింప జేయగా ,అతుడు భోజనం చేస్తూ –‘’పరులు ని౦ది౦చు పట్ల గోపంబు గొనక –శాంతమును బూని వినయపుష్కలత నూని –విహిత సంభాష ణంబుల వెలువరించి –స్వా౦తమున వారి సంతస పరపు సతము ‘’అనే పద్యం చాలాసార్లు పాడి గోవింద గోవింద అని భోజనం చేసి అంతర్ధానమయ్యాడు .దాసు గారు ఆయన సాక్షాత్తు భగవంతుడే అని ,తనకోపాన్ని తగ్గించుకొన్నారు .జీవితకాలం లో దాసుగారు 20 సప్తాహాలు నిర్వహించి ,యాత్రిక సౌకర్యార్ధం నాలుగేళ్ళు గోసవీడులో ఒక ఏడాది బూర్గం పహాడ్ అనే బూరగొమ్మలపాడు ,కొత్తగూడెం లో నాలుగేళ్ళు ,పండరి క్షేత్రం లో తొమ్మిదేళ్ళు అన్నసత్రాలు నిర్వహించారు .చీరాలలో పాండురంగాపురం లో పాండు రంగ ప్రతిష్ట చేసి ,దీనికి అనుబంధంగా నిరతాన్న సత్రం నిర్వహించారు .

   భక్తి ప్రచార కార్యక్రమం లో గుంటూరు నుంచి బయల్దేరి మధ్యలో మజిలీలు చేసి షోలాపూర్ స్టేషన్ లోమకాము చేయగా ,అమావాస్య చీకటి లో ,అర్ధరాత్రి ఇద్దరు దొంగలు దాసుగారి రెండుమూటలు ఎత్తుకుపోగా ఇద్దరు యువకులు వారిని అడ్డగించి సొమ్ము వారి నుంచి తీసుకొని పోలీసు డ్రెస్ లో వచ్చి అప్పగించి చోరీ విషయం అందరికీ చెప్పి అదృశ్యమయ్యారు .పండరి చేరి రంగని దర్శించి గుంటూరు చేరారు .చీరాల పాండురంగాపుర పాండురంగ దేవాలయం లో నిష్కామ సౌభాగ్య దురంధర ,సమయోద్దండ ,కోలాహల మొదలైన బిరుదులున్న  శ్రీమదద్దంకి తిరు వేంకటాచార్య దేశికోత్తముల ఆధ్వర్యం లో ప్రతిష్టి౦ప బడిన స్వామికి కైంకర్యం మహా వైభవంగా జరుపుతున్నారు.

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-1-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

40ఏళ్ళు గా కోర్టు కేసులు సంస్కృతం లోనే వాదిస్తున్న న్యాయవాది-ఆచార్య శ్యాం ప్రసాద్ ఉపాధ్యాయ

 

 

 

40 ఏళ్ళుగా కోర్టు కేసులు సంస్కృతం లోనే వాదిస్తున్న న్యాయవాది-ఆచార్య శ్యాం ప్రసాద్ ఉపాధ్యాయ

 

అతధునిక 21 వ శతాబ్దం లో భారత దేశం లో న్యాయవాదులంతా ఇంగ్లీష్, హిందీ లేక వారి ప్రాంతీయ భాష లో మాత్రమే కేసులు వాదిస్తుంటే, వారికి భిన్నంగా సంస్కృతం లోనే కేసులు వాదించే ఏకైక లాయర్ వారణాసి లోని  ఆచార్య శ్యాం ప్రసాద్ ఉపాధ్యాయ .ఇప్పటికి సుమారు 40 సంవత్సరాలనుంచీ ఆచార్య ఉపాధ్యాయ సంస్కృతం లోనే కేసులు వాదిస్తూ రికార్డ్ సృష్టించారు .

  ఆచార్య ఉపాధ్యాయ అఫిడవిట్ లు ,లీగల్ డాక్యుమెంట్ లు అన్నీ సంస్కృతం లోనే రాస్తారు .ఆయన సంస్కృత బి.యే. బి .ఎల్ .మరియు ఆచార్య .ఈయన తండ్రి భారతదేశం లోని కోర్టులలో సంస్కృతం వాడకం లేదని చెప్పినప్పుడు అవాక్కయ్యారు .అందుకే తనతో అది ప్రారంభం కావాలని దీక్ష బూని అనుసరిస్తున్నారు .వీరికుమారుడికీ దీనిపై అభిలాష బాగా ఉన్నది .సంప్రదాయ బద్ధమైన నల్లకోటు ధరించిదట్టమైన విభూతి రేఖలతో ,తిలకం తో కోర్టుకు హాజరౌతారు ఆచార్య .సంస్కృతంలో ఉపాధ్యాయ వాదం ప్రారంభించగానే కోర్టు హాలు లో నిశ్శబ్దం తాండవించి ఆయన  గంగా ప్రవాహ సదృశ వాగ్దోరణినికి ముగ్దులౌతారు  .అయన మాట్లాడే సంస్కృతం అత్యంత సరళంగా ఉండి,అందరికీ అతి తేలికగా అర్ధమౌతుంది  .తన క్లెయింట్ లకు కూడా కేసు వివరాలు సంస్కృతం లోనే వివరిస్తారాయన  .న్యాయమూర్తులు కూడా ఆయన  సంస్కృత దీక్షను  అభినందించి ,ప్రోత్సహిస్తున్నారు  .ఆయన ప్రభావం వారిపైనా పడటం తో,తీర్పులు కూడా హిందీలో కాని  ,సంస్కృతం లో కాని ఇస్తున్నారు .  ఆయన సంస్కృత భాషకు 1978నుంచి అంకితభావంతో చేస్తున్న విలువైన కృషిని,సేవ  గుర్తించి 2003లో ఆచార్య ఉపాధ్యాయకు ‘’సంస్కృత మిత్ర ‘’బిరుదు ప్రదానం చేసి కేంద్ర మానవ వనరుల శాఖ  గౌరవించి సత్కరించింది .సంస్కృతం లో కేసులు వాదించటమే కాదు సుమారు 60కి పైగా నవలలు సంస్కృతం లో రాసి ఆదర్శంగా నిలిచారు శ్యాం ఉపాధ్యాయ ఆచార్య .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-1-21-ఉయ్యూరు

Posted in సమీక్ష | Tagged | Leave a comment

55ఏళ్లనాటి ఉయ్యూరు హైస్కూల్ ఇంటివద్ద ట్యూషన్ శిష్యురాలు నన్నుమామయ్యాఅంటూ పరవశించి పిలిచే మేన కోడలు లాంటి గోసు కొండభ్రమరాంబా ఇవాళ సాయంత్రం మాఇంట్లో తమ్ముడు వాసు దేవ శాస్త్రి తో

55ఏళ్లనాటి ఉయ్యూరు హైస్కూల్ ఇంటివద్ద ట్యూషన్ శిష్యురాలు నన్నుమామయ్యాఅంటూ పరవశించి పిలిచే మేన కోడలు లాంటి గోసు కొండభ్రమరాంబా ఇవాళ సాయంత్రం మాఇంట్లో తమ్ముడు వాసు దేవ శాస్త్రి తో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 22-కూర్మ దాసు -1   పంగుం లంఘ యతే

మహా భక్త శిఖామణులు

22-కూర్మ దాసు -1

  పంగుం లంఘ యతే గిరీం

ఇలపావులూరి  వెంకట సుబ్బయ్య అనే కూర్మ దాసు బాగా  బీద వాడు విద్యా శూన్యుడు ,సుందర దేహుడు .తండ్రి శ్రీనివాసులు ,తల్లి ఆదెమాంబ . సోదరులు వెంకట కృష్ణయ్య ,సీతారామయ్య .19వ శతాబ్దం లో దాసు జననం .జన్మతోనే కుంటి వాడు .నివాసం కందుకూరు తాలూకా సింగమనేని పల్లె ..అక్షరాభ్యాసం తోనే భక్తి బీజం మొలకెత్తి,క్రమంగా పూలు పళ్ళూ కాసి స్థిరపడింది .ఉపనయన వేడుకా జరిగింది .భజన మండలి స్థాపించి నిత్య భజనలు చేస్తూ రామ, కృష్ణ ,నరసింహ జయంతులు జరిపేవాడు .

 వెంకట కృష్ణయ్య కూర్మదాసు అవటం

ఆకాలం లో మహాద్భుత తరంగ గానం చేసేవాడు ఏలేశ్వరపు సీతారామాంజనేయులు .ఈయన్ను కలవాలని కోరిక ఎక్కువగా ఉండేది.డబ్బు లేదు కాళ్ళూ లేవు .దేవుడిపై భారం వేసి చంకకర్రల సాయం తో ,నడిచి మజిలీలు చేస్తూ ,ఒంగోలు రైల్వే స్టేషన్ లో ఒక ఉదారుని సహాయం తో వెల్లటూరు చేరి ,అక్కడ మల్లాది సుబ్బావదానులుచేసే సప్తాహం లో పాల్గొనటానికి వెడుతున్న సీతారామాంజనేయులు గారిని కలిసి ఆయనతో వల్లభాపురం వెళ్లి సుబ్బదాసు గారినిదర్శించి ఆయన అభిమానం పొందభక్తి ,ఇతడి తత్పరతకు సుబ్బదాసు గారు ఆశ్చర్యపడి హస్తమస్తక న్యాయంగా   ఆశీర్వ దించి ,అలనాటి పాండురంగని భక్తుడైన కూర్మ దాసు లాగా ప్రసిద్ధి చెందమని    ‘’కూర్మ  దాసు ‘’అనే పేరు పెట్టి పిలవటం ప్రారంభి౦చగా లోకం అంతా కూర్మదాసు అనే పిలవటం మొదలెట్టారు . సుబ్బదాసు గారు బాలకృష్ణ లీలా తరంగాలతో మైమరపించారు పొద్దు గుంకి చాలా సేపయింది ఎవరికీ బాహ్య జ్ఞానం లేదు అందరూ అంతర్ముఖులై దివ్య గాన లీలలో తన్మయు లయ్యారు .అందరి చేత స్నానాలు చేయించి కొత్త బట్టలు ఇచ్చి షడ్రసోపేత భోజనం పెట్టి చందన తాంబూలాలతో సత్కరించి ,సుఖా సీనుల్ని చేసి సుబ్బదాసు గారు కూర్మ దాసుతో ‘’’నాయనా !నా లాంటి కుటుంబీకుడు ఇలాంటి సప్తాహాలు నిర్వహించటం కష్టం .నువ్వు కుంటి అని దిగులు పడకు . అది దేహానికే కాని మనసుకు కాదు నువ్వు ఈ సప్తాహ కాలక్షేపం నిర్వహిస్తూ దేశం లో పేరు పొందాలి ఇదిగో నిరతాన్న దాన శిరోమణి వరంగల్లు వరమ్మ గారు .వారి ఆశీస్సులు పొందు శుభం జరుగుతుంది ‘’అనగా ఆమెకు నమస్కరింఛి ఆశీస్సులు పొందాడు కూర్మ దాసు .

  పాండురంగ సప్తాహం

పాండురంగ సప్తాహం జరపాలని కూర్మ దాసుకు అనిపించగా వరమ్మగారి సహాయంతో పండరీపురం వెళ్లి పాండురంగ స్వామిని దర్శించి ,సప్తాహ దీక్షలు నిర్విఘ్నంగా జరిగేట్లుదీవించమని ప్రార్ధించి ,కొన్ని రోజులుండి,అక్కడి నుంచి తెనాలి చేరి ,తురగా కృష్ణయ్య  గారింట్లో జరిగిన భజనలో పాల్గొని ,ఈమని చేరి నేలనూతుల సుబ్బావధానులు గారింట బస చేసి,ఉపవాస దీక్ష చేసి బ్రహ్మ సత్రం చేయటానికి సిద్ధార్ధి సంవత్సర ఆషాఢశుద్ధ పంచమి శుభ ముహూర్తంగా ఏర్పాటు చేసుకొని ఊరివారికి తెలియ జేయాలను కొంటె అక్కడ వైదిక ,నియోగి తగాదాలు తీవ్రంగా ఉండటం తో,చందాలు ఇచ్చేవారెవరూ ముందుకు రాకపోతే ఇక మూడే మూడు రోజులు గడువు ఉందనగా ,ప్రజలేకాక వాతావరణమూ అనుకూలంగా లేకపోగా ఆ రోజు స్వప్నం లో శ్రీరామ లక్ష్మణులు వైష్ణవ వేషం లో సాక్షాత్కరించి ,ముహూర్తాన్ని నవమికి మార్చి కరపత్రాలు పంచిపెట్టమని ,మిగిలిన పనులు తామే చూసుకొంటామని అభయమిచ్చారు .

 ప్రోగ్రాం పేపర్లు ముద్రించటం ,పందిళ్ళు వేయించటం సుబ్బావదానులుగారు ఖర్చుతో పూర్తి చేశారు .పెద్దిరాజు మహాలక్ష్మమ గారిని మొదటి రోజు కు ఉభయం ఇమ్మని కోరితే బదులు చెప్పకుండా తలూపి వెళ్ళింది .నిరాశ పడిన దాసు గారు ,మండపం నిర్మించి అర్చా మూర్తులను ఏర్పాటు చేశారు .అర్ధరాత్రి దాటాక వరలక్ష్మమ్మ గారు అయిదు వందల రూపాయల పళ్ళెం తో వచ్చి అంద జేసి ,రామాజ్ఞతో మిగులు తరుగు బాధ్యతలన్నీ తనవే అని చెప్పి వెళ్లి పోయింది .మర్నాడు నుంచి బ్రహ్మ సత్రం మొదలై రోజూ ఎవరో ఒకరు ఉభయ౦   ఇవ్వటానికి ముదు కురాగా కొత్తపల్లి ,నిడమానూరు ,మైనం పాడు నుంచి వచ్చిన భక్త బృందాలకు ఘన సత్కారాలతో బ్రహ్మ సత్రం దిగ్విజయంగా ముగిసింది .దాసుగారి సప్తాహాలలో జాతి కులమత విచక్షణ లేదు అన్ని క్రతువులలో పాళీ భక్త బృందమే పాల్గొనేది

  ఒంగోలు సప్తాహం

ఒంగోలు సప్తాహం లో మూడవరోజు నృసింహో పాసకురాలైన కైవారం బాలాంబ గారిని శా౦తపరచటానికి 108బిందెల పానకం ,బస్తా వడ పప్పు నైవేద్యం పెట్టగా యాత్రికుడికి ఒక గిద్దెడు మాత్రమే పానకం లభించింది అంటే ఎంతమంది వచ్చారో ఊహించ లేము లక్షలాది జనం వచ్చారని భావించారు .ఆరోజుల్లో ఉచ్చిష్ట పాత్రలను తొలగించటానికి రెండు రెండెడ్ల బళ్ళు అనుక్షణం పని చేసేవి .రెండవ రోజు తరంగ గాన భజనలో ఒళ్ళు మరచిబ్రహ్మానంద  పరవశంతో నృత్యాలు చేశారు.దాసు గారు అక్కడికి రాగానే కోటి సూర్య ప్రకాశమైన ఆత్మజ్యోతి కూర్మ దాసుగారిని ముంచేసి ,ప్రేక్షకులు చూస్తుండగా అజ్ఞాన అంధకారాన్ని పటాపంచలు చేసింది .ఈ అద్భుత సంఘటన చూసిన నీలంరాజు  బాలాంబ గారు ,చలపతి రావు దంపతులు మిగిలిన నాలుగు రోజుల ఉభయానికి 6 వేల రూపాయలు దాసుగారికి సమర్పించి కృతతకృత్యులై క్రతు సమాప్తికి గొప్పగా తోడ్పడ్డారు .బ్రహ్మ సత్రం లో రోజుకు రెండు నీలిమందు కళాయీల నెయ్యి ఖర్చయ్యేది  .దాసుగారు ఎక్కడ సత్రం నిర్వహించినా ఇంతభారీగా జరిగేవి .ప్రజల స్పందనా తోడ్పాటు కూడా  వర్ణించ నలవికానిదిగా ఉండేది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-1-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 21-తూము లక్ష్మీ నృసింహ దాసు-3( చివరి భాగం )

మహా భక్త శిఖామణులు

21-తూము లక్ష్మీ నృసింహ దాసు-3( చివరి భాగం )

అప్పుడు హైదరాబాద్ లో నాజరు ద్దౌలా నవాబ్ ఉండేవాడు .అతనికి మహా రాష్ట్ర బ్రాహ్మణుడు ధర్మాత్ముడు చండ శాసనుడు ,సన్మార్గ ప్రవర్తకుడు  ,సమర్ధుడు ,భక్తుడు అయిన చందూలాల్ ప్రధాన మంత్రి గా ఉండేవాడు .ఒకరోజు ఈయకలలో శ్రీరాముడు కనిపించి ‘’నీ దగ్గరకు నరసింహ దాసు వస్తున్నాడు .వాడు నా ప్రియ భక్తుడు సుమా ‘’అని చెప్పాడు .నిద్ర మేల్కొని నరసింహ దాసు దయవలన తనకు రామ దర్శనం కలిగిందని అబ్బురపడి  నమస్కరించి ,దాసు గారికోసం కన్నులు కాయలు కాసెట్లు ఎదురు చూస్తున్నాడు .కొన్ని రోజులకు దాసు గారు హైదరాబాద్ చేరి చందూలాల్ మందిరానికి వెళ్లి ,’’రాజాధిరాజా సలాం ‘’అని మ్రొక్కగా ,ఊర్ధ్వ పు౦డ్రాలతో ,తులసిపేరులతో ,విశాల నేత్రాలు ,నీర్కావి ధోవతిలో నవ్వు ముఖంతో దాసు గారు తనను ‘’మీ రాజ్యం లోని భద్రాద్రి వాసిని.నరసింహ దాసు డను ‘’ అని పరిచయం చేసుకోగా గద్దె మీదనుంచి అమాంతం లేచి వచ్చి కౌగిలించుకొని ‘’శ్రీరామ చంద్ర పరమాత్మ అనుగ్రహం పొందిన మహాత్మా !భక్త పుంగవా !మీరాకతో నన్ను పవిత్రుని చేశారు .నేను మీ బంటును ఎమికావాలో  సెలవిస్తే  క్షణాలమీద నిర్వహిస్తాను ‘’మా ఇల్లు పావనం చేయండి రండి ‘’అని అత్య౦త వినయంగా నమస్కరించి చేతులొగ్గి చెప్పాడు లాల్ .దాసుగారు కూడా లాల్ గారిని ఆప్యాయంగా కౌగలించుకొని ‘’అంభోజ గర్భాదులరయంగ రానిశ్రీరామ చంద్రు నీక్షించ  గలిగితివే .యెంత ధన్యుడవు తండ్రీ !’’అంటూ కొంత సేపు ఇద్దరూ మాట్లాడుకొన్నారు .లాల్ ఇంట్లో కొన్ని రోజులుండి రామ తారక మంత్రోప దేశం చేయగా పరమానందం పొందదాడు

    రాజా నృసింహ దాసు

 కొన్ని రోజులతర్వాత వచ్చిన పని ఏమిటో చెప్పమని అడిగాడు .అప్పుడు దాసుగారు భద్రాద్రిలో జరుగుతున్న అకృత్యాలన్నీ పూసగుచ్చినట్లు  అక్కడ అన్ని కార్యక్రమాలు యధా విధిగా జరిగేట్లు చూడమని చెప్పాడు .చందూలాల్ వెంటనే ‘’మీరే ఆఅధికార౦  తీసుకోండి ‘’అనగా వేరే విధంగా భావి౦చవద్దన్న దాసు గారి మాటలకు మంత్రి అడ్డుపడి –‘’భద్రాద్రి పాల్వంచ  పరగణా లెల్ల –భద్రంబు గా నీవు పాలి0పదగుడు –వాయుర్వికెల్లనీ వధికారము మూని  -చేయుము న్యాయ స౦సిద్ధి బాలనము –రాజితమైనట్టి రాజా బిరుదము –నే జెల్వగా నీకిదె నొసగితిని – చెలగి నిన్ ‘’రాజా నృసిహ దాసంచు’’-బిలుతు రింతటి నుండి ‘’అంటూ దాసుగారు వద్దు మహా ప్రభో అంటున్నా వినకుండా శాసనం తయారు చేయించి దాసు గారి చేతికిచ్చాడు లాల్ .దీనితోపాటు రెండు ఒంటెలు రెండు ఏనుగులు ,నాలుగు గుర్రాలు ‘’సరిఫేష్తురాయి ,సరిగంచు సెల్వ’’ప్రదానం చేసి ,కనకాభి షేకం చేసి ,కొద్ది దూరం ఆయన వెంట నడిచి వీడ్కోలు చెప్పాడు .ఖరనామ సంవత్సర ఆషాఢకృష్ణ చతుర్దశికి రాజా నరసింహ దాసు భద్రాద్రి చేరాడు.ఆరోజు నుండి తాలూకా అధికారిగా గజ౦తైశ్వర్యం  లభించి ,అదంతా రామార్పణం చేసి,శ్రీరామ కైంకర్యం వేళ త్రప్పకుండా జరిగేట్లు చేశారు దాసు గారు .అప్పటినుంచి భద్రాద్రి నిత్యకళ్యాణం పచ్చతోరణం అయింది .కలియుగ వైకుంఠమే అయింది –‘’రాముడు దయాది రాజిలదగిన –శ్రీమద్విధులకొప్పు చెల్వంపు గృతులు –గద్య పద్యాదులు కాదు హృద్యములుగ-విద్యా రస ప్రౌఢి వెలయ గావించి – శ్రీరమ సత్పదా౦చిత పూజ లందు –గోరికలార నెక్కొనగ స్థాపించె-బాడు చుంద్రెల్ల ప్పటికినీ నా కృతులు-వేడుక నా రఘు వీరు సన్నిధిని ‘’అని  రాసి తన  చరిత్రలో చెప్పారు దాసుగారు .అధికారం భోగం లభించినా సాదా సీదాగానే ఉంటూ జనకుడు రాజ్యం చేసినట్లు కుచేలుడు ఐశ్వర్యాన్ని అనుభావిచ నట్లు ఆదర్శంగా జీవించారు .

  నందన కరువు దాసుగారి సేవ

  అప్పుడు ఆప్రాంతం లో భయంకరమైన క్షామం వచ్చింది .అదే నందన కరువు .ఆసమయంలో దాసు గారు చేసిన సేవ అపారం .పెద్ద అన్న సత్రం ఏర్పాటు చేసి ఎన్నో కుటుంబాలకు  భరోసా కల్పించారు –‘’ఎందరు వచ్చిన నేమి పోయంచు –నందరకొనరించె నాన్న దాన౦బు –శిశువులకు బాలు చేరి ఇప్పించే-బశు సమితికి మేత బాటించి కూర్చె-మాలమాదిగల కేమరక అన్నంబు –జాలుజాలన లెస్సగా సమకూర్చె-ముమ్మారు తిను విధంబున నమరించె—ఆనాడు కట్టినట్టి కుండంబు –లీనాటికిని నిల్చిఎసగు భద్రాద్రి ‘’అని రాశారు .కొంతకాలానికి సమృద్ధిగా వర్షాలు పడి కరువు మాయమైంది .

     మహాప్రస్థానం

 నాగండ్ల వరద రాజు గారికి క్షయవ్యాధి వచ్చి బాగా కృశించిపోయారు .ఆయనకు ధైర్యం చెబుతూ నరసింహ దాసుగారు ‘’నిన్ను చెన్నపురి నుంచి భాద్రగిరికి శ్రీ రామసేవకోసం తీసుకొచ్చాను. ఇక్కడి నుంచి వైకుంఠానికి నిన్ను వెంట తీసుకు వెడతాను ఇది రామాజ్ఞ’’  అని ఊరడించేవారు .రాజుగారి భార్య తల్లీ  మేమూ మీతో వస్తాం తీసుకు వెళ్ళండి అంటే వల్లె అని ,దాసుగారిభార్య లక్ష్మీ బాయంమగారు ‘’మీరు లేకపోతె నేను బతకలేను మీతో నేనూ వస్తాను ‘’అని వేడుకున్నా ‘’నీకు దేవుడి ఆజ్ఞ లేదు ఇక్కడే కొంతకాలం ఉండాలి ‘’అని నచ్చ చెప్పారు.తన ఇంటిలోని  బంగారు వెండి వస్తువుల జాబితా రాయించి ,రామాలయానికి చేర్చి కావలసినవారికి మిగతా సామాను ఇచ్చేశారు  .-‘’ఏమియు లేకుండనిల్ చూరు విడిచి –ఆ మీద రాజకీయ ప్రసంగములు  -దేశ పాండ్యాలకు తెలియ బోధించి –‘’రామాలయం లో ఉన్న స్థిర చరాస్తుల జాబితాలు తయారు చేయించి  శాసనాలపై చెక్కించి –సరిగా గోవెల యందు స్థాపన చెసె. వరద రాజు గారి ఆరు నెలల పసి బాలుడిని దాసికిచ్చి చక్కగా సాకమని చెప్పి ,తనతో ఉన్న తమ్ముడి కొడుకు రాము ని దీవించి మహా ప్రస్దాన ప్రయత్నం చేస్తూఉండగా వరద రాజు రామభజన చేస్తూనే ప్రాణాలు వదిలాడు .ఆయన శవాన్ని వెంటతీసుకొని కాళ్ళకు గజ్జలు భుజాన తంబురా చేతుల్లో పలకలు పట్టుకొని గొంతెత్తి రామభజన –‘’పోయదమయ్యా వైకుంఠమునకు బోవు చున్నాము ‘’అని పరవశించి పాదుతుండగా ఆకాశ౦ లో   ’’ కోదండరాముడు కనిపించగా –‘’అడుగో కోదండ పాణి అడుగో భాద్రాచలేశుండు ‘’అంటూ శ్రీరాముని ఆపాద మస్తకం గా వర్ణిస్తూ 1833-34విజయ వత్సర భాద్రపద కృష్ణ చవితి సోమవారం సూర్యుడు పశ్చిమాద్రికి చేరే సమయం లో ,ఊరిజనమంతా పూలు చల్లుతూ దండలు వేస్తూ మహా కోలాహలం చేస్తుండగా ,పూర్వం పాండవులు మహా ప్రస్థానం చేసినట్లు,గోదావరీ నదికి వెళ్లి ,వెనక్కి తిరిగి రామాలయ శిఖర దర్శనం చేసి నమస్కరించగా అది అంగీకార సూచకంగా ఊగిందట .అందరూ పడవలు ఎక్కి కూర్చుని రామ భజన లో పులకితులై నది మధ్యలోకి వెళ్లి ‘’జయ రమారమణ గోవింద హరే ‘’అనే నాదంతో భూ నభోన్తరాలు దద్దరిల్లేట్లుగా పలికి ,వరదరాజ శరీరాన్ని గోదాట్లో కలిపారు దాసుగారు .ఒక్కసారిగా గోదారి పొంగగా నరసింహ దాసుగారు’’ రామా రామా’’ అంటూ  ఆ ప్రవాహం లో మునిగి కనిపించలేదు .రాజుగారికిచ్చిన మాటను ఇలా నిలబెట్టుకున్నారు దాసుగారు ఆయనతోపాటు 17మంది భక్తులు ఆయన భార్య,లక్ష్మీ బాయమ్మ గారు గోదాట్లోకి దూకేశారు .అప్పుడు –‘’వింతగా నొక దివ్య తేజంబు –ఘనతర సూర్య ప్రకాశంబు మించి –జనములు సూడంగ జనె-వియద్గతిని ‘’.అందరికి ఆ దివ్య తేజస్సు కనిపించగా ఆశ్చర్య పోయారు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-1-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 21-తూము లక్ష్మీ నృసింహ దాసు-2

మహా భక్త శిఖామణులు

21-తూము లక్ష్మీ నృసింహ దాసు-2

 అపర కైలాసంగా కనిపించే రామేశ్వరం లో శ్రీరామ ప్రతిష్టిత సైకత రామ లింగేశ్వర  దర్శనం చేసి ‘’కాశీ పురమునుండి గంగ దెచ్చితిని  ఈశ –దీని గ్రహియిపవయ్య’’అనిప్రార్ధించి ఆ గంగతో నమక చమకాలతో అభిషేకించి బిల్వపుష్పాదులు సమర్పించి ,కోరిన కోరిక తీరి పెన్నిధి లభించి భావించి –‘’అన్యమేరుగాను దేవ అహర్నిశములు- దైన్యమున నీ పసుజన –దంబుల దలచిసుజన –మాన్యమౌ పరమార్ధ సంపద లభించి –ధన్యమతి నైతి నీదగు దర్శనమున ‘’—అంగములో సగమంగన-కు౦గడ మసగంబు భక్తకోటి కోసగితె ,-బ్భంగి నిను గానవచ్చు భు –జంగ చయ విభూష దోష సంగ విదూషా’’మొదలైన పద్యాలతో  స్తుతించాడు  నరసింహ దాసు అక్కడి 24తీర్ధాలలో స్నానించి,,గంధమాదన పర్వతం అధిరోహించి ,సేతుమాధవ దర్శనం చేసి,ఉభయ సాగర సంగమం లో తీర్ధ విధులు యధోక్తంగా నిర్వహించి ,మూడు రోజులుగాడిపి ఏకాంత రాముని సేవించి ,అక్కడి చింతలపాటి లక్ష్మీ నారాయణ గారి అభ్యర్ధనపై వారింట్లో కొన్ని రోజులుండి,రామాయణ పురాణం చెప్పి సన్మానితుడై ,మళ్ళీ సేతుమాధవ దర్శనభాగ్యం పొంది -‘’తగ ప్రయాగ పూరి మాధవుడు నీ క్షేమంబు –నడిగినాడని దెల్పు మనియె బ్రీతి —‘’’కోరిక దీరె నీ చరణకోమల యుగ్మమునాశ్రయి౦చుటన్ ‘’అని పద్య స్తుతి చేసి ,కోటి తీర్ధాన్ని తీసుకొని,సముద్రుడు ఎంతసేపటికీరాకపోతే దర్భలపై పడుకొని నిరశన తెలియ జేసిన  ,దర్భశయనం లో శ్రీ రామ దర్శనం చేసి ,శ్రీరంగం చేరి రంగనికి తన అనుభవాన్ని –‘’ప్రాకార సప్తక ప్రకరంబు కనుగొంటి –యదియెవైకుంఠమంచలరు చుంటి  ‘’అంటూ పద్య నివేదనం చేశాడు .అక్కడినుండి జంబుకేశ్వరం వెళ్లి జలలింగదర్శనం చేసి ,కంచి చేరి –‘’ఆకలి గొన్న యట్టి జను –డన్నము గైకొను మాడ్కి ‘’అని స్తుతించి డబ్బులివ్వనిదే దర్శనం లేదంటే సొమ్మసిలిపొతేఒక వైష్ణవ భక్తుడు అంతరాలయ దర్శనం చేయించాడు .వరద రాజ స్వామిని దర్శించి పరవశంతో సాష్టాంగం చేసి ఆనంద బాష్పాలు రాల్చాడు .తిరుపతి వెళ్లి శ్రీనివాస దర్శనం చేయాలని కొండ ఎక్కుతుంటే ‘’నీ తాత తండ్రుల మొక్కు బడులన్నీ తీర్చగలిగితేనే కొండ ఎక్కు ‘’అనే మాటలు వినిపిస్తే ఎవరా అని వెతికితే ఎవరూ లేకపోవటం తో అది వైష్ణవ మాయ అని గ్రహించి ‘’ఈయనే కంచిలో దర్శనం చేయించిన వైష్ణవరూప వెంకటేశ్వరస్వామి  ‘’అని మనసులో భావించి ,అడుగడుగుకూ ఆపద మొక్కులవాడిని స్మరిస్తూ –‘’తాతనాటి ఋణము దలచి లెక్కలు తీసి –ప్రీతిమాని బిరుదు ఖ్యతిమాని –కఠిన వృత్తి దాల్చి కదలరా వలదంటి –విట్టు లాడ నీక దెట్టులొప్పె’’అని ఎడా పెడా పద్యాలతో వాయించి ,చేతిలో చిల్లిగవ్వ లేని తాను  ఎలా మొక్కులు తీర్చుకోగలను అని నిర్వేదం చెండి మెట్లమీదనే ఉత్తరీయం పరచి నిద్రపోయాడు .స్వప్నంలో ‘’రజతాద్రి కాంతి నిరాకరించెడుమేని –చంద౦బు గల్గు నశ్వంబు నెక్కి ‘’శ్రీవారు కనిపించి అక్కడి విశేషాలన్నీ దగ్గరుండి చూపించగా    –‘’మేలు కొంటి నంత జాల వేడ్క ‘’అని అనుభవం వివరించాడు .వేంకటేశ్వరుని పాద చిహ్నాలు అక్కడ ఆనవాలుగా కనపడితే ఆశ్చర్యపోయి భక్తులందరికీ చూపి పరవశించాడు నరసింహ దాసు .కొండ ఎక్కి శ్రీవారి దర్శనం చేసి ఆనందంతో నృత్యం చేసి అలుమేలు మంగను గోవిందరాజస్వామిని దర్శించి –శ్రీపాద రేణువు చిన్నం వరా యంచుబల్కు –వైష్ణవ పరి భాష వింటి ‘’అని వేడికోలు చెప్పుకొని,శ్రీకాళ హస్తిచేరి శ్రీ కాల హస్తీశ్వర  దర్శనం తో చరితార్దుడై ,మళ్ళీ పొన్నూరునుంచి గుంటూరుకు  చేరాడు .కోటితీర్ధజలాలతో తల్లికి అభిషేకం చేసి అందరి యోగ క్షేమాలు అడిగి తెలుసుకొని తన యాత్రా విశేషాలను సవివరంగా అందరికీ తెలియ జెప్పి వారు కూడా యాత్రాఫలితం పొందేట్లుచేశాడు నరసింహదాసు ..వృషభ సంవత్సర ఫాల్గుణ శుద్ధ పాద్యమికి దక్షిణ దేశ యాత్ర పూర్తయింది .మళ్ళీ భద్రాచలం వెళ్లి శ్రీరామ దర్శనం చేసి ఇంటికి వచ్చాడు .నిరంతర ప్రయాణాలతో ఆరోగ్యం దెబ్బతిని ,వ్యాధి పీడితుడయ్యాడు .

    ఉత్తర దేశ యాత్ర

1827-28వ్యయనామ సంవత్సర పుష్య శుద్ధ విదియనాడు ఉత్తర దేశ యాత్రకు బయల్దేరాడు తూము నరసింహ దాసు .నడిచి ముందుగా అయోధ్య చేరి శ్రీరాముడు పుట్టిన చోటు ,పెరిగిన చోటు ,ఆడిపాడిన చోట్లు ,వల్కలాలు కట్టిన చోటు ,దశరధుడు  చనిపోయిన చోటు ,భరతుడు రామపాదుకలు పూజించిన చోటు ,అక్కడి స్థానికులు వివరంగా చెప్పి చూపిస్తే చూసి ధన్యమయ్యానని భావించాడు .సరయు నదీ స్నానం చేసి పితృ తర్పణాలిచ్చి ,వంశాన్ని పవిత్రం చేసే ఒక్కడు చాలడా అంటూ’’జాలడా ఏడు తరములకు నొక్క మహాత్ముడు ‘’అని శ్రీరామ స్తుతి చేసి అక్కడే కొన్ని రోజులు గడిపి ,అక్కడి నుంచి హరిద్వారం బదరికా వనం చేరి నరనారాయణ సందర్శనం భాగ్యం పొంది సర్వజిత్ సంవత్సర శ్రావణ శుద్ధ ఏకాదశి కి గుంటూరు చేరాడు .ఎక్కడి గుంటూరు ?ఎక్కడి బదరి?ఇంతదూరం కాలినడకన తిరిగి రావటం అంటే మాటలుకాదు .సంకల్పబలం రామానుగ్రహం ,కుటుంబ జన ప్రోత్సాహం ఉంటేనే జరుగుతుంది .మళ్ళీ భద్రాద్రి వెళ్లి దర్శనం చేసి వచ్చాడు .ఎన్నియాత్రాలు చేసినా అలుపూ సోలుపూలేదు రోగం రోష్టూ లేదు .కాలికి ముళ్ళు కూడా ఎక్కడా గుచ్చుకొని బాధ పెట్టలేదు దొంగలభయం పాము వంటి జంతు భయం కూడా ఆయనకు ఎదురు కాలేదు .

   కంచి గరుడ సేవ

కంచిలో డోల సేవ చూడాలని ఎన్నాళ్ళనుంచో దాసు మనసులో ఉంది అది నెరవేర్చుకోవటానికి విరోధి సంవత్సర వైశాఖ మాసం లోకోద్దిమంది భక్తులతో  కాంచీ పురానికి వెళ్లి గరుడ సేవ ఉయ్యాలసేవ తనివి తీరా చూసి తరించాడు

          మద్రాస్ అనుభవం కొత్త శిష్యుడు

మద్రాస్ వెళ్లగా అక్కడ భక్తుడు సంపన్నుడు వైదిక బ్రాహ్మణుడు మురికి నాడు శాఖీయుడు నాగండ్ల వరద రాజస్వామి ఆహ్వానించి ,తగిన రీతిగా సేవలు చేసి ,దాసు గారివలన తారక మంత్రోప దేశం పొందాడు ,మూడు నెలలు వారిట్లో,రామాయణ ప్రవచనం తో అందరినీ సంతృప్తి పరచగా సంతుష్టాంతరంగు డైన  వరద రాజస్వామి, దాసు గారికి పాద పూజ చేసి 4వేల రూపాయలు కానుకగా సమర్పించి ‘’స్వామీ !మళ్ళీ ఒక సారి వచ్చి నన్ను భద్రాద్రి రామ దర్శనం చేయించి పుణ్యం కట్టు కొండి ‘’అని ప్రార్ధించాడు .అతని వినయం భక్తీ లకు సంతోషించి దాసుగారు  అదంతా శ్రీరామానుగ్రహం అని చెప్పి మళ్ళీ గుంటూరు చేరి ,మూడు తరాలనుండి పెరిగిన అప్పు అంతా ఆ నాలుగు వేల రూపాయలతో తీర్చేశాడు-‘’అప్పు దీరుపనైన హరియింప నైనను దలచు మానిసికి బత్రంబు వలదు ‘’అని అడిదం సూరకవి చెప్పినట్లు నోటూ పత్రం లేకుండా తన కుటుంబానికి  అప్పులిచ్చిన వారి గుణ శ్రేష్టతకు కృతజ్ఞత చెప్పుకొన్నాడు ‘

  మళ్ళీ మద్రాస్ వెళ్లి వరద రాజు తో కలిసి వికృతి సంవత్సర చైత్రమాసం ప్రారంభం లో భద్రాద్రి చేరి శ్రీరామనవమి కల్యాణం చూసి ఆయనకు చూపించి మాట నిలబెట్టుకొని గుంటూరు చేరాడు .నరసింహదాసు బుద్ధి గరిమ భక్తీ ప్రపత్తులు శీల విశిష్టత  లను గుర్తించి గౌరవించి వరదరాజు ఈ దంపతులను మద్రాస్ తీసుకొని వెళ్లి ఆరు నెలలు తన ఇంట్లో ఉ౦చి సకల సౌకర్యాలు కలిపించి ధన్యుడయ్యాడు .

            భద్రాద్రి వాసం

భక్తీ జ్ఞాన  సంపత్తి దాసుగారి వలన కలిగి వైరాగ్యభావం అంకురించి ,తనకున్న సకల సంపాదనను గుర్రబ్బళ్ళపై ఎక్కించి దాసు దంపతులతో తమ దంపతులుకూడా కలిసి వికృతి కార్తీకం లో భద్రాద్రి చేరి అక్కడే కాపురం పెట్టాడు వరదరాజు .రోజూ దాసు దంపతులతో సత్కాల క్షేపం .భద్రాద్రి రామ దర్శనం తో ఆన౦దంగా రోజులు గడిచి పోతున్నాయి .రామాలయ పూజారులలో స్వార్ధం పెరిగి స్వామి కై౦కర్యాలు సరిగ్గా చేయక తమ కైంకర్యం కోసమే డబ్బు వాడుతూ అప్రతిష్ట తెచ్చారు .తన డబ్బే పోయినట్లుగా దాసుగారు బాధపడ్డారు –రామా !నీ సేవలు సరిగ్గా జరగటం లేదు .నేను ఎలా సహి౦చ గలను ?మొన్న కలలో ఒక  వైష్ణవుడు కనిపించి విచారించకు చందూలాల్ ను కలిస్తే అంతా చక్కబడుతుంది ‘’అని చెప్పాడు .మెలకువరాగానే ఈవిషయం శిష్యుడు వరద రాజుకు చెప్పాడు .రామాజ్ఞగా భావించి ఒక్కడే హైదరాబాద్ వెళ్ళాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-1-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

19వ శతాబ్ది తొలిస్త్రీ హక్కు ఉద్యమకారిణి –రమాబాయ్ రానడే (విహంగ -జనవరి 2021 )

19వ శతాబ్ది తొలిస్త్రీ హక్కు ఉద్యమకారిణి –రమాబాయ్ రానడే (విహంగ -జనవరి 2021 )

25-1-1862న కుర్లేకర్ కుటుంబంలో మహారాష్ట్ర సాంగ్లీ జిల్లా దేవ్రస్ట్రే గ్రామం లో రమాబాయ్ రానడే జన్మించింది .బాలికా విద్య నిషిద్ధమైన ఆకాలం లో తండ్రి ఆమె ను చదివించలేదు .భారత సా౦ఘికసంస్కరణోద్యమ మార్గ దర్శకుడు,మహా విద్యావేత్త ,ఆదర్శవాది , జస్టిస్ మహాదేవ గోవింద రానడే కు ఈమెనిచ్చి 11ఏటనే తండ్రి పెళ్లి చేశాడు . అత్తవారింటిలోనూ స్త్రీ విద్యకు ఆదరణ లేకపోయినా, భర్త రానడే మాత్రం భార్య రమాబాయ్ విద్యకు సర్వవిధాలా సాయం చేసి తనకు సాంఘిక ,విద్యా సంస్కరణలకు తోడ్పడేట్లు ఆదర్శంగా తీర్చి దిద్దాడు .భర్త ప్రేరణతో రమాబాయ్ మహిళా విద్యకు స్వావలంబనకు ,ఆర్ధిక స్వాతంత్ర్యానికి జీవితం అంకితం చేసింది.

రానడే బొంబాయి ఎలిఫిన్ స్టన్ కాలేజి లో ఇంగ్లిష్ ,ఎకానమిక్స్ ప్రొఫెసర్. ‘’ప్రిన్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్’’అని గౌరవంగా అనిదరి చేతా పిలువబడేవాడు .అలాంటివాడు చదవటం రాయటం కూడాతెలీని నిరక్షరాస్యురాలు రమబాయ్ ని పెళ్లి చేసుకొని అక్షరాలతో సహా అన్నీ నేర్పి విద్యావంతురాలినీ మహిళా సంస్కరణోద్యమ నాయకురాలినిగా తీర్చి దిద్దాడు .సమాజంలోని చెడును సహించే వాడు కాదు .అస్పృశ్యత ,బాల్యవివాహం ,సతీ సహగమనాలకు వ్యతిరేకి .తన ఆదర్శాల ప్రచారం ,అనుసరణకోసం ‘’సర్వ జనిక్ సభ ‘’స్థాపించి సా౦ఘికాభి వృద్ధికి ఎన్నో ఉద్యమాలు నడిపాడు .ముప్పై ఏళ్ళ వయసులోనే రానడే మహారాష్ట్ర౦ లో గొప్పపేరు ప్రఖ్యాతులు పొందాడు .అత్యధిక ఆలోచనాతత్వం ,క్రియాశీలమైన దృష్టి,సంఘం పట్ల అంకితభావం భార్య రమాబాయ్ ని ఉత్తేజితం చేసి ,భావి సాంఘిక కార్యక్రమాలకు బాట వేసింది .

సంస్కరణ ముందు తనతో ప్రారభం కావాలని తానూ విద్యనేర్చి భర్తతో సమాన స్థాయి సాదిస్తేనే సమాజం తన మాటవిని విలువనిస్తుందని గ్రహించింది.దీనికి ఆమె కుటుంబం అత్తవారిల్లు ఎన్నో అడ్డంకులు కలిపించినా ,మొక్క వోని ధైర్యం తో ముందుకే మును ముందుకే సాగింది .భర్త రానడే ఆమెకు ముందు మరాఠీ భాష చదవటం రాయటం నేర్పాడు .తర్వాత చరిత్ర భూగోళం లెక్కలు ఇంగ్లిష్ నేర్పాడు .వార్తా పత్రికలన్నీ చదివించి ,వాటిలో ఉన్న ఆనాటి విషయాలపై తనతో చర్చించటం నేర్పాడు .క్రమ౦గాఉత్తమ విద్యార్ధినిఅయి తర్వాత కార్యదర్శి గామారి,నమ్మకమైన స్నేహితురాలు అయింది .1882లో పండిత రమాబాయ్ విధవరాలుగా పూనా వచ్చినప్పుడు,రానడే దంపతులు ఆమెకు అన్నిరకాల సహాయం చేసి ,తమ ఇంట్లోనే పండిట్ రమాబాయ్ కి క్రిస్టియన్ మిషనరీ లేడీ తో ఇంగ్లిష్ పాఠాలు బోధి౦ప జేశారు .

మొదటి సారిగా రమాబాయ్ నాసిక్ హైస్కూల్ లో ముఖ్య అతిధిగా ప్రజలలో కనిపించింది .ఆమె ఉపన్యాసాన్ని భర్త రానడే రాసిచ్చాడు .తర్వాత ఆమె స్వయంగా బహిరంగ సభలలో బాగా మాట్లాడటం ప్రారంభించి మరాఠీ ,ఇంగ్లీష్ లలో అద్భుత ప్రసంగాలు చేసి అందరి హృదయాలను ఆకర్షించింది .ఆమె ప్రసంగాలు స్పష్టంగా మనసుకు హత్తుకోనేట్లు ఆకర్షణీయంగా ఉండేవి .తర్వాత బొంబాయి లోని ప్రార్ధన సమాజ్ లో పని చేసింది .ఆర్య మహిళా సమాజం సంస్థను స్థాపించింది .1883నుంచి 1901వరకు ఎనిమిదేళ్ళు సాంఘిక సేవా కార్యక్రమాలలో ఉద్ధృతంగా పాల్గొని , బహుళ ప్రచారం పొందింది .’బొంబాయ్ లో ’హిందూ లేడీస్ సోషల్ అండ్ లిటరరి క్లబ్ ‘’స్థాపించి భాషలలో ,జనరల్ నాలెడ్జి లో ,టైలరింగ్ ,చేతి పనులలో అనేక తరగతులు నిర్వహించి శిక్షణ నిచ్చింది .

1901లో భర్త రానడే మరణించాక రమాబాయ్ బొంబాయి నుంచి పూనా కు మకాం మార్ఛి ,పూనా మార్కెట్ దగ్గరున్న పాత వారసత్వ ఇంట్లో ఉంటూ ఒక ఏడాది ఒంటరి జీవితం గడిపింది .తర్వాత జనజీవన స్రవంతి లో కలిసి ,మొదటి సారిగా బొంబాయి లో ‘’భారత్ మహిళా పరిషత్ ‘’స్థాపించింది .భర్త చనిపోయాక 23ఏళ్ళు జీవించి కాలమంతా సాంఘిక జాగృతికోసం ,బాధితుల ఓదార్పు సాయం లో బాదితుల పునరావాసం కోసం, సేవ సదన్ నిర్మాణం లో క్షణం తీరిక లేకండా అంకిత భావంతో పని చేసింది .భర్త ఉండగానే 1878లోనే సేవారంగం లో కాలుపెట్టిన రమాదేవి, భర్త 1901లో చనిపోయాక పూర్తిగా మహిళాసేవా కార్యక్రమాలలో మునిగి పోయింది .తరచుగా సెంట్రల్ జైలు సందర్శిస్తూ ,అందులో ముఖ్యంగా మహిళా విభాగం లో జరిగే విషయాలు స్వయంగా తెలుసుకొనేది .బాలుర సంస్కరణ స్కూల్ కు కూడా వెళ్లి ,బాలురతోమాట్లాడుతూ యోగక్షేమాలు కనుక్కొంటూ ముఖ్యమైన పండుగ రోజులలో స్వీట్స్ పంచి పెట్టేది .స్థానిక ఆస్పత్రులను సందర్శించి రోగుల వైద్య సదుపాయాల విషయం అడిగి తెలుసుకొంటూ వారికి పండ్లూ ,పుష్పాలు ,పుస్తకాలు అందించేది .

1913లో గుజరాత్ కధియవాడి లకు వెళ్లి ,క్షామ బాధితులకు పునరావాస సౌకర్యాలు కల్పించింది .చివరి రోజుల్లో కూడా ఆనందికి వెళ్లి ఆషాఢి,కార్తీక ఉత్సవాలలో పాల్గొన్నది .తనతో పాటు సేవాసదన్ కార్యకర్తలను తీసుకు వెళ్లి సంత్ జ్ఞానేశ్వర్ దేవాలయం సందర్శించే మహిళా యాత్రికులకు సహాయం చేయించింది .అనేక కొత్త తరహా మహిళా సాంఘిక సేవాకార్యక్రమాలు ప్రారంభించింది .రామ కృష్ణ గోపాల భండార్కర్ ,భజేకర్ ల అభ్యర్ధన మేరకు రమాబాయ్1904లో బొంబాయి లో జరిగిన అఖిలభారతీయ మహిళా సదస్సుకు అధ్యక్షత వహించింది .

పార్సి సాంఘిక సంస్కర్త బి.ఎం .మల్బరీ ,దయారాం గిడుమాల్ లకు మహిళలకు నర్స్ ట్రెయినింగ్ సెంటర్ ప్రారంభిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఆలోచన వచ్చి రమాబాయ్ ను కలిసి మార్గదర్శనం చేయమని కోరగా బొంబాయి లో సేవాసదనం ప్రారంభించింది .1915లో పూనా సేవాసదన్ ను ఆమె ఆధ్వర్యం లో సొసైటీగా రిజిస్టర్ చేయించింది .ఈ సొసైటీ పాత విద్యా విధానం తోపాటు అనేక కొత్త పద్ధతులు కూడా ఉండేట్లు విద్యా శాఖలు ,ఏర్పాటు చేసింది .తర్వాత వుమెన్స్ ట్రెయినింగ్ కాలేజి,మూడు హాస్టళ్ళు ఏర్పరచింది .అందులో ఒక హాస్టల్ మెడికల్ విద్యార్ధులకు ,మరొకటి ప్రోబేషనరి నర్సులకు ఉపయోగకరంగా చేసింది .1924నాటికి పూనా సేవాసదనం వివిధ శాఖలలో వెయ్యిమందికి పైగా మహిళలకు శిక్షణ నిచ్చింది .ఇంత అభివృద్ధి జరగటానికి రమాబాయి దూర దృష్టి, నిరంతర పర్యవేక్షణలే కారణం .ఉచిత నిర్బంధ ప్రాధమిక విద్య బాలికలందరికి అందజేయటం ఆమె సంకల్పం .బొంబాయి ప్రెసిడెన్సి లో మహిళలకు ఓటు హక్కు కోసం పెద్ద ఉద్యమాలు 1921-22లలో నిర్వహించింది .

మహాత్మా గాంధీ రమాబాయిమరణించినపుడు ఆమె సేవాతత్పరతను ప్రశంసిస్తూ ‘’ The death of Ramabai Ranade is a great national loss. She was the embodiment of all that a Hindu widow could be. She was a true friend and helpmate of her illustrious husband in his lifetime..’’ After his death she chose her husband’s reform activities as her life’s aim. Justice Ranade was a reformer and deeply concerned about the uplifting of Indian womanhood. Ramabai put her heart and soul into Seva Sadan. She devoted her whole energy to it. The result is that Seva Sadan has become an institution with no second of its kind throughout India.”అన్నాడు.

సేవాసదన్ లో మొదట చేరిన విద్యార్దినులంతా విధవరాళ్ళే.ఒకసారి సేవాసదన్ వార్షిక సమావేశం జరిగినప్పుడు బహుమతి ప్రదాన ఉత్సవానికి రమాబాయ్ ఆ నాటి సంప్రదాయ భారతీయ విధవరాలు ఎలా ఉంటుందో అదే విధంగా బోడిగుండుతో ,ఎర్రచీరతో ,కొంగు నెత్తి మీద పూర్తిగా కప్పుకొని హాజరైంది .వేదిక ఎక్కుతున్నప్పుడు విద్యార్ధులంతా పిల్లికూతలు అరుపులు చప్పట్లు తో గేలి చేశారు .ఆమె ఒక్కసారిగా ‘’మీరు కాలేజి విద్యార్ధులు. ఈ గందరగోళం చూస్తె విద్యార్దులేనా అని అనుమానం గా ఉంది .సమాజపు కట్టుబాట్లలో నలిగి పోతున్నమీ సోదరీమణులకు మీరిచ్చే మర్యాద ఇదేనా ?ఇదేనా మీ సంస్కారం ?వారి దయనీయ స్థితికి మీరు జాలిపడరా ?మీ ఇళ్ళల్లో ఇలాంటి విధవ ఆడపడుచులు, తల్లులూ లేరా ?కనీస గౌరవ మర్యాదలు వారికి చూపలేరా ?”’అని తీవ్రస్వరం తో మాట్లాడగా అందరు సిగ్గుతో తలదించుకొని మౌనం వహించారు ఆమె మాటలు వాళ్లకు హంటర్ కొరడా దెబ్బలే అయినాయి .

రమాబాయి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తీవ్రంగా కృషి చేసింది .ఆమె స్థాపించిన సేవాసదన్ లు ఎందరెందరో నిర్భాగ్య మహిళలకు ఆసరాగా ఉన్నాయి .పూనా సదన్ ను తన పూర్వ స్వగృహం లోనే ప్రారంభించింది .ట్రెయినింగ్ కాలేజీలు ,వృత్తి విద్యా కేంద్రాలు ,అమ్మకాల సెంటర్లు మొదలైనవన్నీ ఏర్పరచింది .రమాబాయ్ అంటే సేవా సదన్ కు మారుపేరు అయి ప్రఖ్యాతి చెందింది .మధ్యతరగతి స్త్రీలసంక్షేమమమే ఆమె ధ్యేయం .గవర్నర్ ఏర్పాటు చేసిన వార్ కాన్ఫరెన్స్ లో పాల్గొని భారతీయ స్త్రీల గురించి వివరించింది .ఫిజి ,కెన్యా దేశాలలో భారతీయ కూలీల సంక్షేమం కోసం కృషి చేసింది .స్త్రీల వోటు హక్కుకోసం నిరంతర పోరాటం చేసింది .అలుపు లేకుండా ఇన్ని సేవాకార్యక్రమాలు చేసిన రమాదేవి తాను తనభర్త మహాదేవ గోవింద రానడే గారి నీడ నే అని వినయంగా చెప్పేది .నిరంతర సేవా కార్యకర్త,చిరస్మరణీయురాలు,మహిళా మాణిక్యం రమాబాయ్ రానడే 62వ ఏట 25-1-1924న మరణించింది.

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~adu~~

Posted in రచనలు | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 21-తూము లక్ష్మీ నృసింహ దాసు

మహా భక్త శిఖామణులు

21-తూము లక్ష్మీ నృసింహ దాసు

  జననాది విశేషాలు

భక్తీ సంగీత సాహిత్యాలకు ఆలవాలమైన సద్వంశం లో క్రీ శ 1790ప్రాంతం లో తూము లక్ష్మీ నరసింహదాసు అప్పయ్య ,వెంకమాంబ దంపతులకు జన్మించాడు .గోల్కొండ వ్యాపారులు ఆపసంభ సూత్రులు యజుశ్శా ఖాధ్యాయులు .వశిష్ట ,శక్తి,పరాశర త్రయార్షేయ  పరాశర గోత్రీకులు ,తాత వెంకట కృష్ణయ్య గుంటూరుజిల్లా  బాపట్లతాలూకాపొన్నూరులో ఉంటూ శ్రీ భావనారాయణ స్వామి సేవలో తరించాడు .ఈయన కుమారుడైన అప్పయ బుద్ధి ,దేహబలం తో రాజగౌరవం పొంది,వెంకమా౦బ ను పెళ్లి చేసుకొని ,గుంటూరులో స్వంతఇల్లు కట్టుకొని కాపురం పెట్టాడు .ఈ దంపతులకు నరసింహదాసు ,కృష్ణ దాసు, రుక్మాబాయి సంతానం .రుక్మాబాయిని జఘాలరావు  వంశం వారికిచ్చి పెళ్లి చేశారు .దాసు ద్వయం తెలుగు సంస్కృతాలు నేర్చి రామభక్తులుగా ఉన్నారు .సంబ్రాజు వంశానికి చెందిన లక్ష్మీ బాయమ్మను నరసింహదాసుకు ,సీతమ్మను కృష్ణదాసుకు ఇచ్చి వివాహం చేశారు .

  నరసింహ దాసు దంపతులకు సంతానం కలగలేదు .దాసు గారు చనిపోయాక భార్య మరిదికొడుకు రామదాసు ను పెంచి ,వైదేహి అనే అమ్మాయితో పెళ్లి చేసింది .వీరికీ పిల్లలు పుట్టలేదు .భర్త చనిపోయాక వైదేహమ్మ కూడా లక్షణ రాయడు ను పెంచుకొని పెళ్లి చేసింది వీరి సంతానం ఇప్పటికీ భద్రాద్రిలో ఉన్నారు .

   భద్రాద్రి రామభక్త దాసు

రామభక్త నరసింహ దాసు బాల్యం నుండి మాట్లాడే ప్రతిమాటకు వేసే ప్రతిఅడుగుకు రామ రామ అనటం అలవాటు చేసుకొన్నాడు .దాసు ఇరవై వ ఏట తండ్రి చనిపోవటం తో కుటుంబ భారం మీద పడి,పొన్నూరులో పేష్కారు జీతం తో జీవనం సాగించాడు .రామభజన అతిధి సత్కారం, కవితా రాధన నిత్యకృత్యం . భక్తికి ఉద్యోగానికి లంకె కుదరక ఉద్యోగం మానేసి ,ఇంట్లోనే రామ మందిరం నిర్మించి ,భద్రాద్రి సీతారామ విగ్రహాలు పెట్టుకొని నిత్య భజన చేస్తూ ,గద్య పద్యాలు రాస్తూ ,భక్తిశతకాలు గేయాలు రాశాడు .

  శ్రీ రంగ క్షేత్ర దర్శనం

నరసింహ దాసు క్రీ శ 1818-19 బహుధాన్య సంవత్సర కార్తీక మాసం లో శ్రీరంగ క్షేత్రానికి వెళ్లి ,పరవశంతో రంగ శాయిని దర్శించి ‘’శ్రీరంగ శాయి తారహారం’’ మకుటం తో27 సీస పద్యాలు రాసి స్వామికి సమర్పించి ,ఇంటికి తిరిగి వచ్చాడు .

 భద్రాద్రి రామ దర్శనం ,కాశీయాత్ర

1820-21లో తల్లీ, భార్య ,తమ్ముడు లను సమాధాన పరచి ఒప్పించి ,విక్రమ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి శనివారం రేవతీ నక్షత్రం లో  ఆప్త మిత్రులతో కలిసి గుంటూరు నుంచి నడిచి అమరావతి వెళ్లి, కృష్ణా స్నానం చేసి అమరలింగేశ్వర దర్శన భాగ్యం పొంది ,అక్కడినుండి కాలినడకన భద్రాద్రి చేరి సీతారామ దర్శనం తో పులకించి –‘’అర్దికిచ్చిన ధన౦ బపుడెమరచెదట-పదిలమోహో రామ బహు పరాకు ‘’అనే అనేక సీస పద్యాలతో పరాకు పల్కి ,మళ్ళీ ప్రయాణం సాగించి అశ్వారావు పేట ,కొవ్వూరు ,రాజమండ్రి ,మీదుగా పిఠాపురం చేరి కుంతీ మాధవ స్వామిని దర్శించి ,సింహాచలం వెళ్లి వరాహ  నృసింహ స్వామికి పూజ చేసి ,శ్రీకూర్మం చేరి కూర్మావతార విష్ణు సేవ చేసి ,పూరీ జగన్నాధం వెళ్లి బలరామ సుభద్రా సహిత జగన్నాధ స్వామి ని సేవించి మార్కండేయాది పుణ్య తీర్ధ స్నానాలు చేసి ,పంచ చామర వృత్తంలో –‘’పరాకు శ్రీ రమా౦గ నాస్య  పద్మ పద్మ బాంధవా –పరాకనంత పద్మజాండవారపూరి తోదరా ‘’  అంటూ పొగడి అయిదు రాత్రులు గడిపి ,చాలా కష్టమైన ప్రయాణం చేసి జాజిపురం వెళ్లి అక్కడి నదిలో పితృ కార్యం నిర్వహించాడు .అప్పటికే బాగా అలసి పోవటం తో కాశీ యాత్ర చేయగలనో లేనో అనే సదేహం కలిగింది .కల కన్నాడు దాన్ని పద్యాలలో బంధించాడు –‘’బ్రహ్మాదులకు నైన బడయ సాధ్యముకాని-అప్రత హత శక్తుడైన నీవు –దురితాత్ముడంచునం ద్రోయగా జూడక –యతి దీను డీతడ౦ చాత్మ నెరిగి —- దాశరధ కుమార రామ భద్రాద్రి ధామ ‘’అని  స్తుతిస్తే స్వామి అభయమివ్వగా భయం పోయిందని స్వయంగా దాసు గారే చెప్పాడు .

   శ్రీరామ దయతో అభయం తో నూతనోత్సాహం కలిగి ,మర్నాడే బయల్దేరి బుద్ధ గయ వెళ్లి ,ఫల్గూ నదిలో పవిత్ర స్నానం చేసి ,విష్ణు స్వామిని దర్శించి గయా శ్రాద్ధం తో పితృదేవతలకు తృప్తి కలిగించి ,పుణ్య రాశి కాశీ  చేరి పవిత్ర గంగాస్నానం  విశ్వనాథ దర్శనం తో పులకించి  నరసింహదాస మహోదయుడు –‘’రజతాద్రి ఇచటికి రాబోలు నేమొకొ-కాదు కాశీ సౌద కా౦తిగాని –‘’అని భక్తిగా ఆర్తిగా వర్ణించి నృత్యం చేసి ,-‘’తారక బ్రహ్మ మంత్రంబు దయ నొసంగు –హరుని కాపురమగు కాశి నరయగంటి ‘’అని తన జన్మ ధన్యమైందని ,అనుకొన్నట్లుగా రామానుగ్రహం తో  కాశీ దర్శించగలిగాననీ పరమానంద పడ్డాడు .అక్కడి బిందుమాధవ ,డుంఠి గణపతి దండాయుధ కాలభైరవ అన్నపూర్ణ విశాలాక్షి దేవులను దర్శిస్తూ నిత్యగంగాస్నానం,పితృ తర్పణం  తో పులకించాడు

  అగస్త్య మహర్షిలాగా కాశీని విడువలేక విడువలేక  విడిచి పడమరగా బయల్దేరి ,ప్రయాగ త్రివేణీ సంగమ పవిత్ర స్నానం చేసి ,విధులు నిర్వహించి మళ్ళీ కాళ్ళకు పని చెప్పి గుంటూరు అనే గర్తపురి చేరి ,తల్లి వెంకమాంబ పాద పద్మాలకు నమస్కారం చేసి గంగాజలంతో అభిషేకం చేసి ఆశీస్సులుపొంది తనరాకకోసం ఎదురు చూస్తున్న పురజనుల క్షేమం  అడిగి తెలుసుకొని కొన్ని రోజులు గుంటూరులో  ఉన్నాడు .

   ప్రతి చైత్రం లో భద్రాద్రి రామ దర్శనం

 ప్రతి చైత్రమాసం శ్రీరామనవమికి లో భద్రాద్రి వెళ్లి తన కులదైవం శ్రీ సీతారామ దర్శనం,చేసి కళ్యాణ శోభ చూసేవాడు .వృష నామ సంవత్సరం లో తమ్ముడు కృష్ణ దాసుతో కలిసి చైత్ర శుద్ధనవమికి భద్రాచలం చేరి,గోదావరీ స్నాన పులకితగాత్రుడై శ్రీరాముడికి హృదయం సీతమ్మకు కాన్కలు హనుమయ్యకు మ్రొక్కులు సమర్పించి-‘’గాయయందు నిప్పాసి  కనులకు భవదంఘ్రి నీక్షింప జేసినదీవ కావె—గంగాది యాత్రలీ కలుషాత్ము జేతజే-యించి రక్షించిన దీవ కావె’’అంటూ అనేక పద్యాలతో భద్రాద్రి రామ స్తుతి చేసి మళ్ళీ గుంటూరు చేరాడు .

     దక్షిణ దేశ యాత్ర

  సంపదలు శరీరం బుద్బుదాలని ,సత్కార్యాచారణం చేయాలని ,తీర్ధ యాత్రలతో జ్ఞాన సౌద  నిర్మాణం చేయాలనీ తల్లికీ తమ్ముడికి ధైర్యం చెప్పి మళ్ళీ దక్షిణ దేశ యాత్రకు1821-22 వృష సంవత్సర ఆషాఢ శుద్ధ విదియనాడు  గుంటూరులో బయల్దేరి పొన్నూరు చేరి. భావనారాయణ స్వామిని దర్శించి పొన్నూరు వెళ్లి అక్కడి భావనారాయణ స్వామి ఆశీర్వచనం పొంది  నరసింహ దాసు నెల్లూరు చేరి రంగనాథ స్వాముల దర్శనం పూజ చేసి , తిరువలిక్కేలి వెళ్లి పార్ధసారధి  దర్శనం  తో తృప్తి చెంది ,మద్రాస్ మీదుగా మధ్యలో ఉన్న  తీర్దాలుక్షేత్రాలు  చూస్తూవానకు తడుస్తూ ఎండకు ఎండుతూ చలికి వణకుతూ చిదంబర క్షేత్రానికి వెళ్లి చిదంబరేశ్వరుని దర్శనం తో ఆనందం పొంది ఆకాశలింగ దర్శనం ,నమక చమకాలతో అభిషేకం ,బిల్వదళ పూజ చేసి ,శియాళి వెళ్లి శివదర్శనం చేసి ,గౌరీ మయూరం దర్శించి ,పంచవటం చూసి, కావేరీ తీరం చేరిపుణ్యస్నానం చేసి   ,మహేశునర్చించి ,కుంభకోణం లో ద్వాదశ తీర్ధాలలో స్నానించి ‘’కు౦భేశ హరహరా  శంభో ‘’అని పులకితగాత్రుడై ,పంచ నాథ శివ దర్శనం చేశాడు .

  నాదబ్రహ్మ త్యాగరాజస్వామి దర్శనం

 ,నాద బ్రహ్మ త్యాగయ్యగారి మహిమలు తెలుసుకొని దర్శన౦ తో  జన్మ ధన్యమైందని భావించి ఆయన ఆదరణ పొంది ,త్యాగబ్రహ్మ తాము రచించిన కృతులను స్వయంగా గానం చేయగా పరవశింఛి , తూము నరసింహ దాస భక్తాగ్రణిఆనంద పారవశ్యంతో ‘’చేతుల దాళము పట్టుక  -చేతో మోద౦బు తోడ సిగముడి వీడన్-బాతర  లాడుచు మింటను –గీతము నారదుడు వాడె గృష్ణా యనుచున్ ‘’   అని పోతన గారు భాగవతం లో రాసినట్లు నారద మహర్షిలాగా నృత్యం చేశాడట నరసింహ దాసు .పాముకాళ్ళు పామే ఎరుగున్ అనే సామెత లాగ దాసు గారు త్యాగయ్యగారిని నిజంగా చూశాడా అని అనుమాన పడే వారికి ఆయనే ‘’కేవలానంద సంకీర్తనావళి వింటి –భావ సిద్ధియు శుద్ధ భక్తి గంటి –భక్తులు శిష్యులు బలసి కొల్వగ గంటి-వాజ్మాధురీ  వైభవంబు గంటి –వినయ సత్సం పద్వివేకమున్ కనుగొంటి –శ్రీరామ పద భక్తి  చెల్వు గంటి-యజున కందగరాని యనుభవంబును గంటి-దన్మయత్వ౦ బాత్మ దనరగ గంటి –నరసి కనుగొంటి ద్యాగరారార్యునందు-నీల సద్గుణ పుంజమి౦ కెన్నియైన –దివ్య మహిమాతి శయములు దేజరిలుట –గంటి హర్షాబ్ధినోలాడు చుంటి మదిని ‘’..త్యాగయ్య గారి సన్నిధానం లో కొన్ని రోజులు గడిపి త్యాగరాజ భక్తికి పరవశుడైనాడు –‘’‘’     .  .’’రామ పదభక్తి కీ త్యాగరాయ వరుని –సమముగా నేర నెవ్వారీ క్ష్మాతలమున –బ్రేమ నా ఘను డొకసారి పిలిచె నేని –రాము డోహో యటంచు మార్పలుకునంట’-అట్టి ఘనుని యాజ్ఞనంది యచ్చోటు వాసి –కడు రయంబుతోడ గదలి సాగి – పరగ రాజిలు నవ పాషాణ  మహిమంబు –నాలకించి ముదుకరిగి యరిగి ‘’ అని తన త్యాగరాజ దర్శనాన్ని చక్కగా చిత్రించాడు రికార్డ్ చేశాడు చరిత్రలో శాశ్వతంగా. భక్తులమనసు భక్తులకే తెలుస్తుంది .నరసింహదాసు త్యాగయ్యగారి చే సత్కారం పొంది దక్షిణ సముద్రం ,నవ గ్రహ శిలలు ,చక్ర తీర్ధం ,స్వేతా రంభ స్థలం ,భైరవాది తీర్ధ సందర్శనం చేసి రామేశ్వరం చేరాడు  .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-1-21-ఉయ్యూరు  ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జారిపోయిన  జ్ఞాపక శకలాలు -1. మల్లయ్య గారి మిల్లు

జారిపోయిన  జ్ఞాపక శకలాలు -1.

మల్లయ్య గారి మిల్లు

‘’ఊసుల్లో ఉయ్యూరు ‘’అనే నా జ్ఞాపకాల తేగలపాతర లోనుంచి కొన్ని జ్ఞాపకాలు జారిపోయాయి .ఇప్పుడిప్పుడే అవి మళ్ళీ స్మృతి పథ౦ లో మెదుల్తున్నాయి .వాటిని తవ్వి తీయటమే ఇప్పుడు నేను చేస్తున్నపని .అందులో మొదటి శకలమే ‘’మల్లయ్య గారి మిల్లు ‘’.

   ఉయ్యూరు రావి చెట్టు బజారులో ,మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయానికి ఎదురుగా ,సూరి వారి బజారునానుకొని మేము హిందూపురం నుంచి 1950లో ఉయ్యూరు వచ్చే నాటికే ‘’వెంట్ర ప్రగడ మల్లయ్య’’ గారి వడ్ల మిల్లు ఉన్నది .మల్లయ్య గారిని నేను చూసిన దాఖలా లేదు .కానీ వారి పెద్దబ్బాయి వెంకటేశ్వరరావు ,ఆయన ఇద్దరు తమ్ములు మిల్లు ను నడపటం బాగా గుర్తు .అది అప్పటికే చాలా పెద్ద మిల్లు .వందలకొద్దీ వడ్ల బస్తాలు రావటం వాటిని బియ్యం ఆడటం లారీలలో ఎగుమతి చేయటం బాగా జ్ఞాపకం .వెంకటేశ్వర రావు గారు నల్లగా హుందాగా తెల్లని మల్లు పంచె తెల్ల షర్ట్ తో ,నుదుట యెర్రని నిలువు బొట్టుతో అనుక్షణం నవ్వుతూ ఉండేవారు .మాంచి యాజమాన్యం లో మిల్లు నడిచేది .కనీసం పది మంది వర్కర్లైనా ఉండేవారు .మిల్లుకు దక్షిణాన ఊక రాసి  చిన్న కొండంత పెరిగి ఉండేది .మిల్లులో బియ్యం అమ్మే వారో లేదో నాకు గుర్తులేదు. చిట్టూ,తౌడు మాత్రం  అమ్మేవారు .ఊక కావాలంటే అడిగితే ఫ్రీగానే ఇచ్చేవారని గుర్తు .ఆయన ఇద్దరు తమ్ముళ్ళు ఆయనకంటే నలుపు రంగు .వ్యవహార దక్షులు కూడా .ఈ ఇద్దరూ పాంట్ షర్ట్ తో ఉండేవారు .మల్లయ్య గారి ఇల్లు అంటే అప్పటికే డాబా రావి చెట్టు ఎదురు సందులో విశ్వ బ్రాహ్మణ బజారు మొదట్లో కుడివైపున సత్రానికి అవతల ఉండేది చాలా క్లాస్ గా ఉండేది .

 వెంకటేశ్వరరావు గారికి మా నాన్న గారు బాగా పరిచయం .నేను ఎప్పుడు వెళ్ళినా పంతులు గారు అనో మేష్టారు గారనో పలకరించేవారు .ఆయన కొడుకు ఉయ్యూరు హైస్కూల్లో నా శిష్యుడు .పేరు గుర్తులేదు పొట్టిగా నల్లగా ఉండేవాడు .మాశ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం పునః ప్రతిష్ట నాటికే వెంకటేశ్వరరావు గారి అన్నదమ్ములు ఎవరి భాగం వారు తీసుకొని విడిగా రావి చెట్టుకు ఉత్తరాన కోమటి బజారు అని పిలువబడే మెయిన్ రోడ్ కు కలుపబడే దారి వీధిలో ఉండేవారని జ్ఞాపకం  .మా ఆలయ ప్రతిష్ట తర్వాత వెంకటేశ్వరావు గారబ్బాయి ,కోడలూ ప్రతి రోజూ గుడికి వచ్చేవారు .చాల భక్తీ శ్రద్ధలున్నవారు ఆ దంపతులు .ఒక పిల్లాడో,పిల్లో పుట్టారు కూడా ..తర్వాత ఏమైందో తెలీదు కాని కోడలు చనిపోయింది .ఆ ఇంటి వైభవం మసకబారింది .కొడుకు ఒంటరిగా కొంతకాలం అందులో ఉండేవాడు తర్వాత అతడు ఆ భవనం అమ్మేశాడని తెలిసింది ఎక్కడి కి వెళ్ళాడో తెలీదు .ఆ చాప్టర్ అక్కడితో క్లోజ్ . వెంకటేశ్వరరావు గారి తమ్ములు మాత్రం అప్పుడప్పుడు కనబడే వారు .

  మల్లయ్యగారి మిల్లులో లెక్కలు, డబ్బు వ్యవహారాలూ చూసే కనుపూరి శర్మ  గారు ఉండేవారు .పూర్తి పేరు హనుమంత శర్మ అని గుర్తు .అందరూ శర్మ గారూ అనే పిలిచే వారు .నిలువెత్తు మనిషి .హుందాగా  తెల్లటి ఖద్దరు అంచుల పంచ తెల్ల చొక్కాతో ఉండేవారు సంస్కారం ఉట్టి పడేది .ఆయన ఉయ్యూరు కాలేజీ దాటాక వచ్చే గరుగు మీద కాపురం .వ్యవసాయం కూడా ఉండేదేమో  ? ఆయన మా ఇంటికి దక్షిణాన ఉన్న బెల్లం కొండ సుబ్బయ్యగారి పెద్ద కుమారుడు లక్ష్మీ నారాయణ గారి భార్య రాజమ్మ గారికి స్వయానా తమ్ముడు .మిల్లు లెక్కా డొక్కా అంతాపకడ్బందీ గా ఉండేది ఆయన చేతిలో .సైకిలు మీద వచ్చేవాడు  గరుగు మీద నుంచి మల్లయ్య గారి మిల్లుకు .ఈయన దగ్గర  బంధువే బహుశా మేనమామ కావచ్చు బెజవాడ లో జైహింద్ టాకీస్ కు వెళ్ళే దారిలో ఉన్న వివేకానంద హోమియో స్టోర్స్ .ఇక్కడ నిఖార్సైన హోమియో మందులు దొరుకుతాయని అందరికి మంచి నమ్మకం .వన్ టౌన్ లో రాదా కృష్ణా సైకిల్ షాప్ రోడ్డులో రామ కృష్ణా హోమియో స్టోర్స్ కు గొప్ప పేరుంది. దాని తర్వాత దీనికి పేరు .వివేకానంద స్టోర్స్ లోనే నేనెప్పుడు హోమియో మందులు కావాల్సి వచ్చినా కొనేవాడిని .శర్మగారు ఈ షాప్ ను నాకు పరిచయం చేశారు .ఆషాప్ ఓనర్ పేరు కూడా శర్మగారు అని గుర్తు .వెడల్పు ముఖం నవ్వుతూ చక్కగా పలకరించేవారు  ఉయ్యూరు పరిచయం ఉన్దికనుక చాలా గౌరవం చూపేవారు ఆయన చనిపోయాక భార్యా పిల్లలు స్టోర్స్ నిర్వహణ చూసేవారు .

గరుగు మీదే ఉండే ఇంకో కనుపూరు అయన ఉయ్యూరులో  చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసేవాడు .లావుగా బొద్దుగా ఉండేవాడు .రోడ్లు వేయటం మరమ్మత్తులు చేయటం చేసేవాడు శర్మగారికీ ,ఈయనకూ బంధుత్వం ఉందేమో నాకు తెలీదు .ఈయన కూతురు ఉయ్యూరు హైస్కూల్ లో నా శిష్యురాలు .పేరు గుర్తు లేదు .

 మేము ధాన్యాన్ని బందరు రోడ్డులో ఉన్న   ,ఆదిరాజు చంద్ర మౌలీశ్వరరావు గారి మిల్లు ,లేక కంతేటి విశ్వనాథం మిల్లు లేక కాటూరు రోడ్డులో ఉన్న పొగాకు ముసలయ్య మిల్లు లో మర పట్టించే వాళ్ళం .మల్లయ్యగారి మిల్లు ధాన్యం చిల్లరగా అడే వారు కాదేమో ?కానీ చివర్లో మల్లయ్యగారిమిల్లులో కూడా మరపట్టించిన గుర్తు కొద్దిగా ఉంది .ఇదీ జారిపోయిన మల్లయ్యగారి మిల్లు జ్ఞాపక శకలం .

ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి నాకంటే ఎక్కువగా మల్లయ్యగారి మిల్లు గురించి తెలిసి ఉండవచ్చు వారి జ్ఞాపకాలు దీనికి  జోడిస్తే సంతోషిస్తానని వారికి ఇందుమూలంగా తెలియ జేస్తున్నాను

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-1-21-ఉయ్యూరు

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

సోమగిరి కోదండరామ శతకం

సోమగిరి కోదండరామ శతకం

చిత్తూరు జిల్లా శశిగిరి పుర నివాసి శ్రీ గండ్లూరి చంగల్వ రాయ కవి రాసిన ‘’సోమగిరి కోదండ రామ శతకం ‘’ను శ్రీ చేగు నారాయణ శెట్టి ,శ్రీ పార్లపల్లి పాపి రెడ్డి గార్ల ఆర్ధిక సాయం తో చిత్తూరులోని శ్రీ వెంకట శివారెడ్డి గారి శ్రీ శారదా ముద్రాలయం  లో 1914న ప్రచురింపబడింది .వెల అణన్నర –(0-1-6).

  పీఠిక లో ఆలయ చరిత్ర వచనంగా రాశాడు .విజయనగర సార్వభౌముడు శ్రీ కృష్ణ దేవరాయలకాలం లో చంద్రగిరి పురం లో విశ్వామిత్ర  మహర్షి చే ప్రతిష్టితమైన అతి ప్రాచీన శ్రీ కోదండ రామ దేవాలయం ఉండేది .అందులో శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవ విగ్రహాలు మహా సుందరమైనవి .చాలా కాలం మహా వైభవంగా స్వామికి నిత్య ధూప దీప నైవేద్యాలు వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ కళ్యాణాలు దిగ్విజయంగా జరిగాయి కొంతకాలానికి  లక్ష్మణ స్వామి  విగ్రహం చోరీ కి గురైంది .క్రమంగా ఆలయమూ శిదిలమైంది .స్థానిక భక్తులలో కదలిక వచ్చి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలనే సంకల్పం కలిగి 1912 డిసెంబర్ లో నూతనాలయ నిర్మాణం చేసి ,నారాయణ శెట్టి ,పర్లే పాపిరెడ్డి గారు పూనుకొని లక్ష్మణ స్వామి విగ్రహాన్ని విశ్వకర్మతో చేయించి యధా విధిగా మూర్తులను పునః ప్రతిష్టించి  ఎన్నేళ్ళు గానో జన హృదయాలలో ఉన్న కోరిక తీర్చారు .ఈ చరిత్రను మన కవి గారు పద్య కావ్యంగా రాయాలని మనసులో అనుకోగానే ,మిత్రులు ప్రోత్సహించి ,ప్రతిపద్య పాదం మొదట్లో రామచరితం ఉండేట్లు108 కంద పద్యాలతో శతకం రాయమని  సలహా ఇవ్వగా ,అది తన శక్తికి మించినది అని కవి భావించి భారమ౦తా కోదండరాముని పై వేసి ,భక్తి తత్పరతతోరాసి పూర్తి చేశాడు చంగల్వ రాయ కవి .ఇందులోని తప్పొప్పులను మన్నించమని సుజన విధేయుడైన కవి మనవి చేశాడు .దీన్ని ‘’ప్రతి పద్య పాద పాదాది కవి యిచ్ఛావాక్య ఘటిత అష్టోత్తర శత కంద  రామాయణ సంగ్రహ శ్రీ సోమగిరి కోదండ రామ శతకం ‘’అని సార్ధక నామ ధేయం గావించాడు కవి .కోదండరామునికే అంకితమిచ్చి ధన్యుడయ్యాడు కవి .

  ప్రార్ధన పద్యాలలో మొదటిది శ్రీ రాముని గురించే –‘’శ్రీభూ సుత కుచయుగమృగ-నాభం .బెద నంటి యు౦డు నలినాక్షుం డై-శోబిల్లెడి వరసారస-నాభుడు శ్రీరాము డేలు నను దినమునన్’’.తర్వాతనే కరి వక్త్రుడైన వినాయక ప్రార్ధనచేసి తన ప్రణాళిక తెలియ జేశాడు .రామ చరిత్రను ఎలా రాశాడో చూద్దాం –సిరులకు నునికియయి ‘’అంటూ రామకధను అయోధ్యాపురి దశరథ మహా రాజు కథ తో ప్రారంభించాడు – ఇప్పుడు పద్య నడక ఎలా సాగిందో చూద్దాం –‘’సిరి కరి తురగాదుల చా –రు రమణులన్ భ్రుత్య దేనుభోగము చే జా –ల రసో జ్వలుడై రిక్తుల-కురు కల్ప ద్రుమము భంగి గోర్కెల నిడుచున్ ‘’ఇలా మొదటి కంద పద్యం చెప్పాడు .ఇందులో ప్రతిపాదం మొదటి అక్షరం లో కథ పైన చెప్పినట్లు నడుస్తుంది .ఒకరకంగా సర్కసు ఫీట్ లా ఉంటుంది .

  మధ్యలోకి వెడితే –చెలగగ లక్ష్మణ విగ్రహము ‘’అనే కధాంశం లోని కడాలరుచి చూద్దాం –‘’చెలియేమొఎడురాదుకొ-లల నిటు నా మీద నలిగి లావణ్యము నున్ –గల తనువును సూపింపక –గలుషము బూమి నట్లు నాకు కష్టము నిడెనో’’’’బుధ వరులయిన తమకు సతతము నతు లొనరిచెద’’అన్న భావంతో 100వ పద్యం నుంచి 105వరకు రాసి తన ప్రతిజ్ఞ నిలబెట్టుకొన్నాడు కవి .-‘’నలినాక్షు డయోధ్యపు-రి లలిత మాధుర్యమైన మృదు భాషణులన్ –చెలియతొబలుకుచు వానర –దళముజేరి రపుడు తద్దయ నుండన్ ‘’అంటూ మళ్ళీ అయోధ్యకు చేర్చాడు రామ కథను .ఈ మధ్యలో రామాయణ ముఖ్య ఘట్టాలన్నీ అందంగా  కందాలలో రాశాడు.

 శ్రీ రామ పట్టాభి షేకాన్ని ఈ నియమం లేకుండా రాశాడు –‘’భరతుడు శత్రుఘ్ను౦డును  -నిరు పార్శ్వముల౦దు  మెరయ నినజుండును యా –దొరయ౦గజుండును రాక్షస –వరుడువిభీషణుడు జాబవంతుండు వరుసన్ ‘’,’’కరువలి దిశ మెరయగవర –సరదభ్రసురుచుల దేహ శ్యామలకాంతి- సరసిజ ముఖుడై రాముడు –ధర విలసితుడయ్యియుండె తా మధ్యమునన్ ‘’-‘’ఘనమగు ప్రభువై ధరణిని-జనపాలన చేయు మంచు జితురత రామున్ –ముని చంద్రుడగు వసిష్టుడు –తిన పట్టాభిషిక్తు జేసి దీవెన లోసగెన్ ‘’-‘’సోమ గిరి పురంబున –బాసిలు కోదండరామ భవ్యునకు నే –వాసిగ నంకిత మొసగితి – భాసురముగ వ్రాసి దీని పల్వురు మెచ్చన్ ‘’-‘’మంగళ మా రామునకున్-మంగళమా సోమ శైల మందిరునకుస – న్మంగళముధీనిధి శుభ-మంగళమా వనిజ పతికి మహానియ్యునకున్ ‘’.

అంటూ శతకం పూర్తి చేశాడు చెంగల్వ రాయ కవి .కవుల చరిత్ర లో ఈ శతకం చోటు సంపాదించు కొన్నదో లేదో తెలియదు కాని కొత్తపోకడతో రాసిన శతకం.మెచ్చదగిన శతకం .ఆదరించాల్సిన శతకం.

   నూతన ఆంగ్ల సంవత్సర శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-1-21-ఉయ్యూరు     

 

ttps://ia800709.us.archive.org/6/items/shriisoomagiriko036171mbp/shriisoomagiriko036171mbp.pdf

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

చర్లవారి పురస్కారం

చర్లవారి పురస్కారం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

హేలాపురి (ఏలూరు )శతకం

హేలాపురి (ఏలూరు )శతకం Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.41(చివరి భాగం )

 

కిరాతార్జునీయం-.41(చివరి భాగం )

18 వ చివరి సర్గ -2(చివరి భాగం )

అర్జునుని సఫలత చూసిన ప్రమథగణం అతని తపస్సును ఫలితం మహా గొప్పదని కీర్తించారు –‘’తపసికృత ఫలే ఫలజ్యాయసీ –స్తుతిరివ జగదే హరేఃసూనునా ‘’.అర్జునుడు ప్రత్యక్ష మహా దేవుని స్తుతించటం మొదలుపెట్టాడు –‘’ఓ శంకరా !పరమ దయామతివి ,భక్తసులభుడవు ,,శరణమిచ్చే వాడివి .నిన్ను పొందిన వారు మృత్యువును జయిస్తారు .దేవదానవ లొకం  లో భయం కలిగితే ,నిన్నే శరణు కోరతారు ‘’-‘’శరణం భవ౦త మతి కారుణికం –భవభక్తి గమ్యధిగమ్యజనః –జిత మృత్యవో  జిత !భవంతి భయే –ససురాసురస్య జగతః శరణం ‘’.నీకు నమస్కరించనంతవరకు మనిషి మృత్యు ఆపదలో ఉంటాడు. కోరికలు సఫలం కావు .ఇతరులూ అలాగే .-‘’విపదేతి తావదవ సాదకరీ –న చ కామ సంపదభికామయతే –న నమంతి చైక పురుషం పురుషా –స్తవ యావదీశ !న నతిఃక్రియతే ‘’..దానాది పుణ్య కార్యాల స్వభావమున్న వారు జన్మ మృత్యు మొదలైన్ కస్టాలను చూసి ,ముక్తి కోరుతూ నిన్ను ఆరాధించటం లో చిత్రమేమీ లేదు .అయినా తమకోసమే నిన్ను ఆరాధించే వాళ్ళను నిస్పృహ పొందికూడా ఫలాన్నివ్వటం నీకారుణ్య ఫలితమే .ఇందులో నీ ప్రయోజనం  ఏదీ లేకపోవటమే చిత్రాచి చిత్రం –‘’సంసేవంతో దానశీలా విముక్త్యై-సంపశ్యంతో జన్మ దుఖం పుమా౦సః-యన్నిఃసంగస్త్వం ఫలస్యాన తేభ్య-స్తత్కా.రుణ్యం కేవలం న స్వకార్యం ‘’.ఏ తీర్ధం దూరం వెళ్ళకుండా ప్రాప్తిస్తుందో ,పరలోకం వెళ్ళకుండానే ఫలమిస్తుందో ,మోక్షప్రదమో ,అన్ని కోరికలూ తీర్చెదో ఆ తీర్ధం నువ్వు కాక మరొకటి కానే కాదు –‘’ప్రాప్యతే  యదిహ  దూర మగత్వా-యత్ఫలస్య పరలోక గతాయ –తీర్థమస్తి న భావార్ణవ బాహ్యం –సార్వ కామిక మృతే భవత స్తత్  ‘’.నీ భక్తీ తో కైవల్యంపొందుతాడు .వ్యతిరేకి ఘోర నరకం అనుభవిస్తాడు.నిష్కళంక మూర్తీ !ఇది చాలా దుస్తరమైనది .కార్యకారణ భావ శక్తి మహిమ .నీకు భక్త ,అభక్త భేదమే లేదు –‘’వ్రజతి శుచి పదం త్వయి ప్రీతిమాన్ –ప్రతిహత మతి రేతిఘోరాం గతిం-ఇయ మనఘ నిమిత్త శక్తిః పరా –తవ వరద న చిత్త భేదః క్వచిత్ ‘’.హే దయాళూ!భక్త వశాను వర్తిని ,కల్యాణాన్నీ చేకూర్చే  నీ మూర్తిని గుర్తించలేక పోయినా రాగద్వేషాలతో ఉండే ప్రాణి భక్తితో నీ స్మరణ చేస్తే చాలు సంసారసాగరం దాటగలడు.’-‘’దక్షిణా౦ ప్రణత దక్షిణ మూర్తిం –తత్వతః శివ కరీ మవిదిత్వా –రాగిణా మపివిహితా తవ భక్త్యా –సంస్మృతిర్భవ భవత్య భవాయ ‘’.జ్ఞాన దృష్టితో తత్వాన్ని గ్రహించి అనుకూలమైన ఆచరణ చేస్తూ విఘ్నాలు బాధలు లేకుండా మోక్షం పొందుతారు .పరమాత్మగా నిన్ను దర్శించి సమ్యక్ జ్ఞానం తో ఆరాధించేవాడు కర్తవ్య పాలకుడు ఔతాడు –‘’దృష్ట్యా దృశ్యా న్యాచర ణీయాని విధాయ –ప్రేక్షాకరీ యాతి పదం ముక్త మపాయైః-సమ్యగ్దృష్టిస్తస్య పరం పశ్యతి యస్త్వాం –యశ్చోపాస్తే సాదు విధేయం స విధత్తే’’.వ్యాస వాల్మీకాది మునులు యోగ మహిమతో ప్రజలకు విధి ,నిషేధ రూప ఉపదేశాలు చేసి ఉపకారం చేశారు. నీ మహిమ ఊహింప వీలు లేనిది .నిన్ను శరణు పొందిన వారి పుణ్య పాపకర్మలన్నీనాశనం చేయగలవు –‘’యుక్తాః స్వ శక్త్యా మునయః ప్రజానాం –హితోప దేశై రుపకార వంతః –సముచ్ఛినత్సి త్వమచిన్త్య ధామా –కర్మాణ్యు పేతస్య దురుత్తరాణి’’

   ‘’నీ మాయను జయించి పుణ్య  పాపాలతో బంధింప బడి ,ఇతరులు చేధించటానికి వీల్లేని భయంకర నరక యాతనను  దూరం చేయటానికి అద్భుత లీలా రూపం ధరించావు – ‘’స౦ నిబద్ద  మపహర్తు మహార్యం –భూరి దుర్గతి భయం భువనానాం –అద్భుతా కృతిమిమా మతిమాయ –స్త్వంభిభర్షి కరుణామయ మాయాం’’.నీ చిత్తం విరాగ మైనదే .నీశరీరం లో అర్ధ భాగం లో స్త్రీ ఉన్నా,మన్మథవికారం  లేని వాడివి .ఉదయ సంధ్యలో బ్రహ్మను ఆరాదిస్తావు .నీ చేష్టలు జటిలమైనవి ,అర్ధం కానివి –‘’న రాగి చేతః పరమా విలాసితా –వధూః శరీరే స్తినచాస్తి మన్మథః-నమస్క్రియా చోషసి ధాతు రిత్యహో –నిసర్గ దుర్బోధ మిదం తవేహితం ‘’.వెంట్రుకలతో ఉన్న గజ చర్మాన్ని కప్పుకొన్నావు.మణితో ఉన్న సర్పం నీ మొలతాడు .కపాలమాల అలంకార దండ .చితా భస్మం చందనం అయినా ఈ అలంకారాలు శిరసుపై ఉన్న చంద్ర రేఖతో సమానంగా ప్రకాశిస్తున్నాయి –‘’తవోత్తరీయం కరి చర్మ సా౦గజం –జ్వలన్మణిః సారసనం మహానహిః-స్రగాస్య పంక్తిఃశవ భస్మ చందనం –కలాహిమాంశోశ్చసమం చకాసతి ‘’.నువ్వు ఆశరీరుడివే.అసాధారణ అర్ధ నారీశ్వర రూపం నీకే ఉంది .విరుద్ధ వేష ,అలకారాలున్నా ,మహా అందంగా ఉంది .లోకం లో ఇంకెవరికీ ఇలా లేనేలేదు .నీ మహిమ అవర్ణ్యం.-‘’అవిగ్రహస్యాప్యతులేన హేతునా –సమేత  భిన్నద్వయ మూర్తి తిష్టతః –తవైవ నాన్యస్య జగత్సు దృశ్యతే –విరుద్ధ వేషాభరణ్య కా౦తతా ‘’.జనన మరణ రహితుడవు నీకు ఉపమానమే లేదు  ఉపమేయమూ లేదు.అంటే వర్ణించలేము  –‘’ఆత్మ లాభ పరిణామ నిరోధై-ర్భూత సంఘ ఇవ న త్వముపేతః –తేన సర్వ భువనాతిగలోకే –నోపమానమసి నాప్యుపమేయః ‘’

‘’చరా చర ప్రపంచ సంహారకుడివి. నీవల్లనే విశ్వం సృష్టింపబడి ,జీవిస్తుంది .యోగులకే కర్మ ఫలాన్నిస్తావు .సమస్త జగత్తు కారణానికే కారణం నువ్వే –‘’త్వమంతకః –స్థావర జంగమానాం –త్వయా జగత్ప్రాణి దేవ విశ్వం –త్వం యోగినాం హేతు ఫలే రుణత్సి-త్వం కారణం కారణ కారణానాం ‘’..ఈ సంసారం లో రాక్షసులు ,దేవ ,మనుష్యులు,దైత్యులు ఏయే సామ్రాజ్యాలు పొందారో ,వాటన్నిటికీ శరణాగతుల దుఖాన్ని పోగొట్టే నీకు చేసిన నమస్కార మహిమే కారణం ‘’-‘’రక్షోభిః సురమనుజైర్దితేః సుతైర్వా-యల్లోకే ష్వవికల మాప్త మాధిపత్యం –పావిన్యాఃశరణాగతార్తి హారిణే త-న్మాహాత్మ్య౦ భవ భవతేనమస్క్రియాయాః’’.శంకరుని అష్ట మూర్తుల్లో వాయు మూర్తి ఒకటి .దాన్నిఅర్జునుడు ‘’  వాయు బలం తో లోకాన్ని ప్రాణవంతం చేస్తుంది .వాయువు ప్రేరణ తో అక్షరరూప బ్రహ్మ పలుక బడుతుంది .అదే అన్ని పాపాలు పోగొట్టి శుద్ధిచేస్తుంది .అలాంటి వాయు రూప శివా !’’అని స్తోత్రం చేశాడు –‘’తరసా భువనాని యో భిభర్తి –ధ్వనతి బ్రహ్మ యతః పరం పవిత్రం –పరితో దురాని యః పునీతే –శవ తస్మైపవనాత్మనే నమస్తే ‘’

  తర్వాత అగ్నిరూప శివ స్తోత్రం చేశాడు పార్ధుడు –యోగ సాధన కోసం యోగాసనం లో కూర్చుని నిన్ను స్మరించే యోగుల సంసార దుఖాలకు కారణమైన కర్మలను దహిస్తుంది .అనేక జ్వాలలతో ప్రకాశించే నీ అగ్ని మూర్తికి నమస్కారం –‘’భవతః స్మరతా౦సదాసనే –జయిని బ్రహ్మ మయే నిషేదుషాం –దహతే భవ బీజ సంతతిం –శిఖినే నేక శిఖాయ తే నమః ‘’.జలమూర్తి శివ స్తోత్రం –సంసార బీజానికి కారణమైన శివా !ఆధ్యాత్మిక ,ఆది భౌతిక ,ఆది దైవిక ,ఆది భౌతిక రూప తాపత్రయాలలు మరణం మొదలైన వాటి వలన కలిగే భయరూప మంటలను ఉన్న సంసారాగ్ని లో చాలాకాలంగా బాధ పడే వారు  నిన్నాశ్రయిస్తే చాలు వారికి జీవదానం చేయగల జలమూర్తి వైన నీకు నమస్కారం –‘’అబాధా మరణ భయార్చిషా చిరాయ –ప్లుష్టేభ్యోభవ మహతా భవానలేన-నిర్వాణం సముపగమేన యచ్ఛతే తే-బీజానాం ప్రభవ నమోస్తు జీవనాయ ‘’నభో మూర్తి శివ స్తోత్రం –భవా! విభువు ,సంపూర్ణ జగత్తూ ఆవరించిన వాడూ ,ఎవరి చేతా ఆచ్చాదనం లేనివాడు ,ఆది అంతం లేని వాడు ,ఇంద్రియాతీతుడు తెలియబడని నీ ఆకాశ మూర్తికి నమస్కారం –‘’యః సర్వేషా మావరీతా వరీయాన్ –సర్వైర్భావైర్నావృతోనాది నిష్టః-మార్గాతీతా ఏంద్రియాయాణా౦ నమస్తే –విజ్ఞేయాయ వ్యోమ రూపాయ తస్మై ‘’.దేవా !సూక్ష్మాతి రూపం తో విశ్వాన్ని ధరిస్తూ ,అంతర్యామిగా అందరికీదగ్గరౌతావు .మాట మనసుకూ అతీతుడవైనా వాటికి అధిపతి వైన నీకు నమస్కారం ‘’.-అణీయసేవిశ్వ విధారిణేనమో –నమో౦తిక స్థాయ నమో దవీయసే –అతీత్య వాచాం మనసాం చ గోచర౦ –స్థితాయ తే తత్పతయే నమో నమః ‘’అన్ని విద్యలకు స్వామివి .అజ్ఞానంగా శస్త్ర సంధాన దుశ్చర్యకు పాల్పడిన నన్ను క్షమించు .అజ్ఞానం తో విరోధించి ,మళ్ళీ నిన్ను చేరిన దుర్మార్గు డికి  కూడా నువ్వే  శరణ మయ్యావు ‘’-అసం విదానస్య మమేశ సంవిదాం –తితిక్షితుం దుశ్చరితం త్వమర్హసి –విరోధ్య మొహాత్పునరభ్యుపేయుషాం-గతిర్భవానేవ దురాత్మనాపి ‘’.

  స్తోత్రాలన్నీ చేసి చివరకు అర్జుండు శివుడిని వర౦  కోరుతున్నాడు-‘’ధర్మపాలకా !ఆస్తి బుద్ధితో వైదిక ధర్మాన్ని ఆచరిస్తున్న మా అన్న ధర్మరాజు గారికి .అపకారులైన శత్రువులపై మేము ఏ విధంగా శస్త్రాస్త్ర సమృద్ధిగా విజయం పొందుతామో దాన్ని మాకు ప్రసాదించు –ఇదే నా ప్రార్ధన –‘’ఆస్తిక్య శుద్ధమవతః ప్రియ మార్గ ధర్మం –ధర్మాత్మజస్య విహితాగసి శత్రు వర్గే –సంప్రాప్నుయా౦ విజయ మీశ యయా సమృధ్యా –తాం భూతనాథ  విభుతాంవితరాహవేషు ‘’అని కోరి శివుని పాదాలపై పడిన ఆర్జునుడిని శంకరుడు ఓదార్పు మాటలు పలికి అగ్నిజ్వాలావృతమై, రుద్రదేవకాత్మమైన పాశుపతాస్త్రాన్ని,దానికి సంబంధించిన ధనుర్వేదాన్నీ అనుగ్రహించాడు –‘’ఇతి నిగదిత వంతం సూను ముచ్చైర్మ ఘోనః –ప్రణత శిర సమీశః సాదరం సాంత్వ యిత్వా –జ్వలదనల పరీతం రౌద్ర మస్త్రం దధానం –ధనురుప పద మస్మైవేదమఖ్యాదిదేశ’’.

   ఆధనుర్వేదం శివుని చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తూ,దేవతలు స్తోత్రాలు చేస్తుండగా అర్జునుడి ఎదుటకు వచ్చింది .ఎర్రని నేత్రాలతో అందం గా ఉంది సర్వ లోక పూజనీయం ప్రకాశమైన ధనుస్సుభయంకర శరీరం ధరించింది .మూడు శిఖల త్రిశూలంతో సంబంధం కలిగి ఉన్నది పచ్చని రంగుతో సూర్యుడు మేఘాన్ని చేరినట్లు ఆర్జునుడిని చేరింది –‘’స పి౦గాక్షః శ్రీమాన్ భువన మహనీయేన మహసా – తను౦ భీమాం భిభ్ర త్రిగుణ పరివార ప్రహరణః-పరీత్యేశానం త్రిః స్తుతిభి రూప గీతః సుర గణైః-సుతం పాండోర్వీరం జలదమివ భాస్వాన భియయౌ ‘’.తర్వాత ఇంద్రాది దేవతలు ఈశ్వరుని అనుమతి పొంది పూర్ణ కాముడైన అర్జునుడికి ఫలదాయకాలైన ఆశీస్సులు పలికారు .విజయ ప్రదాలైన అనేక అస్త్రాలు అర్జునుడికి ప్రదానం చేశారు –‘’అథశశధర మౌలే రభ్యనుజ్ఞా మవాప్య –త్రిదశ పతి పురోగాఃపూర్ణ కామాయ తస్మై –అవిథతఫలమాశీర్వాదమారోపయంతో-విజయి వివిధ మస్త్రం లోక పాలా వితేరుః-‘’

జయశీలుడైన అర్జునుడు పాశుపతాస్త్ర లాభం తో అభ్యుదయం పొంది దురాత్ముల వినాశానానికీ ,లోక రక్షణకు తపస్సు వలన కలిగిన శోభతో ప్రత్యేక తేజస్సుతో అద్వితీయ సూర్య ప్రకాశంగా ప్రకాశించాడు  .దేవతలు అర్జున యశోగానం చేసి ఉత్సాహ పరచారు –‘’అసంహార్యోత్సాహం జాయిన ముదయంప్రాప్య తరసా –దురం గుర్వీ౦ వోఢుం స్థితమనవ సాదాయ జగతః –స్వధామ్నా లోకానాం తముపరి కృతస్థానమమరా –స్తపో లక్ష్మ్యా దీప్తం దిన కృతమివో చ్చైరుప జగుః’’

  శివ భగవానుడు అర్జును డితో’’వెళ్ళు శత్రువులను జయించు ‘’అని ఆజ్ఞ ఇవ్వగా పాదాలకు నమస్కరించి బయల్దేరాడు పార్ధుడు .దేవతలు కొని యాడగా విజయలక్ష్మితో ఇంటికి చేరి ,ప్రేమాదరాలతో ఎదురు చూసున్న అన్న  ధర్మరాజుకు నమస్కరించాడు –‘’వ్రజ జయ రిపులోకం పాద పద్మానతః సన్-గదిత ఇతిశివేన శ్లాఘి తో దేవా సంఘైః-నిజ గృహమథగత్వా సాదరం పాండు పుత్రో –ధృతగురు జయలక్ష్మీ ర్ధర్మసూనుం ననామ ‘’.

 భారవి మహాకవి మహాకావ్యం ‘’కిరాతార్జునీయం’’ సమాప్తం .

ఆధారం –భారవి మహా కవి కిరాతార్జునీయం సంస్కృత కావ్యానికి శ్రీ శ్రీపాద వేంకట రమణ దైవజ్ఞ గారు రాసిన తెలుగు వ్యాఖ్యానం ఆధారంగా అంతర్జాలం లో కిరాతార్జునీయాన్నిమాఘమాసం  25-1-20 న ప్రారంభించి ,7-2-20నాటికి14 ఎపిసోడ్ లతో  3 సర్గలు వారి వ్యాఖ్యానం మూడు సర్గలకే ఉండటం వలన  అంతవరకే రాసి ,ఆపేశాను .తర్వాత సర్గల వ్యాఖ్యానం కోసం ఈలోపు గాలించి ,గాలించి మా అబ్బాయి శర్మ ఎమెస్కో వారు ప్రచురించిన డా. సుందరాచార్య సంపూర్ణ కిరాతార్జున వ్యాఖ్యానం కొని పంపించగా దసరాలలో సరిగ్గా సరస్వతీ పూజ రోజున నాకు 21-10-20న అందింది . .మళ్ళీ కార్తీకమాసం 16-11-20న 4వ సర్గ నుంచీ  డా .కె.వి.సుందరాచార్యులు  వారి సుందర  తెలుగు వ్యాఖ్యానం ఆధారంగా ప్రారంభించి ఈరోజు మార్గశిర బహుళ పాడ్యమి 30-12-20నాటికి 41ఎపిసోడ్ లతో సుమారు నెలన్నర కాలం లో ,18వ సర్గ వరకు మొత్తం కావ్యాన్ని పూర్తి చేయగలిగాను .మొత్తం 55ఎపిసోడ్ లు గా ,కిరాతార్జునీయ౦ పూర్తయింది.ఇది నాకు సంతృప్తినీ ఆనందాన్నీ కల్గి౦చికావ్యం  .నాజన్మ చరితార్ధం –

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -30-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం -40 18 వ చివరి సర్గ -1

కిరాతార్జునీయం -40

18 వ చివరి సర్గ -1

తన భుజబలం శివునిపై ప్రదర్శించాలనుకొన్న అర్జునుడిని  శివుడు ముద్గరం అనే ఇనుప ఆయుధం  వంటి పిడికిలితో పొడిచాడు –‘’ధనురపాస్య సబాణధిశంకరః –ప్రతి జఘాన ఘనైరివ ముష్టిభిః’’ .కిరాతార్జునులు  ముష్టి యుద్ధం చేస్తూ వ్రేళ్ళతో చేతులు చరఛి పట్టుకొ౦టే కలిగిన బండరాళ్ల వంటి ధ్వని పర్వత గుహలలో ప్రతిధ్వనించింది –‘’స్ఫుట దనల్ప శిలారవ దారుణః-ప్రతి నినాద దరీషు దారీ భ్రుతః’’.శ౦కర ముష్టిఘాతాలు,కి౦కరునికి చమ్మగానే ఉన్నాయి .పరాక్రమ శీలురు తేజస్వంతుల అనుకరణలో  కూడా విశిష్టంగా నే ఉంటారు. అర్జున మనస్వి ఆవేశం తో రౌద్రం పొందినా ,సుఖ దుఖాల భేదం గుర్తించలేదు అని భావం –‘’క ఇవ నామ బృహన్మనసాం భవే-దను కృతే రపి సత్వవతాం క్షమః ‘’.శంకర వక్షస్థలం పర్వత తట ప్రాంతం లా విశాలమైనది .అర్జునుడి దెబ్బలతో గాయమై రక్తం కారుతూ సంధ్యాకాల ఎరుపు రంగు మేఘం లా ఉన్నాడు ‘’ –‘’అభిన వౌష సరాగభ్రుతా బభౌ –జలధరేణ సమాన ముమాపతిః ’ఉరసి శూల భ్రుతఃప్రహితా ముహుః-ప్రతిహతం’’

అర్జున ముష్టి ఘాతాలు సహ్యపర్వత తీరాన్ని సముద్ర కెరటాలు మాటి మాటికీ కొట్టు కొంటు న్నట్లుగా ఉంది .పర్వతాన్ని కెరటాలేమీ చేయలేనట్లే అర్జునుని పిడి గుద్దులు స్థాణశివుడిని ఏమీ చేయలేకపోయాయి –‘’ఉరసి శూల భ్రుతఃప్రహితా ముహుః-ప్రతిహతం యయు రర్జున ముష్టయః –భ్రు శరయా ఇవ సహ్య మహీ భ్రుతః –పృథుని  రోథసి సింధు మహో ర్మయః’’

   శివుడు రెండు చేతులతో పిడికిలి బిగించి అర్జున భుజాలపై కొట్ట గా ,కళ్ళు తిరిగి తడబడి తూలి పడ్డాడు –‘’త్రి చతురేషు పదేషు కిరీటినా –లులిత దృష్టిమదాదివ చస్థలే’’.అవమాన కోపాలతో మండిపడి దగ్గరకెళ్ళి శివుడి రెండు భుజాలు వేరు చేసి గట్టిగా పట్టుకొన్నాడు పార్ధుడు –‘’భుజ యుగేన విభజ్య సమాదదే –శశి కళా భరణస్య భుజ ద్వయం ‘’.కిరాతార్జున మల్లయుద్ధం హిమాలయాన్ని కంపింప జేసింది .తమ భుజబలాన్ని వారిద్దరూ గర్వంగా భావించారు .ఒకరి భుజాలు మరొకరు పట్టుకొని శృ౦ఖలాలు కూర్చినట్లు పోరాడారు –‘’కరణ శృ౦ఖల సంకలనాగురు –ర్గురు భుజాయుధ గర్విత యోస్తయోః’’.ముష్టి యుద్ధ లో  ఇద్దరూ కిందపడ్డారు .ఎవరు కిందపడ్డారు,  ఎవరు పైన ఉన్నారో తెలియక తికమక పడ్డారు ప్రమథులు .శివార్జునుల బరువును సహించలేని ఇంద్రకీల పర్వతం  వారితో పాటు కదులుతూ ,వాళ్ళు కదలకుండా ఉంటే స్థిరంగా ఉంటూ ,వంగినపుడు వంగి నుల్చుంటే నిటారుగా నిలబడి ,ఎక్కడ తాను  నశి౦చి పోతానో అనే భయం పొందింది –‘’ప్రచాలితే చలితం స్థిత మాస్థితే-వినమితే నతమున్నత మున్నతౌ –వృష కపిధ్వజయో రస హిష్ణునా –ముహురభావ భయాదివ భూ భ్రుతే’’

  కళ్ళు చేతుల కలయిక ఆపేసి జబ్బలు చరవటం మొదలెట్టారిద్దరూ .ఆ ధ్వనికి పర్వత  నదులు ఎల్లలుదాటి ప్రవహించాయి –‘’చరణపాత నిపాతిత రోధనః –ప్రససృపుఃసరితః పరితః స్థలీః’’.ఆకాశం లోకి వేగం గా ఎగిరిన శివపాదాలు అర్జునుడు యెగిరి లాఘవంగా పట్టుకొన్నాడు –‘’చరణయోశ్చరణానమితక్షితి –రనిజ గృహేతిస్రుణాం జయినం పురాం’’.తను కళ్ళు పట్టి నేలకేసి కొట్ట దలచిన అర్జున పరాక్రమానికిశివుడు ఆశ్చర్యపోయి ,తన వక్షస్థలం తో గట్టిగా ఆలింగనం చేసి నలిపేశాడు –‘’’’విస్మితః సపది తేన కర్మణా –కర్మణాంక్షయకరః పురః పుమాన్ –క్లేప్తుకామ మవనౌ తమక్లమం –నిష్పిపేష పరిరభ్య వక్షసా ‘’.అర్జునుడి పరాక్రమానికి సంతోషించినంతగా అతడి తపస్సుకు సంతోషించ లేదు శివుడు. సత్పురుషుల కు తపస్సు మొదలైన గుణాలకు మించి ,సహజ పరాక్రమమే ఉపకారమై వన్నె తెస్తుంది –‘’’’గుణ స౦హతేః సమతిరిక్త మహో –నిజ మేవ సత్వముపకారి సతాం ‘’

  శంకరుడు తెల్లని భస్మంతోఅల౦కారుడై చంద్ర రేఖ తో మనసును ఆకర్షించే రూపం తో ప్రత్యక్షం కాగా అర్జునుడు వెంటనే నమస్కరించాడు –‘’అథహిమ శుచి భస్మ భూషితం –శిరశి విరాజమిత మిందు లేఖయా – స్వవపురతిమనోహరం హరం –దదత ముదీక్ష్య ననామ పాణ్డవః ‘’.అనుకుకుండా  బాణాలు అమ్ములపొదులు గాండీవం ఖడ్గం కవచం తో ప్రకాశిస్తున్న తన శరీరం చూసుకొని అర్జునుడు ఆశ్చర్య పోయాడు –‘’సహా శరధి నిజం తథా కార్ముకం –వపురతను సంవర్మితం –నిహిత మపి తథైవ పస్యన్నసిం-వృషభగతి రూపాయ యౌవిస్మయం ‘’.అప్పుడు మేఘాలు తు౦పురులతో నేలను తడిపి చల్ల బరిచాయి. చిత్రంగా మందార పుష్ప పరిమళం వ్యాపించి ,స్వచ్ఛకాంతి ఆకాశాన్ని ఆవరించి భేరీ వాదన లేకుండానే ధ్వనించింది .-‘’విమల రుచి భ్రుశంనభో దు౦దుభే-ర్ధ్వని రఖిల మనాహత స్యానతే ‘’.ఇంద్రునితో  సహా దేవతలంతా విమానాలలో వచ్చి ఆకాశాన్ని ఆవరించారు .ఆ విమానాల కాంతులతో ఆకాశం లో నక్షత్రాలు పొడమినట్లు తోచింది .-‘’రోచిష్ణురత్నావలిభిర్వి మానైః-ద్యౌరా చితా తారకితేవ రేజే ‘’.దేవ విమానాలు మోసే హంసలు మెడలలోధ్వనించే గంటలతో ,ఎగురుతూ  రెక్కలు నాడించి  ఆకాశాన్ని కౌగలించు కునేట్లు చేరాయి .మేఘం లాంటి వృషభం పై కూర్చున్న మహేశ్వరునికి వాయుదేవుడు ,తుమ్మెదలు మందార మాలలను పైన వెన్నెల లాగా  వ్యాపింప జేసి ఆహ్లాదం కలిగించాయి –‘’ముదిత మధులిహో వితానీ కృతాః-స్రజ ఉపరి  వితత్య సంతానికీః-జలద ఇవ నిషేది వా౦స౦ వృషే-మరుదుప సుఖయాం బ భూవేశ్వరం ‘’

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.39 17వ సర్గ -3(చివరి భాగం )

కిరాతార్జునీయం-.39

17వ సర్గ -3(చివరి భాగం )

ప్రతీకార  సమర్ధుడైన పార్ధుని చేయి ఆ సమయం లో  సాయ పడకపోయినా ,పూర్వపు ఉపకారం తలచుకొని అమ్ములపొది నుంచి అతి కష్టంగా వేరు పడింది .కృతజ్ఞుడైన సత్పురుషుడు మొదట ఉపకారం చేసిన వాడైనా ,తత్కాలం లో ఉపయోగపడని మిత్రుడిని వదలటం సహజమే .-‘’పరాన్ముఖత్వేపి కృతోపకారా—త్తూణీ ముఖాన్మిత్ర కులాది వార్యః ‘’.గత్య౦తరం లేక ఆ రెండు పొదులను దూరం చేయటం ఉపకారమే అయింది .యోగ్యత లేని సేవకుడు వ్యర్ధం ,అనుచితం ,సాహసమే అవుతుంది .-‘’సంభావనా యామ ధరీ కృతాయం-పత్యుః పురః సాహస మాసి తత్త్వం ‘’.ఇది గమనించిన కిరాత శంకరుడు రెచ్చి పోయి ,ఉక్కు బాణాలతో అర్జున మర్మావయవాలకు తీవ్ర బాధ కలిగించాడు .తత్వ చర్చమధ్యలో  ప్రతివాది నిరుత్తరుడైతే , అతడి పెద్దపెద్ద లోపాలను చూసి బాగా బాధ పెట్టినట్లుంది అర్జునుడి స్థితి.-‘’త౦ శంభు రాక్షిప్త మహేషు జాలం –లోహైఃశరైర్మర్మశునిస్తు తోడ-హృతోత్తరం .తత్వ విచార మధ్యేవక్తేవ దోషై ర్గురు భిర్విపక్షం ‘’.శంకర బాణాలు మణులు కూర్చిన అర్జున కవచాన్నిపగల కొట్టాయి.ప్రచండ వాయువు విద్యుత్తు తో ప్రకాశించే మేఘ శకలాలు తొలగించి సూర్యుడిని ప్రకాశింప జేసినట్లు గా ఉంది –‘’చండఃపతంగాన్మురుదేక నీలం –తడి త్వతః ఖండ మివా౦బుదస్య ‘’. కవచం లేని క్రీడి శోభ ఒరనుండి లాగిన సానబెట్టిన ఖడ్గం లాగా,కుబుసం విడిచిన పాములాగా ,శత్రు ఏనుగును చూసి ముఖావరణం తొలగించిన ఏనుగు లాగా ,పర్వత గుహ నుంచి బయటికొచ్చిన సింహ౦లా,రాత్రి ప్రకాశించే పొగలేని అగ్నిలా అయింది .-‘’విబోధితస్య ధ్వనినా ఘనానాం –హరేరపేతస్య చ శైల రంద్రాత్ –నిరస్త దూమస్య చ రాత్రి వహ్నే –ర్వినాతను త్రేణ రుచిం స భేజే ‘’.కవచం పడిపోయి ,రెండు తూణీరాలు నేలపై పడికూడా ఆపదలో ఉన్న యజమానికి ఏమీ సహాయం చేయలేకపోతున్నామే అన్నట్లు అచేతనమైనాయి –‘’అచిత్త తాయామపి నామ యుక్తా –మనూర్ధ్వతాం ప్రాప్య తదీయ కృచ్ఛ్రే-మహీం గతౌ  తా విషుధీతదానీం  విన వ్రతు శ్చేతన ఏవ యోగం ‘’..పులిమీద పుట్ర లాగా అర్జునుడిపై శివుడు  ఆకాశం లో విశ్వకర్మ సూర్యుడిని చిత్రికపట్టినట్లు శాస్త్రాలతో గాయపరచాడు –‘’స్థితం విశుద్ధే నభసీవ సత్వే –దామ్నా తపోవీర్య మయేన యుక్తం –శస్త్రాభి ఘాతై స్తమజస్రమీశ –స్త్వస్టావివస్వంత మివోల్లి లేఖ ‘’.కోపావేశామున్నా అర్జునుడు వేదన పొందలేదు .శంకరబాణాలను పడగొట్టలేదు .క్రోధమే అతడి ఉక్కు కవచంగా మారింది –‘’సంరంభ వేగో జ్ఘిత వేదనేషు –గాత్రేషు బాధిర్య ముపాగతేషు-మునేర్బభూ వాగణితేషు రాశే-ర్లౌహస్తిరస్కార ఇవాత్మ మన్యుః’’.

   తర్వాత గో పుచ్ఛాకారం లో పొడవైన గుండ్రటి భుజాలున్న అర్జునుడు ,శరీరం రక్తం తో తడిసిపోతున్నా ,పాదాలు నేలకేసి కొడుతూ ,గంభీరంగా అరుస్తూ ,శంకరుని వైపుకు పరిగెత్తాడు .ఇంద్రుని వజ్రాయుధం లాంటి ,చంద్ర రేఖలాగా తెల్లనైన ధనుస్సుతో,ఏనుగు దంతం తో స్తంభాన్ని కూల్చినట్లు, శంకరుడిని  కొట్టి  పడెయ్యాలనుకొన్నాడు .-‘’మహా వేగంగా పడుతున్న ఆ వింటి బద్దను శివుడు తనలోనే వేగంగా దూసుకొస్తున్న గంగానదిని జహ్ను మహర్షి తనలో ఇముడ్చుకున్నట్లు కలుపుకొన్నాడు  -‘’రయేణ సా స౦  నిదధతే పతంతీ-భావోద్భవేనాత్మని చాప యష్టిః-సముద్ధతా సింధు రనేక మార్గా-పరే స్థితే నౌజాసి జహ్నునేన ‘’.చేతిలోచాపం లేని కిరీటి దానం చేయని వాడి సత్కారం లా ,యుద్ధం చేయలేక పోయాడు .శంకర కిరాతకుడు బాగా తగిలే బాణాలతో క్రీడిని దూరంగా నెట్టేశాడు –‘’ విచిక్షిపే శూల భ్రుతాసలీలం –స పత్రిభిర్దూర మాదూర పాతైః’’.అస్త్రలాభం మొదలైన శుభాలు కనపడే తపస్వి అర్జునుడు  తపసు ఉపవాసం మొదలైన నియమాలు పాటించి నట్లుగా యుద్ధం అనే ఆశ్రమ ధర్మాలను ధైర్యం తో పాటిస్తూ ,శివ బాణ బాధ సహించాడు –‘’ఉపోఢ కల్యాణ ఫలోభిరక్షన్ –వీర వ్రతం పుణ్య రణాశ్రమస్థః-జపోపవాసై రివసంయతాత్మా –తేపే మునిస్తైరిషుభిః శివస్య ‘’.ఆపదలో రక్షణ స్థలాన్ని వెదుక్కున్నట్లు ,ప్రతాపానికి ఆశ్రయమైన ఖడ్గాన్ని యుద్ధానికి రూపు దాల్చిన ఆహ౦కార౦ గా వాడాడు .ఖడ్గం తో శివ బాణాలు ముక్కలు చేస్తూ సూర్య కిరణాలతో ఉద్దీప్త తరంగాలు కల సముద్రం లాగా భాసి౦చాడు – ‘’హస్తేన నిస్త్రింశ భ్రుతా సదీప్తః –సార్కా౦శునా  వారిధి రూర్మి ణేవ’’.సూర్యుడు తన మార్గం లో ఉంటూనే నీటిలో ప్రతి బింబ రూపంగా కనిపించినట్లు ,అర్జునుడు ఖడ్గయుద్ధ గతి భేదాలతో ఆకాశం లో, నేలపైనా ప్రకాశించాడు –‘’తథా నభస్యాశు రణస్థలీషు –స్పష్ట ద్విమూర్తి ర్దదృశే స భూతైః’’.శివబాణ౦  తో తెగిపడ్డ అర్జున ఖడ్గం మేఘం నుంచి జారిన మెరుపు యొక్క అగ్నిలా ప్రకాశించింది –‘’జ్వలన్నసి స్తస్య పపాత పాణే-ర్ఘనస్య వప్రాదివ వైద్యుతోగ్నిః’’.కవచం ధనువు బాణాలు ఖడ్గం కూడా విరిగి పోవటం తో అవమానం పొందిన అర్జునుడు ఉద్యానవనం లో చెట్లు నరికేస్తే శూన్యం అయినట్లున్నాడు –‘’రిక్తః ప్రకాశ శ్చబభూవ భూమే –రుత్సాది తోద్యాన ఇవ ప్రదేశః ‘’

     వెనకడుగువేయని ఫల్గుణుడు తన భుజమే సహాయంగా చేసుకొని వడగళ్ళ వాన కురిసినట్లు రాళ్ళ వర్షం కురిపించాడు స్థాణుడిపై.శివుడు తన బాణాలతో వాటికి బదులు చెప్పాడు .క్రీడి చెట్లు విరిచి భూనభో౦తరాలు నిండేట్లు విసిరాడు .శివుడు వాటిని ముక్కలు ముక్కలు చేసేశాడు .భయపడని భీభత్సుడు బంగారు శిల వంటి శివుని వక్షస్థలాన్నితన భుజాలతో గట్టిగా దెబ్బ కొట్టాడు –‘’గాండీవి కనక శిలానిభం భుజాభ్యా –మాజఘ్నే విషమ విలోచనస్య వక్షః ‘’.కీర్తికి ,లక్ష్మి కి సాధనమైనదీ శత్రు సేనకు పొందరాని పరాక్ర౦  కోర్తున్న అర్జునుడిని,తన తొడమీద కూర్చున్న శిశువు  మంచి వస్తువు కావాలని మారాం చేస్తే ఎలా సహిస్తాడో  శివుడు అలా సహించాడు –‘’  అభిలషత ఉపాయం విక్రమం కీర్తి లక్ష్యో-రసుగమమరి సైన్యైర౦క మభ్యాగతస్య –జనక ఇవ శిశుత్వేసుప్రియస్త్యిక సూనో –రవినయనమపి సేహే పాండవస్య స్మరారిః’’ .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.38 17వ సర్గ -2

కిరాతార్జునీయం-.38

17వ సర్గ -2

అత్యంత లాఘవంగా సునాయాసంగా బాణాలు వదులుతున్న అర్జునుడు ప్రమథులకు ,కంటి దోషమున్నవారికి ఒకే చంద్రుడు అనేక బింబాలుగా కనిపించినట్లు ,అనేకంగా కనిపించాడు –‘’శశీవ దోషావృతలోచనానం –విభిద్యమానః ప్రుథ గా బభాసే ‘’.సేన దయనీయం చూసి శివుడుకూడా క్షోభ చెందాడు .పెద్ద చెరువే అయినా తరంగాలవలన సూర్యబింబం వణుకుతున్నట్లు – శివుడి పరిస్థితీ అలానే అయింది –‘’తరంగ కంపేన మహా హ్రదానాం –ఛాయా మయస్యేవ దినస్య కర్తుః’’.అర్జునుడిపై   నిర్వికార పరమాత్మ కనుక శివుడికి  ఆగ్రహం రాలేదు .కానీ ఆకారం లో వికారం చూపాడు మహాత్ముల చేష్టలు ఎవరూ తెలుసుకోలేనివి –‘’ప్రసే దివామ్సం న తమాప కోపః –కుతః పరస్మిన్పురుషే వికారః అకార వైషమ్యమిదం చ భేజే –దుర్లక్ష్య చిహ్నా మహతాం హి వృత్తిః.’’తర్వాత శివుడు రెండు భుజాలతో అల్లెత్రాడు లాగగా ,అది కదులుతూ రెండు గా కనిపించింది .అది తక్షకుని నాలుకేమో అనుకొన్నారు చూసే వాళ్ళు .’’’విస్ఫార్య మాణస్య తతో భుజాభ్యాం –భూతాని భర్త్రా ధను రంతకస్య –భిన్నా కృతిం జ్యా౦ దదృశుః స్ఫురంతీం-  కృద్ధస్యజిహ్వామివ తక్షకస్య ‘’.అర్జునుడు సవ్యాపసవ్యం గా ధనువును ధ్వని౦ప జేస్తూ కిరాతపతిని చూసి ‘’ఎప్పుడూ కుడి ఎడమల చెవులను ఒకటి తర్వాత ఒకటి కదిలిస్తూ ధ్వని చేసే ఏనుగుపై మావటి వాడు ఉన్మత్తంగా అనుమానిఛినట్లు చూశాడు .శివుని బాణాలు సముద్రం లో తిమింగలాదులు నదులద్వారా వచ్చే చిన్న జలచరాలను మింగినట్లుగా.అర్జున బాణాలను వ్యర్ధం చేశాయి-‘’ఊర్జస్విభిః సింధు ముఖాగతాని యాదాంసి యాదో భిరివా౦బు రాశేః ‘’.. శంకర బాణాలు కనిపించకుండానే, మధ్యలోనే తు౦చేయటం ,అడ్డుకోవటం ,ధ్వంసం చేయటం అనే మూడు విధాల అర్జునుడు-జయాభిలాష ఉన్నవాడు  శత్రువు ఏ ఉపాయాలు ఉపయోగిస్తాడో అవే ఉపాయాల ప్రయోగంతో  నిర్వీర్యం చేశాడు  ,శివుడు వేసే వాటికి రెట్టింపు బాణాలు ప్రయోగించి అర్జునుడు శివ సేనను భయపెట్టి సాఫల్యం సాధించాడు .ఐతే ద్రోణాది గురువులద్వారా అస్త్ర విద్య నేర్చి ఆ లాఘవం ప్రయోగించిన అర్జునుడికి శివుని బాణాలతో భంగపాటు కలగటం ధైర్యాన్ని కుంగదీసి రుజుమార్గం లో ధర్మ శాస్త్రాదులు నేర్చిన నిర్దేశించిన ఆచార వ్యవహారాలను అనుష్టించే వారికీ సైతం ఆపదల లో ధైర్యం తగ్గినట్లు తగ్గింది –‘’సతామివాప ర్వణిమార్గ ణానాం-భంగః స జిష్ణొర్ధ్రుతిమున్ము మాద’’.అర్జున బాణాలను ఖండించిన శివ బాణాలు నేలకొరిగి అర్జునునికి వెంటనే ప్రతిఫలం దక్కింది .

 హస్తలాఘవం తో అర్జునుడు ఆశ్చర్య౦గా శివ బాణాలను ఖండించేబాణాలను శివసేన గుండెల్లో సూటిగా నాటాడు .అర్జున పరాక్రమం చూసి శివుడు  ,ఎండాకాలపు మేఘం నీటిని కురిపించినట్లు,అతి తీవ్ర  బాణ వృష్టి కురిపించాడు.అంటే ఎండాకాల వర్షం చాలా ఎక్కువ అని భావం ..అర్జును డికి మేలు చేకూర్చే శివ బాణాలు మర్మ స్థానాలు తాకకుండా ,మిత్రులు చెప్పే పరిహాసపు మాటల్లాగా అర్జునుడికి ఆనందాన్ని కలిగించాయి –‘’’’అనామృశంతః క్వచి దేవ మర్మ-ప్రియైషిణా ను ప్రహితాః శివేన –సు హృత్పయుక్తా ఇవ నర్మ వాదాః-షరా మునేః ప్రీతికరా బభూవః ‘’.ఒకసారి తన బాణాలతో సమానంగా, మరోసారి చాలా హెచ్చుగా ప్రయోగించే అర్జున బాణ శక్తి చూసి వివశం  నిందా పొందే సేనతో కలిసి శివుడుమళ్ళీ తన తడాఖా చూపించాలను కొన్నాడు .-‘’విషాద వక్తవ్య బలహ ప్రమాథీ-స్వమాల లంబే బలమిందు మౌలిః’’.

  తర్వాత శివుడు శక్తి పరాక్రమాలతోసూర్యుడు నీటిని ఇంకింప జేసినట్లు అర్జున తీవ్ర బాణాలను నాశనం చేసి ప్రతాపం చూపాడు –‘’మహేషు జాలా న్యఖిలాని జిష్ణో-రర్కః పయం సీవ సమాచచామ’’.అర్జునుడు మరో బాణం తీయటానికి బాణాలు లేని అమ్ముల పొదిలో చేయి పెట్టాడు .పర్వతంలో మరో ఏనుగు చెలమలోని నీరంతా తాగి ఖాళీ చేయగా, ఆ ఏనుగు దాహంతో అలమటించి తొండం సాచినట్లుఅయింది .-‘’అన్యద్విపా పీత జలేసతర్షం-మత౦గ జస్యేవ నాగా శ్మరంధ్రే’’ ‘’.ధనం లేని స్నేహితుడిని తాను  పూర్వం చేసిన ఉపకారాల జ్ఞాపకం తో కృతజ్ఞత చెప్పటానికా అన్నట్లు అర్జున చెయ్యి అమ్ములపొది చేరింది –.-‘’తాత్కాల మోఘ ప్రణయః ప్రపేదే –నిర్వాచ్యతా కామ ఇవాభి ముఖ్యం ‘’.కర్తవ్యం లో ఉత్సాహం, జయేచ్ఛ ఉన్న నాయకుడి బుద్ధి ఏవిధంగా ,నీతి-ఉపాయం అనే రెండిటిని సహాయంగా చేసుకొంటాడో అలాగే అర్జునుడి చెయ్యి రెండు అమ్ముల పొదుల లోకి  పోయింది .ఖాళీ గా ఉన్న అమ్ములలపొదులను ప్రళయం లో నీరు లేని పూర్వా పర సముద్రాలను లోకం భరించినట్లు   భరించాడు –‘’యుగాంత సంశుష్క జలౌ విజిహ్మః –పూర్వా పరౌ లోక ఇవా౦బు  రాశీ ‘’.అమ్ములపొది శూన్యం అయినందుకు బాధ పడినంతగా బాణాలు వ్యర్దమైనందుకు  అర్జునుడు బాధ పడలేదు .ఆపదలలో ఉన్న సత్పురుషులు ,తమకు ఉపకారం చేసిన వారి దుఖాన్ని గురించే ఎక్కువ తపిస్తారు  .–‘’ తేనా నిమిత్తేన తథా వ పార్థ-స్తయోర్యథా రిక్తతయా నుతెపే –స్వామాపదంప్రోజ్ఘ్య విపత్తి మగ్నం –శోచంతి సంతో హ్యుపకారి పక్షం ‘’.

 శ్రీ హనుమత్ వ్రత౦ శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.37 17వ సర్గ -1

కిరాతార్జునీయం-.37

17వ సర్గ -1

ప్రయోగించిన అస్త్రాలన్నీ వ్యర్ధం కాగా ,తనప్రియ గాండీవం ద్వారా ధైర్యాన్ని పెంచుకొన్న అర్జునుడిపౌరుషం  బాగా అతిశయించింది –‘’ధృతం గురు శ్రీర్గురుణాభి పుష్యన్ –స్వపౌరు షేణేవ శరాసనేన ‘’.గొప్ప పరాక్రమ శీలితో తాను  యుద్ధం చేస్తున్నందుకు సంతోషించాడు కాని శత్రువు వృద్ధి బాధించింది .పర్వతం పై మండే అగ్నిలా కనిపించాడు .పొగ బాగా వ్యాపించి ఉండటం తో కిరాత శివుని రూపం స్పస్టాస్పస్టంగా కనిపించింది .-‘’స్పస్టోప్యవి స్పష్టవపుః ప్రకాశః –సర్పన్మహాదూమ ఇవాద్రి వహ్నిః’’.శత్రువులచే తిరస్కరి౦పబడని తన ధైర్యాన్నే అర్జునుడు కరావలంబనమే  చేసుకొన్నాడు .’’అసాదయన్న స్ఖలిత స్వభావం –భీమే భు జాలంబ మివారి దుర్గే ‘’.కులశీలాదులచేత  తనయందు అనురాగ వతి అభిమాన వతి అయిన కారణంగా ప్రాణాలకంటే ఎక్కువైన కీర్తి తన యెదుటనే శత్రువు అపహరించాలి అనుకొన్నప్పుడు అర్జునుడు అలాంటి గుణాలే కలిగిన కాంత ను గురించి బాధ వంటి బాధ అనుభవించాడు –‘’వంశోచిత త్వాదభిమాన వత్యా-సంప్రాప్తయా సంప్రియతా మనుభ్యః –సమక్షమాది త్సితయా పరేణ-వధ్వేన కీర్త్యా పరితప్య మానః ‘’.హిమాలయాన్ని బద్దలు కొట్టే వేగంతో వచ్చే గంగానదిని శివుడు పూర్వం నిగ్రహించినట్లు ,ఇప్పుడు అర్జున  పరాక్రమాన్ని నిష్ఫలం చేశాడు –‘’పతిం నగానామివ బద్ధ మూల –మున్మూలయిష్య౦ స్తరసా విపక్షం –లఘు ప్రయత్నం నిగృహీత వీర్య –స్త్రిమార్గగా వేగ ఇవేశ్వ రేణ’’.విజయం కోసం మళ్ళీ తన శరాలనే ఆశ్రయించాడు విజయుడు .శరప్రయోగం లో అభ్యాసమూ ,దానికి సంబంధిన అనేక  గుణాలు ఉన్నందున హృదయాన్ని ఆనందింప జేసే శబ్దాలలాగా ఆనందించాడు –‘’జయం యదార్దేషు శరేషు పార్దః –శబ్దేషు భావార్ధ మివా శశంసే’’.కోపంగా ఉన్న విషసర్పం కళ్ళనుంచి విషాన్ని చిమ్మి నట్లు అర్జునుడు యుద్ధం లోనే శత్రువుకు సమాధానం చెప్పాలని ,మొదటి సారి ఓటమి వలన కలిగిన బాధతో క్రోధోద్రిక్తుడై ,కన్నీరు కార్చాడు అధిక సంతోషం లోనూ కోపం లోను ,కన్నీరు కారటం సహజమే .-‘’భూయః సమాధాన వివృద్ధ తేజా-నైనం పురా యుద్ధమితి వ్యథావాన్-స నిర్వ వామాస్ర మమర్షనున్నం –విషం మహా నాగ ఇవేక్షణాభ్యాం’’.యుద్దాయాసం లో క్రీడి జడలు విడిపోయాయి .కళ్ళు రాగిలాగా ఎర్రబడ్డాయి క్రోధం వలనముఖం పై చెమట ,వేడిని చల్లారుస్తున్నట్లు కమ్మి౦ది.-‘’నిర్వాప యిష్యన్నివ రోష తప్తం –ప్రస్నాపయామాస ముఖం నిదాఘః .’’మేఘ మండలం లో చిక్కుకున్న మూడు సూర్యుని ఊర్ధ్వ కాంతి రేఖలు వర్షానికి సూచన అయినట్లు ,అర్జునుడు కనుబొమలు చిట్లించిన ముఖం లో మూడు రేఖలు పైకి వ్యాపించాయి –‘’క్రోధాంధ కారాంతరితో రణాయ – భ్రూ భేద రేఖాః స బభార తిస్రః –ఘనోప రుద్ధః ప్రభావాయ వృష్టే-రూర్ధ్వా౦శు రాజీరివ తిగ్మ రశ్మిః.’’దిగ్గజం తొండం తో పర్వత శిఖరాన్ని చరచి ధ్వనింప జేసినట్లు ,అర్జునుడు మేఘం లాగా ధ్వని చేసే ధనువు ను చేతితో లాగి ,శంకర కి౦కరులపై బాణాలు ప్రయోగించాడు .

  అర్జున బాణాలు  శాస్త్ర నిష్ఠ గల బుద్ధి విషయం లో హితోప దేశం లాగా,వైరాగ్యం ఉన్నవాడిలో గుణాలు ,వాజ్మానస అగోచరమైన బ్రహ్మ విషయం లో వేద వాక్కు వ్యర్ధమైనట్లు ,  శివుని శరీరం లో కలిసిపోయాయి.అంటే శివుడిని ఏమీ చేయ లేకపోయాయని భావం –‘’సద్వాదివాతేభిని విష్ట బుద్ధౌ –గుణాభ్యసూయేవ విపక్ష పాతే-అగోచరే వాగివ చోప రేమే –శక్తిఃశరాణాం శితికంఠకాయే ‘’.అర్జునబాణాలు ఆయన్నమీ బాధించలేదు .హేమంతం లో సూర్య కిరణాలు హిమవంత ప్రదేశాన్ని తాకనట్లే ఆబాణాలు శివుడిని బాధించలేదు –‘’అభ్యుత్థిత స్యాద్రి పతేర్నితంబ –మర్కస్య పాదా ఇవ హైమనస్య ‘’.అర్జున పరాక్రమాన్ని శివుడు దిగ్గజం పోట్లను హిమవత్పర్వతం సహి౦ఛినట్లు ఆనందిస్తూనే, సహించాడు.’’విషాణ భేదం హిమవాన సహ్యం – వప్రానతస్యేవ సురద్విపస్య .బ్రహ్మాడులకే కారణ భూతుడైన శివుడు శివుడు తన పరాభవాన్ని చాలాకాలం సహించాడు.-‘’చిరంవిషేహే భిభ వస్తదానీం –సకారణానా మపి కారణేన’’.శత్రువుతో ఓడినా ,ఏ వ్యక్తి ఉత్సాహం తో తనకంటే పరాక్రమ వంతునితో పోరాడుతాడో  వాని కీర్తి సూర్యకాంతి లా ప్రకాశిస్తుంది –‘’తేజా౦సి భానోరివ నిష్పతంతి-యశా౦సి వీర్యజ్వలితాని తస్య ‘’.ఒక వ్యక్తి మహత్కార్యం ప్రత్యక్షంగా చూసి ,అతడి శత్రువర్గం భయ పడుతుంది .భయపడితే తేజస్సు నశిస్తుంది తేజస్సు లేని వాడిని ఉత్సాహం వదిలేస్తుంది .అది ఆరిన దీపం లాగా ప్రకాశ హీనమౌతుంది –‘’దృష్టావదానాత్ వ్యథతే రిలోకః-ప్రధ్వంస మేతి వ్యథితాచ్చ తేజః –తేజో విహీనం విజహాతి దర్పః –శాంతార్చిషం దీపమివ ప్రకాశః ‘’.ఉత్సాహం మదం ఆత్మాభిమానం దెబ్బతిన్న వాడు తనను జయించిన వాడిని ఓడించటానికే ప్రయత్నిస్తాడు .తనకిష్ట మైన ఏనుగు ,మదవాసనలతో ఆకర్షింప బడిన ఏనుగు తనకు ఎదురుగా వచ్చే ఏనుగుల సమూహాన్ని ఎదుర్కొని ఓడించినట్లు ,శత్రు పరాజయం కోసమే యత్నిస్తాడు .-‘’తతః ప్రయాత్యస్త మదావలేపః –స జయ్య తాయాః పదవీం జిగిషోః-గంధేన జేతుః ప్రముఖాగతస్-ప్రతి ద్విపస్యేవ మతంగా జౌఘః ‘’శివుడు తలలోని చంద్ర రేఖలాగా గొప్ప కీర్తి అర్జునుడికి ఇవ్వాలనుకొని జయాపజయాలు పర్యాయంగా కలిగే యుద్ధం ప్రారంభించాడు .ప్రాణులు జన్మతః వచ్చే స్వభావాలను వదులుకోలేక వాటికి వశులౌతారో అదే విధంగా ప్రమథ గణం అర్జున విచిత్ర బాణాలకు వశమైంది –‘’సహాత్మ లాభేన సముత్ప తద్భి-ర్జాతిస్వభా వైరివ  జీవ లోకః .’’.భయంతో వణుకుతున్న శివ సేన అర్జున బాణవర్ష౦ తో  ఏర్పడిన చీకటి బాణ ధ్వనినీ ,విన్నారు రాత్రికురిసే వర్షంలోని మేఘగర్జనలా ఉంది .శబ్దాన్ని మాత్రమే విన్నారు .అంటే చూడటం కానీ ఏమీ చేయటం చేయ  లేకపోయారు అని భావం .

   సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

54ఏళ్ళ క్రిందటి ఉయ్యూరు హైస్కూల్ శిష్యురాలుశ్రీమతి కరుణానిధి ఇవాళ మాఇంట్లో మాకు చేసిన సత్కారం

54ఏళ్ళ క్రిందటి ఉయ్యూరు హైస్కూల్ శిష్యురాలుశ్రీమతి కరుణానిధి ఇవాళ మాఇంట్లో మాకు చేసిన సత్కారం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.36 16 వ సర్గ -3(చివరి భాగం )

కిరాతార్జునీయం-.36

16 వ సర్గ -3(చివరి భాగం )

అర్జున సర్పబాణ సముదాయం వలన సిద్ధులు ,పక్షులు సంచరించే మార్గం ఆగిపోయి ,అగ్ని అన్ని వైపులకు వ్యాపించటం చేత దిక్కులు పొగతో నిండిపోయాయి .శత్రువులు ముట్టడించిన నగరం లాగా ఆకాశం కనిపించింది .-’’’వృతం నభో భోగి కులైరవస్థా౦-పరోపరుద్ధస్య పురస్య భేజే ‘’.శివుడు వెంటనే గారుడాస్త్రాన్నిసర్పాల బాధ ను ,న్యాయ రీతిగా శత్రువ్యూహం విఫలం చేసినట్లు ప్రయోగించాడు ‘’నేతా నయనేవ పరోపజాతం –నివారయామాస పతిః పశూనాం ‘’.అనిమేషులైన స్వర్గలోక వాసుల నేత్రాలకు కల్గిన అవరోధాన్ని గారుడ పక్షుల సమూహం మెరుపు వేగం తో ప్రకాశం కలిగించి౦ది.-‘’ప్రతిఘ్న తీభిఃక్రుతమీలితాని –ద్యులోక భాజామపి లోచనాని –గరుత్మతాం సంహతి భిర్వి హాయః –క్షణ ప్రకాశాభి రివావతేన ‘’  .గరుడ పక్షుల రెక్కల విచిత్ర కదలిక తో గాలి ,అడవి చెట్ల ఆకులు రాలుస్తూ ,వాటిని ఆకాశం లో అల౦క రించటానికా అన్నట్లు మోసుకెళ్ళింది.మనః శిలల ముక్కలకాంతి తో వెనకాల విశాల వక్షస్థలం తో అడ్డు కాబడిన ఆకాశ మండలం గరుడ పక్షుల ముందు పరిగెత్తుతున్నట్లుగా ఉంది .వేడిగా వీస్తున్న గాలులవలన కదులుతున్న శిఖరాల హిమవత్పర్వతం ,మదిర లాగా ఎర్రగా ప్రకాశిస్తున్న గరుడ పక్షి రెక్కల కాంతిని, గుహాముఖాలతో తాగి ,మత్తుగా కదలింది –‘’దరీ ముఖారాసవ రాగ తామ్రం-వికాసి రుక్మచ్ఛదధామ పీత్వా –జ్వనలా ఘూర్జిత సాను జాలో –హిమాచలః క్షీణ ఇవాచ కంపే ‘’ .రాత్రి,పగలు కలిసిన సంధ్యాకాలం లాగా ప్రకాశిస్తూ  భూమ్యాకాశాలను పసుపు రంగుగా   మారుస్తూ,,సూర్యుని కప్పేసే ఆ గరుడ పక్షులు ,నాలుగు వైపులా అడవులలోని నీడను లేకుండా చేశాయి . .-‘’ప్రవృత్త నక్తం దివా సంధి దీప్తై-ర్నభస్థలం గాం చ పిశంగ యద్భిః-అంతర్హితార్కైఃపరితః ,పతద్భి-చ్ఛాయాఃసమాచి ,క్షిపిరే వనానా౦’’.సర్ప సమూహం గరుడ సమూహం తో,మహా యజ్ఞం లో కర్మలోపం జరిగినప్పుడు ప్రాయశ్చిత్తం తో  శాంతించినట్లు శాంతించింది –‘’మహాధ్వరే విధ్యపచార దోషః –కర్మాంత రే ణేవ మహోదయేన’’.

  సర్పాస్త్రం సమాప్తికాగా అర్జునుడు ఇంధనం లేకుండా ప్రజ్వలించే ఆగ్నేయాస్త్రం  సంధించాడు –‘’అనిన్ధనస్య ప్రసభం సమన్యుః-సమాదేస్త్రం జ్వలనస్య జిష్ణుః’’.అన్నివైపులకు వ్యాపిస్తూ ,మంటలతో మేఘాలను దాటి,వేట కోసం సింహం దూకినట్లు ప్రాణ సంహార కాంక్షతో అగ్నిపైకి ఎగసింది –‘’ఆయస్త సింహాకృతి  రుత్పపాత-  ప్రాణ్యంత మిచ్ఛన్నివ జాత వేదాః’’.తన తేజస్సుతో సూర్యకాంతిని ఛేదిస్తూ ,నిప్పురవ్వలు రాలుస్తూ బండరాళ్ళు బద్దలయ్యే ధ్వనితో అగ్ని మండింది .అగ్నికి గాలి తోడై బంగారు ప్రాకారాల్లా , ఎత్తైన శిఖరాల పర్వతాల్లాగా ,సువర్నమయమైన పురంవెల, మోదుగు చెట్లు వనాల్లా అన్ని చోట్లా వ్యాపించింది .కాటుక లాంటి నల్ల మేఘాలు కదిలే చిగురాకులు లాగా యెర్రని అగ్ని మంటలలో మాడి,ముత్యాల్లా శుభ్రంగా కనిపిస్తున్నాయి .ప్రళయాగ్ని లా లోకాన్ని మింగటానికి చాచిన నాలుకలలాగా,కదిలే అగ్ని సమూహాన్ని చూసి ,మేఘాలను పిలిచినట్లు శివుడు వారుణాస్త్రం వేశాడు –పినాకినా హుత మహా౦బు వాహ మస్త్రం పునః పాశ భ్రుతః ప్రణిన్యే’’.వారుణాస్త్రం పెద్దపర్వతాకార౦ తో ,మెరుపులతో ఉన్న మేఘాలు నేలకు జారే ఆకాశ గంగలాగా ఎడతెరిపి లేని ధారలు కురిపించాయి –‘’అధోముఖాకాశసరిన్నిపాతినీ-రసః ప్రసక్తం ముముచుః పయోముచః ‘’

  జల వృష్టి తో అగ్ని జ్వాలలు చల్లబడి ,ప్రచండ తేజస్సు నశి౦చగా అగ్ని శరీరం పై ,జలధారలు వేడి చేసిన ఇనుము పై పడి ధ్వని చేసినట్లు ధ్వనించాయి –‘’కృతాస్పదా స్తప్త ఇవా యసి ధ్వనిం –పయోనిపాతాః ప్రథమే వితేనిరే’’.త్వరలోనే ఆ జలధారలు పాకం పొంది నురగలై ,తడికట్టె మండి,పొగ వ్యాపించినట్లు వ్యాపించాయి –‘’వ్రజద్భిరార్ద్రే౦ధన వత్పరిక్షయం జలై ర్వితేనేదివి ధూమ స౦తతిః’’.ఎరుపు నీలం తెలుపు రంగులు కలిగిన తమ జెండాలతో ,ఇంద్ర ధనుస్సు కాంతిని మించిన అగ్ని కాంతులు కలిసి విచిత్రమైన అస్థిరమైన పట్టు బట్ట అందాన్ని పొందాయి –‘’  స్వకేతుభిః పాండు రనీల పాటలైః-సమాగతాః శక్ర ధనుః ప్రభా భిదః-అసః స్థితా మాదధిరే విభావసో –ర్విచిత్ర చీనా౦శుక చారుతాం త్విషః’’.మండుతున్న అగ్ని వర్ష ధారలకు మరంత గంభీర ధ్వని చేస్తోంది .మెరుపులతో కలిసి కాంతి పెరిగింది .అంటే శాంతిస్తున్న అగ్ని అంతకు ముందున్న దానికంటే ఎక్కువై కనిపించింది .

  సముద్ర అలల్లాంటి జలరాశులతో చీలి ,అగ్ని కణాలు సాయంసంధ్యాకాంతిపొందిన మేఘ శకలలలాగా కనిపించాయి –‘’ఉపాత్త సంధ్యారుచిభిః సరూపతాం –పయోద విచ్ఛేదలవైః కృశానవః ‘’.గొప్ప పరాక్రమ వంతుడైనా ,సమూలంగా నష్టపోతే మళ్ళీ కోలుకోవటం జరిగే పని కాదు. అగ్ని కూడా ఆ నీటితో అలాగే కుప్పకూలిందని భావం –ఉపైత్యనంత ద్యుతిరప్య సంశయం –విభిన్న మూలో నుదయాయ సంక్షయం –తథా హి తోయౌఘ విభిన్న సంహతిః-న హవ్య వాహః ప్రయయౌ పరాభవం’’.ఆకాశం లో నల్లని కాంతి సమూహంకలమేఘాలు విడిపోగా అగ్ని దహనం చెందిన ఆకాశం  వికసించిన నల్లకలువ కాంతి తో శోభించింది –‘’వికసడమల ధామ్నాంప్రాపు నీలోత్పలానాం-శ్రియ మధిక విశుద్దాం వహ్ని దాహాదివ ద్యౌః.

    అనేక ఉపాయాలతో అర్జునుడు కిరాత శివుని ఓడించాలని వేసిన అన్ని రకాల అస్త్రాలను శివుడు నీతి నిష్టుడైన వాడి పరాక్రమానికి ప్రతికూల దైవం నష్టం కలిగించినట్లు నస్ట పరచాడు.-‘’ఇతి వివిధ ముదాసే సవ్య సాచీ యదస్త్రం –బహు సమయ రనయజ్ఞః  సాదయిష్యన్నరాతిం –విధిరివ విపరీతః పౌరుషం న్యాయ వృత్తేః-సపది తదుపనిన్యేరిక్తతాం నీల కంఠః’’.శివుడి చేత తన అస్త్రాలన్నీ నిరుపయోగం కాగా ,శక్తి తగ్గినా మళ్ళీ బలం పుంజుకొని అర్జునుడు ,అధిక వర్షం కురవటంకోసం,నదీ తటాకాలలోని నీటిని సూర్యుడు గ్రహించినప్పుడు  జనం నీటికోసం బావులు చలమలు త్రవ్వి సహాయం తీసుకొన్నట్లు అర్జునుడు తన భుజ బలాన్నే సహాయంగా  భావించాడు –‘’వీత ప్రభావ తనురప్య తను ప్రభావః –ప్రత్యాచ కాంక్ష జయినీం  భుజ వీర్య లక్ష్మీం –అస్త్రేషు భూతపతి నాప హృతేషు జిష్ణుః-వర్షిష్యతాదిన కృతేవ  జలేషు లోకః ‘’

  సశేషం

  ముక్కోటి ఏకాదశి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-12-20-ఉయ్యూరు .  ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.35 16 వ సర్గ -2

కిరాతార్జునీయం-.35

16 వ సర్గ -2

అర్జునుడు ఆలోచించి, ఆలోచించి చివరకు తెగించి కిరాత శివునిపై గణాధిపతి పౌరుషం పోగొట్టే ‘’ప్రస్వాపనాస్త్రం ‘’అంటే గాఢ నిద్ర నిచ్చే అస్త్రం ప్రయోగించగా అర్ధ రాత్రి చీకటి దట్టంగా అంతటా వ్యాపించింది .-‘’స సంప్రధార్యైవ మహార్య సారః –సారం వినేష్యన్ సగణస్యశత్రోః-‘’.ప్రస్వాపనాస్త్రం ద్రుతమాజహార –ధ్వాంతం ఘనానద్ధ ఇవార్ధ రాత్రః’’ .దావానలం పొగలాగా ,ధూసర వర్ణం సూర్యకాంతిని కప్పేసినట్లు శివ గణాలను ఆవరించింది .అది దట్టమైన చీకటి అడవుల్ని ఆవరించి నట్లుగా ఉంది .దీనికి ప్రమథ గణాలకు నిద్ర ఆవహించింది .సభలో ప్రగల్భాలు పలికేవాడు ,పండితుడు ప్రవేశించగానే కిక్కురు మనకుండా ఉన్నట్లు అయింది –‘’సభేవ భీమా విదధే గణానాం-నిద్రా నిరాసం ప్రతిభా గుణస్య’’.బలాఢ్యులైన కొందరు ధనువులసాయం తో నిలబడిపోయారు .ఆపదలో మంచి మిత్రుల సాయం పొందినట్లుంది వారిపని –‘’కేచిత్సమాశ్రిత్య గుణాన్వితాని –సుహృత్కులా నీవ ధనూ౦షి తస్థుః’’.అర్జున ప్రస్వాపనాస్త్రం ముందు దైవ ప్రతికూలంగా శత్రు అస్త్రాలు నేలపడి పోయాయి .దైవానుకూల్యంలేకపోతే వ్యవసాయ ఫలం నస్టమైనట్లుగా ఉంది –‘’అతర్కితం పాణి తలాన్నిపేతుః-క్రియా ఫలానీవ తదాయుధాని ‘’.ఈ విషమ సమయం లోనూ కొందరు ధైర్యం తో చెట్ల మొదళ్లను ఆనుకొని మదం తో కళ్ళు మూతపడుతున్న ఏనుగులు తొండాలను జార విడిచి నేలపై కూర్చున్నట్లు కూర్చున్నారు –‘’మాదేన మీలన్నయనాః సలీలం –నాగా ఇవ స్రస్తకరా నిషేదుః’’.

  కిరాత శంకరుని నుదుటి నుంచి పిశంగవర్ణ-ఎరుపు ,తెలుపు ,పసుపు రంగు మిశ్రమ రంగు . ప్రకాశం చంద్రాస్తమయం తర్వాతసుమేరు పర్వత శిఖరం నుంచి ఋషులు ప్రణామ౦ చేసే సూర్య బి౦బంలా ఉదయించింది – ‘’తిరోహితేందో శంభు మూర్ధ్నః-ప్రణమ్యమానం తపసాం నివాసైః-సుమేరు శృంగాదివ బి౦బమార్కం-పిశంగ మచ్చైరుదియాయ తేజః ‘’ .శివుని నుదుటి ఆ కాంతి ,గణాల నిద్ర పోగొట్టి చూపునిచ్చి౦ది.తత్వజ్ఞానం అజ్ఞానాన్ని తొలగించి నట్లుగా శివ తేజస్సు గణాలను తెప్పరిల్లేట్లు చేసిందని భావం .-‘’యయౌ వికాసం ద్యుతి రిందు మౌలే –రాలోక మభ్యాది శతీ గణేభ్యః ‘’ఆ ప్రకాశం నాలుగు వైపులా విస్తరించి మేఘమండలాన్ని ఎర్రగా మారుస్తూ ఉదయ సంధ్యలాగా వ్యాపించి ప్రమథ గణముఖపద్మాలను వికసింప జేసింది –‘’నినాయ తేషాం ద్రుతముల్లసంతీ-వినిద్రతాం లోచన పంకజాని ‘’.ప్రస్వాపనాస్త్ర ప్రభావం తగ్గాక తెలివిలోకి వచ్చిన శివ సేన ,మేఘాలుపోయి ,దిక్కులు నక్షత్రాలతో ప్రకాశించినట్లు వివిధ శస్త్రాలు ధరించారు .-‘’ముక్తా వితానేవ బలాహకానాం –జ్యోతీ౦షి రమ్యాఇవ దిగ్విభాగాః’’.

   రాత్రి పోయి ,అంతరిక్షం పైకి లేచినట్లుగా ఉంది .దిక్కులు ప్రసన్నాలై ,సూర్య కిరణాలు స్పష్టత పొంది విస్తరించగా ,పగటి శోభ రోజును ఆశ్రయించింది .మహాదుర్గం లాంటి ప్రస్వాపనాస్త్రాన్ని శత్రువైన శివుడు వ్యర్ధం చేయగా ,వెంటనే సైనికులను బంధించే సర్పరూప పాశాలు వదిలాడు పార్ధుడు –‘’భుజంగ పాశాన్ భుజ వీర్య శాలీ –ప్రబంధ నాయ ప్రజిఘాయ జిష్ణుః’’.మెరుపులతో సమానమైన విషాగ్ని కల వందలాది నాలుకలను ఎప్పుడూ ఆడించే సర్పరాజుల సేన తమ భయంతో ఆకాశంలో తిరిగే సిద్ధ చారణాది దేవమార్గాన్ని ఆవరించి అడ్డుకొన్నాయి –‘’జిహ్వా శతా న్యుల్లస యంత్య జస్ర౦ –లసత్తడి ల్లోల విషానలాని –త్రాసాన్నిరస్తా భుజగేంద్ర సేనా –నభశ్చ రైస్తత్పదవీం వివవ్రే ‘’.దిగ్గజాల తొండాలవంటి ,ఇంద్ర నీల మణుల లాంటి శరీరాలతో ఆపాముల వరుస ఆకాశం అనే సముద్రం లోని తరంగమాలిక లాగా ప్రకాశించింది –‘’దిజ్నాగ హస్తాకృతిమూడవ హద్భిః-భోగైః ప్రశాస్తా సితరత్న నీలైః-రారాజ సర్పావలి రుల్లసంతీ-తరంగ మాలేవ నభోర్ణవస్య ‘’.పడగెత్తిన సర్పాల ఫూత్కారాల్లోని పొగ, సూర్య కిరణాలను కప్పి వేయగా, చూసే వాళ్లకు యోగ్యమైన శరీరాన్ని సూర్యుడు ధరించాడు –‘’నిఃశ్వాస ధూమైః స్థగితాంశుజాలం-ఫణావతాముత్ఫణ  మండలానాం –గచ్ఛన్నివాస్తం వపురభ్యువాహ-విలోచనానాం సుఖ ముష్ణ రశ్మిః’’.విష దృష్టి ఉన్న సర్పాల కళ్ళల్లోనుంచి కాసిన బంగారు ప్రకాశం తో ,దిక్కుల్ని పసుపురంగుగామారుస్తున్నమంటలు పెద్ద తోక చుక్కల్లాగా బయటికి వచ్చాయి .-‘’ప్రతప్త చామీకర భాసు రేణ-దిశః ప్రకాశేన పిశంగ యంత్యః –నిశ్చక్రముః ప్రాణ హరేక్షణానాం-జ్వాలామహోల్క ఇవ లోచనేభ్యః ‘’

  సశేషం

రేపు ముక్కోటి పర్వ దిన  శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

  కిరాతార్జునీయం-.34 16 వ సర్గ -1

  కిరాతార్జునీయం-.34

16 వ సర్గ -1

కిరాత వేష శివుని అసాధారణ రణనైపుణ్యాన్ని చూసిన అర్జునుడికి కోపం వచ్చి,తాను  యుద్ధం లో గెలవక పోవటానికి కారణాలు ఊహించటం మొదలు పెట్టాడు -ఇలా అనుకొన్నాడు ‘’ఈ యుద్ధంలో మదజలం కారే పర్వతాలవంటి,యుద్ధ కష్టం తెలిసిన  ఏనుగులు కనిపించటం లేదు .ఎత్తైన పతాకాలతో రంగులతో సూర్యకాంతిని నానా రంగులుగా మార్చే గంభీర ధ్వని ఉన్న రథ సమూహాలు లేవు .ప్రాసకుంతం వంటి యుద్ధ ఆయుధాల అలల్లాగా చామరాలు అనే నురగ వంటివి అయిన అశ్వరాశి సముద్ర జలరాశి లా మర్యాద దాటి చెలియలికట్టను కప్పివేయటం లేదు .,’’చంపండి నరకండి ‘’అంటూ భీకరంగా అరచే యోధులు శత్రువులపై వదిలే శస్త్రాస్త్రాలు  సూర్యకిరణాలతో కలిసి  ప్రతిఫలించి మెరుపుల్లా ఆకాశం లో వదలటం లేదు .వీరుల్ని చంపటానికి వచ్చే యముడి ఎడతెగని పొగ లాగా ,అంతటా వ్యాపించిన కాంతి సమూహంతో ధూళి గుర్రాల ,రథాలవేగం తో యెగిరి ఆకాశం లో చేరటం లేదు .గాడిద రంగు భూ ధూళి కంటి చూపును అడ్డుకోగా ,పరాక్రమ వీరుల్ని వరి౦చాలనే ఉత్సాహమున్న దేవాగనలకు పగలే రేయి అనే భ్రాంతి కలగటం లేదు .రథ చక్ర ఘురఘుర ధ్వని ,గుర్రాల సకిలింపులు ,మదగజ ఘీంకారం , ధ్వని చేస్తున్నభయంకరంగా లేదు .భేరీ వాద్యాల ధ్వని కూడా ప్రతిధ్వని ఇవ్వటం లేదు .యుద్ధం లో కీర్తి ,పౌరుష లోభమున్నవారు శత్రువులచే ఛాతీపై గాయపడిన వారికి యుద్ధ విఘ్నం కలుగ కుండా వర్ష ధారల్లాంటి చల్లదనాన్ని ఏనుగులు తొండం తో చిమ్మే తుపుర్లు పోగొట్టటం లేదు .అంటే అవి మాటికీ చిమ్మటం వలన వారికి స్వస్థత కలిగిందని భావం .రక్తపుటేరులు పారుతూ సేన మార్గానికి ఇబ్బంది కలిగిస్తున్నాయి .కొన్ని ఎండిన బురద గుంటల్లాగారక్త ప్రవాహం పైకి కనపడటం లేదు –‘’ఆసృఞదీనా ముపచీయ మానై-ర్విచార యద్భిఃపదవీ౦ ధ్వజిన్యాః-ఉచ్ఛ్రాయ మా యాంతి న శోణితౌఘైః-పంకైరివాశ్యానఘనైస్తటాని’’.ఏనుగు దంతాలతో గాయపడిన సాహస వీరులకు ప్రియురాలి ఒడిలాగా చల్లగా ,ఉండే ఆకాశం నుంచి వక్షస్థలం లో పడిన మందార మాల శాంతి కలిగించటం లేదు –నేహ ప్రమోహం ప్రియ సాహసానాం –మందార మాలా విరలీ కరోతి’’ఏనుగు తొండాలనుంచి పడిన నీటి తుంపర్లు మావటి వాళ్ళ కవచాలలోని  మణికాంతులతో కలిసి ఇంద్ర ధనుస్సు ఏర్పడటం లేదు –‘’అర్క ద్విషో న్మీలిత మభ్య్యు దేతి,- న ఖండ మాఖండల కార్ముకస్య ‘’. ,  ,

రెక్కలున్న మైనాక పర్వతం లాగా శత్రువుల ఏనుగు మధ్యలో ప్రవేశిస్తే ,అటూ ఇటూ పారిపోయే సేన ,సముద్రం తో సమానంగా తరంగాలుగా విడిపోయి కోలాహలం కలిగించటం లేదు .గజ సైన్యం పైకి వేగం గా దూసుకొస్తున్న రథికుల మార్గాన్ని సమూలంగా నరకబడిన ఏనుగుల తొండాలు అడ్డు పెట్టటం లేదు –‘’అమూల లూనై రతి మన్యు నేవ –మాతంగ హస్తైర్వియతే న పంథాః.’’.తోమర వాద్యానికి కట్టిన నెమలి ఈకల కట్ట ,పద్మ మాలాలంకారమైన ప్రియురాలి కేశాలంకారంగా ఉండి,మావటి వాళ్ళ వక్షస్థలాన్ని కప్పేయటం లేదు .ప్రళయం లో లెక్కలేని వీరులు చనిపోతే ,నాలుక ఆడిస్తూ ముల్లోకాలను కబళించే మృత్యు దేవత నోరు తెరవటం లేదు –‘’’’ఉజ్ఘత్సుసంహార ఇవాస్త సంఖ్య-మహ్నాయ తేజస్విషు జీవితాని –లోక త్రయాస్వాదన లోల జిహ్వాం – న వ్యాద దాత్యాననమత్ర మృత్యుః’’.’’నా శక్తి ఎంతటి పరాక్రమ వంతుడి నైనా ధ్వస్తం చేసేది .మరి హీనకిరాత యుద్ధం లో చంద్రుని కాంతి లో సూర్య ప్రభ లాగా ఎందుకు క్షీణించింది ?’’-శక్తిర్మమా వస్యతి హీన యుద్ధే –సౌరీవ తారా దిపధామ్నిదీప్తిః’’.’’లేకపోతే ఇదేమైనా మాయా ?నా భ్రమా ?నా పరాక్రమం నశించిందా ?నేను నేనేనా ?గాండీవ బాణాలు ఇదివరకటిలా పరాక్రమం చూపట్లేదేమిటి ?-‘’మయా స్విదేషామతి విభ్రమోవా –ధ్వస్తం ను మే వీర్య ముతాహమన్యః –గాండీవ ముక్తా హియథా పురా మే పరాక్రమంతే న శరాః కిరాతే’’.’’ఈ కిరాతుడు ధనుష్ఠంకారం తో ఆకాశాన్ని రెండుగా చీలుస్తున్నాడు .ఇతడుకిరాతుడు అయి ఉండడు.వేషభాషలు మాత్రం అలానే ఉన్నాయి చేష్ట మనిషి రూపం దాల్చినవాడిదిగా ఉంది .’’నూనం తథా నైష యథాస్య వేషః –ప్రచ్ఛన్య మాప్యూహతే హిచేస్టా’’

  అతడి ధనువు తో రోషం ధ్వనించింది .అల్లెత్రాడు ఒక్కసారి మాత్రమే లాగి నట్లుంది అమ్ములపోదిలోంచి బాణం తీయటం, సంధించటం ఏకకాలం లో జరిగినట్లుది .పిడికిలి పట్టి ప్రయోగించినట్లు కూడా లేదే ?-‘’ధనుః ప్రబంధ ధ్వనితం రుషేవ-సకృద్వికృష్టావితతేవ మౌర్వీ –సంధాన ముత్కర్షమివ వ్యుదస్య –ముష్టేరసంభేద ఇవాప వర్గే ‘’.అతడి భుజాలు కిందికి వంగినా మెడ ఏమాత్రం కదలటం లేదు, ప్రయాస లేదు .ముఖ వికారాలు లేకుండా చంద్రకాంతి లా ఉన్నాడు –‘’అమ్సావ వష్ట బ్ధనతౌ సమాధిః-శిరోధరాయా రహిత ప్రయాసః –ధృతా వికారా స్త్యజతా ముఖేన –ప్రసాద లక్ష్మీఃశ్శ లాంఛ నస్య ‘’.యుద్ధం లో కాళ్ళు అటూ ఇటూ మార్చినా శరీరం చలనం పొందటం లేదు .చలనమున్నా లేకపోయినా బాణాల లక్ష్యం ఒకే రకంగా ఉంది .శత్రువు లోటుపాట్లు తెలుసుకోవటం ,తన లొసుగులు గుర్తించి వెంటనే సరి దిద్దుకోవటం అనే రెండు గొప్ప గుణాలు భీష్మ పితామహునిలో ,గురు ద్రోణాచార్యునిలో కూడా లేవే !అలాంటప్పుడు ఒక కిరాతుని విషయం లో ఎలా సంభవించింది ?’’-‘’పరస్య భూయాన్వివరే భియోగః –ప్రసహ్య సంకర్షణ మాత్మ రంధ్రే-భీష్మేప్యసంభావ్య మిదం గురౌ వా –న సంభవత్యేవ వనే చరేషు ‘’.ఈ రకంగా అసాధారణ పరాక్రమ శీలి ,యుద్ధమదోన్మత్తుడుఅయిన కిరాతుని పరాక్రమాన్ని దివ్యాస్త్రసంధానంతోనే నివారించాలి .చిన్న శత్రువైనా ,రోగం లాగా అపకారమే కలుగుతుంది .ఇతడు గొప్ప శత్రువు కనుక ఉపేక్ష పనికి రాదు అని భావం .అర్జునుడికి మైండ్ బ్లాంక్ అయి ఇన్ని రకాలుగా ఆలోచించాడు . తర్వాత ఎలాంటి ప్రత్యేక అస్త్రం  ప్రయోగించాడో పార్ధుడు రేపు తెలుసుకొందాం .-‘’ అప్రాకృత స్యాహవ దుర్మదస్య –నివార్య మస్యాస్త్ర బలేన వీర్యం-అల్పీయసో ప్యామయ తుల్య వృత్తే-ర్మహాపకారాయ రిపోర్వి వృద్ధిః. ‘’

  సశేషం ‘

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-12-20—ఉయ్యూరు  .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.33 15వ  సర్గ – 4(చివరి భాగం )

కిరాతార్జునీయం-.33

15వ  సర్గ – 4(చివరి భాగం )

శివుడు అర్జున బాణ మేఘాన్నితన బాణాలతో తొలగించాడు .అర్జునుడికి దీటుగా బాణ ప్రయోగం చేశాడు శివుడు .శివుడి బాణాలు తీక్షణాలై,భయోత్పాతం కలిగిస్తాయి –‘’తేన వ్యాతే నిరా భీమా-భీమార్జున ఫలాననాః-న నాను కంప్య విశిఖాః-శిఖా ధరజ వాససః ‘’ఇది శృ౦ఖలా  యమక శ్లోకం .శివ బాణాలు స్వర్గ ,అంతరిక్షాలలో సంచరి౦చ గలిగేవి .చెవులు చిల్లులు పడే శబ్దం చేయగలవి .విద్యుత్ సమూహం తో సమానమైనవి .-‘’దయు వియద్గామినీ -తార సంరావ విహత శ్రుతిః-హైమీషు మాల శుశుభే -విద్యుతా మివ సంహతిః’’.నాలుగవ పాదం లోని విద్యుతామివ సంహతి ‘’అనే అక్షరాలూ మొదటి ,రెండుపాదాల్లో కూర్చబడ్డాయి దీన్ని గూఢ చతుర్ధ పాదశ్లోకం అంటారు .శివబాణ ప్రయోగానికి అర్జునుడు ఏమాత్రమూ చలించలేదు .తర్వాత శ్లోకం కు మూడు అర్ధాలున్నాయి ఆవైభోగం చూద్దాం -.  ‘’జగతీ శరణో యుక్తో హరికాతః-సుధా సితః –దాన వర్షీ కృతా శంసో నాగరాజ ఇవా బభౌ ‘’

మొదటి భావం-అర్జునుడు హిమవంతుని శోభతో .ఉన్నాడు శివుడితో యుద్ధం చేయగల తత్పరుడు .ప్రజాపాలన సక్రమంగా చేసేవాడు .నల్లని వాడు .దాత .యుద్ధ విజయం కోరుతున్నాడు .భూపాలనకోసం బ్రహ్మ సృష్టించిన వాడు. నివాస ,స్థానాలు ఇవ్వటం తో సింహాలకు ప్రియమైనవాడు .హిమవంతుడు .మంచు ఆవరించి తెల్లగా ఉన్నాడు. దానవ రుషి మన్మథులచే కీర్తింప బడినవాడు .

రెండవ భావం –భూమికి శరణ్య మైనవాడు .ఇంద్రునికిష్టుడు ,అమృతం లాగా శీల స్వచ్చత ఉన్నవాడు. దానాన్ని జలరూపం లో ఇచ్చేవాడు .భూమిని బాధపెట్టే రాక్షసులతో పోట్లాడే వాడు ..అంటే ఇంద్రుని ఐరావతం  తో పోలిక .

మూడవ భావం-ఆది శేషుని తో పోలిక –భూ రక్షణ కోసం విధాత ఏర్పాటు చేశాడు .కృష్ణుడికి ఇస్టమైనవాడు.అమృత స్వచ్చ శరీరి .దానవ ,రుషి ,లక్ష్మీ దేవులచే పూజింప బడే వాడు .

  శివుడు బాణాలతో అర్జున పరాక్రమం తగ్గించ లేకపోయాడు .అర్జున ఇంద్రియాలనుంచి కోపకారణంగా అగ్ని బయల్దేరింది . పిశంగవర్ణ తేజస్సుతో అర్జునుడు తన తేజస్సును విస్తరించాడు .అడవి చెట్ల వలన పుట్టే దావాగ్నిలా చెలరేగాడు .తన అమోఘ పరాక్రమం చూపిస్తూ శివుడు అర్జునుని పై గాయ పరిచి ప్రాణం తీయని బాణం వేశాడు .దాన్ని అర్జునుడు నివారించి ,తనబాణాల నీడలో భూమిని కప్పేశాడు .శంకరబాణ౦  సూర్యకిరణమే .ఆబాణం.మహా వేగంగా వచ్చి ,అసంఖ్యాక అర్జున బాణాలను ఖండించింది .అన్నిటినీ చీలుస్తూ,అర్జునుని బాణం లోకి కూడా ప్రవేశించింది .శివుని బాణాలను కూలుస్తూ ,అనేక విధాలుగా కదుల్తూ ,అన్ని చోట్లా అర్జునుడే ఉన్నట్లు గా మహర్షులకు కనిపించాడు .క్షణం తీరికలేక అంతా తానే అయి పోరాడాడు .అర్జున బాణ విజ్రు౦భణ పెరిగి ,శంకర బాణాలు భంగపడుతున్నాయి .దేవ రుషి గణం ఆకాశం లో ఈ మహా యుద్ధం చూడటానికి చేరారు .శంకర బాణ విస్తృతి ,విజయలక్ష్మీ సమేతుడైన విజయుని పరాక్రమం చూసి తత్వజ్ఞులైన మునుల ఒళ్ళు గగుర్పొడిచింది .తత్వజ్ఞులు అన్నమాటవలన అర్జునుడు నారాయణ అంశ ఉన్నవాడు అని తెలుసుకొన్నారు అని భావం లక్ష్మీ వతః అనే మాట కూడా దీన్నే తెలియ జేస్తుంది .-‘’సంశ్యతామివ శివేన వితాయమానం –లక్ష్మీ వతఃక్షితి పతేస్తనయస్య వీర్యం –అ౦గా న్యభిన్న మపి తత్వవిదాంమునీనాం –రోమాంచ మంచిత తర౦భిభారాం బభూవుః’’

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విదేశీ సంస్కృత విద్వాంసులు 49-విదేశాలలో సంస్కృతాధ్యయనం (చివరి భాగం )

← Back

Thank you for your response. ✨

Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.32 15వ  సర్గ – 3

కిరాతార్జునీయం-.32

15వ  సర్గ – 3

కుమాస్వామి సైన్యంతో ఇంకా ఇలా చెబుతున్నాడు –‘’దేవతల్నీ మనుషుల్నీ గడ్డిపరకగా చూసే మీరు ఉత్తమ  పరాక్రమ వంతులు .ఆపరాక్రమ శ్రీ ని ఎందుకు వదిలారు ?మనశత్రువు తీవ్ర ఖడ్గంధరించాడు .నిర్భయుడు తేజస్వి ,అందగాడు .యుద్ధభారం వహించగల దిట్ట ఎంతటి శత్రువుకూ జంకే వాడు కాదు .కనుక భయపడాల్సిన పని లేదు –‘’ నిశితా సిరతో భీకో న్యేజతే  మరణా రుచా –సారతో న విరోధీ నః స్వభాసో భరవానుత’’.  -పరాక్రమం ఉత్తమకవచ ధారీ అయినా అధీరుడు .అతని బాణ శబ్దం విని సమస్తజీవరాశి ప్రాణం వదిలేస్తాయి –‘’ తనువా రభసో భాస్వాన ధీరో వినతోరసా –చారుణా రమతే జన్యే కో భీతో రసితా శిని’’ఈ శ్లోకమూ ప్రతిలోమానులోమంగా రాసిందే .అతడి బాణాలకు చచ్చిన ఏనుగుల నుంచి కారిన రక్తం పర్వతజలపాతం లా ఉంది .మద ధారలున్నఏనుగులున్నవాడు ,శత్రువుల్ని ‘’కాకా ‘’అని కాకుల్ని పిలచినట్లు పిల్చేవాడు ,ఉత్సాహవంతులని నిరుత్సాహ పరిచేవాడు అతడు –‘’దేవకానిని కావాదే వాహికా స్వస్వ కాహివా –కాకారే భభరే కాకా నిస్వభవ్యవ్యభస్వని ‘’ఇది సర్వతో భద్ర కవిత్వంగా రాసింది .’’భయపడిన గుర్రాలు రౌతుల్నే కిందపడేశాయి .ఖడ్గాలు లేని వొరలు గాలి చేరి ఆధ్వని రౌతుల చెవుల్లో దూరి భయంతో చచ్చారు .యుద్ధం లో వీరులలో ఉత్సాహం పెరిగితే ,భయపడే వారి కోపాన్ని నశింపజేస్తుంది .శత్రువులు యుద్ధ కౌశలాన్ని చూసి ఆన౦దిస్తారు .ఈ శ్లోకం లో అర్దభ్రమక బంధం ఉంది..దేవతలతో మీరు భయంకర యుద్ధం చేశారు నిజమే .కాని ఇప్పుడు పౌరుష నష్టం పొందారు ‘’అని సైన్యాన్ని కుమారుడు అనునయిస్తుండగా శివుడు చిరు నవ్వుతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు .

  అర్జున బాణాగ్ని బాధ పడిన గణాలతో శివుడు ‘’పరిగెత్తకండి ‘’’అనే చల్లని మాటతోసంతోషం కలిగించాడు .ప్రమద గణ౦ బలహీనమై ’నిశ్శబ్దంగా ఉన్నప్పుడు శంకరుని సాంత్వన వాక్యం నచ్చి ఆయన అభిప్రాయం తెలుసుకొన్నారు –‘’దూనాస్తే రిబలా దూనా -నిరేభా బహు మేనిరే -–భీతాఃసహిత శరా భీతాః-శంకరం తత్ర శంకం ‘’   శ్లోకం మొదటిపాదం లో మొదటిపాదం అ౦దులొ చివరి పదంగా కూడా ఉండటం ఇక్కడి ప్రత్యేకత .అంటే దూనా –దూనా ,భీతాః- భీతాః,శంకరం –శంకరం .దాటటానికి వీల్లేని శత్రు బాణ సముద్రం లో ఉన్న సేన ఈశ్వర రూపమైన తీరాన్ని చూసి ఊరట చెందింది .ఓడిన సేనను ముందుపెట్టుకొని ,సూర్యుని నుంచి తొలగిన నీడను మహా వృక్షం ధరించినట్లు సేనకు బాసట అయ్యాడు .అంటే శివుడు సేనను వదలలేదు చెట్టు తన నీడను వదలనట్లు ..

  శంకరుడు అర్జునునిపై బాణం సంధించగా ఆ ధనుష్టంకారానికి ఇంద్రకీల పర్వతం బద్దలవు తోందా అన్నట్లు దిక్కులు పిక్కటిల్లాయి .-‘’ముంచ తీశే శరాజ్ఞిష్టౌపినాకస్వన పూరితః –దధ్వాన ధ్వనయన్నాశాః స్ఫుట న్నివధరాధరః ‘’.శివార్జున యుద్ధాన్ని నిశ్చేష్టులై చిత్రం లోని బొమ్మల్లాగా కదలకుండా ఆశ్చర్యంగా చూశారు .నైపుణ్యంతో అర్జునుడు వేసే బాణాలను శివుడు అంతే నైపుణ్యంగా నేలకూల్చాడు -.అర్జునుడూ శివుని బాణాలను అలాగే కూల్చేశాడు –‘’అవద్యన్పత్రిణః శంభోః సాయకైరవ సాయకైః-పాణ్డవః పరి చక్రామ శిక్షయా రణ శిక్షయా ‘’.ఈ శ్లోకం లో ఆద్యంత యమకం ఉంది .వల్కల శోభతో అందగాడైన అర్జునుడు మనోహర తీరులతో యుద్ధం చేశాడు –‘’చార చుంచు శ్చిరా రేచీచంచ చ్చీరుచా రుచః –చచార రుచిర శ్చారు చారైరాచార చంచురః ‘’ఈ శ్లోకం లో చ ,ర అనే రెండు అక్షరాలనే ఉపయోగించి మెస్మరిజం చేశాడు కవి భారవి .గా౦డీవానికి అల్లెత్రాడు బిగించి పిడుగుల్లాంటి నిప్పులు సూర్యునిలా వెదజల్లాడు భీభత్సుడు  .అర్జునబాణాలు శివబాణాలను మేఘాలు సూర్యుని కప్పినట్లు కప్పేశాయి-‘’పార్థబాణాః పశుపతేరావ వ్రర్విశిఖా వలీం –పయోముచ ఇవా రంధ్రాః  సావిత్రీ మంశు సంహతిం ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా పసాద్ -21-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విదేశీ సంస్కృత విద్వాంసులు 48-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం

 

విదేశీ సంస్కృత విద్వాంసులు

48-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం

20- రుమేనియా దేశం

ఈ దేశం లోని బోఖా రెస్ట్ యూనివర్సిటిలో ప్రొఫెసర్ అమితా భోస్ సంస్కృతం బోధించాడు .బెంగాలీ హిందీ విద్యార్ధులకు ఇది రెండేళ్ళ కోర్సు .ప్రఫెసర్ సూరజ్ భాన్ సింగ్  బోస్ కు సహకరించాడు .మాన్యుయల్ ఆఫ్ హిందీ ,ఇండియా –రుమేనియా సంస్కృతీ పుస్తకాలు సింగ్ రాశాడు .భోస్ –గోథే-భారతీయ మేధావులు ఆర్టికల్ రాసి ప్రచురించాడు .రవీంద్రుని ,రాబిన్సన్ క్రూసో ను తులనాత్మక పరిశోధన చేశాడు డా.డి.భట్టాచార్య .

21-స్పెయిన్ దేశం

స్పెయిన్ దేశంలోని మాడ్రిడ్ ,సలమాంకా యూని వర్సిటీలలో సంస్కృత అధ్యయనం జరుగుతోంది .మాడ్రిడ్ లో ప్రొఫెసర్ విల్లార్ 1978-79లో ,సలమా౦కా లో 80-81లో బోధించాడు .ఆత్మ –బ్రహ్మ ను,మేఘ దూతం ను  విల్లార్ ,భగవద్గీతను, మాండూక్య ఉపనిషత్ పై గౌడపాదుని కారికను, డా అడ్ర డోస్, మార్టిన్ కాన్స్యులో –వివేకం ను ,డా జొసీ గోమేజ్ –భారతీయ వేదాంత గ్రంథాలను అనువదించి ప్రచురించారు .

22-శ్రీ లంక దేశం

శ్రీలంకలో కేల నీయ ,జానా యూని వర్సిటీలో అండర్ ,పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో సంస్కృత బోధన జరుగుతోంది .స్కూలు స్థాయిలో అమలు సరిగా లేక నిరాశగా ఉంది ,కొన్ని దశాబ్దాలక్రితం గ్రీక్ లాటిన్ తో పాటు సంస్కృతం కూడా ఒక వెలుగు వెలిగింది .పాలీకూడా అదే స్థాయి పొందింది .పుస్తకప్రచురణ చాలా అరుదు .ప్రస్తుతం కేలననీయ యూనివర్సిటిలో  సంస్కృతం లో 8మంది ఆనర్స్ డిగ్రీవిద్యార్ధులు  ,15మంది మగిలిన సబ్జెక్ట్ లు నేరుస్తున్నారు .నానాటికీ చేరే విద్యార్ధుల సంఖ్య తగ్గి పోతోంది .ఉపయోగకరమైన లైబ్రరీ లేకపోవటం ,రిసెర్చ్ సౌకర్యం లేకపోవటంకారణాలు .జాఫ్నా యూని వర్సిటి -1974లో స్థాపన జరిగిన నాటి నుంచి సంస్కృత బోధన జరుగుతోంది .జనరల్ స్పెషల్ డిగ్రీ కోర్సులున్నాయి .భరతనాట్యం స౦గీతం లలో డిప్లొమా కోర్సులు దీనికి అనుబంధంగా ఉన్న రామనాధన్ అకాడెమీలో నేర్పుతున్నారు .ఏం ఏ ,పిహెచ్ డికోర్సులు పెట్టె యోచనా ఉంది .పెరడీనియా యూనివర్సిటిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు సంస్కృతం ఉంది .డిగ్రీ లెవెల్ లో యాన్సిలరి సబ్జేక్ట్ గా  బోధిస్తారు.హిస్టరీ విద్యార్ధులకు సంస్కృతం ఉంటుంది .శాసన పరిశోధన మనుస్మృతి అధ్యయనానికి తోడ్పడుతుంది

23-స్వీడెన్ దేశం

నాలుగవ ప్రపంచ సంస్కృత  సమ్మేళనం ఈ  దేశం లోని  వీమార్ లో జరిగి ,ఇండలాజికల్ రిపోర్ట్ ప్రచురించారు .స్టాక్ హోం లో అనేక కాన్ఫరెన్స్ లు జరిపారు .భారత దేశంనుండి నిష్ణాతులు ఇక్కడికి విజిటింగ్ ప్రొఫెసర్స్ గా వచ్చారు .సామవేదానికి చెందిన ఉప్సల  ఉపనిషత్ ను  జెన్ ఎక్లుండ్ ,విష్ణుపురాణం ను జి లీబర్ట్ ,కావ్య నిర్మాణం ను లీన్ హార్డ్ ,మానస మంగళ అధ్యయనం ను డబ్ల్యు స్మిత్ లు వారిభాషలోకి అనువదించి ప్రచురించారు .

24-సోవియెట్ రిపబ్లిక్ ఆఫ్ రష్యాదేశం –

పుస్తకప్రచురణ –ప్రాచీన భారతీయ సంస్కృతీ –బొంగార్డో  లెవిన్ ,పి.గ్రీన్స్టర్-భాసుడు ,సేరేబ్రియకోవ్ –భర్తృహరి శతకత్రయం,వేదం వాజ్మయ చరిత్రను ఏర్మాన్ ఓ కెర్క్ ,బౌద్ధవేదాన్తంను క్రితికా మిరోవోజ్ ,మధ్యయుగ భారతీయ కవిత్వం లో అమరప్రేమ ను సేరేబ్రేయిని ,భారతీయ యాత్రా స్థలాలు ను రుద్నేవ్ పో లు అనువదించారు .హరివంశపురాణ౦,రాజశేఖరుడు,,అర్ధ శాస్త్రం ,లోకాయత ,భారతంలో మహిళలు ,జైన బౌద్ధాలు మొదలైన వాటిపై పరిశోధనా వ్యాసాలూ రాసిప్రచురించారు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

  పూలదండకు మరణ శిక్షా ? 

      పూలదండకు మరణ శిక్షా ? 

కలలు కనమని చెప్పి యువతను తీర్చిదిద్దిన

భారత రత్న అబుల్ కలాం పై నీ ఆరాధనా భావం

అసూయకు దారితీసిందా శివదాసన్ !

కొచ్చీ మెరైన్ డ్రైవ్  వీధిలోనే పడుకుంటూ

నిత్యం కలా౦భాయ్ విగ్రహానికి ఏమీ ఆశించక

నీఖర్చుతో పూలమాల వేసి సంతృప్తి చెందే

నీపైనే అసూయా ? ఎంత దారుణం ?

మనుషులున్న సమాజం లోనే జీవిస్తున్నామా  ?

నువ్వేదో కీర్తి సంపాదిస్తున్నావన్న అసూయ

గూడుకట్టుకొని నిన్నే హత్య చేశాడా ఆ కిరాతకుడు ?

మాటు వేసిదారి కాచి చంపేశాడా?

‘’సమసమాజం వల్లించే’’ పాలనలోనే జరిగిందంటే  

తల్లడిల్లిన మనసుతో తలవంచుకొంటున్నాను

శివ దాసన్ ! నీకు నా  కన్నీటి కైమోడ్పు.

ఆధారం -ఇవాల్టి జ్యోతిలో వార్త చదివాక కలిగిన స్పందన

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-12-20-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.31 15వ  సర్గ – 2

కిరాతార్జునీయం-.31

15వ  సర్గ – 2

కుమార స్వామి శివ సేన పారిపోవటాన్ని చూసి మందలిస్తూ’’ఎంతోకీర్తి గడించిన మీరు ఏ ఆపద వచ్చి మీద పడిందని పారిపోయి వచ్చారు ?మీపలాయనం పాపం తప్ప మరేమీ కాదు .ఆ తాపసి దానవుడో ,నాగరాజో ,రాక్షసుడో కాదు .జయించ వీలుఉన్న ఉత్సాహ పురుషుడు .రజోగుణమున్న కేవల మానవ మాత్రుడు.-‘’‘నా సురో యమ న వా నాగో- ధర సంస్థోన రాక్షసః –నా సుఖో యం నవాభాగో –ధరణిస్థోహి రాజసః ‘’.ఈ శ్లోకం ‘’గోమూత్రికా బంధం ‘’తో ఉంది .16అరలు ఉండే రేఖలకు పై భాగం లో ముందుభాగం ,కిందిభాగం చివరి భాగం కలిపితే శ్లోకం పూర్తవుతుంది .’’ఈ ముని దయతో నెమ్మదిగా బాణ వదులుతూ ,మిమ్మల్ని దారితప్పిన పశువుల్ని రైతు కర్రతో అదిలించినట్లు అదిలిస్తున్నాడు .అంతే.-‘’ప్రణుదత్యాగ తావజ్ఞం జఘనేషు పశూనివ ‘’.నీచులచే పరాజితుడైనవాడు మనిషే కాదు నీచుల్ని ఓడించినవాడూ మనిషి కాడు.మీరు నీచునిచే ఓడి భయంతో పరిగెత్తుతున్నారు .మిమ్మల్ని ఏమనాలో మరి ?స్వామి పరాజితుడు కాకపొతే ఆ సైన్యం పరాజితం కాదు .బాధ పడే వారిని ఇంకా బాధ పెట్టె వాడు నిర్దోషీ కాడు,నీచుడుకూడా –‘’న నోన నున్నో నున్నోనో నానా నా  నాననా  నను –నన్నో నున్నో ననున్నేనో నానేనా నున్న నున్ననుత్ ‘’.ఒకే ఒక నకారంతో రాసిన ఏకాక్షర శ్లోకం .అర్ధం తెలుసుకొందాం-నానాననా =అనేక ముఖాలున్న సైనికులారా ,ఊన నున్నః =నీచునితో ఓడిన ,నానా=మనిషికాదు,నున్నోనః నా అనా = నీచుడిని ఓడించినవాడు మనిషికాదు ,న నున్నేనః =న నున్న ఇనః –ఎవరి రాజు పరాజితుడు కాడో,నున్నః =పరాజితుడు ,అనున్నః =పరాజితుడు కాని వాడు ,నున్న నున్న నుత్ =బాధితుడిని పీడించేవాడు ,నా అనేనాః న =మనిషి నిర్దోషికాడు.

‘’ మొదట్లో మంచి గుణాలుకలిగి తర్వాత గుణ హీనుడైతే వాడి కంటే గుణం లేని వాడు గొప్పవాడు .మణి లేని అలంకారం సహజంగా మంచిదే మణిజారిపోయిన నగ మంచిదికాదు విలువలేనిదే .అంటే పారిపోవట కంటే,అసలు యుద్ధానికి వెళ్లకపోవటమే మంచిది అని భావం –‘’ప్రకృత్యా హ్యామణిః శ్రేయాన్నలంకార శ్చ్యుతోపలః’’.అతడి వద్ద వేగంగా వెళ్ళే రథాలు ,మంచి గుర్రాలు దేవ గజాలు , భయపడని పదాతి దళాలు లేవు కనుక భయపడాల్సిన పని లేదు .ఇప్పుడు మన శత్రువు పౌరుషం లేక ,సూర్యుడిచే ఎండించబడిన మడుగులా ఉన్నాడు .అందులో దాటగల బురద ఉండగా ,మీకు రాకూడని అపకీర్తి వచ్చింది –‘’హ్రదైరివార్క నిష్పీతైః ప్రాప్తః పంకోదురుత్తరః ‘’.వెదురు తుమ్మలు ముళ్ళచెట్లతో భీకరంగా ఉండే వనాన్ని వదిలేసి,ఏ దిక్కులు విదిక్కులు జయించటానికి మీరు వెడుతున్నారు ?-‘’వేత్ర శాకకుజే శైలే లేశైజేకుక శాత్రవే –యాత కిం విదితోజేతుం తు౦జేశో దివి కి౦తయా’’ఈ శ్లోకం లో రెండు పాదాలు అనులోమ ,ప్రతిలోమ పద్దతిగా రాయబడింది .ముందునుంచి చివరిదాకా ,చివరుంచి ము౦దాకా ఒకటే రకంగా ఉంటుంది .చదివి చూస్తే తెలుస్తుంది .మనస్వామి శివుడు నపుంసకత్వం పొంది ,శత్రువుకు వీపు చూపి పారి వచ్చిన మిమ్మల్ని పతివ్రతా ధర్మాన్ని వదిలేసిన భార్య లనులాగా ,తన మహిమతో మీ తప్పుల్ని కప్పిపుచ్చుతాడు భయం అక్కర్లేదు –‘’అయం వః క్లైబ్య మాపన్నాన్ దృస్ట పృష్టానరాతినా –ఇచ్ఛతీశశ్చుతాచారాన్ దారానివ నిగోపితుం’’.భయంకర శత్రువును భయపెట్టే మీరు సమర్ధులు శత్రువు విషయం లో మీరు క్రూరులు .ప్రభుభక్తి ఉన్న భక్తులు రక్షకులు .సదాచారులు .వక్తలూ శరణాగత రక్షకులు మీ పరి శుద్ధి అందరికీ తెలుసు –‘’నను హో మథనా రాఘో,ఘోరా నాథ మహో నున –తయదాత వదా  హీమా ,మా భీదా బత దాయత’’.ఈ శ్లోకమూప్రతిలోమం లోనే ఉంది .

   సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విదేశీ సంస్కృత విద్వాంసులు 47-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం

 

విదేశీ సంస్కృత విద్వాంసులు

47-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం

12-ఆస్ట్రేలియా దేశం

1979-81 మధ్యకాలం లో ఆస్ట్రేలియాలో ని నేషనల్ యూని వర్సిటిలో సంస్కృత అధ్యయనానికి అంతరాయం కలిగింది .1979లో ప్రొఫెసర్ ఏ.ఎల్.బషాం రిటైరయ్యాక పోస్ట్ ఖాళీ గా ఉంది .సౌత్ ఏషియన్ బుద్ధిష్ట్ స్టడీస్ ప్రొఫెసర్ ,రీడర్ ,సీనియర్ లెక్చరర్ సంస్కృతం బోధించారు .పార్ట్ టైం రిసెర్చ్ అసిస్టంట్ పదేళ్ళు కస్టపడి పని చేసిన ,సంస్కృత టిబెటన్ గ్రందాథాలనువాదం చేసిన ఆమెను తొలగించేశారు .ఆతర్వాత సంస్కృత బోధనకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు .పై నాలుగేళ్ళలో జరిగిన రిసెర్చ్ పని మాత్రమమే చెప్పుకోవాలి .హారిసన్ పాల్ మాక్స్వెల్ –ప్రత్యుత్పాతన బుద్ధ సమ్ముఖావనిత సమాధి సూత్రను ఇంగ్లీష్ లోకి  అనువదించాడు .మట్సు మూరా హిస్సాషి –నాలుగు అవదానాలు ,రాహులా టేల్వెట్టే-రసవాహిని ,కపూర్ ఇంద్రాణి –బౌద్ధ సింబాలిజం ,ప్రిసియాడో బెంజమన్ –పురాణాలలో కృష్ణుడు ,జిస్క్ కెన్ –ఋగ్వేద అధర్వణ వేదాలలో జబ్బులు నివారణోపాయాలురాశారు  .

13-ఆస్ట్రియా దేశం –

విశిష్టాద్వైత మతచరిత్ర ,పరాశరభట్టు రాసిన తత్వరత్నకార ,నాథముని రాసిన న్యాయ తత్త్వం అనువాదాలు జరిగాయి .రత్నకీర్తి రాసిన సర్వజ్ఞ సిద్ధి ,చంద్రకీర్తి రాసిన మధ్యమాకావతార లపై పరిశోధన జరిగింది .వియన్నాలో సంస్కృత జర్నల్స్ సంస్కృత వ్యాప్తికి దోహదం చేశాయి .ఫ్రాన్సిస్ డి.సా – కుమారిల ,శంకరర రచనలలో శబ్దప్రామాణ్యం రాశాడు .

14-బెల్జియం దేశం –

1841నుండి బెల్జియం లో సంస్కృత అధ్యాయనం సాగుతోంది .లూవెన్ లోని కేధలిక్ యూని వర్సిటి లో సంస్కృత బోధన జరిగింది .ప్రొఫెసర్ ఏ షర్పే-కాళిదాస నిఘంటు ‘’నిర్మాణం చేశాడు.కే యు లూవెన్ –వేద, రామాయణ, భారత పురాణాలలో నైసర్గిక –నామాలు –టోపోగ్రాఫికల్ నేమ్స్ పై పరిశోధన చేశాడు .

15-చైనా దేశం

 బీజింగ్ యూని వర్సిటిలో రెండేళ్ళనుంచి భారతీయ ప్రాచీన తత్వశాస్త్ర అధ్యయనం జరుగుతోంది .చాలా గ్రంథాలు చైనీస్ భాషానువాదం పొందాయి .ప్రొఫెసర్ జి .జియన్లిన్ –ప్రిలిమినారి స్టడీ ఆన్ రామాయణ ,అభిజ్ఞాన శాకుంతలం ,రాశాడు ప్రొఫెసర్ జిన్ కేము –ప్రాచీన భారతం లో కథలు గాథలు ,ప్రొఫెసర్ హుయాంగ్ జిన్ చువాన్ –రామాయణం 2,7కాండల అనువాదం ,పాణినిసూత్రాలు ,పంచతంత్రం ,ప్రొఫెసర్ జు ఫ్రాన్చేన్ -50 ఉపనిషత్తులు ,బోయేషింగ్ –భగవద్గీత ,లెక్చరర్ ఝావో గువో హువా –నలోపాఖ్యానం పై వ్యాసం ,ఏ జున్ –విశుద్ధిమాగ్గా లురాశారు .కాళిదాస,జాతకలధ,మహా వంశ ,మను స్మ్రుతి లపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి .

16-డెన్మార్క్ దేశం

కోపెంహాన్ యూని వర్సిటిలో ఇండియన్ ఫిలాసఫీ నేరుస్తున్నారు .ఐవో ఫీజర్-ది వేదిక్ ఆర్యన్స్యాజ్జ్ సీన్ బై దెం సెల్వ్స్ ,పాలీ త్రిపిటక అనువాదం.బౌద్ధ ఫిలాసఫీ పై పరిశోధన ,బుద్ధపాలితలేక శూన్యవాదం , మాతృ సేనుని ‘’ప్రణిధాన సప్తతి ‘’,ఆచార్య నాగార్జున వేదాంతం ,కంబోలుని అలోకమాల ,శాంత రాక్షసుని తత్వ శుద్ధి ,పై పరిశోధనలు జరిగాయి  పాలి నిఘంటు ను హీర్మాన్ ,కొప్ నార్మన్  లు తయారు చేశారు .ఈ యూని వర్సిటి క్విన్ శతాబ్ది ఉత్సవ సందర్భంగా  ఈ విద్యాలయం పై 14భాగాల యూని వర్సిటీ చరిత్ర అభివృద్ధి ,ఓరియెంటల్ వ్రాతప్రతులు తో ప్రచురించారు .

17-ఫిన్లాండ్  దేశం

10-12-1980న హేల్సిన్కిలో నార్డిక్ సౌత్ ఏషియా సమావేశం జరిగింది .డెన్మార్క్ ఫిన్లాండ్ నార్వే ,స్వీడెన్ మొదలైన 80దేశాల ప్రతినిధులు పాల్గొనగా ,లీడెన్ యూని వర్సిటి ప్రొఫెసర్ జే

హెచ్ హీస్టార్ ‘’వేదం -సమాజం ‘’ పై ప్రారంభోపన్యాసం చేశాడు .50మంది వివిధ అంశాలపై పరిశోధన పత్రాలు రాసి సమర్పించారు .ఏప్రిల్ 17నుండి జూన్ నెలాఖరు వరకు బౌద్ధ విషయక వస్తు ప్రదర్శన జరిగింది .1981ఆగస్ట్ 10నుంచి 18వరకు నార్డిక్ రిసెర్చ్ వర్క్ షాప్ నిర్వహించారు .30మంది ప్రతినిధులు చురుకుగా హాజరయ్యారు .1958నుంచి హెల్సింకి యూని వర్సిటిలో సంస్కృతం బోధిస్తున్న ప్రొఫెసర్ పెనిట్టీ ఆల్టో1980లో  రిటైరయ్యాడు . ,బెర్టిల్ తిక్కనేన్ ఋగ్వేద ,అధర్వ వేద్దాలలో అబ్సల్యూటివ్స్ అంటే పూర్ణత్వ పై దిసీస్ సమర్పించాడు .జైమినీయ శ్రౌత  సూత్రాలకు భావత్రాత రాసిన వ్యాఖ్యానం ను డోసేంట్ ఆస్కో పర్పోలా ప్రచురించాడు .ఇండస్ లిపి లోని పుస్తకాలకు  డాక్యుమెంటేషన్ జరిగింది .పర్పోలా వేదకాలం వరకు ఇండస్ మతం రాసి ప్రచురించాడు .

18-ఫ్రాన్స్ దేశం

లుడ్విక్  స్టెన్ బాచ్ –ఘోరకుని అశుధార ,వ్యాస సుభాషిత సంగ్రహం ప్రచురిస్తే ,డేనియల్ డోన్నేట్ట్-నలోపాఖ్యానం ,సిల్వేనియా ఫిల్జోట్ –రత్నావళి కొటేషన్స్ ,మేరీ క్లాడీ పోర్చేర్- ప్రహేళిక,ఫిల్జోట్- వేదాలపైనా,కొందరు వైష్ణవ శైవ ఆగమాలపై రిసెర్చ్ చేశారు .బ్రూనో డేజేన్స్-శైవాగమ పరిభాషా మంజరి ప్రచురించాడు .మైకేల్ హూలిన్ –మృగేంద్రగమ,భట్ట నారాయణ కంఠ,  అఘోర శివాచార్య ప్రచురించాడు .ఆండ్రేపడాక్స్-జప విధానం పై ,అభినవ గుప్తుని పరమార్ధసరం పై  మరికొందరు జైన బౌద్ధాలపై ,మతగ్రంథాలపై కృషి చేశారు .ఫిల్జోత్-మహాభాష్యం పై, కమలేశ్వర భట్టాచార్య –సిద్ధాంత లక్షణ ప్రకరణం పై సిద్ధాంత వ్యసాలురాశారు ఆయుర్వేదం ఆర్కియాలజీ లనూ వెలుగులోకి తెచ్చారు .

19-జపాన్ దేశం

సంస్కృత ,ఇండాలజీ పండితుడు ప్రొఫెసర్ యెన్ .త్సూజీ టోక్యో యూని వర్సిటి ఎమిరిటస్ ప్రొఫెసర్ 1979లో చనిపోయాక ,ఆయనస్థానం లో ప్రొఫెసర్ జె.తకకూసు  వచ్చి సంస్కృత ,ఇండియన్ స్టడీస్ వ్యాప్తికి విశేష కృషి చేశాడు .చైనా నుంచి సంస్కృత విద్వాంసుల బృందం పెకింగ్ యూనివర్సిటి ప్రొఫెసర్ ,వైస్ ప్రెసిడెంట్ ఛీ హీసిన్ లిం నాయకత్వం లో వచ్చి ఇక్కడి పరిస్థితులు అధ్యనం చేసి సంస్కృత విద్యార్ధులకు స్కాలర్షిప్ ఏర్పాటు చేశారు .తర్వాత ప్రొఫెసర్ నకమూరా నాయకత్వం లో ఒకబృంద చైనా వెళ్లి ,రెండు వారాలుండి,అక్కడి విద్యావేత్తలతో చర్చించారు .1979లో టోక్యోలో 1980లో క్యోటో లో జపాన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ అండ్ బుద్ధిష్ట్ స్టడీస్ సమావేశాలు జరగగా 400 రిసెర్చ్ పేపర్లు రాసి ప్రచురించారు . ప్రొఫెసర్ యెన్ .ట్సూజీ –అధర్వ వేద సూక్తాలలో వంద సూక్తాలకు జపనీస్ అనువాదం చేశాడు .వై.కనకూర బ్రహ్మసూత్రాలకు శంకరాచార్య రాసిన భాష్యాను వాదం చేశాడు .ఎస్.మయేదా-శంకరుల ఉపదేశ సహస్రికి ఇంగ్లీష్ అనువాదం చేశాడు ,వేదాంత్ ఫిలాసఫీ ని జపనీస్ భాషలో అనువదించాడు .జపాన్ విద్యా వేత్తలకు  సాంఖ్యం  పై మోజు ఎక్కువ .ఎస్ మురకాని సాంఖ్య సిద్ధాంతాన్ని అనువదించాడు .నాకుమార –వైదేశిక సూత్రా ,పదార్ధ ధర్మ సూత్రాలనుతర్క సంగ్రహంను దీపికతో సహా  అనువదించాడు ,ఒ.తనక ,కె.కమిమూర కలిసి పంచతంత్రం అనువాదం చేశారు .కమిమూర కథా సరిత్సాగరం ,బేతాళల పంచ వి౦శతి లను కూడా అనువదించాడు .వై .ఇవామోకో వాల్మీకి రామాయణం ను ఇంగ్లీష్ అనువాదం ఆధారం గా  అనువదించాడు సద్ధర్మ పుండరీకం ,కామసూత్ర ,మృచ్చకటికం ,ఉపనిషత్ లను కూడా అనువాదం చేశాడు .ఆర్యభటీయం, లీలావతి, ఆపస్త౦భ  సూత్రాలను యానో, హయాషి ,ఇకారి లు  తమభాషలోకి మార్చారు .ప్రాకృతం జైనిజం పై మక్కువ ఉన్న కుర్రాడు ఎస్.సుచిహాసి గొప్ప కృషి చేసి 1981లో 30ఏళ్ళ చిన్నవయసులోనే మరణించాడు .ప్రొఫెసర్ఏం ఎల్ మెహతా ,ప్రొఫెసర్ హెచ్ సి బయానీ బెనారస్ ,అహ్మదాబాద్ వర్సిటీలనుంచి ఇక్కడికొచ్చి టోకాయ్ యూని వర్సిటిలో విద్యాబోధన చేస్తున్నారు .ఉత్తర జిఘాయ ,పద్మలేష్య ,లపై పరిశోధనలు జరిగి ప్రచురితమయ్యాయి .

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.30 చతుర్దశ సర్గ -4(చివరి భాగం )

కిరాతార్జునీయం-.30

చతుర్దశ సర్గ -4(చివరి భాగం )

‘’అర్జున తపస్వి శాంతం మొదలైన గుణాలతో వశీకృతమైన దేవతలుఅతడికి భయపడి , మనకు కనిపించకుండా మనపై బాణాలు వేస్తున్నారా ?లేకపోతే సముద్రతరంగాల్లా యెడ తెరిపి లేకుండా బాణాలు వచ్చి ఎలా మన మీద పడుతున్నాయి ?’’అని ఆశ్చర్యపోతోంది శివ సైన్యం –‘’హృతా గుణైరస్య భయేన వా మునే –స్తిరోహితాః స్విత్ప్రహరంతిదేవతాః –కథంన్వమీ సంతతస్య సాయకా –భవత్యనేకే జలధేరివోర్మయః ‘’.ఈయన యుద్ధం లో జయించి విరమిస్తే ,చరాచర లోకాలకు మేలు జరుగుతుంది ‘’అంటూ బాణం దెబ్బలకు భయపడుతున్న సేన నీరుకారి అంటోంది .చివరికి చేతు లేత్తేసి నిస్తేజమై బదులు చెప్పలేక శాంతి మార్గమే మేలు అనే ఆలోచనలోకి వచ్చారు .పురుషార్ధం కూడా బలీయమైన దైవం ముందు వ్యర్ధమౌతుంది –‘’బలీయసా తద్విధి నేవ  పౌరుషం –బలం నిరస్తం న రరాజ జిష్ణునా’’.అర్జున బాణ క్షత గాత్రులైన శివ సైనికులు సూర్య కిరణాలతో శోషింప బడిన నీరు మండలాకారం గా తిరిగినట్లు నిశ్చేష్టులై మండలాకారం లో గుమి కూడారు .-‘’రవి కర గ్లపితైరివ వారిభిః-శివ బలైః పరిమ౦డలతా దధే’’.అర్జున బాణాలు బ్రహ్మాండాన్నికప్పేయగా ,మాటిమాటికీ ధనుస్ఫాలనం చేయటం తో భయపడ్డవిజయ లక్ష్మి అతి కష్టంగా శివ సేనపై ఉన్న అనురాగాన్ని వదిలించుకోవటానికి సిద్ధపడింది .అంటే కిరాత సేన పరాజయాన్ని ఒప్పుకొన్నదని భావం – ‘’’ప్రవితత శరజాల చ్ఛన్న విశ్వాంత రాలే-విధువతి ధనురావిర్మండలం పాండు సూనౌ –కథమాపి జయ లక్ష్మీ ర్భీత భీతా విహాతుం –విషమనయన సేనా పక్ష పాతం విషేహే’’.

      పంచదశ  సర్గ -1

వ్యాకులత చెందిన జీవజాలం ఊపిరి పీల్చుకోగా ,శివ సేన ఆయుధాలు అక్కడే పారేసి తలో దిక్కుకూ పారిపోయారు .ప్రమథ గణం శివుడిని చూడకుండానే పారిపోయింది సంకటసమయం లో మనసు ఏదీ ఆలొచి౦చ లెదు కదా –‘’అపశ్యద్భిరి వేశానం రణన్నివవృతే గణైః-ముహ్యత్యేవ హాయ్ కృచ్ఛ్రేషుసంభ్రమ జ్వలితం మనః ‘’.  జయించే ఆశవదిలి  పారిపోతున్న కిరాత సేనపై కపిధ్వజ విజయునికి దయ కలిగింది .అనేక ప్రయత్న విధానాల్లో శత్రువును వశం చేసుకొన్న మహాత్ములకు వారి విషయం లో దయకలగటంగొప్ప వారి మాహాత్మ్యాన్ని చాటుతుంది –‘’వ్యక్తిమాయాతి మహతాంమాహాత్మ్య మను కంపయా ‘’ఖడ్గ బాణ ధనుస్సులు కలిగి వాహనం తో, వాహనం లేకుండానూ శత్రు నిర్జనం చేసి స్వర్ణ గజాదులు స్వాధీనం చేసుకొన్నఅందమైన భాగ్యశాలి ,శివ పుత్రుడు, దేవ సేనాని అయిన కుమారస్వామినే యుద్ధం లో పరి గెత్తించ గల ధీశాలి అర్జునుడు యుద్ధ భూమిలో విచిత్ర శోభ పొందాడు .-‘’స సాసిః సాసుసూః సాసోయేయా యేయా యయాయః-లలౌ లీలాం లలో లోలః శశీ శశి శుశీః శశ౦ ‘’ఇది చిత్ర కవిత్వ శ్లోకం .సాసిః అంటే ఖడ్గమున్నవాడు,సాసుసూః అంటే ప్రాణాలు హరించే బాణం ఉన్నవాడు ,సాసః అంటే ధనుస్సున్నవాడు ,యేయ అయేయ అయయ,అయయః అంటే వాహనం తో నూ ,అది లేకున్నా ,శత్రువును చేరేవారి వాహనాలు స్వాధీనం చేసుకొనే వాడు ,లలః అంటే అందమైన వాడు ,అలోలః అంటే చాంచల్యం లేనివాడు ,శశి ఈశ ,శిశు శీః అంటే చంద్ర ధరుని  కుమారుడైన దేవసేనానిని పరి గెత్తించిన వాడు ,శశన్ అంటే పిక్కబలం చూపించగలవాడు  ,లీలా అంటే శోభను లలౌ అంటే ధరించాడు అని అర్ధం .శబ్దం, ఏకాక్షర నిఘంటువు వ్యాకరణాలపై పూర్తి అధికారం ఉన్న కవి మాత్రమే రాయ గలిగిన శ్లోకాలివి .

  భయంతో పరిగెత్తే శివ సైన్యాన్ని నెమ్మదిగా అనుసరించి వెళ్ళాడు .బాధలో ఉన్నవారిని మరీ బాధపెట్ట టానికి మహానుభావులు ఇష్ట పడరు.-‘’నాతిపీడ యితుం  భగ్నా నిచ్ఛ౦తి  హిమహౌజసః ‘’.పారిపోయి వస్తున్న తమ సైన్యాన్ని చూసి, వాళ్లకు ఎదురుగా ముందుభాగాన ఉండికార్తికేయుడు ఖిన్నులైన కిరాతులతో ఇలా అన్నాడు –‘’అథాగ్రే హసతా సాచి స్థితేన స్థిర కీర్తినా –సేనాన్యేతే జగదిరే కించి దాయస్త చేతసా ‘’ఈ శ్లోకాన్ని నిర్యోష్ఠ్యం’’అంటారు.అంటే  పెదవులు కలవకుండా పలికే అక్షరాలతో కూర్చింది .ఇదీచిత్రకవిత్వమే .కుమారస్వామి వాళ్ళతో ‘’యుద్ధం ,ఆట మీకు సమానమే .రాక్షసులని జయించి కీర్తిపొందారు సామాన్యుల్లా పారిపోతే మీ కీర్తికి మచ్చ .మీలాటి మహాశూరులకు ఇది తగని పని .-క్షతంక్షుణ్ణాసుర గణై రగణైరివ కిం యశః’’ఈపాదం యమకం తో రాయబడింది .’’సూర్యకిరణాలు సోకి మీ ఖడ్గాలు మిమ్మల్ని పరిహాసం చేస్తున్నాయా?అంటే పారిపోయేవారికి కత్తులతో పనేమిటి అని భావం .ఆడవి మృగాలు తిరిగే చోట తలదాచుకోవటానికి పరిగెత్తే మీ దుఖం ఎలా శాంతిస్తుందో అని నా విచారం ‘’అన్నాడు –‘’వనే వనే వన సదా౦ ,మార్గం ,మార్గ ముపేయుషా౦-బాణై ర్బాణైఃసమాసక్తం శ౦కేశంకే న శామ్యతి ‘’ఈ శ్లోకం లోనూ యమక శోభ ఉన్నది .

   సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -19-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment