ప్రపంచ దేశాల సారస్వతం 37-ఉరుగ్వేనియన్ సాహిత్యం

ఉరుగ్వే దేశం లో భాష మాట్లాడటం ఆరంభం నుంచి  ఆదేశ సుప్రసిద్ధ కవి బార్టో లోమ్ హిడాల్గో-1788-1822 కవిత్వాన్ని చదివిఆస్వాదిస్తున్నారు .ఆ దేశపు రొమాంటిక్ యుగం లో  అడాల్ఫో బెర్నో ,జువాన్ జోరిల్లా డి శాన్ మార్టిన్ లు ముఖ్యకవులుగా గుర్తింపు పొందారు .ఆధునిక యుగ లాటిన్ అమెరికన్ కవులలో జూలియో హీర్రేరా రీస్సిగ్ అత్యంత ప్రఖ్యాతుడు.మహిళాకవులలో  జువానా డిల్బార్బారో ,డేల్మిరా ఆగస్టిన్ కవిత్వంలో చరిత్ర సృష్టించారు .ఇందులో రెండవ ఆమె స్పానిష్ అమెరికన్ సెంటిమెంట్ ను ఆయుగం అంతా రగిల్చి చిరస్థాయి సాధించి బహు ప్రఖ్యాతురాలైంది సాహిత్యలోకం లో .ఎమిల్లో ఫ్రుగొని , ఏమిల్లో ఒరైబ్ లను డిస్టిన్గ్విస్ట్స్ లిరిసిస్ట్ లుగా కీర్తి పొందారు .

  వచనం ,ఫిక్షన్ రాసిన ఉరుగ్వేనియన్ రచయితలు –జువాన్ కార్లోస్ ఒనెట్టి,కార్లోస్ మార్టినేజ్మొరెనో,ఎడ్యురార్డో గలీనో ,ఫెలిస్ బెర్టో హెర్నాన్డేజ్,మేరియో బెనేడెట్టి,టొమాస్ డి మట్టోస్,మారిషియో రోసెన్ కాఫ్,జార్జి మాజ్ ఫడ్.

  షార్ట్ స్టోరి రచయితలలో హోరాసియో క్విరోగా కు అద్భుత రచనా శక్తి ఫాలోయింగ్ తోపాటు పాప్యులారిటి ఉన్నది .కాన్  స్టాన్షియో సి విగిల్ మాత్రం అందరి ప్రేమాభిమానాలు పొందిన బాలసాహిత్య రచయిత.జార్జి లూయీ బోర్జెస్ సాంస్కృతిక రంగం లోనూ , ఉరాగ్వే చరిత్ర లో నిష్ణాతుడు  .ఫేమస్ ధియేటర్ రైటర్ గా ఫ్లారెన్సియో సాన్చేజ్ లబ్ధ ప్రతిస్టుడు.

  ఎక్కువ మంది రచయితలు ఉత్తర ఉరుగ్వేలో ఉన్న రాజధాని మాంటే విడియోకు చెందినవారే .ఎడ్యుర్డో గెలీనో జర్నలిస్ట్ రచయితా ,నవలాకారుడు మాత్రమేకాక ‘’ గ్లోబల్ సాసర్స్ ప్రి ఎమినేంట్ మాన్ ఆఫ్ లెటర్స్ ‘’గా ప్రఖ్యాతుడు .’’లాటిన్ అమెరికన్ లెఫ్ట్ లిటరరీ జైంట్’’కూడా .ఇతని ప్రఖ్యాత రచనలు –లాస్ వెనాస్ అబిర్టాస్ డి అమెరికా లాటినా ,మేమోరియా డెల్ ఫ్యూగో మొదలైనవి .3-9-1940లో రాజధానిలో పుట్టి ,13-4-2015చనిపోయాడు .అతని కొన్ని సూక్తులు –ది వాల్స్ ఆర్ ది పబ్లిషర్స్ ఆఫ్ దిపూర్ ,’’దిచర్చ సేస్ ది బాడి ఈజ్ సిన్,సైన్స్ సేస్ దిబాడి ఈజ్ ఎ మెషిన్,అడ్వేర్తిజింగ్ సేస్-ది బాడి ఈజ్ ఎ బిజినెస్ ,దిబాడి సేస్-ఐ యాం ఎ ఫీస్టా-అంటే పండుగ సంబరం .

  మేరియో బెనేడెట్టి –‘’జనరేషన్ ఆఫ్ 45’’గ్రూప్ రచయిత,మహా మేధావి ,రాజకీయ సాంఘిక సమస్యల విశ్లేషకుడు .1956లో ‘’పొయేమాస్ డి లా అఫిసిన –ఆఫీస్ పోయెమ్స్ అనే కవితా సంపుటి వెలువరించి అర్బన్ బ్యూరోక్రాట్ ల వింతపోకడలను ఎండగట్టాడు .అతనికవితలు –గ్రీన్ కంట్రి విత్ ట్రా౦ కార్స్ ‘’బాగా పాప్యులరయ్యాయి .

  క్రిస్టినా పెర్రి రోసి –ఉరుగ్వే నవలా ,కవిత్వ, అనువాదకు రాలుమరియు కధకురాలు .1960తర్వాతి తరం రచయిత్రులలో అగ్రశ్రేణికి చెందింది .37కు పైగా రచనలు చేసింది .12-11-1941 న పుట్టి౦ది.క్రియేటివ్ ఆర్ట్స్ కు ఫెలోషిప్ పొందింది .’’ఇవోహే ‘’అనే పేరుతో మూడు కవితా సంపుటాలు ప్రచురించింది.’’ స్టేట్ ఆఫ్ ఎక్సైల్’’గా ఒకటి ఇంగ్లిష్ లోకి అనువాదం అయింది

  హిరాసియో క్విరోగా –నాటకరచయిత నవలాకారుడు కవి ,కధకుడు .అడవి బాగ్రౌండ్ గా చాలా కధలురాశాడు 31-12-1878పుట్టి 19-2-1937 చనిపోయాడు .హిస్టో రియాస్ డి అమర్ ,డి లాకురా ఇడిమ్యూర్టో మొదలైనవి రాశాడు .

 డేల్మిరా అగస్టిని -20వ శతాబ్ది కవయిత్రి 24-10-1886 పుట్టి 6-7-1914చనిపోయింది .కవితా సంపుటి ప్రచురించింది .ఎల్ అల్బారో బ్లాంకో ,కా౦ టోస్ డి లా మనానా మొదలైనవి ఆమె రచనలు .

  ఫెలిస్ బెర్తో హెర్నా౦ డేజ్-రచయితా పియానిస్ట్ .కథారచయిత .సినిమాలు తీశారు కధలను .20-10-1902పుట్టి 13-1-1964చనిపోయాడు .పియానోకథలు రాసి ఉత్తేజితులను చేశాడు

 జువాన్ జోరిల్లా డి శాన్ మార్టిన్ –ఎపిక్ పోయేట్ .జాతీయ కవిగా గుర్తింపు పొందాడు 28-12-1855పుట్టి 3-11-1931 మరణించాడు .’’తబారే ‘’అనే జాతీయ కవిత్వం రాశాడు .’’హైం ఆఫ్ ది ట్రీ’’అనే ఇతని  స్పానిష్ కవిత  అనేక లాటిన్ అమెరికన్ దేశాల కవితగా ప్రసిద్ధి చెందింది

  కార్మెన్ పోస్సడాస్-13-8-1953పుట్టి  దిలాస్ట్ రిజార్ట్ ,కివిరచనలద్వారా ప్రసిద్ధమైంది  ఈమె  నవలలను సినిమాలుగా తీశారు

 మారికో రోజెన్ కాఫ్ -30-6-1933లో పుట్టాడు .’’దిలెటర్స్ దట్ నెవర్ కేమ్’’  మీడియోముండో మొదలైన రచనలద్వారా ప్రసిద్ధి చెందాడు .ఇతని ఎల్ రేగ్రేసో డెల్ గ్రాన్ టులెక్ నవల సినిమా తీశారు .తనజైలు జీవితాన్ని ‘’ట్వెల్వ్ యియర్ నైట్ ‘’గా రాశాడు ‘

  ఉరుగ్వే దేశం బీచ్ లైన్ కోస్ట్ గా సుప్రసిద్ధం .కరెన్సీ-పేసో ఉరుగ్వే .అధికారభాష స్పానిష్ .అత్యధిక సంపన్న దేశాలలో ఒకటి .స్థూల జాతీయాదాయం చాలా ఎక్కువ .అసమానత  తక్కువ .పేదరికాన్ని రూపుమాపిన దేశం ఉరుగ్వే .వైన్ ఇండస్ట్రి కి ప్రసిద్ధి .సురక్షిత దేశం .మధ్యతరగతి ప్రజలే 60శాతం ఉంటారు .స్పానిష్ తోపాటు ఇంగ్లిష్ కూడా మాట్లాడుతారు .2017లెక్కల ప్రకారం అక్షరాస్యత శాతం -98.62.యూనివర్సిటి విద్యదాకా ఫ్రీ .ఒకేఒక యూనివర్సిటి ఉన్నది .బడి గంటలు -4నుంచి 7.30గంటలే .క్వాలిటి ఎడ్యుకేషన్ ఇక్కడి ప్రత్యేకత  .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-4-20-ఉయ్యూరు

image.png
image.png
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అమ్మా, అదీ ……. కరోనా

అమ్మా, అదీ
అమ్మా మాకు పెంచుకోటానికి జుట్టిచ్చావ్
కాని’’ అది మాత్రం’’ మమ్మల్ని దువ్వుకోనివ్వటం లేదు
అమ్మా మాకు ఆలోచించటానికి బుర్ర ఇచ్చావ్
కానీ ‘’అదిమాత్రం ‘’ఆలోచి౦చ నివ్వటం లేదు
అమ్మా మాకు తినటానికి నోరిచ్చావ్
కాని’’ అదిమాత్రం ‘’ఇష్టమొచ్చినట్లు తినకుండా నోరు కట్టేస్తోంది
అమ్మా మాకు పని చేసే రెండు చేతులిచ్చావ్
వాటిని మాత్రం ‘’అవి తాకకుండా చప్పట్లకు మాత్రమె అంటోంది
అమ్మామాకు శ్వాస పీల్చటానికి నోరిచ్చావ్
కాని ‘’అదిమాత్రం ‘’దాన్ని నియంత్రిస్తూ ముక్కు మూయ మంటోంది
మూసుక్కూచోమంటో౦ది, ముసుగేసుకో మంటోంది
అమ్మా మాకు పెంచుకోవటానికి గోళ్ళు ఇచ్చావ్
కానీ ‘’అదిమాత్రం ‘’మమ్మల్ని దురదపెడుతున్నా గోక్కోనివ్వటం లేదు
అమ్మా మాకు రెండు కాళ్ళిచ్చావ్ నడవటానికి
కానే ‘’అదిమాత్రం ‘’మమ్మల్ని బజారు గడప తొక్కనివ్వట్లేదు
అమ్మా మాకు ముద్దూ ముచ్చట్లకు మంచి మూతినిచ్చావ్
కానీ ‘’అదిమాత్రం ‘’ముద్దూ గుద్దూ జాంతానై అంటోంది
అమ్మా మాకు ఉద్యోగం పురుషలక్షణ౦గా
దర్జాగా ఆఫీసుకు వెడదామనుకొంటే
కానీ ‘’అదిమాత్రం ‘’కాళ్ళూ చేతులూ కట్టేసి హౌస్ అరెస్ట్ గా ఉండమంటో౦ది
అమ్మా మాకు హాయిగా తిరగటానికి సినిమాలు ,నాటకాలు పార్కులు పబ్బులూ ఇచ్చావ్
కానీ ‘’అదిమాత్రం ‘’ విందులూ వినోదాలు బంద్ గడపదాటితే కాటికే అని కట్టడి చేస్తోంది
అమ్మా మా పని అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుంది
అందుకే అమ్మా నువ్వు మాకు మహా బాగా నచ్చావ్
కానీ ‘’అది మాత్రం ‘’మాకు పరమ కరోనా రాక్షసిగాకనిపించి చస్తోంది .
కేరక్టర్ సినీనటుడు’’ ప్రకాష్ రాజ్’’ కు ‘’సారీ’’తో –
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-4-20-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 36-పరాగ్వేనియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

36-పరాగ్వేనియన్ సాహిత్యం

పరాగ్వే దేశం లో ప్రాచీనకాలం నుంచి గాలి ,వెదురు ఫ్లూట్ లు , గంటలు ,ఈలలు మాత్రమె సంగీత సాధనాలుగా ఉపయోగించారు .మొదటి స్పానిష్  సెటిలర్స్ కాలం లో గిటార్ ,హార్ప్ వంటి సంగీతపరికరాలు వాడారు .వీరి ప్రాచీన సంగీతం పోల్కా .సంగీతరూపకాలు ,జానపద పాటలు.వీటిలోనే వీరిపూర్వ సంస్కృతీ సాహిత్యం కనిపిస్తాయి .20వశతాబ్దిలో లిరిక్ ప్రవేశించి,పూర్వపు హిస్పానిక్ సంప్రదాయానికి భిన్నమైన మార్గం ఏర్పడింది .

  పరాగ్వే మధ్యతరగతి ప్రజలు తమ సంప్రదాయాన్ని మార్చుకోవటానికి ఇష్టపడరు .అర్జెంటీనా ,బ్రేజిల్ సంప్రదాయాలనే కొనసాగించటం వారికిష్టం . గోడపత్రికలే వారికి శరణ్యం. ‘’సేర్వా౦టేజ్ ప్రైజ్ ‘’పొందిన పరాగ్వేనియన్ రచయితా ఆగస్టో రో బోస్టర్స్ చిత్ర౦ఉన్న పోస్టర్ ను అందులో ఆయన గేయాలను లైట్ స్థంభాలకు వేలడ దీసి ,ఆయన గురించి తెలుసుకొనే ప్రచారం చేశారు .లాస్ కాన్గోస్ డీ రో బోస్తోస్ కధానికా సంపుటి సమకాలీన సాహిత్యానికి పనోరమ  లాగా కనిపిస్తుంది .

 పరాగ్వేనియన్ రచయితలలో ముఖ్యులు అగస్టో రోవా బోస్టోస్  -1917-2005,గాబ్రియల్ కసాస్సియ -1907-80,జువాన్ సిల్వనో గొడాయ్-1850-1926,హీరిబ్ కంపోస్ సెర్వేర-1905-1953,రోక్ వల్లెజోస్-1943-2006 మొదలైనవారు .ఈదేశం అత్యంత బీద దేశం .రోమన్ కేధలిక్ మతస్తులు ప్రజలు .35శాతం ప్రజలు దుర్భర దారిద్యం లో మగ్గుతున్నారు .కాని భూభాగం అత్యంత సుందరమైనది .కాని సాహిత్యంలో మంచి సంస్కృతి కనిపిస్తుంది .ఇక్కడ పుస్తకం రాసి ప్రచురించటం,మార్కెట్ చేయటం   బ్రహ్మప్రళయమే అవుతుంది .కనుక ఇక్కడి రచయితలు  తమ రచనలను సంపన్న దక్షిణ అమెరికా దేశాలైన అర్జంటినా ,బ్రెజిల్, మెక్సికో లలో ప్రచురించుకొంటారు .

   ఈదేశం గర్వించే రచయిత అగస్టో రోవా బోస్టోస్- గొప్పనవలాకారుడు .ఆయన రచనలలో ఆ దేశ చరిత్ర సా౦ఘిక సమస్యలు రాశాడు .అతని రాచకీయ భావాల వలన రచనలన్నీ ఆ దేశం లోకాక బయటి దేశాలలో ముద్రించుకోవాల్సి వచ్చింది .ఆయన రచనలలో అత్యంత ప్రాముఖ్యమైనవి –యో ఎల్ సుప్రీమో -1989.ఈయనకే ‘’ప్రీమియో మిగెల్ సేర్వాన్టేజ్’’అనే ప్రిస్టీ జియస్ ప్రైజ్ వచ్చింది .

  గాబ్రియల్ కసస్సియో -ను ‘’ఫాదర్ ఆఫ్ మోడరన్ లిటరేచర్ ‘’అంటారు .ఈయన ‘’యూని వర్సి డాడ్ నేకియోనల్ డీ అసుంసియాన్ ‘’లో లా చదివి  గ్రాడ్యుయేషన్ తర్వాత జర్నలిస్ట్ అయ్యాడు .స్థానికపత్రికలు చాలా వాటిలో రాస్తూ తర్వాత ఫిక్షన్ రచయిత అయ్యాడు.ఇతని ప్రఖ్యాత నవలలు హోమ్బ్రెస్ ముజేరాస్ ఫాంటోకస్ -1930,లా బబోసా -1952,లా ల్లాగా -1963,లాస్ హుర్టాస్-1981.చివరిది మరణానంతర ప్రచురణ .కొంతకవిత్వం నాటకాలు కూడా రాసాడు .

 జుడాన్ సిల్వనో గోడాయ్-ఈ దేశపు1800 యుద్ధానంతర రాజకీయ నాయకులలో ముఖ్యుడు .యవ్వనం లో అర్జెంటీనా లో చదివి పెరాగ్వేలో ప్రవేశించాడు .దేశ పునర్నిర్మాణానికి ఎన లేని సేవ చేశాడు .రాజకీయంగా  ప్రత్యర్ధి హత్యకు కారణం అయ్యాడనే అవినీతి మరకను అంటించుకొని దేశం నుంచి బహిష్కరి౦ప బడ్డాడు.నియంతృత్వ ప్రభుత్వ పోకడలను తీవ్రంగా విమర్శించేవాడు .అనేక రచనలు చేశాడు అందులో –మొనోగ్రాఫియాస్ హిస్టారికాస్  ,లా మురటే డెల్మారిస్కల్ లోపెజ్

 మరో రచయిత- హెరిబ్ కంపోస్ సెర్వేరా- పెరుగ్వియన్ కవులలో ప్రధమ స్థానం పొందినవాడు .వామపక్షభావ ప్రేరేపితుడు .నిర్మొహమాటంగా ప్రభుత్వ దమననీతి, అవినీతులను విమర్శించేవాడు .కనుక తానేస్వయంగా దేశం దాటి బయటికి ఒకటి రెండుసార్లు వెళ్ళాడు .ఒకే ఒక కవితా సంపుటి –సెనిజా రెమిడియా-ను 1950లో ప్రచురించాడు .మరనణా నంతరం రెండవ కవితా సంపుటి –హోమ్బ్రే సీక్రెటో ప్రచురితమైంది .

  రోక్ వల్లెజోస్-ఫోరెన్సిక్ సర్జన్ గా ‘’ హైకోర్ట్ ఆఫ్ జస్టిస్’’లో  జీవితం ప్రారంభించి ,రచయితగా, కవిగా స్థిరపడ్డాడు .సాంఘిక రాజకీయాలపై నిష్పాక్ష పాతంగా రాయటానికి ఏర్పడిన ‘’60 జనరేషన్ ‘’గ్రూప్ లో ముఖ్యుడు .అతని ప్రముఖ రచనలు –లాస్ ఆర్కాన్జేలస్ ఎబ్రియోస్-1964,టీమ్పో బలాడియో-1988.

  పరాగ్వే చిన్న బీద దేశమైనా ఇప్పటికీ సాహిత్యాన్ని సృష్టిస్తూనే ఉండటం గమనార్హం .అర్జెంటీనా ,బ్రెజిల్ బోలీవియా  ల మధ్య ఉంటుంది .గడ్డి పరచుకొన్న చిత్తడి నేలలమయం .రాజధాని పరాగ్వే రివర్ ఒడ్డునున్న అసుంసియాన్ .ఈ దేశాన్ని ‘’హార్ట్ ఆఫ్ సౌత్ అమెరికా ‘’అనీ ‘’లాండ్ ఆఫ్ వాటర్ ‘’అనీ అంటారు ,నావికా దేశం .ప్రపంచంలో చాలాప్రాంతాలు సముద్రానికి చేరుకోవటానికి దూరంగా ఉంటె ఈ దేశం ‘’లార్జెస్ట్ నావెల్ పవర్ ‘’గా ప్రసిద్ధి .నేరాలు ఘోరాలు హి౦సాదౌర్జన్యాలు ,దొంగతనాలు ,మనీ లాండరింగ్ ,అవినీతి పోలీసు వ్యవస్థ ఈ దేశం పాపాలు,శాపాలు  .తూర్పున తడిగాలి ,పడమట పొడిగాలి ఇక్కడి ప్రత్యేకత.ఇక్కడి భాషలు- స్పానిష్ ,గువరాని .ఇవే అధికారభాషలుకూడా.ప్రక్క దేశాలతో నిరంతరం యుద్ధాలు చేయటం వల్ల దేశ భూభాగాన్నే కాక ,మగవారినీ చాలామందిని పోగొట్టుకొన్న దేశం .1930లో బోలీవియాతో జరిగిన చాకో వార్ లో  గెలిచి మళ్ళీ భూభాగాన్ని రాబట్టుకోన్నది  .2016లెక్కలప్రకారం అక్షరాస్యత శాతం -94.6.

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 35-గయనీస్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

35-గయనీస్ సాహిత్యం

గయాన దేశపు సాహిత్యమంతా దాదాపు ఇంగ్లిష్ భాషలో వ్రాయబడిందే .ఇక్కడి రచయితలంతా ఇతర దేశాలకు వలసపోయారు .సర్ వాల్టర్ రాలీ 16 వశతాబ్దిలో రాసిన ‘’ది డిస్కవరీ ఆఫ్ దిలార్జ్ రిచ్ అండ్ బ్యూటిఫుల్ ఎంపైర్ ఆఫ్ గయానా ‘’అనేది ఆదేశ సాహిత్యం లో మొట్టమొదటిదిగా భావిస్తారు .ఈ దేశానికిగ్రేట్  గోల్డెన్ సిటీలు ఐన మనోవా ,ఏమర్నా ,ఆరోమయ ,మరియు ఇతర దేశాలతో ఉన్న సంబంధాలను తెలియ జేసే రచన అది .తొలితరం గయనీస్ రచయిత ఎడ్గార్ మిటిహోల్జర్,’’కోరంటైన్ థండర్’’ను 1941లో రాశాడు .ఇతని రచనలలో అక్కడి జాతులమధ్య సంబంధాలు ముఖ్యంగా యూరోపియన్ నాన్ యూరోపియన్ గయనీయుల మధ్య విభేదాలను వివరించాడు .

  ‘’టు సర్ విత్ లవ్’’నవలా రచయిత ఇ.ఆర్ .బ్రేయిత్ వైట్,’’పాలస్ ఆఫ్ ది పీకాక్

‘’రచయిత విల్సన్ హార్రిస్ ప్రసిద్ధులు ఇద్దరి రచనలు 1959,60లలో ప్రచురణ పొందాయి .తర్వాత జాన్ కారీ ,రాయ్ హీత్ లు దిమర్డరర్,ది జార్జి టౌన్ ట్రయాలాజి,దిషాడో బ్రైడ్ రాశారు .మైకేల్ గిల్కెస్ నాటక రచయిత.1980నుండి కొత్తతరం రచయితలు  వచ్చి సాహిత్యాన్ని సంపన్నం చేశారు. వారిలో –బెరైల్ గిల్ రాయ్ ,జాన్ అగార్డ్,గ్రేస్ నికోలస్,సాసనరైన్ పెర్సూద్,తోపాటు ‘’ది టేల్స్ ఆఫ్ గయనీస్ వర్నాక్యులర్ ‘’బార్నీ సింగ్ ఉన్నారు .

    గయనీస్ గ్రేట్ పోయేట్ గా మార్టిన్ కార్టన్ ను పేర్కొంటారు .గొప్ప నాటక రచయితగా మైకేల్ అబ్బెన్ సెట్స్ గుర్తి౦పు పొందాడు .ఇతని నాటకాలు ఇంగ్లాండ్ బుల్లితెర పైకూడా ప్రదర్శితాలు .ఇతని ‘’ఎంపైర్ రోడ్ ‘’ ను   బిబిసి 1978నుంచి 79వరకు ప్రదర్శించింది .విన్సెంట్ రోత్ రెండుభాగాలుగారాసిన జ్ఞాపకాలు –ఎ లైఫ్ ఇన్ గయానా (య౦గ్ మాన్స్ జర్నీ ),లేటర్ ఇయర్స్ గా ముద్రించాడు .ఇటీవలికాలం లో పాలిన్ మెల్విల్లీ ‘’ది వెంట్రి లాక్విస్ట్స్ టేల్’’,ది మైగ్రేషన్ ఆఫ్ ఘోస్ట్స్ అనే ఫిక్షన్ రాశాడు .ఊన్యా కె౦పడూ1998లో బక్స్టన్ స్పైస్ ,టైడ్ రన్నింగ్ రాస్తే ,షరోన్ మాస్-మారేజియబుల్ ఏజ్ 1999లో  పీకాక్ డాన్సింగ్ 2001లో ,ది స్పీచ్ ఆఫ్ ఏంజెల్స్ 2003లో రాసి ప్రచురించాడు .

అందరిని ప్రభావితం చేసే మేధావి రచయిత  వాల్టర్ రోడ్నీ1972లో ‘’హౌ యూరప్ అండర్ డెవలప్డ్ ఆఫ్రికా ‘’రాయటమే కాక గొప్పయాత్రా సాహిత్యాన్నీ సృష్టించాడు .అతని ‘’పాన్ ఆఫ్రికనిజం ‘’ అనే విజన్ గొప్పది .అధోజగత్ సహోదరుల పక్షాన్ని కాపుకాసిన రచయితకూడా .1974లో గయానాకు తిరిగి వచ్చి ప్రతిపక్ష ఉద్యమానికి ఊపిరులూదాడు  .దురదృష్టవశాత్తు ఈ మహానుభావుడిని 1980లో హత్య చేశారు .

  1987గయానా ప్రెసిడెంట్ డెస్మాండ్ హొటే’’గయనా ప్రైజ్ ఫర్ లిటరేచర్ ‘’ఏర్పరచగా  ,ఫిక్షన్ నాన్ ఫిక్షన్ కవిత్వం నాటకం లో ప్రతిభావంతులైన రచయితలను గుర్తించి అందజేస్తున్నారు. ఈ ప్రిస్టీజియస్ పురస్కారం పొందినవారిలో –విల్సన్ హార్రిస్ ,ఫ్రెడ్ డిఅగుయర్,డేవిడ్ డెబి డీన్,గోకర్ణం సుఖదేవ్ ,పాలిన్ మెల్విల్లీ ,ఇయాన్ మాక్ డొనాల్డ్,సిరిల్ డెబి డీన్,రాల్ జాన్సన్ లు ఉన్నారు .పోయెట్రిలో ప్రైజ్ విన్నర్స్ –ఫ్రెడ్ డిఆగురిల్ గ్రేస్ నికోలస్ ,ఇయాన్ మాక్ డోనాల్డ్ ఉన్నారు మాజిక్ రియలిజం ఇక్కడ  వేరూనింది

 గయానా ప్రైజ్ ఫర్ ‘’కరేబియన్ లిటరేచర్ ‘’ కూడా ఏర్పరచి ఫిక్షన్ పోయెట్రి డ్రామాలకు అందిస్తున్నారు .ఈ ప్రైజులు గర్వకారణంగా చిరస్మరణీయంగా ఉన్నాయని అందరూ భావిస్తూ అభిన౦దిస్తున్నారు  .ఇక్కడి కళా సంస్కృతుల అభి వృద్ధికి ఈ ప్రైజులు అత్యంత ప్రోత్సాహకంగా ఉన్నాయి .ఇక్కడి అరవాక్ ,కారిబ్ క్రాఫ్ట్ లకు విపరీతమైన క్రేజ్ ఉంది.

 కరేబియన్ సముద్రం లో  బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ లో గయానా ఒక ఐలాండ్.ఇక్కడి ‘’వైట్ పౌడర్డ్ సాండ్ బీచ్ ‘’ లు యాత్రాస్తలాలు .సముద్రాలు కొండలు నదులు,లోయలు ఇక్కడి అందాలకు ప్రతీకలు .గయానాలో క్రిస్టియానిటి తోపాటు హిందూఇజం కూడా ఉండటం విశేషం .25శాతంహిండువులు ,7శాతం ముస్లిం లు ఉంటారు .సెంట్రల్ జార్జి టౌన్ లో ‘’వైదిక్ మందిరం ‘’ఉన్నది .శివ విష్ణువులను ఆరాధిస్తారు .హిందూ పండగలు ఉత్సాహంగా జరుపుకొంటారు .ఆర్యసమాజం ఇక్కడ ఉన్నది .సంస్కరణలు తెచ్చింది .ఇక్కడి ముస్లిం లు అహ్మదీయ మతానికి చెందినవారు .1970 నుంచి హిందూ ముస్లిం పండుగలకు ప్రభుత్వం సెలవులు అంటే పబ్లిక్ హాలిడేస్ ప్రకటించింది .6వ ఏడాది నుంచి 16వరకు ఇక్కడ ఫ్రీ కంపల్సరి విద్య అమలులో ఉంది .కా౦ప్ర హెన్సివ్ విద్యకు అత్యధిక శ్రద్ధ ప్రభుత్వం తీసుకొంటోంది .

ఒకప్పుడు అత్య౦త పేదదేశమైన   గయాన ఇప్పుడు అభి వృద్ధి చెంది జిడిపి రేటు 2025కు 300నుంచి 1000 శాతంగా ఉంటుందని అంచనావేశారు .ఆయిల్ నిక్షేపాలు ఈ దేశానికి గొప్పవరం . .త్వరలోనే ప్రపంచం లో అత్యంత సంపన్న దేశం అవుతుందని ఊహ .

  1831వరకు డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ కాలనీల ప్రభుత్వాలతో అణచి వేయబడిన దేశం ,1966స్వాతంత్ర్యం పొందింది .కాని ఆఫ్రికన్ లు ,ఇండియన్ లవలన ఎక్కువ టెన్షన్ కు లోనైంది .దీనితో రాజకీయ అస్తిరత్వం తోపాటు విపరీతమైన కరప్షన్ కోరలు సాచి అభివృద్ధికి బ్రేకులు వేశాయి .2015లో ఆర్మీ జనరల్ డేవిడ్ గ్రాన్జర్ ఎన్నికలలో గెలిచి అవినీతి, జాతుల వైరాన్ని అణచేశాడు .జాతీయ సమైక్యత సాధించాడు .తర్వాతమాత్రమే ఆర్ధికంగా వృద్ధిచెందింది .అన్ని వనరులున్నా అల్లుడినోట్లో శని లాగా పేదరికం లో కొట్టుమిట్టాడింది .ఇప్పుడిప్పుడే  నవ శకం వస్తోంది .శుభం భూయాత్ .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

56 ఏళ్ళ క్రితం శిష్యురాలు ,,నన్ను మామయ్యా అని ఆత్మీయంగాపిలిచే భ్రమరాంబ ఫోన్

56 ఏళ్ళ క్రితం శిష్యురాలు ,,నన్ను మామయ్యా అని ఆత్మీయంగాపిలిచే భ్రమరాంబ ఫోన్

ఉయ్యూరు హైస్కూల్ లోనూ, ఇంటిదగ్గర ప్రయివేట్ లోనూ నాకు శిష్యు రాలు ,నన్ను ఆత్మీయంగా మామయ్యా అని పిలిచే ,గోసుకోండ రామచంద్రుడు రుక్మిణమ్మల పెద్దకూతురు భ్రమరాంబ ఇవాళ ఉదయం 8-30కి ఫోన్ చేసి ”మామయ్యా నేనెవరో కనుక్కో ”అంది గుర్తుపట్టలేక పోయాను చాలా ఏళ్ళు అయ్యాయి కనుక .నెమ్మదిగా క్లూస్ ఇచ్చింది .దాన్నిబట్టి ”అమ్మా భ్రమరాంబా ”అనగానే పట్టరాని సంతోష0 తో ”నీతో మాట్లాడాలనిపించింది మామయ్యా .అందుకు ఫోన్ చేశాను .”అన్నది ”చాలా సంతోషం అమ్మా మీ అత్తయ్య తో మాట్లాడు .”అని చెప్పి సెల్ ఇచ్చా నాకు పనులు ఉండటం వలన .వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక ”అత్తయ్యా !మామయ్యతో ఎప్పుడు మాట్లాడటం కుదురుతుంది ”అని అడిగిందట .’ఉదయం 9నుంచి 10లోపు మధ్యాహ్నం 12 తర్వాత సాయంత్రం నాలుగు తర్వాత ”అని చెప్పింది
మళ్ళీ ఫోన్ చేస్తుందేమోఅని ఎదురు చూసి రాత్రి 7 కు నేనే ఫోన్ చేశా వాళ్ళఅబ్బాయి అనుకుంటా లిఫ్ట్ చేసి వాళ్ళ అమ్మకిస్తే మాట్లాడింది .గలగలా మాట్లాడటం ఆ అమ్మాయికి అలవాటు .పాతఃవిషయాలన్నీ గుర్తు చేసుకొన్నది ట్యూషన్ విషయాలు నేను ఎప్పుడూ వేళాకోళం ఆడే సంగతులు , నేను సంగీతం సాధన చేసే విషయం నవ్వుతూ గడగడా చెప్పింది .కల్మషం లేని పిల్ల . వాళ్ళ ఆయన టీచర్ గా వినుకొండలో పని చేసేవారు చనిపోయి 4 ఏళ్ళు అయిందని చెప్పింది బాధపడ్డాం .ఇద్దరు మగపిల్లలు ఓక ఆడపిల్ల ట .ఆ అమ్మాయి ఒకే ఒక్క తమ్ముడువాసు ఉయ్యూరులోనే ఉంటాడు వాళ్ళ ఇంటికి వస్తే మా ఇంటికీ వచ్చి వెడుతుంది ఎప్పుడూ . దాదాపు పదేళ్లు అయి ఉంటుంది చూసి .వాళ్ళనాన్న అమ్మా కూడా చనిపోయారు ఉయ్యూరులో .వాళ్ళ అమ్మ రుక్మిణమ్మ నన్ను ”తమ్ముడూ !”అని ఎంతో ప్రేమగా పిలిచేది .భర్త కెసీపి స్టోర్స్ లో పని చేసి రిటైరయి నీలగిరి కాఫీ స్టోర్స్ పెట్టి కాలక్షేపం చేశాడు వాళ్ళబ్బాయి అదే పనిలో ఉండేవాడు స్వంత ఇల్లు ఏర్పాటు చేసుకొని ఆడపిల్లల పెళ్లిళ్లు చేశాడు . ఇవన్నీ గుర్తుకొచ్చాయి .
భ్రమరాంబను ”నా సెల్ నంబర్ నీకుయెలా తెలుసు ?”అని అడిగా ..”మామయ్యా రోజూ పేస్ బుక్ లో నీ పుస్తక పరిచయం లైవ్ చూస్తున్నాను .నీతో మాట్లాడాలని పించి అందులో నీ సెల్ నంబర్ ఉంటె పొద్దున్న మాట్లాడా .నాకు ఎంతో సంతోషంగా ఉంది .మా వాళ్లందరికీ ”మా మామయ్యా మాట్లాడుతున్నాడు చూడండి చెప్పి వాళ్ళూచూసేట్లు చేస్తున్నాను .బాగా చెబుతున్నావు మామయ్యా .చాలా బాగా నచ్చింది నాకూ మా పిల్లలకు .ఎప్పుడైనా అటువైపువస్తే వినుకొండ ర0డి నువ్వూ అత్తయ్యా కూడా ”అన్నది పిచ్చ ఆప్యాయతతో .ఇలా ఇదివరకు చాలాసార్లు రమ్మంది కానీ .ఎప్పుడూ వెళ్ళలేదు మూడు సార్లు త్రిపురాంతకం వెళ్లినా భ్రమరాంబ గుర్తుకు రాలేదు .డిసెంబర్ లో వెళ్లాం .ఆమె సెల్ నంబర్ కూడా మా దగ్గరలేకపోవటం అసలే అప్పటికే రాత్రి సుమారు 7అవటం వలన కుదరలేదు . ఈసారి అటువేస్తే తప్పక కుండా వస్తామని ఆమె ఉయ్యూరు వస్తే కనిపించి వెళ్ళమని చెప్పాం ఇద్దరం .సరే నంది .ఇంతటి ఆత్మీయతా అభిమానం ఉన్నవాళ్లు అరుదుగా ఉంటారు ఆ అరుదైన మేనకోడలు మా భ్రమరాంబ ..
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-4-20 -ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 34-వెనిజులియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

34-వెనిజులియన్ సాహిత్యం

ఈ దేశ సాహిత్యం ప్రీ హిస్పానిక్ కాలం లోని మిత్స్ కు సంబంధమున్న మౌఖిక సాహిత్యమే .ఇప్పటికీ వాటిని ఇతర లాటిన్ అమెరికన్ దేశాలలో లాగా వేనిజులాకథలు గాథలుగానే చెప్పుకొంటారు .స్పానిష్ దండయాత్ర వారి సంస్కృతీ ,సాహిత్యాలపై పెద్ద ప్రభావం చూపింది .స్పానిష్ కాలనైజర్లు రాసిన మొదటి వ్రాత ప్రతి నే వేనేజులియన్ సాహిత్యంగా పరిగణిస్తారు .ఇందులో క్రానికల్స్ ,ఉత్తరాలు వగైరా ఉన్నాయి .

వెనెజులా ప్రధమ రచయిత ఆండ్రెస్ బెల్లో.19వ శతాబ్దిలోకన్జర్వేటివ్ లకు లిబరల్స్ కు మధ్యజరిగిన అనేక యుద్ధాలతర్వాత  ప్రత్యెక దేశం గా ఏర్పడినప్పటినుంచి వారి సాహిత్య ఆవిర్భావం ప్రారంభమైంది  .1881లో వెనెజులా హీరోయికా పుస్తకాన్ని ఎడ్యురార్డా బ్లాంకో ఆదేశ స్వాతంత్ర్య సమరం ,స్వాతంత్ర్య సిద్ధి పై రాశాడు .

పెట్రోలియం ఇచ్చిన బూమ్ వలన వెనెజులా దేశం లో 20వ శతాబ్దిలో ఆధునికత నగరీకరణం ఏర్పడి ఆర్ధికంగా దేశం అభి వృద్ధి చెందింది .అప్పటి గొప్ప రచయితలలో టేరేసా డి లా పార్రా ,రోములో గాల్గోస్ ,ఆర్తురోఉస్లర్ పీట్రి,సాల్వడార్ గార్మెండియా ఉన్నారు .గాల్లిగోస్ 1929లో రాసిన ‘’డోనా బార్బరా ‘’నవల ‘’అత్యధిక ప్రచారం ఉన్న లాటిన్ అమెరికన్ నవలగా 1974లో గుర్తింపు పొందింది .1948ప్రభుత్వం ‘’నేషనల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ‘’ను ఏర్పాటు చేయగా ఉల్సార్ పెట్రి ఒక్కరు మాత్రమె యాభై ఏళ్ళకాలం లో రెండు సార్లు ఆ ప్రైజ్ ను అందుకున్న ఘన రచయితగా పేరు పొందాడు .

రఫెల్ కార్డనాస్,యూజినో మోంటేజోలు ఐదారు 20వ శతాబ్ద౦ నుంచి 21వ శతాబ్ది ప్రారంభం వరకు  ప్రముఖ కవులు .మరికొందరు వెనెజులా రచయితలు –ఆల్ఫ్రెడో అర్మాస్ అల్ఫోన్జో ,రాఫెల్ అర్రాజ్ లుక్కా ,రాఫెల్ మేరియా బరల్ట్ ,రోములో బెటన్ కోర్ట్ ,కార్లోస్ బ్రాంట్ ,అలీసియా ఫెల్లిచ్ ,ఆస్కార్ ఏన్స్ ,హంబర్టో టేజేరా.వగైరాలు చాలామ౦ది ఉన్నారు .

దక్షిణ అమెరికాలో ఉత్తరాన వినేజులాదేశం ఉన్నది .ప్రకృతి సౌందర్యానికి పట్టుగొమ్మ .కరోబియన్ తీర ప్రాంతాలలో ట్రాపికల్ రిసార్ట్ ఐలాండ్స్ ఉన్నాయి .రాజధాని కారకాస్ .రాజకీయ అవినీతి ,ఆహార,ఆరోగ్య  సమస్య ,కంపెనీలమూత ,నిరుద్యోగం ,ఉత్పత్తి క్షీణత ,మానవహక్కుల అతిక్రమణ ,అధికార దాహం అక్కడ సర్వ సాధారణం .ఆర్ధిక స్థితి కట్టడి చేయలేని నాయకత్వం ,ఆయిల్ పైనే అన్నిటికీ ఆధారపడటం వలన వాళ్ళ సమస్యలు పెరిగేవేకాని తగ్గేవికావు .అది సురక్షిత దేశం కాదు .ప్రపంచ ఆయిల్ రిజర్వ్ అత్యధికంగా ఉన్న దేశం వెనెజుల .ఒక లక్షమంది ముస్లిం లు జనాభాలో 4శాతంగా ఉన్నారు .స్పానిష్ ఇక్కడి అధికార భాష .వయ్యు,పియరోరా  వారో ,మొదలైన భాషలుకూడా ప్రజలు మాట్లాడుతారు .దక్షిణ అమెరికాకు స్పానిష్ కాలనీ ప్రభుత్వం నుంచి విముక్తికలిగించిన వీరుడు సైమన్ బోలివర్ వేనేజులాలోనే పుట్టాడు .4మాత్రమె పబ్లిక్ హాలిడేలు.కుటుంబాలు అత్యంత సఖ్యతతో ఉండటం ప్రత్యేకత .వెనెజుల ఆతిధ్యం మై మరపిస్తుంది .మత స్వేచ్చ ఉన్నది .మెజార్టీ ప్రజలు రోమన్ కేధలిక్కులు.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-4-20-ఉయ్యూరు

 

 

 

 

 

 


 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 33-పెరూ వియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

33-పెరూ వియన్ సాహిత్యం

ఇంకాన్ సామ్రాజ్యకాలం వచ్చిన కళ  ఎవరికీ తెలియదు .మధ్య ఆ౦డీనియన్ కాలం లో ఈనాడు పిలువబడే పేరు నికారుగ్వా ,బొలీవియా ,చిలి దేశాలలో వచ్చిన సాహిత్యం మాత్రం మౌఖిక వ్యాప్తిచెందింది .ఈకాల సాహిత్యం లో క్వేచువా భాషలో వచ్చిన గేయాత్మక  ‘’హరావిక్ కవిత్వం ‘’,రెండవది పురాణ కవిత్వమైన ‘’హేల్లిస్ కవిత్వం ‘’.ఈ కవిత్వం లో  ఆనాటి నిత్యకృత్య వ్యవహారాలను ‘’హరావేక్ ‘’అనేకవి గానం చేస్తే తరతరాలకు వ్యాపించాయి .జానపద గాధలు ఆండీయన్ ప్రపంచ పుట్టుక,గిట్టుక ,వ్యాప్తి  గురించి చెప్పేవిగా ఉండేవి .ఇవన్నీ ఈనాటికీ సజీవంగా ఉండటానికి ‘’ఇంకా గార్సిలసో ‘’వంటి మేగజైన్లె ముఖ్యకారణం .ఇవే క్వేచువా కవిత్వం ,గుయామన్ పోమా డిఆయల్సా మైదాలజి కవిత్వం లను వెతికి వెలుగు లోకి తెచ్చాయి .వీటిని కవిత్వంగా గుర్తి౦చ టానికి చాలాకాలం పట్టింది .1905లో జోస్ డి లా ఆగేరో ప్రకటించిన దానిప్రకారం స్వతంత్ర పెరు సాహిత్యం ప్రి హిస్పానిక్ సంప్రదాయానికి చెందింది కనుక పెద్దగా లెక్కలోకి రాదనీ ,కొత్తదనం లేనిదని అన్నాడు .ఆతర్వాత 20వ శతాబ్దం లో విశ్లేషకులు అతని భావాలను తప్పుపట్టి ప్రి హిస్పానిక్ సాహిత్య విలువలను గుర్తించి మహోపకారం చేశారు .ప్రి హిస్పానిక్ సాహిత్య మిత్స్,లెజెండ్స్ లో కొన్ని ముఖ్యమైన వాటిని తెలుసుకొందాం –అడాల్ఫో వీన్ రిచ్-తర్మాప్ పచ్చా హువారే ,జార్జి బసాడ్రే-లా లిటరియా ఇన్కా,జోస్ మేరియా ఆర్గెడస్  -హోరాచి వ్రాతప్రతిని చేసిన అనువాదం ,మార్టిన్ లీన్ హార్డ్ –లా వోజ్ య్సు హోఎల్లా,ఆంటోనియో కార్లేజో పోలార్ –ఎస్క్రిబిర్ ఎన్ ఎల్ ఎయిర్ ,ఎడ్మ౦డో బెండజు-లిటరేచర్ క్వేచువా .

  పెరు దేశాన్ని స్పెయిన్ దేశం దాడి చేసి ఆక్రమించినప్పుడు కొంత సాహిత్య సృజన జరిగింది 1532 నవంబర్ 15నుంచి ఈకాలం కజామార్కా లో ప్రారంభం .అప్పుడే చివరి ఇన్కా రాజు అలాహులాల్పా ను లోబరచుకొని ఇన్కా సామ్రాజ్యాన్ని సర్వ నాశనం చేసింది  స్పెయిన్ .ఈకాలపు సాహిత్యం ప్రకృతి పైనే ఎక్కువగా వచ్చింది .క్రానికల్స్ లో ఇవి భద్రపరచారు .ఫ్రాన్సిస్కో కార్రిలియో అనే క్రానికలర్  ఈకాలపు క్రానికల్స్ ను గ్రూపులుగా విభజించాడు .మొదటి గ్రూపు క్రానికల్స్ విజయ విశేషాలున్నవి .వీటిని సైనికులు రచయితలే ఎక్కువగా రాశారు .ఇవి 1532-35కాలానివి .వీరి ఉద్దేశ్యం ప్రజలను నాగరికం చేయటం ,యదార్ధ విశ్వాసం కల్పించటం .అజ్ఞాత వ్యక్తులరచనలుకూడా ఉన్నాయి. తర్వాత వాట్ని ధ్వంసం చేశారు .ఫ్రాన్సిస్కో జేరేజ్ ప్రభుత్వ అధికార క్రానికలర్ ‘’దినెరేటివ్ ఆఫ్ ది కాంక్వెస్ట్ ఆఫ్ పెరు ‘’క్రానికల్ రాశాడు .దీన్ని న్యు కాస్టిల్లీ అంటారు .ఫ్రే గాస్పార్ డికార్వజార్ అనే స్పానిక్ క్రానికలర్ అమెజాన్ నదుల పుట్టుపూర్వోత్తరాలపై విస్తృతంగా1541-42లోరాశాడు .ఇవికాక ఇంకా ముగ్గురు -మిగుల్ డి ఎస్టిల్లె,క్రిస్తోబార్ డిమోలినా ,పెడ్రో సీజ్ డి లేనాన్ లు పెరువార్తలు ,అక్కడి ప్రజలు ,ఆచార వ్యవహారాలగురించి చాలా వివరాలతో రాశారు .అజ్ఞాత రచయితల క్రానికల్స్ లో మేస్టిజో క్రానికల్స్ ,ఇన్కారాజుల రక్తపిపాస,ఆన్డియన్ ప్రపంచ వినాశనం  మొదలైన విషయాలను వివరించారు .గువమాన్ పోమా 1179పేజీల తో స్పెయిన్ రాజు 3వ ఫిలిప్ కు ఒక అర్జీ పంపి  ఆదర్శ ప్రపంచం గురించి రాసి పంపాడు .అధికారుల ఆగడాలు ప్రీస్ట్ ల దౌర్జన్యాలు తెలియజేస్తూ కాలనీ ప్రభుత్వ దుశ్చర్యలను ఎండ గట్టాడు .

  ఆధునిక సాహిత్యం –పెట్రార్క్ రాజును అనుకరించటం గ్రీకు రోమన్ మైథాలజీల విజ్రు౦భణ,పై ఏవగింపు పై సాహిత్య సృజన జరిగింది .లిమాలో అకాడేమియా అంటార్కిట సాహిత్య గ్రూప్ 16,17శతాబ్దాలలో ఏర్పడింది . ఈ అకాడేమియాలో ఫ్రాన్సిస్కో డిఫెగువేరా,డియాగోమెక్సియ డి ఫెర్మా౦గిల్ ఉన్నారు. అజ్ఞాతకవులను ‘’క్లారిండా’’అనీ ,అమరిల్లిస్ అనీ అన్నారు.తర్వాత నియోక్లాసిక్ కవులైన మాన్యూల్ ఎస్సేన్సియో సేగురా ,ఫెలిపే ఫార్డోయ్ అలియాగా మొదలైన వారు మంచికవిత్వం 19వ శతాబ్ది చివరివరకు రాశారు .19వ శతాబ్దిలో రోమా౦టిజం వచ్చి,కార్లోస్ ఆగస్టోసాల్వేర్రి ,జోస్ అర్నాల్డోమార్క్వెజ్ లు ఈ భావంతో గొప్పకవిత్వం రాశారు .వర్ణనాత్మక వచనరచన కూడా ప్రారంభమైంది .మాన్యూల్ అసేన్సియో సేగుర ,రికార్డోపాలమా మొదలైనవారు ఈ ప్రక్రియలో నిష్ణాతులు .ఆధునికకవులు – మాన్యూల్ గొంజేజ్ ప్రాడా,జోస్ సాంటోజ్ కోకానో .మహిళలుమాత్రం రియలిజం ,నేచురలిజం మార్గం పట్టారు .వీరిలో గువానా మాన్యులా గొర్రెట్టి,తెరెసా గొంజాలెజ్ డిఫాన్నింగ్,క్లోరిండామట్తో డిటర్నర్,మెర్సిడెస్కాబెల్లెరో డి కార్బో నేరా ఉన్నారు .

  ఫసిఫిక్ యుద్ధ సంక్షోభం తర్వాత పెరులో మోడర్నిజం ప్రవేశించింది. జోస్ సాన్తోజ్ కోకానో,జోస్ మేరియా ఈగురెన్ దీనిలో ప్రసిద్ధులు .నవలలు నాన్ ఫిక్షన్ కూడా రాశారు .ప్రముఖ సోషలిస్ట్ ఎస్సెయిస్ట్ జోస్ కార్లోస్ మారియాటేగు అవంట్ గార్డె ఉద్యమకారుడు .చిన్న చిన్న గ్రూపులు కూడా వచ్చాయి .1950లో అర్బన్ రియలిజం వచ్చింది .జులియో రేమాన్ రేబెయ్రో ,నాటక రచయితసెబాస్టియన్ సల్జార్ బాండి దీనిలో ముఖ్యులు.రియలిజం లో మేరియో వర్గాస్ ల్లోసా ప్రసిద్ధుడు .నారేటివ్ టెక్నిక్లో ప్రసిద్ధుడు ఆల్ఫ్రెడోబ్రిస్ ఈకేంక్ .కవిత్వం లో సుప్రసిద్ధులు –ఎమిల్లో అడాల్ఫో వెస్ట్ ఫాలెన్ ,జార్జి ఎ డ్యు ర్డోఎలేల్సన్ కార్లోస్ జర్మన్ బెల్లి ,కార్మిన్ ఆలీ .

  సమకాలీన రచయితలలో జైంబెయ్లి ముఖ్యుడు అతని ‘’టెల్ నో వన్’’నవల ప్రఖ్యాతమై సినిమాగా తీశారు .యువ రచయితలలో  ఫెర్నాండో ఇవాస్కి ,ఇవాన్ ధే,ఆస్కార్ మాల్కాకార్లోస్ యుషి మిటోవగైరా ఉన్నారు .బాలసాహిత్యాన్ని ఫ్రాన్సిస్కో ఇజ్క్వేర్డోరియాస్ ,,కారియోలా కార్వల్లో డినునేజ్ వగగైరాలు  రాశారు .బాలసాహిత్యం లో పరిశోధనలు చేసిన వారూ ఉన్నారు .వీరిలో మేరియా రోస్టోవిస్కీ ప్రముఖుడు .పెరూవియన్ ఫేబుల్స్ ను అనలైజ్ చేసినవారూ ఉన్నారు .

  దక్షిణ అమెరికా లో పెరు దేశం  అమెజాన్ రైన్ ఫారెస్ట్ ప్రాంతం లో ఉన్నది .ఆండీస్ ప  ర్వతాలు ఇక్కడ ప్రసిద్ధి ,ఇక్కడి మచ్చు చుచ్చు ప్రాంతం ,ఇన్కాలోయ ,మొదలైనవి యాత్రాస్తలాలు .కరెన్సీపేరు’’ సోల్’’.ప్రపంచంలో అత్యధిక ధనిక దేశం పెరు.స్పానిష్ క్వేచ్చు భాషలు ప్రభుత్వ భాషలు .ఆన్డిస్ పర్వత తూర్పుభాగాన అనేక భాషలు మాట్లాడుతారు .వీరిది రోమన్ కేధలిక్ మతం .ఇక్కడి అక్షరాస్యత శాతం  2007 లెక్కలప్రకారం 92.9  .సెకండరీ స్థాయి వరకు విద్య కంపల్సరి .కొత్త ప్రపంచంలో అత్యున్నత విద్యకు పెరు పేరెన్నికగన్నది.

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కరోనా కు ‘’ కరోనా’’ చెప్పు

కరోనా కు ‘’ కరోనా’’ చెప్పు

కరోనా ను ‘’కరోనా ‘’చెప్పుతో

ముట్టుకోకుండా కొట్టి తరిమేద్దాం

ఊహాన్ లో పుట్టిన మహమ్మారిని

వ్యూహాత్మకంగా ఊర్లనుంచి గెంటేద్దాం

కోవిద్ జబ్బును  జబ్బ చరచి

గోవిందా అనేట్లు మట్టిలో పూడుద్దాం

సబ్సిడీలతో జీతాలతో బతికే మనకు

 అడవి మనుషుల బాధలేం తెలుసు

 వైద్య౦ కోసం గర్భిణీలను ‘

ముసలీ ముతకాను మంచాలపై

మైళ్ళకు మైళ్ళు మోసుకు వెళ్ళే వారు

తిన్నారో పస్తున్నారో మనకు తెలుసా ?

మన ప్రభుత్వాలకు కళ్ళున్నా చూస్తున్నాయా ?

చెవులున్నా వినిపిస్తున్నాయా ?

తిండి దొరక్క అడవి అక్కలు

‘’పామోలివ్’’ గుత్తుల్ని కోసుకొని

ఆబగా తింటూ ఆకలి తీర్చుకొంటు౦టే

మనం ఇళ్ళల్లో దీపాలు వెలిగిస్తూ

బయటికొచ్చి చప్పట్లు చరుస్తూ

ఓ పోయిందే –ఇట్స్ గాన్, పోయిచ్చే

అని జబ్బలు చరుస్తున్నాం .

అన్నం వండుకోలేని, తినని,ఎప్పుడూ

బయటికి రాని  రాలేని మనుషులను

గుర్తించి ఇళ్ళకు వెళ్లి ఉదార హృదయాలు

ఆహార పొట్లాలు అందించి మా ఊళ్ళో

అదుకొంటు౦టే  ఫోటోలు తీసి పేపర్లలో వేయరు

కాని అధికారులు చేసే గోరంత

సాయానికి కొండంత ప్రచారం చేసి

 ఊదర కొట్టి ఉబ్బేసి కనుసన్నలలో  ఉంటారు

మానవత్వమా నువ్వెక్కడ ?

ప్రచారం మత్తులో మునిగిపోయావా ?

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-4-20-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 32-కోస్టా రికన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 32-కోస్టా రికన్ సాహిత్యం

కోస్టా రికన్ సాహిత్యం లో 19వ శాతాబ్దిచివర ప్రచురింపబడిన రచనల వరకు 5 సాహిత్య కాలాలున్నాయని (లిటరరీ పీరియడ్స్ )పరిశోధన చేసిన ఆల్వరో కొసేడా సోటోఅనే ప్రొఫెసర్ చెప్పాడు .వీటిని అక్కడ’’ జనరేషన్స్’’అంటారు .ఇవి నిజంగా సాహిత్య దృష్టి తో ఉన్న జేనరేషన్స్ మాత్రం కావు .అవి-

1-ఒలింపస్ జనరేషన్(1890-1920) –ఈకాలం లో జాతీయ స్పూర్తితో కూడిన రచనలు ఎక్కువగా వచ్చాయి .ఆరచయితలు –మాన్యూల్ ఆర్గేల్లా మోరా ,మాన్యూల్ డి జీసస్ జిమెంజ్ ,పియో విన్క్విజ్ ,రాబర్టోబ్రేనెస్ మేసేన్ ,ఆక్వేల్లో ఈకే వార్రియా ,రికార్డో  ఫెర్మెండేజ్ గార్దియా ,కార్లోస్ గాగిని ,మాన్యూల్ జెంజలేజ్ జేలెడాన్.

2-రిపెర్టరి జనరేషన్(1920-40)-దీనికీ మాగజైన్ ‘’రిపర్టోరియో అమెర్రికానో డిజాక్విన్ గార్సియా మోన్గే’’కు లింకు ఉంది .ఈ కాలం లో లిబరల్ ఆలిగార్కిక్ పాలనలో సంక్షోభం ఏర్పడి,నూతనభావాలు ,శైలి అంటే గ్రోటోస్కో స్టైల్  భయంకర ,భీభత్స హాస్యం ,పారడి,వ్యంగ్యం విజ్రుమ్భించాయి . ఈ రచయితలు –జాక్విన్ గారిక్ మంగే ,ఒమర్ డెంగో,కార్మెల్ లైరా ,మేరియో సాంచో ,మాక్స్ జిమెంజ్.

3-ది40 స్ జనరేషన్ (1940-1960)-ఈ పీరియడ్ సోషల్ డెమోక్రసీ ఏర్పడింది .ప్రశ్నించటం సమాధానం రాబట్టటాలు జరిగాయి .అనేక సాంఘిక సంస్కరణలు అమలయ్యాయి .కొత్త రాజ్యాంగ స్పూర్తి కలిగింది .రచయితలు సాంఘిక సమస్యలు, భూమిపంపిణి,బహుళజాతి కార్పో రేషన్ల పై రచనలు చేశారు .ముఖ్య రచయితలు-జోస్ బాసిలో అకునా ,ఐజాక్ ఫెలిపి అజోఫీఫా ,ఫేబియన్ డోబెల్స్,కారియోస్ లూయీ ఫల్లాస్ ,జాక్విన్ గిటేర్రెజ్,జూలియన్ మార్కేనా ,యోలాండో ఒరియామునో ,జోస్ మారిన్కానాస్ ,కారియో లూయీ సేన్జ్,కారియోస్ సాల్వజార్ హీర్రేరా ,మోసెస్ విన్సేంజి .

4-ది అర్బన్ జనరేషన్(1960-80)-ఈకాలంలో ఆధునికత , యాంత్రికత చోటు చేసుకొన్నాయి .కనుక నగర జీవితమే అందరికీ కథా వస్తువైంది .రచయితలు –ఆల్బర్టో  కానాస్ ,జార్జి చార్పెంటియర్,డేనియల్ గాలేగోస్ ,వర్జీనియా గ్రట్టర్,కార్మెన్ నరంజో ,ఈనిక్ ఓడియో ,శామ్యూల్ రోవెన్స్కి,జోస్ లేనాన్ సాన్చెజ్,లారియానో ఆల్బాన్ ,జూలిఎటా డోబుల్స్ ,జార్జి డెబ్రవో,ఆల్ఫాన్సో చేజ్.

5-డిజెన్చాంట్ మెంట్  జనరేషన్(1980నుండి ఇప్పటి వరకు )-ఈకాలం లో కోస్టా రికా లో కొత్త సాహిత్యం పురుడు పోసుకొన్నది .ఆదినుంచి వస్తున్న సాహిత్యాన్ని నెట్టేసి, వాస్తవికత ప్రవేశించి నేలవిడిచి స్వారి చేసే రచనలు పూర్తిగా మారిపోయి యదార్ధ సంఘటనలకు జీవం పోసి రచనలు చేశారు .ఒకే రకమైన శైలికి స్వస్తి చెప్పి విభిన్నమైన శైలులలో కవిత్వం రచనలు ఆవిర్భవించాయి

  20వ శతాబ్దిలో ఆధునికత ప్రవేశించి జీవన విదానాలలో  పెను మార్పులు వచ్చాయి  .రోబెన్ డోరియో  కోస్టారీకాలోనే స్థిరపడి కవిత్వం ,వ్యాసాలురాసి ప్రచురించాడు .ఇతర లాటిన్ అమెరికన్ దేశాలలో కాకుండా కోస్టా రికాలో మోడర్నిజం కు పెద్దగా ఆకర్షణ లేదు .1965తర్వాత పుట్టినకవులు తమ రచనలను 1990తర్వాత మాత్రమె ప్రచురించారు .వీరిలో జువాన్ ఆన్టిలియాన్,మారికో మోలినా డేల్గడో,మొదలైనవారున్నారు .

 ప్రసిద్ధ కోస్టారికన్ రచయితలు  –రాబర్టోబ్రేనెస్ మేసేన్ –ఎల్ యెన్ సైలేన్సియో కవితలను ,కార్మెన్ లైరా –క్వెంటోస్ డిమి టియా పంచిత,మమితా యునాయ్ మొదలైన నవలలు రాసిన కార్లోస్ ఫలాస్ ,ఎల్ సిటోడి లాస్ ఎబ్రాస్ నవలారచయిత ఫేబియన్ డోబెస్,సీమా డెల్ గోజో కవితా సంపుటి కర్త –ఐజాక్ ఫెలిపి అజోఫీఫా మొదలైనవారు

  ఒకే ఒక కవితా సంపుటి ‘’అలాస్ యెన్ ఫూగా ‘’ తెచ్చిన జోస్ లియాన్ సాన్సేజ్ ,లా ఇస్లా డి లాస్ హోమ్బ్రెస్సోలోస్ నవలకూడా రాశాడు .1970-80కాలం లో రోడాలఫో ఏరియస్,జార్జి ఆర్రియో ,అన ఇస్తాని మొదలైన రచయితలున్నారు .

 టాప్ నైన్ బుక్స్ –1-ఇట్ ఈజ్ ఎవెరిమంకిఫర్ దెం సేల్వెస్-వనేస్సా వుడ్స్ –అడవిమనుషుల శృంగారం పై రచన -2-ఓరో-సిజియా జైక్ 3-గ్రీన్ ఫోనిక్స్ –విలియం ఎల్లెన్ 4-మంకీస్ ఆర్ మేడ్ ఆఫ్ చాకోలేట్స్-జాక్ ఈవింగ్ 5-కోస్టా రికా –ఎ ట్రావెలర్స్ కంపానియన్ –ఆస్కార్ ఆరిస్ 6-ది డెవిల్స్ డీప్-మైకేల్ వాల్లెస్ 7-ది సెంట్ ఆఫ్ జేడ్-డీడీ టార్సియో,8-జురాసిక్ పార్క్ అండ్ లాస్ట్ వరల్డ్ –మైకేల్ క్రిక్టన్ 9-ది యియర్ ఆఫ్ ఫాగ్ –మైకేల్లిరిచ్ మాండ్ .

ప్రపంచ ప్రసిద్ధ కోస్టారికన్ రచయితలు –మాన్యుల్ ఆర్గేల్లో ,జాక్విన్ గార్సియా మోన్గే,గార్మేన్ లైరా ,గార్మేన్ నరెంజో ,కార్లోస్ లూయీ ఫల్లాస్ .

  కోస్టా రిక మధ్య అమెరికాలో  వర్షారణ్య   దేశం .కరేబియన్ ,పసిఫిక్ సముద్రాల అంచున ఉంటుంది .రాజధాని సాన్ జో. సాంస్కృతిక కేంద్ర౦  గోల్డ్ మ్యూజియం కు .అనేకమైన బీచ్ లకు నిలయం .భూభాగంలో ఇకవంతు  అభయారణ్యమే .వన్యమృగ నిలయం .స్పైడర్ మంకీలకు ప్రసిద్ధి  .రోమన్ కేధలిక్ మతానికి నిలయం .స్పానిష్ భాష ప్రజలభాష .భోజనం నేటివ్ అమెరికన్ స్పానిష్ ,ఆఫ్రికన్ వంటకాలు తింటారు .1936లో సమ్మర్ ఒలింపిక్స్ లో ఈ దేశం పాల్గొన్నది .ఫుట్ బాల్ ఇక్కడి ముఖ్యమైన ఆట .బేస్ బాల్ కూడా బాగా ఆడుతారు.97శాతం ప్రజలు ఇంగ్లిష్ మాట్లాడుతారు .హైస్కూల్ వరకు విద్య ఫ్రీ .కోస్టారికా యూనివర్సిటి ‘’మెరిటోరియస్ యూనివర్సిటిగా ‘’గుర్తింపు పొందింది .టూరిస్ట్ లపాలిటి స్వర్గధామం .టూరిజం వలన ఆదాయం ఎక్కువ .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-4-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రత్యక్ష పరిచయం

సాహితీ బంధువులకు శుభకామనలు ఇవాల్టితోసరసభారతి పుస్తకాలను 6 ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారంగా పరిచయం చేశాను వీక్షకులకు ధన్యవాదాలు 

   నిన్నరాత్రి అమెరికా షార్లెట్ నుంచి మా అమ్మాయి విజ్జి ఫోన్ చేసి  వాళ్లకు దగ్గరలో ఉంటున్న ఒకావిడ  (పేరేదో చెప్పింది కాని జ్ఞాపకం లేదు ) సరసభారతి బ్లాగు ను అనునిత్యం ఆసక్తిగా ఫాలో అవుతున్నానని ,పుస్తక పరిచయం ప్రాత్యక్ష ప్రసారం కూడా వదలకుండా చూస్తున్నాననిచెప్పిందని ఇంతగా కృషి చేస్తున్నవారెవరూ తనకు  కనిపించలేదని చెప్పిందని చెప్పింది.  ఐతే ఇండియాలోనూ అమెరికాలోనూ పిల్లలకు ”కరోనా  సెలవ”లిచ్చారు కనుక వాళ్ళకోసం నన్ను మంచి నీతి ,కర్తవ్య౦,బాధ్యత ,మానసిక ఉల్లాసం కలిగించే   కథలు  చెబితే  పిల్లలకుకూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారని చెప్పింది . ఐడియా . బాగానే ఉందని పించి ,ఇవాళ రెండు పుస్తకాల పరిచయం త్వరత్వరగా పూర్తిచేసి విరామం      ప్రకటించాను . 
  రేపు 6-4-20 సోమవారం ఉదయం 10 గంనుండి .”కథా సుధ”శీర్షికతో ఉపయుక్త కథలను  ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారంగా   చెబుతాను సుమారు 40నిమిషాలలో . దీనిని ఇటీవల ”గో రసం ”వారు శ్రీ శిస్టు సత్యరాజేష్ సంపాదకత్వం లో ప్రచురించిన ”బాలనేస్తాలు ”లోని కథలతో మొదలు పెడతాను -మీ- దుర్గాప్రసాద్ -5-4-20 ఆదివారం -ఉయ్యూరు
Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 31-నికారుగ్వన్ సాహిత్యం

పోస్ట్ కొలంబియన్ నికారుగ్వా లో మొట్టమొదటి రచనగా ‘’ఎల్ గూగునేస్’’ గా భావిస్తారు .ఇదేసంగీత నృత్యనాటక సమాహారమైన లాటిన్ అమెరికా నికారుగ్వా జానపద సాహిత్యం .దీన్ని 16వ శతాబ్ది అజ్ఞాత కవి రాశాడు .అదే పశ్చిమార్ధగోళం లోని రచన .అది మౌఖికంగా తరతరాలుగా వ్యాప్తి చెంది 1942లో మొదటిసారిగా పుస్తక రూపం లో ప్రచురింపబడింది

  ఇక్కడ మోడరనిస్మో అనే స్పానిక్ –అమెరికన్ సాహితీ ఉద్యమ౦ 19వ శతాబ్ది మలి దశలో బయల్దేరి ‘’రూబెన్ డేరియో’’ కవి చేత విస్త్రుతమైనది .ఈకవినే ‘’ఫాదర్ ఆఫ్ మోడర్నిజం ‘’అని గౌరవంగా పిలుచుకొంటారు .ఇందులో మూడు స్రవంతులు –రొమా౦టిజం ,సింబాలిజం ,పార్నస్సియనిజం కలిసి ఉన్నాయి .మనోభావాలు ,పాషన్లుఅంటే భావా వేశాలు ఏకస్వరాలనే హార్మనీలు ,దృష్టి అంటే విజన్ లు ,లయలు అన్నీ మహా విశిష్టంగా ,అద్భుత శైలీ విన్యాసాలతో  వాచ్య సంగీతంగా ఇందులో దర్శనమిస్తాయి .ఈ ఉద్యమ౦ ఫిలిప్పీన్స్ తో సహా   స్పానిష్ భాష మాట్లాడే దేశాలన్నిటిలో విస్తృత వ్యాప్తి చెంది,ప్రభావం కలిగించింది .కళాభిరుచి సౌందర్యారాధన లకు ఉద్దీపనకలిగించింది .

   ఈ మోడర్నిస్మో ఉద్యమమే నికారుగ్వా బాహ్య ప్రపంచం పై అత్యంత ప్రభావం చూపింది .ఇదే అసలు సిసలు లాటిన్ అమెరికా సాహిత్యంగా ముద్రవేసుకొన్నది .ఇందులో సౌందర దృష్టి ఎక్కువగా ఉన్నాకూడా కొందరు కవులు సమకాలీన సంఘం పై రచనలు చేశారు సమస్యలు చర్చించారు .20వ శతాబ్దం వచ్చేసరికి కవిత్వ౦ అంతా రాజకీయమయమైపోయింది .దీనికి కారణం చిలియన్ నోబెల్ ప్రైజ్ విన్నర్ పాబ్లో నెరూడా కవి ప్రభావమే .అతన్ని అనుసరించి కవిత్వం రాసినకవి ఎర్నేస్టో కార్డినల్.

  గ్రనాడా –నికారుగ్వా లో1927-29లో ప్రారంభమైన ‘’వాన్ గార్డియా’సాహిత్య ఉద్యమం ను జోస్ కార్నెల్ ఉర్టేకో కవి ప్రారంభించాడు .1931లో ప్రచురితమైన మానిఫెస్టో ప్రకారం ‘’to initiate a struggle to get the public attention through artistic expressions, intellectual scandal, and aggressive criticism”.[4]

  ఈ ఉద్యమం అనేక యూరోపియన్ సాహిత్య ఉద్యమాలపై ప్రభావం చూపి ‘’సర్రియలిజం ‘’ఆవిర్భవానికి కారణమైంది .వాన్ గార్దియా సాహితీ ఉద్యమం ఆధునిక నూతన ఆలోచనలకు విషయాలకు ,ముఖ్యంగా షాకింగ్ నవలలకు దారి చూపింది .

నికారుగ్వన్ రచయితలో కవులు రచయితలూ వ్యాసకర్తలు జర్నలిస్ట్ లు ,విమర్శకులు మొదలైన వారున్నారు .వారిలో కొందరు –క్లారిబెల్ అల్జీరియా ,ఏమిలో ఆల్వరేజ్ లిజార్జా ,మొన్టాల్వన్,జూన్ బీర్ ,గికోకొండా బిల్లి ,యోలాన్దాబ్లాంకో ,ఏర్నేస్టో కార్డినల్,కార్లీ గేటాన్,జాక్విన్ పాసోస్ ,ఆర్టేన్ సియు ,డైసి జమోరా వగైరా .హిస్టరీ ఆర్కి టేక్చర్ లకు ప్రసిద్ధమైన ‘’గ్రనడా ‘’లో ‘’అంతర్జాతీయ పోయెట్రి ఫెస్టివల్ ‘’2005నుంచి జరుగుతోంది .అంతర్జాతీయ ప్రసిద్ధి పొందిన కవులను సాదరంగా ఆహ్వానించి ఈ ఫెస్టివల్ జరుపుతారు .దీనిలో నికారుగ్వన్ సింగర్స్ కమ్మగా పాటలు కచేరీలతో వీనుల విందు చేస్తారు ‘

  నికారుగ్వా దేశం పసిఫిక్ సముద్రం కరేబియన్ సముద్రాలమధ్య ఉన్న సెంట్రల్ అమెరికన్ దేశం .ఇక్కడి సరస్సులు బాగా ఆకర్షిస్తాయి .అగ్నిపర్వతాలకూ నిలయమే .అందుకే ‘’లాండ్ ఆఫ్ లేక్స్ అండ్ వాల్కనోస్ ‘’అంటారు .రాజధాని మానాగువా  .సెంట్రల్ అమెరికాలో అత్యంత పేద దేశం .దీనికంటే కోస్టారికా సురక్షిత ప్రాంతం .దాదాపు అందరూ రోమన్ కేధలిక్ మతస్తులు .ఇక్కడి ‘’మాకువా ‘’అనే డ్రింక్ ప్రసిద్ధం ఈ దేశం లోని వేడిని తట్టుకొవటానికి ఇది తప్పని సరి ,ఫ్రైడ్ రైస్ ,ఉల్లిపాయ,స్వీట్ పెప్పర్,బీన్స్ ఎక్కువ గా ఆహారం .మాంసం తప్పని సరి .భాష –స్పానిష్ తో సహా అన్నీ .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-4-20-ఉయ్యూరు

— 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహిళా వివాహ చట్టాల కోసం ఉద్యమించిన ఇండో నేషియా లాయర్ –సోయెవాండో సోయెరాస్నో నాని-గబ్బిట దుర్గా ప్రసాద్ -విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -ఏప్రిల్ 

మహిళా వివాహ చట్టాల కోసం ఉద్యమించిన ఇండో నేషియా లాయర్ –సోయెవాండో సోయెరాస్నో నానిగబ్బిట దుర్గా ప్రసాద్ -విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -ఏప్రిల్

ఇండోనేషియా దేశ మహిళల ఓటుహక్కు మహిళా వివాహ వయస్సు పెంచటం కోసం మహోద్యమం నడిపిన వనిత సోయెవాండో సోయెరాస్నో నాని సోమెరాంగ్ లో 1918లో జన్మించి ,జకార్తాలో లా చదివి ,డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ లో ఉద్యోగం లో చేరింది .లాయర్ అవటం తో అనేక మహిళా సేవా సంస్థలలో ఆమె సభ్యురాలైంది .వీరందరితోకలిసి 1952లో క్రొత్త వివాహ చట్ట రూపకల్పనకు, అందులో ముఖ్యంగా బాలికల వివాహ వయస్సు పెంచటానికి ఒక కమీషన్ ఏర్పాటు చేసుకొన్నారు . .వీటిపై అందరికి అవగాహన కలిగించటానికి నాని, 1954లో ‘’ది లీగల్ అండ్ సోషల్ స్టేటస్ ఫర్ వుమెన్ ‘’పుస్తకం రాసి ప్రచురించింది .ఇండోనేషియాలో మహిళల స్థానం కోసం రాయబడిన మొట్ట మొదటి పుస్తకం గా ఈ పుస్తకం రికార్డ్ కెక్కింది .బహు భార్యత్వం ను సమర్ధిస్తూ అంతకు ముందు కొద్దికాలం క్రితమే ప్రభుత్వం తేవాలనుకొన్న కొత్త వివాహ చట్టం పై తీవ్రంగా విరుచుకుపడి,స్త్రీలను చైతన్యవంతం చేయటం ప్రారంబించింది .అనేక పోరాటాల ఫలితంగా ప్రభుత్వం చట్టం చేసినా అమలు లోకి రావటానికి చాలాకాలం పట్టి 1974 లో అమలైంది .దీన దీని ప్రకారం బాలికల వివాహ వయస్సు 16 సంవత్సరాలుగా ,బాలుర వివాహ వయస్సు 19 సంవత్సరాలుగా నిర్ణయించారు .ఇదంతా నాని కృషి ఫలితమే .

1955లో మనిలా లో’’ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ యూని వర్సిటి వుమెన్ ‘’సమావేశం జరిగింది .ఈ సమావేశం లో నాని ఇండోనేషియా దేశపు అబ్జర్వర్ గా విధులు నిర్వహించింది .ఆమె శ్రమ, అంకితభావం, సేవా నిరతి అందరి దృష్టి ని ఆకర్షించాయి .దీని ఫలితంగా రెండేళ్ళ తర్వాత ‘’ పౌర బాధ్యతలు ,ప్రజాసేవలో ఆసియా మహిళల భాగస్వామ్యం’’అనే అంశాలపై బాంకాక్ లో జరిగిన యునైటెడ్ నేషన్స్ సెమినార్ లో ఇండోనేషియా ప్రతినిధిగా పాల్గొన్నది .సెమినార్ లో ఇండో నేషియా మహిళలపై ఒక పరిశోధన పత్రం రాసి సమర్పించింది .1958లో శ్రీలంక లోని కొలంబో లో జరిగిన ‘’ఏషియన్ ,ఆఫ్రికన్ వుమెన్స్ కాన్ఫరెన్స్ ‘’లో పాల్గొని ఇతర ప్రతి నిధితులతో కలసి ముక్త కంఠంతో వివాహ చట్టం పూర్తి అమలు కోసం పట్టు బట్టింది. .

1959లో సోయెవాండో నాని స్వీడిష్ స్కాలర్షిప్ గెలుచుకొని శతాబ్దాలపాటు అణగారి పోయిన ఇండోనేషియా మహిళల జీవితాలలో మార్పులపై పరిశోధన చేసింది .మహిళా సమస్యలపై అనేక మహిళా జర్నల్స్ లో చాలా వ్యాసాలు రాసి అ౦దరి దృష్టికి తెచ్చింది .వీటి సాధనకోసం ‘’ప్లాన్నేడ్ పేరెంట్ హుడ్ అసోసియేషన్ ‘’1957లో స్థాపించి, వైస్ ప్రెసిడెంట్ గా సేవలందించింది .దీనితోపాటు 1955నుండి ‘’ఇండోనేషియన్ యూని వర్సిటి వుమెన్ అసోసియేషన్ ‘’బాధ్యతలనూ స్వీకరించి సమర్ధంగా నడిపింది .

ఇంతటి మహిళోద్యమ నాయకురాలి జీవితం గురించి ఒక్క పుట్టిన రోజు తప్ప మిగతా వివరాలేవీ దొరకక పోవటం విడ్డూరమే.ఆమె రాసిన ‘’ది ఇండోనేషియన్ మారేజ్ లా అండ్ ఇట్స్ ఇంప్లి మెంటింగ్ రెగ్యులేషన్స్ ‘’పుస్తకం లో చాలా విషయాలు చర్చించింది .వధూవరుల వివాహ వయసు ,భార్యాభర్తల హక్కులు ,బాధ్యతలు ,వైవాహిక ఆస్తి ,విడాకులు ,న్యాయస్థాన నిర్ణయాలు ,వివాహ చట్టం అమలు తీరు ,వివాహ రిజిస్ట్రేషన్ ,వివాహ సర్టిఫికేట్ ,శిక్షా నిబంధనలు మొదలైన అనేక అంశాలపై విస్తృతంగా చర్చించి ఇండోనేషియామహిళలకు మంచి అవగాహన కలిపించి మహోపకారం చేసింది నాని .ఆమె శతజయంతి కూడా జరిగి పోయింది .కాని గూగుల్ లో ఆదేశం వారు ఆమె గురించి ఏమీ రాయకపోవటం క్షమించరాని విషయం .

                                                                                                                                                                        –                                                                                                                            -గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచమానవాళి కరోన వైరస్ ,కోవిద్

విలవిల-కలకల
ప్రపంచమానవాళి కరోన వైరస్ ,కోవిద్ వ్యాధులతో అలమటిస్తూ ,ప్రభుత్వాలు విధిస్తున్న అంతులేని లాకౌట్లు, లాక్ డౌన్లు విధిగా భరిస్తూ ఇల్లే ‘’క్వార౦టైన్’’గా గృహనిర్బంధం లో ఉంటూ, అన్ని పనులు ఇంట్లోనే కానిస్తూ ,బయటి ప్రపంచం లోకి వీలయితే ఒక గంటో,రెండుగంటలో ముసుగువీరుల్లా తిరిగొస్తూ, వీధులన్నీ నిర్మానుష్యం చేస్తూ ,’’ఇక్కడ అసలు జనాభా ఉండేవారా ?’’అనేట్లు ప్రవర్తిస్తూ దాదాపు 15రోజులు గడిపారు .పత్రికలూ టివి లలో మృత్యుభయం వార్తలు చూడలేక ,చూసిన వే మళ్ళీగా సీరియల్స్ చూస్తూ ,పిల్లలను యేమీ అనలేక, వాళ్ళు సెల్ లో ,టాబ్లెట్ లలో గేమ్స్ ఆడుకుంటుంటే మందలించలేక, చదూ కోమని చెప్పాలేక ,ఆడుకోమనటానికి వీలూ లేక ,భార్యపై కోపం ప్రదర్శించలేక భర్తలు ,భర్తలపై సాఫ్ట్ కార్నర్ తో భార్యలూ అత్తామామలపై సాధింపులు మానిన కోడళ్ళు అన్నీ మూసుకొని ఇళ్లలోనే మగ్గిపోతూ ఇదే ఆనందం పరమానందం అనుకొంటూ కన్నీరు పెట్టుకోలేక’’ విలవిల ‘’లాడుతున్నారు మనస్వాతంత్ర్యాన్ని మరెవరో కాజేశారని భ్రమలో .అంతేకాని ఇదంతా మనం చేసుకొన్నప్రారబ్ధమే అనే ‘’ఎరుక’’ రాక పోవటం బాధాకరమే .నరసంచారం లేని రోడ్లు పార్కులు పబ్బులు క్లబ్బులు బార్లు ఆటలు వినోదాలు విందులు ,డేటింగులు ,అర్ధరాత్రి స్వైర విహారాలు పార్కుల్లో అసభ్య శృంగార కేళీ విలాసాలు ,దైవ కళ్యాణాలు మనిషిని అంతర్ముఖం చేశాయా ?చేసి ఉంటె ఎంతో మేలు సమాజానికి కుటుంబాలకు దేశానికీ .ఇదీ జన కీకారణ్యం సంగతి ఇప్పుడు .
ఒక్కసారి అటు అసలు అరణ్యం లోకి తొంగి చూద్దాం .వేటగాళ్ళు రాకపోవటం వలన జంతువులూ ,పక్షులు ‘’కిలకిల’’నవ్వుకొంటున్నాయి ప్రాణహాని తప్పి పోయింది తాత్కాలికంగా నైనా అని ఊపిరి పీల్చుకొంటున్నాయి .’’హమ్మయ్య’’ మళ్ళీ మనజోలికి మనిషి రాకుండా ఉంటె బాగుండునని భావిస్తున్నాయి .చెట్లు ,పొదలు ,లతలు ని౦డుపూలతో ఫలాలతో కనువిందు చేస్తున్నాయి .శుకపికాలు కోయిలలు గొంతెత్తి స్వాతంత్ర్య గీతాలు పాడుతున్నాయా అన్నట్లు కలకల రవాలు చేస్తూ ఆనందంగా పల్టీలు కొడుతూ ,ఇక ఆనందమే అంబరమైతే అన్నట్లు మహా భోగాన్ని అనుభవిస్తున్నాయి .సింహ శార్దూలాలు తమ పెద్దరికం నిలుపుకొంటూ జంతుజాలంతో సఖ్యతగా మెలుగుతున్నాయి .నక్కలు స్వతహాగా వచ్చిన తమజాతి లక్షణాలు జిత్తులు ఎత్తులూ మానేసి ‘’కరటక దమనకుల్లా’’కాకుండా మహా బుద్ధిగా ఉన్నాయి .అడవి పందులు ముస్టులతో నేల త్రవ్వుకొంటూ వీర విహారం చేస్తున్నాయి .భల్లూకాలు’’తమజాతి పిత ‘’జాంబవంతుని పెద్దరికం గుర్తు చేసుకొని పెద్దరికంతో ప్రవర్తిస్తున్నాయి .అడవి ఏనుగులు ,గుర్రాలు పరుగు పందాలు పెట్టుకొని ఆనందం పంచుతున్నాయి .తేనెటీగలు వికసించిన పూల మకరందాన్ని హాయిగా గ్రోలుతూ తుట్టెలు ఇబ్బదడిముబ్బడిగాపెట్టి వాటిని దొంగిలించే దొంగ మానవులు లేక, రాకపోవటంతో అడవి లో’’ తేనె వాకల’’ను ప్రవహింప జేస్తున్నాయి .పూర్వం రుష్యాశ్రమాలుగా ఇప్పుడు అడవి గోచరిస్తోంది సహజీవన సౌందర్యం వికసిస్తోంది .నెమళ్ళు పురి విప్పి ఆనంద నాట్యం చేసి అడవిలో ఇంద్రధనుసులను సృస్టిస్తున్నాయా అనిపిస్తున్నాయి .గుడ్లగూబలు రాత్రిళ్ళే కాక ,పగలూ కళ్ళు ‘’పొడుచు’’కొంటూ మసక కనులతో ఎగురుతున్నాయి .ఎందుకు వీటికి ఆనందం అంటే చైనాలో గబ్బిలాలు పీక్కు తినటం మానేసినందుకు తమజాతి సంపద నష్టం కాకుండా ఉన్నదుకు .
ఎప్పుడో ఎరుక ,ఏనాదులు తిండికి గతిలేక ‘అడవులలో ‘’అలుగు’’లను వేటాడి తినేవారు .నాగరకత బలిసిన దేశాలలో ఇప్పుడు నానా ‘’అలగా జాతులు’’ వాటిని తినటం ఫ్యాషనయి తమ ఉనికికే ప్రమాద ఘంటికలు మ్రోగాక తప్పు తెలుసుకొని అలుగులపై ఆశ హరి౦చు కొని బతుకుతున్నారని సంతోషం వాటిల్లో కనిపిస్తోంది .ఇవే కాదు పాములపై తేళ్ళు జెర్రులూ ఎక్కి స్వారీ చేస్తున్నా కిమ్మనటం లేదు .ఆవులూ దూడలు ఎద్దులూ తమ మాంసం తినటానికి మనుషులు భయపడుతు౦డ టంతో కేరింతలు అ౦బారవాలు రంకెలతో అడవి అంతా ‘’క్షీర సాగరమై’’ అడవిలో ‘’నాద కచేరీ ‘’చేస్తున్నాయి విస్త్రుతానందం తో.కాకులు కోకిలలను సాకుతున్నాయి. గోరువంకలు చిలుకలతో సంసార సౌఖ్యం అనుభవిస్తున్నాయి .వాల్మీకి వచ్చి ‘’మా నిషాద ‘’అంటూ ఆక్రోశించాల్సిన అవసరమే కనిపించటంలేదు .చిట్టిపొట్టి పిచుకలు గూళ్ళు అనంతంగా కట్టుకొని గుట్టుగా గూళ్ళల్లో కాపురాలు చేసుకొంటూ కిచకిచలతో సంతోషం పంచుతున్నాయి . దంతాలు పీక్కుపోయే వారి భయం లేకపోవటం తో, హాయిగా సరస్సులలో జలక్రీడలాడుతూ తొండాలతో నీళ్ళు చల్లుకొంటూ ,రతికేళి లో మైమరచి మదస్రావంతో వి౦త వాసనలు వ్యాపింపజేస్తూ తిరుగుతున్నాయి .సరస్సుల్లో ‘’మకరి’’ఉన్నా , ,’’కరి’’ని ఏమీ చేయకుండా ,’’గజేంద్ర మోక్షం’’ దృశ్యం పునరావృత్తం కాకుండా స్నేహహస్తం చాచి’’ హస్తి’’తో కరచాలనం చేస్తోందా అనిపిస్తోంది .చారల చారల జీబ్రాలుదుముకుతూ పరుగులు తీస్తూ తమ అందాన్నీ హోయలను ఒలకబోస్తున్నాయి . ఒంటెలు, అల్ జజీరాలు మెడ సాచే అవసరం లేకుండా చెట్లు కిందకి వంగి మిత్రత్వం నెరుపుతున్నాయి .ఉడతలు ,కుందేళ్ళు ,జింకలు, దుప్పులు వేటగాళ్ళ భయం లేనదున మహా ఆనందంగా యెగిరి గంతులేస్తున్నాయి .వాటి ఆనందానికి పట్టపగ్గాలు లేవు .ఖడ్గమృగాలు చూపుల గా౦భీర్యమే కాని హింసా ధోరణి ప్రదర్శించటం లేదు.అడవి దున్నలు స్వైర విహారం చేస్తున్నాయి.కోతులు కొండముచ్చుల ‘’కిచకిచ’’లతో మర్కట కిశోర న్యాయంగా తమపిల్లలను పొట్ట కింద కరుచుకొని గెంతుతూ దుముకుతూ పళ్ళు తింటూ తినిపిస్తూ శాఖాచంక్రమణాలు చేస్తూ ఉయ్యాలలూగుతూ చెట్లకు వింత శోభనే తెస్తున్నాయి. మరి ఈజంతు, పక్షులకు’’ అంటు’’’’అంటూ ఏమీ లేదు .స్వేచ్చగా జీవిస్తున్నాయి కరోనా భయం లేని జీవరాశి గా మన్ననలు పొందుతున్నాయి .అరణ్య౦ లో మానవ మృగాలు కలిగించిన భీభత్సం ,ప్రకృతి వినాశనం ,దెబ్బతీసిన పర్యావరణ సమతౌల్యం ,జంతుహింస అంతా వాటికి ఒకప్పుడు ‘’విల విల ‘’గా ఉన్నా, నేడు కరోనా పుణ్యమా అని అక్కడ అంతా’’కలకలా’’ రావాలే .శృతిసౌభగాలే . మనకు మాత్రం ‘’విల విల ‘’లే .మనం చేసుకొన్న పాపమే అదంతా . ఆరణ్య కలకలలు చూస్తుంటే సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులవారి శివతాండవం లోని ‘’ఏమానందము ఇలాతలమున ‘’అన్న గేయభాగం గుర్తుకొస్తోంది .ఇంత ఆనందం ఇంతకు ముందెన్నడూ అడవి జీవజాలం అనుభవించి ఉండదు . మనకొక జాగృతి ,వాటికొక సుకృతి .
కొసమెరుపు –మూడు రోజులక్రితం మా అబ్బాయి శర్మ మెయిల్ లో ఇలా ఆలోచించి రాస్తే ఎలా ఉంటుందో చూడమని హింట్ ఇచ్చాడు .వాడు ఊహించినట్లు వచ్చిందో లేదో నాకు తెలీదుకాని ఈ సాయంత్రం కంప్యూటర్ ముదు కూచుని శీర్షిక కోసం తడుముకొని, తట్టగానే ఇక ‘’కొట్టటం’’ ప్రారంభించి నాన్ స్టాప్ గా రాసి పూర్తి చేశాను .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-4-20-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

మానవత్వం పరిమళించిన వేళ – ఉయ్యూరులో

మానవత్వం పరిమళించిన వేళ
కరోనా లాకౌట్ లో జనం బయటికి రాలేక ,ముసలీ ముతకా ఇంట్లో అన్నం వండుకోలేక రిక్షావాలాకు కిరాయి లు లేక కాలేకడుపులతో అలమటిస్తున్న వేళ ఉయ్యూరులో వె౦ట్రప్రగడ ఆంజనేయులు, మా అబ్బాయి గబ్బిట రమణ ,శ్రీనివాస్ అనే స్వంతకారున్న ఉదారుడు, మిత్రులు కలిసి ఆలోచించిరోజుకొకరు స్పాన్సర్ గా పైవారికి ఇంటికే పప్పు ,కూర పెరుగు, మంచినీటిపాకెట్ ,అన్నం సంబారులతో ఒక పాకెట్ తయారు చేయించి ,రోజుకు కనీసం 50 మందికి ఆహార పాకెట్లు స్వయంగాఇళ్ళకు వెళ్లి అంద జేయటం ప్రారంభింఛి గత అయిదు రోజులుగా మానవత్వం చాటుతున్నారు .అందులో శ్రీను తనకారులో ఈ బాచ్ ను ఆహారపాకేట్ లతో సహా తీసుకు వెళ్లి డోర్ డెలివరి చేసి ఎంతో సాయపడుతున్నాడు .
ఇప్పటికే రెండు రోజులు అతనే స్పాన్సర్ .ఇవాళ సరస భారతి స్పాన్సర్ చేస్తుందని మా అబ్బాయి రమణ నాకు చెప్పి ,రావి చెట్టు బజారు లో ఉన్న కోటేశ్వరరావు కేటరింగ్ కేంద్రం దగ్గర నాతో ,ఒంటిమిట్ట డాక్టర్ శివకుమార్ గారితో
అర్హులకు పాకెట్లు ఇప్పించే పని మొదలుపెట్టించి ,పెద్దవంతెనదగ్గర రిక్షా వారికీ ,బసవయ్య చెరువు దగ్గరున్న ముస్లిం సోదర సోదరీమణులకు ,గురజాడ డొంకదగ్గర ఉన్న ఎరుకల ఏనాది వారికీ మాచేత ఈ బృందం ఆహార పొట్లాలు ఇప్పించి మాకూ ఆపుణ్య౦ లో వాటా దక్కెట్లు చేశారు .ఈఎరుకలకు వేసుకోవటానికి కళ్ళకు చెప్పులు కూడా కొనుక్కోలేని గర్భిణీ స్త్రీలు కూడా ఉండటం గమనించి ఆకుటు౦బాలవారికి 12 జతల చెప్పులు కూడా మాతో అందజేయటంమరో విశేషం .కేటరింగ్ అతను కోటేశ్వరరావు ,అతని పిల్లలు కుటుంబం ఈ వితరణకార్యక్రమం లో భాగస్వామి అయి, చాలాతక్కువ రేటులో ఆహార పాకెట్లు తయారు చేసి రోజూ అందివ్వటం మరో ముఖ్య విషయం .అందుకే ఉయ్యూరులో మానవత్వం పరిమళించింది అని పించింది .మాటల్లో కాక, చేతల్లో మానవత్వం చూపిన వీరందరికీ మనః పూర్వక అభినందనలు .మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-4-20-ఉయ్యూరు
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కరోనా కల్యాణం

కరోనా కల్యాణం
రాముడు –ఏమిటిపూజారీ !నాకు ఆరు గజాల దూరం లో కూర్చుని నాపై పూలు విసురుతూ పూజచేస్తూ ముక్కుకేదో గుడ్డ కట్టుకొని మంత్రాలు చదూతున్నావ్ .అసలు మామూలుగా నువ్వు చదివితేనే మంత్రాలని తెలీదు ఈ ముక్కు గుడ్డతో ముక్కుమూతతో నన్ను తిడుతున్నావో పొగుడుతున్నావో అర్ధం కావట౦ లేదు . అదీకాక ఆ కర్ర ఏమిటి కర్ర చివర గిన్నె మేకుతో బిగించి అందులో నాకు నైవేద్యం పెడుతున్నావ్ పోకిరి సినిమాలో ఆలీ అలాటి కర్ర డిప్ప తో అడుక్కున్నట్లు .
పూజారి -క్షమించాలి రామయ్యా .కరోనా వైరస్ భయం వల్ల అలాచేస్తున్నాను .ఇంకో పదిహేను రోజులు తప్పదు .
రామ- –నీ భయం చూస్తె –కమలహాసన్ ‘’తెనాలి’’ సినిమాలో బతుకు ,భయం చావు భయం ,తింటే భయం, తినకపోతే భయం, కూచుంటే భయం, నుంచుంటే భయం అంటూ డాక్టర్ తో ‘’భయం దండకం’’ చదివినట్లుంది .అది సరే .పొద్దున్న సుప్రభాతం లేదు ,బాలభోగం లేదు, నైవేద్యమూ అంత౦త మాత్రమె,వండిన గిన్నెలుమాత్రం పెద్దవే తెస్తున్నావ్ .నాకుమాత్రం మూతికి వాసన చూపిస్తూ కాలక్షేపం చేస్తున్నావ్ .భక్తులరద్దీ కూడా లేదు .అప్పుడొకరు అప్పుడొకరు తప్ప.
పూజారి –స్వామీ !ఇది దేవరహస్యం .ఎవరికీచెప్పలేను .తప్పనిపించినా తప్పటం లేదు ప్రభూ
దేవుడు -అదేదో బద్దలు చెయ్యి
పూజారి –కష్టం స్వామీ .
రామ- –నన్నే చెప్పమంటావా .నువ్వే చెబుతావా
పూజారి –సర్వాంతర్యామివి నీకు తెలియని రహస్యాలు౦టాయా రామయతండ్రీ .నువ్వెందుకు లే. నేనే చెప్పి పాపప్రక్షాళన చేసుకొంటా.ఆలయ చైర్మన్ ,కమిటీ మెంబర్లు అందరికీ ఇళ్ళకు ప్రసాదాలు పంపకపోతే రోజూ ప్రసాదం ‘’పడి ‘’మంజూరు చేయరు .నువ్వు తినేదిలేదు, నేనూ నాపిల్లలూ తినేది లేదు .దేవుడి సొమ్ము దెయ్యాలపాలు అంటే ఇదేనేమో స్వామీ మన్నించు .
అయినా ఇన్ని సినిమా కబుర్లు చెబుతున్నావ్ నీకెలా తెలుసు ?
రామ- –గుడిలో టివి ఉందిగా .నువ్వు ఆన్ చేసి నీమానాన నువ్వు పొతే కాలక్షేపం లేక చెత్తలన్నీ చూడాల్సోస్తోంది .ఖర్మ .అది సరే ఇవాళ శ్రీరామనవమి కదా విశేషం ,కల్యాణం ఉన్నాయా ?ఇవాళాపస్తేనా ?
పూజారి- లేకేం ప్రభో .అన్నీ జరిపిస్తా .ట్రస్టీ గారు 10కిలోలబెల్లం ,దానికి సరిపడా దినుసులు పానకం కోసం కొన్నారని చక్రపొంగలి పులిహోర నైవేద్యాలకూ భారీ ఏర్పాటు చేశారని కబురపి౦చారు .
రామ –ఐతే నా పుణ్యం ఈరోజు పుచ్చిన్దన్నమాట .ఆ సరుకు లేవీ ఇక్కడ కనబడటం లేదే .
పూజారి –ఓయి తెలివి తక్కువ రామయ్యా !అవి రసీదులకు ,బిల్లులకే కాని వినియోగానికి కాదని నీకు తెలీదా”?
రామ –అయ్యో రామ .ఇదో భాగవతమా ?ఇంతకీ కల్యాణం అయినా ఘనం గా చేస్తావా ?దాని ఏర్పాట్లు ఎలా ఉన్నాయ్ ?
పూజారి –ఘనంగానే మాటల్లో .చేతల్లో మాత్రం ఏమీ ఉండదు .అరె గుట్టుచేప్పేశానే ..నూతనవస్త్రాలు ,పూజా సామగ్రి,తలంబ్రాల బియ్యం ,దండలు మేళాలు –
రామ –ఎంతకమ్మని మాటలు చెప్పావయ్యా
పూజారి –నీకు ఆత్రం ఎక్కువ కోదండ రామా .అవి కొందామంటే దుకాణాలు ఉదయం 9కే బంద్ ట .అవేమీ కుదరవన్నాడు ట్రస్టీ .
రామ –నాసంతోషం పై పానకం నీళ్ళు కుమ్మరించావు కదయ్యా .ఇవీ కొంటాడా కొన్నట్లే అనుకోమంటాడా
పూజారి –ప్రత్యేకించిచెప్పేదేమీ లేదు స్వామీ .అన్నిటికీ ల కేత్వమిస్తే , దాకు కొమ్మిస్తేనే.అంటే ‘’లేదు ‘’అని అర్ధం అని చెప్పాలా ,సర్వాంతర్యామి ?
రామా –అసలు రేపు కల్యాణం ఎలా నిర్వహిస్తావ్ ?
పూజారి –సీతమ్మతల్లి నీ ప్రక్కన కూర్చోబెడదామంటే ‘’టచ్ ‘’భయం .నిరుటి కొబ్బరి చిప్పలు లు మంగళసూత్రాలు మట్టెలూ ,ఉత్తర జంధ్యాలు ఉన్నాయిలే .నిత్యపూజకు పూవులేలేవు .ఇక దండలేక్కడి నుంచి తేనయ్యా ,?అర్ధం చేసుకోవూ .మామూలుగా వాడే అక్షితలే తలంబ్రాలుగా వాడుతా .పీటలపై కూర్చుని కల్యాణం జరిపేవారు ఉండరుకనుక .కూతా మేతా రెండూ నేనే . భక్తులకూ ప్రవేశం లేదు కనుక ఇంట్లో చేసిన వంటలే నైవేద్యం .ఎలాగూ జీలకర్రా బెల్లం ఇంట్లో ఉండేవే కనుక నూరించి తెచ్చి మీ దంపతుల శిరసులపై నేనే ఉంచి మా౦గల్యాలూ వగైరా మీరు చేసినట్లే యాక్ట్ చేసి ,మా౦గల్య ధారణా నేనే చేసి సారీస్వామీ నువ్వు చేసినట్లుగా నేనే నటించి ఆపనీ చేస్తాను .తలంబ్రాలు కూడా నేనే పోస్తాను మీ ఇద్దరికీ .మేళాలు తాళాలు ఉండరాదుకనుక దేవుడిగంటే ‘’నౌబత్ ఖానా ‘’అనుకోని నెమ్మదిగా వినిపించీ వినిపిచాకుండా ఆ ఆవిడతో కొట్టించి తంతు జరిపిస్తా . సమ్మతమేనా రామా ?
రామ –ఇదోటా నా ఇస్టా యిష్టా లతోనే ఇవన్నీ చేస్తున్నట్లు ఆపోజోకటి .సరే అలాగే అఘోరించు .
పూజారి –కోపం వచ్చింది దేవరకు . స్వామీ –మొత్తం పావుగంటలో గుంటకొట్టిగంట వాయి౦ చేస్తాగా డోంట్ వర్రీ.
రామ –వర్రీ లేదు కర్రీ లేదు .ఇక ఆలస్యం చేయకుండా తంతు పూర్తి చెయ్యి .ఇవీ ‘’ఆలీ చిప్పలతోనే ‘’చేస్తావా ?
పూజారి –ఎంతమాట .తప్పదు స్వామి .కనీస దూరం ,ముక్కుకు’’ ముసుగు ‘’అదే లే స్వామీ ‘’మాస్కు ‘’ నాకూ ,మీ దంపతులకూ తప్పదు.
రామ –అంటే’’ కరోనా కల్యాణం’’ జరిపిస్తావన్నమాట.
పూజారి –అంతేగా ,అంతే మరి.

సీన్ -2-వైకుంఠం
లక్ష్మి -నాథా! వామా౦క౦ మీద ఎప్పుడూ ఉండే నన్ను దూరంగా పీఠం మీద కూర్చోపెట్టి వినోదం చూస్తున్నారు .అంత అంటరాని దానినైపోయానా ?
విష్ణు –లేదు శ్రీదేవీ !జాగ్రత్త పడుతున్నా .అదేదో క్రిమి ప్రపంచమంతా పాకి భయపెడుతోందట .ఇక్కడికి కూడా వచ్చిందేమో అని భయం
లక్ష్మి –వస్తే ఏం చేస్తుంది .అసలు ఎలా వస్తుంది ఇక్కడికి .
విష్ణు –మనభక్తులు ఇప్పుడు భారత దేశం లోనే కాదు ప్రపంచమంతా ఉన్నారు ఎక్కడ ఏ దేశం లో ఏ భక్తుడి పుణ్యమో పుచ్చి ఇక్కడికి రావచ్చు. అతడు కరోనా బాదితుడూకావచ్చు.
లక్ష్మి -ఐతే
విష్ణు –ఆతను వెంటతెచ్చే క్రిమి మనం తాకితే దాని బారి పడినట్లే .స్పర్శ వల్ల వ్యాపిస్తుందట ఆజబ్బు .అందుకే నీకూ నాకూ అంత౦ దూరం .మన మధ్య ముద్దులు ముచ్చట్లు సరసాలు సల్లాపాలు కౌగిలింతలూ కేరింతలు ఇక బంద్.సమాన దూరమే మనల్ని కాపాడేది .
లక్ష్మి –మన౦ అన్నిటికీ అతీతులం .మనల్నేవరూ ఎమీచేయ లేరని ధీమాతో ఉన్నాం .మనకీ కస్టాలేమిటి స్వామీ ?
విష్ణు –ఆ క్రిమి మనకంటే శక్తివంతం .దానిముందు నా చక్రాయుధం శివుడి త్రిశూలం ఇంద్రుని వజ్రాయుధం కూడా బలాదూర్ .అందుకే అన్ని జాగ్రత్తలు .
లక్ష్మి –మూతికి ఎదోకట్టుకొన్నారేమిటి నాధా?
విష్ణు –అదే ఇప్పుడు వజ్రకవచం అందరి పాలిట .నీకూ ఒకటి తయారు చేయించా ఇదిగో కట్టుకో .
లక్ష్మి –ఇదికట్టుకొని మాట్లాడితే పెదిమలుకదుల్తున్నాయేకాని శబ్దం బయటికి రావట్లేదు .అగ్గి రాముడు సినిమాలో మూతికీ ముక్కుకూ కళ్ళకూ రామారావు గుడ్డకట్టుకొన్నట్లుంది .
ఈ బాధ తప్పదా నాధా?
విష్ణు –ఇంకో పదిహేను రోజులు ఈ అవస్థ తప్పదు దేవీ భరించాలి. మనకోసం మన లోకం మన పిల్లలు మనవలు మనవరాళ్ళు ,దాస దాసీ జనం కోసం కోసం .వాళ్ళకీ ఈ గుడ్డలు తయారు చేయిస్తున్నాను .
శ్రీరామనవమి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-4-20-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

కరోనా –ఆర్ధిక౦ గా ‘’క్యా కరోనా’’?

కరోనా –ఆర్ధిక౦ గా ‘’క్యా కరోనా’’?
చైనా ఊహాన్ సిటి లో కిందటి డిసెంబర్ లో బయల్దేరిన కరోనా వైరస్ నాన్ స్టాప్ గా 110ప్రపంచ దేశాలను చుట్టేసింది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది .దీని విస్తృత వ్యాప్తి వలన ప్రపంచఆర్ధిక పరిస్థితి ,మార్కెట్ వాణిజ్యం పై విపరీత మైన ఫలితాలు చూపి ,మనుషులను’’ శవాలు’’గా మార్చటమేకాక’’ పెను సవాలు’’గా మారింది .ముందు చూపుగా ఆర్ధిక సంస్థలు, బ్యాంకులు విశ్వవిపణి ని దృష్టిలో పెట్టుకొని కోతలు విధించాయి .దీనివలన ఆర్ధిక సహకార సంస్థలు ,అభి వృద్ధి సంస్థలు వెనకడుగు వేశాయి .అదే సమయం లో కరోనా వైరస్ వలన గ్లోబల్ ఎకానమీ పై ప్రభావం కలిగించి ,ప్రపంచవ్యాప్త మార్కెట్లు కుదేలైపోయాయి .స్టాక్ ధరలు ,బాండ్ ల ధరలు కుంచించుకు పోయాయి .కరోనా వైరస్ వలన ఎంతమంది ప్రపంచ వ్యాప్తంగా మరణించారు అనేదానికన్నా ,నివారణ చర్యలు చేబట్టటానికి ఆర్ధిక పరిపుష్టి పూర్తిగా దెబ్బతిని పోయినందుకు ఎక్కువ బాధపడాల్సి వస్తోంది .ఇదే పెద్ద నష్టం గా కనిపిస్తోంది .గ్లోబల్ రిసేర్చ్ లో ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ కు చెందిన ‘’బెన్ మేయో ‘’దీనిపై స్పందిస్తూ ‘’చైనా చేసినట్లు అన్ని దేశాలు లాకౌట్ ఇష్టం వచ్చినట్లు దామాషా ప్రకారం కాక ప్రకటిస్తే ప్రపంచ ఆర్ధిక స్థితి బలహీనమై ,విపరీతమైన భయం కలిగిస్తుంది. అంటే’’ పానిక్’’ గా మారుతుంది ,గ్లోబల్ ఎకానమీ పెరుగుదల 2020లో2.9గా ఉండాల్సింది ,2.4కు పడిపోతుంది ,ఉత్పత్తి రంగం దెబ్బతిని ఉత్పత్తి తగ్గుదల అవుతుంది .చైనా ఈ ప్రభావాన్ని పొందటం వల దానిప్రభావం ఇతరదేశాలపైనా పడింది .ఆసియా ఫసిఫిక్ ఎకనామీ లైన వియత్నాం సింగపూర్ దక్షిణ కొరియాలు దెబ్బతినిపోయాయి .
సేవా సెక్టార్లు విపరీతంగా దెబ్బతిని, బలహీనపడ్డాయి.ప్రపంచ మార్కెట్ లో అతిపెద్దదైన,విస్తృతమైన వినియోగదారు మార్కెట్ -కన్సూమర్ మార్కెట్ ఫిబ్రవరిలోనే కుంచించుకు పోయింది .గ్లోబల్ ఎకానమీ అనిశ్చితం లో ఉండటం లో ప్రపంచ వ్యాప్త ఆర్డర్లు లేకపోవటం కూడా ముఖ్యకారణం .దీనివలన విశ్వవ్యాప్త ఆయిల్ డిమాండ్ బాగా తగ్గిపోయి,ఆయిల్ ధరలు బాగా తగ్గిపోయాయి .ప్రొడక్షన్ కట్ కు ఒపెక్కూ దాని అనుబంధ సంస్థలకు ఒప్పందం పై భేదాభిప్రాయం ,జగడం రావటం తో ఇటీవల మళ్ళీ ఆయిల్ ధరలు ఇంకా తగ్గిపోయాయి .కాని భారత్ సహా ప్రభుత్వాలు వినియోగదారులకు మాత్రం ఊరట కలిగించకపోవటం శోచనీయం .’’కరోనా వైరస్ ఎపిక్ సెంటర్ ఐన చైనా ‘’క్రూడాయిల్ ను అత్యధికంగా దిగుమతి చేసుకొనే దేశం .ఇటలీ ,ఇతర యూరోపియన్ దేశాలు కరోనా వైరస్ భయంతో ఆయిల్ డిమాండ్ ను తప్పని సరిగా తగ్గించుకోవాల్సి వచ్చింది .
కోవిద్-19 వ్యాప్తి భయం వలన ఇన్వెస్టర్లు వెనకడుగు వేయటంతో ,ఆర్ధికరంగం కుదేలై స్టాక్ ధరలు తగ్గిపోయాయి .మార్కెట్ సెంటిమెంట్ ను కరోనా వైరస్ ఉత్పత్తి స్టాక్ మార్కెట్ ,లతోపాటు ఆర్దికమార్కేట్ లపై ఒత్తిడి- స్ట్రెస్ కూడా పెంచి ప్రభావితం చేస్తుంది .బాండ్ ల విలువ బాగా తగ్గిపోతుంది .అమెరికా ట్రెజరికి ఆ దేశ ప్రభుత్వమే వెన్నెముక .కాని అనిశ్చిత మార్కెట్ వలన ఇన్వెస్టర్లు పారిపోతున్నారు .దీని ప్రభావంతో అమెరికా ట్రెజరీ కిందటివారం లో ఇది వరకు ఎన్నడూ లేనంతగా 1%కంటే క్రిందకు పడిపోయి,భయం కలిగించింది .గత పదేళ్ళలో దాని చారిత్రకపతనం 0.3% కు రావటం భీతికోల్పే విషయమే .దీనితో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ,మళ్ళీ వడ్డీ రేట్లను తగ్గించాల్సి వస్తుంది అని ఆర్ధిక విశ్లేషకుల అంచనా .అమెరికా సెంట్రల్ బాంక్ అత్యవసరంగా 50 బేసిక్ పాయింట్లను గతవారం కోతకోసింది .దీనివలన టార్గెట్ ఫండ్ 1నుంచి 1.25% కు పెంచుకొన్నది .
ఇన్వెస్ట్ మెంట్ ,కంపెని షేర్లు కొనుగోలు అమ్మకాల వలన పెన్షన్ దార్లకు మదుపరులకు పెద్ద నష్టం కలిగింది .ఇండస్ట్రియల్ యావరేజ్ ,నిక్కీలుడిసెంబర్ 31తర్వాత భారీ పతనాన్ని చవి చూశాయి .ఒక్కరోజులోనే ఈపతనం రావటం ఇన్వెస్టర్లను ఆందోళన పరుస్తోంది .ఈ ఆర్ధికపతనాన్ని తగ్గించటానికి ప్రభుత్వాలు తీసుకొన్న తీసుకొంటున్న చర్యలు ‘’అరకోర’’ మాత్రమె తప్ప సమర్ధమైన స్థిరమైన చర్యలు కావు అంటున్నారు ఆర్ధిక నిపుణులు .దీనికి జవాబుగా ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్ తో సహా అన్ని దేశాల సెంట్రల్ బాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి .దీనివలన అప్పుతీసుకోవటం తేలిక అవుతుంది ,ఖర్చు ధారాళంగా పెట్టి ఆర్దికానికి కొమ్ముకాయవచ్చు అని భావన .అమెరికా సెనేట్ కూడా 2ట్రిలియన్ డాలర్ల కరోనా వైరస్ సహాయం ఆమోదించి వర్కర్లకు వ్యాపారస్తులకు వెసులుబాటు కలిగించింది .మన దేశప్రదానికూడా అలానే భారీ మొత్తాన్ని సాయంగా ప్రకటించాడు .కానీ ఇదంతా ‘’అత్యుల్లాసం ‘’,’’త్వరగా ఆవిరి అయ్యే ‘’(వోలటైల్ )విధానమే కాని శాశ్వతం కాదని అంతర్జాతీయ ఆర్ధిక నిపుణులు పెదవి విరిచారు .అమెరికాలో 3మిలియన్ల ప్రజలు కరోనా వైరస్ బాధితులుగా సహాయం కోరుతున్నారు .వీరికి ఇంకం టాక్స్ కట్టింగ్ లు పోను చేతికి ఎంతవస్తోందో బ్రాహ్మ పదార్ధం గా ఉన్నదట .మనకూ అదే పరిస్థితి.
100పైగా దేశాలు కరోనా వ్యాప్తి భయం తో ప్రయాణాలపై, రవాణాపై ఆంక్షలు విధించటం ,విమానాల సంఖ్య, ఫ్లైట్ ల సంఖ్య తగ్గించటం తో బిజినెస్ వాళ్ళు టూర్లు ,హాలిడే ట్రిప్ లు రద్దు చేసుకోవటం తో రవాణా పరిశ్రమ చాలా పెద్ద దెబ్బే తిన్నది.యూరోపియన్ ఎయిర్ పోర్ట్ లనుండి అమెరికాకు ప్రయాణీకులను బాన్ చేశాడు ట్ర౦ప్ .చైనా వారిని గృహ నిర్బంధలో ఉంచటం తో ఇంగ్లాండ్ కు గత 12నెలలలో రావాల్సిన 4,15,000 విజిట్లు ఆగిపోయి గొప్ప నష్టం కలిగించింది బ్రిటన్ కు. అన్ని దేశాలవారికంటే చైనావారు ఇంగ్లాండ్ కు సరాసరి అత్యధిక ధర 1,680పౌండ్లు ఖర్చు చేసివచ్చే ఆదాయం’’ లాస్’’అయ్యారు .సూపర్ మార్కెట్ లు, ఆన్ లైన్ డెలివరి సర్వీసు ల వలన సరుకుల అత్యంత డిమాండ్ ఏర్పడిందని తట్టుకోవటం కష్టంగా ఉందని ముఖ్యంగా టాయిలెట్ పేపర్లు, బియ్యం ,ఆరంజ్ జూస్ లకు ఉన్న డిమాండ్ తీర్చటం కష్టతర మై పోతోందని బాధ పడుతున్నారు సప్ప్లియర్స్ .గుడ్డిలో మెల్ల గా వాతావరణ పొల్యూషన్ బాగా తగ్గిపోయింది ప్రయాణాల రద్దు మూలకంగా .చైనా ఉత్పత్తి మొదటి రెండునెలలలో దాదాపు 14శాతానికి పడిపోయిందట
అనిశ్చిత పరిస్థితులలో దేనిపై పెట్టు బడి పెట్టాలని సందేహం ఎక్కువగా ఉంటుంది .అన్నిటికన్నా బంగారం పై పెట్టుబడి ‘’సేఫ్’’ అని అందరి భావన.కాని ఈమార్చిలో ‘’బంగారు’’ కూడా ‘’కంగారు ‘’పడింది . ధర తగ్గిపోయి గ్లోబల్ వైడ్ గా ఇన్వెస్టర్లకు కన్నీళ్లు తెప్పించింది .ఇంకా ఎక్కువ కాలం లాక్ డౌన్లు, లాకౌట్లు పొడిగిస్తే ఆర్ధిక రేటు అత్య౦త నిరాశాజనకమై భయ పెడుతుందని ఆర్ధిక వేత్తల హెచ్చరిక .ముందు బాగానే ఉంటుంది .తర్వాతే మండిపోతుంది .పెద్ద నోట్లు రద్దు చేసిన మోడీ ని అవతార పురుషుడని ఆకాశానికి ఎత్తేశారు ఆతర్వాత నెలకే అందులోని డొల్లతనం బయట పడి ఈసడించారు .అలా మళ్ళీ కాకూడదని, కాదని భావిద్దాం. మనం మాత్రం ప్రకృతిని, పర్యావరణాన్నీ కాపాడుకొంటూ, శుచి, శుభ్రత పాటిస్తూ ఒకరికొకరం దూరం గా ఉంటూ, బుద్ధిగా ఉండి కరోనా మహమ్మారిని తరిమేద్దాం .
రేపు శ్రీరామనవమి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-4-20-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 561-వాణికీతౌ యక్షౌ పునరాయతౌ కర్త –గుళ్ళపల్లి శ్రీ రామ కృష్ణ మూర్తి (1918)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం

561-వాణికీతౌ యక్షౌ పునరాయతౌ కర్త –గుళ్ళపల్లి శ్రీ రామ కృష్ణ మూర్తి (1918)

గుళ్ళపల్లి శ్రీరామ కృష్ణమూర్తి 11-11-1918న ప గో జి లో పుట్టాడు .తిరుపతి రాష్ట్రీయ సంస్కృత పీఠం హెడ్ .శిక్షాశాస్త్రి సాహిత్య ప్రవీణ ,విద్యా వారిధి . వాణికీతౌ యక్షౌ పునరాయతౌ అనే ఒకేఒక పుస్తకం రాశాడు .ఉత్తర ప్రదేశ్ సంస్కృత సాహిత్యపురస్కారం అందుకొన్నాడు

562-ఉదాహరణ కావ్య కర్త –సంగీత గుండేచ(1974)

సంగీత గుండెచ 1-4-1974 ఉజ్జైన్ దగ్గర శక్తిపూర్ లో పుట్టాడు .భోపాల్ సంస్కృత సంస్థాన్ ప్రొఫెసర్ .సంస్కృత ఎం ఏ పిహెచ్ డి,మ్యూజిక్ లో మాస్టరీ .ఉదాహరణకావ్య ,భాషాకా రంగమంచ ,సమకాలీన రంగమంచ మే నవన్యాయ శాస్త్రకి ఉపస్థితి అనే 3పుస్తకాలు రాశాడు

563-అభినవ సీతా రామ సంవాద ఝరి కర్త –బచ్చు సుబ్బారాయ గుప్త (1902)

1902 నవంబర్ లో కర్నూలులో పుట్టిన బచ్చు సుబ్బారాయ గుప్తఒకే ఒక గ్రంథం అభినవ సీతా రామ సంవాద ఝరి రాశాడు

564-సులభ సోపాన కర్త –అఘోరే నాథ గుప్త (1841)

1841యుపి నాడియాజిల్లా శాంతిపూర్ లో జన్మించిన అఘోరే నాథ గుప్త 9పుస్తకాలు రాశాడు .అందులో శ్లోక సంగ్రహ ,సులభ సోపాన ,ధర్మతత్వ ,సులభ సమాచార ఉన్నాయి .బౌద్ధధర్మ నిష్ణాతుడు ,బ్రహ్మ సమాజ ఉపాధ్యాయుడు ,తాపసి .

565-చందోలోకారమంజరి కర్త –కాంత గుప్త (1935)

11-11-1935 యుపి లో నగీనాలో పుట్టిన కాంత గుప్త రసిక బిహారీ శిష్యుడు .ప్రొఫెసర్ .చందోలోకారమంజరి మాత్రమె రాశాడు .

566-వేదాంత సార కర్త –మనోరమా గుప్త (1956)

సాహిత్య వేద దర్శన లో డిలిట్ మనోరమాగుప్త 1956 డిసెంబర్ 10 కాన్పూర్ లో పుట్టింది .కాన్పూర్ మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యామందిర్ లో సంస్కృత హెడ్ .2పుస్తకాలు –వేదాంతసార ,సాంఖ్యకారిక రాసింది .

567-మూల్యాన్య మూల్యాని కర్త –శశి గుప్త( 1946)

1946 నవంబర్ 8 రాజస్థాన్ బికనీర్ లో పుట్టిన శశి గుప్త,అక్కడే భైరవ రత్న స్కూల్ సంస్కృత లెక్చరర్ . మూల్యాన్య మూల్యాని అనే పుస్తకం మాత్రమె రాసింది

568-ఋగ్వేద పరిచయ కర్త –సుదీర్ కుమార్ గుప్తా (1917)

1917లోహర్యానా గుర్గావ్ లో పుట్టిన సుదీర్ కుమార్ గుప్తా సంస్కృత ఎం. ఏ .పి.హెచ్ డి.యూనివర్సిటి ఆఫ్ రాజస్థాన్ ,గోరఖ్ పూర్ యూని వర్సిటీలలో లెక్చరర్.రాసిన 5లో ఋగ్వేద పరిచయం ,సంస్కృత సాహిత్యస్య సుబోధ ఇతిహాస ,భారతీయ దర్శనస్య సంప్రదాయ ,దండి భాణయోరేక మధ్యయానం ,వేదలావణ్యం రాశాడు .రాజస్థా సంస్కృత అకాడెమి పురస్కార గ్రహీత .

569-సంస్కృత ఛందో విధానం కర్త-వినోద్ కుమార్ గుప్తా (1972)

వినోద్ కుమార్ గుప్తా 1972 నవంబర్ 14 తెహ్రిగద్వాల్ లో పుట్టాడు. అక్కడే ప్రభుత్వ పి.జి .కాలేజిలో ప్రొఫెసర్ .సంస్కృత ఛందో విధానం మాత్రమె రాశాడు .

570-హితోప దేశ నీతి శతక కర్త – బ్రిజేంద్ర సింగ్ గుజార్ (1972)

1972 ఆగస్ట్ 1 రాజస్థాన్ లో పుట్టిన బ్రిజేంద్ర సింగ్ గుజార్ విద్యావారధి ,ప్రవక్త ,ప్రాచార్య శ్రీ మా మహా విద్యాలయ .హితోపదేశ నీతి శతకం మాత్రమె రాశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-3-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రక్త బీజుని రక్త సంబంధివా ?

రక్త బీజుని రక్త సంబంధివా ?

image.png
ఒళ్ళంతా ముళ్ళు
ముఖమంతా ఉమ్మెత్త కాయ
పోలికగా పొడవైనవాడిముళ్ళ భీభత్స రూపం
పూర్వం ఎందరెందర్నో
మహామ్మారుల్ని చూశాం
వాటన్నిటికంటే వికృత రూపం నీది
తలచుకొంటేనే ఒళ్ళు జలదరిస్తోంది
పూర్వం రక్త బీజ రాక్షసుడి
అనుంగు సోదరివా, రక్తసంబంధివా?
వాడి రక్తం బిందువు నేలపై పడితే
అనంతంగా వాడి లాంటి వాళ్ళు పుట్టి
భీభత్సం చేసి భయపెట్టేవారట
అవతలి వాడికి జయించటం
అలవికాక ఉసూరు మనేవాడట
నీ పరిస్థితీ ఇలానే ఉంది కరోనా !
ఒక్కసారి శరీరం లోకి నువ్వు ప్రవేశిస్తే
లక్షాలాదిగా పెరిగిపోయి జీవన ప్రక్రియలు
స్థంభి౦ప జేసి ఉసురు
తీస్తావట సునాయాసంగా
ముట్టుకుంటే అంటుకు పోయి పెను ముప్పు
తెస్తున్నావు ప్రపంచ మానవాళికి
ఇప్పటికే విశ్వమంతా వ్యాపించి
నలభై వేలమందిని నీ కరాళ కోరలతో
కబళించేశావ్ ,భీభత్సం సృస్టించావ్.
మహా రాణిని అనుకొన్నావా
కిరీటం( కోరోనా )పెట్టుకోన్నావ్ ?
మహమ్మారికి అంతటి అహం వద్దు
ప్రతి కుక్కకూ ఏదో రోజు చావు తప్పదు
రక్త బీజుడినే వణికించి
అమ్మకాళికాదేవి ఉగ్రరూపం దాల్చి
వాడి ఒక్క రక్తపు బొట్టు నేలమీద పడ కుండా
రక్త బీజ పునరుత్పత్తి జరక్కుండా
అనంతమైన నాలుకను నేలంతా చాచి
నిలువునా వాడిని సంహరించి
లోకోపకారం చేసిందని మర్చిపోకు
ఇప్పుడు ప్రపంచమంతా అత్యంత జాగృతమైంది
మా అశక్తత ,అలసత్వం ,విచ్చలవిడితనం నీకు
ఆసరా అయి మా ప్రాణాలతో చెలగాటమాడావ్
ఇక నీ ఆటలు సాగనివ్వం
నీ సంహారానికి మందే అక్కరలేదు
శుచి ,శుభ్రత ,దూరం పాటించి నిన్ను
తరిమి తరిమి కొట్టి ఉపశమనం పొందుతాం
అందరం’’ మహ౦ కాళీ’’ స్వరూపులమై
మమ్మల్ని మేము సంరక్షి౦చు కొంటాం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-3-20-ఉయ్యూరు

Posted in రచనలు, సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 551-భావ శతక కర్త –చంద్ర కిషోర్ గోస్వామి (1938)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం

551-భావ శతక కర్త –చంద్ర కిషోర్ గోస్వామి (1938)

27-21938 న రాజస్థాన్ భరత్ పూర్లో జన్మించిన చంద్ర కిషోర్ గోస్వామి సంస్కృత పిహెచ్డి,ఫ్రెంచ్ డిప్లోమాహోల్డర్.వనస్థలి విద్యా పీఠం లో దర్శన వేదిక్ స్టడీస్ లో ప్రొఫెసర్ .సంపూర్ణానంద మిశ్ర ,కాడి పుండరీక ,కృష్ణచంద్ర శర్మ ,ప్రేమనిది శాస్త్రి గురుపరంపర .భావశతకం , పృధ్విరాజ జయం ,కావ్యాంజలి ,దాన వీర కర్ణ,గీతాంజలి రాశాడు .రాజస్థాన్ ప్రభుత్వ సంస్కృత పురస్కారం ,అంబికా దత్ వ్యాస్ పురస్కారం పొందాడు .

552-హఠ యోగ ప్రదీపిక కర్త –గోకులేంద్ర నారాయణ దేవ గోస్వామి (1968)

1968ఏప్రిల్ 1న అస్సాం లో ద్వీపరసాస్ట్ర నల్బరి లో పుట్టిన గోకులేంద్ర నారాయణ దేవ గోస్వామిగౌహతి ప్రభుత్వకాలేజి మీమా౦స శాస్త్ర హెడ్ .రాసిన 17పుస్తకాలలో హఠ యోగ దీపిక ,వేదమంజరి ,రాదా తంత్ర ఉన్నాయి .హేమ చంద్ర గోస్వామిఅవార్డ్ పొందాడు .

553-విరహిణీ వ్రజా౦గనా కర్త –గోర్ కిషన్ గోస్వామి (20శతాబ్ది )

20వ శతాబ్దికి చెందిన గోర్ కిషన్ గోస్వామి-కావ్య తీర్ధ .,పురాణ ,దర్శన తీర్ధ .ఆయుర్వేద శిరోమణి .బృందావన్ గురుకుల ఆయుర్వేద ఫాకల్టి హెడ్ .విరహిణీ వ్రజా౦గనా అనే ఏకైక కావ్యం రాశాడు .

554-సింహ సిద్ధాంత సి౦ధు కర్త –హరి కృష్ణ గోస్వామి( 1909-1979)

1909లో రాజస్థాన్ జైపూర్ మహాపుర లో పుట్టిన హరి కృష్ణ గోస్వామి-సాహిత్య ,న్యాయ ,శుద్ధాద్వైత వేదాంత నిష్ణాతుడు .ఉదయపూర్ సంస్కృత కాలేజి ప్రొఫెసర్ ,అజ్మీర్ సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ .రాసిన 25పుస్తకాలలో సింహసిద్ధా౦త  సింధు ,ఆదర్శ సౌందర్యం ,లలితాకథ కల్పలత ,దివ్యాలోకః ఉన్నాయి .1979లో 70ఏళ్ళ వయసులో చనిపోయాడు .గద్యపద్య స్మార్ట్ అవార్డ్ ,మాఘ  అవార్డ్ లుపొందాడు .

555-వర్షావలి కర్త –హరిరాయ్ గోస్వామి (1950)

1950మే 22 జోద్ పూర్ లోపుట్టిన హరిరాయ్ గోస్వామి సాహిత్య ఆచార్య .మాఘ పురస్కార గ్రహీత .రాసిన 7పుస్తకాలలో జరాసంధవధ మహాకావ్యం ,వర్షా వలి ,పురుస్సంభవ మహాకావ్యం ఉన్నాయి .

556-మహాత్మా విదుర కర్త –రోహిణీ వల్లభ శాస్త్రి గోస్వామి (1952)

1952అస్సాం దేరాగావ్ లో పుట్టిన రోహిణీ వల్లభ శాస్త్రి గోస్వామి జ్యోతిష  శాస్త్ర ఆచార్య .మహాత్మా విదుర ,భక్తరాజ ,సంస్కారతత్వ ,సుభాషితం మొదలైన 13పుస్తకాలు రాశాడు .

557-అవయవ చింతామణి కర్త –సుబుద్ధి చరణ్ గోస్వామి (1944)

1944 మే 20న వెస్ట్ బెంగాల్ బర్ద్వాన్ లో పుట్టిన సుబుద్ధి చరణ్ గోస్వామి-కలకత్తా రవీంద్రభారతి యూనివర్సిటి ప్రొఫెసర్ .గణేశ అవయవ చింతామణి ,కణాద టిప్పణి రాశాడు .

558-స్మార్త ప్రభు కర్త –విద్యాధర్ గౌర్ (1886-1941)

1886 హర్యానా రొహ్ టక్ లో   పుట్టిన విద్యాధర్ గౌర్ కాశీ హిందూ యూనివర్సిటి డీన్.పండిట్ ప్రభుదత్త గౌర్ ,పండిట్ వామచరణ గురుపరంపర .అనేకమంది ప్రసిద్ధ శిష్యులున్నారు స్మార్త ప్రభు ,ప్రతీషాప్రభు  ,వివాహ ,ఉపనయన పధ్ధతి ,వాస్తు శాంతి పధ్ధతి మొదలైన 8పుస్తకాలురాశాడు .1941లో 55వ ఏటనే మరణించాడు .మహామహోపాధ్యాయ ,వైదిక, స్మార్త యాజ్ఞిక సామ్రాట్ ,వైదిక చక్రవర్తి ,విద్యా  వాచస్పతి ,విద్యాభూషణ ,ధర్మాలంకార ,మహాపండిత మొదలైన సార్ధక బిరుదాంకితుడు

559-ధర్మ విజయ చంపు కర్త –కె.వి .గోవిందం (1948)

1948సెప్టెంబర్ 3పుట్టిన కె.వి .గోవిందం-శిక్షా శాస్త్రి, విద్యా వారిది .కృష్ణ  యజుర్వేద తైత్తిరీయ శాఖ ,మీమాంస , విశిష్టాద్వైత ల లోతులు తరచినవాడు .తిరుపతి రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సలర్ .17పుస్తకాలు రాశాడు .అందులో ధర్మ విజయచంపు ,ఆత్మత్వ జాతి విచార ఉన్నాయి .నవ్యన్యాయ ప్రవీణ్ విపశ్చిన్మణి బిరుదాంకితుడు .ఎన్నో అకాడేమీలనుంచే కాక ప్రెసిడెంట్ అవార్డీ కూడా

560-పంచనద దేశస్తవః-కర్త –పండిట్ చంద్రశేఖర శర్మ గులేరి (1883-1922)

పండిట్ చంద్ర శేఖర గులేరి 7-7-1883న రాజస్థాన్ అజ్మీర్ లో పుట్టి 12-9-1922న 39ఏళ్ళకే చనిపోయాడు .సాహిత్య దర్శన ,లింగ్విస్టిక్స్ లో నిపుణుడు .అజ్మీర్ మేయోకాలేజి ప్రొఫెసర్ .పృధ్విరాజ విజయ , పంచనద దేశస్తవః(పంజాబ్ స్తుతి ).స్మార్త సిద్ధాంతాన్ని సంస్కృతం నుంచి ఇంగ్లిష్ లోకి అనువదించాడు .సమాలోచన,నాగరీ ప్రచారిణి సంస్కృత పత్రికల సంపాదకుడు .అపూర్వమైన కథలను హిందీలో ‘’ఉస్నే కహా థా’’పేరున రాసి ప్రచురించాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ 29-3-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రపంచ కుగ్రామం ప్రచండంగా కునారిల్లుతోంది

ప్రపంచ కుగ్రామం ప్రచండంగా కునారిల్లుతోంది

ప్రపంచమొక కుగ్రామం మనమంతా ఆ గ్రామవాసులం

అని చాతీ విరిచి రొమ్ము చరఛి నిన్నటి దాకా చెప్పుకున్న మనం

ఇవాళ కరోనా కల్లోలంతో మనిషి మనిషికీ

బారెడు దూరం పాటిస్తున్నాం ,

కలుసుకోవటానికి  భయపడి పోతున్నాం .

లాక్ డౌన్, లాకౌట్ లతో ఏకాకులమై

ఏకాంత కూ దగ్గరకాకుండా

ఏకాంతవాసం చేస్తున్నాం

మన సైన్స్ టెక్నాలజీ లు

 కలిపి ఉంచాల్సిన మనల్ని

క్వారంటైన్ లలోకి నెట్టి 14రోజులు శిక్షిస్తున్నాయి

రెక్కాడితేకాని డొక్కాడని నిర్భాగ్యులు

ఇటు ఆకలి కేకలతో అటు కరోనా కోరలతో

విలవిలలాడుతూ దిక్కుతోచక దిగాలుగా ఉన్నారు

సుమారు అరవై ఏళ్ళక్రితం చైనా కవ్విస్తే

యుద్ధానికి దిగి తుప్పు తుపాకులతోపోరాడి

 బదులు చెప్పలేకకుప్పకూలి  ఓడిపోయాం

నాటి ప్రధాని అవమానభారంతో మంచం పట్టాడు కూడా

ఇప్పుడు మళ్ళీ అదే చైనాలో ప్రకోపించిన కరోనా ను

ముందు నష్టపోయినా తర్వాత తెలివిగా ప్రవర్తించి

ఉపద్రవంనుంచి కాపాడుకొన్నదా దేశం  

వనరులు సమకూర్చుకొని మళ్ళీ ప్రపంచాన్ని శాసిస్తోంది

‘’నాగరకతా వ్యామోహంలో కన్నీళ్ళ నడుక్కుంటున్న

యుగ భిక్షువును నేను ‘’అని ఆనాడేప్పుడో

చెప్పిన కవి వాక్యం  నేడు రుజువైంది.

సుమారు యాభై ఏళ్ళ హస్తం పాలన ను

అపహాస్యం చేసి ,పొడిచేస్తాం నలిపేస్తాం

ఉషస్సులు కుమ్మరిస్తామని గద్దెనెక్కిన నేతలు

ఆర్ధిక పరిపుష్టి సంగతి వదిలేసి వ్యంగ్యబాణాలతో

వ్యవస్థలన్నీ ధ్వంసం చేసి ప్రజాస్వామ్యం అంటే ఇదా

అని ముక్కున వ్రేలేసుకోనేట్లు చేసి

 తమాషా చూస్తున్నారు చేతకాక

తలలు బ్రద్దలు కొట్టుకొంటున్నారు

యాభై ఆరు అంగుళాల ఛాతీలో

నాలుగంగుళాల హృదయం

 మనసు వికసశించలేక అనర్ధంసృష్టి స్తోంది

నిబద్ధతలేని పాలన,ఆలోచనలేని ఆచరణ ,

తొందరపాటు నిర్ణయాలతో ఇప్పటికే

 ఆరేళ్ళు కష్టనష్టాలు పడ్డాం

కరోనా రూపు మాపటానికి లాకౌట్లు గట్రా

తాత్కాలిక ఉపశమనాలే తప్ప

పూర్తి పరిష్కారాలు కాదు

సమర్ధ నాయకత్వం  నిస్వార్ధ జీవనం

 ఆడంబరరహిత పాలన మాత్రమే పరిష్కారం

ఆరోగ్యం పై డబ్బు ఖర్చు చేయలేని ప్రభుత

సువ్యవస్థ లేని ప్రజారోగ్య పధకాలు

మనపాలిటి ఇప్పటిశాపాలు

సంకల్ప శక్తి లేని వాగాడంబరం తెచ్చిన ,తెస్తున్న

అనర్ధాన్ని నేడు మనం అనుభవిస్తున్నాం

తగినన్ని ఆస్పత్రుల్లేవు పడకల్లేవు మందుల్లేవు

మాస్కులులేవు వెంటిలేటర్లు లేవు

చేతులుకాలాక ఆకులు పట్టుకొన్న చందం

ఘనత వహించిన మన ప్రభుత్వాలది

ఎన్నికలలో ఎలాగైనా,ఎన్ని కోట్లు గుమ్మరించైనా,   

ప్రత్యర్ధుల ను అన్ని సామదాన భేద దండోపాయాలతో

ఎన్నిక యంత్రాలనూ మంత్ర జాలం తో

నియంత్రించి, పీ.కే .లాంటి వారికి సలహా వ్యూహాలకోసం

 కోట్లు మంచినీరులా ప్రవహింపజేసి

గెలవాలన్న ధ్యేయం ఉండి గెలిచిన పాలకులకు

ప్రజారోగ్యం తో పనేమిటి ?

అలాంటి పకడ్బందీ వ్యూహాలు ప్రజారోగ్యం కోసం

ఆర్ధిక పరిపుష్టి కోసం వెచ్చిస్తే యెంత బాగుండును ?

ఎవర్ని లాకప్ లో పెడదామా  ఎక్కడ కబ్జా చేద్దామా

 ఎవరి ఇజ్జత్ నాశనం చేద్దామా

 అన్న  వాటిపై పై ఉన్నయావ

ప్రజా సంక్షేమం కోసం పెడితే దేశం నందనవనం కాదా !

ప్రక్కదేశం పై సైనిక దాడి చేసి ఎన్నిక ఫలితం

రాబట్టే నాయకులకు

రైతుల కూలీలనిరుద్యోగుల ప్రభుత్వ వ్యవస్థల

బాగుకోసం ఆలోచించే తీరిక లేకపోబట్టే ఇంత

ఆర్ధిక విష విలయం చుట్టూ ముట్టేసింది

కరోనానే వణకించే శక్తి సామర్ధ్యాలున్న

వారికి ప్రజలతో సంబంధమేమిటి

ఎలెక్షన్ రోజుల్లో తప్ప ?

ఇలాగే ఉంటే పాలించే మీరు .

పాలించటానికి ప్రజలు మిగలరని

ఇప్పటికైనా గుర్తుంచుకోవాలి

అన్నిటికీ రాజకీయం చేస్తే

చరిత్ర హీనులై మిగిలిపోతారు

తస్మాత్ జాగ్రత జాగ్రత

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-3-20-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం

541-రుక్ సూక్త మంజూష కర్త –గౌతమ్ (1936)

4-8-1936న గుజరాత్ అహ్మదాబాద్ లో పుట్టిన గౌతమ్ 120 గ్రందాల రచయిత.అందులో ఆది శంకరాచార్య ,ఛాందోగ్య దీపిక ,కుమార సంభవం ఆఫ్ కాళిదాస ,వైదిక సాహిత్య ఔర్ సాంస్క్రిట్ ఉన్నాయి .

542-నీలమత పురాణ కర్త –వేదకుమారి ఘాయ్(1931

1931డిసెంబర్ 14న జమ్మూ –తావి లో  పుట్టిన వేదకుమారి ఘాయ్,జమ్మూ యూనివర్సిటి రిటైర్డ్ ప్రొఫెసర్ హెడ్ కూడా .10 పుస్తకాలు రాసింది  .వాటిలో నీలమత పురాణం ,పురంధ్రపంచకం ,కాశ్మీర్ కా సంస్కృత సాహిత్య కా యోగదాన ఉన్నాయి

543-యాజ్ఞ్యవల్క్య సహస్ర నామావళి కర్త –పరశురామ ఘనాపాఠి(1914)

1914 ఆగస్ట్ 15 తమిళనాడు కుంభకోణం దగ్గర ఎంగికొల్లై లో పుట్టిన పరశురామ ఘనాపాఠి  సలక్షణ ఘనతంత్ర విద్వాన్ శతపథబ్రాహ్మణ .చెన్నై అమ్బత్తూర్ లోని యాజ్ఞవల్క్య గురుకుల అధ్యాపక్ ,ప్రెసిడెంట్ .యాజ్ఞవల్క్య సహస్రనామావళి అనే ఏకైక గ్రంధరచయిత

544-అభావ విమర్శ కర్త –దీపక్ ఘోష్ (1941)

1941జనవరి 24 కలకత్తాలో పుట్టిన దీపక్ ఘోష్ రాసిన 6పుస్తకాలలో –అభావ విమర్శ ,విలాప పంచిక ,సంస్కృత  రబీంద్ర సంగీతం ,మేఘ విలాప ,సురవాగ్ విలాస ,అమరవిలాప ,ఉజ్జయిని విలాస ఉన్నాయి

545-కొల్లాల అమృతా చే కర్త -. ,వాసుదేవ పురుషోత్తం గిండే(1937)

19-1-1937పుట్టిన వాసుదేవ పురుషోత్త౦ గిండే సంస్కృత మరాఠీ ఏం ఏ .కల్లోల అమృతాచే ,జానేశ్వారి టిల్ రస తీర్ధే,ఏక్ రసవాదే రాశాడు .

546-భైరవీ మహా విద్య కర్త – గోస్వామి ప్రహ్లాద్ గిరి (1959)

1959జూన్ 22ఒరిస్సా బలాన్ గిరి లో పుట్టిన గోస్వామి ప్రహ్లాద్ గిరి సాహిత్య ,శంకర వేదాంత ,దర్శన ఆచార్య .డిపార్ట్ మెంట్ ఆఫ్ ధర్మాగారం  టీచర్ .బెనారస్ హిందూ యూనివర్సిటి ఫాకల్టి   మెంబర్ .ఆయనది శంకరాచార్య గురుపరంపర .29గ్రంథాలు రాశాడు .భైరవి మహా విద్య ,భువనేశ్వరి మహావిద్య ,షోడశి మహావిద్య ,శ్రీ చక్ర నిరూపణం,సావిత్రీరాస్ట్రాధ్యాయి అందులోకొన్ని .

547-వాది వినోద కర్త –విశ్వ౦భర్ నాద గిరి –(1953)

1-4-1953మీర్జాపూర్ లో పుట్టిన విశ్వ౦భర్ నాద గిరిపూర్వ మీమా౦స లో ఎం ఏ .వాదివినోద ,శ్రీ కృష్ణ లీలా ,దశకుమార చరిత్రం రాశాడు .

548-జైమిని సూత్ర కర్త –పి.వి.గోపకుమార్ (1971)

1971మే 20న కేరళ కొత్తమంగళంలో  పుట్టిన పి.వి.గోపకుమార్ సాహిత్యాచార్య .ఎక్సిక్యూటివ్ ప్రెసిడెంట్ .జైమిని సూత్రాలు మాత్రమె రాశాడు .

549-వ్యవహార సూక్త కర్త –కాశీనాద్ గోపాల గోరె (1936)

3-6-1936హిందీ సాహిత్యరత్న ఎలఎల్ బి గోల్డ్ మెడలిస్ట్ ,సంగీత విశారద ,తెలుగు కోవిద .యుపి ప్రభుత్వ జాయంట్ సెక్రెటరి .7పుస్తకాలు రాశాడు .వ్యవహార సూక్త ,కాళీ గీత ,యోగ అండ్ స్వాస్త్య అందులో ఉన్నాయి .ఎన్నో సంస్థలకు గౌరవ హోదాలలో ఉన్నాడు

550-సంస్కృత పాఠ సంగ్రహ కర్త –భారతి గోస్వామి (1962)

1962 జనవరి 29అస్సాం లోని దూలాజిల్లా మాజ్ గావ్ లో పుట్టిన భారతి గోస్వామి గౌహతిలో ప్రొఫెసర్ .3పుస్తకాలురాసింది  . సంస్కృత పాఠ సంగ్రహ 3భాగాలు,సంస్కృత వ్యాకరణ జ్యోతి రచనలు  .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-3-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గిరీశ భాష్యం

గిరీశ భాష్యం

గిరీశం -ఏం వాయ్ మైడియర్ వెంకటేశం !కరోనా వైరస్ తో రెండు నెలలు హాయిగా మీ ఇంట్లో కాలక్షేపం చేసే వీలు దక్కింది .జేబులో కాపర్స్ ఏమైనా ఉన్నాయా ?

వెంకటేశం –ఉన్ననాలుగు డబ్బులు  ముందే దొబ్బేశారుగా  ఇంకెక్కడివి ?

గి –సంచీ ఒకసారి దులిపి చూడు

వెం-దులిపితే రాలేవి ఎంగిలి బీడీ ,చుట్టముక్కలే .మీ పరువూ నా పరువు పోతుంది .

గి-ముదిరిపోయావ్ .పుట్టి శతాబ్దం అయిందిగా తెలివి తేటలు బానే ఒంటబట్టాయి .

వెం-లేకపోతె మీరు నాకు అక్షరమ్ముక్క నేర్పితే ఒట్టు .అంతా నా తంటాలతోనే ఎదిగా .గురువుగారూ !మీ పూటకూళ్ళమ్మ రోజూ ఫేస్ బుక్ నన్ను రెచ్చగొడుతూ లైనేస్తోంది .

గి –ఒరేయ్.గురూకు పంగనామం పెట్టబోకు పుణ్యం ఉంటుంది .

వెం-మీకు కృతజ్ఞతా  పాడూ లేవు కాని నాకున్నాయ్ .నేనేమీ ప్రొసీడ్ అవటం లేదు .ఫుల్ స్టాఫ్ పెట్టేశా, పెట్టించా .

గి –మంచి పని చేశావ్ .ఇంతకీ ఇక్కడ ఉండిపోటానికి మీనాన్నకే ఠస్సావెయ్యాలా ఆని ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కుతోంది .మీ సిస్టర్ ని పంపి కాస్త నవరత్న తైలం మర్దన చేయించి పుణ్యం కట్టుకో .

వెం-మంచిదే .కాని ఇదివరకట్లాకాదుగా .టచ్ చేస్తే వైరస్ అంటుకుంటుంది .నేను పంపనే పంప .ఇంతకీ మానాన్న కేం చెప్పి బురిడీ కొట్టిస్తారు ?

గి-నాలుగు రోజులనుంచి అన్నీవెతుకుతున్నా .చిక్కట్లేదు .మీనాన్న కూడా బయటికి రావటం లేదే .

వెం- అందరికీ అదే భయం .సంధ్యవార్చి నీళ్ళు తులసి  చెట్టులో పోయటానికి వస్తాడు అప్పుడు పట్టుకోండి.

గి –సరే .అదుగో మామగారు వస్తున్నారు .

వెం-ఏమండోయ్ చుట్టరికం కలిపేస్తున్నారు

గి –ఇవాళకాకపోతే రేపైనా నువ్వు నాబామ్మర్దివి మీ అక్కయ్య నా వుడ్ బి ,మీ అమ్మా నాన్న నాకు అత్తా మామలే కదా .ఇప్పట్నించే కొంచెం అడ్వాన్స్ అవుతున్నా .

వెం-సరే అఘోరించండి .

గి-మామగారూ కులాసానా ?

అగ్ని –ఏం కులాసా మీ బొంద .అదేదో జబ్బుష ప్రపంచమంతా పాకి నవిలేస్తోందష. ఇంట్లో రెడియోకూడా లేదు. బయటికి వెళ్ళనివ్వటం లేదు .కోర్ట్ లున్నాయో లేదో తెలీదు .దావాలు వాయిదాలు పడ్డాయో లేదో ప్లీడరీ గుమాస్తా చెప్పి చావటం లేదు. నీకు తెలిస్తే దాన్ని గురించి చెప్పు కాస్త పూజ ముగించుకొని చక్కా వస్తా.

గి –అలాగే కానీండి అదిగో అత్తయ్యా వస్తున్నారు .ఎలాఉన్నారత్తయ్యా ?

వెంకమ్మ – – ఎందుకడుగుతావు బాబు .మాతమ్ముడు కరకటం రావాలి ఎదురు చూస్తున్నా .ఎలా వస్తాడో పాపం నన్ను చూడంది ఉండలేడు వెర్రి నాయన . నా చేతుల్లో పెరిగాడు వెధవ .పిచ్చిసన్నాసి .

గి-కంగారు పడకండి అత్తయ్యా .మామయ్య కూడా రాగానే కంగారు తగ్గెట్లు కరోనా గురించి క్షుణ్ణంగా చెబుతా .దాని తీవ్రత తగ్గే దాకా సిగ్గు విడచి మీ ఇంట్లోనే ఉండి పోవాల్సి వస్తోంది .బిడియంగా ఉంది .

ఆమె-సంకోచం వద్దు .మీరూ కాల్సినవారే కాదుషా .కడుపులో పెట్టుకొంటాం నాయనా .సంకోచించకు నువ్వూ అబ్బాయి ఇక్కడే ఉండిపొండిపంతులుగారూ .మా వారికి ప్రధమకోపం ఎక్కువ .అగ్గి మీద గుగ్గిలమే .ఉబ్బెస్తే తర్వాత మనసు నవనీతమే .నువ్వే ఆయన్ను ఎష్లా  గైనా ఒప్పించాలి .మామాట వింటే కల్లుతాగిన కోతిలా ఎగిరెగిరి పడతారు .జాగ్రత్త నాయనా .

గి –నేను చూసుకొంటాగా .మీరు గమ్మున ఉండండి .ఇదుగో మామయ్యా వచ్చేశారు .

అగ్ని –ఏమిటి శిఖరాగ్ర సమావేశం ?

గి – ‘’కరోనా ఆశానాసౌ నాసౌమన కోవిద్ప్రజానాం –నహి సౌభాగ్యం తనూం-చైనే రాను వ్ర-వ్రాతా భూతా ఇటలీ అమెరికా ఇంగ్లాండ్ సున్నా హేతు కృతా అకృతాం ‘’

కరోనా శాత్యా –శాసనా సౌమనససం-ప్రజామితి ప్ర –జాం-న సౌభాగ్యం తనూం –అగ్నెః చైనేను  -అనువ్రతా భూత్వా  – నహ్యే-ఇటలీ అమెరికా  ఇంగ్లాండ్ సమితి సున్నా సున్నా హేతు కృతా అకృతాయ కం.

అగ్ని –పంతులూ ఏదో కొత్త పదం ఆలపిస్తున్నావు .ఎప్పుడూ వినలేదే .ఎక్కడ్నించి తెచ్చావ్

గి.మామగారూ ఈ ప్రాంతం లో నులక అగ్ని హోత్రావదాన్లు అంటే పదం క్రమ౦ ఘన జటలలో ఆయన్ను మించిన వారు లేరని లోకం కాకై కూస్తోంది. హనుమాన్ ముందు నా కుప్పిగంతులేమిటి ?

అగ్ని –నేను వినలేదు నేర్వలేదు రా బాబూ అంటే విని చావవేమిటి ?నీ బొట్లేరు ఇంగ్లీషుకు వేద పనసలు కూడానా.నమ్మకం కలగట్లేదుస్మీ .

గి-అందుకే నాకు ఎక్కడో కాల్తుంది .మీ తరం వారంతా ఎక్కడ వేసిన గొంగళి అక్కడి బాపతు .ఆతర్వాత వేదం యెంత పెరిగి విస్తృతి చెందిందో మీకు తెలీదు .నాలుగు ఇంగ్లిష్ అక్షరంముక్కలోస్తే తెలిసోచ్చేది .అది మీకు అంటరానిదాయే .కోర్టులు వ్యవహారాలకు మాత్రం దాన్లోనే అఘోరించాలి. తెలీక పొతే ప్లీడర్ల చేతుల్లో మూటలకు మూటలు పోసి వ్యాజ్యాలాడుతారు .ఇదెక్కడి ఖర్మ వచ్చిందో మనబ్రాహ్మణ్యానికి .

అగ్ని- ఝాడించింది చాలుకాని  అసలు విషయం ఏడవండి పంతులుగారు .

గి –అందుకే మీది ప్రధమకోపం అని జిల్లా అంతా అనుకొంటారు .సీమలో అంటే కోనసీమలో కాదు ఇంగ్లాండ్ లో మాక్స్ ముల్లర్ అనే జర్మని పండితుడు న్నాడు .మనవేదాలను ఉపనిషత్తులు పురాణాల అంతు చూసి వదిలిపెట్టాడు .స్వయంగా ఋగ్వేదం గానం చేసి గ్రామఫోన్ పై రికార్డ్ కూడా చేశాడు .

అగ్ని-అలాగటస్మీ .వాడి తస్సా దియ్యా  భలే వాడే .మేమెప్పుడూ వినలేదే .

గి-(స్వగతం గా –గురుడు దిగొచ్చాడు .ఇక మనం చిలవలు పలవలు సృష్టించి ఎంతదాకా అయినా అల్లేయచ్చు) అవును మామగారూ !ఆయనే ఇందాక నే చదివిన మంత్రం ,పదం దర్శించాడు .దీన్ని మనవాళ్ళు ఎక్కడా చేర్చలేదు మన దౌర్భాగ్యం .

అగ్ని –ఇంతకీ ఆమంత్రం అర్ధం ఏమిషో సెలవివ్వండి.

గి-అక్కడికే వస్తూ మధ్యలో మీ చిరాక్కు వెనకడుగేశా మామగారు .ఈ మధ్య ప్రపంచమ౦తా కరోనా అనే క్రిమి అందర్నీ భయపెడుతూ వ్యాపిస్తోంది .దానితో కోవిద అనే జబ్బు వస్తోంది అది వస్తే మందూ, మాకూ లేదు .సరాసరి కాటికే . ఆయన ద్రష్ట కనుక ముందే ఊహించి మంత్రం లో బిగించాడు .దీనికి క్రమం ఘట, జట కూడా జడ అల్లినట్లు తేలిగ్గా అల్లేశాడు .

అగ్ని –పంతులూ నీ డొంక తిరుగుడు తగ్గించుకోలేదు ఇన్ని నెలలు మా వాడికి చదువు చెప్పే మిషతో మాఇంట్లో తిష్ట వేసినా .

గి-అలా ఐతే నేనిప్పుడే వెళ్లి పోతామామగారూ .

భార్య –అదేమీ షండీ అర్ధాంతరంగా పొమ్మని పొగబెడితే ఎక్కడికి పోతారు పంతులుగారు .బయటికి రానివ్వని కాపలా ఉన్న రోజుల్లో .

గి-(మనసులో –అత్తయ్య కూడా సపోర్ట్ బాగానే ఇచ్చింది. ఇదే బెస్ట్ చాన్స్ నా ప్రతాపం చూపాలి .ఇటలీలో కరోనాలాగా  కదలకుండా తిష్ట ఇక్కడే  వెయ్యాలి .మాంచి ధూపం తో పని చక్కబెడతా చూడు నా తడాఖా  )

  మాటవరసకు అన్నాను కానీ మామయ్యా ,నన్ను పోనివ్వనని అత్తయ్య బహు ఇబ్బంది పెడుతోంది .బుచ్చమ్మక్కూడా ఇష్టం లేదు వెంకటేశిగాడు సరేసరి .బయటికెళ్ళి లోకం లో ఆవ్యాధి అందరికీ పంచిపెట్టి చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఇక్కడే మీ ఇంట్లోనే మీరు చీపురుపెట్టి తరిమేసేదాకా ఉండిపోతాను .మీ మీద, అత్తయ్య మీద ఒట్టు .

అగ్ని –ఒట్టు తీసి గట్టున పెట్ట రాదుషో.ఇంతకీ మంత్రార్ధం చెప్పకుండా శాఖా చంక్రమణం చాలా చేశావు పంతులూ .

గి-నాగుబాము ముందు బురద కొయ్య ఆడినట్లు నేను మీ ముందు మంత్రార్ధం చెప్పేంత ఘటికుడినా మామగారూ  .

అగ్ని –మేమంతా నులక పేనినట్లు ఘనా జటా పేనుతూ వేదం వల్లె వేయటమే కాని అందులో ఏముందో తరచి చూడని బాపతు .నువ్వు చెబితే వినాలని ఉంది .

గి –(తనలో –చిక్కాడు మిడటం భొట్లు .ఒకాట ఆడుకుంటా పాచిక వేసి ప్రయోజనం సాధిస్తా )

  అది కరోనా మంత్రం  .దానికి పదం క్రమం ఘన జట కూడా ఉన్నాయి .సింపుల్గా భావం చెబుతా వినండి అత్తయ్యా మీరుకూడా –చైనాలో పుట్టిన ఓ కరోనా నీకు జాతిమతకుల ప్రాంత భేదం లేదు .కనిపించినవాడినల్లా నీ కిరీటం లాంటి కోరల్లో బంధించి నంజుకు తింటావు .ఇటలీ ఇరాన్ ఇంగ్లాండ్ దాటి అమెరికా లో ఇప్పుడు మనదేశం లోనూ అంటే ఇండియాలోనూ స్థిరపడ్డావ్ .నువ్వు అంటుకుంటే వదలని కామపిశాచి లాంటి దానివి .నీ క్రిమి అంటే వైరస్ సోకిన ఎవరినైనా కౌగిలిస్తే వాళ్ళు మటాష్ .మాడిపోవటమే భస్మాసుర హస్తమే .దానివల్ల వచ్చే జబ్బే కోవిద .అంటే- ఎవరికి తెలుసు అని అర్ధం .కరో అంటే పని చెయ్యి .న అంటే వద్దు మొత్తం మీద ఒక పని మాత్రం చెయ్యద్దు అని అర్ధం .ఆఒక్కపని ‘’హగ్ ‘’చెయ్యటం అన్నాడు తెల్లవాడు.అంటే కౌగిలించటం ,దగ్గరకు తీసుకోవటం ముద్దు,శృంగారం  వగైరాలతో ముంచేయటం చెయ్యరాదు అని అర్ధం .మామయ్యా .పెద్దవారు మీదగ్గర శృంగార విషయాలు ప్రస్తావించటం ఇబ్బందిగానే ఉంది .విడమర్చి చేబితేనేకదా అర్ధమయ్యేది .తప్పలేదు అత్తయ్యా .బుచ్చమ్మకూడా దొంగ చాటుగా వింటోంది .వెంకటేషి జామ చెట్టెక్కి పళ్ళు తింటూ వాడూ వింటున్నాడు .చివరికి దొర చెప్పిందేమిటి అంటే  కరోనా రాక్షసి కి  కృత్యం అకృత్యం అంటూ ఏమీ జాలీ దయాలేదు .మనిషికీ మనిషికీ బారెడు దూరం పాటించాలి .గోమూత్రం తో ఇల్లూ ఒళ్ళూశుభ్రం చేసుకోవాలి. ఆవుపంచితం తీర్ధంగా. తులసి దళాలతో రెండు పూటలా పుచ్చుకోవాలి .మామయ్యా రాత్రిళ్ళు మీ ఇద్దరూ కూడాదూర౦ పాటించండి .తప్పదు.ఇలా చెప్పినందుకు మన్నించండి ..

అగ్ని,  వెంకమ్మ -ఇంత కథా కమామీషు ఉందిషోయ్ అల్లుడూ .నీ కడుపు చల్లగా మంచి వేదమంత్రం చేవినేసి మాకు అర్ధం కాని విషయాలన్నీ చెవికెక్కి౦చావ్ .సూర్యుడు మేషరాసిలో ఉచ్చస్థితి లోకి వచ్చేదాకా మీరిద్దరూ ఎక్కడికీ కదలకుండా మా ఇంట్లోనే ఉండిపొండి.మా ఆబోరు దక్కించండి .

గి-(మనసులో -పడ్డాడు మామ నాపాచిక గోతిలో )అంటే మామయ్యా అత్తయ్యా ఏప్రిల్ 14 వరకూ ఇక్కడే ఉండిపొమ్మని సెలవా .

ఇంతలో కరాటక శాస్త్రి వచ్చి –అక్కయ్యా  బావయ్యా బాగున్నారా .వీధిలో అందరికళ్ళూ  కప్పి వచ్చేసరికి తలప్రాణం తోకకు వచ్చింది .ఎప్పుడు  నేను మీ ఇంటికి వచ్చేసరికి ఎడ్డెం తడ్డెం గా ఉండే మీరిద్దరూ ఇవాళ కలిసి నవ్వుతూ ఒకే మాటమీద ఉన్నట్లు కనిపిస్తున్నారు .ఏమిటి విశేషం ?

 అక్కా బావా –ఏమీ లేదోయ్ కరకటం-గిరీశం పంతులు ఏదో కొత్త వేద మంత్రం చెప్పి దాని అర్ధ తాత్పర్యాలు వివరించాడు .

కరటక –(వీడేదో ఠస్సా వేసి బావనూ అక్కనూ బురిడీ కొట్టించి ఉంటాడు .జగజ్జ౦త్రీ  గిరీశం అంటే ) వేదం లో కొత్త మంత్రమా .వింతగా ఉందే.

అగ్ని –నేనూ మొదష్లో అష్లాగే అనుకొన్నా .తీరా పంతులు విడమర్చి చెప్పేసరికి సరేనని తలూపాను .అదేదో కొత్తరకం క్రిమిట ప్రపంచాన్ని భయపెడుతోందట .పంతులు అంతా చెప్పాడు .ఎవరూ ఎక్కడికీ కదలకూడదట .ఒకరినొకరు ముట్టుకోరాదట .బారెడు దూరం లో ఉండాలట .

కరటక –అవునవును .నేనూ విన్నా .(లోపల -ఇదే సమయమని వీడు ఇక్కడ తిస్ట  కోసం మహా పనస అల్లాడన్నమాట )

అగ్ని దంపతులు –ఒరేయ్ కరకటం .ఎల్లాగో అలలాగా కస్ట పడి ఇక్కడికి వచ్చావ్ .అంతా సర్దుమణిగేదాకా నువ్వూ, పంతులు ,అబ్బి గాడితో ఇక్కడే ఉండి పో మాతోపాటు .

కరటక-బావా నువ్వేనా ఈమాట అన్నదీ .ఎప్పుడొచ్చినా ఎప్పుడు వెళ్తావు అనే కాని, నోరార ఒక్కసారీ ఉండమని అఘోరించలేదు .అందుకే జగత్తులో ఇంత విలయం .(మనసులో –మనకూ మంచిదే –మధురవాణి దగ్గర కెళ్లినా అంటూ కోకుండా ముట్టుకోకుండా  ఉండటం బ్రహ్మ ప్రళయం .కనుక ఇక్కడ తిష్ట వేయటమే  మంచిది .ఉభయ  భ్రస్టుత్వం- ఉపరి సన్యాసం ఎందుకు ?సరే నంటే పోలా ?)

  సరే- మీరు అంతగా బతిమాలుతున్నారు కనుక ,మీమాట గౌరవి౦చాలికనుక ఇక్కడే ఉండిపోతా (లోపల –ఇక్కడే ఉండిగిరీశం గాడికి చెక్ పెట్టటమూ మంచిదే .వెంకటేషి గాడి బీడీలు సిగరెట్లు చుట్టా నశ్యం తగ్గించనూ వచ్చు )

గి –చూశారా అత్తయ్యా మామయ్యా కరటక బాబాయిగారూ .ఎందుకొచ్చిందో కరోనాకానీ మనల్ని ఇక్కడే కలిపి ఉంచి మంచి పని చేసింది .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-3-20-ఉయ్యూరు

 

 

Posted in రచనలు, సమయం - సందర్భం | Tagged | Leave a comment

ట్రయల్ రన్ గా ఇవాళ శనివారం పేస్ బుక్ లోప్రసారం

ట్రయల్ రన్ గా ఇవాళ శనివారం పేస్ బుక్ లోప్రసారం
ట్రయల్ రన్ గా ఇవాళ 28-3-20 శనివారం ఉదయం 10గంటలకు మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి ”శతజయంతి కరదీపిక ‘సరసభారతి ‘ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాము వీక్షించండి .రేపటినుంచి నిన్న తెలియ జేసినట్లే కార్యక్రమాలు ప్రసారమౌతాయి -దుర్గాప్రసాద్ -28-3-20

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 531-బోధి చర్య వార్తారహ కర్త –ప్రఫుల్ గాడ్పాల్(1981)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం

531-బోధి చర్య వార్తారహ కర్త –ప్రఫుల్ గాడ్పాల్(1981)

3-6-1981 లో ఉమేరిలో పుట్టిన ప్రఫుల్ గాడ్పాల్ సంస్కృత పిహెచ్ డి .న్యు ఢిల్లీ  రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ లో ప్రొఫెసర్ . బోధి చర్య వార్తారహ,యూనివర్సల్ మెస్సేజ్ ఆఫ్ బుద్ధిష్ట్  ట్రడిషన్ ,బృహర్నీతి శతకం రాశాడు

532-వేదిక సాహిత్య పరిచయిక కర్త –భావ ప్రకాష్ గాంధి (1982)

వేదిక సాహిత్య పరిచయిక రాసిన భావ ప్రకాష్ గాంధి 6-1-1982 గుజరాత్ లో పుట్టి సంస్కృతం లో శాస్త్రి అయి , జునాగడ్ లోని శ్రీ సోమనాథ్ సంస్కృత యూనివర్సిటి ప్రొఫెసర్ .శుభాషిత పీయూషం అనే మరో పుస్తకం కూడా రాశాడు .

533-చార్వాక దర్శన కర్త –హేమంత కుమార్ గంగూలీ (1914)

1-2-1914 న బారిసాల్ లో జన్మించిన హేమంత కుమార్ గంగూలీ కావ్యతీర్ధ ,సాంఖ్య తీర్ధ.జాదవ్ పూర్ యూనివర్సిటి సంస్కృత ప్రొఫెసర్ . చార్వాక దర్శన,సమాజ సాహిత్య ఓదర్శన,వైదిక ధర్మ ఓమీమాంస దర్శన ,ఫిలాసఫీ ఆఫ్ లాజికల్ కన్స్ట్రక్షన్ –గాడ్-రీజన్ అండ్ రెలిజియన్ వంటి 6పుస్తకాలు రాశాడు .

534-భారత దర్శనం కర్త –గరికపాటి లక్ష్మీ కాంతం (20వ శతాబ్దం )

హైదరాబాద్ నిజాం మహావిద్యాలయ తెలుగు హెడ్ గరికపాటి లక్ష్మీకాంతం 12పుస్తకాలు రాశాడు. అందులో భారత దర్శనం,భవ్యభారతం , విశ్వకవి,కీర సందేశం ,భారతరత్నం ఉన్నాయి .

535-సంస్కృత ఆయుర్వేద సుధ కర్త –భన్వారిలాల్ గౌడ్ (1946)

 ఔషధ ఆచార్య ,ఆయుర్వేద బృహస్పతి భాన్వారి లాల్ గౌడ్ 17-3-46 జైపూర్ లో పుట్టాడు .జర్మన్ భాషలో డిప్లొమా, పిహెచ్ డి.రాజస్థాన్ ఆయుర్వేద యూని వర్సిటి వైస్ చాన్సలర్ .పండిట్ వ్రజ్ మోహన్ శాస్త్రి , వైద్యారాం కృష్ణ ల శిష్యుడు .16గ్రంథాలు రాశాడు -వాటిలో ఆయుర్వేద శబ్ద బోధ ,అష్టాంగ హృదయం ,సంస్కృత ఆయుర్వేద సుధ,ఆయుర్వేద చికిత్స విజ్ఞానం ,పదార్ధ విజ్ఞాన పరిచయం ఉన్నాయి .ఇంగ్లాండ్ ఫెలోషిప్ పొందాడు. శ్రీలంక ,సౌతాఫ్రికా పర్యటన చేశాడు .ప్రజ్ఞాపురస్కారం ,ఇషేర్ పురస్కారం ,ఆదర్శ ఆయుర్వేద శిక్షా పురస్కారం పొందాడు .

536-అగ్నిజా కర్త –బిషన్ లాల్ గౌడ్ –(1936)

వ్యాకరణ ఆచార్య బిషన్ లాల్ గౌడ్3-1-1936యుపి-ముర్దాబాద్ జిల్లా లక్ష్మణ్ పూర్ లో పుట్టాడు .సాహిబాబాద్ లో లెక్చరర్ .అగ్నిజా ,అహం రాస్త్రి పుస్తకాలు రాశాడు .

537-అభినవ శరీరం కర్త –దామోదర్ శర్మ గౌడ్ (20శతాబ్దం )

20శతాబ్ది దామోదర్ శర్మ గౌడ్ శ్రీ వైద్యనాధ ఆయుర్వేద భవన్ డాక్టర్ .అభినవ శరీరం అనే ఒకే ఒక పుస్తకం రాశాడు .

538-ముక్తావళి టీకా కర్త –జ్వాలాప్రసాద్ గౌడ్ (20వ శతాబ్ది )

20వ శతాబ్దికి చెందిన జ్వాలాప్రసాద్ గౌడ్ ముక్తావళి టీకా, సత్ ప్రతిపక్ష,స్వయభిచార  రచించాడు .

539-మహాకవి భాస ద్వారా ప్రణీత ప్రతిమా సాహిత్య అధ్యయనం కర్త –లలితకుమార్ గౌర్ (1962)

హిందీ ,సంస్కృత ఎం .ఏ .,సాహిత్య ఆచార్య లలితకుమార్ గౌర్ 1-1-1962 బులంద సహార్ లోపుట్టి ,కురుక్షేత్ర యూనివర్సిటిలో సంస్కృత ,పాళీ భాషలలో ప్రొఫెసర్ చేశాడు .ఆచార్య ప్రభు దత్త శర్మ ,డా.రాం కిషోర్ శర్మ ల శిష్యుడు .మూడు పుస్తకాలు రాశాడు .అందులో పై పుస్తకం ఒకటి .రాధాకృష్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ అవార్డ్ గ్రహీత.

540-  ఘుర్మే సంతు శివాలయే కర్త –నందకిషోర్ గౌతమ్ (1936)

1936జనవరి 6 న రాజస్థాన్ మధోపూర్ జిల్లా శివార్ గ్రామం లో నంద కిషోర్ గౌతమ్ జన్మించాడు . సంస్కృతకాలేజి ప్రిన్సిపాల్ .5పుస్తకాలు రాశాడు .ఘుర్మే సంతు శివాలయే ,ఘుస్మేశ్వర పద్య కథా,ప్రతి శృతి ,యౌతుక నర్తనం ,సంస్కృత నిబంధ పారిజాతం రాశాడు .చాలా సంస్కృత కవి   సమ్మేళ నాలలో  పాల్గొని ప్రైజులు పొందాడు .సంస్కృత మేగజైన్ స్వర్ణమంగళ భారతి మొదలైన పత్రికలలో ఎన్నో వ్యాసాలూ రాశాడు .రేడియో టివిలలో కవితలు కథలు రాసి ప్రసారం చేశాడు .

   సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -27-3-20-ఉయ్యూరు

← Back

Thank you for your response. ✨

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి ఫేస్ బుక్ లో పుస్తక పరిచయం

సరసభారతి ఫేస్ బుక్ లో పుస్తక పరిచయం 
 శ్రీశార్వరి ఉగాది పంచాంగ శ్రవణం ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించి అభినందించిన  బంధువులకు,సాహితీ బంధువులకు సాహిత్యాభిమానులకు హితులకు మిత్రులకు ఫేస్ బుక్ గ్రూపులకు ధన్యవాదాలు . ఈ కార్యక్రమం ద్వారా  ఎందరెందరికో సరసభారతి మరింత దగ్గరయింది ..   వారు ఇచ్చిన ప్రోత్సాహం ,సూచనలను అనుసరించి సరసభారతి ప్రచురించిన పుస్తకాలను కూడా ఇలాగే ధారావాహికంగా వీలు వెంట పరిచయం చేయాలనే సంకల్పం కలిగింది .  ఈ ప్రణాళిక ఈ నెల 29 వ తేది చైత్ర శుద్ధ పంచమి ఆదివారం ఉదయం 10 గంటలకు ”సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా ”పుస్తక పరిచయం తో ప్రారంభిస్తున్నాను .సుమారు 45 నిమిషాలు ఉండే ఈకార్యక్రమాన్ని చూసి ఆనందించ వలసిందిగా కోరుతున్నాను . మీరిచ్చే ప్రోత్సాహాన్ని బట్టి  వెంటవెంటనే రోజూ ప్రసారం తో ”కరోనా  ఎమర్జెన్సి”పూర్తయ్యే లోపు పూర్తి చేయాలనుకొంటున్నాను  -మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -27 -3-20-ఉయ్యూరు 

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Tagged | Leave a comment

కరోనా అరికట్టటానికి శ్రీ శ్రీ శృంగేరి స్వామివారు రచించిన స్తోత్రం జ్యోతి-27-3-20

కరోనా అరికట్టటానికి శ్రీ శ్రీ శృంగేరి స్వామివారు రచించిన స్తోత్రం

1-ఏతావంతం సమయం ,సర్వాపద్యోపి రక్షణ౦ కృత్వా -దేశస్య వరమిదానీం ,తాటస్త్యం వ హసి  దుర్గాంబ ”
2-”అపరాధా  బహుశః ఖలు-పుత్రాణా౦ ప్రతిపదం భవంత్యేన -కోవా సహతే లోకే ,సర్వాం స్తాన్మాతరం విహాయై కాం
‘3-‘మా భజ , మా భజ దుర్గే -తాటస్త్యం పుత్రకేషు ,దీనేషు -కేవా గృహ్ణ౦తి సుతాన్ ,మాత్రా త్యక్తా న్వదాంబికే. లోకే ”
4-”ఇతః వరంవా ,జగదంబ జాతు ,దేశస్య -రోగ ప్రముఖా పదోస్య -న స్యున్తథా కూర్వచలాం కృపాం   

   ఇత్యభ్యర్థనాం మే సఫలీ కురుస్వ ”
5-”పాహి హీన జనతా వన దక్షాఃః -సంతి నిర్జరవరా న కి జన్తః -పాపపూర్ణ జన రక్షణ దక్షాం,త్వాం వినా భువి పరా౦ న విలోకే ”

పై స్తోత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించమని స్వామి వారి ఉద్బోధ

  మీ -గబ్బిట దుర్గాప్రసాద్ 27-3- 20

Posted in సేకరణలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 521-కేదార ఖండ పురాణకర్త –వాచస్పతి ద్వివేది (1938)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం

521-కేదార ఖండ పురాణకర్త –వాచస్పతి ద్వివేది (1938)

5-1-1938పాట్నాలో పుట్టిన వాచస్పతి ద్వివేది సంస్కృత ,హిందీసాహిత్య రత్న ,ఎం.ఎడ్.,పిహెచ్ డి.వారణాసి సంస్కృత విశ్వ విద్యాలయ సంస్కృత హెడ్ .బ్రహ్మ దత్ ద్వివేది ,ప్రొఫెసర్ బొచ్చన్ ఝా  గురువులు .ప్రొఫెసర్ సుభాష్ చంద్ర త్రిపాఠీ,ప్రొఫెసర్ మీరా దూబే లవద్ద ప్రత్యెక శిక్షణ పొందాడు .సంస్కృతం లో 8గ్రంథాలు రాశాడు .వాటిలో –కేదారఖండ పురాణం ,బృహదారణ్యక వృత్తి సారం ఉన్నాయి .శ్రీమద్ భగవద్గీతకు సంపాదకత్వం వహించాడు .సంస్కృత అకాడెమి నుంచి విశిష్ట పురస్కారం పొందాడు .మారిషస్ లో 2008-09కాలం లో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నాడు .

522-కౌత్సస్య గురు దక్షిణ కర్త –వాసుదేవ శాస్త్రి ద్వివేది (1913)

వేద,వ్యాకరణ సాహిత్య రత్న వాసుదేవ శాస్త్రి ద్వివేది 1913లో యుపి లో భవానిచత్ర గ్రామం లో జన్మించాడు .13గ్రంథాలు రాశాడు .వాటిలో కౌత్సుక గురు దక్షిణ ,దీపమాలిక ,సంస్కృత గానమాల ,భోజరాజీయ సంస్కృత సామ్రాజ్యం ,సంస్కృత గౌరవ గానం ఉన్నాయి .సార్వ భౌమ సంస్కృత ప్రచార సంస్థ నెలకొల్పి సేవ చేశాడు .సంస్కృత భాష మాటాడే అనేక కాంపులు ఉత్తరాభారత్ లో నిర్వహించి భాషా వ్యాప్తికి అద్వితీయకృషి చేశాడు .1955లో రాష్ట్రపతి పురస్కారం పొందాడు .1958లో విశ్వభారతి అవార్డ్ అందుకొన్నాడు

523-త్రిదోష లోకః  కర్త-విశ్వనాథ ద్వివేది –(1910)

1910లో బాలియా జిల్లా ఓజ్హా వాలియా లో విశ్వనాథ ద్వివేది జన్మించి ఆయుర్వేద ఆచార్య అయ్యాడు .లక్నో యూనివర్సిటి ప్రొఫెసర్ .జాం నగర్ ఆయుర్వేద శిక్షణ కేంద్ర డైరెక్టర్ .7సంస్కృత పుస్తకాలు రాశాడు .వాటిలో త్రిదోష లోకః  ,తైల సంగ్రహం ,అభినవ నేత్ర రోగ విజ్ఞానం ,నాడీ విజ్ఞానం ,ప్రత్యక్ష ఔషధీ నిర్మాణం ఉన్నాయి .వారణాసీయ సంస్కృత విశ్వ విద్యాలయం లో నూ సేవలందించాడు .

524-పథిక జన పాటక చింతామణి కర్త –వ్రిజ్ వల్లభ ద్వివేది (1921)

 1921లో  సహపురా బిల్వాడా లో జన్మించిన దర్శనాచార్య వ్రిజ్ వల్లభ ద్వివేదిసంస్కృత ప్రొఫెసర్ .ప్రొఫెసర్ ధుంది రాజ్ శాస్త్రి ,రఘునాధశర్మల వద్ద విద్య నేర్చాడు.ప్రాచీన నిర్ణయ పత్రం , పథిక జన పాటక చింతామణి గ్రంథాలు రాశాడు .

525-గురువాయూర మహాత్మ్యం కర్త –వాసు దేవన్ ఎలయంత్ (1912)

  గురువాయూర మహాత్మ్యం రాసిన వాసు దేవన్ ఎలయంత్15-6-1912న కేరళలోని త్రిస్సూర్ జిల్లా కక్కస్సేరి లో పుట్టాడు .న్యాయ భూషణ్ ,సాహిత్యశిరోమణి .మన్నీత శాస్త్రి శర్మ ,అచ్యుతపోత్వాల్ ,రాం వారియర్ లు గురువులు .కృష్ణ గీతి , గురువాయూర మహాత్మ్యం అనే రెండు గ్రంథాలు రాశాడు .

526-అద్వైత ధర్మ౦ కర్త –కె.ఎన్.నీలకంఠన్ ఎలయంత్(1943)

కె.ఎన్.నీలకంఠన్ ఎలయంత్ 5-3-1943న కేరళలో వజ్హూర్ లో పుట్టాడు .సంస్కృత యూనివర్సిటి ప్రొఫెసర్ ,అడయార్ లైబ్రరి రిసేర్చ్ సెంటర్ డైరెక్టర్ .శృంగేరి మఠం కృష్ణ శాస్త్రి దగ్గర విద్య నేర్చాడు .సంస్కృతం లో 10పుస్తకాలు రాశాడు .అందులో అద్వైత ధర్మ౦ఒకటి .దిఎదిక్స్ ఆఫ్ సాంస్క్రిట్ ,డి కాన్సెప్ట్ ఆఫ్ జీవన్ముక్తి కూడా రాశాడు కేరళ సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత

527-కేరళో దయః కర్త –కె.యెన్ .ఎలుతచ్చన్ (1911)

1911జూన్ 19 కేరళ చెర్పల్ చేరిలో పుట్టిన కె.యెన్ .ఎలుతచ్చన్ సాహిత్య శిరోమణి .కుసుమోపహారం ,ప్రతిజ్ఞ,ప్రతీక్ష ,కేరలోదయః  అనే నాలుగు పుస్తకాలు రాశాడు .కాలికట్ యూని వర్సిటి మలయాళం డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ .1976లో కేరలసాహిత్య అకాడెమి అవార్డ్ ,1979లో కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డ్ పొందాడు .

528-ఆధునిక భారతీయతత్వజ్ఞాన  కర్త –హేమంత విష్ణు ఈనాం దార్(1925-2006)

హేమంత విష్ణు ఈనాం దార్ 1925 నవంబర్ 3 న మహారాష్ట్రలో పుట్టాడు .సంస్కృత మరాఠీ లలో ఎం .ఎ. ఎల్ఎల్ బి ,పిహెచ్ డి .12పుస్తకాలు రాశాడు .అందులో సంత్ నామ దేవ ,భక్తీ పంధా-నవ చింతన ,శ్రీ ఏకనాధ దర్శన ,ఆధునిక భారతీయ తత్వ జ్ఞాన  ఉన్నాయి .81 ఏళ్ళు జీవించి 23-6-2006 చనిపోయాడు

529- సారస్వత్య  శాఖ  కర్త –రామన్ నారాయణన్ ఎప్పురత్ (1970)

సారస్వత్య  శాఖ  కర్త –రామన్ నారాయణన్ ఎప్పురత్ 1970మే 20 న కేరళ త్రిస్సూర్ జిల్లా ఎలవల్లి లో జన్మించి సాహిత్య౦లొ పిహెచ్ డి పొందాడు .హైదరాబాద్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నాడు .వాసుదేవన్ ఎలాయత్ ,ప్రొఫెసర్ కే గోవిందన్ నంబియార్ ,భారత్ పిశోడీ లు ఇతని గురుపరంపర .12పుస్తకాలు రాశాడు .సారస్వత్య  శాఖ ,భ్రుగు వంశ మహాకావ్య ఆఫ్ ప్రతాప రాజ ,దిముక్తావళి ,.ఇండియన్ అనలిట్రిక్ ట్రడిషన్స్ లో కంప్యూటరేషనల్ అప్ప్రోచ్ ప్రాజెక్ట్  హెడ్ .

530-ఖాది గీత కర్త –ఆత్మారాం కమల్ ఫోందారి(1944-2000.)

15-6-1944న తిహారి గద్వాల్ లో పుట్టిన ఆత్మారాం కమల్ ఫోందారి వైద్య విశారద ,.ఖాదీ గీత ,శ్రీ కమలా గురువంశ మహిమ్న స్తోత్రం రాశాడు .56ఏళ్ళు మాత్రమె జీవించి 2000 సంవత్సరం లో మరణించాడు .సంస్కృత హిందీ గద్వాల్ భాషలలో మహాకవిగా కీర్తి గడించాడు .సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-3-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇకనైనా పక్కా ప్లాన్ తో కదలండి ప్రభువుల్లారా,ప్రజా సేవకుల్లారా !

ఇకనైనా పక్కా ప్లాన్ తో కదలండి ప్రభువుల్లారా,ప్రజా సేవకుల్లారా !

 జనతా కర్ఫ్యూ ప్రవేశపెట్టి వారం అవుతోంది .ఉద్యోగస్తులకు జీతం నాతం వస్తుంది కనుక ఇబ్బంది లేదు .పనుల్లేక దినకూలీలు యెంత బాధ పడుతున్నారో ఏలినవారు గమనిస్తున్నారా ? తమ చిత్తం ప్రకారం నడుచుకొంటూ ఇంట్లోనే క్వారంటైన్ లో ఉంటున్న పేద లకు ఇప్పటి వరకు హామీల వర్షమే కాని ,’’కనకధార’’ ,సరుకు ,కూరగాయల రవాణా లేక  రేట్లు ఆకాశం లో ఉంటె ఉన్న డబ్బు తో కొనలేక గగ్గోలు పడుతున్నారు .మీ ఆన శిరసావహించే పేదలపై ఉపేక్ష ఇప్పటికైనా వదలండి .చురుగ్గా ,కరుగ్గా ముందుకు కదలండి .యాత్రలకని బయల్దేరిన జనం ఇతర రాష్ట్రాలలో దిక్కు తోచక ,సాయం అందకా ,ఇంటికి చేరే రవాణా సౌకర్యాలు అన్నీ మూసుకుపోగా బావురు మంటూ కాశీ మొదలైన ప్రాంతాల్లో ఉన్నట్లు పేపర్లద్వారా, చానళ్ళ ద్వారా తెలుస్తున్నాయి తమ చెవులకు కళ్ళకు ఆ వార్తలు వినిపిచాలేదా కనిపించలేదా ? వాళ్లకు ఊరట కలిపించే ప్రయత్నం వీసమైనా చేశారా ?పక్కరాస్త్రానికి ఇదే సమయమా హాస్టళ్ళు మూసి విద్యార్ధుల్ని రోడ్లమీద పడెయ్య టానికి ఒక నవారమో పక్షమో  పోషించి హాయిగా ఇంటికి పంపిస్తే ఘనమైన ఆప్రభుత్వాన్ని యెంత మెచ్చుకొంటారు ?ఇంతలోనే కక్కూర్తా ? ఇప్పుడే కళ్ళు తెరిచి కొన్ని పనులు చేబట్టినట్లు విన్నాను ధన్యవాదాలు .

1-ఒక హెల్ప్ లైన్ నంబర్ ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి సమాచారం సేకరించి వెంటనే తగిన వైద్య పరీక్షలు నిర్వహించి సంతృప్తి చెంది వాళ్ళ స్వగ్రామాలకు పంపే ఆలోచన సత్వరమేచేయండి .లేకుంటే ‘’హోమ్ సిక్ నెస్’’తో దూరంగా ఉన్నవాళ్ళు ,వాళ్ళ కోసం కుటుంబ సభ్యులు  బాధ పడే ప్రమాదం ఉంది .ఉభయ తెలుగు రాష్ట్రాలు, కేంద్రం ఈ విషయం లో త్వరగా చర్యలు తీసుకొని ప్రజాసేవ చేయాలి మహా ప్రభో .

2-వాలంటీర్లకు వేలాది జీతాలిచ్చి పోషిస్తూ వారితో ఈ సమాచారం తెప్పించుకోకపోతే వారికిసాయపడకపోతే ఎలా ?తగిన చర్య నిమిషాల్లో జరగాలి ,జరపాలి .సరుకులు ,వారానికి కనీసం మూడు వేల రూపాయలు అర్జెంట్ గా వారి ఇళ్ళకు చేర్చాలి .లేకపోతె ఆకలి బాధ ,మాల్ న్యూట్రిషన్ ప్రమాద ఘంటికలు మోతాయ్ .చేతులుకాలాక ఆకులు పట్టుకో వద్దు ఇల్లుకాలాక నుయ్యి తవ్వొద్దు .జనాలకు కావలసింది ఊరడింపు మాటలు, హావభావాల చేష్టలూ కాదు .సానుభూతి ,సహకారం ,చేయూత ఓదార్పు ఆరోగ్య రక్షణ కావాలి .ఇవన్నీ కలిసి పని చేసేట్లు చూసే సమన్వయ వ్యవస్థ కావాలి . .

3-ఇళ్ళకు డాక్టర్లను పంపి పరీక్షలు చేయించి అనుమానం ఉంటె హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందించాలి .

4-ఇలాంటి ఎపెడేమిక్ ఉపద్రవాల్లో ఎప్పుడూ ముందుండే ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు ఇప్పుడు ఎక్కడా కనపడటం లేదు .వారి ఆరోగ్యాలకు రక్షణ కల్పించి ప్రభుత్వాలు వారి సేవలు వినియోగించుకోవాలి .

5-స్థానికం పోస్ట్ పోన్ అయ్యాక ,కోర్టులు చీవాట్లు పెట్టాక మన పోలీసు వ్యవస్థ కొంత ముందుకు కదలటం శుభ పరిణామం .ఇందులో పార్టీ విచక్షత చూపి ,పక్ష పాతం ప్రదర్శించి వ్యవస్థకు కుల ,రాచకీయ ‘’ పక్షవాతం తెచ్చి’’ సమాజాన్ని నిర్వీర్యం చేయకండి .బాధితులు ఎవరైనా ఒక్కటే .అక్కున చేర్చి ఓదార్చి మెప్పు పొందండి’’ మూడు సి౦హాల వారూ ‘’.ఇదే చేయకుంటే చరిత్ర మనల్ని క్షమించదు.

6-అమరావతి పై ఉద్యమిస్తున్న రైతులను మహిళలను సాంత్వన దృష్టితో చూడండి. రాజకీయాలు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి ఎప్పుడూ ఉండేదిఓటుహక్కున్న ‘’ఆం ఆద్మీలే’’.కేజ్రీ వాల్ ను చూసి నేర్చుకోండి .నోళ్ళు సంబాళించు కోండి.  ఇకనైనా వీటిని గుర్తించండి . ఉస్ట్ర పక్షి పోకడలు వినాశ హేతువు  .

  ఈ షట్కర్మ నిరతులై ప్రజాభిమానం పొందమని పాలక ,ప్రతిపక్ష ,స్వచ్చంద సంస్థలన్నిటికీ విజ్ఞప్తి చేస్తున్నాను .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-3-20-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

 వద్దురా — గోలోకం… కైలాసం

 వద్దురా —

గోలోకం –నాదా కృష్ణా !మురళి వాయిస్తూ భూలోకం వెళ్ళకు .అందులోంచి  తు౦పురులు  బయటకొచ్చి నీకూ గోపాలురకు ఇబ్బంది కలిగించి అదేదో ‘’కరోడా ‘’అట అంటుకుంటుంది .నువ్వు అసలే పిచ్చిమారాజువు .అది ఇక్కడికి తెస్తే మనం ఏమీ చెయ్యలేం . చద్దన్నాలని ఎంగిళ్ళ ని ,మురళి వాయిస్తామని ,నీ మురళి లాక్కోవచ్చు ‘’అంటు’’తో అంటుకునే మహమ్మారి అట .నువ్వు దయార్ద్ర హృదయుడివి .చిన్ననాటి నెచ్చెలి అని కుచేలుని అటుకులు తినేవ్ .ఆయన ఎంగిలి నీకు అభ్యంతరం లేదు కాని, నా  జాగ్రత్త నేను పడాలిగా .నిరంతరం నీ వెంటే నేనుంటున్నా ఎప్పుడో కనుమాయచేసి వ్రేపల్లె గొల్ల వనితలతో సరసాలాడి, ‘’కిందా మీదా ‘’అవుతావ్ .ఇకిలి౦పులు ,సకిలింపులు కౌగిళ్ళు, వేధింపులు ,సాధింపులు ,లాలనలు ,పాలనలు తో  ఆ సూక్ష్మజీవి ప్రకోపిస్తే కొ౦ప లంటుకుంటాయి .మీ అమ్మ వడిలో గారాలుపోయినా ముప్పే ముకుందా .మీ అన్న గారిని వెంటేసుకొని అడవులు ,లోయలు తిరగద్దు. యమునా నదీ విహారం ,వెన్నెల్లొడపిల్లల్తొ జల్సాలు చేస్తే నా వల్ల కాదు వేణుగోపాలా !పాలు వెన్నామింగి కొంప కొల్లేరు చేయకు కొంటె కృష్ణా.  కాళింది మడుగు బురదమయం ట .ఆ నీళ్లు ప్రమాదమట .పడగలపై అడకయ్యా పావన నామా .రోలు ముట్టుకున్నా, మద్ది చెట్లు కూల్చినా చేతులు తాకటమే కదా  త్వరగా  ఆ  జీవులు వ్యాపిస్తాయట .బండీ ,ఎద్దు , ధేనువుల జోలికి వెళ్ళద్దు దేవకీ నందనా .తేరగా ఇస్తోందని పూతన పాలు తాగితే, రోగం అంటుకొని రొస్టున పడతావ్  .అసలే శరదృతువు .నీకు మరింత ఉద్దీపనకలిగిస్తుంది .రాసక్రీడల మొనగాడివి . చెట్ల వెంటా, పుట్టలవెంటా చెట్టాపట్టాలేసుకొని ఆలింగనం తో మై మరచిపోతే  అసలుకే మోసం రాస విహారీ .అస్టభార్యలూ ,పదహారు వేల కన్యలూ మర్చిపో .ఇది నా ఆన .అందుకే నిన్ను నా ఇంట్లోనే బందీ చేస్తా .నా గదిలోనే అన్నిజాగ్రత్తలతో అదేదో’’ క్వారన్ టైన్’’ ట అందులో ఉంచినట్లు ఉంచేస్తా .కనుక ఒద్దురా కన్నయ్యా ,పోవద్దురా అయ్యా ‘’.

  కైలాసం –వినాయకుడు -ఒరేయ్ అనిన్ద్యా !నా దగ్గర అయిదు నిమిషాలు ఉండవ్ ఎప్పుడూ కలుగుల్లో నక్కుతావ్ .సుస్టుగా నాతో  భో౦ చేస్తున్నా  ,ఇంకా కక్కుర్తి ఎందుకు .భూలోకం పోయి మూతలు పడేసి  ఉన్నవి హుష్ కాకీ చేసి  చటుక్కున తిరిగోస్తావ్ .ఇక అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు .అత్యవసర పరిస్థితి ఉందక్కడ  .స్పర్శ తో వచ్చే జబ్బు ట ప్రపంచమంతా వ్యాపించి భీభత్సం చేస్తోంది .నువ్వు అక్కడ ఎంగిలి చేసి ఇక్కడికొస్తే ఇక్కడా అదే భీభత్సం వచ్చి దిక్కుండదు .నాన్నగారు కూడా ఏమీచేయలేరు .శక్తిమయి అమ్మ వల్లాకాదు.కుడుములు ఉండ్రాళ్ళు అటుకులు నానుబెల్లం చలిమిడి ,పానకాలు ముట్టుకోకు .అన్నీ బంద్. మాంసాహారం అనర్ధం తెస్తోంది .ఒళ్ళు దగ్గర పెట్టుకో .ఆ జబ్బు అంటుకుంటే అంతే. మందూ లేదు మాకూ లేదు .అందుకే నిన్ను నా కాలి కింద గూట్లో బంధిస్తున్నా .వద్దురా ,ఎక్కడికీ   వెళ్ళద్దురా’’.

 పార్వతి శివుడితో –‘’ప్రాణేశ్వరా ! భూలోకం భయానకంగా ఉందని నారదుడు చెప్పి వెళ్ళాడు ఇప్పుడే .కొత్త వైరస్ వ్యాపించి అల్లకల్లోలం చేస్తోందట .మందులేదట .అంటుకుంటే వస్తుందట ఆ జబ్బు .మీరేమో భోళా శంకరులాయే.ఏ నరుడో వానరుడో దానవుడో కొ౦పమునిగే తపస్సు చేస్తే ,మీ అర్ద భాగం గా  ఉన్న నాకే తెలీకుండా, గుట్టు చప్పుడు కాకుండా పరిగెత్తుకెళ్ళి  వాళ్ళకు  అడ్డదిడ్డమైన వరాలు ఇచ్చేసి చక్కారావటం, వాళ్ళు లోక భీకరులై ప్రవర్తించటం ,డీలా పడి మీరుంటే, అన్నయ్య విష్ణుమూర్తి వచ్చి ఏదో చిట్కాతో పరిష్కరించటం జరిగింది ఇన్నాళ్ళూ .మళ్ళీ ఏ భస్మాసురుడు లాంటి వాడో తపస్సు చేస్తే జాలిపడి వరం ఇస్తే వాడు మీ నెత్తిన చెయ్యి పెడితే  సర్వమంగళ నైన నాకు కూడా దిక్కు ఉండదు .మీ తలద్వారా నాకు అంటుకొని కైలాసం  గోవిందో  హారి . నెత్తికెక్కి కూర్చున్నమీ ముద్దులావిడ తో సరసం  బంద్ చేయకపోతే ప్రళయమే .నీటి వలన వ్యాపించే క్రిమిట  ఇప్పుడు విశ్వాన్ని అంతట్నీ వణికించేది . మీ పాములూ పుర్రెలు చర్మాలు తాకితే చాలు క్రిములు విపరీతంగా పెరిగి పోతాయట.వీటన్నిటిని కట్టడి చేయటం నా వల్ల కాదు భూతనాథా,పశుపతీ ఈశ్వరా , పరమేశ్వరా . కనుక ఇక మీరెక్కడికీ వెళ్ళటానికి ఒప్పుకోను .క్వారంటైన్ లాంటి  ‘’డీప్ ఫ్రిజ్ ‘’పెట్టె తయారు చేయించాను .అందులోనే మీమకాం .వద్దురా వృషాధిపతీ !త్వరపడి ఎక్కడికీ పోవద్దురా శంభూ .’’

‘’వద్దురా కన్నయ్యా ,పోవద్దురా వృషాదిపతీ,   వెళ్ళోద్దురా  -వెళ్ళద్దు వెళ్ళద్దు వెళ్ళద్దు ‘’

అంటూ పలవరిస్తుంటే మా ఆవిడ వచ్చి’’ ఏమిటీ కూని రాగాలు పొద్దున్నే .పనీ పాటా లేకపోతె సరి ‘’ అని నాలుగు ఝాడిస్తే కాని అది కల అని తెలియలేదు .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-3-20-ఉయ్యూరు

Posted in రచనలు, సమయం - సందర్భం | Tagged | Leave a comment

నిన్నటి శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యక్ష ప్రసారం లో ఫేస్ బుక్ లో

నిన్నటి శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యక్ష ప్రసారం లో ఫేస్ బుక్ లో చూసి స్పందించిన సాహితీ బంధువులకు అభిమానులకు ,బంధు మిత్రులకు ధన్యవాదాలు .మా అబ్బాయి శర్మనిన్న ఉదయం 10గంటలకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి ఫేస్ బుక్ లో పంచాంగ శ్రవణం చేస్తే బాగుంటుంది అని సూచించటం ,మా అబ్బాయి రమణ ,మనవడు చరణ్ నా సెల్ ఫోన్ లో ఆ యాప్ డౌన్ లోడ్ చేసి రెడీ చేయటం తో సాయంత్రం 5 గం లకు పంచాంగ శ్రవణం లైవ్ జరిగింది .ఇదే మొదటి ప్రయత్నం అవటం వలన కొన్ని జాగ్రత్తలు తీసుకోలేకపోయాం .కెమెరా నాకు ఇంకొంచెం దగ్గరగా ఉండిఉంటె ,మరింత స్పష్టంగా కనిపించి, వినిపించి ఉండేదని గ్రహించాం .వీక్షకులు చాలా ఉత్సాహంగా చాలామంది చూసినట్లు అర్ధమయింది అందరికీ మరోమారు ధన్యవాదాలు -మీ దుర్గాప్రసాద్ -26-3-20

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

 గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 516 –శ్రీమద్భాగవత కావ్య సౌందర్య కర్త-శివ శరణ్ శర్మ ద్వివేది (1928)

ఇప్పటి వరకు 1605మంది గీర్వాణ కవులగురించి రాశాను .ఇప్పుడు 1606వ కవిగా ఈ ఎపిసోడ్ లో  516 వ కవి ని గురించి రాస్తున్నాను’

 గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం

516 –శ్రీమద్భాగవత కావ్య సౌందర్య కర్త-శివ శరణ్ శర్మ ద్వివేది (1928)

15-3-1928 న ఉత్తర ప్రదేశ్ ఫతేపూర్ లో జన్మించిన శివ శరణ్ శర్మ ద్వివేది హిందీ సంస్కృతాలలో ఏం ఏ .పి.హెచ్ డి,ఎల్ ఎల్ బి కూడా ,మధ్యప్రదేశ్ ప్రభుత్వకాలేజి ప్రిన్సిపాల్ .10పుస్తకాలు రాశాడు .అందులో శ్రీమద్భాగవత కావ్య సౌందర్య ,జాగరణం, లోకార్చనం ,ఆవాహన మొదలైనవి .

517-సంస్కృత వ్యాకరణ పుస్తక రచన వర్క్ షాప్ నిర్వహించిన –శ్రేయాన్ష్ ద్వివేది (1969)

1969-జనవరి 10 పుట్టిన శ్రేయాన్ష్ ద్వివేది ఏం ఏ పిహెచ్ డి .స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ .సంస్కృతం లో రెండు పుస్తకాలు రాశాడు .సంస్కృత వ్యాకరణ పుస్తకరచన  వర్క్ షాప్ నిర్వహించాడు .సంస్కృత ఆడియో ప్రోగ్రాం లు నిర్వహించాడు .సాంస్క్రిట్  సెలెక్టేడ్ స్టోరీస్ కు విద్యా వీడియోలు తీశాడు .సంస్కృత కర్రిక్యులం డిజైన్ చేశాడు .

518-విశాల భారత్ కర్త –శ్యాం వరణ్ ద్వివేది –(1916-1975)

1916లో పుట్టి 59 ఏళ్ళకే 1975లో చనిపోయిన శ్యాం వరణ్ ద్వివేది ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ లో జన్మించాడు .విశాల భారత్ అనేఒకే ఒక గ్రంథం రాశాడు .

519-దీర్ఘ వృత్త లక్షణ కర్త –సుధాకర్ ద్వివేది –(1917-1960)

వారణాసి లోని ఖజూరీలో 1917లో పుట్టి 43ఏళ్ళకే 1960నవంబర్ 28న చనిపోయిన సుధాకర్ ద్వివేది జ్యోతిష శాస్త్ర పారంగతుడు .34గ్రంధాలు రాశాడు. వారణాశి సంస్కృత కాలేజి లెక్చరర్ .దేవి కృష్ణమిశ్ర శిష్యుడు .మహామహోపాధ్యాయ పండిత మురళీధర  మిశ్ర ,పండిట్ బలదేవ్ మిశ్ర ,పండిట్ రామాయణ్ ఓఝా,పండిట్ బలదేవ దత్ పాఠక్ వంటి ఉద్దండులవద్ద విద్య నేర్చాడు .రచించిన 34పుస్తకాలలో దీర్ఘ వృత్త లక్షణం ,వాస్తవ చంద్ర శ్రీరంగోన్నతి సాధనం ,భూ భ్రమ రేఖాని రూపనం ,గానకట రంగిని,దిన మీమాంస ఉన్నాయి ,బ్రిటిష్ ప్రభుత్వం మహా మహోపాధ్యాయ బిరుదు ప్రదానం చేసింది .సిద్ధాంత జ్యోతిషం లో అఖండుడు.

520-నారాయణ కావ్యకర్త –ఉమాపతి ద్వివేది –(1853-1911)

ఉమాపతి ద్వివేదివ్యాకరణ ,న్యాయ శాస్త్రాలలో అద్వితీయుడు .గోరఖ్ పూర్ లో సహువాపార్ లో 1853లో పుట్టి 58వ ఏట 1911లో మరణించాడు .అయోధ్యలోని వశిష్ట పాఠశాల సంస్కృత టీచర్ .పండిట్ హరిదత్ ద్వివేది శిష్యుడు .4గ్రంథాలు రాశాడు .సనాతన ధర్మోద్ధార ,శబ్దెందు శేఖర కు జట,టీకా ,పరభాషే౦దు  శేఖర కు జటా, టీకా,నారాయణ కావ్యం రాశాడు .విద్యామహార్ణవ బిరుదాంకితుడు .

  సశేషం

శ్రీ శార్వరి ఉగాది శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-3-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం

శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం

  ఈరోజు సాయంత్రం 5 గంటలకు మా ఇంటి నుంచే శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం  ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారమౌతుంది .చూసి ఆన౦దించి మిగిలిన విషయాలు కూడా తెలుసుకోండి .

అందరికి శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలు .

శ్రీ కళ్యాణ గుణావాహం రిపుహరం –దుస్వప్న దోషాపహం –గంగాస్నాన విశేష పుణ్య ఫలదం –గోదాన తుల్యం నృణాం-ఆయుర్వృద్ధిద ముత్తమం ,శుభకరం –సంతాన సంపత్ప్రద౦

నానా కర్మ సుసాధానం –సముచితం –పంచాంగ మాకర్ణ్యతాం’’ .

‘’శుక్లాంబరధరం విష్ణుం –శశివర్ణం చతుర్భుజం –ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే ‘’

‘’సుముఖశ్చైక దంతశ్చ్య కపిలో గజకర్ణికః –లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః –ధూమ కేతుర్గణాధ్యశ్చఃఫాలచంద్రో గజానన –వక్రతుండ శ్శూర్ప కర్ణోః హేరంబ స్కంద పూర్వజః ‘’

‘’సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణీ –విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ‘’

‘’యా కుందేందు తుషార హార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా –యా వీణా వరదండ మండిత కరా  యాశ్వేత పద్మాసనా –యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతి భి ర్దేవై స్సదా పూజితా –సామాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా .

‘’లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగ దామేశ్వరీం –దాసీభూత సమస్త దేవ వనితాం –లోకైక దీపాంకురాం –శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం-త్వం త్రైలోక్య కుటుంబిణీ౦-సరసిజాం వందే ముకుంద ప్రియాం .’’

శ్రీ శార్వరి నామ  సంవత్సర ఫలం

ఈ సంవత్సరం రాజు ,ధాన్యాధిపతి  బుధుడు .మంత్రి ,సైన్య, అర్ఘ్యా,మేఘాధిపతి చంద్రుడు . ,సస్యాధిపతి ,నీరసాధిపతి గురుడు .రసాధిపతి శని .నవనాయకులలో ఎనిమిది ఆధిపత్యాలు శుభులకు ,ఒక్క ఆధిపత్యం మాత్రమే – అదీ శనికి వచ్చాయి .శత్రువు మిత్రుడు అవటం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలమధ్య సఖ్యత ,సహాయ సహకారం ఒకమాదిరిగా మాత్రమె ఉంటాయి ,

‘’శార్వరీ వత్సరే సర్వ సస్య వృద్ధిర్భవే ద్భువిః-రాజానో విలయం యాంతిపరస్పర జయేచ్ఛ  యా  ‘’అంటే –అన్ని పంటలు బాగా పండుతాయి .నాయకులు  విజయ కాంక్షతో పరస్పర విరోదాలతో నశిస్తారు .

బుధుడు రాజు అవటం వలన గాలి భయం.స్త్రీ,పురుష సమాగమభయం ఉంటాయి .మేఘాలు కొద్దిగా వర్షిస్తాయి .పంటలు ఒకమాదిరిగా పండుతాయి

‘’సదాగతి స్సాద్వ సక్రుత్ప్రజానం నరాః-స్త్రీయోవా రతికర్మహీనాః –ధారధరాశ్చాప్యవిముక్త ధారాః –మధ్యాని సస్యాని భవంతి భూమౌ.

మంత్రి చంద్రుడు అవటం వలన –పంటలకు తగిన వర్షం కురిసి ధాన్యాలు బాగా పండుతాయి .ప్రజలు ఆరోగ్యంగా క్షేమ౦గా సుభిక్షంగా ఉంటారు –

‘’సువృస్టి స్సర్వ సస్యాని ఫలితాని భవంతిచ –క్షేమారోగ్యం సుభిక్షం స్యాచ్ఛశాంకే సచివే సతి ‘’

సేనాధిపతి చంద్రుడవటం వలన –అధికధారాలు ,అధిక వర్షం ఉంటాయి .ప్రజలు ఆరోగ్యంతో సుఖంగా ఉంటారు .ఆవులు పాలుబాగా ఇస్తాయి .

‘’అతివర్ష మతీవార్ఘ ,మరోగా స్సుఖినో జనాః –బహు క్షీర ప్రదా గావ  శ్చ౦ద్రే ససేనాధిపతిః’’

సస్యాధిపతి గురువు –యవలు ,గోధుమలు ,శనగలు బాగా పండుతాయి .పచ్చని నేలలో పంటలు ఎక్కువ .

‘’యావ గోధూమ,చణకాః ఫలితాశ్చ భావంతిహి-పీత దాత్రీచ ఫలితా గురౌ సస్యాదిపే సతి’’

ధాన్యాధిపతి బుధుడు –మేఘాలు గాలులచే చెదరగొట్టబడి ,పంటలకు అనుకూల వర్షం కురవదు .ధాన్యాలు కొద్దిగా పండుతాయి .పాలకులు ఆందోళనతో ఉంటారు –

‘’మధ్య వృష్టి ర్మంద సస్యం మేఘా వాతేన పీదితాః-త్రాపస్సర్వ నృపాణా౦చ  బుదే ధాన్యాది పతే సతి’’

అర్ఘాధిపతి చంద్రుడు –పంటలను బట్టి వర్షం వస్తుంది .పైరులన్నీ బాగా ప౦డుతాయి కాని ధరలు బాగా పెరుగుతాయి –

‘’సువృస్టి స్సర్వ సస్యానా మభీ వృద్ధిశ్చ జాయతే –మహతీ దార్ఘ్య వృద్ధిస్యాచ్ఛ౦ద్రేచారార్ఘ్యా దీపే సతి .

మేఘాధిపతి చంద్రుడు –దేశమంతా సస్యానుకూల వర్షం కరుస్తుంది .పూర్వ అపర ధాన్యాలు బాగా పండు తాయి .గోక్షీరం సమృద్ధి .

రసాధిపతి శని-చెరుకు నెయ్యి నూనె బెల్లం తేనే ఉప్పు కర్పూరం వగైరా రస జాతుల ధరలు తగ్గుతాయి .-

‘’ఘ్రుత  తైల గుడా క్షౌద్రాః ఏ చానె రస రస జాతయః –శూన్యార్ఘ్యం యాంతి తే సర్వే,శనౌయది రసాదిపే ‘’

నీరసాధిపతి గురుడు –వక్కలు రత్నాలు బ౦గారం ధాన్యాలు పత్తి చర్మం చందనం బాగా వృద్ధి చెందుతాయి .బ్రాహ్మణులు సుఖ సంతోషాలతో ఉంటారు –

‘’పూగీ ఫలా న్యఖిలం రత్న సువర్ణ ధాన్యం కార్పాస చర్మ కుసుమానిచ చందనం చ –వృద్ధియయుర్ద్విజః గణా స్సుఖినో భవంతి భూమౌచ నీరసపతౌ సురరాజ పూజ్యే ‘’

ఈ సంవత్సరం లో ఆశ్వయుజమాసం అధికమాసం .నిజ ఆశ్వయుజం లోనే శుభకార్యాలు ,శరన్నవ రాత్రులు జరుగుతాయి .

20-11-20కార్తీక శుద్ధ షష్టిశుక్రవారం గురుడు మకరరాశిలో ప్రవేశించటంతో  తుంగ భద్రానదికి పుష్కరాలు ప్రారంభమై 1-12-20కార్తీక బహుళ పాడ్యమి మంగళవారం వరకు 12 రోజులు జరుగుతాయి .

29-5-20నుండి 8-6-20 వరకు శుక్ర మౌఢ్యమి .16-1-21నుంచి 10-2-21వరకు గురు మూఢమి కనుక శుభకార్యాలు ఉండవు .

21-6-2020జ్యేష్ట బహుళ అమావాస్య ఆదివారం మృగశిరా నక్షత్ర చివరిపాదం లో’’చూడామణి ‘’పేరున్న  సూర్యగ్రహణం .ఉదయం 10-25కు ప్రారంభమై ,మధ్యాహ్నం 1-53 దాకా ఉంటుంది .మృగశిర ఆరుద్ర నక్షత్ర జాతకులు చూడకుండా ఉండటం మంచిది .

14-1-2021పుష్యశుద్ధ పాడ్యమి తాత్కాల విదియలో శ్రవణా నక్షత్ర యుక్త వృషభ లగ్నం లో మధ్యాహ్నం 1-57కు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించటం వలన మకర సంక్రాంతి .సంక్రాంతి పురుషుడి పేరు ‘’మంద ‘’.

ఒకటిరెండు రాష్ట్రాలలో ఊహించని పరిస్థితులేర్పడతాయి .దేశం లో ఆర్దికమాన్ద్యం ఇబ్బందిగా ఉంటుంది .పాక్ కుపీడ  ఈఏడాది  .భారత్ –చైనాలమధ్య డిషుం డిషుం.మన దేశ సీనియర్ నాయకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది .శ్రీ లంక భారీ వర్షాలు వరదలతో అల్లకల్లోలమై ,దేశాధ్యక్షుడికి ఇబ్బంది కలుగుతుంది .బంగ్లాదేశ్ లో అనిశ్చిత పరిస్థితులు ..మయన్మార్ లో రాజకీయాలు దారితప్పచ్చు .ధాయ్ లాండ్ లో తిరుగుబాట్లు జరిగే ప్రమాదం .మలేశియాలోనూ కల్లోల పరిస్థితులే .సైన్స్ లో    ఫ్రాన్స్ గణనీయంగా పేరుపొంది ప్రతిష్టాత్మక అవార్డ్ లు పొందచ్చు .పశ్చిమాసియాలో భారీ భూకంపం రావచ్చు .అమెరికా అడకత్తెరలో పోక గా మారుతుంది .ట్ర౦ప్ మళ్ళీ గెలవచ్చు .దక్షిణ కొరియా భారత్ భాయి భాయి .అగ్నిపర్వత ప్రాంత ప్రదేశాలు జాగ్రత్తగా ఉండాలి .

  ఈరోజు సాయంత్రం 5 గంటలకు మా ఇంటి నుంచే శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం  ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారమౌతుంది .చూసి ఆన౦దించి మిగిలిన విషయాలు కూడా తెలుసుకోండి .

శ్రీ శార్వరి ఉగాది శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-3-20-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

25-3-20బుధవారం శ్రీ శార్వరి ఉగాది సందర్భంగా అందరికి eశుభాకాంక్షలు

25-3-20బుధవారం శ్రీ శార్వరి ఉగాది సందర్భంగా అందరికి eశుభాకాంక్షలు

image.png

image.png
image.png
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రాచకీయ ‘’పన్’’ (పంచ్} ‘’ఆగం ‘’

రాచకీయ ‘’పన్’’ (పంచ్} ‘’ఆగం ‘’

శ్రీ శార్వరి ఉగాది పంచా౦గ శ్రవణం కు ఒక రోజు ముందు రాచకీయ ‘’పన్’’ (పంచ్} ‘’ఆగం ‘’

శ్రవణం వినండి- సారీ చదవండి .ఈ సంవత్సరం నవగ్రహాలలో 8గ్రహాలు శుభులు ,ఒక్కటే పాపగ్రహం .రాజు ,ధాన్యాధిపతి బుధుడు .మంత్రి ,సస్య ,నీరసాది పతి గురుడు .సైన్య ,అర్ఘ ,మేఘాధిపతి చంద్రుడు .రసాధిపతి శని .కనుక లెక్క ప్రకారం శుభులు ఎక్కువవటం తో అన్నీ మంచి శకునాలుగా ఉండాలి .కానీ సీన్ రివర్స్ అయింది  . మన రాష్ట్రం లోఎమ్యెల్యేలు, ఎం .ఎల్సీలు  ,కేంద్రంలో సభ్యతమరచి రాజ్యసభ సభ్యులు ,కర్ణాటక,మద్యప్రదేశ్ లలో నిస్సిగ్గుగా శాసనసభ్యులు బోర్డులు తిప్పేసి గుంపుగా జంప్ జిలానీలయి ,కొత్తప్రభుత్వాలకు వీర విదేయులైనట్లే , గత  డిసెంబర్ లోనే మన శుభగ్రహాలన్నీ జంప్ జిలానీలై పాపులుగా ,’’పావులు’’గా మారిపోయి విశ్వవ్యాప్త ఉపద్రవం కరోనా సృష్టించి ఒక దేశాన్ని నాశనం చేయాలని మరో దేశం పై ప్రయోగించి  ,వీర విష విలయాలు వ్యాపింపజేసి అదుపుకాని స్థితి కల్పించి ,కాలిఫోర్నియా దావాగ్నిలా ,దివిసీమ బడబాగ్నిలా  వేలాదిగా జనం చనిపోతుంటే ఆనందంగా  స్మశానాలలో చలికాచుకొంటున్నారు పైశాచికంగా .

    టచ్ ద్వారా వ్యాపించే ఈ వైరస్ యెంత భయానకంగా వ్యాపిస్తోందో ఇప్పుడు తెలుసుకొని ‘’బావురావురు’’ మంటున్నాయి అగ్ర దేశాలైన ఉగ్రదేశాలు .మానవత్వం మంట గలవటానికి అదుగో  ఆ శుభగ్రహాల కప్పదాట్లే కారణం .కొన్ని దేశాలలో ఊళ్లకు ఊళ్లు ఖాళీ .అగ్రదేశాలు ‘’కొంప’’లోనే అన్నీ కానిమ్మని లాకౌట్ ,లు లాక్ డౌన్లూ  చేసి నరసంచారం లేకుండా చేస్తున్నారు .’’కరోనా! బొంగా  !అదే౦ చెయ్యలేదు ఉత్తిహడావిడి పార సెట్మాల్  వాడమని బ్లీచింగ్ తో స్నానం చేయమని ప్రకటించి మర్నాడే ప్లేట్ ఫిరాయించి లాక్డౌన్ చేయించి ‘’బయటికొస్తే ముక్కుతో చంపేస్తా ‘’అని భయపెట్టాడు పక్కరాస్ట్రనాయకుడు .ఆయన్నే ఆదర్శంగా అడుగులేసే మన పరమానందయ్య శిష్యుడు గురూ మొదట చెప్పింది నిజమేనని నమ్మి దాన్నే రికార్డ్ గాపెట్టి చెప్పి ,90రోజులుగా అమరావతి ఉద్యమం నడుపుతున్నమహిళలను రైతుల్నీ ప్రక్కనుంచి పోతున్నా పట్టించుకోకుండా’’ నీరో’’ లా ప్రవర్తించి ఒకే ఒక్కసారి తనకు కావాల్సిన వందిమాగధ పత్రికలవారిని పిలిచి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ‘’60 దాటినవారికే కరోనా భయం .మిగిలినోరికి’’ ఫికర్ నై ‘’రోజుకు నాలుగు కిలోల పారాసెట్మాల్   టాబ్లెట్స్ మింగితే ,బ్లీచింగ్ పౌడర్ చిమ్ముకుంటే కరోనా గమ్మునుంటుంది ‘’అని డాక్టర్ రెడ్డీ గా ,రెడ్డీస్ లాబ్ అధ్యక్షుడుగా ,ఫిలాసఫర్లకే ఫిలాసఫర్ గా ,అపర ధన్వంతరిగా సూచిస్తే జనం విస్తుపోయి కిలకిలా గలగలా నవ్వుకొన్నారు .ఈయనా మర్నాడే ప్లేట్ మార్చి సెలవులు లాకౌట్లు ప్రకటించి,’’ —- ముత్తైదు’’ లా వ్యవహరించాడు .రాష్ట్ర ఎన్నికల కమీషనర్ స్థానినకాన్ని పోస్ట్ పోన్ చేస్తే ఎక్కడో కాలి ,కులం పూనకంతో ఆయనా ఆయన కౌరవ సేన భీభత్సం సృష్టించారు అంతకు ముందూ  తర్వాత కూడా .ఉచ్చనీచాలు వదిలేశారు .పాపం వాళ్ళెం చేస్తారు మంచి గ్రహాలన్నీ స్వస్థానాలు వదిలేసి పరాయి కొంపల్లో ,పాప స్థానాలలో హాయిగా స్థిరపడితే .ఇది పాపగ్రహకూటమి .ప్రపంచ విలయం .అక్రమాలకూ నిలయం .కలియుగం  అంతమయే రోజులు దగ్గరకోచ్చాయా అనే అనుమానం .ఇదంతా ఆ  ‘’అష్ట గ్రహ కూటమి’’ప్రభావమే .వీళ్ళు పావులు, పిపీలికాలు .శాంతం పాపం .

  ఇక దేశ గ్రహచారం ఎలా ఉంటుందో చూద్దాం –అన్ని రాష్ట్రాలు జనతాకర్ఫ్యు తో ఇంటి క్వార౦ టైన్ లో ఉండటం వలన ప్రభుత్వాలకు రూపాయి కూడా ఖర్చుకాదు. అంతా ఆదాయే .భక్తులకు పూలు  కొబ్బరికాయ, పళ్ళు,అగరొత్తులు ,కర్పూరం  ఖర్చులు లేవు .గుడులన్నీ మూతలేకాని తీతల్లేవు .ప్రసాదాలు వండక్కర్లేదు  నైవేద్యాలు, భోగాలు లేవు .యెదొఇన్త వండి నైవేద్యం పెట్టటమే. దేవుళ్ళకూ పస్తులే పాపం. ‘’యదన్నం మానవాః తదన్నం దేవతాః ‘’అని ఆర్యోక్తి ఉండనే ఉంది ..గ్రహప్రభావం కాక మరేంటి .శివుడికే ఒకప్పుడు శని ప్రభావం తప్పలేదు .ఇప్పుడు కామన్ గా దేవుళ్ళకూ దేవతలకూ అదే తీరు .దండల్లేవ్ స్తోత్రపాఠాల్లేవ్ ,పవళింపు,సుప్రభాత సేవల బంద్.పూజార్లు ఏంచేస్తే అదే జరిగినట్లు ఊరడింపు.

  శుక్ర ,గురులు భీష్మించారు .వివాహాది శుభకార్యాలు బంద్.ఒక వేళ చేసుకొన్నా అయిదారుగురు మనుషులతోనే .ఎంత ఆదా?స్వయం నియంత్రణ తెచ్చింది కరోనా ఒక రకంగా .కేంద్ర ప్రభుత్వం  ఆర్ధిక మాంద్యానికి చేసే పనుల్లేవ్.స్పీచులు తప్ప’’ మెజర్లు’’ ఉండవు .మాటలకు ఝడిసేదా ఆర్ధిక కరోనా ?కొరడా దెబ్బలకు జడుస్తున్దికాని .మొత్తలావులకు ఊడిగం చేసేవారికి సామాన్యుల గొడవేం పడుతుంది .500కోట్లకు రాజ్యసభ సీటు కొనేవారికి జనానలతో పనేమిటి -బ్యాంకు లావాదేవీలు పారిశ్రామిక దిగ్గజాలకు రోడ్డునపడే కుక్కల నక్కల రొద పడుతుందా .ఇదంతా పాపగ్రహ కూటమి ఫలితమే .గ్రహాలు నడిపిస్తుంటే పాపం వీళ్ళే చేస్తారు ?అని సరిపుచ్చుకోవాలి సామాన్యుడు .మాన్యుల నెదిరించి బతగ్గలడా .ఎదిరిస్తే దేవభూమి ఉత్తరప్రదేశ్ లో ,వీరభూమి పంజాబ్ లో,  దేశ శిరో భూమి ఢిల్లీ లో అయినట్లే శాస్తి జరుగుతుంది .అడ్రస్ లు గల్ల౦తవుతాయి

   ఇకమన రాష్ట్రం సంగతికొస్తే –ఎన్నికల కమీషన్ తో తలంటి .రోజూ హై కోర్ట్ తిట్లు మొట్టికాయలు ,పంచ్ లూ తప్పని పరిస్థితి .స్పీకర్ తో సహా వాచాలత్వం ,బూతుల పంచాంగం కరోనా వైరస్ లా సెకండ్, ధర్డ్ స్టేజ్ చేరి ,చివర్లో  పీక్ లో ఉంటాయి .ఇంకా పీక్ లో ఫ్రస్ట్రేషన్ ప్రసాద్ లా ,ఫ్రస్ట్రేషన్ ఉమన్ లా మంత్రులు ప్రవర్తిస్తారు .నాలుకలపై సరస్వతి నర్తించాల్సిన చోట చండిక నర్తిస్తోంది .ఇప్పటికే పది పదిహేను రద్దులు చేసిన ‘’ముద్దు’’ లాయన ఇక ఈ కరోనా ఫ్రస్ట్రేషన్,  కోర్టు కేసులు ,ఎలక్షన్ తంతు ,దోపిడీలు ,నామినేషన్ చిమ్పుళ్ళు,వెయ్యకుండా బెదిరింపులు ,ఉపసంహరణ అఘాయిత్యాలు, నరుకులాటలు ,హోదా, ‘’వినోదం ‘’సినిమాలో ‘’ఉత్తుత్తి బ్యాంక్ ‘’లా ఎండమావి అవటం ,సెంటర్ డబ్బు ‘’చేపక’’పోవటం ,శుక్రవారం’’ కోర్టు’’ ప్రార్ధనలతో  ఎన్ఫోర్స్ మెంట్ వేధింపులతో విసిగి, వేసారి,కౌరవ నాయకుడిలా   ,చివరకి అసెంబ్లీతో సహా మంత్రి వర్గ౦తో సహా తననూ రద్దు చేసుకొనే సూచనలు కనిపిస్తున్నాయి .ఇది జరక్కపోతే 365 భయం ఉండనే ఉంది .అమరావతికి అభయమిస్తు౦ది కోర్టు .ఇప్పటిదాకా దాగుడుమూతలాడిన సినీ హీరోలు తప్పు తెలుసుకొని జనజీవివన స్రవంతి లో చేరే సూచనలున్నాయి .మీడియా కూడా భజన మానేసి స్వయం నియంత్రణ తో ప్రజాస్వామ్యంగా పనిచేసే సూచనలున్నాయి .కరోనా భయోత్పాతం కలల్పించినా చివరకు ఒక రకంగా మంచే చేస్తుందేమో .ఐతే ప్రపంచ వ్యాప్తంగా అందరికి గుణపాఠం మాత్రం నేర్పింది .మర్చిపోలేని పర్యావరణ స్పృహ ,శుచి ,శుభ్రత ,మనదైన సంస్కారం లకు పునరుజ్జీవనం కలిగించింది.

  ఇప్పుడే ఒక యువక శ్రోత ఒక చీటీ పంపి ‘’ఇక సోది ఆపి ,సరుకులధరలు ,ఎగుమతి దిగుమతి ,జనాభా వగైరాలు చెప్పి ఏడవండి ‘’అని రాశాడు ,.అదే విషయానికి వస్తోన్నాన్రాకన్నా . కరోనాలాగా కంగారు పెట్టిస్తే ఎట్లారా నాన్నా ! ప్రేమించుకొన్నా, స్పర్శ సుఖం లేకపోవటం వలన యువతీ యువకులు పెళ్లి చేసుకోటానికి భయపడటం వల్లా ,పెళ్లి ఐన భార్యాభర్తలు కూడా అన్ని సుఖాలున్నా’’ ఆసౌఖ్యం ‘’లేనందువల్లా సంతానం ఈ ఏడాది తగ్గి, జనాభా పెరగదు . చైనాలో పాము ,కప్ప ,పిల్లి ,ఎలుక, కుక్కా, నక్కా నరజాతికి ఆహారం కాకుండా హాయిగా జీవిస్తాయి .ఇండియా నుంచి వాటి ఎగుమతులూ ఉండవుకనుక  ఎగుమతి ,స్మగ్గ్లింగ్ తగ్గుతుంది .ఆవు మాంసం చూస్తే ఐరోపా గడగడ లాడటం వల్ల అక్కడా,ఇక్కడా  గోమాత సేఫ్ .ఇక్కడకూడా ప్రజల్లో అవేర్ నెస్ పెరిగి లారీల్లో వాటి దొంగరవాణా బంద్ .విభూతి ,తులసి, పసుపు మిరియం ధనియం, గోమూత్రం, ఆవుపాలు, పేడ, వేపల ఔషధ గుణాలు మళ్ళీ గుర్తుకు రావటం తో  వీటి ధరలు ఆకాశాన్నంటినా ఆశ్చర్యం లేదు .

  రోజుకూలీ లేక నిత్యావసరాలు దొరక్క కూరగాయలు ఆకాశం లో ఉండటం వల్లా జనం తిండికి మొహం వాఛి పోతారు .ప్రభుత్వం వారికి డబ్బు సాయం చేసి ఆదుకోకపోతే వారి జీవితాలు మాల్ న్యూట్రిషన్  తో హుళక్కి అయ్యే ప్రమాదముంది .మగ ఉద్యోగులు ఇంటి చాకిరి ,వర్క్ ఫ్రం హోమ్ లతో బిజీ బిజీ అయి, పలకరిస్తే కస్సుబస్సు  మంటారు .చిక్కి శల్యమౌతారు .ఆనందం అర్ణవం అవ్వాల్సింది ఆవిరై పోతుంది .స్త్రీ ఉద్యోగినులు,  హౌస్ వైవ్స్ ల పాలిట స్వర్గం గా ఉంటుంది జనతాకర్ఫ్యు. హాయిగా కాలు మీద కాలేసుకొని సీరియల్స్, సినిమాలు చూస్తారు .కనుక ఒళ్ళు బరువెక్కే ప్రమాదం ఉంది .పిల్లలు ‘’జాం జాం’’ గా  వీడియో గేమ్స్ తో ఎంజాయ్ చేస్తారు .ఒకప్పుడు చైనా చేసినట్లు ,ఆమెరికాలో వాళ్ళకూ’’ లెసన్స్ ఆన్ లైన్’’ లోనే కనుక కళ్ళు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు కర్తా0తికులు .

  రాశి ఫలితాలకొస్తే ‘’అన్ని రాశుల ఉనికి ‘’అని అన్నమయ్య చెప్పినట్లు ఒక్కటిగానే ఉంటుంది .పెద్ద తేడా ఉండదు .ఎందుకంటె శుభులు కూడా సావాసా దోషం తో పాపులయ్యారు కనుక .నరఘోషకు, గ్రహ శాంతికి డబ్బులు ఖర్చు చెయ్యలేని స్థితి కనుక నే చెప్పే చిట్కా పాటిస్తే చాలు .మేష రాశి వారు మేకతోలు ,వృషభం వారు ఎద్దు చర్మం ,మిధునం వారు రతీమన్మధ బొమ్మ ,కర్కాటం వారు –ఎండ్రకాయ డిప్ప ,సింహం వారు సింహ౦ తోక ,కన్యారాశి వారు బాపు బొమ్మ ,తులవారు త్రాసు ,వృశ్చికం వారు తేలుకొండి,ధనుస్సు వారు విల్లంబు ,మకరంవారు మొసలి పొలుసు ,కుంభరాశి వారు కుండపెంకు ,మీనం వారు ఎండు చేప ఉంగరాలలోనో తలకో మొలకో ఆభరణ౦ లోనో ధరిస్తే ,అన్నీ సర్దుకుంటాయి .అన్ని రాశులవారు తప్పక ‘’కరోనా జపం ‘’కరోనాభిషేక౦  చేయిస్తే కాని శాంతి లభించదు .ఇవేవీ చేయలేనివారు ఇంటి వాకిలి ద్వారం తలుపు మీదనో, గోడమీదనోఒకప్పుడెప్పుడో మనం ‘’ఓ స్త్రీ రేపురా ‘’అని రాయించినట్లు ఇప్పుడు  ‘’ఓ కరోనా !ఇవాళకాదు రేపు రా ‘’అని రాయిస్తే చూసి పారిపోవచ్చు .అసలు ఇవన్నీ ఎందుకురా భయ్ నమస్కార సంస్కారం ,బయటినుంచి రాగానే కాళ్ళూ చేతులూ మొహం కళ్ళూ కడుక్కొని తడి గుడ్డ తో తుడుచుకొంటే కరోనా లాంటివి మనల్ని చూసి ఆమడ దూరం పారిపోతాయి .ఎరుక మర్చి పోయి ,అనర్ధాలు తెచ్చు కొంటున్నాం .మనల్ని మనం తీర్చి దిద్దుకోవాలని కరోనా సందేశంరా భయ్.ఇది గుర్తిస్తే చాలు .

   మాస్కులు అందించలేక అమెరికా యే చేతులెత్తేసింది కనుక మనం పాత చీర ముక్కలతో మాస్కులు తయారు చేసుకొని వాడితే సరి .దీనివలన పాతచీరల ధరలు పెరిగే ప్రమాదం ఉంది .స్టీలు సామాను వాళ్ళ నోట మట్టే. దేవుళ్ళకూ’’ మాస్కుల దండలు’’ వేస్తె మంచిది వారు సర్వవ్యాపులు ,సర్వాంతర్యాములు కనుక .

  ఇక ‘’సంక్రాతి పురుష ‘’పు౦గవుడి గురించి నాలుగు మాటలు.పేరు ‘’మంద’’.అంటే ‘’మనమంద’’లోని వాడే నన్నమాట .  ఆయనాకరోనా విషయం లో సకల  జాగ్రత్తలు తీసుకొని  వేప నీటి స్నానం ,పీత వస్త్రధారణ –పేత అంటే పీతలు వస్త్రంగా అనికాదు రా బాబూ పసుపురంగు,పెద్దపులి వాహనం తో వస్తాడు .తుంగభద్రానదికి ఈఏడాది పుష్కరం కనుక అన్ని జాగ్రత్తలతో పుష్కర విధులు నిర్వహిస్తే మంచిది .ఇంతకీ రేపు ప్రవేశించే కొత్త సంవత్సరం పేరు ‘’శార్వరి’’అంటే ‘’రాత్రి ‘’పగలుకంటే రాత్రి భయంకరం కదా .అందుకే ముందే కరోనా హెచ్చరికలతో వస్తోంది .కనుక మనం సరదాగా ‘’కరోనా ఉగాది ‘’అనుకున్నా తప్పేమీ లేదేమో .

  అసలు పంచాంగ శ్రవణం రేపు చేస్తాను .

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-3-20 –ఉయ్యూరు    .

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా వూరు -మావాళ్లు -శ్రీ శార్వరి ఉగాది కవి సమ్మేళనం లో చదవాలనుకున్నా కవిత

మా వూరు -మావాళ్లు  కవిత 

మావూరూ మా వాళ్ళు గురించి ఎంత  చెప్పినా తరగని జ్ఞాపకాల గని 

అవన్నీ మధురోహల ఊసులే మమతల మల్లెజాజి సువాసనలే 

ఆప్యాయత , ఆత్మీయత రంగరించిన సుగంధ పరిమళ లహరులే

 మదిలో నాటుకు పోయిన సన్నజాజి లతా నికుంజాలే 

వీరందరి గురించి ఆత్మీయంగా రాసిందే 

ఊసుల్లో ఉయ్యూరు అందుకే అన్నీ మా ఊళ్లే అంతా మా వాళ్ళే అంటాను నేను 

ఈ శార్వరి ఉగాది శుభ సందర్భంగా   మీ-గబ్బిట  దుర్గాప్రసాద్ -23-3-20-ఉయ్యూరు 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ఆంద్ర శాస్త్ర మాణిక్యాలు పుస్తకం కవర్ పేజీలు ,లోపలి ముఖ్యవిషయాలు

ఆధునిక ఆంద్ర శాస్త్ర మాణిక్యాలు (వివిధ రంగాలకు చెందిన 62 మంది ఆంధ్ర శాస్త్రవేత్తల జీవిత విశేషాలు, చేసిన కృషి )adhunika andhra sastra maniratnalu

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సోమనాథ్నుంచి కాశీ విశ్వథ్ దాకా పుస్తకం కవర్ పేజీలు ,లోపలి ముఖ్యవిషయాలు

సోమనాథ్నుంచి కాశీ విశ్వథ్ దాకా పుస్తకం కవర్ పేజీలు ,లోపలి ముఖ్యవిషయాలు

Download by clicking the link

సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా (2002 నుంచి 2015 వరకు -6 రాష్ట్రాలలో మా క్షేత్ర సందర్శన విశేషాల యాత్రా సాహిత్యం)somanadh numchi kaasiviswanadh daaka

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -కవర్ పేజీలు ,లోపలి ముఖ్య విషయాలు

ఊసుల్లో ఉయ్యూరు -కవర్ పేజీలు ,లోపలి ముఖ్య విషయాలు

 

 

 

23 ఊసుల్లో ఉయ్యూరు ఉయ్యూరుతో ,అక్కడి వ్యక్తులు,సంస్థలు మొదలైనవాటితో నాకున్న 75ఏళ్ళ అనుబంధం ,జ్ఞాపకాలు అనుభవాల నాస్టాల్జియా

download here by clicking the links

vusullo vuyyuru Cover Page

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ శార్వరి ఉగాది జ్ఞాపిక

సరసభారతి శ్రీ శార్వరి ఉగాది జ్ఞాపిక

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

22-3-20 ఆదివారం రాత్రి మా ఇంట్లో 57ఏళ్ళనాటి మోపిదేవి హైస్కూల్ ప్రియ శిష్యుడు ,కృత్తి వెంటిమాధవ్ కు ఆత్మీయ స్నేహితుడు చి.అడవి శ్రీరామమూర్తి

22-3-20 ఆదివారం రాత్రి మా ఇంట్లో 57ఏళ్ళనాటి మోపిదేవి హైస్కూల్ ప్రియ శిష్యుడు ,కృత్తి వెంటిమాధవ్ కు ఆత్మీయ స్నేహితుడు చి.అడవి శ్రీరామమూర్తి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

22-3-20 ఆదివారం ఉదయం మా ఇంట్లోఅనుకోనిఆత్మీయ అతిధులు

22-3-20 ఆదివారం ఉదయం మా ఇంట్లోఅనుకోనిఆత్మీయ అతిధులు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కరోనా నిజాలు

నిజాలు

1-కరోనా అంటే ఎందుకు చింత ?-పారా  సెట్మాల్ఉందిగా మీ చెంత .-అని చెబితే నమ్మితే మీ పని మటాష్

2-కోవిడ్ అంటే భయమెందుకు ?బ్లీచింగ్ దానికి అభయం అని తెలీదా –అని నీతి బోధిస్తే మీరు లేవలేని గోతిలో పడ్డట్లే

3-కరోనా ముసలాళ్ళ కే అని దిగులా ? 60దాటితే ఆస్పత్రిలో చేర్చుకోరుగా –ఇక నేరుగా వైకుంఠ యాత్రే

4-నాగరకత కు నిలయం ఇటలీ –ఇప్పుడు కరోనాతో కళేబరం అవుతోంది

5-కప్పలు కుక్కలు పాములు తినే చైనాలో  కరోనా రాకేం చేస్తుందని ఈసడింపా ?

  వాళ్ళే ము౦దుమేల్కొని అన్ని జాగ్రత్తలు తీసుకొని కరోనా మహమ్మారి ని తరిమేశారని తెలుసుకో

6-ధనిక దేశాలమని విర్రవీగే అమెరికా ,యూరప్  లు  కరోనాతో కల్లోలమై ఆర్ధిక మాంద్యం లో విలవిలలాడుతుంటే –చైనా తన ఆర్ధిక స్థితిని ఎన్నో రెట్లు పెంచుకొన్నది కరోనా కష్టకాలంలో కూడా

7-అమెరికాలో షాపుల్లో సరుకులు నిల్-చైనాలో సరుకులతో షాపులు ఫుల్

8-అసలే ఆర్ధికంగా ఈ ఐదేళ్ళలో కుంగిన భారత్ –కరోనా తో మళ్ళీ తల పైకెత్తు కుంటుందని నమ్మగలమా

9-మాటలు కోటలు దాటటం కాదు –చేతల్లో సత్తా నిరూపించాలి నాయకమ్మన్యులు

10-స్పర్శ వైరస్ కరోనా  కులం గజ్జి సలపరింతతో  మరీ  విజ్రు౦భిస్తే –మందే లేదు ఇక భస్మాసుర హస్తమే .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-3-20-ఉయ్యూరు

Posted in రచనలు, సమయం - సందర్భం | Tagged | Leave a comment

తప్పని సరి పరిస్థితులలో – శార్వరి ఉగాది వేడుకలలో సరసభారతి 3 పుస్తకాల ఆవిష్కరణ

తప్పని సరి పరిస్థితులలో – రసభారతి 3పుస్తకాల ఆవిష్కరణ

సాహితీ బంధువులకు శుభకామనలు ,మరియు శ్రీశార్వరి ఉగాది శుభాకాంక్షలు .ప్రపంచమంతా కరోనా మహమ్మారి వ్యాపించి తీవ్ర అల్లకల్లోలం చేస్తూడటం ,సెకండ్ ఫేజ్ దాటి మూడవ ఫేజ్ లోనూ విజ్రు౦భి౦చటం  దేశాలన్నీ స్వయం కర్ఫ్యూ విధించుకొని జాగ్రత్త పడుతూ౦డటం ,మనరాస్ట్రం లోనూ  కరోనా కోరలు సాచి భయానక పరిస్థితులు కల్పించటం ,ప్రజలు ఇంటి నుంచి కదిలి బయటికి వెళ్ళే ధైర్యం లేకపోవటం ,విద్యా సంస్థలు మూతపడటం ,పదవతరగతి పరీక్షలు ఈ నెల 31 నుంచి జరుగ బోతూ౦డటం,స్థానిక ఎన్నికలు వాయిదా పడటం తో, గందరగోళ పరిస్థితి ఏర్పడి ,ఎప్పటికి మామూలు వాతావరణం నెలకొంటుందో చెప్పలేక పోతున్నారు .ఇలాంటి ఆపత్కర పరిస్థితులలో  ఈ రోజు అంటే మార్చి 22ఆదివారం సరసభారతి 150వ కార్యక్రమ౦గా నిర్వహించాల్సిన శ్రీ శార్వరి ఉగాది వేడుకలను వాయిదా వేయక తప్పలేదని మీకు తెలుసు .

1-       ఐతే ఇద్దరు ముగ్గురు అతిధులు ఇప్పటికే ఉయ్యూరు వచ్చి ఉండటం మళ్ళీ ,ఇంత పెద్ద కార్యక్రమం సమీప భవిష్యత్తులో నిర్వ హించటం కూడా చాలా కస్టమవటం, ఆవిష్కరి౦పబడే 3పుస్తకాలు ముద్రణ పొంది నిన్న సాయంత్రమే అందటం తో, తప్పని సరి పరిస్థితులలో నిన్ననే 21-3-20 శనివారం రాత్రి శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారల పాదాల చెంత పై మూడు పుస్తకాలు ఉంచి ,పూజ చేయించి ,ఉన్న అతిదులతోనే స్వామివార్ల సన్నిధానం లో ఆవిష్కరణ జరిపించి నట్లు భావించాం .

2-కొత్తగా అందిస్తున్న’’ శ్రమశక్తి’’ పురస్కారగ్రహీతలు ,ఎక్కువమంది’’ స్వయం సిద్ధ ‘’పురస్కార గ్రహీతలు స్థానికులే అవటం తో ,వారికి కూడా పురస్కారాలు అందజేస్తున్నాం .

3-కరోనా భయం ఇప్పుడప్పుడే పోయే సూచనలు లేనందున ‘’మా వూరు –మా మా వాళ్ళు ‘’అంశం పై జరపాల్సిన  ఉగాది కవి సమ్మేళనం  సమయం దాటాక చేస్తే బాగుండదని భావించాం .దీనివలన కవిమిత్రులకు అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నాం .ఐతే మీరు రాసిన కవితలను  నాకు మెయిల్ లో కాని, పోస్ట్ లో కాని ఉగాది దాటాక పంపమని కోరుతున్నాను .వాటిని ఇదివరకు లాగానే సరసభారతి అంతర్జాలం , ఫేస్ బుక్ ,వాట్సాప్  లలో పెట్టి, అందరికి అందు బాటులోకి తెస్తామని తెలియజేస్తున్నాను . వీలుని బట్టి కవితలు పుస్తకరూపం లో తెచ్చే ప్రయత్నం చేస్తాము .

పై విషయాలను అతిధులు ,పురస్కార గ్రహీతలు ,కవి మిత్రులు,సాహిత్యాభిమానులు  సహృదయం తో  అర్ధం చేసుకొంటారని భావిస్తూ ,మరొక్క సారి శ్రీ శార్వరి ఉగాది శుభా కాంక్షలు తెలియ జేస్తూ –సెలవ్ –మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-3-20-ఉయ్యూరు .

Public links
You can download use pdf option to download these books

 from our blog

శార్వరి ఉగాది వేడుకలలో వెలువడనున్న పుస్తకాలు

వరుస పుస్తకం పేరు వివరాలు
23 ఊసుల్లో ఉయ్యూరు ఉయ్యూరుతో ,అక్కడి వ్యక్తులు,సంస్థలు మొదలైనవాటితో నాకున్న 75ఏళ్ళ అనుబంధం ,జ్ఞాపకాలు అనుభవాల నాస్టాల్జియా

vusullo vuyyuru Cover Page

24 సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా (2002 నుంచి 2015 వరకు -6 రాష్ట్రాలలో మా క్షేత్ర సందర్శన విశేషాల యాత్రా సాహిత్యం)

 somanadh numchi kaasiviswanadh daaka

25 ఆధునిక ఆంద్ర శాస్త్ర మాణిక్యాలు (వివిధ రంగాలకు చెందిన 62 మంది ఆంధ్ర శాస్త్రవేత్తల జీవిత విశేషాలు, చేసిన కృషి )

 adhunika andhra sastra maniratnalu

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి 3పుస్తకాల ఆవిష్కరణ

సరసభారతి 3పుస్తకాల ఆవిష్కరణ

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ శార్వరి ఉగాది వేడుకలు  అనివార్య పరిస్థితులలో వాయిదా

సాహితీ బంధువులకు శుభకామనలు -రాష్ట్రం లో, దేశం లో ఉన్నకరోనా వైరస్ , ప్రధాని ప్రకటించిన స్వచ్చంద కర్ఫ్యూ వలన   22-3-20 ఆదివారం జరగాల్సిన శ్రీ శార్వరి ఉగాది వేడుకలు  అనివార్య పరిస్థితులలో వాయిదా వేస్తున్నామని తెలియ జేస్తున్నాను .దుర్గాప్రసాద్ -20-3-20-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment