వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.7 వ భాగం.15.10.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.7 వ భాగం.15.10.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.64 వ భాగం.15.10.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.64 వ భాగం.15.10.25.

Posted in రచనలు | Leave a comment

జీవన సంధ్యలో డా.రాచకొండ శర్మగారు పూయించిన ‘’మైదానంలో సూర్యోదయం ‘’

జీవన సంధ్యలో డా.రాచకొండ శర్మగారు పూయించిన ‘’మైదానంలో సూర్యోదయం ‘’

డా.రాచకొండ నరసింహ శర్మ ఎం.డి.గారు మా మైనేని గోపాలకృష్ణ గారి బావగారు అంటే అక్కయ్యడాక్టర్  అన్నపూర్ణ గారి భర్త .దంపతులిద్దరూ డాక్టర్లు .గుంటూరులో చదివారు .శర్మగారు ప్రముఖ కవి రా.వి శాస్త్రి గారి తమ్ముడు .కుమారుడు కుమార్తె అమెరికాలో ఉంటారు .శర్మగారు సతీమణి గారితో విశాఖ లో ఉంటారు.రెండేళ్లక్రితం అన్నపూర్ణ  గారు మరణించారు . శర్మగారి 90వ పుట్టిన రోజు నేను రాసి సరసభారతి ప్రచురించి శర్మగారికి అంకితం ఇచ్చిన ‘’పూర్వా౦గ్లకవుల ముచ్చట్లు ‘’ఉయ్యూరులో అవిష్కరి౦చా౦. ఇపుడు . వృద్ధాప్యం లో  కూడా ప్రతి యేడూ అలుపెరు౦గక ఏదో ఒక పుస్తకం రాసి ప్రచురిస్తూనే ఉన్నారు .నిరుడు బెజవాడలో కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల సభల్లో కూడా శర్మగారు 101 జన్మదినోత్సవ సందర్భంగా వారు రాసిన పుస్తకం ఆవిష్కరించాం .శర్మగారికి ఎన్నెన్నో సన్మానాలు జరిగాయి .మంచిమనిషి  ఉదారహృదయులు ,సరసభారతికి అత్యంత ఆప్తులు శర్మగారు .తరచుగా ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాం..మైనేని గోపాల కృష్ణ గారి ఆర్ధిక సహాయంతో  నేను కన్వీనర్ గా  ఉయ్యూరు లో దక్షిణ భారతం లోనే మొట్టమొదటి  సారిగా నిర్మింపబడిన  ఏ.సి లైబ్రరీ ప్రారంభోత్సవానికి విచ్చేశారు శర్మగారు గోపాలకృష్ణ గారు .2017మార్చి 15న డా శర్మ దంపతులను  విశాఖలో వారింటిలో దర్శించాం .సరసభారతి బ్లాగ్ లో నేను రాసే ప్రతివ్యాసం శర్మగారికి పంపుతూనే ఉన్నాను .

 అంతటి మహోన్నత సాహితీ మూర్తి శర్మగారు ఇవాళ ఉదయం విశాఖలో మరణించి నట్లు తెలిసింది .వారి ఆత్మకు శాంతికలగాలని కోరుతూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ  వారి సాహితీ వైదుష్యానికి దర్పణంగా వారు రాసిన పుస్తకం పై నేను 2019 లో రాసిన సమీక్ష మీముందు ఉంచుతున్నాను -గబ్బిట దుర్గాప్రసాద్-15-10-25-ఉయ్యూరు  

‘’జీవన సంధ్యలో డా.రాచకొండ శర్మగారు పూయించిన ‘’మైదానంలో సూర్యోదయం ‘’’

‘’పంచనవతి వర్ష’’(95) యౌవనులు డా రాచకొండ నరసింహ శర్మగారు తమకున్న ఆంగ్లకవితాభిరుచికి దర్పణంగా తాను  చదువుతున్నకాలంలో తనకు అత్యంత ప్రీతికరమైనఅ ఆంగ్ల  కవితలను ఎంచుకొని , మరో ఆంగ్లకవితానువాద సంపుటిని సప్తతి(70) కవితల అనువాదంతో ఈ సెప్టెంబర్ లో ‘’మైదానం లో సూర్యోదయం ‘’గా వెలువరించారు  .ఆంగ్ల కవిత్వం చదివితే ‘’చిత్తము నిలవదు సుంత యైన ‘’అన్నట్లు ఆయన అనుభవించి ఆ ఆన౦దానుభూతిని మనకూ పంచిపెట్టే హృదయమున్న భిషగ్వరులాయన .ఇప్పటికే ‘’పడమటి సంధ్యారాగం ‘’లో 41,’’అయితే ‘’లో 46ఆంగ్లకవితల్ని అనువదించి ,స్మైల్స్ ,టియర్స్ అండ్ మోర్’’ ఆంగ్లకవితల ను ,’’సానెట్స్ ఫ్రం పోర్చుగీస్’’ అందించిన అనుభవం వారిది .తెలుగు కవితలను ఆంగ్లంలోకీ అనువాదం చేసిన నేర్పు వారిది .అంటే ద్విభాషా కవి .ఈ పుస్తకాన్ని తమప్రియతమ అర్ధాంగి డా .అన్నపూర్ణా హారతి దేవికి ,ఆమె మైదానం లోకి రాలేనందున ఆమెగదిలోకే ‘’మైదానం లో సూర్యోదయం ‘’తెచ్చి పరమానంద భరితురాలిని చేసి ,తమ సతీ ప్రేమను వర్షించారు .పుస్తక శీర్షికకు తగిన మైదానం ,సూర్యోదయం ,పశువులు, నీటి చెలమ ,పచ్చ గడ్డిలతో ముఖ చిత్రం ముద్దులొలికింది .ఆంగ్లకవితలు పేజీకి ఎడమవైపు ,తెలుగు సేత కుడివైపు ,అనుబంధంగా ఆకవుల చరిత్ర సంక్షిప్తంగా అందించారు .దాదాపు స్కాలిత్యం లేని పెద్ద  అక్షరాలతో.పుస్తకం చూడగానే మైదానం అంటే ‘’ఫ్లాటై ‘’పోతాం .శర్మగారు ఆత్మీయంగా పంపిన ఈపుస్తకం నిన్న మధ్యాహ్నం నాకు అందింది .రాత్రి 20,ఈ రోజు ఉదయం మిగిలిన 50 ఆబగా జుర్రేశాను .నిన్న పుస్తకం ఒక సారి తిరగేసి ‘’టైటిల్ ‘’విషయం లో ముందుమాటలు రాసినవారు ఎవరైనా మార్గ దర్శనం చేశారేమో అని వెతికితే దొరకలేదు .శర్మగారికే ఫోన్ చేసి పుస్తకం అందిన సంగతిచెప్పి  ,శీర్షిక ఔచిత్యాన్ని గురించి అడిగాను .వారు చెప్పిన సమాధానం సంతృప్తి కలిగించింది .ఈ కవుల జననకాలం 1554నుంచి 1896వరకు .అంటే దాదాపు 350సంవత్సరాల కాలవ్యవధిలోని  కవులు, వారికవిత్వ దర్శనం అన్నమాట .కనుక అద్భుతమైన వైవిధ్యం ,ఆలోచనలలో పరిపక్వత ,అనుభవసారం ఉన్నకవితలు .ఈ కవులు రాజకవులు ,కవిరాజులు ,రాజాస్థాననకవులు అనే పొయెట్ లారియట్స్ , జన హృదయసామ్రాజ్యాన్ని గెలిచినవారు.భగవదన్వేషకులు ,మాటలతోకాక చేతలతో మంచి చేయమని బోధించే తత్వ వేత్తలు ,జర్నలిస్ట్ లు ,సైంటిస్ట్ లు ,నవలా, కథా రచనలలోఅరితేరినవారు,వివిధ దేశాలకు చెందినవారు,’’ఆకాశంలో సగభాగమైన ‘’స్త్రీలు కూడా ఉన్నారు .ఒకరకంగా’’ డెబ్భై మనో ప్రపంచ దర్శనం ‘’చేయించారు శర్మగారు ఈపొత్తం లో .ఈ కవుల్లో కొందరు పులిట్జర్ ప్రైజ్ వంటి ప్రఖ్యాత బహుమతులు అందుకొన్నవారే . వివరాలు తెలీని ఒకకవి ,మరో అజ్ఞాతకవి ఇందులో చోటు చేసుకోన్నారుకూడా . ఇక కవితా మైదానంలో సూర్యోదయ దర్శనం చేసి పులకిద్దాం .

   విల్లా కేథర్’’అనే కవయిత్రి రాసిన ‘’ప్రయరీ డాన్’’కవిత శర్మగారి చేతిలో ‘’మైదానం లో సూర్యోదయం ‘’గా, ఈ పుస్తకం శీర్షికగా మారి దర్శన మిచ్చింది .ఈమె అమెరికాలో చాలాకాలం కొండలు గుట్టలు ఉన్నప్రాంతం లో ఉండి,ఒక్కసారిగా మైదాన ప్రాంతాన్ని చూసి అక్కడి ప్రకృతి సోయగం , సూర్యోదయాలకు పులకించి రాసిన కవిత అది .పులిట్జర్ ప్రైజ్ పొందినకవి .ఈ మైదానం లో ఆమె ‘’తారలు తరలించిన రక్తారుణజ్వలనం ,ధూళి నిండిన ‘’సేజాకు’’ ఘాటుపరిమళం ఆలమందల హఠాత్ చలనం, దూర పీఠభూముల క్రమ దర్శనం వెలుగులో వెండి మడుగుల  భాసురం ,కాంతి శూలం ఒకటి అతివేగంగా వచ్చి అవనిని గుచ్చటం చూసి తనవూరి పర్వత శ్రేణి కై తృటిలోనే ,కన్నీరు చిమ్మింది .ఆమె మధురానుభూతి మనమనసులను సేద తేరుస్తుంది .’’వాటర్ డిచేస్ సిల్వర్ ఇన్ దిలైట్ ‘’అన్న ఆమె మాటలను శర్మగారు ‘’వెలుగులో వెండి మాడుగుల భాసురం ‘’అని చక్కగా అనువదించారు .’’ఎ సడన్ సిక్ నెస్ ఫర్ ది హిల్స్ ఆఫ్ హోమ్’’ను ‘’తనూరి పర్వత శ్రేణికై తృటిలోనే కన్నీరు చిమ్ము ‘’అన్న అనువాదం  భేషు గ్గా ఉండి,పుస్తక శీర్షికకు గొప్ప న్యాయం చేకూర్చింది .ప్రభాత సూర్యోదయ కాంతికిరణాల నులి వెచ్చని ఆహ్లాదం భాసించింది .

 ఈ కవితా కదంబం సర్ ఫిలిప్ సిడ్నీ కవిత ‘’టు స్లీప్ ‘’ తోప్రారంభమై అజ్ఞాతకవి ‘’మినిట్స్ ఆఫ్ గోల్డ్ ‘’తో పూర్తవుతుంది .సిడ్నీకవి నిద్రను ‘’శాంతినిచ్చే ముడి ,దుఖానికి ఉపశమనం ,నిరుపేదకు భాగ్యం పక్షపాతం లేని న్యాయ నిర్ణేత (తగవరి ) అంటాడు .ఈకవి ఎలిజబెత్ కా లం లో 108సానెట్ ల ‘’ఆస్టోఫెల్ అండ్ స్టెల్లా’’కావ్యం రాసి ఆదర్శ పురుషుడుగా గుర్తి౦పు పొందాడు .అందుకే చివరగా ‘’లైవ్ లియర్ డాన్ఎల్స్ వేర్   స్టెల్లాస్ఇమేజెస్ సీ’’అని ఫినిషింగ్ టచ్ ఇవ్వగా శర్మగారు ‘’ఉల్లాస౦గా చూడగలవు –నాలో స్టెల్లా ప్రతిబింబమును ‘’అని ముగించారు అందంగా .70వ కవిత అజ్ఞాతకవి రాసిన ‘’మినిట్స్ ఆఫ్ గోల్డ్ ‘’ను శర్మగారు ‘’నిజంగా బంగారు నిమిషాలు ‘’గా అనువదించారు .నిమిషాలు గంటలు కాలపరిమాణ౦ లో అర్ధం లేనివి –కానీ అవే బంగారు నిమిషాలు మహత్తర ఘడియలు .ఒకరికి సంతోషం కలిగించటం లో ,చిర్నగవు తెప్పించటం లో  కన్నీరు తుడవటం లో  నైరాశ్యాన్ని అంతం చేయటం లో స్నేహాన్నివ్వటం లో  వాటిని ఉపయోగిస్తే సార్ధకం .అనికాలం మహత్తరమైన విలువకలదన్న బోధ చేశాడుకవి  .

  శర్మగారికి ఉన్న కవితాభిమానం కవులపై ఆరాధన నిరుపమానం .అందుకే ఆ అభిమానాన్ని చాటుతూ ,షేక్స్ పియర్ వి 3,ఎమిలి డికిన్సన్ వి 10,ఎల్లావీలర్ విల్కాక్స్ వి 3,సారా టెసల్డేల్ వి అత్యధికంగా 18,ఎడ్నాసెయింట్ విన్సెంట్ మిల్లేవి 2 కవితలను ఎంచుకొని అనువదించారు .ఎమిలీ ,తారా ఇద్దరూ కవయిత్రులే అవటం విశేషం.’’తలపు నీపైనమరల  సంతోషంకలిగి ,మృదుమధురమైన ప్రేమ స్మృతి ని మెదలి నృపతి పదవినైనా తృణీకరిస్తాను-‘’అని ,’’గులాబీ స్థితి వేరే అని ,అది మరణించినా మధుర పరిమళాలనిస్తుందని ,అందుకే అడవిపూలకంటే భిన్నమైనదని ,సత్కవిత వడబోతు నీ సత్యమహిమ ‘’అని ,సుఖాన్ని కోరితే దుఖం ,సంతోషంకోరితే మిగిలేది స్వప్నమే –నరకానికి బాట ఐన నాకసుఖం రాయటం ఎవరికీ వీలుకావటం లేదని షేక్స్ పియర్ తన మూడు  సానెట్ లలో చెప్పాడు .’’ఏ లిలీ ఆఫ్ ఏ డే –ఈజ్ ఫైరర్ ఫార్ ఇన్ మే’’అన్న బెంజాన్సన్ కవిత అందరికీ తెలుసు .’’ఇన్ స్మాల్ ప్రోపోర్షన్స్  వుయ్ జస్ట్  బ్యూటీస్  సీ –అండ్ ఇన్ షార్ట్ మెజర్స్ లైఫ్ మే పెర్ఫెక్ట్ బి ‘’అన్న గొప్ప జీవితసత్యాన్ని ‘’సూక్ష్మ పరిమితి లోనే –చూడగలము సౌందర్యమును –తక్కువ పరిమాణం లోనే లోపరహితంగా ఉండవచ్చు మనిషిజీవితం ‘’అని అదే జీవితానికి నిజమైన కొలత అని అర్ధవంతమైన  అనువాదం చేశారు శర్మాజీ.అదే మనతెలుగుకవి  ‘’కాకి చిరకాలమున్న నేకార్య మగును ?’’ అన్నాడెప్పుడో.’’వసుధలో వస్తువులన్నీ కడతేరాల్సిందే –గతవైభవప్రదర్శన తర్వాత గోరీలోకి జారాల్సిందే ‘’అంటూ పువ్వుల్ని అంత తొందరగా రాలిపోవటం ఎందుకు –మేము చదివే అందమైన పత్రాలు మీరు ‘’అని ‘’టు బ్లాసమ్స్ ‘’కవిత లో   రాబర్ట్ హార్రిక్ అన్నదాన్ని శర్మగారు ‘’విరులకు ‘’విన్నపంగా చెప్పారు .’’ఈలోకం సుందరమైనది ,ప్రేమ మహత్తరమైనది ,జీవితం సంక్లిష్టమైనది ‘’అనే సందేశం ఇచ్చాడు హార్రిక్ కవి .మనపదవీ ,వంశగౌరవాలన్నీ ముందో వెనకో విధికి వశమవ్వాల్సిందే .సన్మార్గుల కృత్యములే సౌరభాలు వెదజల్లి ,మట్టిలో వికసిస్తాయి ‘’అని తాత్విక సందేశమిచ్చాడు జేమ్స్ షిర్లి.

  మూడు దేశాల చక్రవర్తి మూడు సార్లు పార్లమెంట్ ను రద్దు చేసి ఇంగ్లాండ్ లో    అంతర్యుద్దానికి కారకుడై, చివరికి పార్లమెంట్ కు లొంగిపోయి , ఆలివర్ క్రామ్వేల్ తో ఓడిపోయి ఉరితీయబడ్డ   మొదటి చార్లెస్ ‘’క్వయట్ స్లీప్ ‘’కవితలో ‘’నెమ్మదికల అంతరాత్మకు  శాంతి విశ్రా౦తులు౦ టాయని ,భద్రంగా నిద్రపొమ్మని –నిద్రకంటే మధురమైనది లేదని ‘’తన అనుభవ సారంగా చెప్పాడు .మొదటి చార్లెస్ రాజు తరఫుకవి అంటే ‘’కావిలియర్ పొయెట్ ‘’ రిచార్డ్ లవ్ లేస్ సైన్యంలో కెప్టెన్ .’’విమల పవిత్ర వక్షస్థలతపస్వినీ గృహాన్ని వదిలి యుద్ధానికి వెడుతూ ,తాను  దయావిహీనడనుకానని,రణరంగం లో మొదటి శత్రువు ఖడ్గ, కవచాన్ని, అశ్వాన్ని  అధికతర విశ్వాసంతో కౌగలి౦చుకొంటానని,అప్పుడు ఆమెకూడా తనను పొగడాల్సిందే నని తన నిలకడ లేనితనం పేరు ,ప్రతిష్ట లను తాను  ప్రేమించకపోతే ఆమెనుకూడా అంతగా ప్రేమించి ఉండలేనని సందేశమిచ్చాడు .హెన్రి వాన్ కు పొదపొదలో పూలహారాలు ఫలహారాలుగా కనిపించి మహీతలం నీరవ నిశ్శబ్దంగా భాషా యోష అశ్రుగీతం వినిపించింది ‘’విశాలాకాశం లో ‘’.’’డి చైల్డ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ మాన్ ‘’అని ప్రకృతి,కవి వర్డ్స్ వర్త్ అన్నమాట వర్దీ మాట .రైన్బో కవితలో ఆమాట చెప్పి మరణమే మేలు –పిల్లలే పెద్దలకు తండ్రులు .నా రోజులన్నీ ఒకదానితో ఒకటి ముడి పడి ఉండాలని ఆశించాడు .

  వాల్టర్ సావేజ్ లాండర్ కవి ‘’ఆన౦ద  క్షణాలు రాలిపోతున్నాయని చి౦తఎందుకు ? మళ్ళీ రమ్మనటానికి నేను ఉండను అవి ఎక్కడో మళ్ళీ వెలుగుతాయి ‘’అని భరోసా ఇస్తాడు .’’ఆబూ బెన్ ఆడం ‘’కవిత చదవని, వినని, విని మురిసిపోని వారుండరు .లీహంట్ రాసిన ఈకవిత ‘’తోటిమానవులను ప్రేమించినవారినే దైవం తనవాడిగా భావిస్తాడు’’అన్న గొప్ప సత్యాన్ని చాటిన కవిత .నేను తొమ్మిదో తరగతిలోనే చదువుకొన్న దానినే విద్యార్ధులకు పాఠంగా చెప్పినకవిత కవిత .టెన్నిసన్ మహాకవికి ‘’ప్రథమ ప్రేమ మధురం ,ప్రగాఢం.వెళ్ళిపోయిన రోజులు శోకభరితం విషాదం  వినూతనం .మాయమైన రోజులు సజీవమరణమే అనిపించాయి కవికి .రాబర్ట్ బ్రౌనింగ్ కు ‘’నేనుఎవర్ని ?’’అనే ప్రశ్న వచ్చి ‘’వెనుతిరిగి చూడని వాడిని –మంచి ఓటమి పొందినా చెడు గెలుస్తుందని కలలో కూడా అనుకోని వాడిని –నిద్రించటం మేల్కొవటానికే అని నమ్మినవాడిని –కస్టేసుఖీ  అని నమ్మి చివరిదాకా పోరాడేవాడిని –ఇక్కడిలాగానే ‘’అక్కడా ‘’అలాగే జీవితం సాగించమని కోరేవాడు .ఆర్ధర్ హఘ్ క్లో కు ‘’ఆశలు నిరాశాలైతే భయాలు భ్రా౦తు లౌతాయి .ప్రభాకరుడు నెమ్మదిగా పైకి వస్తున్నా ,పడమట నేల౦తా శాంతి మయంగా కనిపించింది .

  ఎమిలి డికిన్సన్ అమెరికాలోని మాసాచూసెట్స్ లోని  ఆంహెర్స్ట్  కవయిత్రి.1800కవితలురాసింది  .ఒంటరిజీవితమే గడిపింది .ఎమెర్సన్ సరసన నిలువగలిగిన కవి .ఆమె మరణం తర్వాత నే కవితలు, లేఖలు చెల్లెలు లవినియాకు దక్కి ప్రచురించింది .దాదాపు మిస్టిక్ పోయెట్.ఆమెవి’’ గాస్పెల్ పోయెమ్స్’’ గాగుర్తి౦పుపొందాయి . శర్మగారు ఎంచుకొన్న 10కవితలలో కొన్ని ముఖ్యభావనలు –‘’చిన్న యెదలో ప్రశాంతంగా   పారే సెలయేరు ఉందా ?అందులోని ప్రాణజలం తాగు .ఈ సెలయేరు ఎండకుండా జాగ్రత్త పడు .గుండెల్లో బాధ దాచుకోటానికి మనస్తైర్యం కావాలి .ఈ ప్రపంచం పరిసమాప్తికాదు .అవతల ఏదో ఉంది .ఆత్మనుకొరికే దంతాన్ని మతబోధకుల అభినయాలు’’ హలలూయాలు ‘’నిద్రమందులు అంతం చేయలేవు .ఆకాశం కన్నా విశాలమైంది,మహోదధికన్నా లోతైనది  భగవంతునితో సరితూగేది  మానవ మస్తిష్కం .ఒకపెద్ద బాధతర్వాత ఒకవిధమైన అనుభవం కలుగుతుంది .ఏటవాలుగా పడేకాంతి ని చూసి నీడలుకూడా ఊపిరితీయటం మానేస్తాయి .హృదయం మొదటకోరేది ఆనందం.తర్వాత నిద్ర .చివరికి చనిపోయే స్వేచ్చ .ఆత్మీయులను తానె ఎంచుకొని  ఆత్మ తలుపు వెంటనే మూసేస్తుంది .అందరికీ ఒకమర్యాద ఏదోరోజువస్తుంది .ఆ వైభవం చెప్పనలవికానిది .అదే చావు సంబడం అన్నమాట .జయం ఎప్పుడూ పొందనివారికి విజయం లో మాధుర్యం అతిఎక్కువగా గా అనిపిస్తుంది .విజయకేతనాన్ని ఎగరేసిన సైనికుడు కూడా విజయం నిర్వచనం చెప్పలేడు.

 సారా టేస్ డేల్కవితలను    శర్మగారు 18ఎంచుకొని తర్జుమా చేశారు .అమెరికా సెయింట్ లూయీ కి చెందిన ఈమే 14వ ఏడువచ్చేదాకా బడిలో చదవలేదు కాని 19ఏట పట్టభాద్రురాలైంది .తీవ్రభావోద్వేగంతో ,సంప్రదాయబద్ధంగా ,సరళంగా కవితలురాసింది .ఈమె రాసిన ‘’లైక్ బార్లీ ‘’కవితను హో లింగ అనే చైనా అమ్మాయి చిన్నతనం లోనే అనువాదం చేసింది .సహజత్వం కవితలలో స్పష్టం .కొన్ని భావనలు –‘’కంచల అ౦చు లపైనా ,గడ్డికట్టల   పైనా ,వైఢూర్యాలను వెదజల్లుతూ ,దార౦లొ తారలను ధరించిన సాలె గూళ్ళను మంచు వీడింది .గి౦జగింజలో హరివిల్లు ధరించిన కలుపు మొక్కలను తళతళలాడిస్తోంది .నీప్రేమ వేకువలాగా నవనూతనం .నాపూర్వీకులు నాకు ఆత్మజ్యోతి నిచ్చారు .కానీ నా ప్రేమికులే వివిధవర్ణ శోభామయ చంచలజ్వాల ప్రసాదించారు .గడియ సేపు స్వర్గాన్నిచ్చిన కవితను ప్రేమించాను .వజ్రోదయం తెల్లని ఎండలో భాసించింది .నగలుమార్చినట్లు నీనుండి చూపులు మార్చుకొంటాను.కాలం అనే నేస్తం ముదిమినొసగి మరపిస్తుంది .బార్లీ వెన్నులు కిందకి వంగి తిరిగి మీదకు లేచినట్లు వేదన –లోతులనుంచి పైకొచ్చింది .ప్రకృతి పరిశీలన ఇది . విశ్వనాథగుర్తుకొస్తాడు .గాలి రెండంచులకత్తిలా ఉంది .ఇల్లులేని బాలుడిలాగా నాయెద రోదిస్తోంది .నువ్వుగాలిఅయితే నేను కడలిని .తుఫానులో నీటి గుంట క్షేమంగా ఉన్నా ,సంద్రంకంటే ఎక్కువ చేదుగా అవుతుంది .’’ప్రేముడి’’ గట్టిగా అరచి౦ది నాలో .నాకు శక్తి ఉంది స్వేచ్చనియ్యకపోతే నీ ఎదను విదలించగలను.కాఠిన్యం  కంటే కమనీయతే హృదయ విచారకరం .ఈ విశ్వం లో ఒకే గొంతుమాత్రమే నాకు విశ్రాంతి నివ్వగలదు .ప్రేమించు ప్రేమించు .ప్రేమతోనే జీవితం సార్ధకం .ప్రేమవల్లనే స్వర్గం చేరగలవు .చెరువుమీద మంచు నీటమునిగిన కత్తుల వలేమెరుస్తున్నాది .సౌందర్యం శకలం జ్వలించే టప్పుడు సౌందర్యమా నువ్వు చాలునాకు .గానం నన్ను వీడితే మరచిన గీతంలో మృత్యువే కోరుకొంటా .నేనుగతి౦చినా  నా గాన౦  నాప్రాణం లో జీవిస్తుంది .నా హృదయ చషకం అందమైనదే .నిర్జీవమైన నిర్వేదమద్యాన్ని సజీవంగా సవర్ణంగా మార్చుట ఎలాగోనాకు తెలుసు .ఇలాతలం పై రాత్రి రెక్కలు పరుచుకొ౦టో౦ది .నాహృదయం చెట్టులోని పక్షిలాగా .పిలుస్తూనే ఉంది .అని హృదయావేదన ,ప్రేమ తపన వ్యక్తం చేసింది సారా .

  విశ్వాసం కోసం ప్రార్ధన చేసింది  మార్గరెట్ సాంగ్ స్టర్.ఎదలో ప్రార్ధన సమసిపోతే ఏకాకి నైపోతాననని వాపోయింది .ఏదో ఒక శుభప్రదమైన ఆశ రాత్రిగీతం లో వినిపిస్తుందని ఆశ ధామస్ హార్డీకి .జేమ్స్ విట్కాంబ్ రిలే కి యెంత లోతుగా దిగజారినవారినైనా ప్రేమ ఉద్ధరిస్తుందనే నమ్మకం .ఎల్లా వీలర్ విల్కాక్స్ కు కోరికలు జయించేమనోబలమున్నవారు ,చిరునవ్వులో దుఖాన్ని దాచగలిగేవారు గౌరవపాత్రులుగా కనిపించారు .అవనిలో ని ఆన౦ద౦  శోభా,సౌందర్యాలు సర్వం తిరిగిరాని కథ, శేషజీవితం కేవలం ఒక విధిమాత్రమెఅనిపించింది .నిన్నటి దినాలనుపాతిపెట్టి ఈరోజు గురించి ఆలోచించి ,ఇద్దర్నీకలిపేది దైవమని అన్నది.ఈమె కవితలో అంద౦ ఆశాభావం కనిపిస్తాయి  .రుడ్యార్డ్ కిప్లింగ్ కు   తాను ఉరితీయబడ్డప్పుడు తల్లిప్రేమ తనను అనుసరిస్తుందని ,లోతు సముద్రంలో మునిగినప్పుడు ఆమె కన్నీరు తన చెంతకు చేరుతుందని ,శరీరం ఆత్మ పాపభూయిస్టమైనపుడు ఆమె ప్రార్ధనలు తన్ను ఉద్ధరిస్తాయని ఎరుగును .లయోనేల్ జాన్సన్ మొదటి చార్లెస్ విగ్రహం దగ్గర కూర్చుని  రాసిన దీర్ఘకవితలో జీవితం లో పరాజితుడైనా చనిపోయి సౌందర్యం సాధించాడని ,అతని ఆత్మకళలలో  ఆనందం పొందుతుందని ,జనమంతా ఆయనకృపకు’’ ఆకొని’’ఉన్నారని ఆవేదన చెందాడు .

  జోసెఫ్ బి స్ట్రాస్ ఆశావాది .దెబ్బపై దెబ్బతిన్నా కస్టాలకడలిలో ఈదుతున్నా బాధతప్ప ఏదీ లేదు అనుకోడు .వసంత స్పర్శ ,ఎగిరే పక్షి,చల్లని చిరునవ్వు ,ఒకరిద్దరు నమ్మిన నేస్తాలు జీవితానికి విలువ నిస్తాయనినమ్మాడు  .రాబర్ట్ ఫ్రాస్ట్ కుదూరటానికి కూడా వీలులేని చీకటి వనం లో పక్షిగానం చీకటిలోకి శోకం లోకి రారమ్మని  వినిపించి౦ది. కాని నక్షత్రాలకోసం బయటే ఉండిపోయాడు .మన ల క్ష్యాన్ని అతిదూరం గా ఉంచమని కోరాడు ఫిలిప్ ఏం రాస్కిన్ రష్యన్,జ్యూయిష్ అమెరికన్ కవి . మార్గరెట్ యి బ్రూనేర్ కు కుక్క మానవ హృదయాన్నే అర్ధం చేసుకోగలది అనిపించింది .దానికి కావలసింది అర్ధం చేసుకోగలమిత్రుడే అని నమ్మింది ఆమె. .మన చెట్టు కవి ఇస్మాయిల్ లాగా జాయిస్ కిల్మార్ కు చెట్టంత అందమైన కవిత కనిపించలేదు. అది రోజంతా ఆకులవంటి చేతులు పైకెత్తి దైవ ప్రార్ధన చేస్తుంది .తనలాంటి మూర్ఖులే కవితలు రాస్తారని కాని దేవుడుమాత్రమే చెట్టును చేయగలడని నమ్మాడు .సున్నిత శ్రావ్యత సౌందర్య౦  ఎలినార్ మార్టాన్ వైలీ కవితలలో ఉంటుంది-ఏదో ఒక చోటుకి మఖమల్ పావులు వేసుకొని నీరవ నిశ్శబ్ద నీహారం లోకి నడుద్దాం రమ్మంటుంది.పడకగది గోడమీద తనపొడవును సగర్వంగా కొలిచిన తల్లి కొలిచిన వైనం గుర్తొచ్చింది రోజా జగ్ నోనిమరియాని కి .జోసెఫ్ మార్రిస్ కు యెద కు౦గినపుడు చిరునవ్వే పలకరిస్తుందని నమ్మకం .కారుణ్యం ఎక్కడ అంతం అవుతుందో చూడలేకపోయినా అది శాశ్వతకాలాన్ని చేరుతుంది అంటాడు .అందుకే విలువైన తన 400ఎకరాల భూమిని మయామీ యూని వర్సిటీకి దానంగా ఇచ్చాడు.

 విలియం యి హేన్లి అజేయమైన ఆత్మను తనకిచ్చినదుకు దేవతలకు కృతజ్ఞతలు చెప్పాడు .భయాలకు ప్రమాదాలకు వెరువనివాడు. తన ఆత్మకు తానె అధిపతిని ,తానె నాయకుడిని అని నమ్మాడు’’ ఇన్విక్టస్ ‘’అంటే అజేయత కవితలో .ఈకవితను దక్షిణాఫ్రికా నేత నెల్సన్ మండేలా తనతోపాటుజైల్ లో ఉన్నవాళ్ళకు ఈకవిత వినిపించి ధైర్యం, పోరాటపటిమ కలిగించాడు .తనతల్లికి ఉన్న ధైర్యం ఆమెతో వెళ్ళిపోయిందని ,ఆమె ధైర్యమే తనకు ఉంటె యెంత బాగుండును అని బాధపడింది ఎడ్నావిన్సెంట్ మిల్లె .కాలం బాధను పోగొడుతుంది అన్నది నిజంకాదు అంటుంది .ఈమెధైర్యసాహసాలకు మేధా శక్తికి ‘’అమెరికన్ మహిళా బైరన్ ‘’ గా కీర్తిపొందింది  .కార్రీ మే నికొలాస్  కు ధుమ ధుమలను చిరునవ్వు మాయం చేస్తుందని తీయని చూపు కోపాన్ని చల్లారుస్తుందని అనిపించింది .డోరోతి క్విక్ కు పాతదేవుళ్ల పాలన అంతమైందని గుడిలో’’ కొత్తా దేవుళ్ళు’’ఉండరని ,జీవితసారాన్నీ గ్రహించిన నిమ్నోన్నతాలకు తాను  బంధువునని అనిపించింది .ఈమె 11ఏళ్ళ వయసులో మహా నవలారచయిత మార్క్ ట్వేన్ ను పడవ లో కలిసి స్పూర్తి పొందింది .నార్మన్ వి పియర్స్ కవి కి గులాబీ తోటలు కనిపించకపోయినా వాసన ఇష్టం .పర్వత శిఖరాలు కనిపించకపోయినా  వాటి నుంచివచ్చే చల్లనిగాలి సౌఖ్యం అనుభవించగలడు .పక్షుల్ని చూడలేకపోయినా వానకోయిల గాన సుఖం అనుభవిస్తాడు .దారిలో పిల్లల్ని చూడలేకున్నా వారి హాసాన్ని ఆస్వాది౦చ గలడు .సముద్రంపై చంద్రకాంతి చూడలేకపోయినా కెరటాల సంగీతం వినగలడు.ప్రకృతి సమర్పించే శ్రావ్య ధ్వనులన్నీ వీనులవిందు అతనికి .అందుకే దైవానికి వందనాలు సమర్పించి ఇంతకంటే ఎక్కువఏదీ కోరను అని సంతృప్తి పడ్డాడు ‘’బ్లైండ్ ‘’అంటే అందుడుకవితలో .

  ఇన్ని అద్భుతఆంగ్ల  కవితలను తెలుగులో బంగారపు పోత పోసి అందించిన రాచకొండ శర్మగారికి ఆంద్ర సాహితీ లోకం ఎంతో రుణపడి ఉంది .ప్రతికవిత ఆకవి హృదయాన్ని ఆవిష్కరించే తీరులో అనువాదం సాగి అనుభూతి నిచ్చింది .ఇన్ని హృదయాలలో పరకాయ ప్రవేశం చేయటం మాటలుకాదు .చేసి చూపించి తమ సమర్ధత చాటారు డా.శర్మగారు .మిక్కిలి అభిన౦దనీయులు .వారి పూనిక ధైర్యం దీక్ష ,నిరంతర సాహితీ సేవ అందరికీ ఆదర్శం .భగవంతుడు వారికి, వారి శ్రీమతిగారికీ శతాధిక ఆయుస్సు ,ఆరోగ్యం కలిగించాలని ,మరిన్ని అందమైన ఆంగ్లకవితల అనువాదాలు వారి లేఖిని నుండి వెలువడాలని కోరుతున్నాను .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-10-19-ఉయ్యూరు   .

Posted in రచనలు | Leave a comment

శ్రీ ఎమ్వీయల్ గారి ముత్యాలముగ్గు వెండితెర నవల.2 వ భాగం.14.10.25.

శ్రీ ఎమ్వీయల్ గారి ముత్యాలముగ్గు వెండితెర నవల.2 వ భాగం.14.10.25.

శ్రీ ఎమ్వీయల్ గారి ముత్యాలముగ్గు వెండితెర నవల.2 వ భాగం.14.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.37 వ భాగం.14.10.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.37 వ భాగం.14.10.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.6 వ భాగం.14.10.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.6 వ భాగం.14.10.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.63 వ భాగం.14.10.25.

ఆచార్య రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.63 వ భాగం.14.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ ఎమ్వీయల్ గారి ముత్యాలముగ్గు వెండితెర నవల.1 వ భాగం.13.10.25.

శ్రీ ఎమ్వీయల్ గారి ముత్యాలముగ్గు వెండితెర నవల.1 వ భాగం.13.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ ఆత్మ కథ.తుమ్మపూడి.36 వ భాగం.13.10.25.

శ్రీ సంజీవ దేవ్ ఆత్మ కథ.తుమ్మపూడి.36 వ భాగం.13.10.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.5 వ భాగం.13.10.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.5 వ భాగం.13.10.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.62 వ భాగం.13.10.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.62 వ భాగం.13.10.25.

Posted in రచనలు | Leave a comment

ఆంధ్ర సచిత్ర వారపత్రిక తెలుగు వెలుగులు.18 వ చివరి భాగం.,12.10.25.

ఆంధ్ర సచిత్ర వారపత్రిక తెలుగు వెలుగులు.18 వ చివరి భాగం.,12.10.25.

ఆంధ్ర సచిత్ర వారపత్రిక తెలుగు వెలుగులు.18 వ చివరి భాగం.,12.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.35 వ భాగం.12.10.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.35 వ భాగం.12.10.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.4 వ భాగం.12.10.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.4 వ భాగం.12.10.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.61 వ భాగం.12.10.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.61 వ భాగం.12.10.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.61 వ భాగం.12.10.25.

Posted in రచనలు | Leave a comment

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు 17 వ భాగం.11.10.25

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు 17 వ భాగం.11.10.25

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.34 వ భాగం.11.10.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.34 వ భాగం.11.10.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.3 వ భాగం.11.10.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.3 వ భాగం.11.10.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.60 వ భాగం.11.10.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.60 వ భాగం.11.10.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.2 వ భాగం.10.10.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య తో.2 వ భాగం.10.10.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.59 వ భాగం.10.10.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.59 వ భాగం.10.10.25.

Posted in రచనలు | Leave a comment

  శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు -5

  శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు -5

41-‘’త్యక్తా త్వమసి భోగా౦స్తు మయా సహా వినిర్గతః – దైవ యోగాచ్చ సౌమిత్రే భు౦క్ష్వ దుఖం దురత్యయం ‘’

సూర్య వంశంలో పుట్టి రాజపుత్రులమై ఇలా అడవులలఏడుస్తున్నాం ..రాజభోగాలన్నీ వదిలి నువ్వు నా వెంట వచ్చావు .నీ రాత అలా ఉంది. ఏం చేస్తాం అనుభవించు .దుఖం దిగ మింగుకో .రాముడు లక్ష్మణుడితో

42-‘’త్యజేప్రాణాన్నియ౦తృత్వే మైధిలీ భరతానుజ – న రావణస్య వశగా భవేదితి సునిశ్చయం ‘’

పరమపావని సీత .బలాత్కారం చేసినా రావణుడికి లొంగదు.ప్రాణాలైనా వదిలేస్తు౦దికాని స్వైరిణి లా ప్రవర్తించదు.

43-‘’రాజ్యా ద్యధా వనే వాసో వైదేహ్యాహరణం  యథా –  తథా కాలే సమీచీనే సంయోగో పి భవిష్యతి ‘’

అన్నా ప్రస్తుతం మనకు రోజులు బాగాలేవు అందుకే రాజ్యహాని వనవాసం సీతాపహరణం తో కష్టాలపాలయ్యాం .మంచి రోజులు వస్తాయి అప్పుడు అన్నీ మనకు అనుకూలం గా ఉంటాయి .తమ్ముడు రాముడితో .

44-‘’ సుఖస్యానంతరం దుఖం దుఖస్యానంతరం సుఖం -చక్రనేమిరివైకం తన్న భవేద్రఘు నందన

      మనోతికాతరం యస్య సుఖ దుఃఖ సముద్భవే – న శోక సాగరేమగ్నో నసుఖీస్యా కదాచన ‘’

సుఖడుఖాలు కాలనేమి క్రమంలో వస్తాయి పోతాయి .ఏ ఒక్కటీ ఎక్కువ కాలం ఉండదు అవి వచ్చినప్పుడు మనోధైర్యాన్ని పోగోట్టుకొంటే మనిషి శోక సాగరంలో మునిగిపోతాడే తప్ప మనిషి సుఖ పడలేదు ఆని మర్చి పోవద్దు .సౌమిత్రి అన్నతో .

45-కారణం సర్వ జంతూనాం బ్రహ్మా దీనాం రఘూద్వహ -తస్యాః శక్తిం వినాకోపి స్పందితుం న క్షమో భవేత్’’

చరాచర జగత్తుకూ ఆదిశక్తికారణం . త్రిమూర్తులకు అధిదేవత .ఆమె అనుగ్రహం లేకుండా బ్రహ్మాది దేవతలు స్పందించాను కూడా స్పందించ లేరు .

   చతుర్దాశ్వాసం

46-‘’గర్భ వాసాత్పరో నాస్తి నరకొ భువనత్రయః -తద్భీతాశ్చ ప్రకుర్వంతి మునయో దుస్తరం తపః ‘’

గర్భ వాసాన్ని మించిన నరకం మరోటిముల్లోకాల్లోనూ లేదు .దానికి భయపడితపస్వులు రాజ్యాలు భోగాలు వదిలి అరణ్యాలకు పరుగులు తీస్తారు .

47-‘’ఆప్త వాక్యం ప్రమాణం చేదాప్తః కః పరదేహవాన్ -పురుషో విషయాసక్తో రాగీ భవతి సర్వథా ‘’

ఆప్త వాక్యం ప్రమాణం అనుకొంటే అసలు ఆప్తుడు ఎవరు ?దేహధారి అయిన ప్రతి వాడూ విషయాసక్తుడే రాగసహితుడే .జనమేజయుడు వ్యాసునితో .

48-‘’ ధర్మహీనం కృతం కర్మ కదం తత్ఫలదం భవేత్ -ధర్మే స్థిరా మతిః క్వాపి న కస్యాపి ప్రతీయతే ‘’

ధర్మం పట్ల ఎవడికీ పట్టుదల ధ్యాస ఆసక్తి ఉన్నట్లు ఎక్కడా అనిపించటం లేదు . జనమేజయుడు వ్యాసునితో

49-‘’అహంకార సముద్భూత స్సంసారో యం యతో నృపః -రాగ ద్వేష విహీ నస్తున కథం జాయతే నృప .’’   

మౌలికంగా ఈ సంసారమే అహంకార సంభూతమైనప్పుడు రాగద్వేష రహితుడు ఎక్కడ ఉంటాడు రాజా .వ్యాసుడు జనమేజయుడితో

50-‘’ద్రోహపరే ద్రోహపరో భవేదితి సమానతా-అద్రోహి ని తధా శాంతే విద్వేషః ఖలతా విద్వేషఃఖలతా స్మృతా ‘’

ద్రోహం చేసేవాడికి ద్రోహం చేయటం సమత .అద్రోహికి అతిశాన్తుడికీ ద్రోహం చేయటం ఖలత -నీచత్వం .వ్యాసుడు జనమేజయిడితో .

  సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-25-

Posted in రచనలు | Leave a comment

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు 16. వ భాగం.9.10.25.

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు 16. వ భాగం.9.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.33 వ భాగం. 9.10.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.33 వ భాగం. 9.10.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి వ్యాఖ్యానంతో.1 వ భాగం.9.10.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి వ్యాఖ్యానంతో.1 వ భాగం.9.10.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి వ్యాఖ్యానంతో.1 వ భాగం.9.10.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.58 వ భాగం.9.10.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.58 వ భాగం.9.10.25.

Posted in రచనలు | Leave a comment

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు.15 వ భాగం.8.10.25.

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు.15 వ భాగం.8.10.25.

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు.15 వ భాగం.8.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.32 వ భాగం.8.10.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.32 వ భాగం.8.10.25.

Posted in రచనలు | Leave a comment

కందుకూరి రుద్రకవి కృత లీలా జనార్దనం.4 వ భాగం.8.10.25

కందుకూరి రుద్రకవి కృత లీలా జనార్దనం.4 వ భాగం.8.10.25

కందుకూరి రుద్రకవి కృత లీలా జనార్దనం.4 వ భాగం.8.10.25

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.57 వ భాగం.8.10.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.57 వ భాగం.8.10.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.57 వ భాగం.8.10.25.

Posted in రచనలు | Leave a comment

యాభై ఒక్క ముద్దు ముచ్చట్లే బులుసు శ్రీమతి డైరీ

యాభై ఒక్క ముద్దు ముచ్చట్లే బులుసు శ్రీమతి డైరీ
శ్రీ బులుసు కామేశ్వరరావు గారు పట్టు వదలని విక్రమార్కుడిలా 35ఏళ్ల నుంచి మచిలీ బందరు నుండి ‘’ప్రమిద ‘’పత్రిక వీలైనప్పుడల్లా తెస్తున్నారు .ప్రమిద బందరు చీకటినే కాదు మొత్తం ఆంధ్రదేశ చీకట్లనే సాహిత్య వెలుగులద్వారా తొలగిస్తోంది .ఇందులో ఆయన శ్రీమతి శ్రీ వాణి నిర్వహిస్తున్న వ్యంగ్యవ్యాస విన్యాసం ‘’శ్రీమతి డైరీ ‘’బాగా క్లిక్ అయి ఆమెకూ అభిమానులేర్పడ్డారు .ప్రమిద ప్రత్యెక సంచికలూ విశేష ప్రాచుర్యం పొందాయి వీటన్నిటి వెనక కామేశ్వర రావు గారి మెతకతనం మేధావితనం మంచితనం నిండా ఉన్నాయి .ఇవాళ కామూ గారు శ్రీమతి డైరీ ప్రత్యెక సంచిక ఇచ్చి అభిప్రాయం రాయమన్నారు .దీనితో పాటు పురాణం వారి పురాణం విప్పే ప్రత్యెక సంచికా ఇచ్చారు .అది తరువాత విప్పమన్నారు .
షిర్డీ యాత్రలో ఉపాసినీ బాబా ఆశ్రమ దర్శనం ముఖ్యవిషయం షిర్డీ వెళ్లినవారు చూస్తారో లేదో చూడాలనుకొనే వారికి మార్గదర్శనం .అన్నిటా రౌడీలు వెలిశారు లెక్చరర్ గారూ రౌడీ అయితే అదో కిక్కబ్బా అనిపించారు .దొంగ చూపుల పెళ్ళి చూపులు ముసిముసిగా ఉన్నాయి బాగా .పెద్దలకి మాత్రమె అన్న సినిమాలు పిల్లలు చూడకుండా చూదండ్రాబాబూఅని నెత్తీ నోరు కొట్టుకున్నారు .’’గ్యాస్ పై గాసుబాగానే కొట్టారు .చదువులలోని సారం గ్రహించక పొతే ఆ చదువు శుద్ధ వేస్టూ వాడొక పెద్ద ఘోస్టు .
బేర్ మని పించిన షేర్ మార్కటీర్ల అంటే ‘’షేర్షా’’ ల కహానీ బాగుంది .లక్కీ డ్రా,బంపరాఫర్ల పరాకాష్టకేక్కిన పిచ్చి వదల్చుకోకుంటే నెత్తిన చేతులే .అయ్యప్పలు సంవత్సరమంతా అంతే దీక్షతో ఉంటే కొంపలు శబరీ శిఖరాలౌతాయని భావించారు .బడ్జెట్ ప్రతి ఏడాదీ రాష్ట్ర కేంద్రాల అంకెల గారడి .నాల్గు రోజుల చానెల్ పేపర్లం చిట్ చాట్ లే తప్ప బడ్జెట్ పద్మనాభాలు ఎవరూ లోకం లో కనిపించరు .రిలయెన్స్ లోనో డీ మార్ట్ లోనో సేల్ పెడితే పండగే పండగ .తిరుపతి బాలాజీ వరాహస్వామి భూమిని నొక్కేసిన కబ్జాదార్ .బహుపరాక్ అన్నారు .మనదేశంలో తక్కువైనా అమెరిఆలో శునకం స్టేటస్ సింబల్ .ఉపనయనానికి ‘’జ౦దెప్పెళ్లి ‘’ఆని భలే కాయినేజ్ చేశారు . నీరద్ చౌదరి స్వీయ చరిత్ర ఆడరణీయమన్నారు .బుర్ర గొరిగించుకొనే ‘’గుండు శ్రీలు ‘’ఒకప్పుడు ఎక్కువ. ఇప్పుడు టైం లేక పుట్టపర్తి బాబా లా జుట్టు పెంచే మొగాళ్ళు, రివర్స్ గ కత్తిరించుకొనే లేడీస్ బయల్దేరరని షేవింగ్ బాగా చేశారు .
స౦సార జీవితంలో విలన్లు ‘’మదరిల్లాస్ ‘’అయ్యారు .సెప్టెంబర్ లో మహా మహులు పుట్టి ,దాన్ని గ్రేట్ చేసి గ్రీట్ చేశారు .పూర్వం సమ్మర్ సెలవలు అంటే మహదానందం .ఇప్పుడు సమ్మర్ కాంప్ లు ,ఇన్సెంటివ్ కోచింగులు తో బుర్ర వేడేక్కిస్తూ కళ్ళజోళ్ళు చేతికోచ్చేట్లు చేస్తున్నారని సెటైర్ పేల్చారు .హింస రచన ధ్వంస రచన ఆని గడ్డిపెట్టారు .కేంద్రం ఇచ్చే పురస్కారాలగురించి రాసిన ‘’పద్మపురాణం ‘’యదార్ధం ,జరుగుతున్న దానికి నిదర్శనం .పద్మా అంటే వద్దుస్మా అనిపిస్తున్నాయి .పుష్కర బాత్ వాంగీ బాత్ లా ఉప్మాబాత్ గా రుచికరంగా ఉంది .చునావ్ కబర్ ఇప్పుడు బీహార్ SIR ను గుర్తుకు తెస్తోంది .తెరదేవుళ్ళు రాచకీయ కొత్త దేవుళ్ళ అవతారం ఎత్తుతున్నారు జాగ్రత్త ఆని హెచ్చరించారు .నూతనప్రసాద్ ఎత్తిన ;;కొత్తా దేవుదండీ ‘’గుర్తుకు తెచ్చారు .వందోవంద చేసిన సచిన్ కు కూడోలు అందించారు .సీరియళ్ళు చీరియళ్ళు గా మారడం బాధాకరం .స్థిత ప్రజ్ఞుడుకూడా చింతా క్రా౦తు డై కొంపలో పడి ఉంటున్నాడు .నాగరక ప్రపంచం ప్రస్తుతం పీటర్స్ ప్రిన్సిపుల్ ఇంఫ్ల్యుయెంస్ లో ఉన్నదట.ఆధార్ బేజార్ అయినా అలసత్వం వహిస్తే ప్రభుత్వ తాయిలాలు దక్కవని చెప్పారు .అర్ధరాత్రి ఆడది నిర్భయంగా ఇంకా తిరగ లేకపోతో౦దని నిర్భయ భారత్ చెబుతోంది సిగ్గు చేటు .లేటు వీరులు రాజస్థాన్ అసెంబ్లీలో నిర్లజ్జగా హాయిగా పెనాల్టి కట్టి నవ్వి పోదురుగాక మాకేటి సిగ్గు అంటూ ఫోజులిచ్చారట .యువకులు క్షణికమైన వ్యామోహాలకు బలికాకుండా కార్యోన్ముఖులు కావాలని ముద్దు ముద్దుగా చివరగా చెప్పారు .
ఈరచనలో సామాజిక విశ్లేషణ ,బాధ్యతా ,బాధ్యతా రాహిత్యం పై కొరడా ,వ్యక్తిత్వానికి వీరపూజ ,ఆడంబరాలకు మంగళ మహాశ్రీలు ,నూతనత్వానికి ప్రోత్సాహం అన్నీ ఉన్నాయి వ్యంగ్యం మాటలలో పైకి భావం లో అంతర్వాహినిగా ప్రవహించింది .బందరు రచయితలు రావూరు మొదలైన వారి ధోరణి వారసత్వం .కామేశ్వరరావు గారి మేనమామ పురాణం సుబ్రహ్మణ్యంగారి ‘’ఇల్లాలి ముచ్చట్లు ‘’కాముగారి సతీమణికి ప్రేరణ .ప్రమిదను మరింత వెలిగించింది ఈమెయే .ఆమె నుంచి మరిన్ని రచనలు కోరుతున్నాను .హాస్యం తక్కువైన ఈకాలం లో ఇది ఎడారిలో ఒయాసిస్సు .
గబ్బిట దుర్గా ప్రసాద్ -8-10-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

పంజాబ్ మాస్టర్ ప్రింట్‌మేకర్,ప్రకృతి దృశ్య చిత్రకారుడు ,టిబెట్ తొలి పరిశీలకుడు ,దలైలామా పట్టాభిషేకానికి ఆహ్వానం పొందిన- కన్వాల్ కృష్ణ

పంజాబ్ మాస్టర్ ప్రింట్‌మేకర్,ప్రకృతి దృశ్య చిత్రకారుడు ,టిబెట్ తొలి పరిశీలకుడు ,దలైలామా పట్టాభిషేకానికి ఆహ్వానం పొందిన- కన్వాల్ కృష్ణ

కమాలియాలో పూర్వ-పంజాబ్‌లో జన్మించిన కన్వాల్ కృష్ణుడు ‘సంచరించే జిప్సీ’ జీవితాన్ని గడిపాడని ఆయన అన్నారు.

1950లలో, కృష్ణుడి రచనలు ప్రత్యేకంగా నిలిచిన ఆధునిక భాషను స్థాపించడానికి అనేక మంది కళాకారులు ప్రకృతి దృశ్య చిత్రలేఖనాన్ని ప్రత్యేక శైలిగా అన్వేషించడం ప్రారంభించారు. కృష్ణుడు నిషేధించబడిన టిబెట్, కాశ్మీర్, యూరప్ మరియు ఇతర ప్రదేశాలకు ప్రయాణించినప్పుడు ప్రకృతి శక్తుల నుండి ప్రేరణ పొందాడు.

1945లో, కృష్ణుడు మరియు అతని కళాకారిణి-భార్య దేవయానిని వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ (ప్రస్తుత పాకిస్తాన్‌లో) గవర్నర్ సర్ జార్జ్ కన్నింగ్‌హామ్ ఆఫ్ఘనిస్తాన్, ఖైబర్ పాస్, స్వాత్ లోయ మరియు పరిసర ప్రాంతాల గుండా ప్రయాణించి, దాని ప్రకృతి దృశ్యం మరియు జీవితాన్ని చిత్రించడానికి ఆహ్వానించారు.

టిబెట్‌లో, కృష్ణుడు తొలి పరిశీలకులలో ఒకడు, మరియు దలైలామా పట్టాభిషేకానికి హాజరు కావడానికి ప్రత్యేక అనుమతి పొందిన మొదటి భారతీయ చిత్రకారుడు, ఈ కార్యక్రమాన్ని అతను చిత్రించి చిత్రీకరించాడు. ఆ ఎన్కౌంటర్ నుండి ఆయన వేసిన డ్రాయింగ్లు ఈ రక్షిత షాంగ్రిలా యొక్క జీవితం మరియు ప్రకృతి దృశ్యాల యొక్క తొలి దృశ్య సూచనలు.

కృష్ణుడి చిత్రాలు బహిరంగ వాతావరణంలో గమనించిన వింత కోణాలు మరియు వక్రత ద్వారా దృక్పథం మరియు లోతుపై అతని నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. అతని సున్నితమైన బ్రష్‌వర్క్ మరియు నిగ్రహించబడిన పాలెట్ ద్వారా సాధించిన అల్లికలు మరియు స్వరాలు మంత్రముగ్ధులను చేస్తాయి. మాస్టర్ ప్రింట్‌మేకర్ అయిన కృష్ణుడు భారతదేశంలోని ఒక తరం ప్రింట్‌మేకర్లను తన సాంకేతికత మరియు శైలితో ప్రభావితం చేస్తాడు. కృష్ణుడు ఢిల్లీ సిల్పి చక్ర మరియు లలిత కళా అకాడమీ, న్యూఢిల్లీ వంటి అనేక కళా సమూహాలతో సంబంధం కలిగి ఉన్నాడు.

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -8-10-25-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

ఆంధ్ర సచిత్ర వారపత్రిక తెలుగువెలుగులు.14 వ భాగం.7.10.25.

ఆంధ్ర సచిత్ర వారపత్రిక తెలుగువెలుగులు.14 వ భాగం.7.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.31 వ భాగం.7.10.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.31 వ భాగం.7.10.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.31 వ భాగం.7.10.25.

Posted in రచనలు | Leave a comment

కందుకూరి రుద్రకవి కృత లీలా జనార్దనం.3 వ భాగం.7.10.25.

కందుకూరి రుద్రకవి కృత లీలా జనార్దనం.3 వ భాగం.7.10.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.56 వ భాగం.7.10.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.56 వ భాగం.7.10.25.

Posted in రచనలు | Leave a comment

ఎస్కిమో (ఇన్యూట్)ల సర్వతోముఖాభి వృద్ధికి ఆహారం కృషి చేస్తున్న ప్రముఖ మహిళా న్యాయవాది -ఆరా ఓల్స్విగ్(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్


అరా ఓల్స్విగ్ అంతర్జాతీయ సమావేశాలలో స్వదేశీ హక్కుల కోసం ఒక అనుభవజ్ఞురాలైన న్యాయవాది, ముఖ్యంగా అనుకూలత లేని సంస్థలలో కూడా కొంత విజయాన్ని సాధిస్తున్నారు.

“మేము చేస్తున్న అనేక దశాబ్దాల వాదన మరియు స్వదేశీ దౌత్యం ద్వారా, UNలో నిర్ణయం తీసుకోవడంలో మనం ఎంత ప్రభావం చూపగలమో మేము చూశాము,” అని ఆమె చెప్పింది.

ఓల్స్విగ్ అలాస్కా (యునైటెడ్ స్టేట్స్‌లో), కెనడా, కలల్లిట్ నునాట్ (గ్రీన్‌ల్యాండ్‌కు ఇన్యూట్ పేరు) మరియు చుకోట్కా (రష్యాలో) అంతటా దాదాపు 180,000 మంది ఇన్యూట్ ప్రజలను సూచించే ఇన్యూట్ సర్కంపోలార్ కౌన్సిల్ (ICC)కి అధ్యక్షత వహిస్తుంది. ఆమె ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం మరియు డెన్మార్క్ రాజ్యంలో స్వయంప్రతిపత్తి కలిగిన గ్రీన్‌ల్యాండ్‌లోని ఇన్యూట్ కమ్యూనిటీలలో పెరిగింది  గ్రీన్‌లాండిక్ మరడానిష్ పార్లమెంటులలో పనిచేసింది.

ICC 1977 నుండి పనిలో ఉంది, అయినప్పటికీ దాని అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ ప్రయత్నాలు నేడు జరుగుతున్నాయి. ఇన్యూట్‌లు ఎక్కువగా సముద్రం నుండి దూరంగా నివసించే తీరప్రాంత ప్రజలు,  ICC  పనిలో ఎక్కువ భాగం సముద్ర పాలనపై దృష్టి పెడుతుంది. వాతావరణ మార్పు ఆర్కిటిక్ మహాసముద్రంలో సముద్రపు మంచు విస్తీర్ణాన్ని తగ్గించింది, కొత్త షిప్పింగ్ లేన్‌లను తెరిచింది మరియు చమురు, గ్యాస్ మరియు ఖనిజాలతో సహా వివిధ రకాల వనరుల దోపిడీపై ఆసక్తిని పెంచింది.

ఈ కీలకమైన మార్పులు జరుగుతున్నప్పుడు, ICC UN సంస్థల క్రింద ప్రధాన సముద్ర సంబంధిత అంతర్జాతీయ ఒప్పందాల అభివృద్ధిపై చర్చలలో నిమగ్నమై ఉంది. వీటిలో అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO)లో షిప్పింగ్ డీకార్బనైజేషన్ చర్చలు మరియు ఇతర నియమాల తయారీ ప్రక్రియలు; ప్రపంచ ప్లాస్టిక్ ఒప్పందం యొక్క ముసాయిదాను రూపొందించడం; మరియు “హై సీస్ ట్రీటీ” అని కూడా పిలువబడే జాతీయ అధికార పరిధికి మించిన ప్రాంతాల సముద్ర జీవవైవిధ్యంపై ఒప్పందం (BBNJ) అమలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఆర్కిటిక్ ప్రాంతంలోని స్వదేశీ ప్రజలపై మరియు వారు ఆధారపడే పర్యావరణ వ్యవస్థలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

2018లో 10 దేశాలు సంతకం చేసిన సెంట్రల్ ఆర్కిటిక్ మహాసముద్ర మత్స్య ఒప్పందాన్ని అమలు చేయడంపై కూడా ICC కృషి చేస్తోంది, ఇది ఆర్కిటిక్ మహాసముద్రం యొక్క అంతర్జాతీయ జలాల్లో మత్స్య నిషేధాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఒప్పందం కోసం పరిశోధన పర్యవేక్షణ స్వదేశీ జ్ఞానాన్ని కలిగి ఉన్న ఒక ఫ్రేమ్‌వర్క్ ద్వారా నిర్వహించబడుతుంది – అంతర్జాతీయ ఒప్పందాలలో అరుదైనది. గ్రీన్‌ల్యాండ్ మరియు కెనడా మధ్య పికియాలసోర్సువాక్ (నార్త్ వాటర్ పాలిన్యా) అనే ఓపెన్-వాటర్ ప్రాంతం కోసం స్వదేశీ నేతృత్వంలోని సముద్ర రక్షిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని కూడా ICC ఒత్తిడి చేస్తోంద.

: జూలై ప్రారంభంలో, ICC IMOలో “శాశ్వత సంప్రదింపుల హోదా”ను పొందింది, ఇది ప్రపంచ షిప్పింగ్‌ను నియంత్రిస్తుంది – అలా చేసిన మొదటి స్వదేశీ ప్రజల సంస్థ. ఈ అక్రిడిటేషన్ ఓటింగ్ హక్కులను ఇవ్వదు కానీ IMO చర్చలు మరియు ప్రక్రియలలో పాల్గొనే హక్కును నిర్ధారిస్తుంది. ఇది ఎందుకు ముఖ్యమైనది?

సారా ఓల్స్విగ్: వాతావరణ మార్పులకు ప్రతిస్పందించే కొత్త విధానాలను రూపొందించడంలో ప్రాంతీయంగా మరియు అంతర్జాతీయంగా భారీ పరిణామాలు ఉన్నాయి, ఇది షిప్పింగ్‌తో సహా ఆర్కిటిక్‌లో పెరిగిన కార్యకలాపాలను తెరుస్తోంది.

ప్రారంభ రోజుల్లో UN పనిచేసిన విధానాన్ని మేము మార్చాలనుకుంటున్నాము. ఉదాహరణకు, UN. లా ఆఫ్ ది సీ కన్వెన్షన్ ఒక ముఖ్యమైన ఒప్పందం  అంతర్జాతీయ సహకారానికి ఒక ముఖ్యమైన సాధనం, కానీ అది స్వదేశీ ప్రజల భాగస్వామ్యం లేకుండా రూపొందించబడింది. మనం లేకుండా మన గురించి నిర్ణయాలు తీసుకోకూడదని మేము కోరుకుంటున్నాము. మనం లేకుండా మన గురించి ఏమీ లేదు – అది IMOలో మన ప్రాథమిక సూత్రం. విధాన రూపకల్పన కాకుండా, అక్కడ జరిగే సాంకేతిక పని చాలా స్పష్టంగా మరియు నేరుగా మనకు సంబంధించినది.

ఉదాహరణకు, గత సంవత్సరం, కలాలిట్ నునాట్ (గ్రీన్లాండ్) ఉత్తరాన ఉన్న ఇనుయిట్ ప్రజలు తమ సాంప్రదాయ వేటకు ఆటంకం కలిగించే ఓడల శబ్దం గురించి ఆందోళన వ్యక్తం చేయడం నేను చూశాను. కలాలిట్ నునాట్‌లోని ప్రజలు ఎక్కువ మంది పర్యాటకులతో ఎలా వ్యవహరిస్తున్నారో కూడా మనం చూస్తున్నాము – మేము స్థిరమైన మార్గంలో నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న పెద్ద క్రూయిజ్ షిప్‌లు. అవి వివిధ రకాల కాలుష్య కారకాలను మరియు నల్ల కార్బన్‌ను విడుదల చేస్తున్నాయి మరియు ప్రజలు దానిని చూసి తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. మరియు బ్యాలస్ట్ వాటర్‌తో ఆర్కిటిక్‌లోకి ఆక్రమణ జాతులను ఎలా తీసుకురావచ్చనే దాని గురించి మనం ఆందోళనలను చూస్తున్నాము. మరియు మన ఆర్కిటిక్ వాతావరణం ఎంత పెళుసుగా ఉందో మనందరికీ తెలుసు.

ఈ విషయాలు మనపై మరియు సహస్రాబ్దాలుగా మనకు తెలిసినట్లుగా మన సంస్కృతులు మరియు జీవనోపాధిని కొనసాగించే హక్కుపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి.

మోంగాబే: ఇది IMOలో మీ పనికి ఎలా సంబంధం కలిగి ఉంది?

సారా ఓల్స్విగ్: ఇవన్నీ IMOలో పరిష్కరించబడే విషయాలు: నీటి అడుగున వెలువడే శబ్దాన్ని మనం ఎలా తగ్గించాలి? ఓడల నుండి వచ్చే నల్ల కార్బన్ ఉద్గారాలను మనం ఎలా తగ్గించాలి? ఆక్రమణ జాతులను నిరోధించగలిగేలా మనం ఎలా నియంత్రిస్తాము? శాశ్వత హోదా కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు మనం పాల్గొనగలిగిన కొన్ని సాంకేతిక పనులకు ఇవి ఉదాహరణలు.

2021 నుండి, మేము IMOలో తాత్కాలిక సంప్రదింపుల హోదాను కలిగి ఉన్నాము, దీని ద్వారా మేము ఈ రంగాలపై ఇతివృత్తాలు మరియు పనిలో పాల్గొన్నాము. కాబట్టి, మాకు, ఈ సమావేశాలలో మన స్వరం ఉండాలి, అవి సాంకేతికమైనా లేదా రాజకీయ నిర్ణయం తీసుకునే సమావేశాలైనా, చాలా స్పష్టంగా మరియు స్పష్టంగా ఉంది. మరియు ఇన్యూట్ జ్ఞాన హోల్డర్లను తీసుకురావడం ఎంత ముఖ్యమో మేము చూశాము.

మోంగాబే: ఆగస్టు 18-29 వరకు, న్యూయార్క్‌లో PrepCom2 అని పిలువబడే BBNJ (హై సీస్ ట్రీటీ) సమావేశానికి పార్టీలు సమావేశమవుతాయి, దీనిలో పాలనా సమస్యలు  ఆర్థిక నియమాలు చర్చించబడతాయి. ఈ BBNJ చర్చలకు మరియు సాధారణంగా BBNJ కోసం మీ లక్ష్యాలు ఏమిటి? ఇన్యూట్ కమ్యూనిటీలకు ఏమి ప్రమాదంలో ఉంది?

సారా ఓల్స్విగ్: అనేక ఇతర UN వేదికలలో మనం చూస్తున్నట్లుగా, మేము కోరుకునే కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి. కనీస ప్రమాణాన్ని నిర్దేశించే మరియు వ్యక్తిగత హక్కులు మరియు సామూహిక హక్కుల పరంగా మన హక్కులను ధృవీకరించే స్వదేశీ ప్రజల హక్కులపై UN డిక్లరేషన్ యొక్క పూర్తి – మరియు ఎటువంటి అర్హతలు లేకుండా – గుర్తింపును మేము కోరుకుంటున్నాము. UN ఒప్పందాలను రూపొందించినప్పుడు లేదా ప్రక్రియలు లేదా అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసినప్పుడు, అవి UN డిక్లరేషన్‌లో ధృవీకరించబడినట్లుగా స్వదేశీ ప్రజల హక్కులను స్వయంచాలకంగా అమలు చేయవని మనం కూడా తరచుగా చూస్తాము. ఉదాహరణకు, మేము ప్రస్తుతం UNFCCC [UN] వద్ద ఈ సమస్యను పరిష్కరించడానికి పని చేస్తున్నాము. వాతావరణ మార్పుపై ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్] మరియు రూపొందిస్తున్న కొత్త ప్లాస్టిక్ ఒప్పందంలో, ప్రస్తుత ముసాయిదా పాఠంలో కూడా స్వదేశీ ప్రజల హక్కులను గుర్తించడం లేదు.

స్వదేశీ హక్కుల పూర్తి గుర్తింపు అనేది మేము BBNJ కింద కూడా నిశితంగా పర్యవేక్షిస్తున్నాము మరియు దాని కోసం ఒత్తిడి చేస్తున్నాము. ప్రస్తుతానికి, దీనికి చాలా బలమైన భాష లేదు. దీనికి కొంతవరకు స్వదేశీ ప్రజల జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను గుర్తించే పేరా ఉంది, కానీ స్వదేశీ ప్రజల జ్ఞానాన్ని గుర్తించడం అంటే మన హక్కుల పూర్తి గుర్తింపు అని అర్థం కాదు.

మరొక సమస్య ఏమిటంటే, BBNJ ఒప్పందం స్వదేశీ ప్రజలను “స్థానిక సంఘాలు” అని పిలవబడే వాటితో ఆమోదయోగ్యం కాని సందిగ్ధతను పునరుత్పత్తి చేస్తుంది. ఇది దురదృష్టవశాత్తు UN వ్యవస్థ అంతటా కనిపించే పునరావృత సమస్య, కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా రాష్ట్రాలు స్వదేశీ ప్రజల హక్కులను తగ్గించడానికి ప్రయత్నిస్తాయి. ఇది చట్టపరమైన విషయం యొక్క అస్పష్టతను సృష్టిస్తుంది. UN ప్రకటనతో స్వదేశీ ప్రజలకు ప్రపంచంలో చట్టబద్ధంగా కట్టుబడి ఉండే హోదా ఉంది. కానీ స్థానిక సమాజాలతో ఈ సంబంధం ఏర్పడినప్పుడు, అమలు దశలో, వారు మన హక్కులను తగ్గించకుండా చూసుకోవడం మన ముందు చాలా పెద్ద పని.

నార్వేజియన్ ద్వీపసమూహంలోని స్వాల్‌బార్డ్‌లో వాల్‌రస్‌లు (ఓడోబెనస్ రోస్‌మరస్) పక్కన ఒక ధ్రువ ఎలుగుబంటి (ఉర్సస్ మారిటిమస్) నడుస్తుంది. జాతీయ అధికార పరిధికి మించిన ప్రాంతాల సముద్ర జీవవైవిధ్యంపై ఒప్పందం విషయంలో ICCకి కీలకమైన ప్రాధాన్యత ఏమిటంటే, ఇన్యూట్ వేట మరియు ఫిషింగ్ హక్కుల ప్రాముఖ్యతను పెంచడం. “మనం ఆధారపడే అనేక జాతులు పెద్ద పరిధులలో నివసిస్తాయి లేదా అధిక వలస జీవులు – ధ్రువ ఎలుగుబంట్లు, వాల్‌రస్‌లు మరియు చాలా తిమింగలాలు – కాబట్టి అవి ఇంటి నుండి దూరంగా ఉన్నప్పుడు వాటిని ఎలా నిర్వహించాలి మరియు సంరక్షించాలి అనే దానిపై మనం తప్పనిసరిగా కొంత ప్రభావాన్ని కలిగి ఉండాలి” అని ICC గ్రీన్‌ల్యాండ్‌లోని సముద్ర నిర్వహణ సలహాదారు విక్టోరియా కుతుక్ బుష్‌మాన్ మోంగాబేతో అన్నారు. జెన్స్ విక్స్ట్రోమ్/ఓషన్ ఇమేజ్ బ్యాంక్ చిత్ర సౌజన్యంతో.

మోంగాబే: ఆర్కిటిక్ జలాల్లో షిప్పింగ్ ట్రాఫిక్ పెరుగుతున్నందున, తీరప్రాంత జీవనోపాధి మరియు సముద్ర పర్యావరణ వ్యవస్థలను ఎలా రక్షించవచ్చు? ICC ఏ పాత్ర పోషిస్తుంది?

సారా ఓల్స్విగ్: ఆర్కిటిక్‌లో పెరిగిన కార్యకలాపాలకు ప్రతిస్పందించే విస్తృత శ్రేణి ప్రక్రియలను ప్రభావితం చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఒక ఉదాహరణ సెంట్రల్ ఆర్కిటిక్ మహాసముద్ర మత్స్య ఒప్పందం, ఇది ప్రాథమికంగా నివేదికలను రూపొందించడంలో స్వదేశీ జ్ఞానంతో సహా సురక్షితమైన మరియు మంచి శాస్త్రీయ జ్ఞానం మనకు లభించే వరకు వాణిజ్య మత్స్య సంపదపై తాత్కాలిక నిషేధం, తద్వారా భవిష్యత్తులో జరిగే చేపలు పట్టడం బాగా నియంత్రించబడుతుంది.

BBNJ మరియు IMO రెండూ ఆర్కిటిక్‌పై దృష్టి పెట్టవలసిన అవసరం పెరిగింది. ప్రజలుగా మనల్ని నియంత్రించడానికి మరియు రక్షించడానికి, అలాగే ఆర్కిటిక్ పర్యావరణాన్ని కూడా నియంత్రించడానికి మనకు అంతర్జాతీయంగా కట్టుబడి ఉండే ఒప్పందాలు అవసరం. మరియు ఒప్పందాలు మనం లేకుండా జరిగితే, అవి మనకు సహాయం చేయడానికి బదులుగా మనకు హాని కలిగించే నియంత్రణను కలిగి ఉండవచ్చని మనకు తెలుసు. స్వదేశీ ప్రజలుగా మనం చాలా సంవత్సరాలుగా చూస్తున్నది అదే, మమ్మల్ని టేబుల్‌కి ఆహ్వానించలేదు. కాబట్టి కొందరు తమ పని గొప్ప ప్రయోజనం కోసం అని అనుకున్నప్పటికీ, అది మనకు మరియు మన హక్కులకు హాని కలిగిస్తుంది.

ఆర్కిటిక్‌లోని ఏవైనా కార్యకలాపాలు మన ప్రజలకు హాని కలిగించకుండా మరియు మన సాంప్రదాయ జీవనోపాధిని కొనసాగించగలిగే విధంగా జరిగేలా, కాలుష్యం తగ్గేలా మరియు పెరిగిన షిప్పింగ్ మన సమాజాలకు మరియు ప్రజలకు మరింత హాని కలిగించని విధంగా జరిగేలా నిబంధనలు నిర్ధారించుకోవాలి.

సారా ఓల్స్విగ్: ఈ ఒప్పందంపై మరింత కృషి చేయడం వల్ల ఇన్యూట్‌లుగా మరియు దేశీయ ప్రజలుగా మనం ఎదుర్కొంటున్న చారిత్రక అన్యాయాలు మరియు అసమానతలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఇన్యూట్ మరియు స్వదేశీ ప్రజలుగా మనం చర్చిస్తున్న చాలా ప్రాథమిక విషయాలలో ఒకటి, మనం మనల్ని మనం ప్రకృతి నుండి వేరుగా మనుషులుగా భావించుకోము. కాబట్టి, మీరు జీవవైవిధ్యం మరియు పర్యావరణ వ్యవస్థలకు సంబంధించిన ఒప్పందాలు మరియు ఒప్పందాలను రూపొందించినప్పుడు, మీరు మానవ హక్కుల ఆధారిత విధానాన్ని ఉపయోగించాలి.

అలాగే, ఇన్యూట్‌లుగా, మనం ఈ చాలా భిన్నమైన దేశ రాష్ట్రాలలో నివసిస్తున్నాము. ఇవి నిర్మాణాలు – పర్యావరణ వ్యవస్థలు  జంతువులు  మన మాతృభూమి మరియు సముద్రాల జీవవైవిధ్యం, వాటికి ఈ రాష్ట్ర సరిహద్దులు తెలియవు. సరిహద్దు దాటిన మరియు పర్యావరణ వ్యవస్థ ఆధారిత మార్గంలో ఆలోచించే సామర్థ్యం ఆర్కిటిక్ కౌన్సిల్ వంటి ఇతర వేదికలలో మనం దోహదపడింది మరియు BBNJ కింద ఈ ఆలోచనా విధానాన్ని స్వీకరించడానికి మనం ముందుకు సాగాలి.

 -గబ్బిట దుర్గాప్రసాద్

Posted in రచనలు | Leave a comment

శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు -4

శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు -4

                      ద్వితీయ స్కంధం

31-‘’పశుధర్మో న మే ప్రీతి౦ జనయిత్యతి దారుణాః-ప్రతీక్షస్వ ముని శ్రేష్ఠ యావద్భావతి యామినీ ‘’

లోకం చూస్తోంది అవతలి ఒడ్డున మా తండ్రి ఉన్నాడు .పశుధర్మందారుణపాప.౦నాకు ఇష్టం లేడు చీకటిపడే వరకు ఆగుదాం .పశువులకు పగలు, మనుషులకు రాత్రి ఆని కదా ఏర్పాటు .యోజన గంధి పరాశరునితో .

32-‘’స్థితా దక్షిణ మూరుం మే సమాశ్లిష్య ఛ భామినీ -అపత్యానాం స్నుషాణా౦ ఛ స్థానం విద్ధి సుచిస్మితే ‘’

అమ్మానేను పరస్త్రీ విముఖుడిని .నువ్వొచ్చి నా కుడి తొడమీద కూర్చున్నావు .అది కొడుకుకాని కూతురుకానీ కూర్చో దగిన స్థానం .సుందరంగి  గంగాదేవితో ప్రతీపుడు.

33-’’ ప్రయత్నశ్చోద్యమే కార్యొ యదా సిద్ధిం న యాతి తత్ – తదా దైవం స్థితం చేతి చిత్తమాలంబ్యయేత్ బుధః ‘’

కార్యం సిద్ధించే వరకు ప్రయత్నించాల్సిందే .సిద్ధి౦చకపోతే దైవం అనుకూలించలేదని మనసును సమాధాన పరచుకోవాలి .34-‘’రక్షణీయః యశః కామం దిగ్ధనం యశసా వినా -సర్వస్వం రఘుణాపూర్వం దత్తం విప్రాయ కీర్తయే ‘’

ధనం కాదు ముఖ్యం .కీర్తి ప్రధానం .పూర్వం హరిశ్చంద్రుడు కర్ణుడూ మనకు ఏమి నేర్పారు ?మంచి వాడు అనిపించుకోకపోతే ఎంతడబ్బు ఉండి ఏం లాభం ?

35-‘’అహింసా పరమో ధర్మః విప్రాణాం నాత్ర సంశయః -దయా కర్తవ్య సర్వత్రా బ్రాహ్మణేన విజానతా-యజ్ఞా దన్యత్ర  విప్రేంద్ర న హింసా యాజ్నికీ మతా ‘’  

అహింస ఒక్కటే పరమ ధర్మం .విప్రులు విద్యా వివేక సంపన్నులు .సకల జీవరాసులపట్ల దయగా ఉండాలి యజ్ఞాలలో తప్ప మరెక్కడా హింస పనికి రాదు.

                         తృతీయ స్కంధం

 36-‘’ అవిజ్ఞాయ పరం తత్త్వం కుతః శాన్తిఃపరంతప -వికీర్ణం బహుదా చిత్తం నకుత్ర స్థిరతాంవ్రజేత్ ‘’

  ఎన్ని సాధనాలు చేసినా మనసుకు శాంతి లభించదు సందేహాలతో వికీర్నమైన మనసుకు స్థిరత్వం ఎక్కడ దొరుకుతుంది ?వ్యాసుడు జనమేజయునితో .

37-‘’ ఏకమేవాద్వితీయం యద్బ్రహ్మవేదా వదంతి వై-సా కిం త్వం వాప్యాసౌ వా కిం సందేహం వినివర్తయః ‘’

ఎకమేవాద్వితీయం బ్రహ్మ ఆని కదావేదాలు చెప్పేది .అది నువ్వా నీవిభుడైన పరాత్పరుడా ?బ్రహ్మ దేవదేవితో 

38-‘’సదైకత్వం న భేదోస్తి సర్వదైవమమాస్య ఛ -యో సౌసా హమహంయో సౌభేదో స్తి మతివిభ్రమాత్ ‘’

నాకూ పురుషుడికి భేదం లేదు. ఎప్పుడూ ఏకత్వమే .అతడే నేను నేనే ఆయన. భేదం మతి విభ్రమం .

39-‘’యదా దీప స్తధోపాదేర్యోగా త్సంజాయతే ద్విధా -ఛాయయే వాడర్శ మధ్యేప్రతిబింబం వా తధావయో ‘’

ఒకటే దీపం ఉపాధి వలన  రెండు అయినట్లు ,నీడ అద్దం లో ప్రతి బింబం అయినట్లు మేము ద్వైవీ భావం పొందుతాం. బ్రహ్మతో దెవి .

40-‘’యోహరి స్స శివ సాక్షా ద్యః శివస్స స్వయం హరిః – ఏతయో ర్భేదమాతిష్ట న్నరకాయ భవేన్నరః ‘’

శివుడే విష్ణువు విష్ణువే శివుడు .అలాగే బ్రహ్మ .భేదం ఉన్న వాడు నరకానికి పోతాడు .

  సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -7-10-25-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

మనం మర్చిపొయిన మన ఆంధ్రా చెస్ చాంపియన్ శ్రీ జి.ఎస్.దీక్షిత్

మనం మర్చిపొయిన మన ఆంధ్రా చెస్ చాంపియన్ శ్రీ జి.ఎస్.దీక్షిత్

జి.ఎస్.దీక్షిత్ ప్రముఖ చదరంగ క్రీడాకారుడు. చదరంగ క్రీడలో 1950దశకంలోనే తెలుగువారి కీర్తిప్రతిష్టలు పెంపొందించిన తొలితరం క్రీడాకారుడు.

జీవిత విశేషాలు

జి.ఎస్.దీక్షిత్ గా సుప్రసిద్ధుడైన ఈ క్రీడాకారుని పూర్తిపేరు గొల్లపూడి సుబ్రహ్మణ్య దీక్షిత్. తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం వ్యక్తి ఐన ఆయన తండ్రి గొల్లపూడి వెంకటరామయ్య ఆ ప్రాంతంలో చదరంగానికి మేటిగా పేరొందారు. చిన్నతనంలో తండ్రి నుంచి చదరంగ క్రీడలోని మెళకువలు తెలుసుకున్న దీక్షిత్ అకుంఠిత దీక్షతో పసివయసు వీడకుండానే తండ్రిని పలుమార్లు ఓడించారు.

చదరంగ క్రీడలో

యౌవనకాలంలో పలుమార్లు మద్రాసు, బీహార్, ఆంధ్ర ప్రాంతాల చదరంగ క్రీడా ఛాంపియన్ షిప్ గెలుచుకున్నారు. ప్రతిష్టాత్మకమైన కస్తూరి కప్, రానడే ట్రోఫీల విజేత నిలిచారు. అంతర్జాతీయ కరస్పాండెన్స్ చదరంగం పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొనే అరుదైన గౌరవాన్ని పొందారు.[1]

వ్యక్తిత్వం

దీక్షిత్ చదరంగక్రీడలో తాను అత్యున్నత స్థాయికి ఎదగడమే కాక ప్రతిభావంతులైన యువకులను తనంతట తానుగా చేరదీసి వారికి గురువుగా వ్యవహరించి మెళకువలు నేర్పడం ఆయన వ్యక్తిత్వాన్ని పట్టి ఇస్తుంది

ప్రాచుర్యం

ఇండియన్ చెస్ పత్రిక దీక్షిత్ ఆటతీరు గురించి శ్రీ దీక్షిత్ 20 ఎత్తుల వరకూ ఆలోచించి ఆడగల మేధావి. ఎత్తులలో ఆయనను బోల్తాకొట్టించగలమని ప్రత్యర్థులు భావించడం తమను తామే వంచించుకోవడం అని రాసింది. చదరంగక్రీడకు సంబంధించి దేశంలోనే మొదటి ముగ్గురిలో ఒకరిగా సంవత్సరాల తరబడి పేరొందారని 20-7-1960న ప్రచురితమైన దీక్షిత్ గురించిన వ్యాసంలో ఆంధ్రసచిత్ర వారపత్రిక పేర్కొంది.

  1. ↑ ఆంధ్రసచిత్ర వారపత్రికలో తెలుగువెలుగులు శీర్షికన జి.ఎస్.దీక్షిత్

నేషనల్ ప్రీమియర్ చెస్ ఛాంపియన్‌షిప్ అనేది భారతదేశ వార్షిక జాతీయ చెస్ ఛాంపియన్‌షిప్. దీనిని 1955లో ఆంధ్ర రాష్ట్ర చెస్ అసోసియేషన్ ద్వివార్షిక కార్యక్రమంగా స్థాపించింది, కానీ 1971 నుండి దీనిని ప్రతి సంవత్సరం ఆడుతున్నారు.

మొదటి ఎడిషన్ ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో 1955 మే 15 నుండి మే 28 వరకు జరిగింది మరియు దీనిని రామచంద్ర సప్రే మరియు దర్భ వెంకయ్య సంయుక్తంగా 9/12 పాయింట్లతో గెలుచుకున్నారు] అంతకుముందు, పిఠాపురంకు చెందిన జి.ఎస్. దీక్షిత్ వరుసగా మూడు సంవత్సరాలు, 1952–54 వరకు ఆంధ్ర మరియు మద్రాస్ రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాన్యుయెల్ ఆరోన్ రికార్డు స్థాయిలో 9 సార్లు పురుషుల జాతీయ టైటిల్‌ను గెలుచుకున్నాడు, ఆ తర్వాత ప్రవీణ్ తిప్సే 7 సార్లు టైటిల్‌ను గెలుచుకున్నాడు. సూర్య శేఖర్ గంగూలీ 2003 నుండి 2008 వరకు వరుసగా ఆరు జాతీయ టైటిళ్లను గెలుచుకున్నారు. భారత చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ 1986, 1987 మరియు 1988లలో వరుసగా మూడుసార్లు నేషనల్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు. పి. ఇనియన్ 2025లో నేషనల్స్ పురుషుల ఛాంపియన్‌గా నిలిచారు.

1977లో రోహిణి ఖాదిల్కర్ ఆ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న మొదటి మహిళా క్రీడాకారిణి అయ్యారు. ఆమె మహిళ కాబట్టి ఆమె టోర్నమెంట్‌లో పాల్గొనడాన్ని కొంతమంది ఆటగాళ్ళు వ్యతిరేకించారు. ఆమె తండ్రి ప్రపంచ చెస్ సమాఖ్య అధ్యక్షుడు మాక్స్ యూవేకు లేఖ రాశారు మరియు యూవే మహిళా క్రీడాకారులను ఓపెన్ చెస్ ఈవెంట్‌ల నుండి నిరోధించలేరని తీర్పు ఇచ్చారు.

ప్రత్యేక మహిళల ఛాంపియన్‌షిప్ 1974లో ప్రారంభమైంది. మొదటి పది ఎడిషన్లలో ఖాదిల్కర్ సోదరీమణులు వసంతి, జయశ్రీ మరియు రోహిణి ఆధిపత్యం చెలాయించారు. రోహిణి అతి పిన్న వయస్కురాలు మరియు ఐదుసార్లు ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది, జయశ్రీ నాలుగు టైటిళ్లను గెలుచుకుంది మరియు పెద్దది వసంతి ప్రారంభ సంవత్సరంలో ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. సుబ్బరామన్ విజయలక్ష్మి రికార్డు స్థాయిలో 6 సార్లు టైటిల్ గెలుచుకోగా, రోహిణి ఖాదిల్కర్ మరియు పద్మిని రౌత్ వరుసగా 5 సార్లు జాతీయ మహిళా టైటిల్ గెలుచుకున్నారు. 2024లో పి.వి. నందిదా ప్రస్తుత జాతీయ మహిళా ఛాంపియన్.

2024 నాటికి, జాతీయ టైటిల్ విజేతకు వరుసగా INR 7,00,000 నగదు బహుమతి, ఆ తర్వాత రెండవ మరియు మూడవ స్థానాలకు INR 5,50,000 మరియు INR 4,50,000 అందుకుంటారు. పురుషులు మరియు మహిళలు ఈవెంట్ల నుండి టాప్ నాలుగు క్రీడాకారులు చెస్ ప్రపంచ కప్ 2025 మరియు మహిళల చెస్ ప్రపంచ కప్ 2025లో పాల్గొనడానికి ఎంపికయ్యారు.

Posted in రచనలు | Leave a comment

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు.13 వ భాగం.6.10.25.

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు.13 వ భాగం.6.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి 30 వ భాగం.6.10.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి

30 వ భాగం.6.10.25.

Posted in రచనలు | Leave a comment

కందుకూరి రుద్రకవి కృత లీలా జనార్దనం.2 వ భాగం.6.10.25

కందుకూరి రుద్రకవి కృత లీలా జనార్దనం.2 వ భాగం.6.10.25

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.55 వ భాగం.6.10.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.55 వ భాగం.6.10.25.

Posted in రచనలు | Leave a comment

వాష్ పెయి౦టింగ్ కుడ్యచిత్ర సౌందర్య శాస్త్రం  పునరుద్ధరించిన విశ్వభారతి విశ్వవిద్యాలయం సూపరింటెండెంట్‌,’’శిల్పిపత్రిక’’ స్థాపకుడు -వి.ఆర్ చిత్రా

Change text alignment

వాష్ పెయి౦టింగ్ కుడ్యచిత్ర సౌందర్య శాస్త్రం  పునరుద్ధరించిన విశ్వభారతి విశ్వవిద్యాలయం సూపరింటెండెంట్‌,’’శిల్పిపత్రిక’’ స్థాపకుడు   -వి.ఆర్ చిత్రా

వి. ఆర్. చిత్ర మరియు భారతీయ కుడ్యచిత్ర సౌందర్యశాస్త్రం యొక్క పునరుజ్జీవనం: మరచిపోయిన వాష్ పెయింటింగ్ యొక్క పునరుజ్జీవనం

వి. ఆర్. చిత్ర జీవితం మరియు కళాత్మక ప్రయాణం

వి. ఆర్. చిత్ర (సుమారు 1900లు–1960లు) ఒక మార్గదర్శక భారతీయ కళాకారుడు , విద్యావేత్త మరియు సాంస్కృతిక న్యాయవాది, ఆమె కెరీర్ బెంగాల్‌లోని శాంతినికేతన్ యొక్క కళాత్మక సంప్రదాయాలను మరియు మద్రాస్ కళా ప్రపంచాన్ని వారధి చేసింది. 20వ శతాబ్దం ప్రారంభంలో (ఖచ్చితమైన తేదీ ఖచ్చితంగా తెలియదు) జన్మించిన చిత్ర, శాంతినికేతన్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం యొక్క కళా పాఠశాల అయిన కళాభవనంలో తన అధికారిక కళా శిక్షణను పొందారు. అక్కడ, నందలాల్ బోస్ వంటి ప్రముఖుల మార్గదర్శకత్వంలో మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ రూపొందించిన వాతావరణంలో, చిత్ర బెంగాల్ పాఠశాల యొక్క స్వదేశీ కళారూపాలను పునరుజ్జీవింపజేసే తత్వాన్ని గ్రహించాడు . శాంతినికేతన్ పాఠ్యాంశాలు శాస్త్రీయ భారతీయ కళ (అజంతా గుహ కుడ్యచిత్రాల నుండి మొఘల్ మరియు రాజ్‌పుత్ సూక్ష్మచిత్రాల వరకు) మరియు భారతీయ మరియు తూర్పు ఆసియా పద్ధతులను కలిపే ప్రయోగాత్మక, సమకాలీకరణ విధానాన్ని అధ్యయనం చేయడంపై దృష్టి సారించాయి. ఈ విద్య చిత్ర సౌందర్య దృక్పథాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది, “మన మాతృభూమి యొక్క పురాతన కళ మరియు చేతిపనుల పునరుజ్జీవనం” పట్ల జీవితాంతం నిబద్ధతను అతనిలో కలిగించింది.

శాంతినికేతన్‌లో ఫైన్ ఆర్ట్స్‌లో డిప్లొమా పూర్తి చేసిన తర్వాత, చిత్ర వలస భారతదేశంలో కళ మరియు చేతిపనుల విద్యలో చురుకుగా పని చేశాడు . 1930ల చివరి నాటికి, అతను మద్రాస్‌లోని ప్రభుత్వ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు, అక్కడ అతను ఉపాధ్యాయుడిగా మరియు తరువాత నిర్వాహకుడిగా పనిచేశాడు. శాంతినికేతన్ జాతీయవాద కళా ఉద్యమం మరియు మద్రాస్ ప్రాంతీయ కళా రంగానికి ఈ ద్వంద్వ పరిచయం – ఉత్తర మరియు దక్షిణ భారతదేశాల మధ్య సాంస్కృతిక వారధిగా చిత్రను ప్రత్యేకంగా నిలిపింది. మద్రాస్‌లో, సాంప్రదాయ భారతీయ డిజైన్ మరియు చేతిపనులను అధికారిక కళా బోధనలో ఏకీకృతం చేయడాన్ని ఆయన సమర్థించారు. వలసవాద సౌందర్య నిబంధనలకు ప్రతిఘటనగా భారతదేశ గత కళలను తిరిగి కనుగొనడానికి ఠాగూర్ సర్కిల్ చేసిన విస్తృత ప్రయత్నాలతో సమలేఖనం చేస్తూ, భారతదేశ గొప్ప దృశ్య వారసత్వాన్ని పరిశోధించడం మరియు డాక్యుమెంట్ చేయడం అతని పనిలో తరచుగా ఉంటుంది.

చిత్ర కెరీర్ రెండు ప్రధాన దశల్లో సాగింది: శాంతినికేతన్ బెంగాల్ స్కూల్ ఆదర్శాలలో పాతుకుపోయిన ప్రారంభ కాలం, మరియు మద్రాసులో పరిణతి చెందిన కాలం, అక్కడ అతను కళా విద్య మరియు ప్రచురణలో నాయకత్వ పాత్రలు పోషించాడు. 1946లో, భారతదేశ స్వాతంత్ర్యం సందర్భంగా, చిత్ర మద్రాసులో పనిచేస్తూనే ప్రభావవంతమైన కళా పత్రిక అయిన సిల్పి (శిల్పి)ని సహ-స్థాపించారు. అటువంటి ప్రయత్నాల ద్వారా, అతను ప్రాక్టీస్ చేసే కళాకారుడి గా  మాత్రమే కాకుండా, సంపాదకుడు, రచయితగా మరియు సాంస్కృతిక డాక్యుమెంటరీగా కూడా ఎదిగాడు. 1960లలో, చిత్ర అధికారిక హోదాలో శాంతినికేతన్‌కు తిరిగి వచ్చారు – 1964లో విశ్వభారతి విశ్వవిద్యాలయంలో సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు – తన కెరీర్ చివరిలో తన ఆల్మా మేటర్‌తో తన లోతైన సంబంధాలను పునరుద్ఘాటించారు. 1960ల చివరి నాటికి ఆయన మరణించారు, గణనీయమైన కానీ తక్కువ గుర్తింపు పొందిన వారసత్వాన్ని మిగిల్చారు. నేడు, ఆయన శాంతినికేతన్ కళా భావన యొక్క “ప్రముఖ పూర్వ విద్యార్థి”గా మరియు 20వ శతాబ్దపు మధ్యకాలపు భారతీయ కళా వర్గాలలో కీలక వ్యక్తిగా గుర్తుండిపోయారు. స్వాతంత్ర్యం తర్వాత దశాబ్దాలలో భారతీయ ఆధునిక కళను చైతన్యవంతం చేసిన పాన్-ఇండియన్ పునరుజ్జీవన స్ఫూర్తికి ఆయన జీవిత చరిత్ర ఉదాహరణగా నిలుస్తుంది, కొత్త పరిశోధనల ద్వారా ఇటీవల వెలుగులోకి వచ్చింది.

కళాకారుడు ,, సంపాదకుడు మరియు డాక్యుమెంటరీ: చిత్ర రచనలు మరియు ప్రాజెక్టులు

వి.ఆర్. చిత్ర హుముఖ ప్రజ్ఞాశాలి – ఒకేసారి కళాకారుడు , సంపాదకుడు, చరిత్రకారి మరియు భారతదేశ స్వదేశీ సౌందర్య సంప్రదాయాలకు న్యాయవాది. ఆయన ప్రధాన రచనలు పెయింటింగ్, ప్రచురణ మరియు సాంస్కృతిక డాక్యుమెంటేషన్‌లో విస్తరించి ఉన్నాయి, ప్రతి అంశం ఇతరులను బలోపేతం చేసింది. ముఖ్యంగా మూడు ప్రాజెక్టులు ఆయన ప్రభావాన్ని హైలైట్ చేస్తాయి: కొచ్చిన్ మ్యూరల్స్ పోర్ట్‌ఫోలియో, సిల్పి ఆర్ట్ మ్యాగజైన్ మరియు కాంపెండియం కాటేజ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా.

1. కొచ్చిన్ మ్యూరల్స్ ప్రాజెక్ట్ (1940): చిత్ర తొలి మైలురాయి కార్యక్రమాలలో ఒకటి కేరళ ఆలయ కుడ్య చిత్రాల డాక్యుమెంటేషన్. 1940లో, ఆయన మరియు సహకారి టి. ఎన్. శ్రీనివాసన్ “కొచ్చిన్ మ్యూరల్స్: కొచ్చిన్ కొల్లోటైప్ రిప్రొడక్షన్స్ ఆఫ్ ది మ్యూరల్ పెయింటింగ్స్ ఆఫ్ కొచ్చిన్”, ఇది కొల్లోటైప్ ప్లేట్ల ప్రతిష్టాత్మకమైన రెండు-వాల్యూమ్ పోర్ట్‌ఫోలియో. 500 కాపీల పరిమిత ఎడిషన్‌లో ఉత్పత్తి చేయబడిన ఈ రచనలో, కొచ్చిన్ (కేరళ) రాచరిక రాష్ట్రంలోని దేవాలయాలు మరియు రాజభవనాల నుండి శతాబ్దాల నాటి గోడ చిత్రాలను ఫోటో తీయడం మరియు వాటిని అధిక-నాణ్యత గల కోలోటైప్ ప్రింట్‌లలో పునరుత్పత్తి చేయడం జరిగింది. ఈ పోర్ట్‌ఫోలియో కొచ్చిన్ మహారాజు పోషకత్వంలో ప్రచురించబడింది, సర్ ఆర్. కె. షణ్ముఖం చెట్టియార్ (కొచ్చిన్ దివాన్) ముందుమాటతో. జపాన్‌లోని క్యోటోలోని ప్రఖ్యాత బెన్రిడో ప్రెస్ ద్వారా ముద్రించబడిన ఈ సంపుటాలలో హిందూ పౌరాణిక దృశ్యాలను (ముఖ్యంగా రామాయణం నుండి ఎపిసోడ్‌లు) స్పష్టమైన వివరాలతో చిత్రీకరించే 40 ప్లేట్‌లు ఉన్నాయి. కొచ్చిన్ కుడ్యచిత్రాలు కళా డాక్యుమెంటేషన్ యొక్క టూర్ డి ఫోర్స్: చిత్ర తప్పనిసరిగా ఆధునిక ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా పండితులు మరియు కళాకారులకు విస్తృతంగా కనిపించేలా చేయడం ద్వారా పెళుసైన ప్రాంతీయ చిత్రలేఖన సంప్రదాయాన్ని “రక్షించడానికి” సహాయపడింది. వాల్యూమ్ I యొక్క శీర్షిక పేజీ (క్రింద చూపబడింది) ప్రాజెక్ట్ యొక్క పండిత స్వభావాన్ని నొక్కి చెబుతుంది, “V. R. చిత్ర మరియు T. N. శ్రీనివాసన్, M.A రాసిన వివరణాత్మక వచనం” మరియు కొచ్చిన్ పాలకుడి అధికారిక అధికారాన్ని పేర్కొంది.

కొచ్చిన్ కుడ్యచిత్రాల ప్రాజెక్టులో చిత్ర పాత్ర కీలకమైనది. సమకాలీన నివేదికలు “మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌కు చెందిన వి. ఆర్. చిత్ర”ను “కొచ్చిన్ ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకురాలిగా” గుర్తించాయి, ఆమె కుడ్యచిత్రాలను ఎంచుకోవడం మరియు ఫోటో తీయడం సులభతరం చేసింది.

 శ్రీ పిలకా గణపతి శాస్త్రి గారితో కలిసి మద్రాస్ లో ‘’ఆంధ్రి శిల్పి ‘’మాసపత్రిక స్థాపించి నడిపాడు ఆని శ్రీ సంజీవ దేవ్ రాశారు .

సారాంశంలో, V. R. చిత్ర రచనలు విస్తృతమైనవి, కానీ ఆధునిక భారతదేశంలో స్వదేశీ సౌందర్యాన్ని పునరుద్ధరించడం మరియు జరుపుకోవడం అనే ఉమ్మడి లక్ష్యంతో ఏకీకృతం చేయబడ్డాయి. ప్రకృతి దృశ్యాన్ని చిత్రించడం, పత్రికను సవరించడం లేదా క్రాఫ్ట్ మాన్యువల్‌ను సంకలనం చేయడం వంటివి చేసినా, అతను భారతీయ మూలాంశాలు, పద్ధతులు మరియు తత్వాలను స్థిరంగా ముందుంచాడు. కొచ్చిన్ మురల్స్, సిల్పి మరియు కాటేజ్ ఇండస్ట్రీస్ వంటి అతని ప్రాజెక్టులు గణనీయమైన కళా-చారిత్రక విలువను కలిగి ఉన్నాయి: అవి జ్ఞానాన్ని సంరక్షించాయి, సమకాలీన కళాకారులను ప్రభావితం చేశాయి (సాంప్రదాయ చిత్రాలకు వారిని బహిర్గతం చేయడం ద్వారా), మరియు 20వ శతాబ్దపు మధ్యకాలంలో భారతదేశ జాతీయవాద కళా చర్చకు దోహదపడ్డాయి. ఈ ప్రయత్నాలు చిత్ర కళాకారుడు-సృష్టికర్త మరియు పండితుడు-ఆర్కైవిస్ట్ రెండింటిలోనూ చిత్ర యొక్క హైబ్రిడ్ గుర్తింపును కూడా వివరిస్తాయి. 1950ల నాటికి, అతను భారతీయ కళ యొక్క గతం మరియు భవిష్యత్తుపై అధికారం కలిగి ఉన్నాడు – ఉదాహరణకు, “కళా భావన (శాంతినికేతన్) వృద్ధి”పై ఉపన్యాసాలు ఇవ్వడం మరియు కళా జ్యూరీలలో పనిచేయడం. అయినప్పటికీ, అటువంటి విజయాలు ఉన్నప్పటికీ, చిత్ర స్వంత కళాత్మక రచనలలో ఎక్కువ భాగం తరువాతి దశాబ్దాలలో అస్పష్టంగానే ఉన్నాయి, తరువాతి తరాల వారు తిరిగి కనుగొనబడటానికి వేచి ఉన్నాయి.

తిరిగి కనుగొనబడిన ‘రాజ్‌పుత్ వారియర్’ వాష్ పెయింటింగ్: వివరణ మరియు విశ్లేషణ

వి.ఆర్. చిత్ర కళాకృతులలో, ఇటీవల తిరిగి కనుగొనబడిన “రాజ్‌పుత్ వారియర్” యొక్క వాష్ పెయింటింగ్ అతని సృజనాత్మక వారసత్వంపై కొత్త ఆసక్తిని రేకెత్తించింది. చాలా కాలంగా తప్పుగా పంపిణీ చేయబడిన లేదా అస్పష్టంగా ఉంచబడిన ఈ పెయింటింగ్, ఆకృతి ఆర్ట్ గ్యాలరీ (కోల్‌కతా) సేకరణలో గుర్తించబడింది మరియు ఇప్పుడు చిత్రాకు గట్టిగా ఆపాదించబడింది. బెంగాల్ స్కూల్ కళాకారులు ప్రసిద్ధి చెందిన సున్నితమైన వాష్ టెక్నిక్‌లో అమలు చేయబడిన ఈ కళాకృతి ఒక వీరోచిత రాజ్‌పుత్ యోధుడిని వర్ణిస్తుంది – చారిత్రక మరియు సాంస్కృతిక ప్రతీకవాదంతో నిండిన విషయం. పెయింటింగ్ యొక్క శైలీకృత విశ్లేషణ చిత్ర యొక్క కళాత్మక శైలి గురించి చాలా వెల్లడిస్తుంది, దీనిని అతని ఇతర ప్రసిద్ధ రచనలైన “వేవ్స్ & క్లౌడ్స్” మరియు అతని హిమాలయన్ ల్యాండ్‌స్కేప్ సిరీస్ (ఎన్చాన్టెడ్ హిమాలయాలు) వంటి వాటితో సంబంధం కలిగి ఉంటుంది.

దృశ్య వివరణ: రాజ్‌పుత్ వారియర్ పెయింటింగ్ సాంప్రదాయ దుస్తులలో ఒంటరి యోధుడిని, బహుశా రాజ్‌పుత్ గొప్ప లేదా యువరాజును చిత్రీకరిస్తుంది. అతను ప్రొఫైల్‌లో, గొప్పగా అలంకరించబడిన గుర్రంపై, బహిరంగ యుద్ధభూమి లేదా శైలీకృత ప్రకృతి దృశ్యాన్ని సూచించే నేపథ్యంతో చూపబడ్డాడు. ఈ కూర్పు వెంటనే రాజస్థాన్ యొక్క క్లాసిక్ రాజ్‌పుత్ సూక్ష్మచిత్రాలను గుర్తుకు తెస్తుంది – బోల్డ్ ప్రొఫైల్‌లు, సంక్లిష్టమైన నమూనాలతో కూడిన దుస్తులు మరియు యుద్ధ గర్వం. చిత్ర యోధుడు ప్రకాశవంతమైన అంగార్ఖా (ట్యూనిక్) మరియు తలపాగా ధరించి, మట్టి ఎరుపు మరియు ఓచర్‌లతో అలంకరించబడి, వంపుతిరిగిన కత్తిని కలిగి ఉంటాడు. ముఖ్యంగా, ఈ బొమ్మను వాష్ టెక్నిక్ ఉపయోగించి పెయింట్ చేశారు: అపారదర్శక నీటి రంగు పొరలను వాష్‌లలో వర్తింపజేస్తారు, మృదువైన టోన్ స్థాయిలు మరియు అవుట్‌లైన్‌ల యొక్క సున్నితమైన అస్పష్టతను సృష్టిస్తారు. దీని ఫలితంగా పెయింటింగ్‌లో “కాంతి యొక్క అతీంద్రియ నాణ్యత” మరియు వాతావరణం ఏర్పడుతుంది. ఉదాహరణకు, యోధుని వెనుక ఉన్న ఆకాశం లేత ఉదయపు కాంతి నుండి హోరిజోన్ దగ్గర వెచ్చని కాంతికి మసకబారుతుంది, ఇది మసక, ప్రకాశవంతమైన ప్రభావాన్ని ఇచ్చే పదేపదే వాష్‌ల ద్వారా సాధించబడుతుంది. యోధుని ముఖ లక్షణాల యొక్క సున్నితమైన నమూనా మరియు గుర్రం యొక్క కండరాలను జాగ్రత్తగా రెండరింగ్ చేయడం కూడా చిత్ర కఠినమైన గీతలు లేకుండా జీవితాన్ని మరియు వాల్యూమ్‌ను నింపడానికి వాష్ పద్ధతిని ఉపయోగించిందని సూచిస్తుంది, అబనీంద్రనాథ్ ఠాగూర్ తన సొంత వాష్ పెయింటింగ్‌లలో చేసినట్లుగా.

టెక్నిక్ మరియు శైలి: చిత్ర వాష్ టెక్నిక్‌లో అతని ప్రావీణ్యం అతన్ని విస్తృత శాంతినికేతన్/బెంగాల్ స్కూల్ వంశానికి అనుసంధానిస్తుంది. 1900ల ప్రారంభంలో అబనీంద్రనాథ్ ఠాగూర్‌తో ప్రారంభించి, బెంగాల్ స్కూల్ కళాకారులు పాన్-ఆసియన్ ఆధునిక కళను ఊహించడంలో భాగంగా జపనీస్-ప్రేరేపిత వాష్ (లేదా సుమి-ఇ) టెక్నిక్‌ను స్వీకరించారు. చిత్ర రాజ్‌పుట్ వారియర్‌లో, కొన్ని దశాబ్దాల తర్వాత ఈ విధానం కొనసాగింపును మనం చూస్తాము. వర్ణద్రవ్యాలు అణచివేయబడి, సూక్ష్మంగా మిళితం చేయబడ్డాయి; ఉదాహరణకు, యోధుడి వస్త్రం యొక్క మడతలు బలమైన నీడ కంటే సున్నితమైన టోనల్ మార్పుల ద్వారా సూచించబడతాయి. ఇది పాత-ప్రపంచ నోస్టాల్జియా మరియు మృదుత్వం యొక్క భావాన్ని సృష్టిస్తుంది. అదే సమయంలో, చిత్ర వ్యక్తిగత శైలి రాజ్‌పుట్ మరియు బెంగాల్ స్కూల్ అంశాల కూర్పు సంశ్లేషణలో కనిపిస్తుంది. విషయం – ఒక రాజ్‌పుట్ హీరో – బెంగాల్ పునరుజ్జీవనోద్యమకారులు ఆరాధించిన మూలాలను గుర్తుకు తెస్తుంది (కుమారస్వామి మరియు అబనీంద్రనాథ్ పాశ్చాత్య విద్యా కళకు విరుద్ధంగా రాజ్‌పుట్ సూక్ష్మచిత్రాలను “రాజ్‌పుట్ పెయింటింగ్ యొక్క గొప్పతనం మరియు గొప్పతనం”గా ప్రశంసించారు). చిత్ర ఆ రాజ్‌పుత్ కళాత్మక స్ఫూర్తిని ప్రసారం చేస్తుంది, కానీ దానిని అసలు సూక్ష్మచిత్రాలలో వలె వాస్లీపై అపారదర్శక గోవాష్‌గా కాకుండా వాష్ మరియు కాగితంపై వ్యక్తపరుస్తుంది. ఫలితంగా ఒకేసారి స్వదేశీ మరియు ఆధునికంగా అనిపించే పెయింటింగ్ – శాంతినికేతన్ యొక్క పొగమంచు లెన్స్ ద్వారా రాజస్థానీ యోధుని సున్నితమైన పునఃరూపకల్పన.

చిత్ర యొక్క ఇతర రచనలతో పోల్చినప్పుడు: రాజ్‌పుత్ వారియర్ థీమ్ అతని తెలిసిన కళాకృతిలో కొంత ప్రత్యేకమైనది, ఇది స్టాండ్-అలోన్ అలంకారిక చిత్రాల కంటే ప్రకృతి దృశ్యాలు మరియు డాక్యుమెంటేషన్ యొక్క ఎక్కువ ఉదాహరణలను కలిగి ఉంది. అయితే, సంపర్క పాయింట్లు ఉన్నాయి. చిత్ర యొక్క “వేవ్స్ & క్లౌడ్స్” (శాంతినికేతన్ వృత్తాల నుండి తెలిసిన పెయింటింగ్ లేదా సిరీస్) అదేవిధంగా సహజ రూపాలను – తిరుగుతున్న తరంగాలు, డ్రిఫ్టింగ్ మేఘాలను – దాదాపు వియుక్త, వాతావరణ పద్ధతిలో చిత్రీకరించడానికి వాష్ టెక్నిక్‌ను ఉపయోగించింది. వేవ్స్ & క్లౌడ్స్ మరియు రాజ్‌పుత్ వారియర్ రెండూ చలనం మరియు ద్రవత్వం పట్ల చిత్ర యొక్క ఆకర్షణను వెల్లడిస్తాయి:

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -6-10-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

సుమధుర పద పారిజాతాల బాటపై శత పద్య పూల రధం పై వాగ్దేవిని అర్చిస్తూ ఊరేగించిన భక్తకవి ‘’పూలబాల ‘’

సుమధుర పద పారిజాతాల బాటపై శత పద్య పూల రధం పై వాగ్దేవిని అర్చిస్తూ ఊరేగించిన భక్తకవి ‘’పూలబాల ‘’

సుమారు మూడేళ్ళ క్రితం సరసభారతి ఉగాది వేడుకలలో సరసభారతి పురస్కారం పొందిన మాతృభాషా సేవా శిరోమణి ,బహుభాషా ప్రవీణ, ప్రముఖకవి శ్రీ పూల బాల వెంకట్ నిన్న ఉదయం మమ్మల్ని చూడటానికి వస్తున్నట్లు ఫోన్ చేసి సంప్రదాయ వస్త్రదారణలో ‘’కవి బ్రహ్మ’’, ‘’సాహితీ సరస్వతి’’ జంటగా మా  ఇంటికి వచ్చినట్లు  ఫలాలతో పలకరించారు .పూల బాల  గారు తాము రచించిన రెండు  వాగ్దేవీ వైభవం-సరస్వతీ కీర్తనావళిఇచ్చి ఆభిప్రాయం రాయమనికోరారు .మా దంపతులం ఆ దంపతులకు శాలువాతో సత్కరించి సరసభారతి పుస్తకాలు కొన్ని అందించాం. దాదాపు ఒకగంట సత్కాలక్షేపం చేశాం . ,

  సాయంత్రం శతకం చదివాను .అంతటి కవి గురించి నేనేమని రాయను ?జాతి పద్య కల్హార మాలిక ఈ శతకం .పోతన్న మాధుర్యం నారాయణ రెడ్ది పదలాలిత్యం ప్రతి పద్యం లో దర్శనమిస్తుంది .అనుగ్రహం కై ప్రార్ధన ,అనుగ్రహ ప్రాప్తి ,భక్తీ పారవశ్యం ,విన్నపం ,శుద్ధ కవితా పుష్పాలు ,శరణం ,అంకితం శీర్షికలతో శతకం విరాజిల్లింది .

‘’తరగని అక్షర లక్షలు -పేర్మితో బ్రహ్మ సతి నాకు పెరగమనిచ్చెన్ -వరముగ వివేక మిచ్చెను -వెరవక రచనలను జేయ వేడుక నిచ్చెన్ ‘’ఆని అమ్మతనకిచ్చినది అక్షర లక్షలని పొంగిపోయారుకవి .వాకిలిలో ఆమె రాకకోసం వేచి ఉన్నానన్నారు .’’కలిగే ఆలోచనలే ముందుకు నడిపిస్తాయి ఆని తెలిసిన వాడు ధన్యుడు .అందరూ మెచ్చే గుణాలు ,ఏకాగ్రతనిమ్మని ప్రార్ధించారు .’’ మనసుకు  వెలుతురు ను దెచ్చునది విద్యే .ప్రతిభ తో స్మృతి ఉంటే శతకా౦తు డవటం తధ్యం . సుందరకావ్యాలలో సరస్వతీ మాత ను చూపిస్తా రమ్మంటున్నారు .పుస్తకాలుగా వికసించే పదాలను వాసన చూస్తె బుద్ధి పెరుగుతుంది .

భాగవతంలో స్వరసుధలు భావద్గీత  భారతం వాణీ ముఖాలే .కాస్మిక్ కిరణాల శక్తి నుంచి పుట్టినదే సరస్వతీ దెవి.ఆని సైంటిఫిక్ యాస్పెక్ట్ జోడించారు . విశ్వ సృష్టికి మూలం ,అసలు విశ్వమే ఆమె .మాత దయవలన ఒక సన్నని కిరణం తాకి తలపులు పరిణతి చెంది ,తన ఆలోచనా సరళే మారిందని చెప్పుకొన్నారు ,’’అమ్మకు దయ కలిగినచో-కమ్మని తేనెల తలంపు కలమున బుట్టున్ – నెమ్మిక కలిగిన మదిలో -అమ్మయె కొలువయియుండునన్నియుతానై ‘’ కోటబుల్ కోట్ ‘’అయిన పద్యం .విద్దేలతల్లికి ఉపదగా పద్యాలు సమర్పిస్తానన్నారు భక్తిగా .ఊపిరి ఆగిపోయే వరకు తెలుగులో పద్య రచన చేస్తానని ప్రతిన పూనారు .ఆ తల్లి తలపు ఎంతో వేడుక .తరగని పెన్నిధి .కనుక చి౦తలేకుండా పరవశంతో కీర్తిస్తానన్నారు .తెలుగు భాషకు దాసులైన పూల బాలకవికి తల్లి కరుణతో పూల బాటలే దక్కాయి .శ్రీమంతులు వాణిని పూజించటానికి బంగారం ,పేదలు చేమంతులు తెస్తే ‘’దీమంతమున్న కవితలల్లి ‘’భక్తితో సమర్పిస్తారు కవులు .గాత్రానికి సూత్రం వాణి .ఆత్రంగా రావాలంటే అబ్బదుఅపాత్రులకు ,పాత్రులకు మాత్రం  ‘’గాత్రము అబ్బును పవిత్ర గానము పారున్ ‘’

  కవిగారికి చిత్రకళ లోనూ ప్రవేశం ఉంది.దాన్ని ముందుకు సాగెట్లు దీవించమని కోరుకున్నారు .వాగ్దేవి గీర్దేవి శబ్దస్వరూపిణి .శబ్ద లక్ష్మి .కథా రచనప్రవేశం కూడా ఉండటంతో ‘’తనకథ ముగిసే దాకా కలం దించకుండా కతలు రాస్తానన్నారు .చదువు ఉద్యోగాలకోసమే అయిపోయిందని బాధపడ్డాడు .భాష నేరిస్తే ఆత్మకు సంతృప్తి .’’స్పష్టమగు నాత్మకు భాష చందనం ‘’.విడ్యా వ్యవస్థలో తప్పుడు గాళ్ళు చేరితే వారిని ‘’ తూచి తక్కేట ‘’కు అంటే పాత ఇనపసామాన్లు కోనేవాడికి ఇచ్చినట్లివ్వాలి .’’ముత్యం లాంటి మన భాష ముక్కలయ్యిందని ‘’బాధపడ్డాడుకవి తల్లిభాషలోనే చదువు చెప్పాలని కేంద్రం చట్టం తెస్తుందని ‘’అప్పుడు చెయ్యెత్తి తెలుగుతల్లికి జై ‘’అంటారు ఆని తెలుగు బంగారు భవిష్యత్తు కలగన్నారు .దీనినే utopia అంటారు .

‘’రావేసనాతని నూపుర-రవముల్ డెందమున సుస్వరములే పల్కన్ -కావ్య సుధారస దారలు -తేవె రసరాణివి నీవే తేనెలు తేవే ‘’.వామనుడి వంటి తన ఇంటికి మేరుపర్వతంలా వాగ్దేవి వచ్చిందని మురిసిపోయడుకవి .

‘’సితకా౦తి ప్రియ శారద -శతకంబు లిఖించి పాయస మధురకృతుల్ -నుతము జేయుచు పాడగ -అతిశయమంది నను నేను మరచితికాదా ‘’ అంటూ నూరవ పద్య౦ తో శతకం పూర్తిచేశారుకవి పూలబాల .

చక్కని ముద్రణ .బైండింగ్ ,అందమైన చిత్రాలు  చిత్తాకర్షణాలు ఈ శతకానికి .కవిత్వం పరుగులెత్తింది. సుమధుర భావ బంధురం .తగినట్లు లలితకోమల పద బంధం వన్నె తెచ్చాయి .ఎంతో ఖర్చు భరించి ముద్రించిన వదాన్యులైన దాతలకు వాణీ మాత పూజా ఫలం దక్కింది . పదాలమధ్య ఎడం సరిగ్గా కుదరక భావానికి ఇబ్బంది కలిగింది  .కొన్నిచోట్ల ఒత్తులు సరిగ్గా పడలేదు .మరింతజాగ్రత్త పడితే బాగుండేది.పూలబాల గారి సరస్వతీ సమార్చనం అభినందనీయం .మరిన్ని అర్ధవంతమైన రచనలు రావాలని కోరిక .

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -6-10-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment