ప్రజలు ఆశించింది జరగట్లేదు -ఆర్ కె ఓపెన్ హార్ట్ తో ప్రొఫెసర్ హర గోపాల్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాలుగు చైనీయ కవితలు మరియు మరోకవిత” బతుకు ”

 


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉత్తమ ప్రి శోధకుడు పల్లా దుర్గయ్య ద్వానా శాస్త్రి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహాకవితో మహర్షి

మహాకవితో మహర్షి

జగన్నాథ రథచక్రాలను భూ మార్గం పట్టించిన శ్రీశ్రీ ఒకవైపు- స్ర్తీని మహోన్నతంగా చూడాలనుకుని విప్లవాత్మక భావాలను తట్టిలేపిన చలం మరోవైపు. సాహిత్య ప్రక్రియల్లో, సాహితీ వస్తువు ఎంపికలో, జీవికలో ఎక్కడా సారూప్యతలు కనిపించని రెండు సాహితీ దిగ్గజాల మధ్య అంతటి సాన్నిహిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? కలిసి చర్చోపచర్చల్లో పాల్గొన్న దాఖలాలు పెద్దగా లేకపోయినా, సన్నిహితంగా మెలిగిన సందర్భాలూ కనిపించకపోయినా ఒకరంటే మరొకరికి అవ్యాజమైన ప్రేమాభిమానాలు ఎందుకున్నాయి? చలంతోనో, శ్రీశ్రీతోనో వెన్నంటి నడిచిన వారు మాత్రమే చెప్పగలిగిన వివరమిది. చలంతో పాటు రమణాశ్రమంలో అనేక సంవత్సరాలు వుండిపోయి, తరువాత సౌరిస్‌తో కలిసి భీమిలి వచ్చి స్థిరపడిన చిక్కాల కృష్ణారావును పలకరించినప్పుడు, ఉబికుబికి వస్తున్న గత స్మృతుల ప్రవాహం ఆగాగి సాగింది.

చలంగారి పోస్ట్‌ బాక్స్‌ నంబరు తొమ్మిది. రోజూ దానిలో పడే ఉత్తరాలను తీసుకువచ్చే బాధ్యత నాదే. ఉదయం ఎనిమిది గంటలకల్లా ఉత్తరాల కోసం వెళ్ళేవాడిని. ఓ రోజు శ్రీశ్రీ రాసిన కార్డు వచ్చింది. ఆయన చలంను ‘చలం మహర్షి’ అని సంబోధించే వారు. ఆ కార్డుపై ఏక వాక్యం… ‘రేపు మీ దగ్గరకు వస్తున్నాను…’ అంతే. ఆ మరుసటి రోజు ఎవరి పనుల్లో వారు వున్నారు. ఈ లోగా ఓ జట్కా ఆగింది. అప్పటి వరకూ చదువుతున్న పుస్తకాన్ని అలాగే చదువుకుంటూ జట్కా బండిని అలవోకగా దిగేశారు శ్రీశ్రీ. పుస్తకంలో నుంచి తలెత్తకుండానే నేరుగా ఇంటి లోకి నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఆయన ముందే నేను నడుస్తున్నాను. గడప దగ్గరలో చలం కూర్చుని వున్నారు. ఆయనను కలవటానికి వస్తున్నానని లేఖ రాసిన శ్రీశ్రీ ఆయనను గమనించకుండానే, పుస్తకంతో నేరుగా వంటగదిలోకి వెళ్ళిపోయారు. నేను శ్రీశ్రీతో ‘చలంగారు అక్కడ కూర్చుని వున్నారు’ అంటూ ఓ ముక్క మాత్రమే చెప్పాను. నేరుగా చలం దగ్గరకు వెళ్ళిన శ్రీశ్రీ ‘ఇది చూశారా!? ఎలా రాశాడో?!’ అంటూ తాను చదువుతూ వచ్చిన పుస్తకంలోని ఓ భాగాన్ని చలంకు చదివి వినిపించారు. అది వింటున్న చలం ముఖంలోనూ, చదువుతున్న శ్రీశ్రీ ముఖంలోనూ ఆనందంతో కూడిన ఓ వెలుగు కనిపించింది. ఆయన ఆ రోజు కేవలం దానిని ఆయనకు చదివి వినిపించటానికే వచ్చారు. అలా వారిద్దరూ కలిసినప్పుడు ఎలాంటి ఫార్మాలిటీస్‌ వుండేవి కావు. ఎవరి ప్రపంచంలో వారు వుంటూనే అవసరమైన మేర పంచుకునే వారనిపించింది.

మరోసారి మరో కార్డు, ఏక వాక్యంతో ‘చలం మహర్షికి, అందరూ అటే… శ్రీశ్రీ.’ అంతే. ‘అందరూ అటే’ అన్న మాటను ఎలా అర్థం చేసుకోవాలి? ఎన్ని అర్థాలు వున్నాయో?! ఆ తరువాత దానికి కొనసాగింపుగా అన్నట్లుగా మరో కార్డు వచ్చింది. దానిలోనే అంతే ఒకే ఒక ముక్క ‘నా భార్య రమణ మహర్షి ఆశ్రమానికి బయలుదేరింది’. దాని తరువాత మరో కార్డు… ‘నేనూ వస్తున్నా’. ఎంతో మంది ఆశ్రమం దారి పట్టారు, మేమూ అదే బాట పట్టాం అన్న భావన అప్పటికి కాని పరిపూర్ణం కాలేదు. చలం స్ర్తీని మహోన్నతంగా నిలిపి ఆరాధిస్తే, శ్రీశ్రీ విప్లవ కవిత్వంతో ఉద్రేకంతో, ఉద్వేగంతో ‘ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి -నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి- హరోం హరోం హర హర హర హరోం హర హర అని కదలండి- అంటూ పరుగుపెట్టించాడు.

చలాన్ని అమితంగా ప్రేమించే ఓ వ్యక్తి ఆశ్రమానికి వచ్చారు. చలంతో అవీఇవీ మాట్లాడుతుంటే టాపిక్‌ శ్రీశ్రీపైకి మళ్ళింది. అంతా విన్న ఆ వ్యక్తి ‘శ్రీశ్రీ గురించి అవీ ఇవీ వద్దు ఒక్క మాటలో ఆయనేమిటో చెప్పండి’’ అంటూ అడిగారు. వెంటనే చలం ‘జారిపడ్డ గంధర్వుడంటాను…’ అన్నారు. ఎన్ని అర్థాలతో నిండిన మాటో కదా అనిపించింది.
శ్రీశ్రీ, చలం-ఇద్దరూ ఆ కాలంలో భాషలో నిష్ణాతులు. అయితే నిత్య జీవితంపై శ్రీశ్రీకి గమనిక వుండేది. చలంకు పట్టేది కాదు. అంతేనా… చలం స్ర్తీని ఆరాధనగా తీసుకుని సమున్నతంగా చూస్తే, శ్రీశ్రీ ప్రత్యేక స్థానం ఇవ్వలేదు. శ్రీశ్రీ వర్గాన్ని ఆవేశంగా తీసుకున్నారు. అదే సమయంలో ఇద్దరి జీవితాలలో ఓ సారూప్యత కూడా వుంది. ఇద్దరూ ఆర్థికంగా ఇబ్బందులు పడిన వారే. ఇద్దరూ డబ్బుకు ప్రలోభపడలేదు. కీర్తి ప్రతిష్ఠలకు ఇద్దరూ పాకులాడలేదు. శ్రీశ్రీ అంటే చలానికి ఓ సాఫ్ట్‌ కార్నర్‌ వుండేది. దానిని ఎవరూ తప్పించలేరు. ఎందుకు? వారిద్దరినీ కలిపి వుంచిన బంధమేమిటి? అన్న ప్రశ్నకు బయట నుంచి ఇప్పుడు సమాధానం చెప్పటం కష్టమే. సరికాదు కూడా. ఇక్కడో విషయం ప్రస్తుతంగా ప్రస్తావించాలి. మహాకవి శ్రీశ్రీ, తెలుగు సాహిత్యంలో పేరడీలకు, ఆద్యుడుగా భావించే జలసత్రం రుక్మిణీనాథ శాసి్త్ర ఉరఫ్‌ జరుక్‌ శాసి్త్ర మంచి మిత్రులు. చెన్నైలోని పానగల్‌ పార్కులో ఒకే సిగిరెట్టు, టీ షేర్‌ చేసుకునేటంత సాన్నిహిత్యం వారిది. శ్రీశ్రీ మహాప్రస్థానం వ్రాయటం పూర్తి అయ్యింది. ఆ వ్రాతప్రతిని జరుక్‌ శాస్ర్తి నేరుగా చలం వద్దకు తీసుకువచ్చారు. అప్పటికి తెలుగుదేశంలో వున్న ఎంతో మంది ప్రసిద్ధులు చెన్నైలో అందుబాటులోనే వుండేవారు. వారందరినీ కాదని, చలం వద్దకు రావటం వెనుక కారణం గురించి ఒక్క క్షణమాలోచిస్తే, చలం, శ్రీశ్రీల బంధాన్ని ఆయన అర్థం చేసుకునే తీసుకువచ్చారని స్ఫురిస్తుంది. శాసి్త్ర తీసుకువచ్చిన వ్రాతప్రతిని చదివిన తరువాత చలం అంతే లోతుగా యోగ్యతాపత్రాన్ని రాశారు. వచన రచనలో చలం ఎంత పొదుపుగా, తక్కువ పదాలను వాడారో, శ్రీశ్రీ తాను రాసిన కవితలలో అంతకన్నా బహుతక్కువ మాటలనే వాడారు.
శ్రీశ్రీ, చలంల మధ్య అంతటి బంధమున్నా, ప్రళయం వచ్చేస్తోందని, ఈశ్వరుని దర్శనమయ్యిందని చలం రాసిన రాతలను శ్రీశ్రీ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఎన్నో గొప్ప విషయాలను రాసిన చలం ఇలాంటి వాటిని చెప్పటాన్ని ఆయన జీర్ణం చేసుకోలేకపోయారని అనుకుంటాను. చలం, శ్రీశ్రీల గురించి మాట్లాడుకునేటప్పుడు, సాహిత్యాన్ని చూస్తున్నామా? సంస్కరణలను, సంఘటనలను చూస్తున్నామా? అన్నది ముఖ్యం. శ్రీశ్రీ కవిత్వం, చలం స్ర్తీ… రెండింటి ఆధారంగానే వాళ్ళ ఔన్నత్యాన్ని చూస్తున్నాం. అయితే, నిత్య జీవితంలో ఆ రెండు విషయాలనీ ప్రపం చం ఎంత పేలవంగా, ఎగతాళిగా, దుర్భలంగా చూస్తోందో, ఆ మహాత్ములు పరస్పరం కావలించుకుని చూస్తూనే వున్నారు.
పుట్టపర్తి నారాయణాచార్యులు తెలుగులో శివతాండవం గేయ కావ్యాన్ని రాశారు. ఆ కావ్యంలోని మాత్రాఛందస్సులోని శబ్దసౌందర్యం, ఆయన గాత్ర మాధుర్యం అద్భుతం. ఓ సారి రమణమహర్షి ఆశ్రమానికి వచ్చారు నారాయణాచార్యులు. శివతాండవం గేయకావ్యంలోని కొన్ని భాగాలను ఆయన పాడారు. ఎప్పుడూ ఎవ్వ రినీ, ఏ పాటనీ రెండోసారి పాడమని అడగని చలం ఆ రోజు ‘మరలా పాడతారా?’ అని అడిగారు. ఎంతగానో సంతోషించిన నారాయణాచార్యులు ఆ గేయాన్ని మరోసారి పాడారు. చాలామందికి తెలిని మరో విషం వుంది. సుబ్రహ్మణ్యం దేవర వద్ద చలం సంగీతాన్ని నేర్చుకుని పాడేవారు.

ఓసారి చలంగారిని పిచ్చికుక్క కరిచింది. ఇంజక్షన్లకు ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి. నిత్యం వచ్చే పోస్టు కార్డులకు ప్రత్యుత్తరమిచ్చే అలవాటు వున్న చలం అదే సమయంలో ఓ ఉత్తరానికి ప్రత్యుత్తరమిస్తూ పిచ్చికుక్క కరిచిన విషయాన్ని కూడా రాశారు. ఆ తరువాత అది అలా అలా పాకింది. అది చివరికి చలాన్ని పిచ్చికుక్క కరిచిందని శ్రీశ్రీ అన్నాడంటూ ప్రచారం అయ్యింది. అంత జరిగినా వారిద్దరి మధ్యా ఎలాంటి భేదభావనా నేను గమనించలేదు.
ఓ సారి చలం వద్దకు వరవరరావు వచ్చారు. సృజన పత్రిక పెడుతున్నామని చెప్పారు. కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన తరువాత దిగంబర కవులు నగ్నముని, నిఖిలేశ్వర్‌, చెరబండరాజు, జ్వాలాముఖి తదితరులు వచ్చారు. ‘ఇదిగో మా కవిత్వం, ఇవీ మా అభిప్రాయాలు’ అంటూ చలం ముందుంచారు. చలంగారికి అవినచ్చినట్లున్నాయి. ఆ తరువాత వాటిని మెచ్చుకుంటూ ఉత్తరంరాశారు. మొత్తానికి నాటి విభేదాలలో శ్రీశ్రీ మావాడంటూ విరసం ఆయనను భుజానికెత్తుకుంది. శ్రీశ్రీ కూడా ఆ విభేదాలలో ఓ వైపే వుండిపోయారు.

చలం బయటకు వచ్చి రమణ మహర్షి గురించి ప్రచారం చేసి వుంటే నేడు తెలుగు రాష్ర్టాలలో పరిస్థితి వేరుగా వుండేది. భగవాన్‌ రమణ మహర్షి తత్వం, దివ్యత్వం ప్రజలకు మరింతగా బోధపడి చేరువయ్యేది.
ఓ సారి రాత్రిపూట శ్రీశ్రీ వచ్చారు. భోజనాలు అయిన తరువాత మా ఇద్దరి మధ్యా సంభాషణ ఇలా సాగింది. ‘సిగిరెట్టు కాల్చవచ్చా?’. లోపలా, బయటా అన్న విషయాన్ని వివరించకుండా గోప్యత పాటించారాయన. ‘ఇక్కడ ఎవ్వరూ కాల్చరు…’ నా సమాధానం. ఆయన, ‘బయట వర్షం పడుతోంది కదా?!’ అన్నారు. అయితే నేను గొడుగు తెస్తానని లోపలికి వెళ్ళి తెచ్చి గొడుగువేసి పట్టుకున్నాను. ఆయన సిగిరెట్టు పీలుస్తున్నారు. పూర్తయిన తరువాత ఇంటి వరండాలో చలంగారి దగ్గర కూర్చున్నారు. ఆయనతో మాట్లాడుతూ, ‘‘కృష్ణారావు నన్ను ఛత్రపతి శ్రీశ్రీని చేశాడు’’ అన్నారు. జోకులు వేసినప్పుడు శ్రీశ్రీ ప్రకటితంగా నవ్వడం నేను చూడలేదు. అయితే చలం మాత్రం ఎవరు మాట్లాడుతున్నా ఎంతో ఆస్వాదిస్తూ వినేవారు. చిత్రకూతుళ్ళు చలంతో ఆడుకునే వారు. ఆయన ముఖానికి పసుపు రాసి, బొట్టుపెట్టేవారు. ఆయనజుత్తుకు జడలు వేసేవారు. వారి ఆటలను చలం ఎంతగానో ఎంజాయ్‌ చేసేవారు. అయితే ఎవరన్నా పుట్టిన రోజు వేడుకలను చేస్తామంటే మాత్రం చలంకు చాలా కోపం వచ్చేది. ఎంతోదూరం నుంచి అభిమానంతో నూతన వస్ర్తాలను తీసుకువచ్చి ఇచ్చినా వాటిని ఆరోజు అస్సలు వేసుకునేవారే కాదు.
తిరువణ్ణామలైలోని రమణ మహర్షి ఆశ్రమం చుట్టూతా ఎంతో మంది పెద్దలు ఇళ్ళు కట్టుకుని వున్నారు. ఆశ్రమానికి ఎంతో మంది రాజకీయ, సినీ ప్రముఖులు వస్తూండేవారు. వాణిశ్రీ తరచుగా వచ్చేవారు. మరో నటి శారద కూడా. నటి సుకన్య స్వతంత్రంగా వుండేది. ఎవరినీ పేరూ, ఊరు ఏనాడూ అడగని నాకు చాలా మంది తెలియదు. ఓ సారి చలంగారి కుటీరం పక్కనే వున్న మరో కుటీరంలోకి ఘంటసాల, సంగీతరావు, ఆత్రేయ దిగారు. కరెంటు లేదు. నిద్రపట్టని ఘంటసాల గదిలో ఓ మూల వున్న తీగలు తెగిన తంబూరా తీసుకుని అష్టపదులు గానం చేశారు.
చెన్నైలో తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. మండలి వెంకటకృష్ణారావు స్వయంగా ఆశ్రమానికి వచ్చారు. చలంతో, మిమ్మల్ని సన్మానించుకోవాలని అనుకుంటున్నామని చెబుతూ చెన్నై రావాలంటూ అభ్యర్థించారు. అయితే వాటికి పూర్తి దూరంగా వుండే చలం సున్నితంగా తిరస్కరించారు. నా కృష్ణ వస్తాడు అంటూ నన్ను చూపించారు. మండలి వారు నాతో చెన్నై రాగానే ఫోన్‌ చేయండి, అన్ని సౌకర్యాలూ నేను చూసుకుంటాను అని చెప్పారు. అలాగే వెళ్ళాను. నాడు వారిచ్చిన షీల్డ్‌ను మాతోపాటే భీమిలి తీసుకువచ్చాం. సౌరిస్‌ ఆశ్రమంలో ఇప్పటికీ ఆ షీల్డ్‌ పదిలంగా వుంది.

 స్వేచ్ఛా రచన : చిగురుపాటి సతీష్‌ బాబు

(నేడు చలం జయంతి)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘32(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)(చివరిభాగం )

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘32(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)(చివరిభాగం )

‘  డాక్టర్ కొలచల సీతారామయ్య గారి జీవితం ,పరిశోధనలు పై  రష్యన్ భాషలో మొదట  సీతారామయ్య గారి పెద్దకూతురు లీలావతి భర్త Ghen Shangin –Berezovsky  రాశారు . దీనిని  ‘’A wreath for Doctor Ramayya ‘’పేరుతొ అచలా జైన్ ,ఎస్.పి.కే .గుప్తా తోకలిసి ఇంగ్లీష్ లోకి అనువదించారు ఈ గ్రంధానికి సంపాదకులుగా ఎస్.పి.కే .గుప్తా వ్యవహరించారు .ఇప్పుడు సంపాదకుని మాటలలో మరింత సమాచారం తెలుసుకొందాం .

వెదక బోయిన తీగ

మొదటి సారిగా కొలచల సీతారామయ్య గారి గురించి 1959 లో బెంగుళూరు ఐ .టి. ఐ .మేగజైన్ ఎడిటర్ .డి.వి.ఏం.రావు తాను  తెలుగు భాగం’’ఐ .టి .ఐ. వాణి –అక్టోబర్ –నవంబర్ సంచిక ‘’లో రామయ్యగారిపై రాసిన వ్యాసం పంపగా గుప్తా తెలుసుకొన్నారు .  డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గురించి గుప్తాను సమాచారం పమపమని కోరారు రావు గారు .ఇరవై మూడేళ్ళ తర్వాత 1982లో  ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేకరిగా మాస్కో వెళ్ళిన గుప్తా రామయ్యగారి గురించి మరింత సమాచారం తెలుసుకోవాలని అనిపించింది .అక్కడ చాలామంది భారతీయులు ఉన్నా ఎవరికీ రామయ్య గారి గురించిన పూర్తి సమాచారం ఇవ్వలేకపోయారు .1984లో తాష్కెంట్ లో జరిగిన  ఫిలిం ఫెస్టివల్  విశేషాలను రాయటానికి గుప్తా  వేసవిలో ఉజ్బెక్ రాజధానికి మేనెల 31 న వెడుతూంటే ఒక రష్యన్ రచయిత ‘’వ్లాడిమిర్ సుకలోవ్ ‘’గుప్తాను ఆపి కారులో లిఫ్ట్ ఇచ్చి దిగాల్సిన హోటల్ కు చేర్చాడు .ఇద్దరి మధ్య జరిగిన సంభాష ణలో  రామయ్య గారి గురించి ,సోవియట్ లో ఆయన కుటుంబాన్ని గురించి ప్రస్తావన వచ్చింది .సుకలోవ్ తనకు రామయ్య గారి కుటుంబ వివరాలు తెలుసునని ,పెద్దకుమార్తె లీలావతి బాగా పరిచయమేనని చెప్పి ఆమె మాస్కో అడ్రస్ ,ఫోన్ నంబర్ ఇచ్చాడు .వెదక బోయిన తీగ కాలికి తగిలింది గుప్తాకు .గుప్తా కు సుకలోవ్ తో అనుకోకుండా జరిగిన పరిచయం పరిచయం సత్ఫలితాలనిచ్చింది . .సుకలోవ్ తాను రాసిన చిన్ననవల ‘’బర్ఖాన్ ‘’గుప్తాకు కానుకగా ఇచ్చి వెళ్ళిపోయాడు .                దర్శనమివ్వని లీలావతి –గుప్తంగా ఉన్న రామయ్య చరిత్ర ను వెలికి తీసిన గుప్తా

గుప్తా తనకు సుకలోవ్ ఇచ్చిన మాస్కో ఫోన్ నంబర్ కు లీలావతికి చాలా సార్లు ఫోన్ చేశాడు .అక్కడ గుప్తా ఉన్న నాలుగేళ్ళలో ఆమెకు ఎన్ని సార్లు ఫోన్ చేశాడో లెక్కే లేదు .లీలావతి ని రమ్మని, తండ్రి గురించి వివరాలు చెప్పమనీ చాలా  సార్లు  అర్ధించాడు  .నాలుగేళ్ళలో ఒక్కసారికూడా ఆమె వచ్చి గుప్తాను కలవలేదు .కానీ పోస్ట్ లో ఒక సారి ఒకే ఒక పేజీలో రామయ్య గారిపై ఉన్ననోట్ ను మాత్రం పంపింది .తర్వాత రష్యా మేగజైన్ ‘’Zvezda Vostaka’’కు చెందిన రెండు సంచికలు పంపింది .అందులో ‘’A wreath for  Lal Govind  Ramayya ‘’గురించి రాయబడి ఉంది .Ghen Shangin –Berezovsky తన భర్త అని కాని ,కారు లో తనను హోటల్ కు తీసుకొచ్చిన సుకలోవ్ ఈ  ఆర్టికల్స్ తాష్కెంట్ జర్నలో  ముద్రించటానికి ముఖ్య కారకుడనికాని గుప్తాకు తెలియ జేయక పోవటం ఆశ్చర్యంగా ఉంది.ఫోన్ లో గుప్తా రామయ్యగారి గురించి మరిన్ని వివరాలు అడిగితే, రామయ్య గారి అస్తికలు మాస్కో క్రేమేటోరియం చాపెల్ లో భద్రపరచబడి ఉన్నాయని మాత్రం చెప్పింది .గుప్తా కు రామయ్యగారి అస్తికల పాత్ర ను సందర్శించాలని మనసులో ఉండి లీలావతిని కూడా తనతో రమ్మని కోరగా వస్తానని చెప్పింది కాని మనసుమార్చుకొని ,రాలేదు ..మాట నిలబెట్టుకోలేక పోయింది రామయ్యగారి కన్న పెద్ద కూతురు లీలావతి

భారత్ చేరిన రామయ్య గారి పై ప్రచురిత సంచికలు –ప్రొఫైల్ రచన

1988 లో గుప్తా రష్యానుండి ఇండియా వస్తూ రామయ్యగారిపై ప్రచురింపబడిన సంచికలు తనతో ఇండియాకు తెచ్చాడు .సైన్స్ రిపోర్టర్ పత్రిక సంపాదకుడు  జి .పి .ఫోన్ డ్కే-గుప్తాను ‘’Un sung Hero of .Science ‘’ పేరుతొ  రామయ్య గారిపై  రాయమని కోరాడు .అప్పటికే గుప్తా అదే శీర్షిక తో డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పై ‘’Subba Rao the Conquer of Plague ‘’ ప్రొఫైల్ రాసిఉన్నాడు  .చేతిలో రామయ్యగారి గురించిZvezda Vostoka’’ పత్రిక  ‘’వివరాలు ఉన్నాయి .అచలా జైన్ సహకారంతో గుప్తా బెరేజోవ్ స్కి  రచనను ఆంగ్లం లోకి అనువదించారు . గుప్తా  కుమారుడి మాస్కో క్లాస్ మేట్ అచల .పుష్కిన్ ఇన్ ష్టి ట్యూట్  లో గ్రాడ్యుయేషన్ చేసి ,ఢిల్లీ కి  తిరిగి వచ్చింది .రష్యన్ భాషకు ఇంటర్ ప్రీటర్ గా  ఉంటూ సోవియట్ ను దర్శించే బిజినెస్ గ్రూప్  మొదలైన డెలిగేషన్ వారికి సహాయకారిగా ఉంటోంది .రోజుకు ఒకటి లేక రెండుగంటలు గుప్తా కు సాయపడుతూ 57 సెషన్ లలో 1993 ఏప్రిల్ నుండి ఆగస్ట్ వరకు పని చేసి రామయ్యగారి పుస్తకాన్ని ఆంగ్లం లో అనువాదం చేయటానికి సహకరించింది.చిత్తుప్రతిని ఢిల్లీ ‘’IIT’s ITMMEC ‘’ముఖ్యాధికారి (హెడ్)ప్రొఫెసర్ ఏ.సీతారామయ్య నిర్దుష్టంగా పరిశేలించి రామయ్య గారి కేమోటాలజి  మొదలైన విషయాలపై అనువాదం లో ప్రామాణికత ను  నిర్ధారించాడు  .

Kolachala Sitaramayya  ‘’   ‘’ జోరా పెట్రునిచేవ ‘’రష్యన్ భాషలో 1985 మార్చి –ఏప్రిల్ Asia and Africa today “’లో  రాసిన ‘సోవియట్ ఆంధ్రా ‘’ లోని విషయాలు రామయ్య గారి కుటుంబ నేపధ్యం గురించి తెలుసుకోవటానికి గుప్తాకు సహకరించాయి .ఆసియా ఆఫ్రికా టు డే లో ప్రచురితమైన కొన్ని ఫోటోలు ,సోవియట్ లాండ్ మాస పత్రికలో వచ్చిన ఫోటోలు ‘’kolachala Sita Ramayya –Father of Chemmotology ‘’ప్రొఫైల్ రాయటానికి బాగా ఉపయోగ పడ్డాయి . అచలా తో గుప్తాకలిసి రాసిన ఈ ప్రొఫైల్  సైన్స్ రిపోర్టర్ లో 1993నవంబర్  లో ప్రచురితమైంది .విశేష స్పందన లభించింది .ఎడిటర్ డాక్టర్ ఫోన్ డ్కే  కు ఉత్సాహం రెట్టింపు అయి ‘’Achievements In Anonymity ‘’(Un sung Indian Scientists) పేరిట 12 మంది పై అత్యుత్తమ ప్రోఫైల్స్ రాయించాడు .అందులో ఒక హీరో ‘’రఫ్ రైడర్ ‘’మన సీతా  రామయ్య గారే .ఇవి బ్రహ్మాండంగా విజయవంతమైనాయి .అద్భుతమైన శీర్షిక ,అంతకన్నా అందులో అప్పటివరకు ఎవరికీ తెలియని విషయాల పొందిక ,విశ్లేషణ  విపరీతమైన క్రేజ్ ను తెచ్చి త్వరలోనే కాపీలన్నీ అమ్ముడై ఇప్పుడు ‘’అవుట్ ఆఫ్ ప్రింట్ ‘’గా ఉండిపోయాయి .

న్యు స్వతంత్ర టైమ్స్ లో పునర్ముద్రణ

‘’ ఘెన్ ‘’రాసిన దానికి చేసిన ఇంగ్లీష్ అనువాదం అలమరలలోనే ఉండిపోయింది .జన బాహుళ్యం లోకి రాలేదు .గుప్తా స్నేహితుడు వి .వామన రావు  సైన్స్ రిపోర్టర్ లో వచ్చిన ఆర్టికల్స్ 1997 ఏప్రిల్ –మే నెలలో’’ New Swatantra Times of Hyderabad ‘లో ’రి ప్రింట్ చేసిన తర్వాత  గుప్తాను కలవటానికి ఒక సారెప్పుడో వస్తే ,వాటిని చక్కగా ఎడిట్ చేసి సీరియల్ గా ప్రచురించి ఈతరం వారికి ,పాత తరం వారికీ కూడా ఆంధ్రులకు ,భారతదేశం లో ఇతర ప్రదేశాలలో ఉన్న తెలుగువారికీ తెలియ జేస్తే బాగుంటుంది అని సలహా చెప్పాడు. వామన రావు వెంటనే అంగీకరించాడు .అచల సహకారం తీసుకొని గుప్త మళ్ళీ పనిలో పడ్డాడు .ప్రతినెలా అచలా  ప్రింట్ చేయాల్సిన విషయాన్ని కంప్యూటర్ పేజీలలో పంపటం ,దాన్ని ప్రింటర్ కు పంపటం జరిగేది .కనుక ఇప్పుడు ఇంగ్లీష్ అనువాదం మొత్తం ‘’న్యు స్వంతర టైమ్స్ ‘’లో ప్రచురింపబడింది .1997నవంబర్ సంచికతో ప్రారంభమైన రామయ్యగారిపై ఈ ధారావాహిక 12 సంచికలుగా రూపు దాల్చి1998 నవంబర్ తో పూర్తయింది .

భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ కార్య దర్శి డాక్టర్ వైద్యనాధఆయ్యర్  రామయ్య గారిపై వచ్చిన సీరియల్ ను ర చదివి మెచ్చి దాన్ని ఇంగ్లీష్, తెలుగు భాషలలో పుస్తకం గా తీసుకు రావాలని ప్రోత్సహించాడు .మాస్కో లోని ‘’రాడుగా ‘’పబ్లిషింగ్ హౌస్ కు ఎన్నో తెలుగు అనువాదాలు చేసిన ప్రిన్సిపాల్   ఆర్. వి. రావు తెలుగులో అనువదించటానికి వెంటనే ఒప్పుకొన్నారు కూడా .

ఉయ్యూరులో సూరి శ్రీరామ మూర్తి నిర్వహించిన  రామయ్య గారి శతజయంతి

‘’న్యు స్వంతంత టైమ్స్’’ ప్రచురించిన రామయ్య సీరియల్  కొలచల వారి కుటుంబానికి  బాగా నచ్చింది .’హైదరాబాద్ లో ఉంటున్న ఉయ్యూరు  వాసి ,’హాం రేడియో’’ అధినేత సూరి శ్రీరామ మూర్తి (సూరి)భార్య కొలచలచల వారి ఆడబడుచు కావటం తో ఉత్సాహం బాగా వచ్చింది .గుప్తా సూచన ప్రకారం శ్రీరామమూర్తి కృష్ణా జిల్లా లోని సూరి  స్వగ్రామం ఉయ్యూరు లో 1997 ఆగస్ట్ 17 నకోలాచల సీతారామయ్య గారి శత జయంతి ఉత్సవం (అసలైన జయంతి తర్వాత నెల రోజులకు )  నిర్వహించాడు .ఆనాటి పార్లమెంట్ సభ్యుడు శ్రీ దాసరి నాగ భూషణ రావు అధ్యక్షత వహించిన సభ కు విశేష సంఖ్యలో అభిమానులు వచ్చి పాల్గొన్నారు . విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్  వారి చేత రామయ్య గారి  సంక్షిప్త జీవిత చరిత్ర ను  ముద్రింప జేయిస్తానని నాగభూషణం గారు వాగ్దానం చేశారు సభలో .దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్ .వి .రావు గారు సంక్షిప్త తెలుగు అనువాదమూ చేసి సిద్ధపరిచారు .కాని ఇంతవరకు ప్రచురితం కాకపోవటం ఆంధ్రులుగా మన అలసత్వానికి గొప్ప ఉదాహరణ .

డాక్టర్ రామయ్యకు ఒక  పుష్పహారం

రామయ్యగారి అల్లుడు ‘’  ఘెన్ బెరేజోవ్ స్కి’’ రష్యన్ భాషలో రామయ్యగారిపై రాసిన దానికి చక్కని శైలి తో రాజి నరసింహన్ ,అనస్తేషియా శాంఘినా బెజోవ్ స్క(రామయ్యగారి మనుమరాలు ) ఫినిషింగ్ టచ్ ఇచ్చిన ఇంగ్లీష్ అనువాదం ఇప్పుడు ‘’A wreath for Doctor Ramayya ‘’ గా ప్రచురింప బడింది .రష్యన్ ,ఇంగ్లీష్ భాషలలో ప్రతిభ ఉన్న ద్విభాషా విదుషీమణి అనస్తేషియా కోసం  ఈపుస్తకాన్ని ముద్రించ టానికి ముందు   గుప్తా ప్రయత్నించాడు .

తాతగారి మూలాల వెదుకులాటలో ‘’సీతారామయ్య గారి మనవరాలు ‘’

న్యు స్వతంత్ర టైమ్స్ లో వచ్చిన ధారావాహికలో గుప్తా తన తాతగారు రామయ్యగారి కుటుంబ మూలాలను వెదికి ,శోధించి రాసినందు వలన దాన్ని చదివి  చదివిన అనస్తేషియా తన తాతగారి  కుటుంబ మూలాలను  తెలుసుకో గలిగింది . ఆ మూలాలను , తాత గారుపుట్టిన ఊరు, బంధుగణం లను  సందర్శించి జీవితం ధన్యం చేసుకోవాలని భావించింది .గుప్తా కు మనసులోని కోరిక తెలియ జేసింది .ఆమెను  వెంట బెట్టుకొని   గుప్తా హైదరాబాద్ వచ్చాడు .ఆమెకు కొలచల ,సూరి కుటుంబా ల నుండి అపూర్వ హార్దిక స్వాగతం లభించింది .’’సీతారామయ్య గారి మనవరాలు ‘’వచ్చిందని సంబరపడ్డారు .మీడియా కూడా గొప్పగా స్పందించింది .ఆమెను చూసి తాతగారు రామయ్య గారి శాస్త్రీయ పరిశోధనను మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకొన్నది ఆంద్ర లోకం .1963 లో రామయ్యగారు 42 ఏళ్ళ తర్వాత 42 రోజుల పర్యటన కోసం రష్యానుండి ఉయ్యూరు రావటం గుర్తుకొచ్చింది .ఆమెను తమ అడపడుచుగా ఎంతో  అభిమానంగా ఆత్మీయం గా ఆపేక్షగా ఆహ్వానించి పసుపు కుంకుమ చీరా సారే అందజేసి పూలతో సత్కరించారు .ఆంద్ర సంప్రదాయ పద్ధతిలో అనస్తేషియా చీర జాకెట్ తో ,తలలో  పువ్వులతో చేతులనిండా గాజులతో నుదుట యెర్ర కుంకుమబొట్టు తో   ఉయ్యూరుకు రావటం అందర్నీ ఆశ్చర్య పరచింది .ఆమె యెడల అనిర్వచనీయమైన గౌరవం కలిగింది .స్వంత ఆడపదచును గౌరవించినట్లు గౌరవించింది ఉయ్యూరు గ్రామం .

ఢిల్లీ లో అనస్తేషియా గుప్తా ఇంటివద్ద ఎల్లా కాటేజ్ లో ఉంది .గుప్తా చేసిన అనువాదానికి మెరుగులు దిద్దింది తానూ రాసిన దానికి ఆమె సూచించిన విషయాలతో గొప్ప శోభ కలిగిందని సంతృప్తి చెందాడు గుప్త ..ఈ విష్యం లో రాజ్ నరసింహన్ అనస్తేశియాలకు తానూ ఎంతో   రుణ పడి ఉన్నానన్నాడు గుప్త .1963 లో చేసిన అనువాదానికి అచల సహకరించింది .ఇప్పుడు వచ్చిన పుస్తకానికి బాధ్యతా అంతా గుప్తాదే.

గుప్తా కృతజ్ఞతాభి షేకం

చికాగో యూనివర్సిటి ,కార్నెల్ యూని వర్సిటి ,అమెరికా పేటెంట్ ఆఫీస్ లకు రామయ్య గారి విషయం లో  విలువైన సమాచారాన్ని తనకు అందజేసినందుకు గుప్తా క్రుతజ్ఞతలు తెలియ జేశాడు .రామయ్యగారి కుమార్తె లీలావతి కి తాను అడిగిన ప్రశ్నలన్నిటికి ఓపికగా సమాధానాలు ఫోన్ లో చెప్పిందుకు  , ఫైల్ ఆల్బం నుండి ఫోటోలు తీసి ఇచ్చినందుకు ,రామయ్య గారి  సైంటిఫిక్ సర్వే  పై సూక్ష్మ వివరాలు ఇంగ్లీష్  అందజేసినందుకు క్రుతజ్ఞతలు చెప్పాడు గుప్తా .

1997లో ఐ .టి. ఐ.కి పి .ఆర్. వొ. గా ఉన్న ఆర్ .సుందర రాజన్ 1959 ‘’ఐటి ఐ వాణి’’సంచికలను వెతికి బయటికి తీసి అందజేసినందుకు ,సోవియట్ లాండ్ మంత్లీలో పడిన రామయ్యగారి ఫోటోల నెగటివ్ లను  బ్రోమైడ్లను  ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రకటించాడు .గుప్తాకు ఆత్మీయ స్నేహితుడు ప్రముఖ ప్రతిభగల ఫోటో జర్నలిస్ట్  సి .నరసింహారావు లీలావతి పంపిన రామయ్యగారి ఫోటో నెగిటివ్ లను డెవలప్ చేసి ఉయ్యూరు లో ప్రదర్శన పెట్టటానికి సహకరించినందుకు కృతజ్ఞత తెలిపాడు .1959ఏ నెల 20 వ తేదీ సోవియట్ లాండ్ సంచికకోసం ఢిల్లీ  ,మద్రాస్ ,మాస్కో లలో యెంత ప్రయత్నించినా దొరకనిది ,గుల్మొహర్ పార్క్ దగ్గరుండే స్నేహితుడు సి. పి. ఐ. కార్యకర్త ఆనంద్ గుప్తా దగ్గర దొరకటం , ప్రపంచం లోనే అదొక్కటే గా ఉన్న ఆఅరుదైన , అపురూప సంచికను ను ఏంతో ఆనందంగా తన కివ్వటం తన అదృష్టం గా భావించాడు గుప్తా .భారత్ సోవియట్ సత్సంబంధాలకు అది స్పూర్తిదాయకం అంటాడు గుప్తా .

ఢిల్లీ ఐ .ఐ .టి. కి చెందిన డాక్టర్ ఏ సీతారామయ్య ,హైదరాబాద్ బి .హెచ్.ఇ .ఎల్ .కు సంబంధించిన డాక్టర్ హర ప్రసాద్ ,డేహ్రా డూన్ ఇండియన్  ఇన్ ష్టి ట్యూ ట్ ఆఫ్ పెట్రోలియం ఉద్యోగి సుదీర్ సింఘాల్ ,ట్రైబాలజిస్ట్ ప్రముఖులు , ,ఇండియాలో  ట్రైబాలజి సొసైటీ ప్రెసిడెంట్ –డాక్టర్  ఏ.కే భట్ నగర్ ,  సెక్రెటరి వి .మార్టిన్ లు ఈగ్రందాన్ని పబ్లిష్ చేయటానికి కొంత బాధ్యత తీసుకొని గుప్తా భారాన్ని తగ్గించినందుకు కృతజ్ఞతలు తెలుపుకొన్నాడు . రామయ్య గారి సమీపబంధువు (నీస్)డాక్టర్ సూరి శ్రీమతి కు ,ఆమె సోదరులకు ఈ పుస్తకం ముద్రణ రూపం పొందటానికి గ్రాంట్ ను విడుదల చేసినందుకు గుప్తా కృతజ్ఞతా పూర్వక అభినందనలు చెప్పాడు .

కంప్యూటర్ ను ఉపయోగించి అచలా  స్క్రిప్ట్  లో చేసిన అనేక మార్పులను కూర్చి , అందంగా ఆకర్షణీయంగా పుస్తకం రూపు దిద్దుకోవటానికి చేసిన సహాయం మరువలేనిదన్నాడు .మొహమ్మద్ యాసిన్ ,సుమన్ కపూర్ ,నంద కిషోర్ సాపరా ,హరీష్ చతుర్వేది ,సుమీత్ సింఘాల్, మంగళం స్వామినాధన్ లు హార్డ్ వేర్ ,సాఫ్ట్ వేర్ లలతో చేసిన సహాయానికి కూడా కృతజ్ఞతలు ప్రకటించాడు .

ఢిల్లీ లోని పార్లమెంట్ లైబ్రరి స్టాఫ్ అందజేసిన సహకారం చిరస్మరణీయం అన్నాడు గుప్తా .’’నీలిమా వారెకర్’’ వేసిన పెయింటింగ్ ను ముఖ చిత్రంగా ఉపయోగించుకోవటానికి ఆమె అంగీకరించినందుకు ధన్యవాదాలు చెప్పాడు .ఇరవై ఏళ్ళ క్రితం గుప్తా పుస్తకానికి వేసిన పెయింటింగ్ ఇది .కాని అప్పటి ప్రింటర్ లకు ఈ పెయింటింగ్ ను ముద్రించే టెక్నాలజీ తెలియక న్యాయం చేయ లేక పోయారని గుప్తా చెప్పాడు .కార్టో లాబ్స్ వాళ్ళు శ్రమించి  నీలిమ వేసిన పెయింటింగ్ కు  గొప్ప డిజైనింగ్ చేసి ఆకర్షణీయం చేశారని చెప్పాడు .

అనస్తేషియా ,ఆమె పరివారం ఏవ్ జెని  శే,షేనిన్ ,యూరీ ఫ్రోలోవ్ ,ఒలేగ్ మావ్ లోవ్ లు   కాలిఫోర్నియా రాష్ట్రం లోని సాన్ ఫ్రాన్సిస్కో   లో ఉన్న  ‘’ఆస్టేరిక్ స్టూడియో’’ లో ఏంతో శ్రమించి ఈ పుస్తకానికి  ఇంకోక కొత్త అందమైన డిజైన్ ను రూపొందించి అందజేసినప్పటికీ దాన్ని వాడకుండా నీలిమ పెయింటింగ్ నే ముఖ చిత్రంగా వేయటానికి చెప్పలేని కారాణాలున్నాయన్నాడు గుప్తా .దీన్ని ద్వితీయ ముద్రణకు ఉపయోగిస్తానని తెలిపాడు .వారి డిజైన్ ,లే అవుట్ లు ఈ గ్రంధ ముద్రణకు గొప్ప ప్రభావం ,ప్రేరణ  కలిగించాయని ఒప్పుకొని ,అందుకు వారికి కృతజ్ఞతలను  వినయంగా గుప్తా ప్రకటించాడు .

ఇదీ ‘’కేమోటాలజీ పిత కొలచల సీతారామయ్య ‘’గారి చరిత్ర .ఇదే ‘’పుల్లేరు నుండి ఓల్గా దాకా ‘’అనే పేరుతోనూ ‘’,ఉయ్యూరునుండి మాస్కో దాకా ‘’శీర్షికతోను నేను రాశాను .దీనికి మూలం  రామయ్య గారి పెద్దల్లుడు ‘’ఘెన్ శాంఘిన్ –బెరేజోవ్ స్కి రష్యన్ భాషలో  రాసిన దానికి  ’’ ఎ రీత్ ఫర్ డాక్టర్ రామయ్య ‘’(రామయ్యగారికొక పుష్పహారం )అచలా జైన్ ,ఎస్.పి.కే .గుప్తాలు అనువదించిన పుస్తకమే ఆధారం . మక్కీకి మక్కీకి అనువాదం కాదు .అను సరణ  అనుకోవచ్చు . అర్ధ వంతమైన శీర్షికలు పెట్టి విషయ ప్రాధాన్యంగా అందరికి తేలికగా అర్ధమయేట్లు రాశాను .దీనికి మా సరసభారతి కి ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణగారు గొప్పగా స్పందించారు చాల బాగా వస్తున్నాయి ఎపిసోడ్ లు అని అభినందించారు .సూరి శ్రీరామ మూర్తి (హాం రేడియో )ఆర్టికల్స్ చదివి గొప్ప ప్రయత్నం అన్నాడు .తెలుగులో ఇంతవరకు ఎవరూ సీతారామయ్య గారిపై ఇలా రాయలేదని మెచ్చుకొన్నాడు .అంటే ఆ అదృష్టం నాకే దక్కింది అన్నమాట .మా ఊరి వారైన శాస్త్ర వేత్త శ్రీ కొలచల సీతారామయ్య గారి గురించి ఇలా 32 ఎపిసోడ్ లు రాయటం నాకు పరమానందంగా ఉంది .ఈ ఇంగ్లీష్ పుస్తకాన్ని నాకు అమెరికా నుండి పంపి నన్ను చదివింప జేసి,  ఇలా రాయటానికి కారణ భూతులైన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి శతాధిక కృతజ్ఞతలు .

రామయ్య గారి కుటుంబ ఫోటోలు జతచేశాను చూడండి –with young indian freiends 001 with wife 001 ramayya family 001 indian youth with ramayya 001 ramayya 001

సమాప్తం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -17-5-15- ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | 3 Comments

బాదితుదడి ని అమరుడిని -కాలేకూరిప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”న్యాయాన్ని కాపాడండి మిలార్డ్ ”అంటూ అర్ధించిన ఆర్ కె

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కస్టపడి పనిచేయటం అనే తప్పు మాత్రమె చేస్తున్నా -మోడీ

 


s

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పుస్తక పురాణం మరియు పుస్తకానికి పుష్కరాలు – స్వీయ రచనలు – బందా

సప్తగిరి ఛానల్ లో – 18,21 తేదీలలో ఉదయం 7గం.30 నిమిషములకు అవకాశం వుంటే చూడండి, ఇంకా ఈనాడు,బెజవాడ టైమ్సు, సీనియర్ సిటిజను వాణి, పెన్షనర్స వాయిస్,,ఆకాశవాణి,  కృష్ణవేణి ఎఫ్.యమ్ ఛానల్,వంటి పత్రికలలోనూ,  ప్రసార మాధ్యమాలలోనూ కనుపించే నా కవితలు, రాజకీయ విశ్లేషణలు, పుస్తక సమీక్షలు, సీనియర్ సిటిజను వాణిలు,పెద్దల మాటలు, ఆరోగ్యానికి ఆధారాలు, ఆచారాలలోని ఆరోగ్య సూత్రాలు —- ఎన్నో మరెన్నో — చూడండి  — చూశామని ఒక్కమాట చెప్పండి , సలహాలను,ఇవ్వండి — ఇది నా విశ్రాంత జీవనంలోని – రెండవ ఇన్నింగ్స్ –, కొన్ని వందల కవితలు, 25 పైన గ్రంధాలు నా అంతరంగములోని తరంగాలకు సాక్ష్యాలు –  మన ఇతిహాస పురాణాలు మానవ జాతి చరిత్రలనే భావనలో  వ్రాసిన పరిశోధనలు అనేకం – చదివినందుకు ధన్యవాదములు – మీ బందా.

 

పుస్తక పురాణం మరియు పుస్తకానికి పుష్కరాలు – స్వీయ రచనలు – బందా

img114 img115

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”కంచ ”దాటుతున్న వాదన

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

కంచ ఆవల —- నేను నేనే — బందా

img113

Posted in కవితలు | Tagged | Leave a comment

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు గ్రంధం లో -గ్రంధ స్వీకర్తలు వేలూరివారి కుటుంబం ఫోటోలు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు గ్రంధం లో -గ్రంధ స్వీకర్తలు వేలూరివారి కుటుంబం ఫోటోలు

veluri1 001 veluri2 001 veluri3 002 veluri4 001 veluri5 001 veluri6 001 veluri7 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మూడవ ప్రపంచ తెలుగు రచయితల సభలు -నా సమీక్ష -రమ్యభారతి -ఫిబ్రవరి-ఏప్రిల్

మూడవ ప్రపంచ తెలుగు రచయితల సభలు -నా సమీక్ష -రమ్యభారతి -ఫిబ్రవరి-ఏప్రిల్

telugusabhalu1 001 ts2 001 ts3 001 ts4 001

 

Posted in రచనలు | Tagged | Leave a comment

అమ్మకు వందనం –

imggallery

 


గబ్బిట దుర్గా ప్రసాద్
 
 
 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత్ వ్యతిరేకులకే పాక్ సైనిక పగ్గాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జంతు హృదయం -మేనకా గాంధి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దెయ్యం దీవి

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఈ ప్రశ్నలకు జవాబేదీ ?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చైనాతో చెలిమి రాజకీయ పరిష్కారమే శరణ్యం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆలవాలం

 


 
 

 
 

గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://

బౌద్ధ ప్రపంచం

ఆలోచించే ప్రతి వ్యక్తీ ఏదో ఒక ఇజంను ఎన్నుకుంటాడు. ఇజం అంటే జీవితంపై ఒక దృక్పథం, ఒక అవగాహన, ఒక ఫిలాసఫీ ఆఫ్‌ లైఫ్‌ అనొచ్చు. తాను ఎన్నుకునే ఇజంలోని ఆలోచనా విధానం తనకు నచ్చాలి. అంతకన్నా ముఖ్యంగా అది తనకు ఎంత ప్రాధాన్యమిస్తూ ఉందన్నది ఆలోచిస్తాడు. సిద్ధాంతం ఎలా ఉన్నా తనకు సముచిత స్థానం, గౌరవం ఇస్తే దాన్ని స్వీకరిస్తాడు. లేదంటే వదిలేస్తాడు. ప్రస్తుతం ప్రపంచంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో అనేక మేధావులను ఆక ర్షిస్తున్నది గౌతమబుద్ధుని భావజాలం.

దీనికి కొన్ని కారణాలున్నాయి. సైన్స్‌, శాస్త్రీయ ఆలోచనలు అప్పటివరకు ఉన్న మత విశ్వాసాలను పూర్తిగా సడలించాయి. ఆకాశంలో స్వర్గమనే చోట దేవుడున్నాడు, అతడు మనలను శాసిస్తున్నాడు అంటూ మతం చెప్పే కథల్ని అనేకులు ఒప్పుకోవడం లేదు. మతంతో పాటు ముడిపడి ఉన్న నైతిక విలువలు కూడా బలహీనపడ్డాయి. నాస్తికత పెరిగింది. అయినా ఆస్తికుల్లో ఎందరు మంచివాళ్లు ఉంటారు. శాసీ్త్రయ దృక్పథానికీ, మతవిశ్వాసానికీ సంఘర్షణ వచ్చే సందర్భంలో నాస్తికులు మతవిశ్వాసంతో సంబంధం లేని ఆధ్యాత్మికత కోసం అన్వేషిస్తారు. మానవ స్వభావంలో ఉన్న సాత్త్వికగుణం కారణంగా మంచి మార్గాన్నే ఎంచుకోవాలని ప్రయత్నిస్తారు. మతవిశ్వాసంతో సంబంధంలేని ఆధ్యాత్మికత, శాస్త్రీయ చింతన ఏదైనా ఉంటే.. దాన్ని అంగీకరిస్తారు. అందువల్ల దేవునితో సంబంధం లేని ఆధ్యాత్మికత కావాలనుకునే ఆధునికులు అన్నివిధాలా ఆకర్షించే సిద్ధాంతం బుద్ధుని భావజాలం.
ధ్యానం శరణం గచ్ఛామి..
మరోకారణం.. బౌద్ధ బిక్షువులు, ముఖ్యంగా టిబెట్‌కు చెందిన వాళ్లు ధ్యానం, సమాధి మొదలైన వాటిపై శ్రద్ధతో సాధనలు చేశారు. ఈ సాధనలు మనస్తత్త్వ శాస్త్రాల్ని ఆకర్షించాయి. శాస్త్రవేత్తలు బౌద్ధబిక్షువులు కలిసి మనసు, దాని నియంత్రణ మొదలైన వాటిపై ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ధోరణిలో ఇటీవల Sam Harris అనే ప్రముఖ అమెరికన్‌ నాస్తిక రచయిత రాసిన ‘Waking Up & A Guide to Spirituality Without Religion’ చూడవచ్చు. చాలా ఏళ్లుగా తన సొంత మతాన్ని విమర్శిస్తూ నాస్తికవాదాన్ని ప్రచారం చేసిన ఈయన భారతీయ సిద్ధాంతాలను పరిశీలించాడు. వాటిలో ముఖ్యంగా బౌద్ధానికి చెందిన విపశ్యనాయోగంలోని ధ్యాన పద్ధతులను సాధన చేశాడు. ధ్యానం ద్వారా తను పొందిన అనుభవాలను పై పుస్తకంలో వివరించాడు. ధ్యానపద్ధతులు అధునిక మనస్తత్త్వశాస్త్రంలో Mindfulness meditation పేరిట చాలా ప్రాచుర్యం పొందాయి. మతవిశ్వాసంతో అవసరం లేకుండా ఎలాంటి వాడైనా ఈ ధ్యానం చేసి లాభం పొందవచ్చు. ఒక వ్యక్తి తన కోపిష్టి స్వభావాన్ని విశ్లేషించుకోవడానికి ధ్యానం చేయవచ్చు. మరొకరు జీవితంలో మరొక సమస్య గురించి చేయవచ్చు. ఒక మీటింగుకు వెళ్లే మేనేజర్‌ తను మాట్లాడబోయే విషయాన్ని గురించి.. ఇలా ఏ విషయంలోనైనా ఈ ప్రక్రియ వాడవచ్చు. ఈ విషయాలతో పాటు బౌద్ధమతంలోనూ, అద్వైత వేదాంతంలోనూ చెప్పే జ్ఞానపద్ధతులను (Epistemology) కూడా రచయిత ఆ గ్రంథంలో వివరించాడు. నేను ఎవరు (who am I ?) అన్న విషయంపై రెండు మతాల్లోనూ దాదాపు ఒకే విధమైన విశ్లేషణ ఉంటుంది. ఈ రెండింటినీ హారిస్‌ తన రచనలో వివరించాడు. దీనివల్ల పాశ్చాత్యదేశాల్లోని యువత ఎలాంటి ఆలోచనా ధోరణిలో ఉన్నారన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇటీవలి ఒక సర్వే ప్రకారం అమెరికా యువకుల్లో 25 శాతానికిపైగా మంది తమ విధానం Spiritual but not rel-igious (SBNR) అని చెప్పుకోవడం విశేషం
ధర్మం శరణం రక్షామి..

పై చర్చంతా బుద్ధుడు నాస్తికుడు అని భావించి చెప్పినది. కానీ నిజంగా బుద్ధుడు దేవుడు ఉన్నాడని కానీ, లేడని కానీ చెప్పలేదు. బుద్ధుడు సమాజంలో అందరికీ ప్రాధాన్యం ఇచ్చిన కారణంగా ఆ మతం ప్రజలకు చేరువైంది. దాదాపు పది శతాబ్దాలపాటు హిందూ మతంతో సమానంగా వ్యాపించింది. అలాంటిది ఎందుకు బలహీనపడిందన్న విషయంపై అంబేద్కర్‌ మొదలైన ప్రముఖులు చారిత్రక కారణాలను చెప్పారు. అంబేద్కర్‌ బౌద్ధమతం స్వీకరించడం మన సాంఘిక చరిత్రలో గొప్ప సంఘటన. అన్ని మతాల స్వరూపాన్ని గమనించిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రిటిష్‌ వారి విధానాల వల్ల వర్గాలుగా చీలిపోతున్న ప్రజలను భారతీయ సంస్కృతిలోనే ఉండేటట్టు చేసి దేశంలో అంతర్గత కలహాలు నివారించి శాంతికి తోడ్పడ్డాడని చెప్పవచ్చు. ‘బౌద్ధం దేశ అఖండతను కాపాడే తత్వం’ అని, దేశ సమగ్రత కోరేవాళ్లు.. బుద్ధుని, అంబేద్కర్‌ మార్గాన్ని పాటించాలని ఇటీవల కత్తి పద్మారావుగారు చెప్పడ ం చాలా ప్రశంసనీయం.

ఇదం బ్రాహ్మం..

ప్రస్తుతం బుద్ధుడి గురించి చెప్పేవారు బౌద్ధ సిద్ధాంతంలోని గొప్పదనాన్ని, ఉపనిషత్తులకూ ఆ సిద్ధాంతానికీ ఉన్న అనేక పోలికలు మొదలైన వాటిని విశ్లేషించడం లేదు. సామాజిక సిద్ధాంతం విశ్లేషణ మాత్రమే జరుగుతోంది. ముఖ్యంగా బుద్ధుడిని వైదిక ధర్మ వ్యతిరేకిగా చిత్రీకరించడం, అతడు బ్రాహ్మణులను నిందించాడని చెప్పడం వింటుంటాం. కానీ చాలా మంది పాశ్చాత్యులు కూడా ఈ వాదంతో ఏకీభవించారు. ఉదాహరణకు J.E. Jennings అనే రచయిత ఇలా అంటాడు ‘”It should never be forgotten that Buddhism is a reformed Brahmanism, as is evidenced by the invariably honorific use which Gautama makes of the title Brahmin’ (The Vedantic Buddhism of Buddha). అలాగే Rhys Davids దంపతులు బౌద్ధంపై రాసిన పుస్తకాల్లో ఇదే భావాలను చెప్పారు. ’బౌద్ధమతం సాంప్రదాయక విశ్వాసాల నుండే పుట్టింది. వాటితో పరిపుష్టమైంది’ (Rhys Davids – Buddhism p.85). బుద్ధుడు స్వయంగా చెప్పిన బోధనలు అని భావించే దమ్మపదంలో బ్రాహ్మణవర్గ అని ఒక అధ్యాయం ఉంది. బుద్ధుడు ఎంత గౌరవభావంతో ఈ పదాన్ని ప్రయోగించాడో చూడగలం. ఎవడు నిజమైన బ్రాహ్మణుడు అనే విషయంపై వేదవ్యాసుడు భారతంలో గాని, భాగవతంలో గాని వాడిన ఘాటైన మాటలతో పోలిస్తే.. బుద్ధుడు చె ప్పిన మాటలు ఎంతో గౌరవప్రదంగా ఉన్నాయి.

ఇదం బౌద్ధం..

బుద్ధుడు తన జీవితకాలంలో ఏం చెప్పాడ న్నది యధాతథంగా తెలియదు. అతని నిర్యాణం జరిగిన వందేళ్ల తర్వాత అతని శిష్యపరంపరలోని వారు బుద్ధుని బోధనలు సంగ్రహించి మూడు విభాగాలుగా చేసినట్లుగా చరిత్ర చెబుతోంది. వీటిని త్రిపిటకములు అన్నారు. పిటకము అంటే బుట్ట. ఆ కాలంలో తాటాకుల పుస్తకాలను బుట్టలో భద్రపరిచే వారు. ఈ మూడు పిటకాల పేర్లు వినయ పిటకము, సుత్త పిటకము, అభిదమ్మ పిటకము. వీటిలో అభిదమ్మ పిటకంలో తత్త్వానికి సంబంధించిన చర్చ ఉంటుంది. తర్వాతి కాలంలో నాగార్జునుడు మొదలైన వారు దీన్ని విస్తరించారు. వీటిలో చాలా విషయాలు ఉపనిషత్తులకూ. అద్వైత వేదాంతానికీ ఎంత దగ్గరగా ఉన్నాయంటే ఒకరిని చూసి ఒకరు కాపీ కొట్టారా అన్నట్లుంటుంది. వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం ఇద్దరూ ఒప్పుకుంటారు. ఇద్దరూ ప్రపంచం మిథ్య అంటారు. ప్రతీత్య సముత్పాదం (doctrine of dependent origination) ఉపనిషత్తుల్లో మధుబ్రాహ్మణంను పోలి ఉంటుంది. చైతన్యం గురించి బౌద్ధవిద్వాంసులు, శంకరాచార్యులు ఒకే రీతిలో చెబుతారు. అందుకే బుద్ధుని తర్వాత వాడైన శంకరాచార్యుడిని ప్రచ్ఛన్న బౌద్ధుడు అన్నారు. వేదాంతం ముసుగు కప్పుకున్న బౌద్ధుడు అని హిందూమతంలోని వారే కొందరు విమర్శించారు.

ప్రస్తుతం మనదేశంలో జాతీయవాదులు కొంతవరకు బుద్ధుడిని గురించి చెబుతున్నా.. ఒకప్పుడు బుద్ధిజంను ఆదరించిన వార్గాలు మాత్రం ఇతరమత ప్రచారాల ప్రభావంలో ఉన్నట్టు కనిపిస్తుంది. మేధావులు కొందరు బుద్ధుడి గురించి మాట్లాడుతూ పనిలో పనిగా బ్రాహ్మణులను విమర్శించి తన సామాజిక బాధ్యత పూర్తయిందని భావిస్తారు. దీనివల్ల బౌద్ధమతానికి ఎలాంటి లాభమూ లేదు. మరెవరో లాభం పొందుతారు. నిజంగా ఆనాడు బుద్ధుని ప్రథమ శిష్యులు, బౌద్ధ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది బ్రాహ్మణులే. ఇప్పుడు కేవలం విమర్శలు కాకుండా దళిత వర్గాల్లో ప్రచారం చేయగలిగితే ఎందరో దానిలో భాగస్వాములవుతారు.
(రచయిత ప్రసంగాలను www.advaitaacademy.org అనే వెబ్‌సైట్‌లో చూడవచ్చు)

డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వరంగల్ పోరడు ఫార్మసీ ధీరుడు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చట్ట సవరణలు ,నసీబ్ వాలా ,కేంద్రం దిగి రాదా/

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

 

1-సంస్కృతాంధ్ర ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి

తెలుగు ,సంస్కృతాలలో ఏం ఏ .పి.హెచ్ .డి.చేసిన శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు విద్యలకు పుట్టినిల్లు విజయనగరం జిల్లా దేవాడ లో లో 22-9-1942 జన్మించారు .తండ్రి గారు వేదుల కృష్ణ మూర్తి గారు తల్లిగారు మారువాడ వారి ఆడబడుచు వెంకట రమణ ,రామలక్ష్మి గార్ల కుమార్తె శ్రీమతి రామలక్ష్మి .

విద్యా వైదుష్యం

శాస్త్రిగారు విశాఖ పట్నం సి .బి .ఏం హైస్కూల్ లో సెకండరీ విద్య నేర్చి ,మిసెస్ ఏ.వి.యెన్ కాలేజి లో డిగ్రీ చదివారు ఆంద్ర విశ్వ విద్యాలయం లో చేరి తెలుగు ,సంస్కృతాలలో ఏం .ఏ. లో ఉత్తీర్ణత సాధించి ,పిమ్మట ఆ రెండుభాషలపై గల అభిమానం తో పి హచ్ .డి. లను కూడా పొందారు .విద్వత్ పట్ట భద్రులైన తండ్రి కృష్ణ మూర్తి శాస్త్రి గారు సంస్కృతాంధ్ర సాహిత్య తత్వాన్ని వాత్సల్యం తో ఉపదేశించారు .దానిని శాస్త్రి గారు సద్వినియోగం చేసుకొన్నారు .ఆంద్ర విశ్వ విద్యాలయం లో సంస్కృతాంధ్ర సాహిత్య వైభవాన్ని ఆత్మీయతతో బోధించారు ఆచార్య గంటి జోగి సోమయాజి గారు .శాస్త్రి గారి గురు పరంపరలో ‘’కళా ప్రపూర్ణ ‘’దువ్వూరి వెంకట రమణ శాస్త్రి ,ప్రాచార్య,’’ యశస్వి’’ ,ఎస్వీ జోగారావు ,వంటి ఉద్దండులున్నారు .విద్వత్ శిరోమణి ‘’,వాచస్పతి ‘’అప్పల  సోమేశ్వర శర్మ పుత్ర వాత్సల్యం తో ఎన్నో శాస్త్రవిజ్ఞానపు మెళకువలు కరతలామలకం చేశారు .సద్గురు శివానంద మూర్తి మహర్షి సత్తముల  ఉత్సాహ ప్రోత్సాహాలు అమృత వర్షమై శాస్త్రిగారిని తనియింప జేస్తున్నాయి .’’త్వమేవాహం ‘’భావాన్ని బోధించారు శ్రీ గట్టు నారాయణ గురూజీ సోదరులు . ఇంతమంది మహనీయుల ఆశీస్సులతో తమ విద్యా శాస్త్ర ప్రామాణ్యాన్ని మెరుగు పరచుకొన్న ధన్య జీవులు శాస్త్రి గారు .

ఉద్యోగ సోపానం

తెలుగు గీర్వాణ భాషల లోతులను తరచి చూసిన శాస్త్రిగారు  1965-75 వరకు విశాఖ పట్నం లో తాను విద్య నేర్చిన మిసెస్ ఏ వి యెన్. కాలేజిలో తెలుగు లెక్చరర్ గా పని చేశారు .1975-2002వరకు ఆంధ్రా యూని వర్సిటి లో లెక్చరర్ గా చేరి ,వరుసగా పదోన్నతి పొంది రీడర్ గా ,ప్రొఫెసర్ గా ఎదిగి ,తెలుగు శాఖ ముఖ్య ఆచార్యులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు 1976 లో అమెరికాలోని విస్కాన్సిస్ స్టేట్ యూనివర్సిటి లో ఉద్యోగించారు .చదువుకున్న గురువులవద్ద వారితో బాటు పనిచేస్తూ విద్యార్ధులకు బోధించే  అదృష్టం శాస్త్రిగారికి దక్కింది .

సాహిత్యార్ధాంగి

శాస్త్రి గారి జీవిత భాగస్వామిని నిత్య జిజ్ఞాసువు అయిన శ్రీమతి ప్రభావతి గారు .ఏం.ఏ .పట్ట భద్రురాలు .సంస్క్రుతాన్ద్రాధ్యయనం చేసిన విదుషీమణి .జీవితం లోనే కాక శాస్త్రిగారి సాహిత్యం లోనూ ఆమె సాబాలు (సగం పాలు )పంచుకొన్నారు .

రచనా పాటవం

శాస్త్రి గారే చెప్పుకొన్నట్లు సాహిత్య జీవితం లో సాహిత్య ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రసంగాలు సహస్రాదికంగా చేశారు వీటిని గ్రంధ రూపం లోకి తెచ్చి లోకానికి విలువైన గ్రంధాలను అందించారు .కనీసం ౩౦౦ గ్రంధాలకు పరిష్కరణ పూర్వకం గా ముందుమాటలు సమీక్షలు రాశారు .వివిధ అంశాలపై ఆకాశవాణిలో అనేక ప్రసంగాలను చేసి శ్రోతలను మెప్పించారు .శాస్త్రిగారి శిష్యపరంపర అగణితం .

శాస్త్రిగారు తమ సంస్కృత విద్వత్తును సార్ధకం చేసుకొన్నారు .పఠన ,పాఠనలేకాక గ్రంధ రచనా చేశారు సంస్కృతం లో 1.వరూధినీ ప్రవరం 2. కల్యాణం అనే ఏకాంకికలు 3.తత్వ మసి అనే మూడు రచనలు చేశారు  ప్రవర వరూదినుల విషయం పెద్దన గారి మనుచరిత్ర మాతృకగా కలది .ఇదే వీరి తోలి రచనకూడా .కల్యాణం ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వర కల్యాణం .దీనిని గురుదేవులు దువ్వూరి వారికి అంకితమిచ్చి గురూణం తీర్చుకొన్నారు .కాని దువ్వూరు వారి జీవితాకాలం లో పుస్తకం రాలేదు వారి మరణానంతరమే వెలువడింది .శ్రీ మద్రామాయణేపురుషార్ధ వివేకః అనేగ్రందాన్ని రాశారు –ఇది ఇప్పటికి అముద్రితం .

తెలుగులో చాలా గ్రంధాలు రాశారు శాస్త్రిగారు .అందులో అష్ట దిగ్గజాలు ,భాగవత సుధా ,,పంచ తంత్ర చంపువు ,ఆధ్యాత్మిక వ్యాసమంజరి ,భారతం లో శాంతి పర్వం ,భారత భారతి ,సుబ్రహ్మణ్య భారతి ,జానపద గేయ సాహిత్య ప్రభ ,శంకర భగవత్పాదుల శివానందలహరికి  ,సౌందర్య లహరి లకు వ్యాఖ్య ,ఆధ్యాత్మ రామాయణం లో అపూర్వ కల్పనలు రాసి సంస్కృత ఆధ్యాత్మ రామాయణాన్ని తెలుగు లోకి అనువాదమూ చేశారు .అలాగేసంస్కృత  అద్భుత  రామాయణాన్నీ తెలుగు చేశారు .బాల రామాయణం ,రామాయణ ప్రసంగ లహరి రాశారు .ఉత్తర రామాయణం వాల్మీకి మహర్షి రచన కాదని శాస్త్రిగారు తేల్చి చెప్పారు .’’ఉత్తర కాండ ‘’పేరుతొ సంక్షిప్త సరళ  వచన రచన చేశారు .,రామాయణ౦ లో ఇంతటి విశేష కృషి చేసిన శాస్త్రిగారు భాగవతం వైపుకు దృష్టిని మరల్చి’’ భాగవత రసాయనాన్ని’’ కడుపార గ్రోలమని అందించారు .తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున బ్రహ్మ వైవర్త పురాణానువాదం చేసి  లోకోపకారం చేశారు  ఆది శంకరాచార్యులవారు  రాసిన అయిదు ప్రకరణాలు ,అపరోక్షానుభూతి 2.ఆత్మా బోధ  ను తెలుగు చేశారు .శతక సాహిత్యం లోనూ ప్రవేశించి ‘’శంభూ శతకం ‘’రాశారు .

మాఘమహాకవి సంస్కృతం లో రచించిన ‘’శిశుపాల వధ ‘’కావ్యం లోని అమూల్యమైన విశేషాలను రసజ్ఞులకు పరిచయం చేయాలన్న సత్ సంకల్పం తో ‘’మాఘ కావ్యామృతం ‘’రచించారు .వివిధ పత్రికలలో ప్రచురితమైనవి, ,జాతీయ సదస్సులలో సమర్పింపబడిన పత్రాల వ్యాసాలను ‘’భారద్వాజ వ్యాసావళి ‘’గా ప్రచురించారు .వీరి పుస్తకాలను కొన్నిటిని కరీం నగర్ జిల్లా మందని లోని ‘’శ్రీ సీతారామ సేవా సదన్ ‘’వారు సభక్తికంగా ప్రచురించి  అందించారు .

అందుకొన్న బిరుదులూ సత్కారాలు

వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ‘’ ఆచార్య సార్వ భౌమ ,విజ్ఞాన వివేక భూషణ ,వాణీ విభూషణ ,ఆధ్యాత్మిక రత్న ,వాజ్మయ కళా ప్రపూర్ణ ,సాహితీ కళా సమ్రాట్ ,ఆంద్ర రత్న’’ బిరుదులు  అందుకొన్నారు .ఇవన్నీ అన్వర్ధాలే నని మనకు తెలిసిన విషయమే .

నడిచే సరస్వతి అనిపించే శాస్త్రిగారికి విశాఖ పట్నం శ్రీ శంకర మఠం సంస్థానం ‘’సువర్ణ సింహ లలాటం ‘’తో సత్కరించి సన్మానించింది .శ్రీ గణపతి సచ్చిదానంద  స్వామి వారి స్వహస్తాలనుండి ‘’సువర్ణ కంకణ సన్మానం ‘’అందుకొన్నారు .సద్గురు శ్రీ కందుకూరు శివానందుల సంస్థ నుండి ‘’శ్రీ శివానంద ఎమినేంట్ సిటిజెన్ పురస్కారం ‘’అందుకున్న పుంభావ సరస్వతులు శాస్త్రిగారు .వివిధ సాహిత్య ఆధ్యాత్మిక సంస్థలు విశిస్టవ్యక్తులు శాస్త్రి గారికి చేసిన సత్కారాలు లెక్కకు మించి ఉన్నాయి .

73 వసంతాల శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు  సాహిత్య ,ఆధ్యాత్మిక విషయాలలో నిత్య యవ్వనులై వాజ్మయ  శారదా పీఠ పాదార్చన చేస్తున్న ధన్య జీవులు  .

మనవి –సరసభారతికి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా )గారి బావ గారు డా శ్రీ రాచకొండ నరసింహ శర్మ ఏం డి .గారు(విశాఖ పట్నం) ‘’ఆచార్య సార్వ భౌమ’’ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి సరసభారతి ప్రచురించిన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’ గ్రంధాన్ని పంపగా వారు అందుకొని నాకు వారు రచించిన అమూల్య గ్రంధాలను ఏడింటిని  పంపారు .వారికి నేను వెంటనే ఫోన్ చేసి క్రుతజ్ఞాత తెలియ జేశాను .నేను చేసిన కృషిని వారు అభినందించారు

శాస్త్రి గారు సంస్కృతం లో గ్రంధ రచన చేశారని ఈ పుస్తకాలు వచ్చేదాకా నాకు తెలియక పోవటం నా అజ్ఞానానికి ప్రతీక .తెలిసిఉంటే’’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’లో వారిని గురించి రాసి ఉండేవాడిని  . పుస్తకాలు అందగానే ఫ్లాష్ గా  ‘’గీర్వాణకవుల కవితా గీర్వాణం -2 ‘’రాస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చి , అందులో సుబ్రహ్మణ్య శాస్త్రి గారినే తొలికవిగా రాయాలని అనుకోని వారి గ్రందాలనుండే విషయ సేకరణ చేసి ఈ మొదటి ఎపిసోడ్ రాశాను .

శ్రీ గోపాలకృష్ణ గారు వారం క్రితం నాకు పంపిన కృష్ణమాచార్ ఆంగ్లం లో రాసిన సంస్కృత  కవుల చరిత్ర లో ఇంకా ఎవరైనా కవులు మిగిలిపోతే వారిపై కూడా రాస్తూ ,మరెవరైనా గీర్వాణ రచన చేసిన వారుంటే వారిపైనా  రాసి  ఈ రెండవ  భాగం లో చేర్చాలని  సంకల్పం .

శాస్త్రిగారి ఫోటో జత చేశాను చూడండి

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -14-5-15- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్పందన

vedula letter 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నిరాశాకంటే భ్రమే నయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు గ్రంధా విష్కరణ

శ్రీ హనుమజ్జయంతి  13-5-15 బుధవారం నాడు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఉదయం అభిషేకం హోమం ,తర్వాత త్సమలపాకు పూజ ,ఆ తర్వాత పూర్ణాహుతి జరిగాయి .తర్వాథ శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారలకు శాంతి కళ్యాణ మహోత్సవం జరిగింది .నేను రాసిన ”దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు ”గ్రంధాన్ని శాసన మండలి మాజీ సభ్యులు శ్రీ వై .వి.బి. రాజేంద్రప్రసాద్ ,శ్రీమతి భ్రమరాంబ దంపతులు 500 మంది భక్తుల సమక్షం లో ఆవిష్కరించారు ఇది సరసభారతి 79 వ సమావేశం .ఆతర్వాత దగ్గరే ఉన్న ఆర్య వైష్యకల్యాణ  మండపం లో సుమారు ఏడువందల మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించాం  -దుర్గాప్రసాద్

http://wp.me/p1As8O-1KS

https://plus.google.com/u/0/photos/107563242221333034923/albums/6148321897961192561/6148321903106803762

 

https://plus.google.com/u/0/115752370674452071762/posts/9GXxb92i5md?pid=6148305944156197138&oid=115752370674452071762

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

పద్యo జీవనది


 
 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అక్షర యోధుడు ఎస్ వి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కధల్లో రస ,ధ్వని

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భూతల స్వర్గం — ఈ వారం స్పెషల్

భూతల స్వర్గం — ఈ వారం స్పెషల్

  • 10/05/2015
  •  -బి.వి.ప్రసాద్

అత్యంత ప్రాచీన, అత్యాధునిక సమాజాలకు ప్రతీక సింగపూర్. అక్కడ ఏమీ తయారుకాదు, కాని ప్రతీదీ దొరుకుతుంది. ప్రజల్లో నిజాయితీ, పాలనలో పారదర్శకత, ప్రభుత్వంలో చిత్తశుద్ధి. చివరికి ప్రజలు అంతా సుఖసంతోషాలతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో సింగపూర్ ఈ రోజు అగ్రరాజ్యాలకు సైతం ఆదర్శవంతంగా ఎదిగింది. ఈ ఎదుగుదల రాత్రికి రాత్రి జరిగింది కాదు, ‘దేశం కోసం’ అనే భావన ప్రజల్లో నరనరాన జీర్ణించుకుపోయి దాదాపు 700 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతూ, ప్రపంచం పట్టించుకోని దశలో అక్కడి ప్రజలే తమను తాము సంస్కరించుకునే ప్రయత్నం ఈ రోజు అత్యధిక జీడీపీ స్థాయికి తీసుకువచ్చింది. శతాబ్దాల చరిత్ర ఉన్నా, అత్యంత వేగంగా అభివృద్ధిని సాధించింది మాత్రం గత 50 ఏళ్లలోనే. పూలౌ ఉజోంగ్..పూలౌచంగ్ గానూ కాలక్రమంలో సింగపురగా మారిన అతి చిన్న జనావాస ప్రాంతమే సింగపూర్. ప్రపంచంలో అతి చిన్న పట్టణమే ఒక దేశంగా ఉన్న సింగపూర్ చుట్టూ సముద్రమే. దేశ భూభాగాన్ని పెంచే అవకాశం లేదు. ఏం చేద్దామన్నా సరిపడా భూమి లేదు, ఏదీ ఉత్పత్తి కాదు, గనులు, చమురు వంటి సహజ సంపద లేదు, పరిశ్రమలు లేవు, పెడదామంటే చోటు లేదు ఇలాంటి అననుకూల పరిస్థితులను కూడా సింగపూర్ తమకు అనుకూలంగా మలుచుకుంది. జనాభా పెరిగితే వారి కనీస అవసరాలు తీర్చేందుకు సరిపడా ఆకాశాన్నంటే హర్మ్యాలు, అందులోని అంతస్తుల్లో పచ్చదనం, సౌకర్యవంతమైన జీవనానికి కావల్సిన పరిసరాలతో అలరారేలా సింగపూర్ అభివృద్ధి చెందింది. ఆధునిక అవసరాలను ముందుగా ఊహించడం, తదనుగుణమైన వ్యూహాలతో ముందుకు సాగడం వల్లనే సింగపూర్ ఇపుడు ప్రపంచంలో నెంబర్ వన్‌గా ఉంది. అమెరికా, చైనా, రష్యా వంటి అగ్రదేశాలను సైతం బెంబేలెత్తిస్తున్న అభివృద్ధితో సింగపూర్ ముందుకు దూసుకుపోతోంది. అసలు ఈ సింగపూర్ ఇంతలా ఎలా అభివృద్ధి సాధించింది? అందరికీ ఎలా ఆదర్శప్రాయమైంది అనేది అందరి మెదళ్లలో మెదిలే ప్రశ్న. మలేషియాకు దక్షిణాన 704 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న దక్షిణాసియాలోని అతి చిన్న దేశం సింగపూర్. దీని అధికారిక పేరు రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్. ఒక చిన్న ద్వీపమే ఈ మహానగరం- ఈ మహాదేశం. ఇందులో ప్రధాన ద్వీపంతో కలిపి 63 ద్వీపాలున్నాయి. ప్రారంభంలో ఈ ద్వీపం ‘సుమత్రన్ శ్రీ వజయ్’ సామ్రాజ్యంలో ‘తమ్‌సెక్’ అంటే సముద్ర పురం అనే జపనీస్ పేరుతో వ్యవహరించేవారు. క్రీ.పూ 2వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకూ వ్యాపార కేంద్రంగా ఇది విలసిల్లింది. 16వ శతాబ్దం నుండి 19 శతాబ్దం వరకూ ఇది జోహార్లో భాగంగా ఉంది. 1819 సంవత్సరం జనవరి 29న ఈ ద్వీపానికి వచ్చిన థోమస్ స్టాన్ ఫోర్డ్సు రాఫిల్స్ భౌగోళికంగా సింగపూర్ వ్యాపారానికి అత్యంత అనుకూలమైన ప్రదేశంగా గుర్తించి ఈస్టిండియా కంపెనీ తరఫున బ్రిటిష్ వ్యాపార కేంద్రంగా అభివృద్ధి పరిచే ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందమే దేశంలో ఆధునిక యుగానికి నాంది పలికింది. అంతర్జాతీయంగా ఇక్కడకు వచ్చి నివసించే వారిపై పౌరసత్వ కట్టుబాట్లు నిర్బంధం లేని కారణంగా వివిధ సంస్కృతులకు చెందిన ప్రజలు ఇక్కడ స్థిరపడటం ఆరంభం అయింది. 1819లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ అడుగుపెట్టేసరికి ఇది మలయ్, ఒరాంగ్ లాట్ జాలర్లు నివసించే చిన్న గ్రామం. బ్రిటిష్ వాళ్లు దీనిని రవాణాకు వాడుకున్నారు. 1867 నాటికి ఇది బ్రిటిష్ సామ్రాజ్యపు ఛత్రం కిందకు వచ్చింది. బ్రిటిష్ కాలనీ ఆరంభం నగర నిర్మాణ వ్యూహాలతో నగరాన్ని సంస్కృతి పరంగా విభజించింది. సింగపూర్ నదీ ప్రాంతం వ్యాపారులకు, బ్యాంకర్లకు ఆలంబనగా మారింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఫిబ్రవరి 15 తర్వాత ఆరు రోజుల యుద్ధం అనంతరం జపాన్ దీనిని స్వాధీనం చేసుకుంది. 1945 సెప్టెంబర్ 12న తిరిగి బ్రిటిష్ వారి పరమైంది. 1963లో మలేషియా ఏర్పడినపుడు దానిలో భాగంగా ఉండి రెండేళ్ల తర్వాత సైద్ధాంతిక విభేదాలతో విడిపోయి 1965 ఆగస్టు 9న స్వతంత్ర గణతంత్ర దేశంగా మారింది. అదే ఏడాది సెప్టెంబర్ 21న ఐక్యరాజ్యసమితిలో 117వ దేశంగా చేరింది. 1970లో అలీన ఉద్యమంలో చేరింది. తీవ్రమైన నిరుద్యోగం, గృహ సంక్షోభం ఎదుర్కొంటూ సింగపూర్ ఆధునికతపై దృష్టిసారించింది. తయారీ పరిశ్రమ స్థాపన, అతిపెద్ద ప్రజా గృహ భూముల అభివృద్ధి, ప్రజా శిక్షణపై పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టింది. స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాతనే సింగపూర్ జీవన శైలి గణనీయంగా మెరుగుపడింది. ఈ అభివృద్ధిలో వ్యవస్థాపక పితామహుడు లీ క్వాస్ యు లీ కృషి అనన్యసామాన్యం. తన ప్రగతి శీల విధానాలతో సింగపూర్ దిశ, దశను మార్చేశాడు. ఇష్టంలేని విభజనతో ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న సింగపూర్‌ను లీక్వాస్ యూ అభివృద్ధిలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిపారు. విదేశీ పెట్టుబడులు, మరో పక్క ప్రభుత్వ విధానాలన్నీ యంత్రీకరించడం, ఎలక్ట్రానిక్ పద్ధతులు అమల్లోకి రావడం, ఐటి కంపెనీలు ఏర్పాటై ఆధునిక ఆర్ధిక రంగం ఉద్భవించింది. అనతి కాలంలోనే ఉన్నతమైన అభివృద్ధి సాధించి స్వేచ్ఛామార్కెట్ ఉన్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. శక్తివంతమైన అంతర్జాతీయ వాణిజ్య బంధాలు, జపాన్ కాకుండా ఆసియాలో అత్యధిక తలసరి ఆదాయంతో గరిష్ట స్వదేశీ ఉత్పాదనను కలిగి, ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా మారింది. ఐదు దశాబ్దాలుగా అభివృద్ధి సింగపూర్‌కు శతాబ్దాల చరిత్ర ఉంది…కాని అభివృద్ధిలో మాత్రం ఈ 50 ఏళ్లలోనే తన సత్తా చూపింది. సింగపూర్ అంటే రెండు మలయ్ పదాల కలయక. సింగ అంటే సింహం, పుర అంటే పురము అనే పదాలతో ఆ పేరు వచ్చింది. చారిత్రక ఆధారాల ప్రకారం 14వ శతాబ్దపు సుమత్ర ద్వీప యువరాజు సంగ్ నిల ఉతమ తుపానులో చిక్కుకుని ఈ దీవిలో అడుగుపెట్టినపుడు అతనికి ఒక మృగం కనిపించింది. సింహం తలలా ఒక వింత జంతువు కనిపించినందుకు ఈ పేరు పెట్టారని చెబుతుంటారు. విచిత్రం ఏమంటే సింగపూర్‌లో సింహాలు లేవు, ఉన్నవల్లా మలయ్ పులులే. అన్ని రంగాల్లో.. నెంబర్ వన్ అందర్నీ ఆకర్షిస్తున్న సింగపూర్ నేడు ఏ రంగంలో తీసుకున్నా నెంబర్ వన్. ఉత్తమ పారిశుద్ధ్య నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం, ఐటి రంగాల్లో ప్రపంచంలోనే మేటి. అక్కడ ప్రభుత్వం విధించిన నియమనిబంధనలు, పౌరుల్లో జవాబుదారీతనం, నిజాయితీయే దీనికి కారణం. స్థూల జాతీయ ఉత్పత్తిలో సింగపూర్ ప్రపంచ దేశాల్లో ఆర్ధికంగా 13వ స్థానంలో నిలిచేలా చేసింది అదే. ఎకనామిస్టు పత్రిక సర్వే ప్రకారం ఆసియా దేశాల్లో అతి ఉత్తమమైనది సింగపూర్ , ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది. వ్యాపార, ఆర్ధిక రంగాల్లో, అభివృద్ధి చెందిన సింగపూర్ ఇటీవలే ‘కాసినోవా’ అని పిలిచే పాశ్చాత్యుల జూదగృహాన్ని నిర్మించడంతో, ధనవంతులైన వ్యాపారవేత్తలను బాగా ఆకర్షిస్తోంది. అంతేగాక, అత్యంత విలాసాలకు పెట్టింది పేరుగా చక్కటి పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన ఈ దేశంలో చైనా, మలయ్, భారత్‌లకు చెందిన వారు ఎక్కువగా స్థిరపడటంతో విభిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. విలాస జీవనం పర్యాటకరంగంలోనే కాదు, విద్య, ఆరోగ్యరంగాల్లోనూ సింగపూర్ అభివృద్ధి పథంలో ఉండటంతో విదేశీయులను సైతం పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తూ వైద్య ఆరోగ్య పర్యాటక కేంద్రంగా మారింది. ఆ దేశం ఆర్ధిక వనరుల్లో పర్యాటక రంగం ప్రధాన భూమికను పోషిస్తోంది. తేలికగా వీసాలు సింగపూర్ వెళ్లేవారికి విమానాశ్రయాల్లోనే తాత్కాలిక వీసాను మంజూరు చేసే ఏర్పాటు ఉంది. చాలా సులువుగానే పర్యాటక వీసాలను మంజూరు చేయడం కూడా అనేక మందిని సింగపూర్ వైపు ఆకర్షితులయ్యేలా చేస్తోంది. అన్నీ చూడాల్సినవే సింగపూర్ వెళ్లామంటే ఒకటో రెండో కాదు, అన్నీ చూడాల్సినవే ఉంటాయి. అతిపెద్ద విలాసవంతమైన భవనాలు, పర్యాటక కేంద్రాలు, షాపింగ్ మాల్స్, కాసినోవా, నైట్ సఫారి, సాంటోసా ద్వీపకల్పం, అండర్ సీ వరల్డ్ వంటివి ప్రతీదీ తప్పనిసరిగా చూడాల్సినవే. నిజానికి అన్నీ చూడాలంటే నెలల సమయం చాలదు. పర్యాటక ప్రాంతాల్లో ముఖ్యంగా చెప్పుకోవల్సింది అండర్ సీ వరల్డ్. భూగర్భంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో అనేక సముద్ర ప్రాణుల్ని సజీవంగా చూసే ఏర్పాటు ఉంది. రాత్రి పూట అద్భుతమైన లేజర్ షోలు నిర్వహిస్తుంటారు. సింగపూర్ సముద్ర తీరాన రేవు నుండి క్రూయిజ్‌లలో సగం రోజు లేదా దీర్ఘకాలం పాటు పడవ ప్రయాణం చేయవచ్చు. ఈ టూర్‌లొ సింగపూర్‌కు చెందిన ఇతర దీవులను సందర్శించవచ్చు. అలాగే డాల్ఫిన్ షోలను తిలకించవచ్చు. రెండోది నైట్ సఫారి. ఇందులో రాత్రివేళల్లో జంతుప్రదర్శనశాల చూసే ఏర్పాటు ఉంది. ఇందులో ఆకర్షణీయమైన ప్రదర్శన శాలలు ఉంటాయి. రాత్రి వేళల్లో జంతువులను వాటి సహజమైన జీవనాన్ని చూడటం పర్యాటకులకు వింత అనుభూతిని కల్పిస్తుంది. మూడోది పక్షుల పార్కు చాలా అద్భుతంగా ఉంటుంది. పక్షులతో రకరకాల విన్యాసాలు చేయిస్తుంటారు. అత్యంత అపురూపమైన లేత కాషాయరంగు హంసలకు సింగపూర్ నిలయం. పార్కు మొత్తం చూడడానికి చక్కటి రైలు ప్రయాణం ఉంది. స్కైటవర్లో సందర్శకులకు టవర్ పై భాగానికి తీసుకువెళ్లి కిందకు దించుతారు. పైకి వెళ్లినపుడు సింగపూర్‌కే గాక చుట్టూ ఉండే ఇండోనేషియా, మలేషియాలను కూడా చూడగలుగుతాం. ఇది ఒక అద్భుమైన అనుభవం అవుతుంది. నాలుగో ప్రత్యేకత సెంటోసా ద్వీపం. ఈ ద్వీపానికి కేబుల్ కారులో వెళ్లొచ్చు. తిరిగి రావడానికి బస్సు మార్గాన్ని ఉపయోగిస్తుంటారు. సింగపూర్‌లో భాగంగా మారిన సెంటోసా ద్వీపంలో సింగపూర్ జాతీయ చిహ్నమైన మెర్ మెయిడ్ కింది భాగం చేప, పై భాగం సింహంతో కూడి ఉంటుంది. ఈ మెర్‌మెయిడ్‌ను చూడటం మరిచిపోలేని అనుభూతి. సందర్శకులను మెర్ మెయిడ్ తలభాగం వరకూ లిఫ్ట్‌లో తీసుకువెళ్తారు. ముందుగా ఒక చిన్న ప్రదర్శన ఉంటుంది. ఇక్కడ సంప్రదాయ భవనంలో సింగపూర్ చరిత్రను లేజర్‌షో సహాయంతో ప్రదర్శిస్తారు. అతి సహజమైన పరిస్థితిలో జీవం ఉట్టిపడే బొమ్మల మధ్య నావ ప్రయాణం మరిచిపోలేనిది. అనేక సంప్రదాయాల్లో ప్రతిబింబించే బొమ్మలతో కూడిన ప్రదర్శన శాలలను ఇక్కడ చూడవచ్చు. లిటిల్ ఇండియా, చైనా టౌన్, ముస్త్ఫా కాంప్లెక్స్, సింగపూర్ కాంప్లెక్, సన్‌టెక్ , సెరంగూన్ రోడ్‌లో దేవాలయాలు చూస్తుంటే మనం భారతదేశంలోనే ఉన్నామా అని అనిపిస్తుంది. పండగ సమయాల్లో అంగడి వీధులను చూడముచ్చటగా అలంకరిస్తారు. హరిత విప్లవం సింగపూర్ పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాణం పెడుతుంది. భవనాలు, జలాశయాలు, రహదారులు మినహాయిస్తే మిగిలిన ప్రాంతం అంతా పచ్చగానే కనిపిస్తుంది. ఏ మాత్రం స్థలం ఉన్నా అక్కడ అందమైన రంగురంగుల ఫలాలు, పుష్పాలను ఇచ్చే మొక్కలను పెంచుతారు. అంతే కాదు వాటి నిర్వహణ కూడా పకడ్బందీగా ఉంటుంది. అది ఎంత వరకూ అంటే 90వ అంతస్తులో కూడా మొక్కలను పెంచే సంస్కృతి అలవడింది. చిట్టచివరి అంతస్తులో కూడా తొట్టెల్లో మొక్కలు పెంచుతారు. తాగునీటికి సమస్య ఉన్నా మొక్కల నీటికి సింగపూర్ వెరవడం లేదు. ఈ కారణంగానే ఒకప్పటి అధ్వాన్న దేశం ఇప్పుడు అద్భుతంగా మారిపోయింది. ప్రపంచ గమ్యస్ధానం సింగపూర్ ప్రపంచంలోని అన్ని దేశాలూ ఇపుడు సింగపూర్ వైపు చూస్తున్నాయి. ఒకపుడు ప్రపంచంలోని మెళుకువలతో అత్యంతవేగంగా అభివృద్ధి సాధించిన సింగపూర్ నేడు ప్రపంచానికే పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగింది. సింగపూర్ ఒక ముఖ్యమైన రవాణా కేంద్రంగా, అతిపెద్ద పర్యాటక గమ్యస్థానంగా నేడు మారిపోయింది. ఈ పరిణామం అంత తేలికగా జరగలేదు. ఐరోపా వలస రాజ్యాల దాడులు, పోర్చుగీసు, డచ్ వారి ఆధిపత్యం, అరబ్బులు, చైనీయులు, జపనీయులు ఒకరేమిటి చాలా దేశాలు దాడులకు దిగడంతో ఉంటుందా ఊడుతుందా అనే రీతిలో అనుకోకుండా స్వాతంత్య్రం పొందిన తర్వాత సింగపూర్ అస్థిరతతో కూడిన భవిష్యత్‌ను చవిచూసింది. ఒక పక్క ఇండోనేషియా ఒత్తిడులను ఎదుర్కొంటూనే సింగపూర్ తన సత్తా చూపింది. ఒక చిన్న ద్వీపం విజయవంతమైన దేశంగా ఎలా ఎదుగుతుందని అంతా హేళన చేయడం సింగపూర్ ఉనికే ప్రశ్నించింది. దీనికి తోడు సార్వభౌమాధికార సమస్యలతో నిరుద్యోగం, గృహవసతి, విద్య, సహజవనరుల కొరత, భూమి కొరత ఒత్తిడిని కలిగించే సమస్యలుగా ఉండేవి. నిరుద్యోగం కూడా విపరీతంగా పెరిగి పౌర అశాంతికి కారణం అవుతుందేమో అనే పరిస్థితుల్లో సింగపూర్ వ్యూహకర్తలు ఆ దేశాన్ని గాడిలో పెట్టారు. పరిశ్రమలు, సేవా రంగం పెరగడం, నౌకానిర్మాణం, ఎగుమతులు, ఉన్నతమైన వస్తువుల ఉత్పత్తి , వాణిజ్య పెరుగుదల, చమురు శుద్ధి కర్మాగారాల ఏర్పాటుతో దేశం దశ తిరిగిపోయింది. ప్రభుత్వం విద్యావిధానం మీద భారీగా పెట్టుబడులు పెట్టి ఆంగ్లభాషా బోధనను అవలంబించింది. స్థానిక పరిశ్రమలకు సరిపోయే పోటీతత్వం ఉన్న పనిబలాన్ని అభివృద్ధి చేయడానికి అభ్యాససిద్ధితో కూడిన శిక్షణను అందించింది. స్వాతంత్య్రం వచ్చిన 15 ఏళ్లలో సింగపూర్ అనూహ్యమైన ప్రగతిని సాధించింది. 1980లో చవకగా కార్మికులను కలిగి ఉన్న పొరుగువారితో పోటీ పడటానికి సింగపూర్ తన పరిశ్రమలను సాంకేతికంగా ఉన్నతమైనవిగా నవీకరించడం మొదలుపెట్టింది. వాఫెర్ ఫ్యాబ్రికేషన్ వంటి ఆధునిక పద్ధతులను తీసుకువచ్చింది. 1981 నాటికి సింగపూర్ ఎయిర్‌లైన్స్ అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌గా అభివృద్ధి చెందింది. సింగపూర్ నౌకాశ్రయం అత్యంత రద్దీగా ఉండే నౌకాశ్రయాల్లో ఒకటిగా అయింది. ఆంగ్‌మో కియో వంటి నూతన పట్టణాల రూపకల్పన చేసి ప్రభుత్వ నివాస గృహాలను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. సింగపూర్‌లో 90 శాతం మంది ఈ అపార్టుమెంట్లలోనే నివసిస్తారు. 1987లో మొదటి మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ పనిచేయడం మొదలైంది. దీంతో నగరంలో చాలా ప్రదేశాలను చాలా తేలికగా కలిపింది. రాజకీయ సుస్థిరత రాజకీయ ప్రసార సాధనాల మీద కఠినమైన నియంత్రణ ఉంటుంది. చట్టవిరుద్ధ నిరసనలకు సైతం మరణదండన వంటి తీవ్రమైన శిక్షలు ఉంటాయి. సింగపూర్‌పై పీపుల్స్ ఆక్షన్ పార్టీ ప్రభావం చాలానే ఉంది. ప్రస్తుతం 175 దేశాలతో ఈ దేశం దౌత్యసంబంధాలను కొనసాగిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో, కామనె్వల్త్‌లో, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్టు ఏషియన్ కంట్రీస్‌లో సభ్యత్వం ఉంది. యుకెతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియాలతో కలిసి ఐదు దేశాల రక్షణ ఒప్పందంతో సురక్షితంగా ఉంది. మరో పక్క అమెరికాతోనూ సింగపూర్ మంచి సంబంధాలనే కొనసాగిస్తోంది. మొత్తం సింగపూర్ జనాభా 55 లక్షలు. ఇందులో విదేశీయులే 20లక్షలకు పైగా ఉంటారు. చైనీయులు 75 శాతం, మలయా వారు 13.6 శాతం, భారతీయులు 9 శాతం ఉన్నారు. నేరాలు తగ్గినా తీవ్రవాద భయం సింగపూర్‌లో పటిష్టమైన చట్టాలతో నేరాలను గణనీయంగా తగ్గించగలిగినా, సింగపూర్‌కు తీవ్రవాద భయం మాత్రం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. సింగపూర్ రాయబార కార్యాలయాల మీద దాడులను దృష్టిలో ఉంచుకుని శక్తివంతమైన తీవ్రవాద నిరోధక చర్యలను చేపట్టింది. ముందు చూపుతో… సింగపూర్ చాలా చిన్న ద్వీపం, కాని ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు హేమా హేమీ దేశాలతో పోటీపడేలా సింగపూర్ ఎదగడానికి కారణం రాజకీయ చిత్తశుద్ధి. వంద ఏళ్ల తర్వాత, 200 ఏళ్ల తర్వాత దేశం పరిస్థితి ఏమిటనే ఆలోచనలను ఇపుడే చేయడమే. పెద్ద పెద్ద ఆలోచనలు చేయడమేకాదు, వాటిని తక్షణం అమలుచేసి ఫలితాలను ప్రజలకు చూపించడంతో పాలకుల వ్యవహారంపై తలదూర్చకుండా స్థానికంగా ఉన్న వారు అభివృద్ధి కారకాలుగా మారిపోయారు. ప్రతి ఒక్కరూ పనిచేయాలి, దేశాభివృద్ధికి తోడ్పడాలి. ఈ మాట ఎవరో చెప్పనక్కర్లేదు. ప్రతి పౌరుడూ తన గురుతర బాధ్యతగా గుర్తుంచుకుంటాడు. పని, వ్యాపకం అనే రెండు అంశాలు ఇతర విషయాలపై దృష్టిపెట్టనివ్వకుండా చేస్తున్నాయ. సింగపూర్ ప్రధానంగా పర్యాటకం, షాపింగ్, విమానరంగం, నౌకారవాణా, నౌకానిర్మాణ రంగం, ఐటి రంగాల్లో అగ్రస్థానంలోకి చేరుకుంది. ఉన్న భూభాగాన్ని ప్రజల జీవనానికి, పెట్రోకెమికల్ పరిశ్రమలకు, పోర్టులకు, ఎయిర్‌పోర్టులకు, రవాణా వ్యవస్థకు ఒక ప్రణాళిక ప్రకారం వినియోగించుకుంటున్నారు. భూవిస్తరణ ఇలా… జురాన్గ్, సెంటోసా, పులవ్ టెక్నాగ్ దీవి, పులవ్ యుబిన్ దీవులు విస్తీర్ణంలో కొంచెం పెద్దవి. మిగిలిన దీవులు చాలా చిన్నవే. జురాన్గ్ దీనివి పెట్రో కెమికల్ పరిశ్రమలకు వాడుకుంటున్నారు. సెంటోసా దీవిని పర్యాటక ఆకర్షణకు వాడుకుంటున్నారు. పులవ్ టెక్నాగ్ దీవిని రక్షణ సంబంధ వ్యవహారాలకు ఉపయోగించుకుంటున్నారు. పులవ్ యుబిన్ దీవిలో ఆధునిక అవసారాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టారు. 166 మీటర్లు ఎత్తున్న బుకిత్ తిమాహ్ హిల్ సింగపూర్‌లో చాలా ఎత్తయిన ప్రదేశం. ఉత్తరాన సింగపూర్ కాజ్‌వే, తువాస్ సెకండ్ లింగ్ అనే రెండు మానవ నిర్మిత వారధులున్నాయి. నగర నిర్మాణాలకు కొంత భూమిని వినియోగించాల్సి రావడంతో నెమ్మదిగా ప్రభుత్వం భూమి విస్తరణపై దృష్టి పెట్టింది. 581 చదరపు కిలోమీటర్లు నుండి నేడు 704 చదరపు కిలోమీటర్లకు భూమిని విస్తరించగలిగింది. త్వరలో మరో వంద కిలోమీటర్లు భూమిని విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది. చిన్నచిన్న మట్టిదిబ్బలుగా ఉన్న దీవులు ప్రధాన దీవుల్లో కలుస్తూ భౌగోళిక రూపురేఖలు మారుతున్నాయి. * ఆదాయం కోట్లు, తాగునీటికి పాట్లు భారతీయ సంప్రదాయం ప్రకారం ఎవరైనా ఇంటికి వస్తే మంచినీటితో స్వాగతం పలుకుతాం. కాని అక్కడ మంచినీరు తప్ప ఏం అడిగినా ఇస్తాం అనే రీతిలో ఉంటుంది. దానికి కారణం తలసరి వార్షిక ఆదాయం కోట్లలో ఉన్నా సింగపూర్ ప్రజలకు పెద్ద శాపం తాగునీటి సమస్య. ఇపుడా సమస్యను అధిగమించింది. అయినా తాగునీటి ధర ఖరీదే. సింగపూర్ ప్రజల నీటి అవసరాలను చాలా వరకూ వర్షపు నీటి రిజర్వాయిర్లతో తీరుస్తుంటారు.. మిగిలిన నీరు మలేషియా నుండి సరఫరా అవుతుంది. బ్రిటిష్ ప్రభుత్వకాలంలో చేసుకున్న నీటి ఒప్పందాలు ఇరు దేశాల మధ్య దీర్ఘకాల వివాదాలకు కారణమవుతునే ఉన్నాయి. ఆ కష్టాల నుండి గట్టెక్కడానికి సింగపూర్ ఆధునికతను అందిపుచ్చుకుని రీసైక్లింగ్ ప్లాంట్లపై దృష్టిసారించింది. దీంతో వెలుపలి నుండి సరఫరా అవుతున్న నీటి దిగుమతిని కొంచెం కొంచెంగా తగ్గిస్తున్నారు. సింగపూర్‌లో 19 నీటి రిజర్వాయిర్లు, 19 నీటి శుద్ధికరణ విభాగాలు, 14 నీటినిల్వ రిజర్వాయిర్లు ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరీనా బరేజ్ పనులు పూర్తకావచ్చాయి. మలేషియాతో చేసుకున్న నీటి ఒప్పందాలు కొన్ని 2011లో ముగిశాయి. మరికొన్ని 2061లో ముగియనున్నాయి. దానికి తోడు మలేషియా చేస్తున్న డిమాండ్‌ను తోసిరాజని సింగపూర్ సొంత జలవనరుల కోసం ప్రయాసపడుతోంది. దేశంలోనే నీటి వనరులను అభివృద్ధి చేసుకుంటూ స్వయం సమృద్ధితో ముందుకు సాగాలని యోచిస్తోంది. జనాభాకు రెట్టింపు పర్యాటకులు సింగపూర్ పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించడం తద్వారా వచ్చే ఆదాయంతో దేశ ఆర్ధికవ్యవస్థను చక్కదిద్దుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. స్థానిక ప్రజల ఆర్ధిక అవసరాలను నిర్బంధ పొదుపు చర్యలను శాసించడం ద్వారా ప్రభుత్వంపై ఏ దశలోనూ వారు ఆధారపడకుండా చూసుకుంటోంది. అనుత్పాదక రంగాల్లో ఎవరికీ ఎలాంటి రాయితీలను అమలు చేయడం లేదు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, పెన్షన్లు, ఉచిత గృహాలు వంటి పథకాలకు ఇక్కడ తావు లేదు. ఎంట్రీ పోర్టు వ్యాపార విధానాల వల్ల తన ఆర్ధిక రంగాన్ని పరిపుష్టం చేసుకుంది. అంతర్జాతీయ వ్యాపార రంగంలో నాలుగు సింహాలుగా అభివర్ణించబడే దేశాల్లో సింగపూర్ ఒకటి. మిగిలినవి హాంకాంగ్, తైవాన్, కొరియా. సింగపూర్ దేశానికి 25 శాతం పైబడి ఆదాయం కర్మాగారాల ద్వారానే వస్తుంది. ఎలక్ట్రానిక్స్, రిఫైనరీ, రసాయనాలు, మెకానికల్ ఇంజనీరింగ్ ఉత్పత్తులు, బయోమెడికల్ సైన్స్ రంగాల్లోనే ఎక్కువ కర్మాగారాలున్నాయి. ప్రపంచ ఫౌండ్రీ వేఫర్ వాడకంలో 10 శాతం సింగపూర్ ఉత్పత్తుల వల్లనే లభించింది. సింగపూర్ రేవు అత్యంత చురుకైన అంతర్జాతీయ రేవుగా గుర్తింపు పొందింది. వ్యాపారపరంగా లండన్, న్యూయార్క్, టోక్కోకు సమానంగా సింగపూర్ ఓడరేవు ప్రసిద్ధి గాంచింది. తలసరి ఆదాయం 80వేల పైమాటే. నిరుద్యోగం చాలా స్వల్పం. ప్రతి ఏటా కోటి మంది వరకూ సింగపూర్‌కు వస్తుంటారు. 165 మీటర్లు ఎత్తుండే ఫెర్రీవీల్, సముద్రతీరంలో ఉద్యానవనాలు, మరీనా దక్షిణ తీరాన నిర్మించిన పొడవైన డబుల్ హైలెక్స్ బ్రిడ్జీలు, సందర్శకులను సౌకర్యవంతమైన ఫుడ్‌ఫెస్టివల్స్ ఆకర్షిస్తున్నాయి. మరో పక్క కేవలం వైద్య చికిత్సలకే దాదాపు పది లక్షల మందికి పైగా సింగపూర్ వస్తుంటారు. వ్యాపారం, వైద్య చికిత్స, వినోద కార్యక్రమాలపై వచ్చే యాత్రికుల సంఖ్య బాగా పెరగడంతో ఆహార రంగం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. కఠిన శిక్షలు సింగపూర్ చట్టం బ్రిటిష్ చట్టాన్ని అనుసరించేదే అయినా అధికారంలో ఉన్న పార్టీ – పిఎపి మాత్రం పాశ్చాత్య దేశాల సంపూర్ణ ప్రజాస్వాతంత్య్రపు విలువలు పాటించడంలో కొంత వరకూ విముఖత వ్యక్తం చూపిస్తూనే ఉంది. విభిన్న సంస్కృతుల , మతాల ,్భషల ప్రజలు నివసిస్తున్న దేశం కనుక అల్ప సంఖ్యాకులను రెచ్చగొట్టేవి, ప్రశాంతతకు భంగం కలిగించేవి, ప్రజాశ్రేయస్సుకు ప్రతికూలమైనట్టి వ్యాఖ్యలను నిషేధిస్తూ వాక్ స్వాతంత్య్రాన్ని కట్టుబాటులోనే ఉంచుతోంది. అల్పసంఖ్యాకులను రెచ్చగొట్టేవిధంగా బ్లాగుల్లో, వ్యాఖ్యానాలు రాసిన ముగ్గురు బ్లాగర్లపై చర్యలు తీసుకుంది. అధిక జరిమానాలు, కొరడా దెబ్బలు లాంటి శిక్షలు ఇంకా అమలులో ఉన్నాయి. హత్యలు, హానికరమైన మత్తుపదార్ధాలకు సంబంధించిన నేరాలకు ఉరిశిక్ష విధించడం మామూలు విషయమే. ప్రపంచంలో అధికశాతం ఉరిశిక్షలు అమలవుతున్న దేశాల్లో సింగపూర్‌ది అగ్రస్థానం . ఉరిశిక్షల అమలులో అంతర్జాతీయ మానవ హక్కుల విమర్శలు ఎదుర్కొంటున్న సింగపూర్ ప్రభుత్వం తమ దేశంలో అమలు చేయాల్సిన చట్టంపై తమకు పూర్తి సంపూర్ణ హక్కు ఉందని వాదిస్తూ తమ చర్యలను సమర్ధించుకుంటోంది.

 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”మొ నాలిసా” లో గ్రహాంతర జీవులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రెండు కవితలు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కద రాయడం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘31(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘31(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

హైదరాబాద్ చేరుకొన్న రామయ్య

తన తమ్ముడు సీతా రామయ్య 42 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇండియాకు ఉయ్యూరుకు  వస్తున్నందుకు పెద్దన్నగారు అనంత రామ శాస్త్రిగారికి మహదానందం గా ఉంది .ఆయన బంధు వర్గానికీ పరమాందంగా ఉన్నది .అందరూ హైదరాబాద్ విమానాశ్రయం లో ఘన స్వాగతం ఇచ్చారు .అందరిలో ‘’నా అన్నయ్య ‘’ను గుర్తుపట్టి రామయ్యగారు వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి పాదాలపై పడి వినమ్రంగా నమస్కరించారు .ఆప్యాయం గా అన్నదమ్ములు కౌగలి౦చుకొన్నారు .అమెరికాలో ఉండగా పంపబడిన శ్రీమతి జ్యోతిష్మతి  ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు .రామయ్యగారు కమ్మని తెలుగులో మాట్లాడి అందర్నీ ఆశ్చర్య పరచారు ..సూరి వారి కుటుంబానికి రామయ్యగారిని తీసుకొని వెళ్ళారు .లెక్కలేనన్ని పూల దండలు వేసి  రామయ్య గారికి ఆత్మీయ స్వాగతం చెప్పి  అనంతరామయ్యగారి అల్లుడిగారింటికి పెద్ద ఊరేగింపుగా తీసుకొని వెళ్ళారు . నలభై రెండేళ్ళ క్రితం  రామయ్య గారు ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లాలని ఉందని చెబితే ,అన్న అనంతరామయ్యగారు ఆయన్ను ఆశీర్వ దించి ,వెళ్ళటానికి అంగీకరించి మద్రాస్ ఓడ రేవుకు వెళ్లి వీడ్కోలు చెప్పారు .ఆనాడు సంప్రదాయ హిందువులు సముద్రం దాటి ఇతర దేశాలకు వెళ్ళటం నిషిద్ధం .మరో అన్నగారు  వెంకటప్పయ్య శర్మగారు రామయ్యగారు విదేశాలకు వెళ్ళటాన్ని ఒప్పుకోలేదు ఆనాడు .అలాంటి పరిస్తితులలో దేశం కానీ దేశానికి వెళ్ళిన రామయ్య ఇప్పుడు మళ్ళీ 42 ఏళ్ళ తర్వాత ,42 రోజులు మాత్రమె ఇండియాలో గడపటానికి  స్వదేశానికి రావటం అందర్నీ సంతోష పరచింది .రామయ్య గారు సంస్కృత శ్లోకాలు అప్పగిస్తున్నారు .సంధ్య వందనం నిర్వహిస్తున్నారు .’’కమ్మకమ్మని ఎర్రెర్రని ఘాటు ఆవకాయ’’ను అన్నం లో కలుపుకొని లాగిస్తున్నారు  .నిజమైన ఆంధ్రుడనే అని మాటలద్వారా ,చేతల ద్వారా రుజువు చేసుకొన్నారు .అందరి మనస్సులో శాశ్వత స్థానాన్ని సంపాదించారు .ఇంటి కోడళ్ళు రామయ్యగారికి నూనె రాసి ,సున్నిపిండి నలుగు పెట్టి కుంకుడుకాయ రసం తో వేడివేడి  నీటి తో తలంటి పోశారు .రామయ్యగారి’’ హోమ్ కమింగ్ ‘’ఒక పండుగలాగా జరిగింది .              హైదరాబాద్ లోప్రాంతీయ రిసెర్చ్ లేబరేటరి,ఉస్మానియా విశ్వ విద్యాలయమ్ ,ఆకాశ వాణి కేంద్రాలను సందర్శించి అక్కడి అభివృద్ధిని అడిగి తెలుసుకొని అభినందించి ఆనందించారు .కోలచల కుటుంబం రామయ్యగారి తిరుపతి ,శ్రీశైల క్షేత్ర దర్శనం ఏర్పాటు చేసింది .ఆ రెండు క్షేత్రాలలో భక్తిగా రామయ్యగారు పూజాదికాలు నిర్వహించి అలౌకికానందాను భూతికి లోనయ్యారు .

రామయ్య గారు హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చారు .అక్కడ ప్రముఖ   కమ్యూనిస్ట్ నాయకురాలు ,డాక్టర్ శ్రీమతి అచ్చమాంబ  గారిని సందర్శించారు .

ఉయ్యూరొచ్చిన రామయ్య-పౌరసమ్మానం

విజయవాడ నుంచి స్వగ్రామం ఉయ్యూరు చేరుకొన్నారు .మే నెల 21 వ తేదీన రామయ్యగారికి డాక్టర్ మిక్కిలి నేని సాంబశివ రావు ,ఆధ్వర్యం లో ఉయ్యూరు గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్ ,గ్రామ పెద్దలు కలిసి  ఘనమైన పౌరసన్మానం  చేశారు .మే 24 న రామయ్య గారు ఆంద్ర యువకులకు ఒక సందేశాన్ని రికార్డ్ చేశారు .అందులో ఆంద్ర యువత కు సోవియట్ తో స్నేహం తో ఉండటానికి ఇష్ట పడుతున్నందుకు మనసార  అభినందించారు .భారత దేశ భవిష్యత్తు యువత మాత్రమే తీర్చి దిద్దుతుంది అన్నారు .ఇండో సోవియట్ స్నేహం చిరకాలం వర్ధిల్లాలి ‘’అని ఆశాభావం వెలిబుచ్చారు .

గుంటూరులో

గుంటూరులో ఆంద్ర యూత్ ఫెడరేషన్ రామయ్యగారిని ఆప్యాయంగా ఆహ్వానించి గొప్ప పౌర సత్కారం నిర్వహించారు .దీనికి స్థానిక ఇండో -సోవియట్ సాంస్కృతిక సంస్థ సహకరించింది .అందంగా అలంకరింపబడిన విశాలమైన ప్రాంగణం అంతా విపరీతంగా వచ్చి చేరిన యువత తో నిండిపోయి కనుల పండువుగా కనిపించింది. ఉరకలెత్తే యువత ఉత్సాహం రామయ్యగారిని విశేషం గా ఆకర్షించింది .నవభారత నిర్మాణానికి వీరే నిజమైన స్తంభాలు అనుకొన్నారు .లోపల చోటు దొరకక ఏంతో మంది హాలు బయట ఉండిపోయి చూడాల్సి వచ్చింది .ఇంత మందిని ఆకర్షించిన రామయ్యగారు ధన్య జీవులని పించారు . విద్య ,ఉద్యోగం వినోదం వగైరాలు రష్యాలో యువతకు ఎలా అందుబాటులో ఉన్నాయని వేదికపై ఉన్న రామయ్యగారిని వారు ప్రశ్నించారు .అన్ని ప్రశ్నలకు తడుముకోకుండా అనర్గళం గా అచ్చమైన ,మధురమైన తెలుగు పదజాలంతో సమాధానాలు చెప్పి రామయ్య యువతను సంత్రుప్త పరచి వారి హృదయాలలో గొప్ప  శాశ్వత స్థానం  సంపాదించారు .దాదాపు అర్ధ శతాబ్దం ఇండియాకు దూరంగా ఉన్నప్పటికీ ,భారత దేశ సాంస్కృతిక వారసత్వం పై రామయ్యగారికి ఉన్న అవగాహనకు ముక్కు మీద వేలేసుకొన్నారు .

మద్రాస్ లో మధుర సన్నివేశాలు

రామయ్యగారు  బెంగుళూరు యాత్ర నుండి మే 28 న మద్రాస్ చేరుకొన్నారు . .మర్నాడు హిందూ పత్రికకు ఇంటర్వ్యు ఇచ్చారు .మర్నాడే దాన్ని ఆ పత్రిక ప్రచురించింది. అందులో ‘’మన జాతీయ భావన అంటే విశాల దృక్పధం తో మన యువ సైంటిస్ట్ లను ఇతర దేశాలలో నివాసం ఉండేట్లు అంగీకరించి పంపించటమే అవ్వాలి .న్యాయానికి మన దేశానికి శాస్త్రీయ ప్రతిభ ఎక్కడినుంచో రానక్కరలేదు మనకే ఏంటో విజ్ఞానం ఉంది  .కాని ఇతర దేశాలకు మన శాస్త్ర సాంకేతిక జ్ఞానాన్ని అంద జేస్తున్నందుకు  వారి ప్రగతిలో భాగ స్వాములం అవుతున్నందుకు మనం గర్వ పడాలి .సైన్స్ లో ,పరిశ్రమలలో  అభ్యుదయం లో  సోవియట్ యూనియన్  ఉండటం ఇండియాకు సర్వ విధాల అవసరమేకాక చాలా మంచిది కూదా .ఇప్పుడు అందరి ద్రుష్టి ,,ఆలోచన అంతా ‘’సహాయం –తోడ్పడటం ‘’పైనే ఉంది .ఈ  రెండు మాటల మంత్రాన్నే జపిస్తున్నారు  .’’అని రామయ్య గారు చెప్పినట్లు రాసింది.

బొంబాయి –అక్కడినుండి తిరిగి రష్యాకు

రామయ్యగారు  మద్రాస్ నుండి  బొంబాయి కి  జూన్ 1 న బయల్దేరి వెళ్లారు .బొంబాయి  ఆకాశ వాణికి ఒక ప్రసంగం రికార్డ్ చేశారు .అక్కడి నుండి బయల్దేరి మే నెల 5 వ తేదీ కి రష్యాలోని మాస్కో నగరానికి చేరుకొన్నారు .

రామయ్యగారి జీవన సంధ్య

మాస్కో చేరిన కోలచల సీతారామయ్య అనే ‘’కాన్ స్టాన్టిన్ సేర్జియోవిచ్ ‘’జీవిత౦ చివరికాలం లో ‘’సెంట్రల్ సైంటిఫిక్ రిసెర్చ్ ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ ఆటోమొబైల్ అండ్ రోడ్ బిల్డింగ్స్ ‘’సంస్థలో పని చేశారు .ఫిజిక్స్ ,కెమిస్ట్రీ లలో విశేష ప్రతిభా వంతులైన రామయ్యగారు ప్రముఖ ‘’సైంటిఫిక్ అడ్వైజర్ (శాస్త్రీయ సలహాదారు ) గా ను ,అనేక సైంటిఫిక్  కౌన్సిల్స్ కు  సలహాదారుగాను విశేష సేవలు అందజేశారు .

ఆల్బర్ట్ అయిన్ స్టీన్ తో పోలిక

వృద్ధాప్యం మీద పడుతున్నప్పటికీ చివరి రోజుల్లో సైతం రామయ్య గారు ఎంతో సృజన శీలతను ప్రదర్శించారు .మనకు అప్పటిదాకా తెలిసిన మూడు స్తితులు కాక నాలుగో స్తితి ఉందని భావించి ,దేర్మో న్యూక్లియ చర్యలలో’’ ప్లాస్మా ‘’అనేది ఏర్పడుతుందని ఊహించి చెప్పారు .కాని దురదృష్ట వశాత్తు అది రుజువు కాక ముందే రామయ్యగారు కానిపోవటం విచారకరం .ప్రముఖ విజ్ఞాని ,సైంటిస్ట్  ఆల్బర్ట్ అయిన్ స్టీన్ కూడా తాను ఊహించిన చెప్పిన సిద్దా౦తలనన్నిటిని ఒక చోట చేర్చి ఏక సూత్రత సాధించి కొత్త సిద్ధాంతాన్ని ప్రదిపాదించే లోపలే మరణించాడు ఈ ఇద్దరు మేధావి  సైంటిస్ట్  ల జీవితాలలో యాదృచ్చికం గా ఇలా జరగటం  ఆశ్చర్యం గా   ఉంటుంది .మానవ జాతికి మహత్తర విజ్ఞానం అందకుండానే వారిద్దరూ చనిపోవటం విచార కరం .

రామయ్యగారి ‘’ప్లాస్టిక్ ధీరీ ‘’సిద్ధాంతం రామయ్య గారు వదిలి వెళ్ళిన ఉపన్యాస రికార్డులనుండి సేకరించి  సంపూర్ణ స్తితికి తేవాలి .రామయ్య గారు  రష్యన్ భాషా జర్నల్స్ లో రష్యన్ భాషలో రాసిన పత్రాలను సేకరించి ఇంగ్లీష్ భాష లోకి అనువదించాలి .యంత్రాల నిర్మాణం లో రామయ్యగారు అవలంబించిన పద్ధతులనుపయోగించి కొత్త యంత్ర నిర్మాణాన్ని ఇండియా లోను రష్యాలోను ‘’ట్రైబాలజిస్ట్ ‘’లు  రూపొందిస్తున్నారు .

రాం రాం

రామయ్యగారు ఊపిరి తిత్తుల సంబంధ మైన ఉబ్బసవ్యాది (బ్రాన్కైల్ ఆస్తమా )తో చాలాకాలం బాధ పడ్డారు .దీనితో ఊపిరి తిత్తులు ఉబ్బి శ్వాస పీల్చుకోవటం కష్టమైన ‘’ఎ౦ఫిసేమా’’  జబ్బు ఇబ్బంది పెట్టింది .దీనికి తోడూ డబల్ టైఫాయిడ్ వచ్చి మీద పడింది . జీవితం లో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని ధైర్యం గా నిలబడిన రామయ్యగారి గుండె ఇక తట్టుకోలేక ,కొట్టుకోలేక పోయింది .29-9-1977 న మాస్కో లో రామయ్య గారి హ్రదయ స్పందన ఆగిపోయి శాశ్వతం గా మనకు దూరమైపోయారు .ఆయన చితా భస్మం మాస్కో క్రిమేటోరియం చాపెల్ లో  భద్రపరచారు .

దీనితో మూడు ఫోటోలు జత చేశాను చూడండి

కెమోటాలజి పిత’

సశేషం

naannayya 001 ramayya 001 talanti 001

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-5-15 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దేవుడు ప్రజాస్వామ్య వాది కాదా /కంచ ఐలయ్య ప్రశ్న

Posted in వార్తా పత్రికలో | Tagged | 2 Comments

బ్రిటన్ లో కామెరాన్ విజయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హోదా వాకాల్సిందే ఇది సెంటిమెంట్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘30(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘30(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

ఇప్పటిదాకా మనం రామయ్య గారి స్వదేశాగామనాం ,అనుభవాలు అనుభూతులు ఆయన స్వయం గా చెప్పిన మాటలద్వారా విని తెలుసుకొన్నాం .ఆయనలో భవిష్యత్తును దర్శించే దార్శనికుడు కనిపించాడు రెండు దేశాల అభివృద్ధి తపన ,యువతపై ఉన్న అచంచల విశ్వాసం ,ఇండియా ప్రపంచ దేశాలకు దీటుగా ఎదిగి నిలవాలన్న ఆకాంక్ష కనిపించింది .తన జీవితం సార్ధకమే నన్న విశ్వాసం గోచరమైంది .జీవన సంధ్యలో ఉన్నా ఇంకా ఏదో చేయాలనే తపన చూశాం .హార్ట్ పేషెంట్ అనీ తెలుసుకొన్నాం .విశ్వమానవ గీతం గా అయన జీవితాన్ని ఆవిష్కరించిన వైనం కనిపిస్తుంది ..            ‘’  ప్రతిదీ సాపేక్షికమే అని ప్రజలు అంటారు .ఒక రోజు నేను జనసమ్మర్ద మాస్కో వీధుల్లో నడుస్తున్నాను .అకస్మాత్తుగా ఒక మర్యదాపూర్వక మైన ‘’క్షమించండి రామయ్య గారు !’’అనే పిలుపు వినిపించింది .నా ముందు హాషి మోటో నిలబడి ఉన్నాడు .కాలం అతనిలో ఎన్నో మార్పులు తెచ్చి ముసలివాడుగా కనిపిస్తాడు .ముఖం లో విషాదం కనిపిస్తోంది .అతన్ని చూసినందుకు ఆశ్చర్యం సంతోషం కలిగాయి .ఆత్మీయంగా హత్తుకోన్నాను .ఇలా చేయటం జపాన్ సంప్రదాయానికి విరుద్ధం. ఇండియాలోనూ ఇలా ఎవరూ ప్రవర్తించరు .’’నేనే రామయ్యను ‘’అన్నాను అతనితో .’’ఇక్కడికి ఎలా వచ్చావు ?’’అని అడిగాదు  .’’సముద్ర మార్గం ద్వారా ‘’అన్నాను జోక్ చేస్తూ  .’’నువ్వు టూరిస్ట్ లాగా లేవే ?’’అన్నాడు  .’’నేనిక్కడ చాలాకాలం నుంచి పని చేస్తున్నాను’’అన్నాను  .’’నాకు అర్ధమైంది నువ్వు కాంట్రాక్ట్ ఒప్పందం మీద పని చేస్తున్నావు ‘’అన్నాడు .నన్ను అర్ధం చేసుకోలేదు .’’లేదు హషిమోటో! నేనిక్కడే నివశిస్తున్నాను .’’అన్నాను అతనిముఖం లో నమ్మకం కనిపించలేదు .తర్వాత నవ్వేశాడు .’’ఓహో అలా జరిగిందా ?’’అన్నాడు .

రామయ్యగారికి ఒకే సారి రెండు డిగ్రీలు

రామయ్యగారు జీవితకాలం లో–  పనిచేసేటప్పుడు ఇంజన్ లోని  లోహ భాగాలను తినివేసే విషయం ,లూబ్రికంట్స్  కు తగిన ఎడిటివ్స్ ను కలిపే విషయం పైన  70 పేపర్లు  రాశారు. ఆయన చివరి శాస్త్రీయ పరిశోధనా పత్రం ‘’induction period of precipitation –a new index of motor oil quality and effectiveness of additives in them ‘’పరిశోధనా ఫలితాలలో కొన్నిటిని సిద్ధాంత పరంగా లూబ్రికంట్స్  లో నాణ్యత గురించి 1949 లో మోనోగ్రాఫ్ ప్రచురించారు .’’విస్కాసిటి ఎనామలి ఇన్ ఆయిల్ ,’’’’ఎఫెక్ట్ ఆన్ ఫ్రిక్షన్ ఇన్ మెషీన్స్ ‘’ప్రచురించారు మాస్టర్ డిగ్రీ  కోసం దీన్ని రెండేళ్ళ తర్వాత సమర్పించారు .దీన్ని పరిశీలించిన ‘’ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ పెట్రోలియం కమీషన్ ‘’ఆ పరిశోధన డాక్టర్స్ డిగ్రీ పొందటానికి పూర్తిగా అర్హమైనదని తీర్మానించింది .యు .ఎస్ .ఎస్ .ఆర్. కు చెందిన ‘’అకాడేమి ఆఫ్ సైన్స్  సుప్రీం ఎటేస్టేషన్ కమిషన్’’ అంగీకరించింది .వెంటనే రామయ్యగారికి మాస్టర్ అండ్ డాక్టర్ ఆఫ్ టెక్నికల్ సైన్సెస్ డిగ్రీలు రెండూ ఒకే సారి ప్రదానం చేసింది  .

ఫాదర్ ఆఫ్    ట్రైబో కేమిస్ట్రి

రామయ్యగారి శాస్త్రీయ పరిశోధనలు ‘’కేమోటాలజి’’అనే కొత్త శాస్త్రం గా ఆవిర్భవించింది .ఇది మోటార్ ఆయిల్స్ ,ఉపరి తలాలమధ్య స్లైడింగ్  అందులో జరిగే మిశ్రమ రసాయన చర్యల గురించిన శాస్త్రం .పెట్రోలియం ను శుద్ధి చేసిన తర్వాత లభించే బేస్ ఆయిల్స్ లో సరైన , ఎడిటివ్ లను కలపాల్సిన  అవసరాన్ని కేమోటాలజి గుర్తించింది .దీన్ని  పాశ్చాత్య దేశాల వారందరూ అంగీకరించటం తో బాగా ప్రాచుర్యం లోకి వచ్చింది .ఇవాళ కేమోటాలజి ‘’ట్రైబో కెమిస్ట్రీ ‘’పేరుతొ బాగా ప్రసిద్ధమైంది .ఇదంతా రామయ్య గారు వేసిన బీజం .నేడు మహా వృక్షం గా విస్తరించింది .ఈ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది .అందుకే రామయ్యగారిని ‘’father of chemmotology ‘’,’’father of tribochemistry ‘’అంటే ‘’కేమోటాలజిపిత ‘’లేక’’ ‘’ట్రైబో కేమిస్ట్రి పిత ‘’గా గౌరవించి చెప్పుకొంటున్నారు .ఈ గౌరవం భారత దేశం లో జన్మించినందుకు మనమూ ,, రష్యా దేశం లో దాన్ని సాధించినందుకు అ దేశప్రజలూ  గర్విస్తారు . .రెండు దేశాల ప్రజలకూ ఇది అత్యంత సంతోషకరమైన విషయమే .

రామయ్య గారి భారత సందర్శనం లో మరికొన్ని విశేషాలు

డాక్టర్ సూరి భగవంతం ప్రకటన

రామయ్య గారు 1963 లో ఏప్రిల్ 22 నుండి జూన్ 5 వరకు సెంటిమెంటల్ టూర్ గా భారత దేశం సందర్శించారు .ఆనాటి రక్షణ శాఖ మంత్రి వి .కే.కృష్ణ మీనన్ కు సైంటిఫిక్ అడ్వైజర్ గా ఉన్న డాక్టర్ సూరి భగవంతం గారు రామయ్య వస్తున్న సంగతి ప్రజలకు మాస్కో ట్రిప్ నుండి రాగానే 1962 లో హైదరాబాద్ లోని ‘’ఆంద్ర సారస్వత భవనం’’ లో తెలియ జేశారు .అక్కడ చేరిన ఔత్సాహకులు సంబరం తో చప్పట్లు కొట్టి ఆనందించారు .రామయ్య గారి సమీప బంధువు శ్రీమతి డాక్టర్ సూరి శ్రీమతి తన చిన్నప్పుడుమూడో క్లాస్ చదువుతుండగా  రామయ్యగారి నుండి రామయ్యగారి అన్నగారు అనంత రామ శాస్త్రి గారికి అంటే తన తాత గారికి శుభాకా౦క్షల టెలిగ్రాం పంపటం,ఈయన అందుకోవటం  జ్ఞాపకం చేసుకొన్నారు . అంటే రామయ్యగారు మాస్కో లో కులాసాగా ఉన్నారని తెలిసి కుటుంబమంతా ఎంతో సంతోషం పొంది పండుగ చేసుకొన్నారు .రామయ్య గారి క్షేమ సమాచారాలు 1936లేక 1938లో కుటుంబానికి ఒక్కసారి  మాత్రమే తెలిసింది .అదికూడా’’ బాంబే క్రానికల్ పేపర్ ‘’లో’’ చాట్ వుడ్ హాల్ ‘’ అనే ఆయన రామయ్య గారి గురించి ఒక ఆర్టికల్ రాస్తూ అయన రష్యాలో ఉన్నాడు అని అందులో తెలిపాడు .అప్పటినుంచి అనంత రామయ్య గారు రష్యా రాయబారి విజయ లక్ష్మీ పండిట్ తో తరచూ సంభాషిస్తూ వివరాలు తెలుసుకొనే వారు .రష్యాకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు .

ఢిల్లీ లో స్వాగత సంరంభం

ఢిల్లీ విమానాశ్రయం కు చేరుకొన్న రామయ్యగారికి  ,పార్లమెంట్ లో కమ్యూనిస్టు ,కాంగ్రెస్ మెంబర్లు ,ప్రముఖ ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్  కొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం లో ప్రధాని నెహ్రు కేబినేట్ లో నీటి పారుదల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ బోతున్న డాక్టర్ కే.ఎల్.రావు ,హార్దిక స్వాగతం పలికి పూలహారాలతో ముంచెత్తేశారు .ఆ తర్వాత రామయ్యగారు పార్లమెంట్ హౌస్ కు  వెళ్లి లోక్ సభ పబ్లిక్ గాలరీలో ఆసీనులై ప్రధానమంత్రి జావహర్ లాల్ నెహ్రు  ‘’జాతీయ భాషల ‘’గురించి చేస్తున్న ప్రసంగాన్ని శ్రద్ధ గా విన్నారు .కాట్ర గడ్డ గంగయ్య గారు రామయ్య గారికి ఇష్టమైన ప్రదేశాలను దగ్గరుండి చూపించారు .మొగల్  కళ ,శిల్పకళ ,చరిత్రల మీద పుంఖాను పు౦ఖ౦గా  ప్రశ్నలు  సంధించి అడిగారు .రామయ్య  గారు తన కోసం ప్రత్యేకం గా ఏర్పాటు చేసిన  చారిత్రిక చిత్రం ‘’మహా మంత్రి తిమ్మరుసు ‘తెలుగు ’సినిమా చూశారు .

ప్రముఖ సంస్థల సందర్శన

ఆనాటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ దామోదరం సంజీవయ్య ,ఢిల్లీ యూని వర్సిటి వైస్ చాన్సలర్ శ్రీ చింతామణి దేశ్ ముఖ్  పార్లమెంట్ సభ్యులు కే సి పంత్ ,రావి నారాయణ రెడ్డి ,కే ఈశ్వర రెడ్డి ,కుమరన్ ,లక్ష్మీ దాస్ శ్రీమతి విమలాదేవి మొదలైన ప్రముఖులు రామయ్య గారి గౌరవార్ధం కే.ఎల్ రావు గారు ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు .మర్నాడు ఉదయం దేశ ముఖ్  గారింట్లో ఉదయం అల్పాహారం ,భార్య శ్రీ మతి దుర్గాబాయ్ దేశ ముఖ్  ఏర్పాటు చేశారు .తర్వాత ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ,వెంకటేశ్వర కాలేజ్ ,ఆంధ్రా స్కూల్,ఢిల్లీ యూనివర్సిటి లను సందర్శించారు .ప్రముఖ కూచిపూడి నృత్య దర్శకురాలు ఇంద్రాణి రెహ్మాన్ ను కలిసి మాట్లాడారు ఇంద్రాణి తలిదండ్రులు ,బహిష్కరింపబడిన సీతారాం బాపూజీ అనే విప్లవ నాయకుడు రామయ్యగారికి అమెరికాలో సన్నిహిత మిత్రులు .

ఆంద్ర మహా సభ సత్కారం

ప్రొఫెసర్లు ,ఇంజనీర్లు ,సైంటిస్ట్ లు  రచయితలూ ,జర్నలిస్ట్ లు ,పార్లమెంటరీ సభ్యులు మొదలైన వారందరూ కలిసి ‘’ఆంధ్రా  అసోసియేషన్’’ తరఫున జరిగిన సన్మానం లో పాల్గొన్నారు . హైదరాబాద్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి శ్రీ బూర్గుల రామ కృష్ణా రావు ,కొత్త లక్ష్మీ రఘురామయ్య లు రామయ్యగారిని భారత దేశం అంతా పర్య టించి ,ఇన్నేళ్ళలో జరిగిన మార్పులను పరిశీలించవలసిందిగా అభ్యర్ధించారు .మిగిలిన వారు ఆ రోజుల్లో చదువులకోసం అందరి ద్రుష్టి ఇంగ్లాండ్ పైన ఉంటె ,దాన్నికాదని రామయ్యగారు వలస వాద సిద్ధాంతాన్ని వ్యతి రేకించి,నాటి బ్రిటిష్ పాలకుల దేశమైన ఇంగ్లాండ్ కు ,అమెరికాకు ఉన్నత విద్య నేర్వటానికి వెళ్ళకుండా  ప్రజా పక్షాన పని చేసృన్న రష్యా వెళ్ళటాన్ని శ్లాఘించారు . విప్లవ కారుడైన బాజ్ పాయ్ తో అమెరికాలో రామయ్యగారికున్న స్నేహాన్ని రష్యాలో వీరేంద్ర నాద చటోపాధ్యాయ తో మిత్రత్వాన్ని  గూర్చి ప్రసంగించారు కొందరు   .రష్యాలో రామయ్య గారు టెక్నికల్ శ్రేణులకు శిక్షణ  నిచ్చిన విధానాన్ని ,సైంటిస్ట్ గా సోషలిస్ట్ సోవియర్ రష్యా పురోగమనానికి  తోద్పడిన వైనాన్ని ప్రశంసి౦చారు .ఇండియా రష్యాలు పరస్పరం అవగాహనకు రావటానికి తోడ్పడటానికి  రామయ్య గారు  తెలుగు రచనలను రష్యన్ భాషలోకి అనువదించటాన్ని ప్రముఖం గా పేర్కొని ఆయన కృషి ఆదర్శ ప్రాయం ఆచరణ సాధ్యం అనుసరణీయం అని మెచ్చుకొన్నారు .

ఎందుకు ఇండియా వచ్చానంటే!

వీటకన్నిటికి సమాధానం గా రామయ్య గారు ముఖ్యం గా   తాను వృద్ధుడైన ‘’తన అన్నగారు అనంత రామయ్య’’(నా అన్నయ్య)  గారిని చూడటానికి ఇండియా వచ్చానని ,స్వంత కనులతో భారతే సీమ అందాన్ని ఇక్కడి నదీ నదాలు పర్వత శ్రేణులు ,పూలూ ,మొక్కలు ప్రక్రుతి అందాలు దర్శింఛి పులకి౦చానని అచ్చతెలుగు మాటలతో అందరికి చెప్పి వారి కరతాళ ధ్వనులకు నిజంగానే పులకించిపోయారు .తన మాతృదేశం ఏ విధంగా రూపు మార్చుకోన్నదో తెలుసుకోవాలన్న ఆరాటం తనను ఇక్కడికి రప్పిం౦దన్నారు.గురజాడ అప్పారావు రాసిన అమర గీత౦ ‘’దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ ‘’గీతం  పాడి వినిపిచారు  .విభిన్న వర్గాల ప్రజలను కలిసి వారితో సంభాషిం చాలని ఉందన్నారు.అప్పుడే అసలైన భారత దేశ నవీన ముఖం అర్ధమవుతుందని చెప్పారు  తాను  ఇండియా నుండి చాలా తీసుకు వెళ్లానని ,కాని దానికి బదులుగా  చాలా తక్కువ మాత్రమే ఆమెకు ఇవ్వగాలిగానని వినమ్రంగా ప్రకటించారు . రష్యా వెళ్ళిన తర్వాత తాను  దీనిమీదనే ఇక నుంచి ఎక్కువ శ్రద్ధ పెడతానని  వినయ పూర్వకం గా విన్న వించారు .తాను  చేసిన శాస్త్రీయ కృషి ఇండియాలో పెట్రోలియం పరిశ్రమకు తోడ్పడితే తనకంటే ఆనందించే వారు ఉండరని చెప్పారు .తనకు హృదయ పూర్వక స్వాగతం చెప్పిన వారందరికీ ,ఢిల్లీ లో  గడిపిన నాలుగు రోజుల్లో తనపై ప్రత్యెక  దృష్టిని  పెట్టిన వారికి కృతజ్ఞతలు చెప్పారు .వారి మనసులలో ఉన్న సందేహాలన్నిటికీ సంతృప్తికరమైన సమాధానాలు చెప్పి సంశయ విముక్తుల్ని చేశారు రామయ్య .మాతృభూమి తనను ‘’అమృతమయి ‘’గా ‘’అమృతమాయి ‘’గా పుత్ర వాత్సల్యం తో  ఆలింగనం చేసు  కొన్నందుకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకొన్నారు .ఇంతటి అనుభూతి మళ్ళీ మళ్ళీ రాదు అన్నారు .ఏప్రిల్ 26 వ తేదీ ఢిల్లీ లోని పాలం విమానాశ్రయానికి విశేష సంఖ్యలో ముఖ్యులు వచ్చి హైదరాబాద్ వెడుతున్న రామయ్య గారికి ఘనమైన వీడ్కోలు పలికారు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –8-5-15 ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఎవరెస్ట్ కుంగింది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉభయ వేదాన్తాచార్య

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పతంజలి యోగ సూత్రాలు -రవిశంకర్ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మృత్యువును జయించటం సాధ్యమా /స్వరూపానంద

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ధర్మం -మతం -డా అరవింద రావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహాకవినని శ్రీ శ్రీ అనుకోలేదు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పట్టిసం అవసరమే

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment