

గబ్బిట దుర్గా ప్రసాద్


సాహితీ బంధువులకు శుభకామనలు -ఆశు కవితా సమ్రాట్ ద్విశతావధాని కీ శే రాళ్ళబండి
కవితా ప్రసాద్ గారిపై స్మృతి సంచికగా మూసీ మాసపత్రిక జూన్ సంచికను
ప్రచురించింది ఆంద్ర ,తెలంగాణా లలో ఇన్ని సాహిత్య సంస్థలు ,సాహితీ పత్రికలూ
ఉన్నా ఎవరూ చేయని సాహసం చేసి ఆ కవితా ప్రసాదాన్ని అందరికి అంద జేస్తున్నందుకు
మూసీ సంపాదకులు శ్రీ డా సాగి కమలాకర శర్మ గారిని అభినందిస్తున్నాను . కవితా
ప్రసాద్ గారిపై మూసీ లో వచ్చిన వ్యాసాలూ కవితలను ధారా వాహికం గా సరసభారతి
అందజేస్తూ తన వంతు సాహితీ సేవ చేస్తోంది . దీనితో ఆరు విషయాలు జత చేశాను చదివి
ఆనందించండి మిగిలినవి సరసభారతి వరుసగా అంద జేస్తుంది -మీ దుర్గా ప్రసాద్ –

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -44
18-వాస్తవితకు సాహిత్య గౌరవం తెచ్చిన ఫ్రెంచ్ రచయిత –ఎమిలీ జోలా -3
ప్రేమ వ్యామోహం
దీనికి రెండేళ్ళ ముందే జోలా గాఢం గా ప్రేమలో పడ్డాడు 1864లో ఎడమ గట్టు మీద కొత్త లాడ్జింగ్ వెతుక్కొని వెళ్ళిపోయాడు . అప్పటి నుంచి అలేక్సాండ్రిన్ మేస్లీ తో పిచ్చి మొహం లో పడ్డాడు .ఆమె తలిదంద్రులు అద్దెకిచ్చిన గదిలోనే ఉన్నాడు .ఆమె ఒక మెడికల్ స్టూడెంట్ కు కొత్తభార్య ఆమెను వేసవికి ఇంటిదగ్గర వదిలి భర్త వెళ్లి పోయి మళ్ళీ తిరిగి రాలేదు .ఆమె జోలాను ముగ్గులో దించినా ఓపిక పట్టి ఆమె భర్త తిరిగి వస్తే జరిగే పరిణామాలను గురించి ఆలోచించాడు .ఒక వేళ ఆమె ప్రియుడు తిరిగి వస్తే అలేక్సాండ్రిన్ పై అతనికే మొదటి హక్కు ఉంటుంది కదా అనుకొన్నాడు .ఈ స్థితిలో సుఖం గా గడపాల్సిన రాత్రులన్నీ ఈ సంక్షోభం తో కరిగిపోయాయి జోలాకు అతనే తిరిగి వస్తే తనకు ఆమె మొదటి ప్రేమికుడికి మధ్య ద్వంద్వయుద్ధం జరుగుతుందేమో ననుకొన్నాడు .అనుకోన్నట్లే కొన్ని నెలల తర్వాతా ఆ మెడికల్ స్టూడెంట్ తిరిగి రానే వచ్చాడు . వీరిద్దరి ప్రేమ గ్రహించిన ఆ మెడికో జోలాకు అలేక్సాండ్రిన్ ను స్వయం గా అప్పగించేశాడు .కొత్త దంపతులు విశాలమైన ఇంటికి కాపురం మార్చారు .అప్పుడు జోలా తల్లి వచ్చి కొడుకు కోడలుతో ఉంది. హాయిగా ఆనందంగా జీవితం గడిపారు ముగ్గురూ ..ఆరేళ్ళ తర్వాత ఆమెను చట్ట బద్ధం గా జోలా పెళ్లి చేసుకొన్నాడు .
ఇంప్రెష నిస్ట్
రెండేళ్ళ తర్వాతా తన సాహిత్య క్షేత్రాన్ని జోలా విస్తరించాడు .సెన్సేషనల్ గా వాస్తవానికి దగ్గరగా ఉండే ఒక గొప్ప నవల రాయటానికి తీవ్రం గా ప్లాన్ తయారు చేసుకొన్నాడు .అప్పటికే ‘’మై హేట్స్’’(-my hates ) అనే వ్యాస సంపుటిని ప్రచురించాడు చివరి సారిగా తాను రోమా౦టి జం ను త్యజిస్తున్నానని ప్రకటించాడు .యువ చిత్రకారుల భుజం తట్టి వారి ఇంప్రెష నిజానికి మద్దతు పలికాడు సిజానే తో కలిసి .సెలూన్ జూరీ దీనికి అనుమతించలేదు .’’పిక్నిక్ ఆన్ ది గ్రాస్ ‘’అనే చిత్రాన్ని గీసిన మానేట్ ను అభినందించాడు . దాన్ని ‘’పోకిరి ‘’చిత్రం అని విమర్శకులు దాడి చేస్తే జోలా ‘’A work of art is a corner of creation ,seen through a temperament ‘’అని జవాబు చెప్పాడు. ‘’తెరేసి రాక్విన్ ‘’ప్రచురించేటప్పటికి జోలా వయసు 27.ఈ నవలలో తాను సెక్స్ ,హత్య , పశ్చాత్తాపం మొదలైన వాటిని చర్చించానని జోలా చెప్పాడు. అశ్లీలం గా జంతు ప్రేమకు పరాకాష్టగా ఉందని విమర్శకులు అన్నా, రెండవ ముద్రణ పొందింది .
25 ఏళ్ళ పరిశోధనా కృషి ఫలితమే రోగాన్ –మాక్వార్ట్
నిశ్చయత్వం లో పూర్తిగా మునిగి పరిసరాలు ,హీరేడిటిల ప్రభావాలను చర్చించాడు . వాటి ప్రభావాన్ని గణితం చెప్పినంత కరెక్ట్ గా చెప్పగలిగాడు .ఫిక్షన్ రచనలలోని వ్యక్తుల ప్రవర్తనను వారి జీవిత నేపధ్యం దృష్టిలో రాశాడు .ఇందులో పెంపకం, రక్తం ,ఏయే ప్రభావాలు కలగ జేస్తాయో క్లినికల్ లేబరేటరీ లో పరీక్ష చస్తే వచ్చే ఫలితాలు ఎంత స్పష్టంగా ఉంటాయో అంత స్పష్టంగా చెప్పగలిగాడు బాల్జాక్ రాసిన ‘’కామెడీ హ్యూమనే ‘’ఆధారం గా మరో గొప్ప నవల కు ప్లాన్ తయారు చేసుకొన్నాడు .లైబ్రరీలలో కూర్చుని మోనోగ్రాఫులు ,కేస్ హిస్టరీలు ,మానసిక అధ్యయనం ,వ్యవహార పత్రాల పరిశీలన ను అతి జాగ్రత్తగా అధ్యయనం చేసి వాటిని తనకున్న మనోభావాలతో విశ్లేషించి వివరించాడు .సమాజం పై తనకున్న భావాలు వ్యక్తుల ప్రవర్తన ,వారి మానసిక శారీరక స్తితి లపై చేసిన ఈ పరిశోధన 25 భాగాల ‘’రోగాన్ –మాక్వార్ట్ ‘’నవలలకు సరిపడ సామగ్రి గా లభించింది . ఈ బృహత్తర గ్రంధ రచనకు 25 ఏళ్ళు పట్టింది ఇవన్నీ 90 రాత ప్రతులలో భద్రం చేశాడు .రోగాన్ –మక్వార్ట్ కుటుంబాలకు చెందిన 32 మంది వ్యక్తుల సమగ్ర రిపోర్ట్ ఇది దీనికోసం ఎందరో వ్యక్తుల మహళ్లకు ,మురికి కూపాలకు అడ్డాలకు అనేక సార్లు వెళ్లి వచ్చేవాడు .పోలీసు రికార్డ్ లు పరిశీలించాడు తన రచన చాలా నిర్దుష్టంగా సంపూర్ణం గా దోష రహితంగా ఉండాలన్న తపనే ఇదంతా .
ప్రతి పుస్తకాన్ని వేరుగా ఒక యూనిట్ గా ఉంచాడు .ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ నిర్మాణానికి రాళ్ళు ఎలా అవసరమో ఇవి ఆయన బృహత్తర నవలకు మూలాదారాలయ్యాయి .దీనిపై హెన్రి బార్బాస్ స్పందిస్తూ ‘’ in the entire history of intellectual creation there is scarcely another example of a man seeing so far in advance with such precision the concrete contours of a multi form work ‘’అని గొప్పగా విశ్లేషించి చెప్పాడు ‘’![]()
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-6-15-ఉయ్యూరు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -43
18-వాస్తవితకు సాహిత్య గౌరవం తెచ్చిన ఫ్రెంచ్ రచయిత –ఎమిలీ జోలా -2
ఇరుకు గదిలో ఇద్దరు
ఉద్యోగం కోసం ఎదురుచూపులు మానేసి అప్పుచేసి దాంతో పోట్టకింత తింటూ ఒక మేడమీద పై భాగం లో చిన్నగది బాడుగకు తీసుకొని ,ఎత్తు మెట్లు ఎకుతూ దిగుతూ అక్కడ ప్రోఫెషనల్ బోహీమియన్ లా ఉన్నాడు . బద్ధకం గురించి చెబుతూ ‘’బద్ధకం మహా గొప్పది. దానివలన ఎవరూ చచ్చిపోరు .’’అంటాడు తన పూర్వ స్నేహితులిద్దర్నీ తనతోకలిసి వచ్చి లాటిన్ క్వార్టర్ లో ఉండమని ఆహ్వానించాడు .కాని సిజానే మాత్రం మూడేళ్ళు తండ్రితో తీవ్ర యుద్ధం చేసి వచ్చి చేరాడు . ఆ చిన్న ఇరుకు గదిలోనే ఇద్దరూ సర్దుకున్నారు .సిజనే కొచ్చే అలవెన్స్ తోనే ఇద్దరూ గడిపారు .ఇద్దరికీ విసుగనిపించి వేర్వేరుగా గదులు తీసుకొని వేరైపోయి ఉన్నారు. ఐక్స్ లో సిజానే ఇబ్బంది పడుతూ ఇంటికి వెళ్లి పోయాడు .జోలా ఒంటరిగా పేదరికం లో మగ్గుతూ గడిపాల్సి వచ్చింది .రోమా౦టిసిజం ను ఇంకా పట్టుకొని వేలాడుతూనే ఉన్నాడు అవి ఏమీ ప్రతి ఫలాన్ని పిండటం లేదు .’’ఈ నగరం లో విశ్రు౦ఖల వేశ్యా విహారం తప్ప ఏమీలేదు .పోనీ పల్లెటూళ్ళల్లో ఏదైనా ఉందనుకొంటే అక్కడ అంతా మూర్ఖత్వమే ‘’అన్నాడు జోలా .కని పించిన ప్రతి చోట ప్రేమ కోసం అన్వేషించాడు .కాని అదీ ఆకాశ కుసుమమే అయింది .’’everywhere sex but nowhere woman ‘’అనుకొన్నాడు .ఉద్యోగం వెన్నులో వణుకు పుట్టిస్తోంది .అవి తనను పూడ్చి పెట్టనిమ్మనుకొన్నాడు .
పిచికల్ని కాల్చుకు తిన్న అతి దరిద్రం
కొంతకాలం దరఖాస్తు పెట్టకుండా ఉద్యోగం వేట చేశాడు .అతని ఆకారం, దుస్తులు ,చూపులు చూసిన వారెవ్వరూ ఇంటర్వ్యు చేయట౦ , ఉద్యోగం ఇస్తానన్న సాహసం చేయ లేకపోయారు .తనకు తాను అంచనా వేసుకొన్నాడు తాను వేసుకొన్న మార్కులు కూడా చాలా పూర్ .కవి ,స్వేచ్చా ప్రేమ తో ఉన్న బోహీమియన్ అను కొనేవాడు .ఇరవై ఒక ఏడాది వరకు అస్కలిత ఘోటక బ్రహ్మ చారి గా ఉన్నాడు .ఒక వేశ్య దొరికితీ ఆమె తో కొన్ని నెలలు గడిపాడు .ఈ కలయిక సుఖాన్ని ఏమీ అందించలేదు .బీదరికాన్ని ,బీద జనాన్ని చీదరించుకొనే జోలా ,సంఘాన్ని తిట్టిపోశాడు ,కాని దాన్ని సహించాడు .చాలీ చాలని దుస్తులు ,ఎప్పుడూ కడుపులో ఆకలి మంటలు .కళ్ళల్లో క్రోధం అదీ జోలా పరిస్థితి .రాయటానికి అసలు ఇష్టపడే వాడు కాదు . గైడీ మొపాసా అనే ప్రముఖ రచయిత రాసిన దాన్ని బట్టి జోలా గదిలో పిచ్చుకలు గూళ్ళు కట్టుకొని ఉండేవి వాటిని కర్టెన్ రాడ్ మీద ఉదికి౦చు కొని ఆత్మా రాముడికి శాంతి కలిగించేవాడు . అంతటి దుర్భర దారిద్ర్యం అనుభవించాడు జోలా .లేక పోతే అవి తెచ్చుకొని వదిలేసిన రొట్టేముక్కల్నిదక్షిణ ప్రాంతం నుండి పంపిన ఆలివ్ ఆయిల్ లో ముంచు కొని తినేవాడు . మరీ దారుణంగా పతనమై పోయాడు ఆర్ధికం గా .అప్పుడు తెలిసింది ఒక స్నేహితుని ద్వారా తన తండ్రి ఒక పబ్లిషింగ్ కంపెనీ లో ఒక ఉద్యోగాన్ని కుదిర్చాడని తెలిసింది .
ఉద్యోగం –మొదటి కదా పుస్తకం –మొదటి నవల
ఆ మాట విని ‘’విశ్వాసం మళ్ళీ వచ్చింది .నిజమే అని నమ్మాను .ఇప్పుడు నాకు నవ్వు వస్తోంది ‘’ ఆకంపెనీ అధికారి మన్సూర్ హేచాటీ జోలా రచయిత అని తెలుసుకొని ప్రొమోషన్ ఇచ్చి అడ్వర్ టైజ్ డిపార్ట్ మెంట్ లో ఎక్కువ జీతం ఇచ్చి ప్రోత్సహించాడు .ఈ విషయాన్ని సిజానే కు రాస్తూ తన పాత రచనలపై అభిప్రాయాలకు మెరుగులు దిద్దాలనుకోన్నానని చెప్పాడు .బాగా వినిపించాలని బాగా చూడాలని అనిపిస్తోందన్నాడు ఇదివరకు లేని కొత్తభావాలు తనలో వికసిస్తున్నాయన్నాడు ప్రకృతి లో చాలా కవిత్వం ఉంది అలా కనిపిస్తుంది కూడా అన్నాడు .ఇది వరకు రాసిన రొమాంటిక్ కధలను అన్నిటినే సేకరించి మేగజైన్స్ లో ప్రచురించేట్లు చేశాడు . మిగిలినవీ రాశాడు. వీటినన్నిటిని కలిపి ‘’’’స్టోరీస్ ఫర్ నినాన్ ‘’పేరుతొ ప్రచురించాడు . ఇదే జోలా మొదటి పుస్తకం .అప్పటికి ఆయన వయసు 25.తర్వాత వేశ్యతో తాను గడిపిన అశాంత జీవితాన్ని ఒక నవలగా ‘’కన్ఫెషన్స్ ఏ క్లాడ్ ‘’.రాశాడు .దీన్ని తన ప్రియ మిత్రులైన సిజనే ,బైలీ లకు అంకితమిచ్చాడు ఈ నవల సిగ్గుమాలిన నవల అని అందరూ ముందు అన్నా తర్వాత విపరీతమైన విజయాన్ని సాధించి ఉత్సాహాన్నిచ్చింది .ఈ సందర్భం గా సిజనే –జోలా చిత్రాన్ని గీసి బహూక రించాడు అందులో జోలా లోని కల ,నిశ్చయం రెండూ సమతూకం లో కనిపిస్తాయి .
ఫ్లాబర్ట్ చెప్పే నేచురలిజం చూసి దాని ప్రచారం విని తెలుసుకొని తన రచన చాలా పేలవం గా ,జీవం లేనిదానిలా ఉందని జోలా గ్రహించాడు .’’మాడంబోవరీ’’రాసినందుకు ఫ్లాబర్ట్ ను అందులో అనైతికత ఉందని కోర్టుకు లాగారు అందులో అన్నీ చాలా వివరంగా ఫ్లాబర్ట్ రాశాడు .’’మంచి అభిరుచి ‘’ చదువరులకు అందించాలనే ఆలోచన వచ్చింది .ఇదే నేచరిలిజం కు దారి తీసింది “”zola envisioned a kind of writing which would shock the world by its power and range ,a series of books from which nothing could be excluded .’’అనే ఒక ఆలోచనలోకి వచ్చాడు .ఈ సందర్భం లో జోలా ‘’When I attack a subject ,I want to force the whole universe into it ‘’అని చెప్పుకొన్నాడు .జోలా పని చేస్తున్న కంపెనీ దాని అధికారి హచాటీ లవి భిన్న ఆలొచనలుగ ఉండేవి .తన జీవిత చరిత్రగానే రాసిన ‘’కన్ఫెషన్స్ ‘’నవల అతని కంపెనీలో ద్వేషాలు పెంచింది .మూడేళ్ళు అలాగే లాక్కొచ్చి రాజీనామా చేసేశాడు .వెంటనే చారిత్రాత్మకం గా గొప్ప నవల ‘’ది ఇస్స్యు ‘’ను ధారావాహికం గా పారిస్ వార్తాపత్రికకు రాశాడు .దీన్ని మెచ్చిన సంపాదకుడు ఆ పత్రికలో రెగ్యులర్ కాలం రాయమని కోరాడు .’’A young man versed in all the arts whose books ,few but excellent ,have already produced a sensation ‘’అని మెచ్చుకొన్నాడు కూడా .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-6-15 –ఉయ్యూరు
వాన రాకడ… ప్రాణం పోకడ… -అని మనవాళ్లు ఊరికే అనలేదు. ఈ రెండూ ముందుగా గుర్తించడం అసంభవం. ఎంత శాస్త్ర సాంకేతికాభివృద్ధి జరిగినా, అంచనాలు వేయడమంటూ జరిగినా, అనుకున్నట్టుగానే జరుగుతుందని అస్సలు చెప్పలేం! అయితే ‘అతివృష్టి’ – లేకుంటే ‘అనావృష్టి’ అన్నట్లు పరిస్థితులుంటూంటాయి. ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా – ఎన్నాళ్లని దాక్కుంటావే పైనా’ అని వర్షం పాటలు ఎన్ని పాడుకున్నా, అది రాదలచుకుంటే వస్తుంది. లేదంటే లేదు. వచ్చినా ఎంత శాతంగా తన ‘పాతం’ నమోదు చేసుకుంటుందో, జరిగాక కానీ చెప్పలేం! వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో – ఆ వ్యవసాయం కూడా ప్రధానంగా వర్షాధారితం కనుకనే, ‘వాన రాకడ’ పట్ల మనకంత నిరీక్షణలూ, మమకారాలూ! కానీ, రోజులు మారిపోతున్నాయి. మేధోమథనాలు, మేఘ మథనాలు వచ్చాక ‘దృక్పథాలూ’ మారిపోతున్నాయి. ఒకప్పుడు వానతో ముడివడిన అనుభూతులు క్రమంగా అంతరించి పోతున్నాయేమోనన్న బెంగా కలుగుతోంది. ‘వానల్లు కురవాలి వానదేవుడా వరిచేలు పండాలి వానదేవుడా’ ‘వానావానా వల్లప్పా’ అని పాడుకునే పిల్లలు ఇప్పుడు – ‘రెయిన్ రెయిన్ గో ఎవే’ అని పాడుతున్నారు. వరుణుడికి కోపం వస్తే రావచ్చు మరి. ‘ఎల్.కె.జి. రైమ్కీ, ‘ఎల్నినో’కు సంబంధం ఉంటుందా? అంటే ‘ఎమోషనల్ బ్లాక్మెయిల్’ అయిపోవచ్చు. మెయిల్ కాదు గానీ, ‘మొయిలు’ అంటే మేఘం అనే. ‘బ్లాక్మెయిల్’ అనగా నల్లని మేఘం అంటే వర్షవాహికగా భావిస్తాం మరి! ‘మబ్బుల్లో నీరు చూసి ముంత ఒలకబోసుకుంటామా’ – అలా చేస్తే ఇప్పటికే తాగునీరు సమస్య పెరిగిపోతోంది. అది మరీ గుక్కెడు నీరు అందని విపత్కర పరిస్థితి తెచ్చేయవచ్చు. గుంపులు గుంపులుగా కనపడ్డ మబ్బులు గుప్పెడు నీళ్లయినా చల్లకుండా తేలిపోవచ్చు. ‘కుంభవృష్టి’ అనగా కుండపోత నీరు పడడం పోయి వాన వాటర్బాటిల్ ఒంపినట్లుగా పడి ముగిసిపోనూ వచ్చు. అసలు ‘వానాకాలం’ అనే దానికి గొప్ప ప్రాధాన్యం. సకాలంలో పంటలు పండాలంటే సకాలంలో వర్షాలు కురవాలి. వర్షం కాకుండా డ్రిప్ ఇరిగేషన్ అంటూ బిందు వ్యవసాయంలోకి దిగితే ‘డిప్రెషన్’ రావచ్చు. రైతు ఆత్మహత్యలకు వర్షాభావ పరిస్థితులూ హేతువులవుతున్నాయనే మాట ఉంది. పర్యావరణ సమతుల్యతను చేజేతులా మనమే దెబ్బతీసి అడవులు, చెట్లు నరికివేస్తుంటే ఇక సహజ వర్షాలను చేజేతులా అడ్డుకున్నట్లే అని శాస్తవ్రేత్తలు ఘోషిస్తూన్నారు. ‘వానలో తడవనివాడు’ మనిషే కాడు. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికి, సహజసిద్ధంగా జీవనం గడపవలసిన మనిషి ఆ సహజాతాలకు దూరంగా ఆ కాలానికి తగినట్లుగా కాక ప్రతికూలతలను సౌకర్యాలుగా సంభావించి అనుభవించడం నేర్చుకుంటున్నాడు. వానలో తడిస్తే మొక్క మొలిచి పోతానన్నట్లు భయపడుతున్నాడు. వివేకం బదులు విలువలు నశించి బుర్రలో మట్టి పెరుగుతున్నప్పుడు సదరు భయాలు సహజమే అనిపిస్తోంది కూడాను. మునుపు ‘వానాకాలం చదువులు’ అనేవారు. వర్షపురోజుల్లో బడులు, బోధనలు సెలవులెక్కువ పుచ్చుకునేవి అప్పుడు. కానీ, వానాకాలం చదువు అంటే నిజమైన వ్యవసాయ విద్య అనే భావనా వుండేది. చెట్లు చేమలతో, పొలాలతో ప్రకృతితో ప్రతి మనిషికీ అవినాభావ సంబంధం ఉండేది ఆ రోజుల్లో. ఇప్పటి పిల్లలు కొందరు బియ్యం చెట్లకు కాస్తాయనుకుంటున్నారంటేనూ, ఏది ఏ పొలమో, ఏది ఏ చెట్టో మొక్కో చాలామంది గుర్తించలేని స్థితిలోనే వున్నారంటేనూ వానతో, ప్రకృతితో వారికి అనుబంధం ఎడమై పోవడమే. సన్నగా వర్షం పడుతూంటే రేడియోలో వివిధభారతిలో ఏ హిందీ పాటనో వింటూ, వేడివేడి పకోడీలో, మిరపకాయ బజ్జీలో తినడంలోని అనుభూతి- ఆ మజా అనుభవిస్తే గానీ తెలియదు కదా! ఇప్పుడు రేడియో ఔట్ ఆఫ్ డేటెడ్ కదా పాపం! ‘బర్సాత్ కీ ఏక్ రాత్’, ‘వర్షం కురిసిన రాత్రి’ లాంటి కథలు సాహిత్యంలో హృదయదఘ్నంగా చేరువైన రోజులూ వెళ్లిపోతున్నాయి. ‘కొమ్మచాటు పువ్వు తడిసె – ఆకుచాటు పిందె తడిసె’ అని వర్షపు గీతాలు, సినిమాల్లో వర్షపు సన్నివేశాలు ఎంతగా ఎందరి అనుభూతి ప్రపంచాన్ని చుట్టుకున్నాయో మాటల్లో చెప్పడం కష్టమే! వర్షంతో ముడిపడిన కథలెన్నో! కావ్యాలెన్నో! ‘నగరంలో వాన’ అని కుందుర్తి సుదీర్ఘ వచన కవిత రాశారు. అలాగే, వర్షం గురించి వంగపల్లి విశ్వనాథం అనుభూతి వీచికలు కవితాత్మకం చేశారు. సినిమాల్లో వాన పాటలు, వాన దృశ్యాలకు కొదవే లేదు. మబ్బు మరణించి వానగా మారిపోవు విత్తు మరణించి మొక్కగా మారిపోవు అంటూ మృత్యుకేదారముననె జీవి సుమించుట చూస్తాం- అని తాత్త్విక కవిత నల్లిన వారున్నారు. వానలు ముంచెత్తితే వరదలే! గాలివాన ఒక బీభత్స దృశ్యమే. పాలగుమ్మి పద్మరాజుగారి ‘గాలివాన’ కథకే అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇప్పుడు తుపానులు కూడా కొత్తకొత్త పేర్లు పెట్టుకుని వస్తున్నాయి. మొన్నటికి మొన్న ‘హుద్హుద్’ తుఫాను అందాల విశాఖను ఊడ్చిపారేసింది. ఇప్పుడిప్పుడే విశాఖ మళ్లీ ప్రకృతి అందాల చిగుళ్లు తొడుక్కుంటోంది. వరద బీభత్సాలు పంటలను, గ్రామాలను పాడుచేస్తే వర్షాభావ పరిస్థితులు కరువు కాటకాలు తెస్తాయి. వానలు పడక పోవడమంత దురదృష్టం మరొకటి లేదు! వర్షాల గురించి అధ్యయనాలు ఇవాళ ప్రపంచమంతటా సాగుతున్నాయి. వాతావరణ శాఖ వాన రాకడ అంచనాలకు అహర్నిశలూ కృషి చేస్తూ ఉంది. డైనమిక్ థియరీ, జెట్ స్టీమ్ థియరీ వంటి కొత్తకొత్త పరిశోధనలు వచ్చాయి. ఎల్నినో ఏర్పడితే వర్షాభావ పరిస్థితులెదురై కరువు కాటకాలకు దారి తీస్తుందంటున్నారు శాస్తజ్ఞ్రులు. పసిఫిక్ మహాసముద్ర జలాల్లో వచ్చే ఉష్ణోగ్రతల్లోని పెనుమార్పులే ఎల్నినోకు కారణం సాధారణ ఉష్ణోగ్రతలకన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు మధ్య తూర్పు పసిఫిక్ జలాల్లో సంభవించి మిగిలిన సముద్ర ప్రాంతాలకు విస్తరించడమూ జరుగుతోందిట! వేడి నీటి ప్రవాహాలు సముద్రంపైన గాలిలో నీరు చేరేందుకు అడ్డుపడి వర్షాభావంతో కరువులకు నెలవులు అవుతూంటాయి. సముద్రపు నీటి ప్రవాహాల్లో వేగం తగ్గడం కూడా ఎల్నినో ఏర్పడడానికి సంకేతం అంటున్నారు శాస్తజ్ఞ్రులు. నీటి ఉష్ణోగ్రత సామాన్య స్థితికన్నా బాగా తగ్గిపోవడంవల్ల ‘లానినా’ సంభవిస్తుంది. ‘ఎల్నినో’ అయినా, ‘లానినా’ అయినా ఉష్ణోగ్రతల్లో తారతమ్యాల వల్ల ప్రమాద సూచికలయ్యే వీలుంది మరి! భూగర్భ జలాలు కూడా క్రమేపీ తగ్గిపోతున్నాయి. చెరువులు, కుంటలు కూడా కబ్జాలకు గురై, కాంక్రీటు భవనాలు లేచిపోతుంటే పర్యావరణం దెబ్బతినక ఏమవుతుంది? దారికి ఇరుపక్కలా మొక్కలు నాటించిన, బావులు తవ్వించిన అశోకుడు వంటివారు ఇవాళ చరిత్ర పుటలకే పరిమితమై పోయారు. వ్యక్తి స్వార్థంతో ప్రకృతి వనరులు కూడా దోపిడీకి గురవుతున్నాయి. మొక్కలు నాటడం కన్నా నరకడం పరిశుభ్రత అనుకునే దుస్థితి వచ్చింది. ‘వన మహోత్సవం చేద్దాం మొక్క నాటడానికి చోటు చూడండి’ అని అధికారులు ఆదేశిస్తే, ‘గత సంవత్సరం నాటిన చోటు బానే వుందండీ! అక్కడే నాటేద్దురుగాని’ అని సమాధానమిచ్చే సహాయకులు, స్వచ్ఛ భారత్ చేయాలంటే చీపుర్లు పట్టడం కోసం ఆ నేతలకు సమీపంలోనే చెత్త చేర్చేవారు రూపొందుతున్నారు. ‘వాన నీటిని వృథా కాకుండా కాపాడాలి’ అన్నది నినాదంగా మిగిలిపోకూడదు. వానలు అరుదై పోతే వాననీరు మరీ అరుదై పోతుంది. కృత్రిమ వర్షాలు కృత్రిమ వర్షాలే అవుతాయ గానీ రుతుపవనాలతో సహజసిద్ధంగా వర్షించినవి కాజాలవు కదా! నైరుతి రుతుపవనాలు మే నెలాఖరు నుండి జూన్ మొదటి వారంలో ప్రవేశించడం మన దేశంలో సహజంగా జరుగుతూ ఉంటుంది. వీటి కారణంగా సెప్టెంబర్ వరకు వానలు పడే వీలుంటుంది. అయితే, వర్షపాతం ఎక్కువ, తక్కువలు అనేది సముద్ర జలాల ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఉంటుంది. మబ్బులు ఏర్పడటంతో సరిపోదు. అవి సరియైన దిశగా పయనించి కొండలను తాకి తాము ధరించిన నీటిని వర్షించడం ముఖ్యం. ఈ పరిణామం సహజంగా ఎంత చక్కగా జరిగితే వర్షపు పరిమాణం అంత హర్షదాయకం అవుతుంది. నీరే ప్రాణాధారం అన్నారు. భూమినైనా మూర్ఛ నుంచి తేర్చేది వర్షపు నీరే. వర్షం రైతు నేస్తం మాత్రమే కాదు. సర్వ జీవరాశి జీవన నేస్తం కూడాను. వానల కోసం భారత విరాట పర్వ పారాయణాలు చేయడం, కప్పలకు పెండ్లి చేయడం ఈ భరత భూమిలో ఇప్పటికే జరుగుతూనే ఉంది. వానాకాలం అంటే ప్రాణకోటి జీవనకాలం ప్రకృతితో మమేకమై విలువల జీవధార నింపువడం ఎప్పటికీ అవిస్మరణీయ అంశం. * కాలం మారింది! సంగీతంలో శ్రుతి బాగుంటేనే శ్రావ్యంగా ఉంటుంది. అది మనసుకు హాయినిస్తుంది. రుతురాగం బాగుంటేనే మనిషి బతుకు బాగుంటుంది. శ్రుతి, లయ తప్పితే విలయమే. ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా భారతీయుల జీవితానికి రుతురాగమే చుక్కాని. తొలకరితో మొదలయ్యే వారి జీవనరాగం, మధురిమలొలకాలంటే ఏ కాలానికి ఆ కాలం తన పని తాను చేసుకుపోవాలి. ఆ పనికి మనిషి ఆటంకాలు కల్పిస్తే వచ్చే విలయానికి బలయ్యేది అతడే. అది ఇప్పటికే అనుభవంలోకి వచ్చేసింది. రోహిణి కార్తెలో రోళ్లు పగలడం మామూలే అయినా ఇప్పటిలా పిట్టల్లా మనుషులు రాలిపోవడం ఇటీవలి కాలంలో ఎదురైన విషాదకర పరిణామం. నీడను, తిండిని, చక్కటి గాలిని ఇచ్చే చెట్టూచేమను తెగనరికిన ఫలితం ఇది. సముద్రాలు వేడెక్కి ఏర్పడిన మేఘాలు చల్లబడటానికి కావలసిన చల్లని గాలిని ఇచ్చే చెట్లు లేకపోతే ఏం జరుగుతుందో ఇప్పటికే మానవాళికి అనుభవంలోకి వచ్చింది. పచ్చనిచెట్టు నరకొద్దని పూర్వం ఎందుకు చెప్పేవారో ఇప్పటి తరానికి అర్థం కాదు. వసంతం వచ్చినా కోకిల గొంతుల్లో అప్పటి మాధుర్యం విన్పిస్తోందా? మేమున్నామంటూ అక్కడో, ఇక్కడో ఓ కోకిలగొంతు సవరించుకుంటున్నదే తప్ప అప్పటిలా కుహుకుహుల వింజామర ఏదీ! ఎండమావి ఎలా ఉంటుందో వేసవి చెబుతుంది. తీరని కోర్కెలు, లేదా అలవికాని హామీలను ఎండమావితో పోల్చేవారు. ఇప్పటి తరానికి ఈ రెండు అనుభవమే. అలాగే బతికేస్తున్నాం. వేసవికాలం పెరిగిపోయి, వర్ష రుతువు చిన్నబోతోంది. తొలకరి కోసం దేశం యావత్తూ ఎదురుచూస్తుంది. ఎందుకు. మిగతా ఏడంతా పనీపాట, పాడిపంటా, డబ్బూదస్కం దండిగా రావాలంటే తొలకరితోనే సాధ్యం. అందుకే ఆశగా ఆకాశం వైపు, కరిమేఘాల కోసం, వానచినుకు కోసం పరితపిస్తాడు రైతు. మన చేతినిండా పంట, పశువు కడుపు నిండా గ్రాసం కావాలంటే తొలకరి సకాలంలో పలకరించాల్సిందే. తొలి చినుకులతో తడిసిముద్దవ్వడం ఓ తరహా ఆనందం. తొలకరి వానలో చిన్నాపెద్దా తడిసిముద్దవ్వడం అలనాటి మురిపెం. చూరుకింద బొట్లు, బొట్లుగా జారే ముసురువాన నీటిచుక్కలతో వచ్చే బుడగలు అలా లేచి టప్పున పేలిపోవడం ఓ ముచ్చట. జీవితం కూడా అలాంటిదేనని, ఎప్పుడు ఎలా ముగుస్తుందో చెప్పలేమనడానికి ఆ బుద్బుధం ఓ సంకేతం. అలా మరీ ప్రవాహం కాని చూరునీటిలో కాగితపు పడవులు వేయడం ఓ ఆనందక్రీడ. పనికిరాని కాగితాలతో పడవలు చేయడం పెద్దవారికి, వాటిని నీటిలో విడవడం, ఆడటం చిన్నవారికి వానాకాలం వినోదం. ఇప్పుడు వానలు తగ్గిపోయాయి కనుక ఆ ఆటలు దూరమయ్యాయి. పడవ చేసే ఓపిక, ఆసక్తి ఇప్పటి జనంలో పూర్తిగా కనుమరుగవ్వలేదుకానీ, తగ్గిందనే చెప్పాలి. జీవనశైలిలో వచ్చిన మార్పులకు, వాతావరణంలో వచ్చిన మార్పు జోడెద్దుల్లా తయారై జీవనగమనాన్ని మార్చేస్తున్నాయి. రొంప చేస్తుందని తెలిసినా అప్పటి జనం వానల్లో తడిసిముద్దయ్యేవారు. రైతులకైతే వానలోనే పొలాల్లోకి చేరి నారుకట్టడం, నాట్లువేయడం తప్పనిసరి చర్య. ఎండలు తగ్గి, వానలు పెరిగితే ఆ ప్రభావం ఆరోగ్యం ప్రతికూల ప్రభావం చూపేమాట నిజమే అయినా అందుకుతగ్గ జాగ్రత్తలు తీసుకోవడం పూర్వీకులు ఎప్పుడో నేర్చారు. అయితే, కాలచక్రంలో అనూహ్య మార్పులు రావడంవల్ల, అజాగ్రత్తవల్ల పైప్రాణాలు పైనే పోతున్నాయి. వర్షాలొస్తే తడవకుండా ఉండటానికి పడే తాపత్రయం ఓ సరదా సన్నివేశమే. ఇళ్ల పైకప్పులు సరిగా లేకపోతే వాననీరు గదుల్లో ఉరవడం, అవి ఇల్లంతా పాకిపోకుండా చూసేందుకు గినె్నలు ఆ నీటిధార పడేచోట పెట్టడం ఓ జాగ్రత్త. రోజుల తరబడి ఉండే ముసురు- ఇప్పుడు మురిపానికి కూడా ఎదురవడం లేదు. వస్తే కుండపోత లేదా ఒకటీ అరా చినుకే దక్కుతోంది. ఇక ఆ తరువాత శిశిరం. వేసవికాలం పెరిగిపోవడం, వర్షాకాలం చిక్కిపోవడంతో పెద్దగా ఎవరినీ వణికించడం లేదు. చల్లని చిరుగాలుల్లో తిరుగుతూ మొక్కజొన్న కండె, పక్కన చెలికత్తె ఉంటే ఆ చలి బలాదూర్. కానీ, ఈ ఆనందం అనుభవించేలోగా శీతాకాలం శీతకన్ను వేస్తోంది. వేసవిలో మల్లెపూల పరిమళం, సంపెంగల సువాసనలు ఆస్వాదించడంలో ఆనందం ఉంది గానీ, కోస్తా తీరంలో వేడిగాలులు, స్వేదధారలు దానిని కడిగేస్తాయి. వర్షాకాలంలో పుష్పవిలాసం తక్కువేగానీ శిశిరంలో బంతీచామంతులు కాంతలకు ఇష్టమే. అద్భుతమైన పరిమళం మాటకాదు గానీ, ఇంటికి, ఇంతికి అవి తెచ్చే అందం అంతాఇంతాకాదు. వర్షం పడుతున్నప్పుడు ఒకే గొడుగు కింద దూరి, వాటి చూరులోంచి ఓ మాదిరి ధారలు పడీపడకుండా, తడిసీతడవకుండా తప్పించుకుంటూ ఒకరినొకరు రాసుకుంటూ,పూసుకుంటూ సిగ్గులొలికే జంట ఆనందం ఆ గొడుగుమాటున మనకు కన్పించదు కానీ అదంతా వర్షం పుణ్యమే కదా. ఇప్పుడొచ్చే వర్షాలు ఆ గొడుగులను ఎగరేసుకుపోయే స్థాయిలో లేదా గొడుగులు అవసరమే రాని స్థాయిలో పడుతున్నాయే తప్ప అప్పటిలా సాధారణ స్థాయిలో ఉండటం లేదు. సప్త సముద్రాల మాటేమోగానీ మనదేశం చుట్టూ ఉన్న మూడు సముద్రాలపై గాలులు, ఆ పక్కనే ఉండే పసిఫిక్ సముద్రగాలులు, మేఘాలకు హిమాలయాల అడ్డంకులు కలసి కురిసే వర్షమే భారతావనికి ప్రాణం. రైతుకు ఆయువు. పంటకు ఆధారం. ప్రపంచంలో కేవలం ఋతుపవనాలపైనే ఆధారపడి, వ్యవసాయానికి అవసరమైన నీటిలో దాదాపు 80శాతం ఇస్తున్న ఆ గాలుల దిశ, దశ ఇప్పుడు పూర్వంలా స్థిరంగా లేదు. దీంతో భారతీయుల జీవనమార్గం లయ తప్పుతోంది. దాంతో ఆనందం ఆవిరైపోతోంది. భారత ఆర్థికరంగంలో 80శాతం వ్యవసాయం ద్వారానే వస్తోంది. ప్రజల్లో 70శాతం మంది దీనిపైనే బతుకు వెళ్లదీస్తున్నారు. మన దేశ స్థూల జాతీయోత్పత్తిలో 20శాతం దీనిద్వారానే సమకూరుతోంది. ఒక్క ఏడాది రుతుపవనాల గమనం లయ తప్పితే అది దేశ ఆర్థిక, జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే అటు రైతైనా, ఇటు ప్రభుత్వమైనా తొలకరి కోసం పరితపిస్తాయి. ఆ పవనాలు తమకు అనుకూలంగా వీయాలని ప్రార్థిస్తారు. ఆ ప్రార్థన వరుణుడు విని కరుణిస్తే చాలు. అదే పదివేలు. * నైరుతి, ఈశాన్య రుతుపవనాలు భారతదేశ వ్యవసాయ అవసరాలను తీరుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణభారత దేశం యావత్తూ ఈ రుతుపవనాల వల్ల లబ్ధి పొందుతున్నాయి. ఉత్తర భారతదేశానికి లాభం ఉన్నా ఇబ్బందులూ వీటివల్ల ఎక్కువే. ప్రపంచంలో అత్యంత నాటకీయంగా, క్రమం తప్పకుండా వచ్చే ఈ తరహా రుతుపవనాలు భూగోళంపై మరెక్కడా కానరావు. ఈ మధ్య ఎదురౌతున్న ‘ఎల్నినో’ ప్రమాదం వల్ల రుతుపవనాల గమనంలో మార్పు కన్పిస్తోంది. భారతదేశంలో కేవలం రుతుపవనాలపై ఆధారపడి 60 కోట్లమంది జనాభా బతుకుతున్నారు. వీటి గమనంలో తేడాలొస్తే వారి జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. పంటలు పండకపోతే ధరలు పెరిగి, పనులు లేక వారు ఇబ్బందులు పాలవుతారు. అందుకే అందరి దృష్టి రుతుపవనాల రాకపైనే ఉంటుంది. మనదేశంలోకి వచ్చే నైరుతి రుతుపవనాలు రెండుగా చీలిపోయి అడుగుపెడతాయి. ఒకభాగం మలబారు తీరంలోని కేరళను తాకి దేశంలోకి వస్తాయి. మరోభాగం అండమాన్ నికోబార్ దీవుల్లోని ప్రాంతాలను తాకి మరోవైపునుండి చుట్టబెడతాయి. ఇక ఆ పవనాలు నెమ్మదిగా దేశమంతటా వ్యాపించి నెమ్మదిగా బలహీనపడతాయి. ఇక ఈశాన్య రుతుపవనాలు ఉత్తరాదికి కొంత లాభకరంగా ఉంటాయి. దక్షిణాదికి నైరుతి రుతుపవనాలతో పోలిస్తే వాటివల్ల అంత ప్రయోజనం ఉండదు. * అక్కడ వర్షపాతం అధికం.. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం మనదేశంలోనే ఉందంటారు. అస్సోంలోని చిరపుంజి మనదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా చాలామంది భావిస్తారు. అందులో కొంత నిజం ఉంది. అయితే గత పది పదిహేను సంవత్సరాల వర్షపాత నమోదు వివరాలు పరిశీలిస్తే చిరపుంజి కాస్త వెనకబడిందనే చెప్పాలి. మేఘాలయలోని హిమాలయాల పర్వత సానువుల్లో ఉండే ‘మాసిన్రామ్’ గ్రామంలో అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. ఇది షిల్లాంగ్కు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలాకాలంగా చిరపుంజి కన్నా ఇక్కడ ఎక్కువే వర్షం పడుతోంది. ప్రపంచంలో అత్యంత చిత్తడి ప్రదేశంగా దీనికి గుర్తింపువస్తోంది. ఇక్కడ వార్షిక సగటు వర్షపాతం 11,872 మిల్లీమీటర్లు. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. సాధారణం కంటే 3 నుంచి 8 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలతో జనం తల్లడిల్లిపోయారు. వేసవిలో ఉత్తర వాయవ్య దిశల నుంచి వేడి గాలులు కొనసాగడం సాధారణమే. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే వేడిగాలులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈసారి అధిక ప్రభావం చూపాయి. సాధారణ ఉష్ణోగ్రత (సగటున 40 డిగ్రీలు) కంటే 5 నుంచి 6 డిగ్రీల అధికంగా ఉష్ణోత్రలు నమోదైతే ‘హీట్వేవ్ కండిషన్స్’గా పేర్కొంటాము. అంతకుమించి ఉష్ణోగ్రతలు నమోదైతే ‘సివియర్ హీట్వేవ్ కండిషన్స్’గా పరిగణిస్తాము. ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు, తెలంగాణలోని కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో మే 20 నుంచి 27 వరకూ సివియర్ హీట్వేవ్ కండిషన్స్ నెలకొన్నాయి. విజయనగరం, విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ‘మోడరేట్ హీట్వేవ్ కండిషన్స్’ నెలకొన్నాయి. ఖమ్మం జిల్లాలో ఈ నెల 24న- దాదాపు 68 ఏళ్లతర్వాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. వాతావరణంలో చోటుచేసుకున్న ఈ అసాధారణ పరిస్థితులకు మరికొన్ని కారణాలున్నాయి. ముఖ్యంగా చత్తీస్గఢ్, ఒడిశా నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ వేసవిలో కొనసాగే అల్పపీడన ద్రోణి ప్రభావం కూడా వేడిగాలుల తీవ్రతకు కారణమయ్యాయి. అల్పపీడన ద్రోణికి భూ ఉపరితలం మీదుగా ఎడమ వైపు ఉన్న ప్రాంతాల్లో ఈ సారి వేడిగాలుల తీవ్రత అధికంగా కన్పించింది. సముద్ర తీరం వెంబడి కుడి ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత అంతగా ప్రభావం చూపలేదు. రుతుపవనాలు మన దేశాన్ని తాకే వరకూ పగటి ఉష్ణోగ్రతల్లో ఈ తీవ్రత కొనసాగుతూనే ఉంటుంది. ఈసారి రుతుపవనాలు నిర్ణీత సమయంలోనే ప్రభావాన్ని చూపనున్నాయి. ప్రొఫెసర్ పివి రామారావు, విశ్రాంత డైరెక్టర్, వాతావరణ శాఖ, విశాఖ
రెండు నిమిషాల్లో ఉడికే మాగీ ఇప్పుడు కుతకుత లాడుతోంది

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -42
18-వాస్తవితకు సాహిత్య గౌరవం తెచ్చిన ఫ్రెంచ్ రచయిత –ఎమిలీ జోలా
సవ్యంగా సాగని బాల్య౦
తన రచనలన్నిటిని వారసత్వాన్ని (హెరిడిటరి)ఆధారం గా చేసుకొని రాసి సాహిత్యం లో రియలిజానికి పట్టం కట్టిన ఎమిలీజోలాది మాత్రం మిశ్రమ వారసత్వం .తండ్రి ఫ్రాన్సిస్కో జోలా సగం ఇటాలియన్ సగం గ్రీకు వాడు. ఇంజనీర్ గా సాహసిగా పేరున్నవాడు తల్లి కోర్ఫు ఐలాండ్ కు చెందినది .ఆమె తండ్రి తాలూకు వారు వెనిస్ దేశస్తులు ఆమె పేరు ఫ్రాంకో ఎమిలే ఆబర్ట్ .పారిస్ దగ్గర డౌర్డాన్ గ్రామం లో పుట్టింది పారిస్ లో జోలా 2-4-1840న జన్మించాడు .అసలుపేరు’’ ఎమిలీ ఎడౌర్డ్ చార్లెస్ ఆంటోని ‘’.పుట్టగానే బ్రెయిన్ ఫీవర్ తో బాధ పడి రెండేళ్లకు కోలుకొన్నాడు .దీనికి తగ్గట్లు కళ్ళకు షార్ట్ సైట్ (హ్రస్వ ద్రుష్టి )ఉండేది .దీనితో ఎడమకన్ను కొంచెం పైకి లేచినట్లు కనిపించేది .ఈ పరిస్తితులలో ధనికుడైన తండ్రి కుటుంబాన్ని దక్షిణ ఫ్రాన్స్ కు తరలించాడు .పెళ్లి అయ్యే దాకా అక్కడే ఉన్నాడు .అక్కడ ఒక కాలువ తవ్వాలని ప్లాన్ లో ఉండేవాడు .అనుకోకుండా తీవ్రమైన చలి జ్వరం వచ్చి ప్లూరసి జబ్బు తో బాధ పడి చనిపోయాడు .కుటుంబానికి తండ్రి మిగిల్చింది ఐక్స్ సిటీ మీద వేసిన ఒక దావా మాత్రమె .ఈకేసులో తండ్రికున్న ఆస్తి చాలాభాగం అమ్మేయాల్సి వచ్చింది .చాలా తక్కువ ఆస్తి మాత్రమె కుటుంబానికి మిగిలింది .ఎమిలీ యవ్వన జీవితం అంతా ఈ ఆర్ధిక లేమి వలన డిప్రెషన్ తోగాడిచి పోయింది .తక్కువ ఖరీదైన లాడ్జిలలో ఉంటూ తరచుగా ప్రదేశాలు మారుతూ గడిపాడు .చివరికి తల్లి అతన్ని ఐక్స్ లోని ఒక బోర్డింగ్ స్కూల్ లో చేర్పించింది . ముగ్గురు మిత్రులు
మిగిలిన సహా విద్యార్దులకంటే వయసులో పెద్దవాడుగా ఉన్న జోలా స్కూల్ లో పెద్దగా పేరు తెచ్చుకోలేక పోయాడు .తోటి విద్యార్ధులు అతని ఎగుడు దిగుడు కన్నులను చూసి వెక్కి రించేవారు అతని పారిస్ నగర ఉచ్చారణ విని హేళన చేసేవారు .దీనితో పిరికితనం వచ్చి ఆత్మ రక్షణ లో పడాల్సి వచ్చింది. కాని ఇద్దరు ఆత్మీయ మిత్రులను మాత్రం సంపాదించుకో గలిగాడు అందులో బాగా తెలివిగల ఐక్స్ లోపుట్టిన పాల్ సిజనే ,సిజనే స్నేహితుడైన బైలీలు .పది హేనేళ్ళ ఈ ముగ్గురూ కలిసి పల్లె ప్రాంతపు అందాలను అనుభ వీస్తూ పరిశోధన చేస్తూ కాలవలలో ఈతలు కొడుతూ నదిగట్ల మీద విక్టర్ హ్యూగో ,ఆల్ఫాన్సో డిలామర్టి న్ , ఆల్ఫ్రెడ్ డి మ్యూసేట్ ల రొమాంటిక్ రచనలు చదువుతూ .కాల క్షేపం చేశారు .వీటికన్నిటికి ప్రేరకుడు సిజనే .తర్వాత అయిదేళ్ళలో సిజనే రంగుల బొమ్మలు గీస్తూ గడిపాడు .ఎమిలీ జోలా కవిత్వం తో, బాలడ్స్ రాస్తూ మూడు అంకాల నాటకాలు రాస్తూ కాలక్షేపం చేశాడు తోటి మిత్రులకు రాబోయే సాహిత్యాన్ని గురించి తెలియజేస్తూ కళ కున్న బాధ్యతను వివరిస్తూ చదువు పై శ్రద్ధ పట్టలేక పోయాడు జోలా .
ఆర్ధిక కు౦గు బాటు
ఇంటి దగ్గర తల్లి పరి స్తితులూ బాగాలేవు ..దరిద్రం పెరిగి పోయింది తినటానికి తిండి కూడా దొరకని పరిస్థితి వచ్చింది .ఆమె తలిదండ్రులే ఇప్పటిదాకా అండగా నిలిచారు .కాని వారూ ఇక ఏమీ చేయ లేని నిస్సహాయులైపోయారుకూతురికీ, మనవడికీ . చిల్లిగవ్వ కూడా చేత లేక జోలా తల్లి నిస్సహాయురాలైంది .ఎవరో పుణ్యాత్ముల దగ్గర అప్పు గా కొన్ని ఫ్రాన్కుల డబ్బు తీసుకొని భర్త తాలూకు బంధువులు ఏదైనా సాయం చేస్తారనే ఆశ తో పారిస్ వెళ్ళింది. కొడుకు జోలాను ఇంట్లో మిగిలిన కర్రా బుర్రా కూడా అమ్మేసి మూడవ తరగతి మెట్రో రైల్ టికెట్ కొనుక్కొని పారిస్ వచ్చి తనను కలవమని చెప్పింది .
కవిత్వం పై పిచ్చి
18 వ ఏటా జోలా పారిస్ చేరాడు .అది విలాసవంత మైన పై డాబుల నగరం మూడవ నెపోలియన్ దాన్ని పునర్నిర్మించాడు .లాభాల వేటగాళ్లకు ,పరాన్నభుక్కులకు నిలయం .అసాంఘిక చర్యలకు అడ్డా .తాను వచ్చిన పల్లెటూరికి దీనికి ఆస్తి మశాకాంతరం ఉందనిపించింది జోలాకు .పారిస్ ను చూసి షాక్ అవటమేకాక ఆనందం కూడా పొందాడు .ఇక్కడ స్కాలర్ షిప్ వచ్చి లీసీ సెయింట్ లూయీ లో చేరాడు అక్కడ అతను ఇష్టం లేని వాడుగా ,అక్కడివాళ్లు అతన్ని ఒప్పుకోలేని వారుగా కనిపించారు .ఇక్కడ కూడా అతని పారిస్ ఉచ్చారణ కు మొదట అవహేళన జరిగినా అతను స్థానికుడు కనుక సరిపోయింది .చదువు మీద ద్రుష్టి పెట్టలేదు. స్నేహితుల్ని పట్టించుకోలేదు .సాహిత్యం చదవటం ,రాయటం అనే రెండు విషయాల మీదే దృష్టిని కేంద్రీకరించాడు. అవే అతని శ్వాస, ఊపిరి అయ్యాయి .కవిత్వమే అతని ప్రేయసి అయి మురిపించింది లోకాన్ని మరిపించింది .ఆ తర్వాత నేచరిస్ట్ రచయితలలో అగ్రగామి అని పేరొచ్చినా అతనికి కవిత్వం మీద అభిమానం మాత్రం పోలేదు .ఇరవై ఏళ్ళ వయసులో కవిగా గుర్తింపు మాత్రమేకాదు రొమాంటిక్ ఫిగర్ గానూ గుర్తింపు వచ్చింది ‘’మన ఆకలి తీర్చుకోవటానికి తిందాం తాగుదాం కాని మన ఆత్మలను పవిత్రం గా దూరం గా ఉంచుకొందాం ‘’అని చెప్పేవాడు .
మరణం అంచు లోంచి బైటికి
19 వ ఏట జోలా మళ్ళీ చావు దగ్గరకు వెళ్ళాడు .తీవ్రంగా టైఫాయిడ్ జ్వరం వచ్చి రెండు నెలలు మంచం మీదనే ఉండిపోయాడు .కొంచెం కోలు కొనే సమయం లో నోరు అంతా అల్సర్ ల తో నిండిపోయి మాట్లాడ లేక పోయాడు.మానసికం గా బాగా కు౦గి పోయాడు .హైపో కా౦డ్రియాకు అది తర్వాత దారి తీసింది . ఈ వ్యాధి వలన వచ్చిన రచనా విధానం లో మార్పు వచ్చింది . సిజనే కూడా కావితలు రాసేవాడప్పుడు .అతనికి జాబు రాస్తూ జోలా ‘’ఒరే ముసలి మూర్ఖా !నువ్వు నాకంటె గొప్పగా కవిత్వం రాయగలవు .నీ కవిత్వం కంటే నా దానిలో వాస్తవికత ఉండచ్చు కాని నీదానిలో కవితా స్పర్శ ఎక్కువ .నువ్వు హృదయం తో రాస్తావు .నేను మనసుతో అంటే బుద్ధి తో రాస్తాను .నీది హృదయవాదం నాది బౌద్ధికవాదం ‘’అన్నాడు
అనేక ఆలోచనలు
టైఫాయిడ్ నుంచి కోలుకొన్నాడు కాని స్కూల్ అంటే మరీ చిరాకేసింది .లాయర్ అవ్వాలనిపించింది పరీక్ష రాసి తప్పాడు డిప్లమా రాలేదు దీనిపై ‘’the open sesame to all the professions ‘’అను కొన్నాడు .దీనిపై దీర్ఘ కవిత రాశాడు .ఒక షాడో బిజినెస్ మాన్ అవతారం ఎత్తాలనుకొన్నాడు .ఈ విషయమై బైలీకి రాస్తూ ‘’ఏదో ఒక సంస్థలో గుమాస్తాగా చేరాలని ఉంది. ఇది నా నిరాశా దృక్పధం తో తీసుకొన్న నిర్ణయం .నా భవిష్యత్తు చిద్రమై పోతుంది .ఆఫీసులో పని చేసినా భవిష్యత్తు లేదు నైతిక పతనం తో చీకటి లోకి జారిపోవటమేనేమో ‘’అన్నాడు .అనుకోన్నట్లే నెపోలియన్ డాక్స్ లో బుక్ కీపర్ ఉద్యోగం వచ్చింది .రోజూ రెండుమైళ్ళు నడిచి ఉద్యోగానికి వెళ్ళాలి. జీతం నెలకు ముప్ఫై ఫ్రాంకులు .చేరి ,జీతం చాలక, నడవ లేక రెండు నెలలకే మానేసి మళ్ళీ ఉద్యోగాన్వేషణలో పడ్డాడు
.
| ignature |
|---|
| ignature |
|---|
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-6-15- ఉయ్యూరు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -41 –
17-పోస్ట్ -ఇంప్రషనిస్ట్ ఫ్రెంచ్ పెయింటర్ – పాల్ సిజేన్ (Paul Cezanne)-3(చివరిభాగం )
తండ్రి మరణం తో ఆర్ధిక పుష్టి-అయినా దిన కూలీ జీవితమే
1886 లో సేజనే తండ్రి మరణించటం తో ఆస్తిలో వాటాలభించి ఆర్ధిక పుష్టి కలిగింది .ఆర్ధిక భద్రత లభించి ధనవంతుడని పించుకొన్నా కూడా దిన కూలీ లాగా నే సాధారణ జీవితం జీవించాడు .గుర్రబ్బండీ కూడా కొనుక్కోలేదు .బయటికి తనను తీసుకొని వెళ్ళటానికి ఒక కిరాయి బండిని మాత్రం ఏర్పాటు చేసుకొన్నాడు .ఇది కూడా విలాసమే అనేవాడు .
ఆగిపోయిన బ్రష్
.కూలి విషయం లో ఒకసారి వాడితో గొడవ పడి,67 ఏడేళ్ళ వయసులో నడిచి పోతానని భీష్మించాడు .అనుకోకుండా తుఫాను వచ్చి గాలి వేగానికి రోడ్డుమీద కూలిపోయాడు .పూర్తిగా తడిసిపోయాడు .ఒక లాండ్రీ వాగన్ ఆయన్ను ఇంటికి చేర్చింది .మర్నాడు ఉదయం తానూ వేస్తున్న పోర్ట్రైట్ కు మెరుగులు దిద్దాడు అప్పటికే డయాబెటిస్ ఉంది .ఒకవారం తర్వాత 22-10-1906న 67 వ ఏట సిజనే పెయింటర్ చనిపోయాడు .అతని బ్రెత్ తో పాటుపెయింటింగ్ బ్రష్ కూడా ఆగిపోయింది .చనిపోయే ముందు కొన్ని చిత్రాలపై ఫిర్యాదులు రాశాడు .ఆస్తిని భార్యను మినహాయించి కొడుక్కు దాఖలు పరచాడు విల్లు రాసి
సిజనే చిత్ర ప్రత్యేకత
సిజనే అంతర్ సంఘర్షణలు మాత్రం అతని చిత్రాల్లో ప్రతి ఫలించలేదు .ప్రశాంత మైన ప్రభావం కోసమే తపన పడ్డాడు .తనకు నచ్చని చిత్రాలను నేలమీదే బ్రష్ లతోబాటు పడేసేవాడు .లేకపోతే పాలెట్ కత్తితో వాటిని చించేసే వాడు .వాన్ గొఘ్ చిత్రాలలో కనిపించే మానసిక సంఘర్షణ సిజనా ఫినిషింగ్ కాన్వాస్ ల లో కనిపించదు . సిజనే కోరింది ప్రశాంతత (సెరినిటి)మాత్రమె అదీ అతని ప్రత్యేకత .అతని రేంజ్ అంత గోప్పదేమీకాదు .అంటే వైవిధ్యం ఎక్కువ లేదని అర్ధం .ఎప్పుడు గీసినా అవే చెట్లు కొండలు పూలు పళ్ళు పేకాట ఆడేవాళ్ళు లనే చిత్రించేవాడు .అతని రంగుల ప్రస్తారమూ హద్దులోనే ఉండేది .’’ఎప్పుడు గీసినా మూడే మూడు ప్రాధమిక రంగులతో ,వాటి నుండి వచ్చిన రంగులతోనే చిత్రించు ‘’అని చెప్పిన గురువు ‘’పిసార్రో ‘’మాటకు కట్టుబడి చిత్రించాడు .నలుపు ,కారునలుపు ,సియన్నా మొదలైన రంగుల జోలికి పోలేదు .తానూ సృష్టించుకొన్న రంగుల సామరస్యానికే (హార్మని ) కట్టు బడ్డాడు .మూడే మూడు రంగులతో తన కళా విశ్వరూపాన్ని చూపాడు అవేనీలం ,ఆకుఅచ్చ ,ఊదా రంగులు .(blue green pink tan )అవే అతని రంగుల సర్వస్వం . ‘’he used these colors not mere accents in a design or as decorative units but as blocks of pure form ,basic elements of structure ‘’ అని అతని పై పరి శోధన విశ్లేషణా చేసిన వారు చెప్పారు .
ఇంప్రెష నిస్ట్ లు సంప్రదాయం గా వస్తున్న లైట్ అండ్ షేడ్ లను తిరస్కరించి ముందుకు సాగారు .కాని సిజనే ‘’’’modulated’’ his pigments and defined his objects not by outlines but by subtly contrasting planes and patches of color ,a continual change and ‘’de composition ‘’of light . అని అతను తొక్కిన కొత్తదారిని గురించి వివరించారు .లాండ్ స్కేప్ లలో సాధారణత ఉన్నా ,ఏదో ఒక నియమానికి సూత్రానికి బద్ధుడై చిత్రించలేదు . తాను చిత్రించినవాటి లో ‘’క్యూబికల్ ,కొనికల్ ఆకారం లో ఉన్నవి తర్వాత కాలం లో అందరికి ప్రేరణగా నిలిచి క్యూబిక్ ఆర్ట్ గా పేరు తెచ్చుకొంటు౦దని ‘’ప్రక్రుతి ప్రధానం గా రేఖాగణితం లాగా ఉంటుంది ‘’అనే నిర్వచనం వస్తుందని సిజనేకు తెలిస్తే అమితాశ్చపోయేవాడు .
నిత్య జీవితం లోని విషయాలను విశ్వ సత్యాలకు అనుసంధానం చేశాడు చిత్రాలలో .అతిని నిశ్చల చిత్రాలలోనే కాదు లాండ్ స్కేప్ లుకూడా ప్రేమ మయం గా ఉండటం అతని ప్రత్యేకత .యాపిల్ పళ్లను ఆరంజ్ లను చిత్రించటం లో సాధారణ వస్తువులలో ఉన్న ఆశ్చర్యానుభూతిని ,వాటికున్న పరస్పర సంబంధాన్ని తెలియ జెప్పాడు .అతని దృష్టిలో ఒక జగ్ ఒక మగ్ ,రుమాల పండుముక్క చిత్రం లో తాత్కాలికంగా చోటు దక్కించుకొని ఒక పర్వతానికున్న ప్రాధాన్యతను పొందుతుంది .అంటాడు . దీన్ని చూసే శ్రీ శ్రీ ‘’కుక్క పిల్లా సబ్బు బిళ్ళా కాదేదీ కవితకనర్హం ‘’అన్నాడెమో !అతని దృష్టిలో ‘’literature express itself by abstractions ,where as painting ,by means of drawing and color ,gives concrete shape not only to perception but sensations ‘’ అని అభిప్రాయ పడ్డాడు . సాహిత్యం ఇవ్వలేని ఆకృతిని నిండుతనాన్ని చిత్రం ఇవ్వ గలుగుతుంది అని భావించాడు . ఈ సెన్సేషన్ అంటే ఇంద్రియానుభవమే చిత్రకారుడు సిజనే సాధించిన అద్భుత విజయం .దీనికి అతను ప్రక్రుతి ఉన్నతికి ,అర్ధంకాని విషయాలకు వినమ్రుడౌతాడు.అతని చిత్రాలు బ్రోకెన్ వర్ణాలకు తనకు ఇష్టం లేని తానూ లక్ష్య పెట్టని ఈ ప్రపంచానికి దూరంగా ఉండి సంతోషించటానికి మార్గ దర్శకాలయ్యాయి .అవన్నీ శాంతికి ప్రశాంతికి మహా చిహ్నాలుగా నిలిచిపోయి చరితార్ధతను సాధించాయి . ఎక్కడా ఆటవికత ఉండదు .అందులో ఒక క్రమ ద్రుష్టి ఉండి పవిత్రత తో శాశ్వతత్వాన్ని బోధిస్తాయి .ఈ ప్రశాంతత ఆతను పడిన మానసిక వేదన అంతర్ జ్వలన నిరాశ వలన లభించినదే .అందుకే తనకు మొదటి డీలర్ గా ఉన్న వోలార్డ్ ను తనపై నమ్మకం ఉంచుకోమని చెప్పాడు .కాని 115 స్టింగ్ ల తర్వాతా కూడా తాను గీసిన పోర్ట్రైట్ సంతృప్తినివ్వలేదు .’’he had failed to realize his sensations and could not coalesce his color planes into a solidly perfected form .’’Still ‘’ he conceded ‘’the shirt –front is not bad ‘’అన్న పెర్ ఫెక్షనిస్ట్ ప్- పెయింటర్ పాల్ సిజనే .
పతన ఉత్థానాలు –చీకటి కాలం
1861-1870 కాలం సిజనే చిత్రకళా జీవితానికి చీకటి రోజులు –మూడవ నెపోలియన్ సెలాన్ ల సంఖ్య తగ్గెట్లు కొందరి చిత్రాల్ని తిరస్కరించేట్లు చేశాడు .తిరస్కరింప బడినవారిలో ఇంప్రెష నిస్టులు కూడా ఉన్నారు .వారిని విప్లవకారులుగా భావించాడు .వారి శైలికి ప్రభావితుడయ్యాడు . కాని వారితో స్నేహానికి దూరంగా ఉన్నాడు సిజనే .సిగ్గు, మొరటుతనం ,కోపం లు చుట్టుముట్టి డిప్రెషన్ లోకి వెళ్ళాడు .ఈ కాలం లో వేసినవన్నీ నల్ల రంగు చిత్రాలే .1867 లో కూర్బేట్ ప్రభావానికి లోనై ‘’పాలెట్ నైఫ్ ‘’తో చిత్రాలు గీశాడు .వీటినే తర్వాతి కాలం లో’’ un couilarde’’ అంటే ‘’విరిలిటి ‘’అంటే మగతనం ఉన్న చిత్రాలు అన్నాడు పాలెట్ నైఫ్ తో సిజనే గీసిన చిత్రాలు ‘’ఆధునిక ఎక్స్ప్రేషనిజం’’కు నాంది పలికింది అని అతనే సృష్టికర్త అని రాస్తూ లారెన్స్ గోయింగ్ ‘’although it was incidentally that ,the idea of art as as an emotional ejaculation made first appearance in this moment ‘’అన్నాడు . ఇందులో అతని శైలి పరి పక్వమై నిలిచింది .ఇదే అతని చీకటికాలం ఈ కాలం లో గీసినవన్నీ ‘’ఈరోటిక్ ,వయోలేంట్ ‘’విషయా అంటే కామ ,హి౦సాత్మకాలే నన్నమాట .
ఇంప్రెషనిస్ట్ కాలం
1870-78 కాలం అతను ఇంప్రెష నిస్ట్ అనిపించాడు పారిస్ వదిలి మార్సేలీస్ కు చేరినతర్వాత లాండ్ స్కేప్ లేక్ ప్రాదాన్యమిచ్చాడు .యుద్ధం ముగిసిన తర్వాత పారిస్ చేరి పిసార్రో తోకలిసి లాండ్ స్కేప్ లు గీశాడు .తనను పిసార్రో శిష్యుడనని చెప్పుకొన్నాడు అతన్ని ‘’గాడ్ ది ఫాదర్ ‘’అని కీర్తించాడు పిసారో ప్రేరణ తో నల్ల రంగులు వదిలేసి మెరిసే రంగులు వాడాడు పారిస్ ,ప్రావెంస్ ల మధ్య తిరిగాడు .మొదటి ఇంప్రెష నిస్ట్ ప్రదర్శన1877లో ఇచ్చాడు .కొన్ని అమ్ముడుపోయి కొంత ధనలాభం కలిగింది .ఇందులో వ్యంగ్యం అధిక్షేపణ అధికం .వీటిని చూసిన గర్భిణీ స్త్రీ లకు ఎల్లో ఫీవర్ తో పుట్టే బిడ్డను కనటం ఖాయం అన్నారు విమర్శకులు .
పరిపక్వ దశ
1878-90 కాలం సిజనే చిత్రకళా జీవితం లో పరిపక్వ దశగా భావిస్తారు .ప్రావెంస్ లోనే ఉండేవాడు 1885-88 కాలం అతని నిర్మాణ దశ .1886 గొప్ప మలుపు తెచ్చింది .ఎమిలీ జోలా తో స్నేహానికి దూరం గా ఉన్నాడు .జోలా నవలలో తనను ఒక పాత్రగా రాయటం తో చిన్ననాటి స్నేహానికి స్వస్తి చెప్పాడు .జోలా నమ్మక ద్రోహం చేశాడని భావించాడు –
అ౦తిమకాలం
1890-96కాలం లో పెయింటింగ్ లకు దూరం గా ఉండిపోయాడు .కాని అతని పేయింటింగ్ లకు ప్రాచుర్యం బాగా వచ్చి నవ తరానికి చెందిన యువ చిత్రకారులు సిజనే ను తమ ఆదర్శ చిత్రకారుడని భుజాలకెత్తుకొన్నారు . 1903 నుంచి తన స్టూడియోలోనే చిత్రాలు గీశాడు .
సిజనే చనిపోయాక పెట్టిన ప్రదర్శనలో అతని చిత్రాలు హాట్ కేక్స్ లాగా అమ్ముడు పోయాయి. అతని శిష్యులుసిజనే క్యూబిజానికి ఆద్యుడు అని అంటూ అతని ప్రతిభను ‘’ “Cézanne is one of the greatest of those who changed the course of art history . . . From him we have learned that to alter the coloring of an object is to alter its structure. His work proves without doubt that painting is not—or not any longer—the art of imitating an object by lines and colors, but of giving plastic [solid] form to our nature.” (Albert Gleizes and Jean Metzinger in Du “Cubisme”, 1912)[37]
అని ప్రశంసించారు .సిజనే ప్రభావం పికాసో ,బ్రేక్ ,మెట్జిన్జర్ ,గ్లీజేస్ ,గ్రీస్ మొదలైన ప్రముఖ చిత్రకారులమీద అదికం గా ఉంది .సిజనే ను జీనియస్ అన్నారు .అతనిపేర ఒక మెడల్ ఏర్పాటు చేశారు .
![]()
![]()
![]()
![]()
మరో ప్రముఖునితో మళ్ళీ కలుద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-15 ఉయ్యూరు
శ్రీమతి ఇందిరాదేవి నట విశ్వ రూప ప్రదర్శనమే –ఇంటింటికో కద నాటిక
ఆకాశ వాణి విజయ వాడ కేంద్రం డైరెక్టర్ గారికి –
3-6-15 బుధవారం హైదరాబాద్ కేంద్రం నుండి రాత్రి 9-30 గం లకు ప్రసారమైన ‘’ఇంటింటికో కద’’ అత్యద్భుతం .ఇల్లాలి పాత్రలో శ్రీమతి ఇందిరాదేవి భావ ప్రకటన అనితర సాధ్యం అనిపించింది .స్వచ్చమైన వాచకం తో నిష్టూరాలు, దెప్పి పొడుపులు ,ఆప్యాయత ,అనురాగం, కుటుంబ బంధం ,బాధ్యత ,అలకా, అనునయం ,మాటకు మాట అంటించటం ,అత్తగారిని దెప్పటం, అమ్మను అనునయంగా బతిమాలటం ,భర్తపై యెనలేని ప్రేమ ,ఉద్యోగ ధర్మం ,పిల్ల చదువు భవిష్యత్తుపై ఆరాటం ,భర్త కు దూరమై బదిలీ అయితే ఆ అర్భకుడు పడే ఆగ చాట్లను తట్టుకోలేక పోవటం అన్నీ ,ఇందిరా దేవి గొంతుకలో సహస్రదళపద్మం లా విర బూశాయి .నిజంగా చెప్పాలంటే మాటలు రావు .చాలవుకూడా .రేడియో నాటికకు ఆమె ఒక వరం .ఆమెది సుస్వరం .ఆమె నట విశ్వరూప ప్రదర్శనమే ఈ నాటిక .
ఎన్నేళ్ళయిందోయిందో ఇంత కమ్మని తెలుగు నాటికను విని .మొదటినుంచి చివర వరకు సంభాషణలే నాటికకు జీవం పోశాయి .గాత్ర ధారులైన పాత్ర దారులు నూటికి నూరు శాతం న్యాయం చేకూర్చారు .రచయిత బహుదా ప్రశంసనీయులు .అరగంట నాటిక అయిదు నిమిషాల్లో అయిపోయి నట్లు అనిపించింది .ఇంత అనుభూతిని మిగిల్చిన నాటిక కర్త ,ప్రయోక్త ,నటీనట బృందానికి ,ప్రసారం చేసిన హైదరాబాద్ కేంద్రం వారికి అభినందన శతం .అయితే ముగింపు ట్రెడిషనల్ గా ఉండటం అంత బాగాలేదని పించింది .మారుతున్నకాలానికి తగిన ముగింపు కాదు .చప్పట్లు కొట్టి౦చు కోవటానికి చేసిన ముగి౦పే. ఏమైనా బుధవారం రాత్రి వీనులకు గొప్ప విందు అనుభవించాం .
ఆ తర్వాత విశాఖ నుండి ప్రసారమైన రాగం తానం పల్లవి లో శ్రీమతి మండ శ్రావ్యమైన స్వరం తో అమ్మవారిపై కీర్తనను గానం చేసి దివ్యాను భూతిని కలిగించారు వాద్య సహకారమూ ముచ్చటగా మెచ్చదగినదిగా ఉంది .
గబ్బిట దుర్గాప్రసాద్ -4-6-15-ఉయ్యూరు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -40-
17-పోస్ట్ -ఇంప్రషనిస్ట్ ఫ్రెంచ్ పెయింటర్ – పాల్ సిజేన్ (Paul Cezanne)-2
పారిపోయి పల్లెటూరి అమ్మాయితో రహస్యం గా పెళ్లి
1870 లో ఫ్రాన్స్ కు ప్రష్యా దేశానికి జరిగిన యుద్ధం అందర్నీ యుద్ధ సైనికులుగా చేసింది .ఈ బాధ భరించలేక సిజనే ఎస్తేనే అనేచిన్న టౌన్ కు పారిపోయాడు .అక్కడ తన అసమాన చిత్రకళా నైపుణ్యం తో ఆకళకు అమరత్వం సిద్ధింప జేశాడు .అక్కడే మోడల్ గా పని చేసిన హార్తెన్స్ ఫికేట్ తో సాన్నిహిత్యం పెరిగి వివాహం చేసుకొన్నాడు .ఆమె జూరా ప్రాంత రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి .ఆమెకు 19ఏళ్ళు .మన పైంటర్ కంటే 11 ఏళ్ళు చిన్నది .రెండేళ్లకు కొడుకు పుట్టాడు .వాడికి తనపేరు పాల్ అని పెట్టుకొన్నాడు .తన ప్రేమ వ్యవహారానికి తండ్రి ఉగ్ర నరసింహం అవుతాడేమో నని భయపడి ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాడు .తండ్రివి డేగ కన్నులు .వ్యవహారం పసిగట్టాడు .అగ్గి మీద గుగ్గిలమై కొడుక్కు ఇచ్చే అలవెన్స్ డబ్బు కట్ చేసేశాడు . అమెతోకాపురం చట్ట సమ్మతం చేయటానికి ,కుటుంబాన్ని ఒప్పించటానికి ఆమెను పది హేడేళ్ళపరిచయం తర్వాత పెళ్లి చేసుకొన్నాడు .అయినా ఆమె పై ప్రేమ క్రమంగా తగ్గిపోయింది .ఆమెతో అరుదుగా గడుపుతూ సిటీ జీవితానికి అలవాటు పడిపోయాడు . ఆమె నుంచి తప్పించుకోవటానికి తరచుగా ప్రయాణాలు చేసేవాడు .దీనికి సాకుగా ‘’మా ఆవిడ స్విట్జర్లాండ్ ను ,నిమ్మకాయాలను మాత్రమె అతి జాగ్రత్తగా చూసుకొంటుంది ‘’అని చెప్పాడు .
క్రమబద్దత లేని జీవితం
పెళ్లి కాక పూర్వం నుంచీ కూడా సిజనే మామూలు జీవిత సౌఖ్యాలకు దూరంగా ఉండటం అలవాటు చేసుకొన్నాడు .అతని అలవాట్లు లాగానే అతని స్టూడియో కూడా అస్తవ్యస్తంగా ఉండేది .అంటువ్యాధుల కూడలిగా ఉండేది .30 వ ఏట చాలా పొడవుగా , బుజాలు కొద్దిగా ఒంగి, చిన్నగద్దముక్కు తో ,మోసం చేసేట్లుండే కళ్ళతో కనిపించేవాడు .కొత్తగా వచ్చిన వారికి గట్టిగా మాట్లాడినట్లు ఆ మాటలు గుబురు నల్ల గడ్డం లోంచి వస్తున్నట్లు గా ఉండేది .40 ఏళ్ళు వచ్చేసరికి మనిషి చిరుబురులాడుతూ దుస్టుడేమో అని పించేవాడు .
విమర్శకుల దారుణ విమర్శ
ఇంప్రెషనిస్ట్ లంటే అభిమానం పెరిగింది .కాని పత్రికలు విమర్శల చేన్నాకోల్ తో ఝడిపించేవి .ఆతని చిత్రాలు పల్లెటూరి మూర్ఖుడి చిత్రాలని ,అతనొక మాంసం కొట్టే బుచర్ అనీ అతని పెయింటింగ్స్ చిన్నపిల్లలు ఆకతాయి తనం తో సీతాకోక చిలకలను పట్టుకొని జిగురుతో పుస్తకం లో అంటించి నట్లున్నాయని ఈసడించారు . అతనంటే ద్వేషం పెరిగిపోయింది .ప్రాచుర్యం పోయింది .మూడవ ఇంప్రెషనిస్ట్ ప్రదర్శన లో విమర్శకులు అరుపులు కేకలు నిరసనలతో హోరెత్తించారు .ఈ సంఘటనపై జోలా ‘’హాండ్ కర్చీఫులు అడ్డం పెట్టుకొన్నా నవ్వులు పెదిమలలోంచి పగిలి బయటికొచ్చాయి ,రెచ్చిపోయిన కుర్రకారు పై చొక్కాలు విప్పేసి అట్టహాసాలతో కోపాన్ని ప్రదర్శించారు .చర్మాన్ని మాంసం రంగు తో ఆకుపచ్చ ,,పసుపు షేడ్ లతో చిత్రించటం ఎవరూ హర్షించలేకపోయారు .సేజనే ఒక అపస్మారక స్థితిలో ఉ౦డి వీటిని పెయింట్ చేశాడేమో అని ఎద్దేవా చేయటమేకాక గర్భిణీ స్త్రీలను సేజనే చిత్రాలు చూడవద్దు అని కూడా చెప్పారు .చూస్తె వాళ్ళకుపుట్టే పిల్లలు ఒళ్లంతా మచ్చలతో పుడతారని ఝడిపించారు కూడా అంత వ్యతిరేక ప్రచారం జరిగింది .
సిజనే వర్ణాలపై చేస్తున్నప్రయోగాలను చూసి హర్షించిన మరో విమర్శకుడు ‘’విజ్లర్ ‘కూడా విమర్శిస్తూ ‘’ఒక ఆరేళ్ళ పిల్లాడు సేజనే లాగా వాళ్ళ చెల్లెల్ని చిత్రిస్తే ,అతని తల్లి మంచి తల్లి అయితే అతడిని కొట్టిపారేసేది ‘’అన్నాడు .యాభై ఏళ్ళ తర్వాత ఒక లక్ష డాలర్లకు అమ్ముడుపోయిన సిజనే లాండ్ స్కేప్ చిత్రాలు ఆనాడు నలభై నుంచి ఎనభై ఫ్రాంకు లకు మించి ఎవరూ కొనలేదు .అదీ మన చిత్రకారుని సమకాలీన సమాజపు విపరీత వింత పోకడ .అసలు వీటి నెవరూ పట్టించుకోను కూడా పట్టించుకోలేదు ప్రదర్శనలో .’’ఒక లుక్ వేద్దాం ‘’అని కూడా ఎవరూ అనుకోకపోవటం దారుణం అంటారు .
ఇలాంటి తిరస్కారాలకేమీ స్పందించకుండా సిజనే తన పనేదో తానూ చేసుకు పోతున్నాడు . ఇంప్రెషనిజం టెక్నిక్కులు వాడాడు .తర్వాత వారితో విభేదించినా వారి సిద్ధాంతాలను అంగీకరించాడు . ‘’ప్రకృతిలో గీతలు అనేవి లేనేలేవు .’’అని సిజనే నిశ్చితాభిప్రాయం .‘’.ప్రతిదీ లైట్ అండ్ షేడ్ ల ఏర్పాటే .రంగులమార్పిడి భావ వ్యక్తీకరణాలే ‘’అంటాడు ‘’the main thing is the modeling –and a better word for modeling is modulation ‘’అని అతని నిర్వచనం .చారిత్రాత్మక ,పౌరాణిక జానపద గాధల చిత్రాలను ‘’bad literature ‘’ అనేశాడు .ఎట్టకేలకు 1882లో అతని 43 వ ఏట సిజనే గీసిన ఒక చిత్రాన్ని ‘సెలూన్’’ అంగీకరించింది .ఇదికూడా ఒక కుట్రలో భాగమే ,వంచనా శిల్పమే .అంటోన్ గిలిమేట్ అనే స్నేహితుదు సెలూన్ లో జూరీ మెంబర్ .అతను ఒక విద్యార్ధి చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తూ ,ఆ ప్రదర్శనా చిత్రాల కేటలాగ్ లో ‘’Cezanne –a pupil of Guillimet ‘’అని పేర్కొన్నాడు .
అందరూ ఉన్నా ఏకాకి జీవితమే –చుక్కల్లో చంద్రుడు
వయసు పెరిగిన కొద్దీ అంతర్ సంఘర్షణలకు సిజనే ఎక్కువగా లోనయ్యాడు .ఈ విషయాలపై విన్ ట్రాప్ సార్జంట్ రాస్తూ ‘’ he painted women both as portraits and as nudes ,yet he was so frightened by women that he often could not bear to remain in the same room with his female models ‘’అని చెప్పాడు. ఆ రోజుల్లో ఉన్న సెలూన్ పెయి౦టర్స్ అంటే సిజనే కు ఈర్ష్య ఎక్కువ .కాని వారి ఆమోదం కోసమే ఎదురు చూసేవాడు .అతను పూర్తిగా కేధలిక్ మతానికి చెందినవాడు .కాని ప్రీస్ట్ ల చెడుప్రవర్తనపై నిప్పులు కక్కేవాడు .సమాజం అంటే భయపడేవాడు తోటివారు ఏదో ప్రలోభపెట్టి తనను గేలాలతో బంధించి వారితో లాక్కు పోతారనే భయం బాగా ఉండేది . ‘’humanity was horrible .Nature was reassuring but it was loveliest when it was inanimate ‘’ఇదీ సిజనే మనస్తత్వం .కాని ఎమిలీ జోలా అంటే చాలా అభిమానం అతనికి విధేయుడుగా ఉండేవాడు .జోలా రాసిన నవల ‘’L’oeuvre’’లో హీరో గా తననే చిత్రి౦చాడేమోననే అనుమానం ఉండేది .అందులో హీరో అపజయాల పెయింటర్ ,పిరికి ,.తనను తాను విశ్వజనంతో కలుపుకోకుండా ఏకాకి గా ఉండేవాడు .కాని తనలాంటి వారు చాలా అరుదని చెబుతూ ‘’ప్రతి శాసన సభలో రెండు వేల మంది శాసన సభ్యులు ఉండవచ్చు . కాని సిజానే లాంటి వాడు రెండు శతాబ్దాలకు ఒక్కడు మాత్రమె ఉంటాడు’’ అని ఘంటాపధం గా చెప్పగల ధీరుడు సిజనే .
పీచే మూడ్
1895 తర్వాతా మాత్రమె 20ఏళ్ళ చిత్ర కళా జీవితం లో నాలుగు మాత్రమె ప్రదర్శనలు ఏర్పాటు చేశాడుసిజనే .అప్పటికి వయసు 56 .వోలార్డ్ అనే డీలర్ చాలా చిత్రాలు పెట్టాడు కాని అప్పటికీ పబ్లిక్ అతన్ని తిరస్కారం తోనే చూశారు .సానుభూతి ఎక్కడా రాలేదు .సెలూన్ సామ్రాట్టులూ పెదవి విరిచారు .ఇక పారిస్ మీద విసుగు పుట్టి తన స్వగ్రామం చేరుకున్నాడు .అక్కడే తల్లితో కాలం గడిపాడు .స్నేహితులు అంటే అసహ్యమేసింది సిగ్గుపడి వారికి మొహం చూపించ లేక పోయాడు .హింస ఫోబియాలో ఉండిపోయేవాడు ‘’ఈ ప్రపంచం నన్ను అర్ధం చేసుకోవటం లేదు .నేను కూడా ప్రపంచాన్ని అర్ధం చేసుకోలేక పోతున్నాను .అందుకే దానికి దూరంగా ఉండిపోతున్నాను .మనుషుల చీచ స్వభావం చూసి సహించలేక పోతున్నా వారితో ఏకీభ వించ లేక పోతున్నా . జీవితం భయ పెడుతో౦ది నన్ను ‘’ అని కొడుకుకు ఉత్తరం రాశాడు .మానసిక భయం బాగా పట్టుకొని పీడించింది .డిప్రెషన్ నుండి బయట పదాలని విశ్వ ప్రయత్నం చేశాడు .’’సెరిబ్రల్ టెన్షన్ ‘’అతన్ని పీడిస్తోంది. ఏ పని అయినా భరించలేక పోయాడు .అయినా’’ఫారం ,కలర్’’లపై పోరాటం మానలేదు .I am old and ill –but I am determined to die painting ‘’అని కలవరించేవాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-15- ఉయ్యూరు
ప్రముఖ కదా రచయిత ,న్యాయవాది నాకు అత్యంత ఆప్తులు శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారు కుటుంబం తో 2-6-15 మంగళవారం రాత్రి -మా ఇంట్లో
డా.శ్రీ ఉప్పలధడియం వెంకటేశ్వర గారి ‘’పాఠం’’-2-సమీక్ష (చివరి భాగం )
డా వెంకటేశ్వర –గారు కవితా సంపుటికి పెట్టిన పేరు ‘’పాఠం’’అని ముందే చెప్పుకొన్నాం .ఆ శీర్షిక తో ఉన్నకవిత ను చూద్దాం .చరిత్ర అంటే పిల్లలకు అసహ్యం. కారణాలు చాలా .హద్దుల్ని నిర్ణయిస్తూ ,ఆహవాలే (యుద్ధాలే )తప్ప ఆటలు లేక పోవటం ,తమ ప్రశ్నలకు చరిత్ర జవాబు చెప్పదనే సంశయం అన్ని పేజీలు ఒకే మూసలో ఉంటాయన్న విసుగు అందుకే వాళ్లకు చరిత్ర అంటే గతకాలపు పాత వాసన .అందుకని కవిగారు ‘’పిల్లలు ఇస్టపడేలా చరిత్ర మొత్తం తిరగ రాయాలి ‘’అని తమ అభిప్రాయం తేట తెల్లం చేశారు .తాగు బోతు సంసార జీవితం లో ‘’పాన సుఖ లాలసలో –కాలం మంచు ముక్క కరుగుతుంది –రోజు రోజుకీ ఇల్లాలిగాజులు పెద్దదవుతాయి –పగిలిన సీసా పెంకులు పిల్లల గుండెల్లో దిగబడతాయి .’’అంతేకాక ‘’ఊరవతలి కొంపల్లో –కాలం బరువుగా కన్నీటి బొట్లుగా కారిపోతుంది –‘’ఒక్కో చుక్కా యెంత విలువైనదో తెలిసినా ‘’ఆ చుక్కను’’ మాత్రం వదలలేని బలహీనత కొంపల్ని కొల్లేరు చేస్తుందనే బాధ చూపారు ‘’దృశ్య దృశ్యం ‘’లో వర్షం ఎలా కురుస్తోందో తెలుసా ?’’మొయిలేనుగు (మేఘం అనే ఏనుగు )చదలేట్లోంచి (ఆకాశం అనే ఏటి లో నుంచి ) నీల్లేత్తి కుమ్మరిస్తున్నట్లు .’’ఇంతకురిసీ ఆగిపోయినా ‘’యెదలోపల కురుస్తూనే ఉంది అలజడి వాన ‘’ఎందుకు ?’’పొద్దుననంగా బయటికెళ్ళిన ‘’ఆరోప్రాణం’’ కోసం ఎదురు చూస్తూ ‘’ అన్నారు ‘’వర్షం కురిసిన రాత్రి ‘’కవితలో .సాహితీ సభ ఆహ్వానం లోని అక్షరాలూ ‘’సుతిమెత్తని ఎద లాంటి కాగితంపై ప్రేమాభిమానాలు అక్షరాలై దీపిస్తూ ‘’అని ‘’అక్షర స్మ్రుతి ‘’ వీణను మీటుతారు .అన్నీ చెప్పగలం సలహాలూ ఇవ్వగలం కాని ‘’మనల్ని మనం పసిగట్టటం –నిజంగా ఎంత కష్టమో ?’’అని ‘’అంతర్వాహిని ‘’ని వెలువరిస్తారు .ప్రతి నగరం లోను సాధారణంగా కనిపిస్తాడు ‘’రోడ్డు చిత్రకారుడు ‘’’’మురికి చేతులతో తపో దీక్ష తో బొమ్మ గీసి కనక కిరీటాన్ని రూపొందిస్తాడు –కాలం మనుషులు కాసేపాగి మళ్ళీ పరుగో పరుగు .’’నాలుగు రాళ్ళు ఏరుకొని చీకట్లో కల్సిపోతాడు ‘’కాని అతడు వేసిన బొమ్మ మాత్రం సూదంటురాయిలా ఆకర్షిస్తూనే ఉంది’’ .ఇలాంటి రోడ్డు చిత్రకారుల గురించి ఇంకెవరైనా కవిత రాశారో లేదో నాకు తెలియదుకాని వెంకటేశ్వర మాత్రం అతనికి అక్షర శిల్పం చెక్కారు .నేను 1956-60 లో బెజవాడ లో ఇంటర్ డిగ్రీ చదివినప్పుడు ,ఒకప్పుడున్న అలంకార్ టాకీస్ వద్ద ఒక గుడ్డి అతను ఇలానే రోడ్డు మీద బొమ్మలేసి ప్రాణ ప్రతిష్ట చేసి డబ్బా మొగి౦చు కొంటూ అడుక్కునేవాడు .అతను దాదాపు పదేళ్ళ క్రితం వరకూ అలానే గడిపాడు .అది నాకిప్పుడు గుర్తొచ్చింది .
ఎన్నో ఊహించుకొని తన ఊరి బస్సెక్కి వెడుతుంటే ‘’కనుచూపు మేరా ప్లాట్లు అవుతున్న పొలాలు ‘’చూసి దారి తప్పానను కొన్నారు కవి .ఇన్నేళ్ళకు తిరిగొస్తే చిరు నగవు తో పలకరించే నేస్తమే కరువయ్యాడు .’’ముసలి పల్లె మూగగా రోదిస్తోంది –మూలాలనేవరో –కుదిపేస్తున్న భావన ‘’కలిగింది .తనకోసం విత్తనాలు చల్లే నేస్తాలను ‘’మీకోసం నేను –ఈ నేలమీద బీజాక్షరాలు రాస్తాను ‘’అని ఆహ్వానించారు .ఈ నాటి ప్రతి పల్లె సీమ దైన్య స్తితి ఇదేగా .’’నగరానికి ఎప్పుడోకానీ రెండు కాళ్ళూ ఒకే చోట నిలవవు –గడియారపు ముళ్ళల్లె’’-కుటుంబరావు గాఢ నిద్రలో మునిగినప్పుడు ఉన్నదికాస్తా దొంగలు ఊడ్చుకెళ్లితే ‘’తెల్లారని బతుకులు –తెల్లారి పతాక శీర్షికలు ‘’అవుతాయి పత్రికలలో ‘’ఒక రోజు ‘’.
‘’ప్రపంచం కుగ్రామం అవుతుంటే ఇళ్ళన్నీ చిన్న బోతాయా ?’’అనే మౌలిక ప్రశ్న సంధించారు ‘’ప్రక్షాళన ‘’లో .అలాగే ప్రణయ రంజిత రాత్రి ‘’రాగ మయి ‘’అయి అనురాగమయి అయి ‘’జయ భేరి ‘’మోగిస్తుంది .’’ఎన్ని అస్తిత్వ ప్రత్యేకతలున్నా –మానవతకు లేవు సరిహద్దులు ‘’అని విశ్వ విపంచిని మీటారు కవి ‘’సారం ‘’లో అసలు కవితా సారం ఆదేనంటూ .చరాచారాన్ని ఉత్తేజ పరుస్తుంటే ,సుప్రభాత గీతం పాడుతుంటే ‘’రాత్రంతా బహుశా –వేకువనే కలగందేమో భూమి ?’’అనే అనుమానమొచ్చింది .అసూయ ఈర్ష్య ద్వేషం కమ్ముకొన్న మానవాళి ‘’తననీడనే భరించలేక పోవడం –మనిషి తనమేనా ‘’అని ‘’నీడ ‘’ను చూసి ఝాడుసుకొనే జనాన్ని చూసి సంధించిన ప్రశ్న .మానవత్వమే కనుమరుగైపోతోందన్న ఆందోళన .,ఆవేదన .మాటల్లో నిర్లక్షంగా మంటలు పుట్టిస్తుంటే స్నేహ గంధం వేడెక్కి పోతుంది .ఆ పొగ పెనుపాములా చుట్టేస్తుంది .ఇది పద్ధతికాదు అని చెప్పటానికి గొంతు సవరించుకొంటు౦ టే –గొంతు కేదో అడ్డు పడుతోంది ‘’అన్నారు ‘’స్నేహ ధూపం ‘’లో .రోడ్డు మీద ఇస్త్రీ చేసే వాడిని ‘’చలువరి ‘’అన్నారు సాభిప్రాయం గా .అతడికి తెలియని చిరునామా ఉండదు .కాని అతని చిరునామా మాత్రం ‘’రంగు వెలిసిన చెక్క బండే’’అనటం మహాద్భుతం .’’మూటలు మూటలు బట్టలు చలువ చేస్తాడుకాని –అతడ్ని మాత్రం చలువ బట్టాల్లో –ఎవరైనా చూశారా ?’’లేదనే కదా సమాధానం .ఎప్పుడో తిలక్ ‘’పోస్ట్ బంట్రోతు ‘’గురించి కవిత రాసి మనః హృదయాలలో అతన్ని నిలబెట్టాడు .ఇప్పుడు ఉప్పలధడియం వారు మళ్ళీ అలా అక్షర చలువ పందిరి వేశారు చలువరి కి.
సూర్యుడు కబేళాకు వెళుతున్న మేక పిల్లలా పడమరకు వెడుతున్నాడని ,మారాం చేసే కొడుకును ఆపలేక చితక్కోట్టిన తల్లి ‘’చిరుగు చీరతో కళ్ళు ఒత్తుకుంటుంది మళ్ళీ ‘’.సత్య సాయి బాబా ‘’మనుషుల్ని ప్రేమ స్వరూపులుగా సంభావించిన జ్ఞాన శిఖరం –ఆత్మ సౌరభ స్పృహ కలిగించే సత్యం –సమస్త లోకానికి శాంతిగీతం ‘’అని పించి ‘’అక్షరాంజలి ఘటించారు .కవిత్వానికి ఏ నిర్వచనమూ సరిపోలేదు కవిగారికి .కార్పోరేట్ ఆస్పత్రులలో ఎరగా అస్పష్ట చిత్రాలు ఆక్వేరియం లు ఉంటాయి .కాని అక్కడ ప్రాణం ఖరీదు ఎంత ఎక్కువో ఎవరికి తెలుసు ?’’(’’అ )మూల్యం’’ .అని వ్యంగ్యం .ఇల్లాలికికి ‘’నిద్ర మోయ లేని భారం ‘’ఆమె రెండు చేతులూ ‘’శత సహస్ర బాహువులై విస్తరిస్తాయి .రెండు కాళ్ళూ విరామం లేకుండా సంచరిస్తాయి .ఇదంతా ఎప్పుడు ?తెల్లారగట్ల .భర్తకు అన్నీ అందించాలన్న ఆరాటం తో .మరి ఆమెకు ఎమివ్వగ లడు ‘’నన్ను తప్ప ‘’అంటారు ‘’తెల్లార గట్ల ‘’కవితలో .చివరి మాట ఒక్కటి చాలు ఆమె చేసే సేవకు ప్రతిఫలంగా .
‘’మల్లెకు ఆశ ఆమె లా నవ్వాలని –గులాబీకి ఆశ –ఆమెలా మెరవాలని –శతపత్రానికి ఆశ –ఆమెలా వికసించాలని ‘’అంటూ ‘’ఈ పూలకు ఎంత దురాశో ! అని ముక్తా యించారు .’’కలలకు ఆమె ఆసరా –అయినా –ఎంత నిష్టూరం గా మాట్లాడుతుందో !’’అదీ ‘’మూడు ముళ్ళ’’ బంధం లోని ప్రేమ ఆప్యాయత అనురాగం .’’ఆవిడకు ఓరోజంటే’’ఏమిటో తెలుసా ?’’నుదుటి బొట్టును తూర్పు గోడకు అంటించి దిగుతుంది ‘’బియ్యం లో వేళ్ళతో రాస్తుంటేనే పాకం కళే’’అని గ్రహించింది .ఇల్లు అంట్లు ధగ దగా మెరుస్తున్నాయంటే అది ఆమ్లాల శక్తికాదు ఆమె చెమట తో తడవటమే కారణం –అవసరాలు ఆకాంక్షలు కూర్చోనివ్వవు –ఇంటి పనికీ బయటిపనికీ –ద్విచక్రవాహనమై –తిరుగు తుంది ‘’’’ఆమె సిగ లో చేరలేని పూలన్నీ –ఆకాశం లో తారకలై –తృప్తి పడతాయి ‘’ఎంత గొప్ప భావాన్ని ఎంత కమ్మని భాషలో గుండె లోతుల్లోంచి చూసి చెప్పారు వెంకటేశ్వర గారూ!
‘’విష సంస్కృతీ ని విస్త రింప జేసే –వర్తమానాన్ని ప్రశ్నించ కుంటే –భవితవ్యమూ ప్రశ్నార్ధకమే –సహజీవన సౌరభం –గగన కుసుమమే ‘’అని హెచ్చరిస్తారు కర్తవ్య బోధ చేస్తూ .ఇదికవి దార్శనికత -చదరంగం ముందు కవిగారి అమ్మాయి కూచుని తండ్రిని ‘’రాయలు ‘’ను చేస్తుందట .నాన్న ను ఓడించేశానన్న సంతోషం తో ఆమె ఉంటె ‘’గెలుపును మించిన ఓటమి –మనసంతా చిత్తడి చిత్తడి ‘’పరమ వైభవ వర్ణన .పిల్లల చేతుల్లో ఓడిపోవటం లో ఉన్న మహాదానందానికి మచ్చు తునక ఈ కవిత. ‘’కవి’’ అంటే మనకవి గారు –‘’లోకం చుట్టూ తిరుగుతూంటా –అప్పుడప్పుడు –నాచుట్టూకూడా ‘’అని సహజ సుందర నిర్వచనం చేశారు .
ఇలా ఎన్నని ఉదహరించను ?ప్రతి కవితా ఆణి ముత్యమే –ప్రతి పంక్తి ‘’కోటబుల్ కోట్ ‘’ ఇవికాక ఇంకా ఎన్నో చెప్పాల్సినవి ఉన్నాయి .మచ్చుకు మాత్రమే నేను కొన్ని చెప్పాను .ఇష్టం ఉన్నవారికి ‘’హైకూ ‘’కూతలూ ఉన్నాయి .సుమారుగా 70 కవితలు .ప్రతిదీ చదివి ఆస్వాదించ దగినదే .చాలాకవితలు చెన్నై రేడియోలో ప్రసిద్ధ పత్రికలలో వచ్చినవే .బహుమతులూ అందుకొన్నవే .కవిగారి కృషికి జేజేలు –పలుకుతూ సెలవ్ –
మీ-గబ్బిట దుర్గాప్రసాద్-2-6-15- ఉయ్యూరు
ప్రతులు కావాల్సిన వారికీ చిరునామా
Smt –V.Usha – No 1-A-4th street –V.V.colony –Adambakkam –chennai -88 –phone -044 -42028010 –price rs -60 .
డా.శ్రీ ఉప్పలధడియం వెంకటేశ్వర గారి ‘’పాఠం’’
తమిళనాడు లో మద్రాస్ నగర జీవితానికి అలవాటుపడి హిందీ లో ఏం ఏ పి హెచ్ డి చేసి, పాలిటెక్నిక్ డిప్లోమో పొంది ,చెన్నై లో కేంద్ర ప్రభుత్వోద్యోగిగా ఉంటూ శతకాలు కవితా సంపుటులు హిందీ వ్యాస సంపుటి ప్రచురించి ,’’జనని’’ పత్రికా సంపాదకత్వం వహించి కార్య దర్శియై ‘’నాగ భైరవ పురస్కారం’’ వంటి అపూర్వ పురస్కారాలు గ్రహించి ‘’షార్ట్ అండ్ స్మార్ట్ ‘’కవితా సంపుటి ‘’పాఠం’’వెలువరించిన డా . శ్రీ ఉప్పలధడియం వెంకటేశ్వర నా అడ్రస్ ఇంటర్నెట్ లో చూసి ,రమ్య భారతి సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ గారు కూడా చెప్పగా ఆపుస్తకాన్ని అత్యంత ఆదరం తో నాకు పంపటం నిన్ననే దాన్ని ఆసాంతం చదవటం రాత్రి వారి తో ఫోన్ లో సంభాషించటం జరిగింది .చిక్కని చక్కని కవిత్వం తో అలరించారు .ఉప్పలధడియం అనగానే మహానటులు చిత్తూరు వి. అంటే ఉప్పల దడియం నాగయ్య గారు జ్ఞప్తికి వచ్చారు .వారికీ వీరికీ బంధుత్వం ఉందొ లేదో తెలీడు కాని నాగయ్యగారిదీ చిత్తూరు జిల్లాయే వీరి జననమూ ఆ జిల్లాలోనే . .
‘’పాఠం ‘’కవితలు నిజం గా అందరికీ పాఠాలునేర్పేవిగా నే ఉన్నాయి .ఇందులో మద్రాస్ నగరాన్ని ఎన్నో కోణాలలో ఆవిష్కరించారు డాక్టర్ గారు .పఠాభి అలానే రాశాడని జ్ఞాపకం .మళ్ళీ ఎవరైనా చెన్నై నగరాన్ని ఇలా రాశారో లేదో నాకు తెలియదు .కుందుర్తి నగరం లో వాన కూడా మదిలో మెదిలింది .ముందుగా కవి నగర వర్ణన గురించి తెలుసుకొందాం .’’నిర్నిద్ర నగర౦ ‘’కవితలో ‘’ఒంటరి నగరానికి –ఒంటి కంటి నిద్రే –ఆమాటకొస్తే మెలకువ కూడా ఒట్టి పర్రే’’అని నగర నిజాన్ని తెలిపారు .’’పాలపాకేట్టు ఒలికినట్లు తెల్లారి పోయిందట ‘’ గొప్ప ప్రయోగం .’’నగరం పై ప్రేమ గీతం ‘’వినిపిస్తూ ‘’ఒక స్వప్నం లోకి –ఒకానొక స్మ్రుతి లోకి –ఏక కాలం లో మేల్కొలిపే ఇంద్రజాలం ‘’గా నగరం కనిపించింది .నగరం లో వెలుగుకన్నా’’ చీకటి పొరలు ఎక్కువే ‘’ అయినా ‘’అదొక చైతన్య దీప్తి –ముందుకు నడిపించే మహా చోదక శక్తి ‘’అని పించింది .కవికి చెన్నై నగరం ‘’ఆ జన్మ సాహచర్యం ‘’అందుకే తనది అనుకొంటారు . నగరం అణువణువునా ఆయనలో అల్లుకొనే ఉంది .అన్నిపొరలు ఎలా ఎర్పడ్డాయోననే ఆశ్చర్యం ఉన్నా ‘’అనుభవం వేరు కదా !’’అన్నారు .చెన్నైలోని ప్రముఖ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థలతో కవికి అనుబంధం ఎక్కువ .’’అంశం ఏదైతేనేం వక్త ఎవరైతేనేం –అందరి హృదయాల్లో ప్రవహిస్తుంది –ఆర్ద్రంగా మన తెలుగు గంగ ,’’అని అదొక అమృత తరంగ అని ఫినిషింగ్ టచ్ ఇస్తారు .బహుశా తెలుగు సభలపై ఇంత భావుకతో అనుభూతితో రాసిన కవిత లేదేమో ?బయట చీకట్లు అల్లు కొంటుంటే ‘’లోపల సాహితీ వెన్నెల కురుస్తుంది ‘’’అని సాయంత్రాలు కళా కాంతు లీనుతూ రాత్రిగా పరావర్తనం చెందడం అద్భుతమని పిస్తు౦ది కవిగారికే కాదు మనకూ .
‘’వేసవిలో నగరం’’ రోడ్లన్నీ తారుని స్రవిస్తాయి .ఆకాశ హర్మ్యాలు కడలిగాలిని కట్టడి చేయగా ఊపిరాడక ఇబ్బంది .నీడ అక్కడ ఎండమావే అనటం మంచిప్రయోగం మాత్రమేకాదు కాంక్రీట్ అరణ్యాల విస్తరణ ఫలితం కూడా .’’మిట్ట మధ్యాహ్నం వేళ’’సలసల కాగే నూనె నెత్తిన కుమ్మరిస్తున్నట్లు ఎండ కాస్తోంది .కాలికింద నేల బుసబుసా వేడి ఆవిర్లు చిమ్ముతోంది .గదిలో పంఖా సెగలు కక్కుతోంది –ఇంటా బయటా అగ్ని గుండమే ‘’ఈ బాధ భరించలేక ఎవరిని నిందించాలో తెలీక నిస్సహాయం గా స్వేద ధారగా కరిగి పోవటమే జీవితం ‘’..ఎండ ఇ౦త మడిస్తుంటే మరి వర్షాకాలం ?’’వానకు నగరం అతలాకుతలమై ‘’బంగాళాఖాతం పాయలై పారుతున్నట్లు ‘’వీధులన్నీ నీళ్ళ మయం .దీనికి తోడు’’ విస్పోటన సంరంభం ‘’తో వీచేగాలి కి నగరం నిలువెల్లా గజగజ .మట్టినీ చెట్టునీ మింగేసిందిట మహా నగరం .యెంత ఎండ అయినా భరిస్తారు కాని జనం నాలుగు వానచినుకులకే అల్లాడి పోవటం విడ్డూరం .మానవ ప్రక్రుతి అది .అంతే .
మద్రాస్ మెరీనా బీచ్ సాయంత్రాన్ని రాత్రిగా మారుస్తుందట. స్థలకాల స్పృహే లేని మహా సౌందర్యం లో లీనం చేస్తుందట .మహానగర సోకు పైపైన కనిపించే డాబు .కాలువలు పూడ్చి కట్టిన హర్మ్యాలు .మనో వేగంగా వాహనాలు .జడివానకు రోడ్లూ ఇళ్ళూ ఏకం .హోరుగాలికి చెట్లు దుంగలే అవుతాయి భరోసా లేని జీవితం ఇది .నగరంపై ‘’ఎప్పుడూ ఎగురుతుంది పదో అంకె ప్రమాద సూచిక –కనిపించీ కనిపించ కుండా ‘’ఇవన్నీ వెంకటేశ్వర గారి స్వీయ అనుభూతులే అవి కవితామృతం మారి మనకు ,సాహిత్యానికి అమరత్వం కల్పిస్తున్నాయి .ఏ కవితలో చూసినా పదాలు వాటంతటికి అవి వచ్చి చేరి కూర్చుని సార్ధక మయినట్లు ,భావానికి తగిన శబ్దం తన విలువను నిరూపించుకోన్నట్లు కనిపిస్తుంది .రస సిద్దుడైన కవి మనకు ప్రత్యక్ష మౌతాడు.
కవిగారు కొన్ని ప్రదేశాలను చూసి అక్కడిఅనుభూతులనూ కవితలలో అందంగా అమర్చారు .అవీ చాలా సార్ధకమై విలువను పొందాయి .అస్సాం లోని గౌహతికి వెళ్తే హోటల్ గది ‘’నిరుపహతి స్థలం ‘’గా పెద్దనగారికి లాగా అనిపించింది .’’ఎన్ని నక్షత్రాల హోటలైనా ఇల్లు అవదు అని ఎరుక కలిగింది .ఇంటిమీది జ్ఞాపకాలతో రాత్రి దహించిపోయింది . బ్రహ్మ పుత్ర నది మహా మాయలాడి –బతికించిన మనుష్యులనే బలి గొంటుంది .అలాంటి నదిలో పడవ ప్రయాణంచేయాలి ప్రాణాలు అర చేత బట్టుకొని ‘’కామాఖ్యమ్మ ‘’పై భారం వేసి . ఇక్కడే ‘’చూస్తుండగానే ‘’కవితలోపడవలో చీకటి వేళ ఇంటికి వెడుతున్న మిత్రుడు-‘’క్షితిజ రేఖ కేసి బ్రాహ్మ పుత్ర ప్రవహిస్తుంటే చీకట్లో ఉవ్వెత్తున కెరటం ఎగిసి పడి కళ్ళల్లో గుచ్చుకొంది ‘’అని చెప్పారు .అంటే స్నేహితుడు జలసమాధి చెందాడని అంతరార్ధం . ‘’మదనపల్లి ‘’చుక్క రాల్చని నింగి –నెర్రవారిన నేలా ‘’కుమ్మక్కు అయినట్లుగా ఉందట .ఆశ ఆవిరై కళ్ళు శూన్యాన్ని వరిస్తే కాళ్ళు సరిహద్దుల్ని పునర్లిఖిస్తున్నట్లుంది .’’హంపి ‘’లో రాగ ఝారి ప్రవహించింది .ఒకసారి పురావైభావం గుర్తొచ్చి ‘’గాలి వేళ్ళు అలల తీగల్ని మీటు తుంటే –ఏ వసంతోత్సవం లోనో ‘’అక్కడ పద్యం చదివిన గుర్తు .’’తల కోన ‘’అందాలనూ వొడిసి పట్టారుకవి .’’పచ్చని చీరలో –కొత్త పెళ్లి కూతురులా కొండ మెరిసి పోతోంది ‘’ట .జలపాతం వెండి తోరణం లా వేలాడుటూ రాతి తబలాల పై మూర్చనలు పోతోంది ‘’ట .మహా గొప్ప భావ చిత్రం .’’పాండిచ్చేరి ‘’లో జాలరి సాహసి .బుల్లిపోట్ట కోసం సాహసమే శస్త్రం గా ,నమ్మకమే కవచం గా ‘’సముద్ర యుద్ధం చేస్తాడు .అనుకోకుండా కడలి కాల సర్పమై బుస కొడితే క్షణమొక యుగమే అతనికి .ఎలాగోఅలా గట్టెక్కితే ‘’ గట్టవతల తిమింగిలాలు ‘’గుటుక్కున మింగేస్తాయి ‘’అని దళారీ సామ్రాజ్యపు తిమింగిల కోరల్లో నలిగిపోతున్న జాలర్ల బతుకుని చక్కగా ఆవిష్కరించారు .’’మైసూరు ప్రయాణం లో పదనిసలు ‘’లో బట్టలకు బదులు పుస్తకాలే సర్డుకొన్న అక్షర జీవిగా కవి కనిపిస్తాడు .పుస్తకం తెరిస్తే లోకమే కనిపించదు. భార్య ఫోన్ చేసి బట్టలు కొనుక్కోమనే దాకా .’’హార్స్లీ కొండలు ‘’అక్కడే ఉండిపొమ్మంటాయిట.నీళ్ళూ చీకటి రాహు కేతువుల్లా సూర్యుడిని మింగుతుంటే కొండను మోసుకొని వెనుదిరుగుతాడటకవి ..బెంగళూరు నగరం లో స్నేహితులతో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన కవి పెళ్ళయ్యాక ‘’ఒక్క బంధం కోసం ఎన్నో బంధాలు కోల్పోయాను ‘’అని మధన పడతారు .’’కొడైకెనాల్’’ లో తాను ఒంటరిని కాదని చెట్లూ పూలు వాగులూ తన నేస్తాలేనని భావించారు .తిరునల్వేలి పై ‘’ఖాళీ ‘’కవితలో ‘’గదిలో గోడగడియారం ‘’అవే అంకెల చుట్టూ పదే పదే తిరుగుతున్నట్లని పించింది .గది ఖాళీ చేస్తే గణాంక పుస్తకం మినహా మరేమీ మిగలదు ‘’అన్నారు .’’అరకు ‘’లోనిగిరిజన తండాను చూసిన కవిగారి పిల్లలు అక్కడ వారు వాడే చింకి చాప , మట్టికుండా , రుబ్బు రోలు ,పూరిపాక చూసి అవి ఎవరివి అని అడిగితె ‘’మనవేరా కన్నా ! మన పూర్వీకులవి ‘’అని మాయ మాట చెప్పి ఆ గిరిజన దీన స్తితిని మనకళ్ళ ముందుంచారు కవి .
మిగిలిన కవితల గురించి ఈ సారి
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-6-15 ఉయ్యూరు
మాకు ఉయ్యూరు హైస్కూల్ లో మాస్టారు ,తర్వాత అదే స్కూల్ లో మా సహ ఉపాధ్యాయులు మాకు మెంటార్ ,విశాఖ పట్నం ఆంధ్రా యూని వర్సిటిలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ చేసి రిటైర్ అయి అక్కడే స్తిరపడి అక్కడి యూనివర్సిటి తెలుగు శాఖాధ్యక్షురాలు ఆచార్య శ్రీమతి అరుణ కుమారిగారిని వివాహం చేసుకొని అయిదారేళ్ళ క్రితం చనిపోయిన గండి గు౦ట గ్రామవాసి మా గురువుగారు కీ శే.డా.వల్లభనేని రామ కృష్ణా రావు గారి పత్ని శ్రీమతి అరుణకుమారిగారు ఉయ్యూరు వచ్చి ప్రత్యేకం గా నన్ను చూడాలని మా ఇంటికి 2-6-15 మంగళవారం వచ్చిన సందర్భం గా ఫోటోలు

మా ఇంట్లో అమెరికా లోని షార్లెట్ నుంచి వచ్చిన ఉయ్యూరులో మా పక్కింటి లేక్కల master ఉమామహేశ్వర రావు గారబ్బాయి ప్రసాద్
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -38
16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -4(చివరిభాగం )
మానవత్వ ద్వేషి –మానవ హితైషి
ఈ రకమైన కుటుంబ విషాదాలు మార్క్ ట్వేన్ జీవితం లో మార్పులు తెచ్చాయి .మనుష్య ద్వేషిగా సర్వ ప్రపంచ ద్వేషి గా ఉన్న ఆయన సమతుల్యత లో పడ్డాడు .జీవిత చరమాకం లోని 15ఏళ్ళు ,పూర్వ జీవితం లో ఎంత రాశాడో అంతే కాక ఎక్కువ కూడా రాశాడు అదీ ట్వేన్ గొప్పతనం .అయితే ఇవి సగం సగం రాతలుగా మిగిలాయి .వీటిలో మానవ ప్రవ్రుత్తి ,విధి, ,గౌరవ౦ ,నీతి ఎక్కువ .అన్ని రకాల ఫీలింగ్ లకు స్థానం కల్పించాడు అమెరికా దేశపు రిపబ్లిక్ పాలన మిగిలిన దేశాల పూర్వపు రిపబ్లిక్ లలాగే అంత రించి పోతుంది అనుకొన్నాడు .దీనికి కారణాలు అవినీతి ,పిరికితనం మానవ స్వభావం గా భావించాడు .’’వాట్ ఈజ్ మాన్ ‘’అని ఒక పుస్తకం రాశాడు .శతాబ్దం మారిన తోలి రోజుల్లో రాసిన ఈ పుస్తకం 1906లో ముద్రణ పొందింది .కార్య కారణాల చర్చ చేశాడు ఇందులో .’’He castigated humanity but he loved people ,especially the people of his time and place ‘’.’’ప్రిన్స్ అండ్ పాపర్ (రాజు –పేద )నవలలో ను’’ జోన్ ఆఫ్ ఆర్క్ ‘’లో ఫ్రెంచ్ చరిత్రను చేర్చాడు .ఈ రెండు తన అద్భుత నవలలు అన్నాడు మార్క్ ట్వేన్ .కాని ఫలితాలు ఆశావహం గా రాలేదు .అమెరికాలో ఉన్నంత హాయి, గుర్తింపు ఇతర దేశాలలో పొందలేక పోయాడు .
స్వచ్చతకు మారుపేరు తెల్లని వస్త్ర ధారణ
అరవైలలో నల్లని చిక్కని జూట్టు పల్చబడి తెల్లబడింది .మొదటి నుండి అలవాటైన తెల్లని వస్త్రాలే ధరించేవాడు కళ్ళల్లో చురుకుదనం తగ్గ లేదు మీసం ఆయన వ్యక్తిత్వానికి చిహ్నం గా మారింది .బతికి ఉన్న ఒకే ఒక కూతురు క్లారా పియానిస్ట్ ఆసిప్ గాబ్రిలోవిచ్ ను పెళ్లి చేసుకొన్నప్పుడు మాత్రం తెల్ల వస్త్రాల బదులు ఆక్స్ ఫర్ యూని వర్సిటి డాక్టర్ ఆఫ్ లిట రేచర్ ప్రదానం చేసినప్పుడు ధరించిన స్కార్లెట్ రంగు బట్టలు కట్టుకొన్నాడు . కనెక్టి కట్ లోరెడ్డింగ్ వద్ద తనకు కావలసిన రీతిలో చక్కని ఇల్లు కట్టుకొన్నాడు .కాని ఇక్కడ ఎక్కువ కాలం ఉండకుండా నే చనిపోయాడు .తన జీవితం హెయిలీ తోక చుక్కతో ముడి పడి ఉంది అని భావించేవాడు .అది కనిపించినప్పుడు జన్మించి మళ్ళీ 75 ఏళ్ళకు కనిపించిన తర్వాతా 21-4-1910 న మరణించాడు .
అమెరికా కొత్త సాహిత్య ప్రపంచ సృజన
అమెరికన్ సాహిత్య సరిహద్దు అన్వేషకుడు మార్క్ ట్వేన్ .విషయ౦ లో, శైలిలో అద్వితీయుడే .కొత్త సాహిత్య ప్రపంచాన్నే సృష్టించాడు.తాను చూసింది తెలుసుకొన్నది అంతా తన రచనలలో నిక్షిప్తం చేశాడు ప్రజల జీవన విధానం, భాష ,ప్రవర్తన అలవాట్లు, భయాలు ,విశ్వాసాలు ,కోరికలు,అంతరంగాలు అన్నీ అందులో పొదిగాడు .ఆ ప్రజల ప్రతినిధిగా రాశాడు .అమెరికా రాష్ట్రాల ప్రజల మనోభావాలకే ఆయన రచనలు ప్రతినిదులైనాయి .నేటివిటి ప్రతి రచనలో ప్రతి ఫలించింది .ఇదే ఇతరులకు మార్గ దర్శకమైంది ‘’all modern American literature comes out of one book by Mark Twain called ‘’Huckleberry Finn .All American writing comes from that . There is nothing before .There has been nothing as good since ‘’. అని మరో అమెరికన్ ప్రసిద్ధ నవలా రచయితా నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎర్నెస్ట్ హెమింగ్ వే చెప్పాడు ఇది అక్షర సత్యం .
భాష మీద అనితర సాధ్యమైన పట్టు సాధించి దానిలోనూ మార్గ దర్శి అయ్యాడు మార్క్ ట్వేన్ .తన మార్క్ ను సృష్టించు కొన్నాడు .మాట్లాడే భాషకు రాసే భాషకు ఉన్న అనేక అంతరాలకు స్వస్తి పలికి మాట్లాడే భాషనే రాసేభాషగా తీర్చి దిద్ది కొత్త సాహిత్యభాషకు ఒరవడి పెట్టాడు .అంతకు ముందు ఏ రచయిత ఈ సాహసం చేసి ఉండలేదు .అదీ అతని క్రెడిట్ .నూతన సాహిత్య పరిభాష హాస్యం లో కొత్తపద సృష్టి వ్యంగ్యం లో వినూతనత్వం ఆయన తెచ్చినవే .చాల సులభం గా అతి సహజం గా భాషను వాడాడు .భాషలో జీవం నింపాడు .ప్రజలలోవ్యాపించి ఉన్న పదాలకు సాహితీ గౌరవం కలిగించాడు .ఈ పదాలు మనవే మనం మర్చిపోయాం అని గుర్తు చేశాడు .మన భాష ఇంత మహాత్తరమైనదా అని ఆశ్చర్య పోయేట్లు రాశాడు .అతని రచనలో వ్యంగ్యపు చురుకు పాలు అవహేళన చెన్నాకోలు దెబ్బలు ఉంటాయి .చురుక్కుమన్నా మహా సంతోషం గా ఉంటుంది .ఆయన పదాలు పదబంధాలు గొప్ప ఉదాహరణలుగా సాహిత్యం లో నిలిచిపోయాయి .ఆయన ఏది రాసినా ,ఏది చెప్పినా ఒక సాహిత్య క్రీడగానే భావించారు .అమెరికా జాతి మానవ మనసులను ,మనుష్యులను ఇంత గొప్పగా ఆవిష్కరించిన రచయిత అంతకు ము౦దు ఎవ్వరూ లేరు .ఆయనకున్న ఆలోచనా ఎవరికీ రాలేదు .అందుకే చరితార్ధుడు చిరస్మరణీయుడు అయ్యాడు మార్క్ ట్వేన్ .ఆయన సృజనకు జోహార్లు .
మార్క్ ట్వేన్ చేసిన చమత్కారాలు చూపిన చెమక్కులు ఎన్ని చెప్పినా తనివి తీరదు .కొన్ని ఆయన మాటల్లో చదివితేనే అందులోని సొగసు చూడగలం .అవి ఆ నాటి నుండి సాహిత్యం లో గొప్ప ఉదాహరణలుగా కోటబుల్ కోట్స్ గా చలామణి లో ఉన్నాయి –
1-To be good is noble ,but to show others how to be good is nobler and no trouble .
2-Good breeding consists in concealing how much we think of ourselves and how little we think of the other person .
3-Of all God’;s creatures there is only one that can not be made the slave of the lash .That one is the cat .If man could be crossed with the cat it would improve man but it would deteriorate the cat .
4-If you pick up a starving dog and make him prosperous ,he will not bite you >this is the principal difference between a dog and a man .
5-man is the only animal that blushes . or needs to
6- prosperity is the best protector of principle
7- In the first place God made idiots .This is for practice .
8-When in doubt tell the truth .
మార్క్ ట్వేన్ ప్రభావం
మార్క్ ట్వేన్ జీవించిన కాలం లో ఆయన ప్రభావం ఎంత ఉండేదో చెప్పటం కష్టం .ఈ నాడు మాత్రం ‘’ది అడ్వెంచర్స్ ఆఫ్ టాం సాయర్ ‘’మాత్రం బాల సాహిత్యం లో మహోత్క్రుస్ట మైనదిగా గుర్తింపు పొందింది .కాని దానినే 1877 లో రివ్యు చేసి ‘’అనవసర చెత్త ‘’అన్నారు .యాభై ఏళ్ళ వయసులో ట్వేన్ రాసిన హకల్ బెరిఫిన్ నవల పెద్దగా సంచలనం సృష్టించలేదు .ఇది టాం సాయర్ వచ్చిన తొమ్మిదేళ్ళకు వచ్చింది .దీన్ని టాం కు సీక్వెల్ అనుకొన్నారు .సాంకేతిక దృష్ట్యా హకల్ బెరిఫిన్ భాషా శాస్త్ర పరంగా గొప్ప విజయమే సాధించింది .మాండలికం అమెరికన్ సాహిత్యం లో మొదటి సారిగా ప్రవేశించింది ఈ నవల ద్వారానే .అదొక ఘన విజయం .ఇందులో ఏడు రకాల మా౦డలీకాలున్నాయని పరిశోధనలో తెలిసింది .ఒక్కవాక్యం లో దీన్ని ‘’half comic ,half perilous saga ,a boy’s odyssey which has become a national myth ‘’అన్నారు .
మార్క్ ట్వేన్ కు కౌమార దశ అంటే అమితమైన అభిమానం .అది అప్పుడే జరిపోయిందే అనే బాధ కూడా ఉండేది .అదొక స్వర్గ సీమ అనుకొనేవాడు .ఆయన తాను వివాహ ద్వేషి (misogynist ) స్త్రీ ద్వేషి అని ధైర్యం గా చెప్పుకోలేని పిరికి వాడు అన్నారు విమర్శకులు .కాని మగవారి గురించి ఎంత రాశాడో ఆడవారి గూర్చికూడా అలానే రాశాడు .అయితే చీము నెత్తురు రక్తం మాంసం ఉన్న వ్యక్తిత్వం గల మహిళలు ఆయన రచనలో కనిపించరు అనే అభియోగం ఉంది .కాని మార్క్ ట్వేన్ తన భార్య దృష్టిలో ఎప్పుడూ ‘’యూత్ ‘’యే.
మార్క్ ట్వేన్ సాహిత్య పదాలలో ‘’soil and soul ‘’ప్రతి చోటా దర్శనమిస్తాయి .లూయీ అంటర్ మేయర్ మార్క్ ట్వేన్ ను ‘’paradox is the very key to the conflicts which while they made Mark Twain creatively mature ,kept him from growing up emotionally .A self confessed ,self divided spirit ,holding all the contra dictions together ,there remains the rude but loving skeptic ,the free and un flinching chronicler who was also the innocently swaggering ,endlessly resourceful ,,and eternally impressive boy ‘’ను అభి వర్ణించాడు .
శాస్త్ర సాంకేతిక జ్ఞానం
![]()
శాస్త్రీయ పరిశోధన అంటే మార్క్ ట్వేన్ కు అమితాసక్తి .స్నేహితుడు నికోలా టెస్లా తోకలిసి టెస్లా కున్న లేబరేటరిలో పరిశోధనలు జరుపుతూ గంటలకొద్దీ కాలం గడిపేవారు .మూడు పరిశోధనలకు పేటెంట్ హక్కు పొందాడు .ఆయన రాసిన ‘’కనెక్టికట్ యాంకీ ఇన్ కింగ్ ఆర్ధర్స్ కోర్ట్ ‘’నవలలో ‘’టైం ట్రావెల్ ‘’విషయాన్ని ప్రస్తావించాడు .ఇది అప్పటి సమకాలీన ఆవిష్కరణ .ఆర్ధర్ గారి ఇంగ్లాండ్ లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టాడు .ఇదే తర్వాతా సైన్స్ ఫిక్షన్ లో ‘’ఆల్టర్ నేట్ హిస్టరీ ‘’గా గుర్తింపు పొందింది .1909లో ప్రముఖ శాస్త్రీయ పరిశోధకుడు ఎడిసన్ మార్క్ ట్వేన్ నివసిస్తున్న కనెక్టికట్ లోని రెడ్డింగ్ కు వచ్చి అతని పరిశోధనపై రెండు రీళ్ల షార్ట్ ఫిలిం షూట్ చేశాడు .అదొక్కటే ట్వేన్ జీవితం పై చిత్రించబడిన ఒకే ఒక్క ఫిలిం .
లేబరేటరిలో మార్క్ ట్వేన్ -1894
మని కలెక్టింగ్ స్పీకర్
సునిసిత మైన హాస్యాన్ని వ్యంగ్యాన్ని జోడించి స్పాంటేనియస్ గా మాట్లాడటం మార్క్ ట్వేన్ గొప్పతనం .ఇదే తర్వాత కాలం లో ‘’ స్టాన్డప్ కామెడి ‘’గా గుర్తింపు పొందింది .ఎన్నో క్లబ్బులలో ‘’ పెయిడప్ టాక్స్ ‘’ఇచ్చాడు .లండన్ సావేజ్ క్లబ్ లో కూడా మాట్లాడి గౌరవ సభ్యునిగా ఎన్నికయ్యాడు .ఇంతటి అరుదైన గౌరవం పొందినవారు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ తో సహా ముగ్గురే ముగ్గురు .వియన్నా వెళ్లి అక్కడిక్లబ్ లో ‘’జర్మనీ భాషలో దారుణాలు ‘’(హారర్స్ ఆఫ్ జెర్మని లాంగ్వేజ్ ) అనే విషయం పై మాట్లాడి అందరిని మెప్పించాడు .ప్రిన్స్ టన్ యూని వర్సిటి లో ఉపన్య సించి దాని గౌరవ సభ్యుడయ్యాడు .
బాలికల క్లబ్
ఆడ పిల్లలను కోల్పోయిన మార్క్ ట్వేన్ 1906 లో ‘’’’ఏంజెల్ ఫిష్ అండ్ ఆక్వేరియం క్లబ్ ‘’స్థాపించి బాలికలను ఆహ్వానించి తన దియేటర్ లో నాటికలు ఆడామని సంగీతకచేరీలు చేయమనేవాడు .’’నా జీవిత ముఖ్య ఆనందం ఈ క్లబ్ ‘’అని రాశాడు .1908లో .ఏంజిల్ ఫిష్ బాలికలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు .
ఘన నివాళి
మార్క్ ట్వేన్ మరణానికి సంతాపం ప్రకటిస్తూ ఆనాటి అమెరికా ప్రెసిడెంట్ విలియం హోవార్డ్ టాఫ్ట్’’మార్క్ ట్వేన్ బౌద్ధిక విజ్ఞానాన్ని హాస్య వ్యంగ్య ఆనందాన్ని లక్షలాది ప్రజలకు అంద జేశాడు ఇంకా ఎందరినో ప్రభావితం చేశాడు. ఆయనది అమెరికా హాస్యం .ఆయన రచనలను ఇంగ్లాండ్ దేశం తో సహా అనేక దేశాలు చదివి అభినందించాయి. అమెరికా సాహిత్యానికి అరుదైన గుర్తింపు మార్క్ ట్వేన్ వలన లభించిందన్నది పరమ సత్యం ‘’అని ఘన నివాలులర్పించాడు .
అందరివాడు
ఇ౦పీరియలిజానికి మార్క్ ట్వేన్ వ్యతిరేకి .స్పష్టంగా దీన్ని తెలియ జేశాడు .జాతి వివక్షత ను కాదన్నాడు .మహిళాహక్కులు కావాలన్నాడు . స్త్రీలకు వోటుహక్కు ఉండాలని ‘’వోట్స్ ఫర్ వుమెన్ ‘’.అనే ఉపన్యాసం లో చెప్పాడు .అంధ రచయిత’’ హెలెన్ కెల్లర్’’విద్యా పురోభి వృద్ధికి సహకరించాడు .’’లైఫ్ ఆన్ ది మిసిసిపి ‘’లో రాసిన బోటింగ్ ఇండస్త్రి లోని ‘’యూనియన్ ‘’ల గురించి రాసిన వాటిని ఇప్పటికీ యూనియన్ హాళ్ళలో చదువుతున్నారంటే ఆయన రచనా ప్రభావం ఎంతటిదో తెలుస్తోంది .’’కార్మిక ఉద్యమం ‘’ను మార్క్ ట్వేన్ ప్రోత్సహించాడు .
![]()
మార్క్ ట్వేన్ పూర్తీ
![]()
డి లిట్ ట్వేన్
మరో ప్రముఖునితో కలుద్దాం
మీ –గబ్బిట డుర్గా ప్రసాద్ -1-6-15-ఉయ్యూరు