తెలుగు నేలలో బౌద్ధ పునరుద్ధరణ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మార్క్ రాజకీయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

“’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-16

’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-16

ప్లాస్టిక్ స్పేస్

ప్రత్యేకం గా చేస్తున్న పరిశోధనలు ఏవీ  వృధా కాలేదు మంచి ఫలితాలనే ఇచ్చి  ఉత్సాహపరచాయి .యుద్ధ  టాంకు లకు  పనికొచ్చే కొత్త రకాలైన ఇంధనాలు (ఫ్యుయెల్స్) ,వాటిలో  కలిపే ‘’ఎడిటివ్స్’’ పైన చేస్తున్న కృషి రామయ్య గారి జీవితం లో ముఖ్య భాగమే అయింది .దీనితో ‘’ప్లాస్టిక్ స్పేస్ ‘’అనే కొత్త సూత్రాలకు దారి తీస్తుందని ఊహించలేదు .ఇది అనుకోకుండా జరిగిన సంఘటన .అప్పటికే మధ్యాహ్న భోజనం సమయమైంది .ఇంటికి ఫోన్ చేసి ఆ రోజు ఆలస్యంగా వస్తానని చెప్పారు .అక్కడే ఏదో దొరికింది తినేస్తాం అని తెలియజేశారు భార్య కాత్యాకు  .మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి ఆ విషయమే మర్చిపోయారు .పని పూర్తీ చేసుకొని ఇంటికి చేరుకొనే సరికి అందరూ నిద్రపోతున్నారు .

హోం గార్డ్ రామయ్య –అదుగు దూరం లో  యుద్ధభూమి కి దూరమైన రామయ్య

యుద్ధం మొదలైన రోజు నుండి దిన చర్యలో మార్పు వచ్చింది .రామయ్య గారు వాయంకోమాల్ వెళ్ళిన దగ్గర్నుంచి తనను యుద్ధ భూమికి పంపమని కోరుతూనే ఉన్నారు .ఆయన్ను హోమ్ గార్డ్ గా మిగిలిన వాలంటీర్ లతో బాటు  తీసుకొన్నారు .అందరిలాగే వరుసలో నిలబడ్డారు .ఇది వరకటి లాగా అహింస ,ఇతరులను చంపరాదు ,యుద్ధం లో చస్తే అమరులౌతారు మొదలైన నీతి వాక్యాలేవీ అప్పుడు మనసులోకి రానే లేదు . అనాగరక కొత్త హూణులే ,వారి దుశ్చర్యలే మనసులో నిలిచాయి .హోమ్  గార్డ్ గా తన దేశాన్ని తన స్వేచ్చను సంరక్షించుకోవాలి అన్నదే ధ్యేయమైంది రెండో ఆలోచనే రాలేదు మనసులోకి .యుద్ధ సైనికుడినే అనుకొన్నారు .’’క్విక్ మార్చ్ ‘’అన్న కమాండ్ విని పించింది .యుద్ధ రంగం లోకి అడుగు పెట్ట బోతున్నారు .ఇంతలో ‘’ఇందులో రామయ్య ఎవరు ? ఆయన ఈ లైన్ ఫార్మేషన్ నుండి బయటికి రావాలి ‘’అన్న మాటలు వినిపించాయి .మిగిలిన వాలంటీర్లు ఆశ్చర్యం తో చూస్తుండగా రామయ్యగారు  ఆ  కమాండ్ విని ఆఫీస్ వైపు నడిచి వెళ్ళారు .అక్కడ ఆర్మీ  రిప్రేసే౦టటివ్ తో బాటు, రామయ్య గారి ఇస్టిట్యూట్ డైరెక్టర్ కూర్చుని ఉన్నాడు .ఆయన ‘’కామ్రేడ్ మిత్రమా ! నీ దేశ భక్తీ పై ఎవరికీ అపనమ్మకం లేదు .కాని నీ బుర్ర శిక్షణ లేని సైనికుడు .కనుక అది శత్రువుల బులెట్ కు గురి కారాదు .మాకు నీ మేధస్సు  పదునైన ఆయుధం గా ఉపయోగ పడాలి కాని యుద్ధ భూమిలో కాదు ‘’అన్నాడు .

రామయ్యగారు ఆజ్ఞను పాలించి ఇదివరకున్న ఇస్టిట్యూట్ ఖాళీ చేసిన చోటికి చేరుకొన్నారు .రామయ్యగారు తన కుటుంబాన్ని ఓల్గా తీరం లోని భార్య కాత్యా దగ్గర బంధువుల ఇంటికి పంపేశారు .మాస్కో కు రామయ్య గారు గుడ్ బై చెప్పారు .కానీ ఏడాది తిరిగొచ్చేసరికి మళ్ళీ ఇంటికి చేరుకొని పాత చోటులోనే మళ్ళీ ఏర్పడిన డిపార్ట్ మెంట్ లో చేరి పని చేయటం మొదలు పెట్టారు యుద్ధం తీవ్రం గా జరిగింది .రామయ్య గారు ఒంటరిగా ఉండిపోయారు తన భార్య ,పిల్లలు ఎక్కడున్నారో ఏమై  పోయారో తెలియదు .కొన్ని నెలల తర్వాత వాళ్ళు క్షేమంగా ఉన్న వార్త మాత్రం తెలిసింది ..ఈ ఒంటరితనం తాను చేస్తున్న తీవ్ర పరిశోధనకు బాగా ఉపయోగ పడి సమయమే తెలియ కుండా పోయి గొప్ప వరమే అయింది .ఒంటరితనం మనుషుల్ని నిలువుగా అడ్డంగా కూడా వేరు చేస్తుంది .తరాల శృంఖలాను చేదిస్తుంది .భార్యా బిడ్డలు ఏమై  పోయారో నన్న దిగులు తో బాటు తానూ జీవితం నడి దారిలో- క్రాస్ రోడ్స్ లో ఉన్నానన్న బాధా కలవరం కలిగించింది .తాను  ఒక గుడ్ల గూబలా ఉండిపోయాను అని చెప్పుకొన్నారు రామయ్య .

ఈ ఒంటరితనం దూరం కావటం ఒక విధం గా జరిగి కొంత  ఊరట కలిగించింది .’’హౌస్ మేనేజి మెంట్ ‘’వారు రామయ్య గారి  పొరుగు వారైన ఒక ఇంజనీరు ,అయన భార్య ను తోడుగా  ఉండే ఏర్పాటు చేశారు .యుద్ధప్రారంభం లో ఆ ఇంజనీర్ ఇంటి వద్ద బాంబు పేలిందట .అక్కడే బితుకు బితుకు మంటూ తల దాచుకొన్నారు ఇప్పటిదాకా . వారికి మళ్ళీ ఫ్లాట్ ఇచ్చేదాకా రామయ్య గారింట్లో నే ఉండే ఏర్పాటు చేశారు .కాసేపైనా మాట్లాడుకోవటానికి మనుషులు దొరికారని రామయ్య సంతోషించారు .వంట గది ఉపయోగం లోకి వచ్చినదుకు ఆనందమూ పొందారు . ఆ రోజుల్లో తినటానికి పెద్దగా ఏమీ ఉండేదికాదు ఉడికిన బంగాళా దుంప లే   ఆహారం .తనదేమో  ఏనుగు లాంటి భారీశరీరం .దానికి చిరు ఆహారాలేమీ ఆనటం లేదు .దీనికి తోడూ  ఇన్ ష్టి  ట్యూట్ లో పని ఎక్కువై టెన్షన్ పెరిగింది .ఈ కొద్ది ఆహారం ఏమూలకూ చాలక ఎప్పుడూ ఆకలిగా ఉండేది .అలసట నీరసం ,తల తిరుగుడు బాగా బాధించేవి .

మూడు బాంబులను తప్పించుకొని బతికిన రామయ్య

అందరిలాగే రామయ్య గారు జర్మన్ బాంబు దాడులు జరిగే రోజున సెర్చ్ లైట్లతో యుద్ధవిమానాలు ఎత్తుగా భీకర శబ్దం చేస్తూ ఎగురు తున్నాయి . విధి నిర్వహణలో బిల్డింగ్ పైభాగాన నిలబడి ఉన్నారు  .గుడ్లగూబ చేసే ధ్వని లాంటిది వినబడింది .ఒక బాంబు పై నుండి పడి ప్రక్క బిల్డింగ్ దగ్గర ప్రేలింది .ఆ బాంబు ప్రేలుడు ప్రకంపనాలకు ఈ బిల్డింగ్ పై ఉన్న రామయ్యగారు కిందపడిపోయారు .దోర్లిపోయారు .తన కాళ్ళ కింద రూఫ్ గర్డర్లు పగిలి పోతూ కనిపించాయి .కాసేపటికి భయం తీరింది అని పించింది .బాంబు పేలిన పక్క ఇంటి పైభాగాన నుండి విపరీతమైన  పొగ మేఘం లాగా కమ్మేసింది .కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి .కిందున్నవారు భయం తో అరుపులు కేకలు వేస్తున్నారు .ఇలా త్రుటికాలం లో మొదటి సారి బాంబు దాడి నుంచి రామయ్య తప్పించుకొని ప్రాణ భయం లేకుండా బతికారు .

రెండవ సారి సూటిగా బాంబు వచ్చి రామయ్య గారి చేతిలోనే పడింది .అదృష్టవశాత్తు అది అతి చిన్న ఇల్లు తగలబెట్టే దిమాత్రమే .ఈ సారికూడా రూఫ్ మీద డ్యూటీలోనే ఉన్నారు .ముందు జాగ్రత్తగా ఇసుక పెట్టె రెడీగా ఉంచుకొన్నారు .ఇవి’’ ఇన్సేన్డియరి’’ బా౦బు లాంటివి పడితే రక్షణకు ఉపయోగ పడతాయి .బాంబు పేలి రైలింగ్ కు తాకి సరాసరి వచ్చి రామయ్య గారి పాదాల దగ్గర పడింది .అప్రమత్తమై పట్టకారుతో దాన్ని పట్టుకొని ,అగ్ని జ్వాలలు కురిపిస్తున్న దాన్ని లాగి , సాండు బాక్స్ వైపుకు వదిలేశారు .అప్పుడు తాను  ఒక కంసాలి పని చేసే వాడిలాగా అనిపించాను అనుకొన్నారు .మండే వస్తువులు ప్రాణాంతకమైనవి కాకూడదని రామయ్య గారు భావించారు .ఆయన భయపడనే లేదు .కాని ఇంకేదో ఉంది .ఆ స్పార్క్ లను తానూ సృస్టించ లేరు అనుకొన్నారు కాని ఆ వెలుగులు ఆయనలో కొత్త ఆలోచనల స్పార్క్ లను కలిగించింది .అవి తానూ చేస్తున్న పరిశోధనలకు సంబంధం ఉందనుకొన్నారు కాని తను చేస్తున్నది లూబ్రికంట్ ల పని .ఆ తర్వాత ఇంతకు  ముందు వచ్చిన ఆలోచనను మర్చే పోయారు .

మూడో సారి పెద్ద భయంకర బాంబు నుండి తప్పించుకో గలిగారు .డ్యూటీకి వెడుతుండగా సైరన్లు వినిపించాయి .కాపాడుకోవటానికి దగ్గరేక్కడా షెల్టర్ కనిపించలేదు అనటం కంటే వాటిని పట్టించుకోలేదనటం సరైన మాట .యుద్ధానికి ముందు ప్రమాదాన్ని అంచనా వేయ లేక పోయాయమని రామయ్య అన్నారు .వీధిలో నడుస్తున్న రామయ్య గారికి కొన్ని అడుగుల దూరం లో భూమి మీద బాంబు పడింది .కదలకుండా అక్కడే ఉండిపోయారు .బాంబు ప్రేలుడు దాదాపు పూర్తీ అయి పోయింది .ఏదో అదృశ్య శక్తి తనను కాపాడింది అనుకొన్నారు .అవే తన చివరి క్షణాలనిపించింది .అదృష్ట వశాత్తు ఆ బాంబు పేలనే లేదు .పేలే అవకాశమూ కనపడ లేదు .కాని ఎప్పుడేది జరుగుతుందో ఎవరికి తెలుసు ?కానీ రామయ్యగారు భయ పడి పారిపోనే లేదు .బాంబు తన యెడల వీర విధేయత ప్రదర్శించిందేమో ?అక్కడ వారి   దృష్టిలో తాను  ఒక నల్లవాడు మాత్రమే .కాని అక్కడున్న జనం రామయ్యగారిని ప్రక్కకి లాగి అప్రమత్తం చేశారు .చుట్టూ దడికట్టి కాపాడారు .ఇలా మూడు సార్లు త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకో గలిగారు .ప్రాణం పోకపోవటమే కాదు ,గాయాలు కూడా తగులకుండా బయట పడ్డారు .బాన్దేజి వేసిన డాక్టర్ ‘’రామయ్యా ! యు ఆర్ లకీ ‘’అనటం తమాషాగా ఉంది ఆయనకు .యుద్ధం లోని నైచ్యాన్ని ఏవ గి౦చు కొన్నారు .జనావాసాలపై ఈ బాంబు దాడులు ‘’mean absurdity ‘’ అని పించింది .ప్రపంచం లో సగం దూరం ప్రయాణం చేసి కొత్త దేశం లోదేశానికి  కొత్త రూపు రేఖలు సంతరిస్తున్న సందర్భం లో ఈ బాంబు దాడులనుండి  ‘’ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ ‘’ కాలం లో తప్పించుకోవటం అద్భుతం అని పిస్తుంది .ఆయన సాధించాల్సింది ఇంకా ఏంతో ఉందికదా .అందుకే ఆయన్ను  భగవంతుడు రక్షించాడు అనుకోవాలి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-15 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-15

కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-15

పల్లెటూరి పిల్లతో   రామయ్య రెండో పెళ్లి

ఆ రాముడికి ఒకే బాణం ఒకే భార్య .కాని విధి వక్రించి ఈ రామయ్య కు రెండో వివాహం జరిగింది .అదీ యాదృచ్చికం గా .మొదటి అమ్మాయి అమెరికా కు చెందిన సారా .ఆమె ఈయనతో రష్యాకు రానన్నది .అక్కడే ఉండి పోయింది .రామయ్యగారి అన్ని ప్రయత్నాలు విఫలమై ఆమెను వదిలి రష్యాకు ఒంటరిగా రావాల్సి వచ్చింది  .అప్పటి నుండి ఒంటరి జీవితమే గడిపారు .మళ్ళీ ఆయన జేవితం లోకి’’ కాత్యా’ అనే ఆమె ప్రవేశించి భార్య అయి సంతానం అంద జేసింది .రష్యా అంతర్యుద్ధం అనేక విధాలుగా ప్రజా జీవితాలను అస్త వ్యస్తం చేసింది .వేల కుటుంబాలకు నీడ లేకుండా పోయింది .ఆకలి తో జనం అల్లల్లాడారు .తీవ్రమైన జబ్బు పడ్డ మనిషి నెమ్మది నెమ్మదిగా కోలు కొన్నట్లుగా ఇప్పుడు రష్యా క్రమంగా కోలు కుంటోంది .రామయ్య గారు రష్యా చేరిన కొన్నేళ్ళకు విపరీతమైన కరువు కాటకాలోచ్చాయి .పంట బాగా తగ్గిపోయింది  ఓల్గా తీరాన ఉన్న ‘’పావోల్జీ ‘’ప్రాంతం మరీ దెబ్బ తిన్నది .వేలాది మంది తిండి లేక చనిపోయారు .మిగిలిన వారు వారి స్వగ్రామలను వదిలి ఉపాధి, తిండి దొరికే ప్రాంతాలకు వలస పోయారు .అలాంటికరువు  సమయం లో ఒక ‘’పల్లెటూరి పిల్ల’’సర్వస్వం కోల్పోయి అనాధ యై ,ఎన్నో కస్టాల కడలి దాటి నెమ్మదిగా మాస్కో నగరం చేరింది .కాయ  కష్టం చేసి పొట్ట పోసుకొంటూ నగర జీవితానికి క్రమంగా అలవాటు పడింది .ఇక్కడ రామయ్యగారు తాను  పూర్వం ఉయ్యూరు నుండి మద్రాస్ చేరిన సంగతి తో ఈ సంఘటనను పోల్చుకొన్నారు .తాను  ఆ రోజుల్లో జ్ఞాన దాహం ,విజ్ఞాన ఆకలి తీర్చుకోవటానికి మద్రాస్ చేరారు కాని ఈ విధివంచిత కడుపు ఆకలి తీర్చుకోవటం కోసం ,  బతకటం కోసం మాస్కో నగరం చేరింది .ఇద్దరి విధి ఒకే తీరుగా ఉందనిపించింది .ఆమెను మొదటి సారి కలిసి నపుడు ఆమె తనను సానుభూతితో అర్ధం చేసుకొంటుంది అనిపించింది .క్రమంగాఒకరికొకరు దగ్గరయ్యారు .సారాలాగా ఈమె తనతో ఎప్పుడూ పోట్లాడి ఎరుగదు .ఆమె తనకంటే సాంఘికం గా ,విద్యా పరంగా చాలా తక్కువ స్తితిలో ఉన్నప్పటికీ ఆమె తనకు తగిన భార్య గా భావించి,పరస్పర అంగీకారం తో  పెళ్లి చేసుకొన్నారు .ఇద్దరికీ మూలాల లో భేదం ఉన్నా ,’’రష్యన్ పిలుపు ‘’ఇద్దర్నీ దగ్గరకు చేర్చింది అంటారు రామయ్య .సలహా ,ప్రేమ తమను పరస్పరం కలిపాయి అన్నారు .ఆమె తనకు భార్య అయినందుకు రామయ్యగారు ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకొన్నారు అదీ రామయ్య గారి సంస్కారం. తానేదో జీన జనోద్దరణ  చేశానని డబ్బా కొట్టుకోలేదు ..ఆమె వలననే తనకు నెమ్మది నెమ్మదిగా రష్యా భాష మాట్లాడటం ఆలోచనలు , దేశం పరిస్తితుల్ని ఆకళింపు చేసుకోవటం జరిగింది అంటారు. తానూ ఎప్పుడైనా  తప్పని సరి అయితే తెలుగు కాని సంస్కృతం కాని మాటలు నేర్పే వారామెకు .కనుక తాను  రష్యా వచ్చిన కొన్నేళ్ళ వరకు భార్య కాత్యా పైననే ఆధార పడి ఉన్నానని నిస్సంకోచం గా తెలియ జేశారు .అన్ని రకాల అర్హతలున్న జీవిత భాగ స్వామిని లభించిందని సంతోషించారు .నిజం గా కాత్యా తనకు అర్ధాంగి  .తాను  రామయ్య అయితే ఆమె సీతమ్మ తల్లి .

నిజమైన ‘’సీతా’’ రామయ్య ‘’

ఆ రోజుల్లో తమ ఇల్లు ‘’హౌస్ ఆఫ్ సెవెన్ విండ్స్ ‘’లాగా ఉండేదట .ఎందరో ఇంటికి వచ్చి వెడుతూ ఉండేవారు అందులో సైంటిస్టులు ,ఇండియా నుంచి వచ్చే స్నేహితులు , తనతో పాటు పని చేసేవారు సహా విద్యార్ధులు కొమిటేర్న్ వారు ,ఇతర రిపబ్లిక్ దేశాలలో ఉన్న మిత్రులు వచ్చి ఆతిధ్యం అందుకొని వెళ్ళేవారు అందరికీ భార్య కాత్యా ఏంతో ఆదరం గా ఆత్మీయంగా వండి వడ్డించి అతిదిమర్యాదాలు చేసేది .ఆమె అందరి పాలిటి  అన్నపూర్ణ అయింది .’’వండ నలయదు వేవురు వచ్చిరేని ,నడికి రే యైన –అన్నపూర్ణకు నుద్దియౌ నతని గృహిణి ‘’అన్న పెద్దన గారి ప్రవరాఖ్యుని భార్యలాగా కాత్యా ప్రవర్తించి అందరిని ఆదరించింది . అందరితో చక్కగా మాట్లాడే గొప్ప సావకాశం కల్పించింది .ఆమెలో ఏంతో శక్తి నిండి నిబిడీకృతం గా ఉండేది . యెంత  శ్రమ పడుతున్నా ఆమె ముఖం లో చిరునవ్వు చేరిగేదికాడు. అలసట కనిపించేదికాదు . రామయ్య గారు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేవారు .ఆమె పవిత్రమైన నవ్వుకు అందరూ జేజేలు పలికేవారు .అదృష్ట వంతులు రామయ్య. సరైన సమయం లో సరైన అర్ధాని లభించి ఆయనకు పూర్తిగా బాసట గా నిలిచింది .ఇప్పుడు నిజంగా ‘’సీతా ‘’రామయ్య ‘’అయ్యారు .

రామయ్య గారి  రెండవ ప్రపంచ యుద్ధ జ్ఞాపకాలు

రెండవ ప్రపంచ యుద్ధం మొదలైన రోజు ను గుర్తుకు తెచ్చు కొంటూ రామయ్యగారు ‘’ఆ రోజు మా కుటుంబం అంతా  ‘’ఆల్ యూనియన్ అగ్రికల్చరల్ ఎక్సి బిషన్ ‘’ను చూస్తున్నాం .చాలా ప్రశాంతమైన రోజు అది .మా అమ్మాయి  లీలావతి  పూల తోటల మధ్య హాయిగా పరి రిగెత్తుతూ ఆడుకొంటోంది .ఆ ఆనందం శాశ్వతం అనుకొన్నాను .ఇలా ఆనందంగా చాలా ఏళ్ళుగా ఉన్నాం కూడా .అప్పుడే లౌడ్ స్పీకర్ల నుండి యేవో సూచనలు హెచ్చరికలు వినిపించాయి . మేము ఎమైనామో  నని మా దగ్గరికిపిల్ల కంగారుగా  పరిగెత్తుకొచ్చింది .’’ఇప్పడు ఏమౌతుంది ?’’ అని నా భార్య కాత్యా అడిగింది . మిగిలిన వారికి ఏమి అవుతుందో మనకీ అదే అవుతుంది కాత్యా ! అన్నారు రామయ్య .అక్కడున్న మిగిలిన అందరిభార్యలు భర్తలను అదే ప్రశ్న వేస్తున్నారు .కాత్యాకు అర్ధమై పోయింది విషయం .నా దగ్గర ఏడవ కుండా గుడ్ల నీరు కుక్కుకోన్నది .నేను ‘’వాన్ కొమాట్ ‘’వెళ్లి పోయాను వాళ్ళను అక్కడ వదిలేసి .ఇప్పుడు నా కర్తవ్యమ్ మా  ఇంటినే కాదు నా భార్యా కూతుర్ని మాత్రమె కాదు నా దేశాన్ని రక్షించాలి .అదే ఇప్పుడు గౌరవం స్వేచ్చ .నాభారత దేశం పై నా ,ప్రపంచం పై నా ఆశ ‘’అని అంటారు .

ఎప్పుడో వస్తుందనుకొన్న యుద్ధం  అనుకోకుండా ఒక్కసారి  వచ్చి మీద పడింది .ప్రతిసారీ ఆయన ఆలోచనలు మూలాలలోకి వెడతాయి .హిట్లర్ దళాలు తన దేశం పై ఎందుకు దాడి చేస్తున్నట్లు ?అదీ రాత్రి పూట మరీ ?ప్రజలందరూ హాయిగా నిద్రలోకి జారుకున్న సమయం లో ఈ భయంకర యుద్ధ ప్రళయం ఏమిటి ?ఈ సమయమే వాళ్లకు చాలా అనుకూల సమయం అని ఎంచుకోన్నారా?ఈ అర్ధ రాత్రి వేళ జనమే కాదు సైన్యమూ ప్రమత్తతతో నిద్రపోతూ ఉంటుంది .కొద్దిమంది జర్మన్లకోసం ఇంత మందిని హిట్లర్ నరమేధం చేయాలా ?హిట్లర్  తన ప్రజల మీద ఆ మధ్య అంత ప్రేమ ఒలక బోస్తూ మాట్లాడాడు .ఇంతలో ఇంత మార్పా ?హిట్లర్ భయపడ్డాడా ?యూరప్ ను జయించినంత సులభం కాదు రష్యాతో పోరాటం .హిట్లర్ కు సోవియట్ రష్యా అంటే భయం ,ఒణుకు కూడా .అక్కడ తన పప్పులు ఉడకవు.ఇప్పుడిప్పుడే కోలుకొని ఎదుగుతున్న రష్యా పై ఇంత కసీ ,కక్షానా ?ఈ యుద్ధం లో హిట్లర్ విజయమన్నా సాధించాలిలేక పోతే చచ్చి అయినా పోవాలి. రెండే అతని ముందున్న మార్గాలు .రష్యాతో యుద్ధం మొదలు పెట్టిన రోజు నుండి ప్రతి రోజు సైన్యం వెంటే ఉండి నడిపిస్తున్నాడు .రష్యా సర్వస్వాన్ని ఒడ్డి ఎదిరిస్తోంది నిలవరిస్తోంది హిట్లర్ పురోగమనాన్ని .

అకడేమీషియన్ అయిన వేర్నాన్దిస్కి మాటల ప్రకారం జెర్మని ఫాసిసిజం చారిత్రాత్మకం గా పతనమైనట్లే .మానవ ప్రాధమిక పరిణామానికి వ్యతిరేకం గా హిట్లర్ ప్రవర్తిస్తున్నాడు .అందుకే వాళ్ళు తప్పక ఓడిపోవాలి .రామయ్యగారికీ అదే నిజమని పించింది .అయితే విజయ సాధనకు ఎంత మూల్యం చేల్లి౦చాలొ ?ఫాసిస్ట్ లకు ,రక్షణ లేని ఇండియా రష్యాను సమర్ధించటం మధ్య ఒక అడ్డంకిఉన్నట్లు అని పించింది .ఇలా చేస్తే తన బంగారు తల్లి భారత దేశాన్ని పతనం నుండి చావు నుండి కాపాడిన వాడినవుతాను అని భావించారు రామయ్య .

సర్వ శ్రేష్టమైన రష్యన్ టాంక్

ట్రాక్టర్ కు యుద్ధ టాంక్ కు చాలా భేదం ఉంది .వాటికి పని చేసే మోటార్ ల పని భిన్నంగా ఉంటుంది .ఆ రోజుల్లో అన్ని వాతావరణ పరిస్తితులలో యా మోటారర్ల లోని ఇంధనం అనుకూలం గా పని చేసేట్లు చేయటమే లక్ష్యం గా ఉండేది . భారీ యంత్రాలు చాలా సమర్ధంగా ఎక్కువ కాలం మన్నాలి .ఎక్కువ వేగంగా పని చేయాలి .టాంక్ అంటే ఆయుధాలున్న ట్రాక్టర్ కాదు అనిపించింది రామయ్యగారికి .చాలా చిక్కు సమస్యలు ఇందులో ఉన్నాయి వీటిని అత్యవసరంగా పరిష్కరించాలి ముందు .అందుకే కొత్త తరహా కిరోసిన్ ను కనిపెట్టి వాడారు అది బ్రహ్మాండమైన, అపూర్వమైన విజయాలనిచ్చింది .దీనితో రష్యా టాంకులు శత్రు జర్మనీ టాంకుల కంటే సర్వ సమర్ధంగా పని చేసి సామర్ధ్యాన్ని నిరూపించాయి .ఈ విజయం రామయ్య గారి టీం సాధించిన ఘన విజయమే .సర్వ శ్రేష్టమైన రష్యన్ టాంక్ ఆవిర్భావం రామయ్య గారి బృందం వలన ఏర్పడి అద్భుత యుద్ధ విజయాలను చేకూర్చి పెట్టాయి..

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-5-15 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-14

’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-14

శాంతి సంరక్షణలో రామయ్య

జర్మన్ ల కోరిక ప్రపంచాధిపత్యం .హిట్లర్ గురి సోవియట్ రష్యా మీదనే .జర్మనీ తుపాకులన్నీ రా ష్యాపైనే గురి పెట్టి ఉన్నాయని అర్ధమైంది .అమెరికా వదిలి వచ్చేటప్పుడు స్నేహితుడు జో చెప్పిన ‘’if not tractors ,then tanks –for the sake of defending peace ‘’ మాట చెవుల్లో రింగు మంటూనే ఉంది .ఒక సారి అశోక చక్రవర్తి గుర్తుకు వచ్చాడు  కళింగ యుద్ధం గెలిచి ,ఆయుధ విసర్జన చేశాడు .లెనిన్ దేశాలమధ్య శాంతి ఉండాలన్నాడు .కాని ఇప్పుడు ఆస్ట్రియా ,జెకోస్లోవేకియా ,పోలాండ్ ,స్పెయిన్ లు యుద్ధ జ్వాలల పొగలతో నిండిపోయి ఉన్నాయి .మందు గుండు సామగ్రి పొగలే అవి .ఆ వాసన రష్యా సరిహద్దుల దాకా వచ్చేసింది .ఇలాంటి పరిస్తితులోస్తే అశోకుడు మళ్ళీ కత్తి పట్టేవాడు అనుకొన్నారు రామయ్య ఇలాంటి ఆలోచనలు మనసులో సుళ్ళు తిరిగి తిరిగి అకస్మాత్తుగా ఒక నిర్ణయానికి వచ్చేశారు .తన శక్తి యుక్తులు సామర్ధ్యం అన్నీ రష్యా దేశ రక్షణ ను బలోపేతం చేయటానికే ఉపయోగించాలని నిర్ణయించుకొన్నారు .ఆ రోజుల్లో ఒక రోజు ఒక గంట లాగా గడిచిపోయింది  రామయ్యగారికి ఆయన బృందానికి .

జర్మనీలో   ఫాసిజం పతనం -రిపబ్లిక్ అవతరణ

గేర్నికా తర్వాత కొప్పెన్ చార్జి  హాండ్ ఓవర్  చేయటానికి వచ్చాడు .ఆతను లేకుండా ఎలా పని చేయాలో అర్ధం కాలేదు .వెళ్ళ వద్దని చెప్పారు రామయ్య .అతను వినలేదు .రక్షణ లేని తన ప్రజలను ఆ ద్రోహులు విచక్షణా రహితం గా  చంపేస్తుంటే  ఇక్కడ ఉండలేనన్నాడు .అన్నిటికంటే ఆత్మ గౌరవం ముఖ్యం అన్నాడు .తానూ నిజాయితీగల మనిషిని అని రుజువు చేసుకోవాలన్నాడు .కోపెన్ తన రిపబ్లిక్ ను రక్షించుకోవటానికి క్షణం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయాడు .యుద్ధం లో అతనికేమైందో తెలియదు .యుద్ధం అయిపోయిన తర్వాత అతను క్షేమంగా ఉన్నాడని తెలిసి సంతోష పడ్డారు .గాయాలైనా బతికి బయట పడ్డాడు .రిపబ్లిక్ పతనం అయిన తర్వాత పైరెంసేస్ నుండి ఫ్రాన్స్ కు వెళ్ళాడు .పోలీసుల కోరలనుండి తప్పించుకో గలిగాడు .అదృష్ట వశాత్తు కోపెన్ ను నాజీలకు అప్పగించటం జరగ లేదు .దేశభక్తి యుద్ధం లో కోపెన్ సోవియట్ యూనియన్ తరఫున పోరాడాడు .ఫాసిజం పతనం అయిన తర్వాతనే జర్మనీలో కాలు పెట్టాడు .జర్మనీ డెమోక్రాటిక్ రిపబ్లిక్ లో ప్రముఖ  సైంటిస్ట్ లలో  రాజకీయ వేత్తలలో ప్రముఖుడైనాడు కోపెన్  .ఒక సారి ‘’కాంగ్రెస్ ఆఫ్ దిడిఫెన్స్ ఆఫ్ పీస్ ‘’లో కోపెన్ కనిపించాడు .రామయ్యగారికి ఆనందంగా షేక్ హాండ్ ఇచ్చి ‘’ఇదీ నా జర్మనీ ‘’అని పొంగిపోతూ చెప్పాడు గర్వంగా .అప్పుడు రామయ్యగారికి’’ సంతోషపు అదృష్టం ప్రజల సుఖం కోసం పోరాడి  నప్పుడే లభిస్తుంది’’అని తెలిసింది .

నిజమైన కామ్రేడ్

రామయ్యగారు తానూ రష్యన్ నిర్మాణపు పనివాడుగా ఉండేవాడినని పోల్చుకొన్నారు .తాను  జియాలజిస్ట్ అయి ఉంటె గొప్ప నిర్మాణాలు చేసి ఉండేవాడిని అనుకొన్నారు .అయినా తాను  కార్మికుల సమీపం లో ఉండే పని చేశారు .రామయ్య గారిలో ఉన్న పని నైపుణ్యాన్ని చూసి వాళ్ళు మహదానందం పొందేవారు .మిగిలిన వారిలాగా రామయ్య గారు ఉ౦డేవారు కాదు .’’నా శరీరం రంగు ను బట్టి కాదు .వారిని అర్ధం చేసుకోవటం లో నేను ముందుండే వాడిని ‘’ఆని చెప్పుకొన్నారు  మాటల కామ్రేడ్ కాదు చేతల కామ్రేడ్ రామయ్య .అధికారులు హోదా ఉన్నవారు పెట్టుకొనే స్పెషల్ కాప్ ను కాకుండా వర్కర్లు పెట్టుకొనే టోపీ ని పెట్టుకొనే వారు రామయ్య .ఇదే చాలా సదుపాయం గా ఉండేది .లాబ్ లోని వారు దీనికి ఆశ్చర్య పోయేవారు .కాని తన పధ్ధతి మార్చుకోలేదు .వర్కింగ్ క్లాస్ కు అతి సన్నిహితం గా ఉండటం లో రామయ్య ఆనందాన్ని అనుభ వి౦చేవారు .

తనజీవితం లోని సంఘటనలను వారితో పంచుకోమని కోరేవారు .కాని రామయ్య ఏమీ మాటాడే వారుకాదు .చాలా సార్లు బతిమాలిన తర్వాత చెప్పారు తన గురించి వారికి .తన తండ్రి తనను తీర్చి దిద్దారని ,పని ఎలా చేయాలో బోధించారని ,తాను  బొగ్గు రూమ్ లో ,బరువులు మోయటం లో పని చేశానని కనుక వర్కింగ్ క్లాస్ అంటే సహజంగా ఇష్టం అని చెప్పారు .ఈ టోపీ  నే రామయ్యగారు జీవితాంతం పెట్టుకొన్నారు .అదే హాపీ ఆయనకు .రష్యా రివల్యూషన్ ప్రజలను అణచి వేతనుండి స్వేచ్చను ప్రసాదించి ,విద్య ,ఐచ్చిక సేవ లను అంద జేసింది .అంత మాత్రాన రివల్యూషన్ వారికి ఒక్క నిమిషం లో అన్నీ సమకూర్చలేదుకదా .అయితే ఒక గొప్ప మార్పు ‘’మనపని మన దేశం ,మన అకాడెమిక్ పావ్లోవ్ ,మన సోవిఎట్  మొదలైనవి మహా ఇష్టంగా ప్రజలు మాట్లాడుకొంటున్నారు. ఒకరికొకరు దగ్గరైపోతున్నారు .ఇప్పుడు రష్యా ఒక స్వయం సిద్ధ రాజ్యం గా ఎదుగు తోంది. దానికి తన సర్వ శక్తులు ఒడ్డు తున్నాను అనే గొప్ప సంతోషం రామయ్యగారికి కలిగింది .

రెండవ ప్రపంచ యుద్ధ భీభత్సం

జపాన్ అంతా అణుబాంబు దాడిలో ధ్వంసమై పోయింది .రాజధాని టోక్యో సగం బూదడిదయింది .స్నేహితుడు హషిమాటో చెప్పిన నిజాలు ఇవి .అతని ఇల్లు కుటుంబం అడ్రస్ లేరు .అయితేయేం ఇపుడు అసలైన జపాన్ ఏర్పడింది అని సంతోషించాడతను .శిధిలాలనుంచి నూతన జపాన్ ఆవిర్భ వించింది .హాషి మాటో ఆత్మహత్య చేసుకొందామనుకొన్నాడు కాని మారిపోయి రాజుకు విదేయుడైపోయాడు .అతనిది ‘’సమురాయ్ గర్వం ‘’జపాన్ ఆర్దికాభి వృద్ధిలో కనులు మిరుమిట్లు గొలిపే స్థాయిని చేరుకొన్నది .ఫీనిక్స్ పక్షి బూడిద లోంచి మళ్ళీ పుడుతుందట .అలానే జపాన్ కూడా ప్రపంచం లో నేడు అగ్రాభాగాన అన్నిటా నిల్చింది .అదీ ఆప్రజల ,పాలకుల వజ్ర సంకల్పం .కాలం అనేక మార్పులు తెస్తుంది .అందులో మనం ఒదిగి పోవాలి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-5-15-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భయ నివృత్తి -స్వరూపానంద

జంతూనామ్‌ నరజన్మ దుర్భరమ్‌’’ అంటారు ఆదిశంకరులు. జన్మాంతర సుకృతం చేత దుర్లభమైన మానవ జన్మ మనకు లభించిందనేది దీని అర్థం. ఆహారం, నిద్ర, భయం, మైఽథునము ఇవి జంతువులకు, మానవులకు సామాన్యమైన లక్షణములు. అయితే మానవ జన్మవలన ప్రత్యేకంగా లభించేది యుక్తమైనది, ఆయుక్తమైనది అనే విచక్షణా జ్ఞానమే. దానినే సదసద్వివేక సంపద అని కూడా చెబుతారు. ఏది సత్‌ పదార్థము ఏది అసత్‌ పదార్థము అని నిర్ణయము చేసి సత్‌ పదార్థము వైపు దృష్టి మళ్ళించి సాధించగలిగే అవకాశము మానవుడికి మాత్రమే ఉంది.
భయం వల్ల..
తిండి, నిద్ర, భయం, సంసార సుఖం ఇవి సకల ప్రాణులకి సమానమైనవి. వీటి చేత కలిగే సుఖం, ఆనందం తాత్కాలికమైనవి. వీటిని వ్యక్తపరిచే శక్తితో పాటు భాష, వివేకం మానవుడికి మాత్రమే ఉన్నాయి. పైన పేర్కొన్న వాటిలో భయం మానవ సమాజంలో ఎక్కువగా ఉండటాన్ని మనం చూస్తుంటాం. సాధారణంగా భయం కలిగినప్పుడు దానిని తొలగించుకోవడానికి భగవంతుడి యందు భక్తి భావం పుడుతుంది. ఆ భయహేతువును తెలుసుకోవడానికి మరియు దాని నివృత్తికి నిరంతరము ప్రయత్నిస్తాము. లోకంలో మనతో పాటు జీవిస్తున్న మహాత్ములను దర్శించి వారరి చేత మన భయందోళనలు నివృత్తి చేసుకోవటానికి ప్రయత్నిస్తాం. ఒక వైపు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే- సర్వోత్కృష్టుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు అయిన భగవంతుడిని ఆరాధించి, భయభ్రాంతులు తొలగించుకోవాలనుకుంటాం. అయితే ఇది తాత్కాలికంగా భయాన్ని తొలగించుకోవటానికి చేసే ప్రయత్నం మాత్రమే. అయితే- శాశ్వత భయనివృత్తి, నిరతియానందం కోసం, అనాది నుండి మానవులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దీనినే- శంకరులు.
 తైత్తిరీయ భాష్యంలో ‘‘పురుష ఏవహి శక్తిత్వాత్‌ – అర్థిత్వాత్‌ ’’ అని పేర్కొంటారు. కర్మ ఉపాసనల ద్వారా సాపేక్షికమైన నిరతిశయ ఆనందం పొందే అవకాశము మానవుడికి మాత్రమే ఉందనేది ఈ వాక్య అర్థం. ఇలాంటి నిరతిశయ ఆనందాన్ని పొందటానికి మార్గమేమిటనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. దానికున్న ఏకైక మార్గం జ్ఞానుల మార్గదర్శకత్వమే. ‘‘నేను’’ ఎవరు? నా స్వరూపం ఏమిటి? ఎందుకు ఇలా ఉన్నాను? అనే ప్రశ్నలకు మనకు సరియైున జ్ఞాన గురువుల దగ్గరే సమాధానం లభిస్తుంది.
‘‘తద్విద్ధి ప్రణి పాతేన పరిప్రశ్నేన సేవయా’’ అంటారు గీతాచార్యులు. భౌతిక జ్ఞానానికి వ్యవహారిక ఆధ్యాత్మిక జ్ఞానానికి శాసీ్త్రయ జ్ఞానులు అవసరమనేది దీనర్థం. ఈ మార్గదర్శకత్వం కూడా వీలైనంత త్వరగా పొందాలి. వయస్సు, బుద్ధి, ఆరోగ్యం అన్ని ఉన్నప్పుడే జ్ఞానం పొందగలిగితే వయస్సు మీరిన తరువాత మానవ జీవన మార్గానికి దుఃఖము ఉండదు, భయము ఉండదు.
స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి
విశాఖ శారదా పీఠాధిపతి
99666696584
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆనందమా? భ్రమా?

ఆనందమా? భ్రమా?
ఇప్పటివరకూ మనం పతంజలిని గూర్చిన కథ తెలుసుకున్నాం. ఇపుడు పతంజలి యోగసూత్రాలలోనికి వెడదాం.

అథ యోగానుశాసనమ్‌

శాసనం అంటే మనపై వేరే ఎవరో విధించే నిబంధన. అనుశాసనం అంటే మనకు మనమే విధించుకునే నిబంధన. ఈ రెండింటికీ తేడా గమనించారా? మరి, యోగ అనుశాసనం అంటున్నారెందుకు? ఈ నిబంధన, క్రమశిక్షణ అవసరమా? నిబంధనలు ఎప్పుడు అవసరమవుతాయి?

మీకు దాహం వేసినపుడు నీళ్ళు తాగాలని కోరుకుంటారు. దాహం వేసినపుడు నీళ్ళు తాగటం క్రమశిక్షణ అని అనుకోరు. మీకు ఆకలివేసినపుడు ఆహారం తింటారు. ఆకలి వేసినపుడు ఆహారం తినటాన్ని ఒక నిబంధనగా భావిస్తారు. అలాగే ప్రకృతిని ఆస్వాదించటం, ఆనందించటం ఒక క్రమశిక్షణగా అనుకుంటారు. ఆనందంగా ఉండటానికి ఏ నిబంధనలూ అవసరం లేదు. చిన్న పాప తన తల్లిని చూడగానే పరుగెత్తుకుంటూ వెళ్ళి ఒడిలో వాలిపోతుంది తప్ప, ‘నేను అమ్మను చూడగానే పరుగెత్తుకు వెళ్ళాలి. అది క్రమశిక్షణ’ అని అనుకోదు. అవునా?

మరి ఈ క్రమశిక్షణ ఎక్కడినుండి వచ్చింది?
ఏదైతే మొదలుపెట్టటానికి అంత ఆకర్షణీయంగా, ఉత్సాహభరితంగా ఉండదో అటువంటి పనిని మొదలుపెట్టడానికి క్రమశిక్షణ అవసరం అవుతుంది. ఆ పనిచేస్తే వచ్చే ఫలితం చాలా బాగుంటుందని, ఆనందాన్నిస్తుందని మీకు తెలుసు. అయినా మొదట్లో మాత్రం అంత ఆనందంగా ఉండదు. మీరు నిబద్ధతో ఉన్నప్పుడు, ఆనందంగా, ప్రశాంతంగా- నిజమైన ఆనందాన్ని కలిగి ఉన్నప్పుడు- అపుడు మీరు మీతోనే ఉన్నారు. ఆ స్థితిలో క్రమశిక్షణ అంటూ ఏమీ ఉండదు. అనా కానపుడు మాత రం కుక్కపిల్ల తోకను ఊపినట్లుగా మీ బుద్ధి అటూ ఇటూ పరుగెడుతూ ఉంటుంది, అపుడు దానిని శాంతపరచటానికి, స్వస్థానంలోకి తీసుకురావటానికి క్రమశిక్షణ అవసరం అవుతుంది. అంతిమంగా ఈ క్రమశిక్షణకు ఫలితం పరమానందంగా ఉంటుంది. మధుమేహవ్యాధి ఉన్న వ్యక్తి తీపి వస్తువులను తినకూడదని తనకు తానే నిర్ణయించుకుని పాటిస్తాడు. అలాగే క్రొవ్వు అధికంగా ఉన్నవారు, తమకు ఇష్టమైనా సరే, మానేయటం కష్టంగా అనిపించినా సరే, క్రొవ్వు పదార్థాలను తీసుకోరు. ఎందుకంటే క్రొవ్వు పదార్థాలు రుచిగా ఉన్నా, దీర్ఘకాలంలో చేటుతెస్తాయి కాబట్టి. ఈ క్రమశిక్షణకు ఫలితం ఆరోగ్యమే కదా.

ఆనందం మూడు రకాలు- సాత్వికం, తామసికం, రాజసికం

సాత్విక ఆనందం, అంత సౌకర్యంగా లేకున్నా, అంతిమంగా ఆనందానికి దారితీస్తుంది. ఒక క్రమశిక్షణ కలిగి ఉండటం వల్ల పొందే ఆనందం సాత్వికానందం- ఇది దీర్ఘకాలం నిలిచి ఉండేది. ఏ ఆనందమైతే మొదట్లో సంతోషాన్నిచ్చి, చివరకు దుఃఖాన్ని మిగులుస్తుందో అది ఆనందం కానేకాదు. కాబట్టి అసలైన సాత్విక ఆనందం పొందటానికి క్రమశిక్షణ అనేది అవసరం. క్రమశిక్షణ అంటే మిమ్మల్ని మీరు అనవసరంగా హింసించుకోవటం కాదు సుమా. క్రమశిక్షణ యొక్క ఉద్దేశ్యం ఆనందాన్ని పొందటమే. కొన్నిసార్లు ప్రజలు తమపై తాము విధించుకునే నిబంధనలు వారికి ఆనందాన్ని ఇవ్వవు, చుట్టూ ఉన్నవారికీ ఆనందాన్ని కలిగించవు. ఇది తామసిక ఆనందం. తామసిక ఆనందం అనేది ఆనందంలా కనిపిస్తుంది గాని, నిజానికి మొదటి నుండీ చివరి వరకూ అంతా దుఃఖమే. తామసిక ఆనందానికి ఏ క్రమశిక్షణా అవసరం లేదు. క్రమశిక్షణ ఉండకపోవటమే తామసిక ఆనందం. రాజసిక ఆనందం చూడటానికి ఆనందంతోనే మొదలైనప్పటికీ, చివరకు దుఃఖాన్ని మిగులుస్తుంది. క్రమశిక్షణ తప్పు దారిలో పడటం దీనికి కారణం. క్రమశిక్షణ లేకపోవటం కూడా రాజసిక ఆనందానికి దారితీయవచ్చు. సాత్విక ఆనందం పొందటానికి క్రమశిక్షణ అవసరం. ఏదైనా సౌకర్యంగా లేదో దానిని భరించటమే క్రమశిక్షణ. అసౌకర్యం అన్ని వేళలా ఉండకపోవచ్చు. అయితే ఒకవేళ అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉన్నా సరే దానిని భరించి ముందుకు సాగటానికి క్రమశిక్షణ నీకు అవసరం.
అందుకే పతంజలి ‘అథ’ (ఇప్పుడు) అంటూ మొదలుపెట్టాడు. ఈ క్షణంలో , విషయం తేటతెల్లంగా లేని పరిస్థితిలో , నీ బుద్ధి సరియైున స్థానంలో ఇంకా కుదురుకోని స్థితిలో మొదలుపెట్టాడు.

యోగానుశాసనమ్‌
యోగ అనేది ఎవరో మనపై రుద్దినది కాదు. మనకు మనమే విధించుకున్న క్రమశిక్షణ ఇది. మీకు మీరే విధించుకుని పాటిస్తున్నవి ఏవి? రోజూ పొద్దునే లేవగానే పళ్ళు తోముకుంటారు, రాత్రి పడుకునే ముందు మరోసారి తోముకుంటారు. ఇది మీ క్రమశిక్షణ. అయితే ఇవి చిన్నప్పుడే నీకు అలవాటు చేయబడ్డాయి. నీవు చిన్నవాడిగా ఉన్నప్పుడు మీ అమ్మ నీకు క్రమశిక్షణ నేర్పింది. ఒకసారి అలవాటైనాక, దాని వలన కలిగే మంచి ఏమిటో నీకు తెలిసింది. ఒకసారి విషయం అర్థమైనాక ఇక అది మీ అమ్మ విధించిన నిబంధన కాదు, నీకు నీవే పాటిస్తున్నదిగా మారిపోయింది. నీ శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం, వ్యాయామం చేయటం, ధ్యానం చేయటం, ఇతరుల పట్ల దయ కలిగి ప్రవర్తించడం- ఇవన్నీ నీ క్రమశిక్షణకు తోడ్పడటం కోసం నీకు నీవే విధించుకున్నవి. అవును కదా?

సరే, ఈ క్రమశిక్షణ ఏం చేస్తుంది?
క్రమశిక్షణ, నిన్ను నీ ఆత్మలో కలుపుతుంది. నీలో నీకు తెలియని ఖాళీలను పూరించి నీ అస్తిత్వాన్ని సంపూర్ణం చేస్తుంది.

తదాదృష్టః స్వరూపే అవస్థానమ్‌. నిన్ను నీ ఆత్మలో ఉంచుతుంది.
అలా కానప్పుడు, నీవు నీ ఆత్మలో లేనపుడు ఏం జరుగుతోంది?

వచ్చేవారం చూద్దాం..
శ్రీశ్రీశ్రీ రవి శంకర్
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆత్మా జ్ఞానం కోరటం నేరమా?డా అరవిందరావు

కొందరు చదువుకున్న వాళ్ళు కూడా ఒక ప్రశ్న వేస్తూంటారు – మన సంప్రదాయంలో ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అంటూ కళ్ళు, ముక్కు మూసుకుని కూర్చొని మోక్షం కోరుకోవడం, ప్రపంచాన్ని పటిం్టంచుకోకపోవడం, సమాజ సేవపై దృష్టి లేకపోవడం స్వార్థం కాదా? అని అడుగుతూంటారు. ఈ ప్రశ్నకు రెండు విధాలుగా సమాధానం చెప్పవచ్చు. మనల్ని ప్రశ్నించే వాళ్లు ఎలాంటి సమాజసేవ చేస్తున్నారు అని ఎదురు ప్రశ్న వేయడం. రెండవది ఆత్మజ్ఞానం అంటే ఏమిటో వివరించి చెప్పడం. మొదటి సమాధానం ప్రశ్నించినవాడికీ వర్తించేదే. నిజానికి ఆత్మజ్ఞానం గురించి ప్రయత్నించేవారు అతి తక్కువగా ఉన్నా ఇది సిద్ధాంతానికి సంబంధించిన ప్రశ్న కావున అసలైన సమాధానం తెలుసుకోవాలి.
తత్త్వశాస్త్రంలో ‘నేను ఎవరు’? ‘నేను’ అనే పదానికి అర్థమేమిటి? అనేది మొదటి ప్రశ్న. ఇంగ్లీషులో ‘నేను’ అనే దానికి ‘ట్ఛజూజ’ అంటాం. సంస్కృతంలో దీన్నే ‘ఆత్మ’ అంటాం. ఆత్మజ్ఞానం అంటే నేను అనే స్ఫురణ మనకు ఏ వస్తువుపై ఉంది అనే దాన్ని గూర్చి విశ్లేషణ.
నేను అనగానే మొట్టమొదటగా మనదేహం గుర్తుకువస్తుంది. దేహం అంటే స్థూల శరీరం, మనస్సు, ఇంద్రియాల సమూహం. మనిిషికే కాక ప్రతి జంతువుకూ నేను అనే భావన దేహంపై ఉంటుంది. దీనికి తోడు మనిషికి ఫలానా పేరు, సీ్త్ర లేదా పురుషుడు, ఫలానా కులానికీ, మతానికీ, దేశానికీ చెందినవాడిని, ఫలానా వృత్తిలో ఉన్న వాణ్ణి అంటూ అనేక విధాలుగా నేను యొక్క అర్థం ఉంటుంది. దీనికి తోడు మన డిగ్రీలు, సమాజంలో మన స్థాయి, మనం సాధించిన విజయాలు లాంటివన్నీ కలిపి ఒక identity ఉంటుంది. నేను అనగానే శరీరంతో పాటు వీటన్నింటిపైనా కూడా నేను అనే భావన ఉంటుంది. తత్త్వశాస్త్రం ఈ భావనను ప్రశ్నిస్తుంది. పై వర్ణనలో దేహం మొదటిది, సమాజం మనకిచ్చిన వ్యక్తిత్వం రెండోది. మనిషి యాదృచ్ఛికంగా ఒకానొకచోట పుట్టినా అతని చుట్టూ ఉన్న సమాజం అతనికి ఒక కులము, మతము, జాతి మొదలైన విశేషణాల్ని అంటగడుతుంది. ఎంతో స్వేచ్ఛగా పుట్టిన మనిషిపై సమాజం రుద్దిన భావాలు ఇవి. ఇవన్నీ ఒక విధమైన బంధాలు. అందుకే ఫ్రెంచి తత్త్వవేత్త రూసో అనే అతను “Man is born free but everywhere he is bound in chains ‘ అన్నాడు, వీటన్నింటినీ కాదని అసలైన నేను ఏమిటి అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం.
పై ప్రశ్నకు రెండు స్థాయిల్లో సమాధానం లభిస్తుంది. సులభంగా అర్థం కావడానికి డిగ్రీస్థాయి, హైస్కూలు స్థాయి అని చెప్పుకోవచ్చు. డిగ్రీస్థాయిలో ఉన్నవాడికి పరమాత్మ అని పిలువబడే చైతన్యమే ఈ ప్రపంచంలాగ కనిపిస్తుంది అని చెబుతుంది. అందులో భాగంగా నీవు అనుకునేది కూడా ఆ పరమాత్మయే అని చెబుతుంది. ప్రపంచంలో ప్రతి జీవీ ఆ పరమాత్మ స్వరూపమే అని చెబుతుంది. దీనిపై ఎంతో విస్తృతమైన విశ్లేషణ, వివరణ ఉంది.
పై స్థాయి విచారణను అందుకోలేనివాడికి తనను, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నీ గమనించమని చెబుతుంది. ఇది హైస్కూలు స్థాయి. మనం ప్రతి నిమిషం ప్రకృతిపై ఆధారపడి ఉన్నాం, ప్రకృతి లేనిదే మనిషి లేడు. ప్రకృతిలో ఉన్నదే శరీరంలో ఉంది. నిరంతరం గాలి పీలుస్తూనే ఉన్నాం, ప్రకృతి లేనిదే మనిషి లేడు. ప్రకృతిలో ఉన్నదే శరీరంలో ఉంది. నిరంతరం గాలి పీలుస్తూనే ఉన్నాం, నీళ్ళు, ఆహారం అనేవి ప్రకృతి నుండి తీసుకుంటున్నాం. మనిషి శరీరంలోని ప్రతి అణువూ ప్రకృతినుండి తయారైనదే. మరో విధంగా చెప్పాలంటే వ్యక్తి అనేవాడు ప్రకృతిలో చిన్న అణువు. సముద్రంలో తరంగాన్ని విడిగా చూస్తే అది తరంగమే. మరో విఽధంగా చూస్తే తరంగము అని మనం భావించేది నిజంగా సముద్రమే. ఈ భావన మన మనస్సులో గట్టిగా నాటడానికై ఉపనిషత్తులు అనేక ఉపాసనాల్ని చెప్పాయి. ఉదాహరణకు భూః, భువః, సువః, మహః అనేపదాలు మనకు తెలిసినవే. భూః అంటే భూమి, భువః అంటే చుట్టూ ఉన్న గాలివలయం, సువః అంటే సూర్యుడు, నక్షత్రాలతో కూడిన విశ్వం. వీటన్నింటికీ మూలమైన ఒకానొక cosmic mind ను మహః అన్నారు. మొదటి దశలో నేను అనేది ఈ పరిమితమైన దేహమొక్కటే కాదు ఈ ప్రపంచమంతా అని భావించడం. శరీరంలో ఉన్న చిన్న అణువు నేను శరీరం అని భావించినట్టు. లేదా ఒక తరంగం నేను సముద్రం అని భావించినట్లు. ఇదే భూః అనే ఉపాసన. తర్వాత భూమి చుట్టూ ఉన్న వాయుమండలమంతా కూడా నా శరీరమే అని భావించడం భువః అనే దానిపై ఉపాసన. ఈ విధంగా నేను అని భావిస్తున్నది విశ్వాన్నంతటినీ నిండి ఉన్న cosmic mind కన్నా వేరు కాదు అని భావించడం. ఇది మహః అనే దానిపై ఉపాసన. నేను అనే భావాన్ని దేహానికి పరిమితం చేయకుండా విశ్వానికంతా వ్యాపింపచేయడం ఈ ఉపాసనల ఉద్దేశం. ఈ భూః భువః సువః అనే పదాలు గాయత్రీ మంత్రంలో అందరూ చెప్పుకునేవే.
వేదాంతంలో దీన్నే సర్వాత్మభావం అంటారు. విశ్వమంతటా ఒకే చైతన్యం, ఒకే ఆత్మ వ్యాపించి ఉన్నది అనే భావన. అన్నింటినీ ఒకటిగా చూడడం, అన్నింటిలో బ్రహ్మచైతన్యాన్ని చూడటం అనే భావన మన గ్రంథాల్లో అనేక చోట్ల కనిపిస్తుంది. గీతలో దీన్నే సాత్త్విక జ్ఞానం అన్నారు (18-20). అన్నింటినీ వేరువేరుగా చూడడం రాజసజ్ఞానం(18-21). సాత్త్వికజ్ఞానం ఉన్నవాడు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొందగలడు. దీని వల్ల మనకూ, సమాజానికీ ఒరిగేదేమిటి అని ప్రశ్నించవచ్చు. సర్వాత్మభావం ఉన్నవాడు ఆత్మౌపమ్యం అనే గుణంతో అందరినీ ప్రేమిస్తాడు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో కృష్ణుడు వర్ణిస్తాడు (6-32). ఆత్మౌపమ్యం అంటే ప్రపంచంలో ప్రతి జీవినీ తన ఆత్మగా చూసుకోవడం. దీనిలో వ్యక్తికి ఇన్నాళ్ళూ నేను అనే అంశంపై ఉన్న భావనలన్నీ పటాపంచలౌతాయి. నేను ఫలానా కులానికీ, జాతికీ చెందిన వాణ్ణి మొదలైన భావాలు వీగిపోతాయి. నేను, నాది అనే భావనలు కూడా బలహీనపడతాయి. ప్రపంచం పట్ల అతని దృష్టి మారుతుంది. అతడు చేసే ప్రతి పనీ ప్రపంచంలో ఏ జీవికీ హాని చేయని విధంగా, అందరినీ ప్రేమించే విధంగా ఉంటుంది. ఇలాగ ప్రపంచం మేలుకు పని చేయడాన్నే కర్మయోగం అంటారని మునుపటి వ్యాసాల్లో గమనించాం. పై విధంగా విచారణ చేసేవాడికి ఇలాంటి కర్మయోగబుద్ధి సులభంగా ప్రాప్తిస్తుంది. వ్యక్తిస్థాయిలోనే కాక సమాజస్తాయిలో కూడా దీని ప్రభావం ఉంటుంది. అందరూ ఒకటే అనే భావన మన నరనరాల్లో ఉండటం వల్లనే భారతీయులు అన్ని మతాల్నీ సమానంగా ఆదరించారు, భగవంతుణ్ణి ఏ రీతిలోనైనా పూజించవచ్చని చెప్పారు.
నీవు నీ పొరుగువాడిని ప్రేమించు అని ఒక ఆజ్ఞ ఉందనుకుందాం. ఎందుకు ప్రేమించాలి అని ఎదురు ప్రశ్న వస్తుంది. ఎదుటివాడు మనపై దౌర్జన్యం చేయకుండా ఉండాలనో, లేదా నేను వాడిని నా మార్గంలోకి మార్చుకోవాలనో, లేదా ఇద్దరి మధ్యా శాంతి ఉండాలనో కారణం చెప్పాల్సి వస్తుంది. ఇలాంటి ఆజ్ఞ గీతలో చెప్పిన రాజసజ్ఞానం పరిధిలోకి వస్తుంది. అన్నింటినీ వేరువేరుగా చూడడం, తనను తాను ఎత్తైన స్థానంలో ఉంచుకొని ఎదుటివాడికి తానేదో మేలు చేస్తున్నానని అతణ్ణి తక్కువ స్థానంలో చూడటం జరుగుతుంది. అలా కాకుండా సాత్త్వికజ్ఞానం ఉన్నవాడు అవ్యాజమైన- అంటే ఎలాంటి స్వార్థపరమైన ఉద్దేశమూ లేకుండా- ప్రేమ చూపగలడు. ఎదుటివాడు నా కన్నా వేరుకాడు అనేది సర్వాత్మభావంతో చూపే ప్రేమ, నేను నిన్ను ఉద్ధరిస్తున్నాను అనే భావనతో చూపేది భేదభావంతో చూపే ప్రేమ. ఈ రెండింటి మధ్య ఎంతో తేడా ఉంది. ఆత్మజ్ఞానం అంటే తన identity ని పెంచుకోవడం కాదు, identityని తొలగించుకోవడం అన్నది వేదాంతంలో చెప్పే ముఖ్యమైన సాధన.
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను navya@andhrajyothy.comకు పంపండి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-13

కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-13

రామయ్యగారి రూపు రేఖలు

పొడుగ్గా  వెడల్పైన భుజాలతో  బలిష్టంగా(రోబస్ట్) అంత అందమైన ముఖం కాకపోయినా ఆకర్షణీయం గా రామయ్య గారు ఉండేవారు .చూడటానికి మొరటు మనిషిలా కనిపించినా ఆయన పొడవైన బాహువులు చూస్తె అతి మృదులంగా ,కోమలంగా  ఉండట౦  అందరికీ ఆశ్చర్యం కలిగించేవి .గోళ్ళు ఆల్మండ్ షేప్ లో ఉండేవి .కళ్ళు చిలిపితనం కు ఆలవాలంగా ఉండేవి .ఈ కలలకే అమ్మాయిలూ ఫ్లాటై పోయేవారు .చాలా హుషారుగా కనిపించేవారు .నవ్వుతూ పలకరించటం ఆయన ప్రత్యేకత .ఆయన  కళ్ళల్లో ఆయన మేధస్సు ప్రతి ఫలిస్తూ కనిపించేవి .అందమైన కళ్ళు గా అందరూ భావించేవారు .విశ్రాంతి అంటే ఏమిటో రామయ్యగారికి తెలియనే తెలియదు .చాలా ప్రశాంతం గా సంతృప్తి గా కనిపించటం ఆయన ప్రత్యేకత .ఎప్పుడూ ఎక్కడా తొందరపడిన సంఘటనలు ఆయన జీవితం లో లేనే లేవు .కోపం ,విసుగు ,చిరాకులకు ఆయన ఆమడ దూరం .

గజేంద్ర  (గణేష్ )రామయ్య

భారతీయ మిత్రులు రామయ్యగారిని తమ తండ్రిగా భావించేవారు అలానే పిలిచేవారు కూడా .అంటే కాదు ఇంకో పేరూ  ఆయనకు ఉంది .అదే ‘’గజేంద్రుడు ‘’‘’.ఏనుగు బలానికి సంకేతం ,ఎంతటి కష్టమైన పనినైనా సునాయాసంగా చేసే నేర్పూ ఓర్పూ ఉన్న జంతువూ  .అంతే కాదు రాజసం(మెజెస్టి )ఉట్టి పడే జీవి .స్నేహితులు ఆయన్ను గజేంద్ర  అనేవారు అంటే ఆయనలో పైన చెప్పిన లక్షణాలన్నీ పూర్తిగా ఉన్నాయనే .ఏనుగు గమనం లో ఠీవి ఉన్న్నట్లే రామయ్య గారి నడకలోనూ ఉంది .చీమకు కూడా ఏనుగు హాని చేయదని మన పురాణాలలో ఉంది .అలాగే రామయ్య గారి వలన ఎవరికీ హాని జరగలేదు .ఏనుగు ఆకారం మహా సౌష్టవం గా ఉండి , సంపూర్ణత కు నిలయం అనిపిస్తుంది దాని ఆలోచనలూ ఉత్తమోత్తమంగా ఉంటాయి .రామయ్య గారివీ అదే స్థాయిలో ఉండటం విశేషం .రామయ్య గారి హైతీ మిత్రుడు ‘’రామయ్య గారి కళ్ళు మాత్రమె కాదు చేతులు కూడా గానం చేస్తాయి ‘’అన్నాడు .ఫ్రెంచ్ భాష రాకపోయినా రామయ్య మాట్లాడుతూ ఉంటె బాడీ లాంగ్వేజ్ వలన అయన ఏమి చెబుతున్నారో తనకు అర్ధమయ్యేది అన్నాడు అలెక్సీ అనే ఆయన .గజ ముఖుడు అయిన  వినాయకుడు మనకు పరమ ఆరాధనీయ దైవం. మొదటి పూజ ఆయన కేగా . .రామయ్య గారి అందమైన కళ్ళు దిగ్భ్రాంతిని కలిగించేవి .ఆయన చూపులలో అపారమైన కరుణా ,ప్రేమా పొంగి పొరలేవి .ఏంతో  ఆప్యాయంగా ,ఆత్మీయం గా ఆయన మిత్రులను ఆలింగనం చేసుకొనేవారు .అందులో శుద్ధత ,స్వచ్చత ,పవిత్రత ఉండేవి .చిలిపి కళ్ళే అయినా అందులో విజ్ఞాన  ప్రకాశం జ్యోతక మయ్యేది .అవి ఆయన మానసిక ,బౌద్ధిక ఉన్నతికి ఆకరాలు అనిపించేవి .కనుక రామయ్య గారిని’’ An elephant of intellect ‘’అని అత్యంత గౌరవం గా సంబోధించేవారు .వంకర తిరిగిన పెదవులలో చిరునవ్వు ,ఏటవాలు కళ్ళు ఆయన ప్రవర్తనకు, స్వభావానికి  అద్దం పట్టేవి .ప్రశాంతమైన ,అడ్డులేని సాగర తరంగ స్వారి లాగా చాలా మృదువుగా ,అరికట్టలేని స్వభావం గల వారిగా రామయ్యగారు అందరికీ ఆకర్షణీయం గా ,ఆరాధనీయం గా దర్శనమిచ్చేవారు .అదీ రామయ్య గారి స్పెషాలిటి .’’ఎ పెర్సనాలిటీ విత్ మెజెస్టి ‘’ అని పించేవారు రామయ్య గారు .

వ్యవస్థ మూలాలలో తేడా –సోషలిజం లో నిజం

రష్యా  సైంటిస్ట్ అగ్ర నేత తో  సమావేశం అయిన తర్వాత రామయ్యగారు  అమెరికాలో తాను పనిచేసిన పెట్రోకెమికల్స్ అధినేత హేంక్ తో ఈయనను పోల్చుకొన్నారు .నక్కకూ నాగ లోకానికి ఉన్నంత తేడా గమనించారు .హేంక్ భయపడినట్లు రష్యన్లు అమెరికా ఆకాశ హర్మ్యాలను కూల్చటానికేమీ ప్రయత్నించటం లేదని మేధస్సును భూమి దున్ని పంటలు పండించటానికే వినియోగిస్తున్నారని తెలిసి మనసులో ‘’పూర్ హేంక్ ‘’అనుకొన్నారు .ప్రముఖ రష్యా సైంటిస్ట్ చెప్పిన మాటలు ఏంతో విలువైనవిగా అనిపించాయి .ఆ మాటలసారాంశం –‘రష్యా ’విప్లవం ‘’అంటే ఒక మార్పు మాత్రమేకాదు ,అధికార బదిలీ కూడా కాదు .ముఖ్య గమ్యం .నూతన మానవావిర్భావం .విప్లవం ప్రజలవల్లనే ,ప్రజలకోసమే .ప్రతి వ్యక్తికీ చేతినిండా పని ఇవ్వగలగటం. దీనికోసం పంచ వర్ష ప్రణాలికా రచన జరిగి అమలు పరుస్తున్నారు .అవి విజయ వంతమైనాయి  .నిన్నటిదాకా బానిస బతుకులు బతికిన వాళ్ళు ఇవాళ వారి జీవితాలకు యజమానులయ్యారు .అందుకే వారంతా సోవియట్ శక్తికి బలాన్ని చేకూరుస్తున్నారు .ప్రాణ త్యాగానికైనా సిద్ధం గా ఉన్నారు .అంతమాత్రం చాలదు .సోషలిజం ప్రతి వ్యక్తీ నరనరానా వ్యాపించాలి .కొత్త జీవితాలు ఏర్పడాలి ‘’your life style defines your consciousness ‘’అన్నది సిద్ధాంతం అవ్వాలి .ప్రతి వ్యక్తికీ తన బలం మీద, తెలివి తేటలమీద నమ్మకం కలిగించాలి .వ్యక్తీ తాను అద్బుతాలు  సృస్టిం చ గలను అనే నమ్మకాన్ని కలిగిఉండాలి .సోషలిజం ఒక కల కాదు .అదొక వ్యక్తిగత కర్తవ్యమ్ .అందుకే సోషలిజం అనేది వాస్తవం .

అభివృద్ధిలో బాగా దూసుకు పోయిన దేశాలతో రష్యా పోటీ పడాలి .పాత అలవాట్లు ,పాత జీవితాలకు స్వస్తి పలకాలి. కొత్త లోకం ఆవిర్భవించాలి .నూతన మానవుడు అందులో సుఖ సంతోషాలతో జీవించాలి .లేకపోతె వాళ్ళు ‘’పారిస్ కమ్మ్యూన్ ‘’లో  మనుష్యులను మట్టు పెట్టినట్టే రష్యా ప్రజలనూ చేస్తారు ఇక్కడ  రష్యా ప్రజల ఉనికికే ప్రమాదమేర్పడుతుంది .అందుకే ఎక్కడ మేదోజీవులున్నా వారందరినీ రష్యాకు ఆహ్వానించి వారి సేవలు అందజేసి సోవియట్ దేశ పురోభి వృద్ధికి కృషి చేయమని ఆహ్వానించారు .ఈ మాటలు విన్న రామయ్యగారి మనసులో సన్నని అలజడి రేగింది .విప్లవం అంటే ఉన్న అంతర్జాతీయ భావన అర్ధమయింది .ప్రతి విషయం క్రిస్టల్ క్లియర్ గా ఉందనిపించింది .తానూ మళ్ళీ రాజమార్గం మీదే నడుస్తున్నననే నమ్మకం బలపడింది .

‘’రష్యా దేశం చాలా క్లిష్ట పరిస్తితులలో ఉంటె’’ ఇష్టపడి అభి వృద్ధికి రామయ్య చేసిన కృషి

రామయ్యగారు మాంచి ఉత్సాహంగా పని చేశారు .తన టీం చేత అదే ఉత్సాహం తో పని చేయించారు .ప్రతి మనిషి ఇద్దరు మనుషుల పని చేసేవాడు .అయినా అలసట అనిపించేదికాదు .రోజు మొత్తం మీద నాలుగైదు గంటలు మాత్రమె నిద్రపోయేవారు .చీకటి తోనే లేచి మళ్ళీ పనుల్లో చేరేవారు .దీనికి కారణం సరైన సమయం లో సరైన ప్రదేశానికి వచ్చి పని చేస్తున్నామన్న ఆనందం .దేశానికి ఏం కావాలో తెలిసింది తాము ఏమి అంద జేయాలో అర్ధమైంది .అందుకే ఈ పనిలో అంత ఉత్సాహం .మనసు ,మెదడు కాళ్ళు , చేతులు అన్నీ ఒకే’’ రిదం ‘’తో పని చేస్తున్నాయి. కనుక పని స్పీడ్ అందుకొన్నది .ఆశించిన సమయం కంటే పనులు ముందే పూర్తయి పోతున్నాయి .’’’త్వరగా ఇంకా త్వరగా ‘’అనేదే అందరి నినాదం అయింది .అదే ప్రణవ మంత్రం గా ధ్వనించింది .ఆలస్యం అనే మాట నే మర్చిపోయారు అందరు .

రామయ్య గారి బృందం అంతా టీనేజి బృందం .ఉరకలు వేసే ఉత్సాహ వంతులే అందరూ .మయకోవ్ స్కి చెప్పినట్లు ‘’దేశమంతా యవ్వన దశలో ఉందని’’పించింది .లేబ్ లో పని చేసే యువకులు ఫ్రెష్ గా కాలేజి విద్య పూర్తీ చేసుకొని వచ్చి చేరిన వాళ్ళే .అన్నీ బాగానే ఉన్నాయి కాని రష్యా జీవితం చాలా కష్ట భరితం గా ఉంది. అనుభవజ్ఞులు,,స్పెషలిస్ట్ లు  లేరు రామయ్య దగ్గర  .ఆ లోపం ఉంది .ఆహార సమస్య ఒకటి బాధిస్తోంది .ఇంటి సమస్య దీనికి తోడైంది .అమెరికాలో అనుభవించిన సౌఖ్యాలు ఇక్కడ ప్రస్తుతం గగన కుసుమాలే .కాని రష్యన్ ప్రభుత్వం చేయగలిగినంత గరిస్ట సదుపాయాలూ కల్పించింది .రామయ్య గారికి ఒక ఫ్లాట్ ఇచ్చారు .దానికి కావలసిన ఫర్నిచర్ అంతటినీ సమకూర్చారు .కష్టాలలో ,ఆర్ధిక ఇబ్బందుల్లో  ఆర్ధిక నియంత్రణ లో ఉన్న  ఉన్న దేశం ఈ సౌకర్యాలు కలగ జేయటం ఒక రకం గా తలకు మించిన భారమే .అయినా కనీస గౌరవ మర్యాదలను ఇచ్చి తృప్తిని  చేకూర్చిందని  రామయ్య సంతృప్తి చెందారు .

దేశం రామయ్య బృందం ముందు చెయ్యాల్సిన అతి ముఖ్యమైన పనుల పెద్ద లిస్టు పెట్టింది  .వీటిలో సమస్యలు ఉంటె పరిష్కరించాలి .సాంకేతిక నైపుణ్యం ప్రస్తుతం పూజ్యం .పరిశోధనకు అవసరమైన సామగ్రి ఇతర దేశాల నుండి తెప్పించుకోవాలి .కాని తమకు కావలసిన వాటిని తామే స్వయం గా తయారు చేసుకోవాలి .దీనినే రష్యన్లు ‘’మదర్ విట్ ‘’అంటారు .తక్కువ ఖర్చుతోఅక్కడే లభించే వాటితో  మంచి ఫలితాలకోసం ఒక ప్రయోగ శాల ఏర్పాటు చేసుకోవాలి .అప్పుడు రామయ్య గారికి ‘’బంధాలనుండి విముక్తుడైన స్వేచ్చా జీవి అద్భుతాలు సృస్టించ గలడు ‘’అన్న సూక్తి జ్ఞాపకానికి వచ్చింది  .

ఆ రోజులను గుర్తుకు చేసుకొంటూ రామయ్య ‘’అవి బహు అందమైన రోజులు .అందమైనవి ఎందుకయ్యాయి అంటే నూతనత్వం వలన ,బృహత్తర ఉద్యమం లో భాగస్వాములవటం వలన .అప్పుడు మేమూ యవ్వనం లో స్వచ్చంగా బల శక్తి సంపన్నంగా  ఆశ తో ఉన్నాం ‘కనుక .’’అన్నారు .రష్యా వచ్చినా సారా రామయ్య గారి మనసులో నుండి తొలగి పోలేదు .ఆమె తనకు ఆత్మీయురాలు ,స్నేహితురాలు .అన్నీ అర్ధం చేసుకున్నా ,ఏదీ అర్ధం కానట్లు ప్రవర్తించే పిల్ల అనుకొన్నారు .పొన్నాంబలం ద్వారా తన విషయాలు ఆమెకూ, ఆమె విషయాలు తనకూ తెలుస్తున్నాయి .ఆమెకు రామయ్య గారి అడ్రస్ ఇచ్చాడు పొన్నాంబలం .కాని ఆమె నుండి రామయ్యగారికి ఒక్క ఉత్తరం కూడా రాలేదు .ఆమె రష్యావచ్చి తనను అమెరికా  కు  తీసుకెళ్ళే ఆలోచనలో ఉందేమో ననుకొన్నారు . ఏమైనా ఇద్దరి దారులూ వేరైపోయాయి .ఇక కలిసే పరిస్తితి లేనే లేదని పించింది .

రష్యాలో అందుకొన్న మొదటి ప్రోత్సాహక బహుమతి

కోపెన్ అనే సహచరుడు అప్పుడప్పుడు  జర్మనీ వెళ్లి  వస్తూండేవాడు .జర్మనీ లో ఫాసిస్ట్ జుంటా ఆగడాలు విడమర్చి చెప్పేవాడు .రీచ్ స్టాగ్ ను తగల బెట్టిన వార్త చెప్పాడు .అప్పుడప్పుడు కోపెన్ అవార్డు ఫంక్షన్ లకు వచ్చి   కలుస్తూ వివరాలు చెప్పేవాడు .ఇద్దరూకలిసి లూబ్రికంట్స్ లో ‘’గరిష్ట టెన్షన్ఆఫ్ డిస్ప్లేస్ మెంట్’’  ను విజయవంతం గా కొలిచినందుకు (గణించి నందుకు )అవార్డ్ పొందారు .కోపెన్ కు బోనస్ ఇచ్చారు రామయ్య గారికి స్వదేశం లో తయారు చేసిన రేడియో ను బహూక రించారు .ఈ సందర్భం లో రామయ్యగారింట్లో మిత్ర బృందం చేరి, చిన్న పార్టీ చేసుకొన్నారు తమదేశం రేడియో లాంటి అవసర సాధనాలను స్వదేశం లోనే తయారు చేసుకొంతటున్నందుకు సంబర పడ్డారు .ఈ రేడియో సెట్లు బహుళ ప్రయోజనకరం గా పరమ నాణ్యంగా ఉన్నాయి .రామయ్య గారి రేడియో యుద్ధం వరకు బాగానే పని చేసింది .రేడియో లో హిట్లర్ ప్రసంగాలు విన్నారు అందరూ .అతను జాతి స్వచ్చత గురించి చెప్పాడు .ఆర్య జాతి గొప్పతనాన్ని చాటి చెప్పాడు అది తన జర్మని అంటున్నాడు మధ్య మధ్యలో .నెమ్మదినెమ్మదిగా గొంతు పెంచి మాట్లాడుతున్నాడు హిట్లర్ .కోపెన్ కు కోపం పిచ్చగా వచ్చి ‘’ఈ వెధవ మూలంగా నా జర్మన్లు వేలాది మంది సైన్యం లో చేరి బలై పోతున్నారు .వీళ్ళంతా కలిసి నా జర్మనీని బుగ్గి  చేసేస్తారు ‘’అన్నాడు ఉద్రేకం గా .హిట్లర్ మాటల్లోని జాతి వివక్షతపై రామయ్య గారు ఆలోచించారు .హిట్లర్ విధానం సరైనది కాదనిపించింది .అతనివలన మానవ మారణ హోమం జరిగే ప్రమాదముందని ఊహించారు .తానూ  కోపెన్ యిద్దరూ ఆర్యులు కారు .కనుక తమ కర్తవ్యమ్ ఫాసిస్ట్ జర్మనీ తో కాదు అభి వృద్ధి చెందుతున్న సోవియట్ యూనియన్ తోనే అని బలంగా అనుకొన్నారు .రామయ్య గారికి రష్యన్లు తనను చంపరనే నమ్మకం కలిగింది .నాజీలంటే అసహ్యమేసింది .దాన్ని దాచుకోలేదుకూడా .బహిరంగం గా చెప్పేవారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-15 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నవ్యాంధ్ర రాజ దాని అమరావతి -అమ్మనుడి

amaravati 001 brown- kavita 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-12

’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-12

రష్యా రామయ్య

1930 డిసెంబర్ 17 న  కొలాచల సీతారామయ్య గారు సోవియట్ యూనియన్ (యు .ఎస్ .ఎస్. ఆర్ )రాజధాని మాస్కో నగరం చేరారు .వెంటనే ఎకడమీషియన్ ఇవాన్ గుబ్కిన్ ను అత్యవసరంగా కలుసుకోమని కబురు అందుకున్నారు . ‘’సోవియట్ దేశపు సైంటిఫిక్ రిసెర్చ్ ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ ఆయిల్’’కు  గుబ్కిన్ డైరెక్టర్ అన్న సంగతి రామయ్య గారికి ముందే తెలుసు .

ప్రపంచ ప్రసిద్ధ సైంటి స్ట్ దృష్టిలో పడిన రామయ్యగారు

సోవియెట్ జీయాలజీ ,పెట్రోలియం ఉత్పత్తి మీద గుబ్కిన్ అధారిటీ అనీ తెలుసు .యువ రామయ్య కు అలాంటి పెద్ద అధికారి  ప్రపంచ ప్రసిద్ధ సైంటిస్ట్ అయిన గుబ్కిన్   దృష్టిలో పడటం ,ఆయన నుండి తనకు కబురు రావటం మహదానందంగా ఉంది .రాష్యావస్తే రొట్టె విరిగి నేతిలో పడింది అనిపించింది . ఆలస్యం చేయకుండా రామయ్య  వెళ్లి ఆయన్ను ఆఫీసులో కలిశారు .

రామయ్యగారితో గుబ్కిన్ దాపరికం లేకండా రష్యాలో ఆయిల్ పరిశ్రమ అభివృద్ధి కోసం చేబడుతున్న ప్రణాళిiకలను గురించి వివరించాడు .అతి తక్కువ కాలం లోనే వోల్గా నుండి యూరల్ దాకా ఆయిల్ క్షేత్రాన్ని వ్యాపి౦ప జేయాలన్నదే తమ లక్ష్యం అన్నాడు .ఈ విషయాలన్నీ రామయ్యగారు  మాస్కోకు ట్రెయిన్ లో వస్తూండగా విన్న విషయాలే .దీనితో ఉత్సుకత మరీ పెరిగింది .ఆయనలోని సైంటిస్ట్ ,వర్కర్ రష్యా దేశాభి వృద్ధికి పూర్తిగా సహకరించాలని ప్రబోది౦చి నట్లు అనిపించింది .

భారత దేశం పై గుబ్కిన్ ఆరాధనా ,ఆశా భావం

వారిద్దరి సంభాషణలలో ఇండియా విషయం ప్రస్తావనకు వచ్చింది .గుబ్కిన్ రామయ్యగారితో ‘’మీ వింధ్య పర్వతాలు మా యూరల్ పర్వతాలు చాలా పోలికలు కలిగిఉన్నాయి .ఈ విషయం పై నేను చాలా సార్లు ఆలోచించాను .కొన్నేళ్లలో మీ దేశం లో కూడా ఆయిల్ కోసం అన్వేషణ జరుగుతుంది .’’అని ఆశాభావం వ్యక్తం చేశాడు .రామయ్యగారు పెట్రో కెమికల్స్ లో ,లూబ్రికంట్ లపైనా  చేసిన అత్యున్నత  పరిశోధనలకు గుబ్కిన్ ముగ్ధుడయ్యాడు .

అరుదైన ఉన్నత పదవికి ఆహ్వానం –అంగీకారం

వెంటనే  తన ఇన్ ష్టి ట్యూట్ లోని’’లూబ్రికంట్స్  రిసెర్చ్ డివిజన్ ‘’లో అత్యున్నత అధికారిగా చేరమని ఆహ్వానించాడు .రెండు వారాల గడువు కోరి అమెరికాలో తాను  పని చేసిన ‘’సొనేబార్న్ సంస్థ  ‘’ కు ఈ విషయం తెలియ జేశారు .ఇప్పటిదాకా రామయ్య గారికి రష్యాలో స్థిర పాడాలన్న ఉద్దేశ్య౦కాని ,బ్రిటిష్ వారు పాలిస్తున్న ఇండియాకు తిరిగి వెళ్లాలని కాని  లేదు .కృష్ణా పత్రిక సంపాదకులు ముట్నూరు కృష్ణా రావు గారు చెప్పినట్లు ‘’భగవంతుడికి  ఎవరితో ఎక్కడ ఎలా పని చేయించాలో తెలుసు ‘’అన్న మాట రామయ్య గారి పట్ల రుజువైంది .ఎక్కడ ఇండియా ? ఎక్కడ సోవియట్ యూనియన్ ?విరుద్ధ భావాలున్న దేశాలివి .వాటి మధ్య తాను విజ్ఞాన శాస్త్ర రాయబారి గా రూపాంతరం చెందటం భగవల్లీల గా భాసించింది .

మార్పు ,అభివృద్ధి కోసం రామయ్య గారి సూచనలు

రష్యా లో ఆయిల్ పరిశ్రమ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకొన్నారు .ఆయిల్ రిఫైనరీ కేంద్రాలకు వెళ్లి పరిశీలించారుము౦దు గా .అక్కడున్న సాంకేతిక విషయాలను అడిగి తెలుసుకొన్నారు .వాటిలో చేయాల్సిన మార్పులను ,విధానాలను అక్కడికక్కడే సూచించారు .అతి తక్కువ కాలం లోనే రామయ్య గారి ముద్ర సోవియెట్ ఆయిల్ సంస్థ మీద పడింది .పూర్వం కంటే అభివృద్ధి గణనీయంగా పెరిగింది .

మరో అరుదైన ఉన్నతోన్నత పదవీ గౌరవం

ఈ అసామాన్య మేధావి సూక్ష్మ బుద్ధికి నీరాజనాలు పలికిన యాజమాన్యం ఆయన్ను ‘’డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫ్యుయెల్స్ అండ్ ఆయిల్స్ –కు –అంటే ‘’నామి ‘’ (N.A .M.I –అంటే Nauchno –Avtomotorno iinstitute or the institute for Automobile Motor research )అధిపతిని చేసింది .ఇది అరుదైన గౌరవం .

రామయ్య గారి పరిశోధనా ఫలితాలు

‘’నామి ‘’కు అధిపతిగా ఉంటూ రామయ్యగారు సోవియట్ రష్యాలోయుద్ధ టాంకు లు   వివిధరకాల శీతోష్ణ స్థితులలో సమర్ధ వంతంగా పని చేయటానికి ఉపయోగ పడే’’ ప్రత్యేక కిరోసీన్ ఇంధనాన్ని’’  ను స్వీయ ప్రతిభతో తయారు చేసి అందరి మన్ననలను అందుకొన్నారు .ఇది సోవియట్ దేశం రెండవ ప్రపంచ యుద్ధం లో జర్మనీ తో చేసిన  టాంక్ యుద్ధాలలో గొప్ప విజయాలను చేకూర్చి పెట్టి రామయ్యగారి కీర్తి ఖండాంతరాలకు వ్యాపించింది .ఇదొక మేజర్ సైంటిఫిక్ విజయం .ఈ విజయం రామయ్యగారికే దక్కింది .

డి .కే .నామి సృష్టి

రామయ్యగారు ఒక కొత్త పరికరాన్ని సృష్టించారు .దాని పేరే’’ D.K N.A.M.I .’’ఈ యంత్రం కోసం చాలా సంవత్సరాలు తీవ్రంగా కస్టపడి పని చేశారు .ఇందులో ఎదురయ్యే అనేక సమస్యలను గుర్తించి ,పరిష్కరించారు .కందెన నూనెలు  అంటే లూబ్రికంట్స్ అతి తక్కువ ,అతి ఎక్కువ  ఉష్ణోగ్రత లలో ఇంజన్ భాగాలను తినేసే ధర్మం ఉంది (కరోసివ్ ఎఫెక్ట్ ).అంతేగాక ఏదైనా గాస్ దీనిమీదకు వదల బడితే దాని లోహాలకు  శత్రువై విపరీతమైన హాని కూడా కలిగిస్తుంది .మోటార్ ఇంజన్ ను సమర్ధ వంతంగా పని చేయించటానికి బదులు ఈ లూబ్రికంట్స్  యంత్రాల పాలిటి పరమ శత్రువులై పోతాయి .అదీ విడ్డూరం .1954 లో ఈ కొత్త యంత్రాన్ని సృష్టించి ప్రయోగం చేశారు .ఇది రేడియో యాక్టివ్ ఐసోటోపులను విని యోగించుకొని ,లూబ్రికంట్ లోకలిపే పదార్ధాలను  బేరీజు వేసి యంత్రం లోని సిలిండరు, పిస్టన్ భాగాలపై పడే ప్రభావాన్ని అంచనా వేసింది .ఇది మరొక  ఘన విజయమే అయింది .సల్ఫ్యూరిక్ ఇంధనాలను వాడటం వలన యంత్ర భాగాలకు జరిగే ప్రమాదాలను నివారించటాని ఇది బాగా తోడ్పడింది .పని చేసేటప్పుడు విడుదల అయ్యే సల్ఫ్యూరిక్ డయాక్సైడ్ ,సల్ఫ్యూరిక్ ట్రయాక్సైద్  వాయువులు   విడుదల అయినపుడు ‘’ఆయిల్ జెల్ ‘’ఏర్పడకుండా కాపాడింది  .దీనివల్ల ఇంజిన్ సామర్ధ్యం పెరిగి ,విషవాయువుల వాళ్ళ యంత్ర భాగాలు తినేసే గుణం నివారించ బడింది .

ఒక డీజెల్ మోటారు జీవిత కాలం లో ఒక వెయ్యి టన్నుల ఇంధనాన్ని ఉపయోగించుకొంటుంది .ఇది వెయ్యి కిలోల సల్ఫర్ నుండి మూడు టన్నుల సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏర్పడటానికి సమానం .దీనివలన మోటార్ ఇంజిన్ లోని లోహ భాగాలు పూర్తిగా దెబ్బతింటాయి అంటే తిని వేయబడతాయి .ఇంజిన్ జీవితం గోవిందో హారి .ఈ ప్రమాదం నుండి కాపాడటానికే రామయ్య గారి తపన అంతా .చక్కని పరిష్కారం’’ డి .కే. నామి’’ ద్వారా  సాధించారు  .ఈ ప్రయోగాల వలన లూబ్రికంట్స్ లో సరైన’’ అడిటివ్స్ ‘’కలిపి లూబ్రికంట్ పై ఒక రక్షక పొర ఏర్పడి యంత్ర లోహాన్ని కాపాడేట్లు చేయగలిగారు .ప్రగతి పధం లో ఇదొక ముందడుగు ,మైలు రాయి  .

డి. కే .2

దీని తర్వాత మరింత అధునాతన యంత్రం డి.కే 2 ను తయారు చేశారు .ఇది భారీ ఉత్పత్తి లో భాగమైంది .ఈ యంత్రాలు సోవియెట్ యూనియన్ లోనేకాక మిగిలిన చైనా ,జెకోస్లోవేకియా ,మొదలైన సోషలిస్ట్ దేశాలలోను ఉపయోగానికి వచ్చాయి .దీనివలన ఆయిల్ ఇంజిన్లు గడువుకన్నా ముందే  అతి త్వరగా వినాశనం చెందకుండా ఎక్కువ కాలం సమర్ధ వంతం గా పని చేయించే వీలుకలిగి ,యంత్రం  జీవితకాలం  వృద్ధి అయింది .తరువాత అత్యంత శక్తి సామర్ధ్యాలు కల ఇంజన్ల నిర్మాణం జరిగింది .నిమిషానికి అయిదు వేల రివల్యూషన్లు తిరగ గలిగే యంత్రాలోచ్చాయి .ఇంత  శక్తి తో అవి పని చేస్తున్నా ,అధిక పీడనానికి గురవుతున్నా ,ఘర్షణకు లోనవుతున్నా చెక్కు చెదర కుండా పని చేస్తున్నాయి .అది అపూర్వ విజయం .రామయ్యగారు తన లాబ్ లో కొత్త లూబ్రికంట్ అడ్డిటివ్స్ పై పరిశోధన తీవ్రంగా చేసి  పాత వాటి స్థానం లో వీటి నికలిపి అద్భుత విజయాలు సాధించారు .పదేళ్ళ దీర్ఘ కృషి ఫలితం గా రామయ్యగారు 1964లో N A M.I –T-!అనే యంత్రాన్ని నిర్మించగాలిగారు .ఆయన ‘’లేబరేటరి ప్లాంట్ ‘’అధునాతన (అడ్వాన్సేడ్ )లూబ్రికంట్ అడ్డిటివ్స్ ను ఎంపిక చేసి కొత్త , భవిష్యత్ తరాలకు ఉపయోగ పడే  ఇంజిన్ లలో ఉపయోగించే కేంద్రం అయింది .రామయ్య గారు రష్యా వచ్చిన అతి కొద్దికాలం లోనే దాని ప్రగతి రధానికి ఒక చక్రమై నిలిచారు .సార్ధక జీవి అనిపించుకొన్నారు .తనపై పెట్టిన బాధ్యతలను అతి సమర్ధ వంతం గా నిర్వహించి కీర్తి శిఖరాలను అందుకొన్నారు .

దీనితో రష్యా లో  రామయ్య ఫోటో జత చేశాను చూడండి –

rashya ramayya 001సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-15 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | 3 Comments

కుంభ మేలా కు దీటుగా గోదావరి పుష్కరాలు -పరకాల ప్రభాకర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నలభై దాటితే.. నటన అక్కర్లేదా?

నలభై దాటితే.. నటన అక్కర్లేదా?

  • -రమ్య
  • 30/04/2015
TAGS:

నలభై ఏళ్లు దాటిన నటీమణులను తల్లిపాత్రలకు ఎంపిక చేస్తున్నారే తప్ప నటనపరంగా అవకాశం లేకుండా పోతోందని ప్రఖ్యాత నటి, దర్శకురాలు రేవతి (48) ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎలాంటి వైవిధ్యం లేని తల్లిపాత్రలు ఒకటి, రెండు సన్నివేశాలకే పరిమితం కావడంతో నడివయసు హీరోయిన్లు అసంతృప్తికి లోనవుతున్నట్లు ఆమె చెబుతోంది. కోచి (కేరళ)లో 1966లో జన్మించి, 1983లో సినీరంగ ప్రవేశం చేసిన ఆశా కుట్టి (రేవతి) మూడు సార్లు జాతీయ ఉత్తమనటిగా, ఆరు సార్లు ‘్ఫల్మ్‌ఫేర్’ అవార్డులను కైవసం చేసుకుంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసుకున్న ఈ నటి ప్రస్తుత సినీరంగ పోకడలపై తీవ్ర అసంతృప్తి చెందుతోంది. వయసుతో సంబంధం లేకుండా నటనను ఆవిష్కరించే పాత్రలు లభిస్తే సినిమా రంగానికి తాను ఎప్పుడూ దూరం కానంటోంది.
35- 45 ఏళ్ల వయసు కలిగిన నటీమణులకు తగిన పాత్రలను సృష్టించడంలో ఈకాలపు రచయితలు ఆసక్తి చూపడం లేదని రేవతి ఆరోపిస్తోంది. వయసుకు తగ్గ పాత్రలు వేస్తున్నప్పటికీ అందులో నటనకు అవకాశం లేకుంటే సినిమాలు చేయడం ఎందుకని ఆమె ప్రశ్నిస్తోంది. వృత్తిని సవాల్‌గా తీసుకుని, మంచి పాత్రలో నటించేందుకు ఎంతోమంది నడివయసు హీరోయిన్లు సిద్ధంగా ఉన్నారని అయితే- అందుకు తగ్గ పాత్రలే లేవని ఆమె అంటోంది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో మంచి నటిగా, దర్శకురాలిగా తనకు గుర్తింపు దక్కినప్పటికీ, ఇప్పటి సినిమాల్లో నటనకు చోటు లేకుండా పోయిందని చెబుతోంది. మంచి పాత్రలు లభించక పోవడంతో తాను గత రెండేళ్లలో ఒకే ఒక సినిమాలో నటించానని ఆమె గుర్తు చేస్తోంది. ఎక్కువ సినిమాల్లో నటించాలన్న తపన తనకు లేదని, మంచి పాత్ర లభిస్తే ఏ భాషలోనైనా నటించేందుకు సిద్ధమేనని అంటోంది. సినిమా అన్నది వినోదాత్మకమే అయినప్పటికీ నటనకు కూడా అవకాశం ఉండాలని, సామాజిక స్థితిగతుల్ని ప్రతిబింబించాలని ఆమె అంటోంది. కళాత్మకత, వినోదం సమపాళ్లలో మేళవిస్తేనే నటీనటులు, సాంకేతిక నిపుణుల శ్రమకు సార్థకత చేకూరుతుందని చెబుతోంది.
మహిళా సమస్యలను స్పృశిస్తూ తాను గతంలో పలు సినిమాలకు దర్శకత్వం వహించానని, అయితే- తాను నటించే పాత్రలన్నీ అలాగే ఉండాలని ఇతర దర్శకులపై ఒత్తిడి తెచ్చిన సందర్భాలు లేవంటోంది. మగ దర్శకుల్లా ఆలోచించి, వాణిజ్యపరమైన సినిమాలకు దర్శకత్వం చేయడం అంత సులభం కాదని, అనేక విషయాల్లో శిక్షణ, అవగాహన ఉంటే తప్ప అలాంటి సాహసాలు చేయలేమని రేవతి చెబుతోంది. ప్రేక్షకులు ఎప్పుడూ వైవిధ్యాన్ని కోరుకుంటారని, నటనకు అవకాశం లేని తల్లిపాత్రలు ఎవరికీ గుర్తు ఉండవంటోంది. ఎలాంటి పాత్రకైనా గుర్తింపు రావాలంటే అది రచయితల వల్లనే సాధ్యమవుతుందని ఆమె విశే్లషిస్తోంది. ఆధునిక యుగంలో అన్ని వయసుల మహిళలూ అనేక రకాల ఒత్తిళ్లను, సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారి మనోభావాలకు అద్దం పట్టేలా పాత్రలను సృష్టిస్తే నటీమణులకు వృత్తిపరమైన సంతృప్తి దక్కుతుందని రేవతి చెబుతోంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒకప్పటి భూలోక స్వర్గం నేపాల్ -ఇప్పుడు ప్రత్యక్ష నరకం

నేపాల్‌కు బాసటగా…

  • 30/04/2015
TAGS:

చేష్టలుడిగిన నేపాల్‌లో మళ్లీ చైతన్యం చిగురిస్తోంది. పునశ్చైతన్యం పొందిన నేపాల్ ప్రజల కళ్ల ఎదుట దిగంతాలకు వ్యాపించిన దిగ్భ్రాంతికర దృశ్యమాలిక ఆవిష్కృతమై ఉంది. ఏప్రిల్ 25వ తేదీన ప్రకంపించిన భూమి సృష్టించిన విలయ విషాదం నుండి నేపాల్ విముక్తం కావడానికి ఎంత సమయం పడుతుందన్నది ఊహకందని వైపరీత్యం! నేపాల్‌ను ఆదుకోవడానికి భారతదేశం యత్నిస్తుండడం సహజ సాంస్కృతిక జాతీయాత్మ ప్రతిస్పందన మాత్రమే…ఉభయ దేశాల మధ్య, ఉభయ దేశాల ప్రజల మధ్య, ప్రజల హృదయాల మధ్య, చరిత్రల మధ్య తాత్కాలిక రాజకీయ, భౌతిక వాస్తవాలకు అతీతమైన సనాతన మమకార బంధం నెలకొని ఉంది. ఈ పరస్పర మహోపకారానికి ప్రాతిపదిక ఉభయ దేశాల ప్రజల సమాన సంస్కృతి, సమాన జీవన లక్ష్యం…కష్ట సుఖాలలో, సుఖ దుఃఖాలలో, జయాపజయాలలో, శత్రు మిత్ర విచక్షణ భావాలలో కన్యాకుమారినుండి గౌరీశంకర హిమ శృంగం వరకు విస్తరించి ఉన్న ఉభయ దేశాల ప్రజలు సమాన స్పందనకు ప్రతిస్పందనకు లోను కావడం యుగయుగాల చరిత్ర. ఈ చరిత్రలో ఇది భయంకర విషాద ఘట్టం…ఈ విషాదం నేపాల్ రాజకీయ సీమలకు పరిమితమైన ప్రజలది మాత్రమే కాదు…్భరతీయులది కూడ! ఈ ‘కూడిక’ ఊపిరాడని స్థితిలో ఉక్కిరి బిక్కిరి అయి పడి ఉన్న భూకంప పీడితులకు హిమాలయమంత ఉపశమనం. మన దేశంలోని జాతీయతా సంస్థలకు చెందిన వేలాదిమంది కార్యకర్తలు నేపాల్‌వైపు కదలి వెడుతున్నారు. ప్రకంపన పీడితుల కన్నీళ్లు తుడవడానికి కటిబుద్ధలౌతున్నారు! నేపాల్ ప్రధాని సుశీల్ కుమార్ కోయిరాలా దిగ్భ్రాంతికి గురై వౌనం వహించిన సమయంలో తేరుకున్నది మన ప్రధాని నరేంద్ర మోదీ. తేరుకున్న వెంటనే మన వాయుసేన రంగంలోకి దూకింది. సహాయక కార్యకలాపలను ఆరంభించింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్ తదితర సంఘ పరివార సంస్థలు, అనేక ఇతర జాతీయతా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పెద్దఎత్తున చేపట్టిన సహాయ కార్యకలాపాలు నేపాల్ ప్రజలతో భారతీయులకు గల మమకార బంధానికి ప్రతీకలు! మన దేశంలోనే ఈ భయంకర భూకంపం సంభవించిందని మనం భావిస్తున్నాము. ప్రచార మాధ్యమాలలోను సామాజిక మాధ్యమాలలోను భూకంప బాధితుల కడగండ్ల గురించి పెద్ద ఎత్తున జరుగుతున్న విశే్లషణలు విపత్తులలో ఉభయ దేశాల సమాన స్పందనకు మరో సంకేతం..నేపాల్ ప్రజలు భారతీయుల ఆత్మబంధువులు..సమాన సాంస్కృతిక పరివారంలోని సన్నిహిత సహచరులు..
ఈ ఆత్మీయ బంధువుల అగచాట్లు మన అగచాట్లు! నేపాల్‌లోని ప్రకంపనాలకు పెల్లుబికిన అగ్నికణాలు మన గుండెలను దహిస్తున్నాయి. మన కళ్లను రక్తాస్రుపూరితం చేస్తున్నాయి. నేపాల్‌లోని మొత్తం డెబ్బయి ఐదు జిల్లాలలో నలబయి చోట్ల ప్రతి పట్టణంలోను గ్రామంలోను ఇళ్లు కుప్పకూలిపోయాయి! రహదారుల పక్కన కూలిన ఇళ్ల శిథిలాలు గోచరిస్తున్నాయి..శిథిలాల కింద మానవ దేహాల శకలాలు కనిపిస్తున్నాయి. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఐదు వేల మందికి పైగా అకాల మృత్యుపాలైనట్టు ఇప్పటికే ధ్రువపడింది. మృతుల సంఖ్య పదివేలు దాటవచ్చునని నేపాల్ ప్రధాని స్వయంగా ప్రకటించడం ప్రకంపన భయంకరత్వానికి నిదర్శనం. నాలుగు రోజులు గడిచినప్పటికీ భూగర్భం ప్రకంపన ప్రభావంనుండి విముక్తం కాలేదు. మంగళ వారం సైతం మట్టి చరియలు విరిగి పడిపోయాయి. వాటికింద రెండువందల మంది కూరుకుని పోయారు. 1934 నాటి భూకంపానికి పదివేల మందికి పైగా బలయ్యారు. బిహార్, నేపాల్ ప్రాంతాలకు ఆ ‘కంపం’ విస్తరించింది. ప్రస్తుతం నేపాల్‌లోను మన దేశలోని మూడు రాష్ట్రాలలోను సంభవించిన ప్రకంపన విలయం అదే స్థాయిలో ప్రాణాలను తీసిందన్న భయాందోళనలు కొనసాగుతున్నాయి! ప్రకంపనల తీవ్రత, ప్రభావం సమసిపోకపోవడంతో విధ్వంసం జరిగిన ప్రాంతాలలోని ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతుండడం మరో వైపరీత్యం. మంగళవారంనాడు రాజధాని ఖాట్మండు నగరంనుంచి మాత్రమే ఎనబయి వేలమంది ఇతర ప్రాంతాలకు మారుమూల గ్రామాలకు తరలిపోవడం జనం భయవిముక్తులు కాలేదనడానికి చిహ్నం…
మరోసారి భూమి కంపించవచ్చునన్నది నిర్వాసితులై పోతున్న వారి భయం. ఈ భయాన్ని మాన్పి మళ్లీ భూకంపం సంభవించబోదన్న విశ్వాసం కల్పించడానికి అధికారులు సిద్ధంగా లేరు శాస్తవ్రేత్తలు నోరు విప్పడంలేదు. కదలిపోతున్న పునాదిపై నిలుచుని ఉండడం ప్రమాదకరమన్న భావం భూకంప పీడితుల గుండెలలో గూడుకట్టుకుంది! జీవితంపట్ల విశ్వాసం సడలిపోవడం కంటే భయంకర విషాదం మరొకటిలేదు! శిథిలమైన ప్రాంతాలలో అంటురోగాలు ఇతర వ్యాధులు వ్యాపించవచ్చునన్న పుకార్లు కూడా విషాద గ్రస్తులను మరింత భయకంపితులను చేస్తున్నాయి. భోజనం ఎప్పుడు దొరుకుతుందో తెలియని స్థితి..దప్పికైనా తీర్చుకోవడానికి వీలులేని దుస్థితి! ఈ దుస్థితిని అక్రమ లాభార్జనకు వినియోగించుకొనడం రాక్షసత్వం, క్రూరమైన పైశాచికత్వం! కానీ ఇలాంటి పిశాచాలు, నర రాక్షసులు కూడ ‘వ్యాపారుల’ రూపమెత్తి పీడితులను మరింతగా పీడించడం మానవీయమునకే మచ్చ. ఇంతటి ఘోర విపత్తు సమయంలో సైతం లభ్యమాన వస్తువుల ధరలను పెంచి అమ్ముతున్నవారు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నవారు నేపాల్ నగరాలలో కోకొల్లలుగా తయారయ్యారు. ప్రాకృతిక వైపరీత్యాలను సైతం తన ప్రాబల్య విస్తరణ కోసం ఉపయోగించుకోవాలన్న చైనా ప్రభుత్వం నేపాల్‌లో మనం సాగిస్తున్న సహాయ కలాపాల పట్ల పరోక్షంగా వ్యతిరేకతను ప్రదర్శిస్తోంది. సహాయం పేరుతో భారత చైనాలు నేపాల్ బాధితుల మధ్య తమ ప్రాబల్యం పెంచుకుంటున్నాయన్న వార్తలను ఎవరో ప్రచారం చేశారట. ఎవరు చేశారన్నది మాత్రం చైనా చెప్పడంలేదు! సహాయం అందచేయడం విషయంలో తమకూ భారత్‌కూ మధ్య పోటీ లేదన్న అనవసరమైన స్పష్టీకరణను బీజింగ్‌లో చైనా విదేశాంగ మంత్రిత్వ కార్యాలయంవారు విడుదల చేయడం విడ్డూరం! తాము భారత్‌తో కలిసి సహాయ కలాపాలను నిర్వహిస్తామని నేపాల్‌ను ఆదుకోవడం అంతర్జాతీయ సమాజంలోని అన్ని దేశాల బాధ్యత అని చైనా విదేశాంగ వారు చెప్పుకొస్తున్నారు. ఇలా చెప్పడం ద్వారా భారత నేపాల్ మధ్యగల ప్రత్యేక స్నేహ సంబంధాల ప్రాధాన్యం తగ్గించడనికి చైనా యత్నిస్తోంది!
నేపాల్ భూకంప పీడితులను ఆదుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయునిది. విరాళాలు సమర్పించడం, కార్యకర్తలుగా నేపాల్‌కు కదలివెళ్లడం, సామాజిక మాధ్యమాల ద్వారా సమస్యను వివరించి విరాళాలు సేకరించి పంపడం-ఇలాంటి సహాయం కార్యక్రమాలు ఎన్నో మనం చేపట్టవచ్చు! ఎనబయి లక్షల మంది నేపాలీలు భూకంప పీడితులు. వీరిలో దాదాపు పదిహేను లక్షలమందికి భోజనం లభించడం లేదట! కనీసం అరవై వేల కోట్ల రూపాయల నిధులు పునరావాసానికి పునర్ నిర్మాణానికి అవసరమట! ఎవరెంత ఇవ్వగలరు?

 


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కొత్త దారులు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాండుంగ్ చరిత్ర -వర్తమానం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వ్యాసాల్లో శ్రీ శ్రీ భావ విన్యాసం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పట్టిసీమ నుంచి రాయలసీమ దాకా –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దాదా సాహెబ్ ఫాల్కే ను చిత్ర సీమ మరిచిపోయిందా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆంద్ర లో పెట్టుబడుల పండగే పండగ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-11

’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-11

జో సందేశం

రామయ్యగారికి ,భార్య సారాకు అత్యంత ఆత్మీయుడు జో తో ఒక సారి దీర్ఘ సంభాషణ జరిగింది .ఆఫీస్ లో జరిగిన విషయాలన్నీ తెలుసుకొన్న జో, రామయ్య గారికి గొప్ప హితోపదేశం చేశాడు .కంపెనీ మేనేజి మెంట్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని ,రామయ్యగారి మేధస్సుతో పావుల గేం ఆడుతోందని ,రామయ్యకు ఏ  క్షణం లో నైనా నోటీస్ ఇచ్చి బయటికి పంపే ప్రయత్నం లో ఉన్నారని గ్రహించమని చెప్పాడు .రామయ్య కంపెనీతో కొంత కాంప్రమైజ్ అయినట్లు జో చెప్పగా కాదన్నారాయన.రామయ్య గారి మేధస్సును వాడుకొని’’ బ్రెయిన్ డ్రెయిన్ ‘’చేసే ఆలోచనలో కంపెనీ ఉందని ,కంపెనీకి కావాల్సింది మంచికాదని, ఏవి వెంటనే  లాభాలు గడించి పెడుతాయో అవే కావాలని చెప్పాడు. రామయ్యగారి స్వేచ్చను క్రమ క్రమగా హరి౦చ టానికే వారు ఆలోచిస్తున్నారని తెలియ జెప్పాడు .లబరేటరీలో కూడా రామయ్యగారికి పూర్తీ స్వేచ్చ ఉండదని నిఘా ఉంటుందని ,ఆయన సృజనకు అడ్డ౦కు లేర్పరుస్తారని అన్నాడు .ప్రతిదానికీ ఎద్దులా తలూపద్దని   హెచ్చరించాడు .అన్నీ అర్ధం చేసుకోవాలని కోరాడు .బాస్ లు అంటే వ్యాపార  దృష్టిమత్రమే ఉన్నవారని గ్రహించాలన్నాడు .అంటే ఆయనద్వారా వాళ్లకి లాభాలు వచ్చి మీద పడాలి రామయ్య గారు కూడా వారికి వ్యాపార వస్తువే ననీ చెప్పాడు .రామయ్య గారికి ఇష్టమైనప్పుడు ,అనుకూలంగా ఉన్నప్పుడు కంపెనీ నుంచి వెళ్ళిపోయే స్వేచ్చ ఉండదని ఖచ్చితంగా చెప్పాడు .కాంట్రాక్ట్ ను భగ్నం చేశారని నేరం మోపే అవకాశం కూడా ఉందన్నాడు .ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచి౦చాలన్నాడు .ఇవి సీరియస్ సమస్యలే అనిపించింది రామయ్య గారికి కూడా .

భూతల స్వర్గం  రష్యా

వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం ఉందన్నాడు జో .అదే రష్యాకు తరలి వెళ్ళటం .వెంటనే సామాన్లు సర్దుకొని ,రష్యాకు వెళ్లి ఉజ్వల భవిష్యత్తును అందుకోమన్నాడు .రామయ్య గారు కలలు కనే బంగారు భవిష్యత్తు రాష్యాలోనే సాధ్యమవుతు౦దన్నాడు .రష్యాలో రామయ్య వంటి సమర్ధుల అవసరం చాలా ఉందని చెప్పాడు .తనకు కూడా రష్యా వెళ్లి ఉండిపోవాలని ఉందికాని కేన్సర్ బాగా ముదిరి తన జీవితకాలం అతి తక్కువేనని తెలిసి  వెళ్ళటం లేదన్నాడు జో. .అమెరికా ,రష్యా ల పరిస్తితులను బేరీజు వేసుకోమని సలహా ఇచ్చాడు .ఇప్పుడున్న పరిస్తితులలో అమెరికా లో ఉన్న సుఖ జీవనం రష్యాలో ప్రస్తుతం సాధ్యం కాదని ,చాలా కష్టపడాలని చెబుతూ లెనిన్ అన్న మాటలు ‘’Either we will catch up with America and leave it behind or we will be crushed ‘’ గుర్తు చేశాడు .రష్యా అభి వృద్ధికి చేతనైన సాయం చెయ్యమన్నాడు .రామయ్య లాంటి స్పెషలిస్ట్ లు రష్యాకు చాలా అవసరం అన్నాడు .రష్యాకు సాయం చేస్తే రష్యా ఇండియాకు సహాయం చేసి ఋణం తీర్చుకొంటుంది అన్నాడు .’’రష్యా  భారత్ భాయీ భాయీ’’ గా భవిష్యత్తులో నిలిచి పోతాయన్నాడు .రష్యాలో విపరీత విపత్కర పరిస్తితులెదురైనా లెనిన్ మాటలు జ్ఞాపకం చేసు కొంటూ కష్టాలను అధిగమిస్తూ రష్యా అగ్రగామి దేశం గా ఎదగటానికి తోడ్పడమని కోరాడు .ఇక ఏ మాత్రం ఆలస్యం చేయవద్దని త్వర పెట్టాడు .

విఫలమైన వివాహం –సారా ‘’సారో’’దంతం

భార్య సారా కూడా ఈ సంభాషణలలో పాలు పంచుకోన్నది .ఆమెతో కూడా జో మాట్లాడి రామయ్య గారి వెంట రష్యా వెళ్లి పొమ్మని హితోపదేశం చేశాడు .ఇండియా  వెళ్లి పోదామనుకొన్న రామయ్య గారికి ఇదొక కొత్త సమస్య అయింది. అమెరికాలో ఉండలేక పోతున్నారు .సారా అంటే రామయ్యకు అమితమైన ప్రేమ ఉందని అతన్ని నమ్మమని ఆమెకు చెప్పాడు జో. ఆమె వెంటనే ఏమీ చెప్పలేక పోయింది .అది దారుణం అన్నాడు జో మొహమాటం లేకుండా .రామయ్యగారికీ మనసులో బాధగానే ఉంది .ఇప్పుడిప్పుడే  వారిద్దరి వైవాహిక జీవితం లో కొద్దిగా ఆశా రేఖ గోచరించింది .ఇంతలో మళ్ళీ ఈ దూరం .రామయ్యగారికి అన్నిరకాల సహకారం ఇచ్చానని ,ఇక కూడా ఇస్తానని ఇక్కడే ఉండిపొమ్మని సారా గోల చేసింది .

ఇద్దరి బాధలు అర్ధం చేసుకొన్న జో ఆమెతో ‘’అమ్మాయీ !ఇది జీవితం .మనం అనుకొన్నట్లు జరగదు. మనకు తెలియ కుండానే నిర్ణయాలు జరిగి పోతూ ఉంటాయి .నేను నీకు స్నేహితుడిని .నా మాట మీద విశ్వాసం ఉంచు .నేను చెప్పేది నీకు బాధాకరంగా, భయంకరం గా ఉండచ్చు .కాని ఇది వాస్తవం .అర్ధం చేసుకో .రామయ్యను తప్పు చేయమని నేను కోరలేను .ఆతను కొత్త జీవిత యుద్ధానికి తయారవుతున్నాడు .మీ ఆయనకు ఇష్టం ఉన్నా లేకున్నా అమెరికాలో సైనికులకోసం మోటార్లు తయారు చేశాడు .కాని ఆ మోటార్లు భూమిని త్రవ్వటానికి, దున్నటానికి ,పంటలు పండిం చటానికీ ఉయోగ పడతాయి టాంక్ లు నడపటానికీ అవే మొటార్లు కావాలి .యుద్ధం లో వీటిని వాడితే భూమి అంతా రక్త సిక్తమవుతుంది ‘’అని చెప్పాడు .కాని సారా తలిదండ్రులను వదిలి రష్యాకు రామయ్య గారితో వెళ్ళటానికి ఇష్టపడలేదు .ఇదివరకు ఆయనతో ఎక్కడికైనా వెళ్లి పోటానికి సిద్ధపడ్డ ఆమె ఇప్పుడు వెనకడుగు వేసింది .పూర్వం ఒక సారి తనతో ఇండియా రమ్మంటే అప్పుడూ వస్తానని అనలేదు .అంటే అవకాశం వచ్చినప్పుడు ఆమె సరైన నిర్ణయం తీసుకో లేక పోయింది ఇదే ఆమె బలహీనత అయి ఇద్దరి మధ్యా దూరం పెరగటానికి కారణం అయింది .జో చేవిలో ఇల్లు కట్టుకొని   నచ్చ చెప్పినా ఆమెను మార్చలేక పోయాడు .ఒప్పించలేక పోయాడు .సారా మనసు లో తనకు తెలియని ఏదో ఒక పొర ఉందని అర్ధమయింది .ఆమెకూ ఈ పొర ఉన్నట్లు తెలీదేమో అనుకొన్నారు .ఆమె ఒక కోతిపిల్ల తల్లిని అంటుకునే బతుకు తుంది అనిపించింది .ఆమెకు రక్షణా, సుఖం కావాలి .రష్యా మూలం గా తాము విడిపోవాల్సి వస్తుందని ఊహించలేదు .ఇక ఆమెది అమెరికా .తనది రష్యా అవుతుంది .మార్క్సిజం ఇద్దర్నీ శిక్షిందేమో నని సందేహమూ వచ్చింది .ఇక ఇది శాశ్వత వియోగమే అయింది .మనుషులు దూరమైనా మనసులు దూరం కావు అని నమ్మారు .సారా కద ‘’’’సారో’’(విషాద ) దంతం అయిపొయింది .ఆమె  పరిస్తి తులకు తగిన నిర్ణయాలు తీసుకోక పోవటం వలన వచ్చిన విషాదం ఇది .అది రామయ్యగారికీ బాధ కలిగించినా తప్పని పరిస్తితి అయింది .ఇలా సారా తో మొదటి వివాహం విఫలమైంది .ఇదే ‘’సారోదంతం ‘’.

ప్రలోభం –కాదని తిరస్కరించిన రామయ్య

కంపెనీతో ఒప్పందం గడువు పూర్తీ అవగానే వాన్ డేర్ హేంక్ రామయ్యగారిని పిలిచి ప్రొమోషన్ ఆశ చూపించి ,డిపార్ట్ మెంట్ పై పూర్తీ అధికారాలు ఇస్తామని ,,జీతం కూడా బాగా పెంచుతామని ప్రలోభ పెట్టాడు .దీనికి రామయ్య గారు థాంక్స్  చెప్పి తాను  చికాగో ఫర్మ్ కు వెళ్లి పని చేయనని ,అమెరికా వదిలి వెడుతున్నానని  చెప్పేశారు .ఎక్కడికి వేడుతున్నారో చెప్పలేదు .గ్రహించిన హేంక్ ‘’ఇండియాలో నీలాంటి స్పెషలిస్ట్ ల అవసరం లేదే .అక్కడున్నది బ్రిటిష్ ప్రభుత్వం ‘’.హోమ్ రూల్ ‘’ఇంకా ఇండియాకు రాలేదే’’అన్నాడు .ఒక నవ్వునవ్వి రామయ్యగారు ‘’రష్యా వెడుతున్నాను.అన్నారు  .నిస్చేస్టు డయ్యాడు హేంక్ .మళ్ళీ’’ గేం ‘’మొదలెట్టాడు హేంక్ .జీవితాన్ని ధ్వంసం చేసుకోవద్దని ఒక సలహా పారేశాడు .ఇక అక్కడ ఉండకుండా బయటికి వచ్చేశారు రామయ్య . ‘’Life is in fact short  but that is exactly why we want to live it honesty ‘’అన్న సూక్తి జ్ఞాపకమొచ్చింది .హేంక్ యెంత ఉద్రేకపరచినా పరమ శాంతంగా మేనేజ్ చేశారు రామయ్య .న్యూయార్క్ ఆయనకు ఒక’’ సీల్డ్ డోర్ ‘’లా, రష్యా ఒక భూతల స్వర్గం గా కనిపించింది . ప్రపంచ దేశాలనుండి సైంటిస్ట్ ల ,సాంకేతిక నిపుణుల ను ఆహ్వానించి రష్యాలో ఉండి  సోవియట్ రష్యా సర్వ తోముఖాభి వృద్ధికి తోడ్పడమని అభ్యర్ధించిన విషయం రామయ్య గారికి రెడ్ కార్పెట్ వెల్కం లాగా అనిపించింది .

1930  చివర్లో యూరప్ పర్యటన చేశారు .తన గమ్యం రష్యా అని తెలిసి పోయింది .ఆ దేశం గురించి వారపత్రికలలో చదివి అక్కడికి యాత్రగా వెళ్లి వచ్చిన వారి వలన విని తెలుసుకోగలిగారు .కాని అక్కడి ప్రజాస్వామ్య స్థితిగతులు ఉద్యోగావ కాశాలు ,అభివృద్ధికి మార్గాలు ,ఆ సమాఖ్యలోని దేశాల పరిస్తితులు స్వయంగా అధ్యయనం చేసి  ఫస్ట్ హాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని  రష్యా వెళ్ళారు .first wife sara 001

దీనితో రామయ్య గారి మొదటి భార్య సారా ఫోటో జత చేశాను చూడండి

ఇక రష్యా రామయ్య గారి గురించి తెలుసుకొందాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-4-15 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-10

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-10

కేమ్మోటాలజీకి  బీజం

లాబ్ పరిశోధనా ఫలితాలు ఉత్సాహాన్నిస్తున్నాయి .మోటార్ ఆయిల్ కి ఉన్న తుప్పు పట్టింఛి తినేసే  గుణం (కరోసివ్ యాక్షన్ )వలన వచ్చే సమస్యలను పరిష్కరించే అతి పెద్ద బాధ్యత ను రామయ్య గారి బృందానికి హేంక్ అప్పగించాడు .దీనిపై ద్రుష్టి పెట్టి పని చేస్తున్నారు రామయ్య గారు .మోటారు వివిధమైన పని  చోట్ల వివిధ రకాల ఘర్షణకు గురి అవుతుంది అన్న విషయం గమనించారు .ఈ లక్షణం వివిధ స్థాయిల్లో ఉంటుంది .మోటార్ ఆయిల్ లో ఉపయోగించే పదార్ధాలు  వాటి శాతం (ఇన్ గ్రీడిఎంట్స్  )వలన మంచి రన్నింగ్ రాబట్టవచ్చు అనే ఐడియా వచ్చింది రామయ్య గారికి .ఇది అంత తేలిక విషయం కాకపోయినా ఆ విషయం పైనే కేంద్రీకరణ జరిపారు .పని చేసే నియమాలను మార్చటం వలన మోటారు లో జరిగే షేకింగ్ (ఊపుడుగుణం )తగ్గించ గలిగారు .దీనికోసం లూబ్రికంట్స్(కందెన నూనె )లో ఉండే పదార్ధాలను మార్చి మార్చి ప్రయోగాలు చేశారు .హేంక్ కోరిక ప్రకారం  మోటార్ నిర్మాణం లో ఒక కొత్త శకమే ఆవిష్కరించ బడాలి .దీనికోసం హేంక్ ‘’వేల్వేరి లూబ్రికంట్ ‘’అనే పదాన్ని కాయినేజ్ చేశాడు .

‘’ వేల్వేరి కిట్టెన్’’ మోటార్  సృష్టి

లూబ్రికంట్స్ లో వాడే పదార్ధాల లలో స్వల్ప  మార్పులు చేశారు .మోటారు లోడ్ మారినప్పుడు ఆయిల్ పైన ఏర్పడే పలుచని పొర లో వచ్చే మార్పుల్ని అధ్యయనం చేశారు .అతి తక్కువ సమయం లో రొటేషన్ ల సంఖ్య ను పెంచితే ఒక’’ క్రిటికల్ కండిషన్ ‘’ఏర్పడింది .కాని లూబ్రికంట్ దానంతట అదే ఈ కొత్త వేగానికి మార్పు చెందలేక పోతోందని అర్ధమయింది .అందువలననే పూర్వపు మోటార్ లలో కరోసన్ ఏర్పడి యంత్ర భాగాలని తినేసేదని  తెలుసుకొన్నారు .కనుక ఒక కొత్త యంత్ర సృష్టి జరగాలి అని నిర్ణయానికి వచ్చారు .ఈ యంత్రం లో ఆటోమాటిక్ గా రొటేషన్ ల ను బట్టి  ఆ మార్పులు జరిగి మోటార్ సమర్ధం గా పని చేస్తుంది .దీనికోసం వేర్వేరు లూబ్రికంట్ ల ను పోశారు .సృష్టింప బడే కొత్త యంత్రానికి ‘’వేల్వరి కిట్టేన్ ‘’అని పేరూ పెట్టారు  కాని హేంక్ ఈ ఐడియా మీద నీళ్ళు కుమ్మరించాడు .అలా కొత్త మోటారు తయారు చేయటానికి చాలా డబ్బు ఖర్చవుతుందని అభ్యంతర పెట్టాడు .కాని రామయ్య గారు చేతిలో ఉన్న ఖచ్చితమైన లెక్కల ప్రకారం అలాంటి యంత్రం ఎక్కువ కాలం పని చేస్తుందని మొహమాటం లేకుండా చెప్పారు .దీనివల్ల  కారు’’,కారు చౌకగా’’ తయారు చేయవచ్చని వివరించారు .ఒక నవ్వు నవ్వి హేంక్ ‘’రామయ్యా !నువ్వు గొప్ప’’ దీరిటిషియన్’’వే ,దానికేమీ అనుమానం లేదు  కాని ప్రాక్టికల్ మనిషివి కావు .మనకు కావలసింది మనకు పోటీగా ఉన్న కంపెనీల మోటార్ ల కంటే బాగా పని చేసేవికావాలి  కాని శాశ్వతమైన నడక ఉన్న మోటారు కాదు .శాశ్వత మైన మోటారు నువ్వు  సృష్టి  చేస్తే అది మన పరిశ్రమనే చంపేస్తుంది .’’అన్నాడు .ఈ వితండ, విడ్డూర, వింత వాదన రామయ్య గారికి నచ్చలేదు .కనుక స్వస్తి చెప్పాల్సి వచ్చింది .

కనుక ఇప్పుడు ఆలోచనలన్నీ కొత్త లూబ్రికంట్ తయారు చేయటం మీదనే పెట్టారు .ఆ లూబ్రికంట్ దానంతటకి అదే రెగ్యులేట్ చేసుకొంటూ ‘’,విపత్కర వింత పరిస్తితులలో ‘’అనువుగా పని చేస్తూ ఉండాలని కృషి చేస్తున్నారు .ఈ విషయం తెలుసుకొన్న హేంక్ ‘’బ్రహ్మాండం గా ఉంది మీ ఐడియా .మన మేనేజ్ మెంట్ కు ఈ విషయం వెంటనే తెలియ జేస్తాను .ఈ రహస్యం అంత దాకా మన ఇద్దరి మధ్యే ఉండిపోవాలి .బయటికి పొక్క నీయద్దు. నాఅనుమతి లేకుండా ఇంకెవరూ  ఈ ఐడియా పై  కృషి చేయ రాదు .’’అని ఆనందం గా భరోసా ఇస్తూ హెచ్చరికా  ఇచ్చాడు .

బఫర్ ఆఫర్లు

కంపెనీకి డిఫెన్స్ సర్వీస్ నుండి బఫర్ ఆఫర్లు వచ్చాయి .నౌకాదళాదికారి వచ్చి చూసి వెళ్ళాడు . ఈ సంస్థ  బాగు  కోసం ఇందులో పని చేసే కొందరిని డిఫెన్స్ సర్వీస్ లో కి  పంపించే ఉద్దేశ్యం   ఉన్నట్లు హేంక్  చెప్పాడు .వెళ్ళే వారిలో  టిండర్మాన్స్ నార్వేజియన్  లున్నారు .దీనితో రిసెర్చ్ లో టెంపో తగ్గి పోయింది .ఒక రోజు రామయ్య గారు ఆఫీస్ కు వెళ్లి తన తో పాటు పని చేస్తున్న అత్యంత సమర్ధులను ఎందుకు దూరం చేశారని అడిగారు .దేవాంతకుడు హేంక్ చిరునవ్వు చిద్విలాసం గా కనపరుస్తూ బాధ పడాల్సిన దేమీ లేదని ,వారికి ప్రత్యామ్నాయం గా కొత్త వారిని ఎంపిక చేసి వేస్తామని అన్నాడు .ఇక మాట్లాడాల్సింది దీనిమీద ఏదీ లేదన్నట్లుగా హేంక్ లేచి పోయాడు .బుర్ర తిరిగి పోయింది రామయ్యగారికి . తనతో నడిచి వస్తూ ఆపి రామయ్యగారితో హేంక్ ‘’నీకు ఒక విషయం రహస్యంగా చెప్పాలను కొంటున్నాను .నిన్ను నేనెలా చూస్తున్నానో నీకు తెలుసు .అందుకే నా మాటల్ని సీరియస్ గా తీసుకో .నువ్వు ఎక్కడెక్కడ ఎవరెవరితో తిరుగుతున్నావో మన మేనేజి మెంట్ దృష్టిలో కి వచ్చేసింది  .అయినా మనది స్వేచ్చా  స్వాతంత్రాలున్న దేశం  ఎవరి ఇష్టం వారిది .ఎవరూ అభ్యంతరం పెట్టరు .నీపనులకు అడ్డుకూడా పడరు .కాని ఇది నీ అభివృద్ధికి మంచిది కాదు అని చెబుతున్నాను .నేను నీకు అత్యంత ఆత్మీయ మిత్రుడిని కనుక ఇంత దూరం చెప్పాల్సి వస్తోంది .నిన్ను’’ లాల్ ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు’’ అని ఇప్పటిదాకా నన్ను అడిగిన మన బాస్ ‘’మన ఎర్రాయన ఎలా ఉన్నాడు’’ ?’’అని అడుగుతున్నాడు  అంటే, ఇక నువ్వే అర్ధం చేసుకో ‘’అని హేంక్  ‘’కమ్మీలతో’’పూసుకు తిరగటం మేనేజి మెంట్ దృష్టిలో పడింది అని హెచ్చరిక లాంటి సలహా ఇచ్చాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-4-15 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-9

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-9

న్యూయార్క్ లో పెట్రో కెమికల్స్ లో ఉద్యోగం

న్యూయార్క్ లో పెట్రో కెమికల్ బిజినెస్ లో బాగా అనుభవమున్న’’ L Sonne born sons inc’అనే ప్రైవేట్ సంస్థ వారు ఆహ్వానించి రామయ్యగారికి ఉద్యోగం ఇచ్చారు .ఈ కంపెనీ 1890 నుంచి ఉంది .రామయ్యగారికి లేబరేటరి బాధ్యతలు అప్పగించారు .అక్కడ పని చేస్తూ బ్రూక్లిన్ లో నివాసమున్నారు .ఇక్కడ రామయ్యగారి ముఖ్యమైన పని ఏమిటంటే తిక్సో ట్రోఫిని కొలవటం , మంచి నాణ్యమైన అడిటివ్ లనుకలిపి లూబ్రికంట్ ల జీవితకాలం పెంచటం .దీనికోసం ఆయన చాలా శ్రమ పడాల్సి వచ్చేది .ఇంజన్ లలోని భాగాలు ఘర్షణకు గురికాకుండా చేయటానికి ఇంజిన్ నిర్మాణాన్నే పూర్తిగా మార్చేశారు రామయ్య .ఇలా చేయకపోతే లూబ్రికంట్ ల వలన ఇంజిన్ లోపలి భాగాలు బాగా దెబ్బతిని పోతున్నాయని గ్రహించారు .ఇంజిన్ సునిసిత్వాన్ని కాపాడుతూ ,,లూబ్రికంట్ లోని పదార్ధాలను మార్చారు .దీనివలన ఇంజిన్ రొటేషన్ సామర్ధ్యం పెరుగు తుంది ,ఇంజిన్ భాగాలు దెబ్బ తీసే లూబ్రికంట్లు కాకుండా వాటి ఆయుస్సును పెంచే విధానాలను కనిపెట్టారు .ఈ పరిశోధనా ఫలితాలు చాలా ప్రోత్సాహకం గా ఉన్నాయి అందరూ అభినందించారు .కాని ఈ కంపెనీ రామయ్య గారి కృషి ఫలితాలన్నిటికి పేటెంట్ హక్కులు తీసుకో కుండా అలక్ష్యం చేసింది .ఒక్క మూడు ఫలితాలకు మాత్రమె పేటెంట్ హక్కులు పొందేట్లు చేసింది .పేటెంట్ హక్కు కోసం 1930 లో అప్లికేషన్ పెట్టినా మూడేళ్ళ తర్వాత కాని వాటిని పొందే అవకాశం రాలేదు .మొదటి పేటెంట్ హక్కు ‘’art of purifying petroleum sulphonic acids derived from the treatment of  mineral oils with sulphuric acid (17-10-1933)2-Petroleum sulphonic acids ,compositions containing them and the process for preparing them (21-11-1933) 3-Art of treating petroleum sludges (1-5-1934).

ఒక రష్యన్ స్నేహితుడు ఇచ్చిన కమ్యూనిస్ట్ మేని ఫెస్టో చదివారు .దాస్ కాపిటల్ నీ జీర్ణించుకొన్నారు .క్రమంగా తాను ఎర్రజెండా వైపు ఆకర్షింప బడుతున్నానా అని కొంచెం సందేహం లో పడ్డారు కూడా .రామయ్య గారు పని చేసే కంపెనీ యజమానుల్లో వా౦డర్ హేంక్ ఒకడు .ఆయన తో తరచూ కలిసి మాట్లాడేవారు .వాళ్లకి రామయ్యగారి సామర్ధ్యం తెలుసు .ఈయనకు ఉద్యోగం కావాలి .కాని ఆత్మా గౌరవం అంతకన్నా ముఖ్యం అనుకొనేవారు .హేంక్ రామయ్యగారికి కంపెనీలో అత్యున్నత పదవిస్తానన్నాడు .దానికి ఆయనే సమర్ధుడు అనీ అన్నాడు .తమకంపెనీ జెనరల్ మోటార్స్ కంటే వేగంగా పురోగమించాలని దిశా నిర్దేశామూ చేశాడు .రామయ్య గారి లాంటి మేదావి ,సమర్ధుడికి ఈ ఉద్యోగం ఇవ్వటం తమకంపెనీకి గర్వకారణం అని ఉబ్బేశాడు .రామయ్యగారి ఆలోచనలు వేరుగా ఉన్నాయని పసిగట్టాడు .ఆయనకు పని అవసరం అని గ్రహించాడు .తనను బాగా పూర్తిగా అర్ధం చేసుకోమన్నాడు. ఆయన ఎక్కడ పని చేస్తున్నా తన కన్ను ఒకటి ఆయన మీదే ఉంటుంది అనీ చెప్పాడు .

‘’  కాలమే డబ్బు ‘’అన్నసంగతి తనకు తెలుసనీ ,రామయ్యగారి ఫ్రెండ్ హషిమాటోతో లాంగ్వేజ్ ప్రాబ్లెం ఉందని ,అందుకని అతను వెళ్లిపోయాడని అన్నాడు .కొత్త లాబరేటరి ఏర్పాటు చేసి దానికి అన్ని సౌకర్యాలు కలిగించి అధిపతిని చేస్తానన్నాడు .రామయ్య గారి జోలికి వేరెవరూ రారని ,హాయిగా స్వతంత్రంగా పని చేసుకోవచ్చని చెప్పాడు .రామయ్య గారి దిసీస్ సమర్పించటానికి ముందుగా కొంత పని అప్పగిస్తానని ఆశ పెట్టాడు .ఒకటి రెండేళ్లలో అది పూర్తీ చేసుకోవచ్చు .ఇలా చాలా తెలివిగా వా౦డర్  రామయ్య గారితో ‘’మైండ్ గేమ్’’ ఆడాడు  .అన్నీ అర్ధం చేసుకొన్నారు రామయ్య .తన్ను ములగ చెట్టు ఎక్కి౦చేశాడని అర్ధమై పోయింది ..రామయ్య బాగుపడితే ఫర్మ్ కూడా బాగు పడ్డట్టే అన్నాడు .రామయ్య గారు వాండర్ వాల్ట్ తప్పేమీ లేదని అవన్నీ వ్యాపార లక్షణాలే నని గ్రహించారు .ఈ బెస్ట్ ఆఫర్ ను కాదనటానికి కొంత సమయం కావాలనుకొన్నారు రామయ్యాజీ .ఒక పక్క వాడు ఊరిస్తున్నాడు .ఇందులో దిగిపోతే తన అస్తిత్వానికే ప్రమాదం రావచ్చునని రామయ్య గారు సంశయిస్తున్నారు .పూర్తిగా ఔననీ చెప్పలేదు కాదనీ అనలేదు .తన జాతక చక్రాన్ని క్షుణ్ణంగా పరీక్షించి మాట్లాడిన మాటల్లా అనిపించాయి హేంక్ మాటలు .రామయ్య గారి మస్తిష్కం లో కాసేపు ఒక వెలుగేదో వెలిగింది .చివరికి ఆ కంపెనీ పెట్టిన అన్ని షరతులకు ఒప్పుకొని చేరటానికి  అంగీకరించారు సైంటిస్ట్ రామయ్య .

చిరకాల స్వప్నం అయిన పూర్తీ విజ్ఞానం ,డిగ్రీ ,లేబరేటరీ మూడు సమకూరుతున్నాయని సంతోషించారు .తన పరిశోధనలు భవిష్యత్తును ఎలా నిర్దేశిస్తాయో తెలీదు . .ఇది అంతా వాతాపి భోజనం లాగా ఉందా ?అని ఒక పక్క భయం .వాతాపి ఇల్వలుడు అనే రాక్షస సోదరులు దారికాచి యాత్రికులను ఇంటికి పిలిచి వాతాపిని కోసి కూరచేసి వడ్డించి అతిధి తినగానే ఇల్వలుడు ‘’వాతాపీ ‘’అని పిలవటం వాడు అతిధి పొట్ట చీల్చుకొని బయటికి రావటం అన్నదమ్ములిద్దరూ అతిధిని ఆరగించటం జరుగుతూ ఉండేది .వీరి బాధ భరించలేక అగస్త్యమునిని శరణు వేదారుజనం ఆయన కు కూడా ఇలానే అతిధి మర్యాద చేశారు ఆయన వాతాపిని తిన్న వెంటనే ‘’జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ‘’అన్నారు వెంటనే వాడు మహర్షికడుపులోనే చచ్చాడు .ఈ కద గుర్తుకొచ్చింది .ఇలాంటిదే ఇంకోరకమైన కదా విన్నారు రామయ్య .ఒక యాత్రికుడికి ఏ అనుమానం కలగా కుండా భోజనానికి పిలిచి ,రుచికర భోజనం పెట్టి ‘’కై కై ‘’అని అరిచి  అతిధిని తినేసే కద అది’’కై కై కద ‘’

సకల సౌకర్యాలతో లేబరేటరి

అన్నమాట ప్రకారం లేబరేటరీ ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసి రామయ్య గారికి స్వాధీనం చేసింది కంపెనీ .కస్టపడి పని చేసేవారు దొరికారు .అంతా అనుకోన్నట్లుగా సాగిపోతోంది .ఇక్కడ లెనిన్ చెప్పిన మాటలు ‘’it is easy to start a revolution in Russia  but will be more difficult to build socialism than in the developed countries of the West ‘’ జ్ఞాపకమోచ్చాయి .అక్కడ  రష్యాలో తిండిలేక ,పండించలేక జనం ఆల్లల్లాడి పోతుంటే ఇక్కడ అమెరికాలో వేలాది టన్నుల గోధుమను టన్నులకొద్దీ కాఫీ గి౦జలను  సముద్రం పాలు చేయటం ,కాలిఫోర్నియాలో అధికం గా పండిన ఆరంజ్ లను సముద్రం లో పారేయటం పేపర్లలో చదివి ఆశ్చర్య పోయేవారు రామయ్య .ఇక్కడ అదిక ఉత్పత్తి సమస్య. రష్యాలో ‘’ఉత్పత్తి లేమి ‘’సమస్య .ఇ౦త అధిక ఉత్పత్తి సాధించినా అమెరికాలో తిండీ ,బట్టా లేని నిర్భాగ్యులేందరో ఉన్నారని తెలుసుకొన్నారు .రవాణాకోసం బస్సులున్నాయి ట్రె యిన్లున్నాయి కానీ నిరంతర జన సందోహం తో అవి కిక్కిరిసి పోతున్నాయి . ముఖ్యమైన సైంటిఫిక్ సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారానికి రామయ్య బృందం అనుక్షణం పని చేస్తోంది .కంపెనీకి లాభాల వర్షం కురిపిస్తున్నారు .లాబ్  ఫలితాలు విజయ వంతంగా ఉన్నాయి .

 

‘’ఎర్ర ‘’ఆలోచనలు

న్యూ యార్క్ లో పరిచయమైన ఒక కమ్యూనిస్ట్ పెద్దాయన వలన ‘’కమ్యూనిస్ట్ స్టూడెంట్  సర్కిల్ ‘’ కు చేరువయ్యారు .త్వరలోనే చురుకైన పాత్ర వహించారు .మిగిలిన సర్కిల్స్ లో కూడా పని చేయమని వాళ్ళు కోరారు .తనకు  మార్క్సిజం మీద మాత్రమె  సానుభూతి  ఉందని ,తాను  కమ్మ్యూనిస్ట్ ను కానని తేల్చి చెప్పేశారు .వారు కమ్మ్యూనిజం హ్యూమనిజం కంటే గొప్పదని చెప్పారు .ఇది కొంత ప్రభావం కలిగించి కమ్య్యూనిజం గురించి చదివి ఇతరులకు బోధించసాగారు రామయ్య .ఏదీ శాశ్వతం కాదని, మార్పు  ప్రకృతి సహజమని గ్రహించారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-4-15 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-8

కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-8

రామయ్య పెళ్లికొడుకాయేనే-సీతారామయ్య పెళ్ళికొడుకాయేనే

యవ్వనం పుట్టించే ప్రకంపనాలను తట్టుకోవటం ఎవరి వశమూ కాదు .రామయ్య గారూ దీనికి అతీతులు  ఏమాత్రం కాదు .యూని వర్సిటి లో చేతిలో పెన్నీ లేకుండా చదువుకొంటున్న రోజుల్లో ,ఆయనకు నీడను అండనూ ఇచ్చింది సారా అనే అమ్మాయి .ఇద్దరు ఒకరికొకరు  అ౦కితమైపోయారు .ఒకర్ని విడిచి ఒకరు ఉండలేక పోయేవారు .అయితే ఇద్దరికీ మౌలిక  భావాలలో భేదాలున్నాయి .ఆమెకు పిల్లల్ని కనడం ఇష్టం లేదు. రామయ్యగారికి తన వారసుల్ని చూసుకోవాలనే గొప్ప ఆలోచన ఉంది .ఆమెను ఒప్పించటానికి శతధా ప్రయత్నించారు .కాని ఆమెను ఒప్పించ లేకపోయారు .ఆమె కూడా ఈయన్ని తనమార్గం లోకి లాక్కు రావాలని విశ్వ ప్రయత్నం చేసింది .కాని రామయ్య అంగీకరించ లేదు . ఇంతటి తీవ్ర విభేదం ఇద్దరి మధ్యా ఉన్నా వారి ప్రేమకు అంతరాయం కలగ లేదు.తరచుగా కలుసుకొంటున్నారు .పార్టీలకు హాజరవుతున్నారు .ఒకరికొకరు సాయ పడుతున్నారు .సారా ఒక ఆయస్కాంతమే అయింది ఆయన పాలిటి .ఇదివరకు కడుపు ఆకలి ఉండేది .ఇప్పుడు ప్రేమ ఆకలితో అలమటిస్తున్నారు .ఆపుకోలేక పోతున్నారు .మనసు స్థిరంగా ఉండటం లేదు .ఒక్క చోట నిలవ లేక పోతున్నారు .ఆమె తప్ప ఇంకెవర్నీ ఆయన ఇష్టపడలేదు .అంత గాఢమైన ప్రేమ  కద నడిచింది ఇద్దరి మధ్యా .ఏదో అజ్ఞాత శక్తి తమ ఇద్దరి మధ్యా ప్రేమకు కారణం అయి ఉంటుందని పించింది .’’ఆమె కన్నులలో అన౦తాంబరరపు నీలి నీడలు చూశారు రామయ్య .

సారా అంద గత్తేయే .ఆమె చేసిన సాయానికి ఏమిచ్చినా సరిపోదని భావించారు .సాధారణ అమెరికా అమ్మాయే ఆమె .కాని తనకు మాత్రం ఊర్వశీ ప్రేయసీ అనిపించింది .ప్రేమకున్న జబ్బు ఇదేనేమో?ఆమెలోని స్త్రీత్వం ఆయనకు  పరమాకర్షణ అయింది .ఒక్కోసారి ఆమె తనకు అందనంత ఎత్తులో ఉన్నట్లు అనిపించేది .కనిపించి మురిపించి మరిపించేది .ఆమె తోడిదే స్వర్గం అనిపించేది .తనకంటే ఆమె చాలా పెద్దదే .’ఆమెలో భారతీయత లేదు .కాని ఆమె ఆయనతో ‘’నాలో ఇండియా అంతా ఉంది  .నువ్వు నాలోనే ఉన్నావు ‘’అనేది .తాను  నల్ల రామయ్య .ఆమె తెల్ల సీత .ఆయన్ను తన నల్ల కృష్ణుడు అనేది .తనకు పిల్లలు కావాలి ఆమెకు ఆ యావే లేదు .ఇదీ మౌలిక భేదం .పిల్లలు పుడితే ఎలా పెంచగలం ఈ బీదరికం లో అని ప్రశ్నిస్తే ఆయన దగ్గర సమాధానం లేదు. నెమ్మది నెమ్మదిగా డబ్బు వచ్చిచేరుతోంది .కాని ఆమె మనసు మార లేదు .ఈ విషయాన్ని యాభై ఏళ్ళ తర్వాత గుర్తుకు తెచ్చుకొని రామయ్య గిల్టీ గా ఫీలయ్యారు .ఆ ఇద్దరి మధ్యా క్రమంగా భేదాలుపెరిగాయి .కాని ఆమె తనది అనే గర్వం ఉండేది .

సారాను రామయ్య వివాహం చేసుకొన్నారు . స్తైఫ౦డ్ వచ్చి డబ్బు ఇబ్బంది తీరుతోంది .సారాకు కూడా రామయ్యగారిలా సంగీతం అంటే ఇష్టం .బీతొవెన్ సంగీతం రామయ్య గారికి మహా ఇస్టమైపోయింది కచేరీలకు వెళ్ళేవారు .మద్రాస్ చదువులో పొందిన మార్కులు రామయ్యగారికి ఇక్కడ ప్లస్ అయింది .ఒక ఏడాది ముందే చదువు పూర్తయింది. పొన్నాంబలం ఇంకో ఏడాది చదవాల్సి వచ్చింది .భార్యా భర్తల విషయం లో కోపెంహాన్ చెప్పినమాటలు తరచుగా రామయ్యగారికి జ్ఞాపకం వచ్చేవి .’’the relationship of husband and wife is a system in which each of the two elements work only through the medium of the other ‘’.తానూ సారా విడిపోయినా ,మానసికం గా కలిసే ఉంటామని పించింది .సారా ఇండియన్ వంటలు నేర్చుకొని చేసేది .

ఉద్యోగానికి  ఆహ్వానం –పేటెంట్లు స్వంతం

డిప్లొమా చేతికి రావటం తో బాటు లూబ్రికేంట్స్ తయారు చేసే ఒక ప్రఖ్యాత సంస్థ నుంచి మంచి జీతం ,అధికమైన అవకాశాలతో ఉద్యోగానికి ఆఫర్ వచ్చింది .అప్పటికే రెండు పేటెంట్లు రామయ్యగారికి దక్కాయి .మొదటిది తిక్సోట్రఫి కొలిచే పద్ధతిలో ఒకటి ,రెండోది    మోటార్ ఆయిల్ జీవితాన్ని పెంచే విధానం లో రెండోది  పేటెంట్ హక్కులు పొందారు .ఇవి ఆయనకు సంతోషం కలిగించాయి .కాని సారా ప్రవర్తన మాత్రం అర్ధం కావటం లేదు .ఆమెలో మార్పు గమనిస్తున్నారు .ఒక సారి ఇండియాకు వెళ్లి రావాలని రామయ్యగారికి అనిపించి భార్య సారాను కూడా తనతో రమ్మన్నారు. ఆమె దానికేమీ సమాధానం చెప్పలేదు .ఆమె తలిదండ్రులు ఆమెను ప్రలోభ పెడుతున్నట్లని పించింది .సామాను తీసుకొని బయటికి వస్తుంటే ఆమె అడ్డుకోన్నది .వదిలి వెళ్ళే సాహసం చేయ లేకపోయారు .ఇండియాకు వెళ్లి పొలం లో మళ్ళీ కందా ,పెందలాలు పండించాలా ?అని ప్రశ్నించుకొన్నారు .’’the dollar is the murderer of the human soul ‘’అని  ఒక రష్యా మిత్రుడు అన్నదానిపై వితర్కి౦చుకోనేవారు  .కమ్యూనిస్ట్ సాహిత్యం పై అభిమానం పెరిగి మార్క్స్ ను చదివారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-4-15 ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మన నయాగరా ‘చిత్రకూట్‌’..

మన నయాగరా ‘చిత్రకూట్‌’..

పరవళ్లు తొక్కుతూ కిందకు దూకే జలపాతం.. రుతువు రుతువుకు రంగులు మార్చే జలపాతం.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నయాగరా జలపాతాన్ని పోలి ఉండే జలపాతం..దేశంలోనే అతి వెడల్పైన జలపాతం..ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఆ జలపాతమే ఛత్తీ్‌సఘడ్‌లోని ‘చిత్రకూట్‌ వాటర్‌ఫాల్స్‌’…

చుట్టూ కొండలు..దట్టమైన అరణ్య ప్రాంతం..ప్రకృతి ఒడిలో గలగల పారుతున్న నదిలో పడవ ప్రయాణం..కనువిందు చేసే జలపాత అందాలు… ఎంతో రమణీయం ఆ ప్రదేశం. ఛత్తీ్‌సఘడ్‌లోని జగ్దాల్‌పూర్‌కి 50 కిలోమీటర్ల దూరంలో చిత్రకూట్‌ జలపాతం ఉంది. వింధ్య పర్వత శ్రేణుల్లో పరుగులు పెట్టే ఇంద్రావతి నది నుంచి ఈ జలపాతం ఏర్పడింది. దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి నీటి ధారలు పడుతుంటాయి.

– జలపాతాలు చూడటానికి గుర్రపు డెక్క ఆకారంలోనే ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది.

– వేసవి కాలంలో నీరు ఎక్కువగా ఉండకపోయినప్పటికి వర్షాకాలంలో జలపాతం హోరున శబ్దం చేస్తుంటుంది. వర్షం వెలిశాక నీటి ధారలపై ఇంద్రధనుస్సు రంగులు పడడంతో జలపాతం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వర్ష రుతువులో ఈ జలపాతం దాదాపు 1000 అడుగుల వెడల్పుతో పరవళ్లు తొక్కుతుంది. ఈ జలపాత అందాలు చూడటానికి సరైన సమయం వర్షాకాలం. జోరుగా వానలు కురవడంతో చుట్టూ ఉన్న అరణ్య ప్రాంతం కొత్త చివుళ్లు తొడుక్కొని పచ్చ రంగు పులుముకుంటుంది. ఆహ్లాదకర వాతావరణానికి తోడు రకరకాల పక్షులు జలపాత పరిసరాల్లో సందడి చేస్తుంటాయి. వర్షపు నీళ్లు మట్టితో కలవడం వల్ల జలపాతం ఎర్ర రంగులోకి మారుతుంది.
– చిత్రకూట్‌ జలపాతానికి ఏ రుతువులోనైన వెళ్లవచ్చు. కానీ జూలై నుంచి అక్టోబర్‌ మధ్య కాలంలో ఎక్కువ నీటితో జలపాతం మరింత అందంగా కనిపిస్తుంది.
– సూర్యుడు మనకు గుడ్‌ మార్నింగ్‌, బై బై చెప్పే సమయాల్లో అంటే ఉదయించే, అస్తమించే సమయాల్లో జలపాతం అందాలు చూడడం నయన మనోహరం. ఇంకా చెప్పాలంటే అద్భుతమనే చెప్పాలి.
– వర్ష రుతువులో ఎర్రగా మారిన నీళ్లు శీతాకాలం వచ్చే సరికి పాలలాంటి తెలుపుతో కిందకు దూకుతుంటాయి.
– ఈ జలపాతానికి సమీపంలో శివాలయం, పార్వతి గుహలు కూడా ఉన్నాయి. జలపాతం తీరంలో అనేక చిన్న చిన్న శివలింగాలు, త్రిశూలం, వినాయక, శివ విగ్రహాలున్నాయి.
–  సహజ సిద్ధమైన ఈ జలపాతాన్ని ప్రభుత్వ పర్యాటక శాఖ పర్యాటక స్థలంగా తీర్చిదిద్దింది. పర్యాటక శాఖనే ప్రత్యేకంగా ఓ హోటల్‌ని ఏర్పాటు చేయడంతో పాటు, పిల్లల కోసం పార్కులు కట్టించింది. రాకపోకల కోసం రోడ్లు బాగు చేయించింది. సందర్శకుల కోసం చిన్న చిన్న కుటీరాలను ఏర్పాటు చేసింది.

– చిత్రకూట్‌ వాటర్‌ఫాల్స్‌ని చూడటానికి మన దేశంతో పాటు, విదేశీ సందర్శకులు కూడా వేల మంది
వస్తుంటారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆ వయసులో స్వీయ జ్ఞానం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనంతమూర్తిగారిది నిలువుటద్డం లాంటి మూర్తి మత్వం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎవరిది లోపం ?ఎవరిది కుట్ర?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మరోఫెర్గూసన్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముంగిట్లో భూకంపం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-7

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-7

అంతర్జాతీయ మిత్ర బృందం

గ్రేట్ లేక్స్ అంటే ఉత్తర అమెరికాలో ఉన్న 1 లేక్ సుపీరియర్ ,2 లేక్ యీరీ ,3మిచిగాన్- 4యూరాన్  5 ఒంటారియో లను గ్రేట్ లేక్స్ అంటారు . ఈ అయిదు  మంచి నీటి సరస్సులు .ప్రపంచం లోని మంచి నీటిలో లో ఇరవై ఒక్క శాతం మంచినీరు వీటిలోనే ఉంది .94,250చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం లో ఇవి వ్యాపించి ఉన్నాయి .వీటిని ‘’ఐలాండ్ సీస్’’ అనీ పిలుస్తారు . సెలవల్లో రామయ్యగారు వీటిని సందర్శించి వచ్చేవారు .వీటిని చూసిన మధురానుభవం జీవితానటం గుర్తుండిపోయింది .యూరోపియన్ స్నేహితులు ఏర్పడ్డారు .తానూ ,పొన్నాంబలం హిందువులు .ఒకజపాన్ హషిమోటో  మిత్రుడయ్యాడు .ఇతను బక్కగా ఉన్నా రామయ్యగారికంటే ఎక్కువ బరువులు మోసేవాడు .శరీరాన్ని తీగలాగా వంచే సామర్ధ్యం అతనికి ఉండేది .కనుక వీరంతా కలిస్తే అంతర్జాతీయ బృందమేగా ! జపాన్ వాళ్లకు స్నేహితుడు అంటే చాలా విలువైన వాడి గా భావించి గౌరవిస్తారని అతనే చెప్పాడు .చాలా సున్నితమైన రసాయన పరికరాలను ఎంతో నైపుణ్యంగా ఉపయోగించటం చూసి రామయ్యగారికి ఆశ్చర్యమేసేది .ప్రయోగాలను వంట చేసినంత తేలికగా చేసేవాడు .ఒక సర్జన్ లాగా ఖచ్చితమైన నిర్ణయాలు చేసేవాడు . అందరూ విభిన్న భాషలు అట్లాడేవారు .అందరికి అర్ధమయ్యే ఒక సామన్య భాష ఉంటె యెంత బాగుంటుందో అనుకొనేవారు .అమెరికా విద్యార్దులకంటే వంద శాతం ఎక్కువ కస్టపడి చదవాలి అనుకునేవారు రామయ్య .

రామయ్య మాస్టర్ ఆఫ్ సైన్స్

ఫిజిక్స్ ,కెమిస్ట్రీ లలో  మూడు అదనపు మేజర్స్  పూర్తీ చేసి ‘’పాత్స్ ఆఫ్ ఆటమ్స్’’ అనే దిసీస్ రాసి ఆమోదాన్ని పొంది౦పజేసుకొన్నారు .దీనితో 10-6-1924న అంటే 25 ఏళ్ళ వయసులోనే కెమిస్ట్రీ లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని అందుకొన్నారు .ఆ యూని వర్సిటీలో ఉన్న ప్రోఫెసర్లలో కొందరు రామయ్యగారి సునిసిత మేధా  సంపత్తిని చూసి ఆశ్చర్య పోయేవారు .ఆయనలో ఉన్న తెలుసుకోవాలన్న తపనకు మరీ అభిమానం చూపించారు .చాలా దరిద్రం అనుభవిస్తూ ,దాదాపు ఒంటరి పోరాటం చేస్తూ విద్యలో ఇంత ఎదుగుదల సాధించటం అసాధారణం అబ్బురం  .

ఇంట్లో పల్లకి మోత బైట ఈగల మోత

లాగా  ఉంది ఆయన పని .విద్యా వ్యాసంగం లో అత్యున్నత శ్రేణి సాధిస్తున్నా కడుపు నిండా తిండికి ఇబ్బందిపడేవారు .ఏదో ఒక షాపులో  ‘’పాకర్ గా ,హోటల్ లో డిష్ వాషర్(అంట్లు తోమటం) బరువులు ఎత్తటం దించటం వగైరా పనులు చేసి డబ్బు సమకూర్చుకోనేవారు .చికాగో యూని వర్సిటి ఇచ్చిన మాస్టర్ దిగ్రీకాని ఆయన అద్భుతమైన తెలివి తేటలుకాని రామయ్య గారి జీవితం లో మార్పేమీ తేలేదు .బలవంతం మీద బతుకుతున్నారు .బతకాలి కనుక తింటున్నారు .అదీ  ఆ మేధావి దీన స్థితి . మాసాచూసేట్స్ లో ఉన్న  వినియార్డ్ హావన్ లోని  సెవెన్ గేట్స్ ఫారం లో పనిచేశారు .కొలంబియా యూని వర్సిటి  గ్రాడ్యుయేట్ స్కూల్ లో 1925 లో కొన్ని కోర్సులు చేశారు .ఎన్ని పేరు ప్రఖ్యాతులోచ్చినా అమెరికన్ల దృష్టిలో ‘’ఒక బిచ్చ గాడుగ ,ఒక దిగంబర సన్నాసి ‘’గానే ఉండిపోయారు .సంపాదించిన డబ్బులన్నీ పుస్తకాలు కొనుక్కోవటానికి ,అప్పులు తీర్చటానికే సరి పోయేవి .ఇక బట్టల సంగతి చూసే పనే లేదు పాపం .ఉండటానికి జానెడు స్థలమూ లభించని స్థితి .ఎప్పుడూ ఆకలితో నకనక లాడి పోతూ ఉండేవారు .దేశ దిమ్మరిలాగా రాత్రుళ్ళు పార్కుల వెంట ,వీదుల వెంట తిరుగుతూ ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడ పడుకొనేవారు .అదృష్టవశాత్తు ఎన్నడూ పోలీసుల కంట బడలేదు .అందుకని క్లాసుల్లో చెప్పే విషయాలు అర్ధం చేసుకోవటం కష్టంగా ఉండేది .తనకేమీ అర్ధం కావటం లేదన్న భావం ఏర్పడింది .అంతా గందర గోళం గా ఉండేది .ఆ తర్వాత ప్రతి విషయం ఫొటోగ్రాఫిక్ మెమరీ లా ఉండిపోయింది .కాలీజీలో మాత్రం దీనికి భిన్నంగా ఉండేది .నిద్రమత్తు ,అలసట ,నీరసం కమ్మేసేవి .శరీరం లో ఉన్న సర్వ శక్తులూ ఖాళీ అయిపోయినట్లు అని పించేది .సరిగా లేచి నిలడలేనంత నీరసం ఆవహించేది .ఇన్ని వ్యతిరేక పరిస్తితులున్నా ‘’బతకాలి ,ముందుకు వెళ్ళాలి చదువు పూర్తీ చేయాలి ‘’అన్నవే ఆయన్ను నిలబెట్టాయి .గమ్యానికి చేర్చాయి .అయినా తానిప్పుడు  అమెరికా వాడి నేగా అనే భరోసా వచ్చింది .                                 .           పి. హెచ్ .డి.రామయ్య

ఇతాకాలో ఉన్న కార్నెల్ యూనివర్సిటి లో ను న్యూయార్క్ లోను పి హెచ్ డి ప్రోగ్రాం కు అర్హత పొంది, చేరారు .ఆ ఏడాది అక్టోబర్ 12 ఫాల్ టర్మ్ నుండి మరుసటి ఏడాది ఫాల్ టర్మ్ వరకు ఫిజికల్ కేమిస్ట్రి లో ప్రధాన విషయాలపై వైల్డర్ .డి.బ్రాన్ క్రాఫ్ట్ అనే ప్రొఫెసర్ తో కలిసి పని చేశారు .రామయ్యగారు ‘’ఆప్టికల్ కేమిస్ట్రి’’ని ప్రొఫెసర్ జే .పాపిష్ రామయ్య గారిలో అద్భుతమైన స్పార్క్ ఉందని గ్రహించటమేకాడు బయటికి చెప్పాడుకూడా .ఎఫ్ కే రిచ్ మేయర్ దగ్గర మొదట్లోను, తర్వాత ప్రొఫెసర్ ఆర్ గిబ్స్ దగ్గరా ఫిజిక్స్ లో పనిచేశారు . ఇప్పుడు రామయ్య గారు అమెరికన్ .కార్నెజీ వాళ్ళ ఫండ్ తో స్కాలర్ షిప్ వచ్చింది .తీసుకోవటానికి వెనకాడాల్సిన పనిలేదని తానూ అమెరికనే కనుక అర్హత మీద వచ్చిందని సంతృప్తి, సంతోషం పొందారు  బాన్ క్రాఫ్ట్ ,పాపిష్ ,రిచ్మేయర్ తో కూడిన .స్పెషల్ కమిటీ రామయ్య గారి ప్రోగ్రెస్ ను అన్ని కొణాలలోను క్షుణ్ణంగా పరీక్షించి పి .హెచ్. డి .పొందటానికి అన్ని విధాలా అర్హులని  తేల్చి చెప్పింది .దాన్ని పొందటానికి కావలసిన ఏర్పాటు చేసుకోమని సూచించింది .

పొట్ట ని౦పు కోవటానికి ఇప్పటికీ రామయ్య గారు కష్టపడుతూనే ఉన్నారు .ఒక ఫాక్టరీలో  ‘’ఫర్నేస్ మాన్ ‘’ గా  ఆ తర్వాత ఒక ప్రొఫెసర్ గారి  గార్డేనర్ (తోటమాలి )గా పని చేస్తూ కోల్ సెల్లార్ కు అతి దగ్గరగా ఉన్న  చిన్న గదిలో ఉంటూజీవించారు. రోజు రోజుకూ పరిస్తితులు దుర్భరమే అయ్యాయికాని బాగు పడిన పాపాన పోలేదు .అనివార్య పరిస్తితులలో 1927 స్ప్రింగ్ టర్మ్ కు కార్నెల్ వెళ్ళలేక  డిగ్రీ పూర్తీ చేయ లేకపోయారు .అంతటి భయానక పరిస్తితులను జీవితం లో రామయ్య గారు ఎదుర్కొన్నారు .అదేకాదు కార్నేల్ లో ప్రారంభించిన అయన స్వంత మొట్టమొదటి పరిశోధన  .’’the scattering of light in fogs ‘’  ను కూడా పూర్తీ చేయలేకపోయారు .రాష్ట్రాలన్నీ తిరుగుతూ సేల్స్ మాన్ వ్రుత్తి చేస్తూ సంపాదించి 1928 లో మళ్ళీ యూని వర్సిటీలో చేరారు .అందరికంటే ఒక ఏడాది ముందే పి హెచ్ డి అందుకొన్నారు .దానితో బాటు ఒక మంచి సంస్థ నుంచి ఉద్యోగం ఆఫర్ కూడా అందుకోవటం విశేషం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-4-15 –ఉయ్యూరు

https://sarasabharati-vuyyuru.com/?s=%E0%B0%AE%E0%B1%8B%E0%B0%9F%E0%B0%BE%E0%B0%B2%E0%B0%9C%E0%B0%BF+%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A4

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

27-4-15 సోమవారం మేము ముగ్గురం చేసిన కాకినాడ ,ఉప్పాడ ,యానాం ,దాక్షారామం ,ర్యాలీ ,తణుకు ట్రిప్ చిత్రాలు

27-4-15 సోమవారం మేము ముగ్గురం చేసిన కాకినాడ ,ఉప్పాడ ,యానాం ,దాక్షారామం ,ర్యాలీ ,తణుకు ట్రిప్ చిత్రాలు

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

కిరికిరి నాయుడు పొమ్మంటే పోడు -వెలమదొర కెసిఅర్


People (2)
gabbita prasad's profile photo
gabbita prasad

Family

https://plus.google.com/u/0/_/streamwidgets/canvas

Show details

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రక్షించాలేదు కాబట్టే భక్షించింది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గల్ఫ్‌లో ఉచిత భోజనం

గల్ఫ్‌లో ఉచిత భోజనం

గల్ఫ్‌లో ఉన్న భారతీయుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నాలుగు డబ్బులు సంపాదించాలనే ఆశతో అక్కడికి వెళ్లిన వారు కడుపు మాడ్చుకుని బతుకులు వెళ్లదీస్తుంటారు. ఎప్పుడైనా కమ్మని భోజనం వైపు మనసు లాగినా పేదరికం గుర్తొచ్చి ఆగిపోతారు. అయితే ఇలాంటి వారి కోసమే ఖతార్‌లో ఓ భారతీయుడు రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ఒకవేళ నిజంగా భోజనానికి డబ్బులు లేకపోతే ఈ రెస్టారెంట్‌కు వెళ్లి ఉచితంగా భోజనం చేయొచ్చు. దోహకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండస్ట్రియల్‌ ఏరియాలో వర్క్‌షాపులు, ఫ్యాక్టరీలు ఉంటాయి. ఇక్కడ తక్కువ ధరలో వసతి లభిస్తుంది. కర్మాగారాల్లో పనిచేసే భారతీయులు ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడే జైకా పేరుతో ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించారు షాదాబ్‌ ఖాన్‌. న్యూఢిల్లీకి చెందిన ఇతను 13 ఏళ్లుగా ఖతార్‌లో ఉంటున్నాడు. పనికోసం ఖతార్‌ వచ్చినపుడు షాదాబ్‌ కూడా ఎన్నో కష్టాలనెదుర్కొన్నాడు. అక్కడ పనిచేస్తున్న కార్మికుల కష్టాలు ఆయనకు బాగా తెలుసు. అందుకే ఉచిత భోజనం ప్రారంభించాడు. ఆయన రెస్టారెంట్‌ వారంలో ఏడు రోజులు, 24 గంటలు ఓపెన్‌ చేసే ఉంటుంది. ధరల విషయానికొస్తే ఫిష్‌ కర్రీ 6 రియాల్స్‌, ఎగ్‌రోస్ట్‌ 3 రియాల్స్‌, పాలక్‌ పన్నీర్‌ 10 రియాల్స్‌ ఉంటుంది. అయితే ఇది చెల్లించే స్తోమత ఉన్న వారికే. చెల్లించలేమనుకుంటే ఉచితంగా తినొచ్చు.

భారీ కర్మాగారాల్లో పనిచేసే పేదలకు ఈ ఉచిత భోజనం ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. గల్ఫ్‌ దేశాల్లో లక్షల మంది భారతీయులు కార్మికులుగా పనిచేస్తున్నారు. చాలా మంది లేబర్స్‌కు నెల వేతంనం 800 నుంచి 1000 రియాల్స్‌ వరకు ఉంటుంది. ఇందులో నుంచి మంచి భోజనం చేయాలంటే కష్టమే. అందుకే వీరి వెతలు గమనించిన షాదాబ్‌ ఖాన్‌ రెస్టారెంట్‌లో ఉచిత భోజనం పెట్టాడు. ఉచిత భోజనం ఎవరు ఎక్కువ అడుగుతున్నారని షాదాబ్‌ని ప్రశ్నిస్తే ఇండియా, నేపాల్‌, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన నిర్మాణరంగ కార్మికులేనని అంటున్నాడు. పేదల కోసం ఉచిత భోజనం పెడుతున్న షాబాద్‌కు హ్యాట్సాఫ్‌ చెబుదామా!

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నిరంకుశ నిజాం కు ప్రశంసలా ?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మృత్యు విలయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యు ఏ అనంత మూర్తి గారి మరణం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఈ గూర్ఖాలు చాలా గ్రేట్‌

ఈ గూర్ఖాలు చాలా గ్రేట్‌

మాతృభూమి రుణం తీర్చుకునే దేశ రక్షకులు… ప్రాణాలకు తెగించి పోరాడే యుద్ధ వీరులు.. ‘పిరికివాడిగా బతకడం కంటే చావడమే మేలు’ అని నినదిస్తు.. దేశ సేవలో తరిస్తున్న నిజమైన హీరోలు.. ‘గూర్ఖా రైఫిల్స్‌’. ఇండియన్‌ ఆర్మీలో భాగమైన ‘గూర్ఖా రైఫిల్స్‌’(జీఆర్‌) 2 శతాబ్దాలుగా మాతృభూమి రక్షకులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌ 24న 200 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా వారి గురించి మీకోసం..

ఈస్ట్‌ ఇండియా కంపెనీ 1815వ సంవత్సరం, ఏప్రిల్‌ 24న గూర్ఖాలను తొలిసారిగా నియమించింది. బ్రిటీ షర్స్‌ పరిపాలనలో ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో పాల్గొని శత్రువుల్లో వణుకు పుట్టించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం గూర్ఖాలను యథావిధిగా కొనసాగించింది.
–  ప్రస్తుతం భారత దేశంలో ఏడు గూర్ఖా రెజిమెంట్లు లేదా రైఫిల్స్‌ (1,3,4,5,8,9,11) ఉన్నాయి. ప్రతి రెజిమెంట్లో 5 లేదా 6 బెటాలియన్లు ఉంటాయి. ప్రతి బెటాలియన్లో 800 మంది సైనికులుంటారు.
–  ఏడు రెజిమెంట్లలో దాదాపు 30,000 మంది గూర్ఖాలు సేవలిందిస్తున్నారు. సైనికుల్లో 65 శాతం మంది నేపాలీ నుంచే వసున్నారు. 35 శాతం మంది సైనికులు డార్జిలింగ్‌, డెహ్రడున్‌, ధర్మశాల, ఇంకా ఇతర ప్రదేశాల నుంచి వస్తున్నారు.

– 1814-16 సంవత్సరాల్లో ఆంగ్లో నేపాల్‌ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గూర్ఖాల పరాక్రమం చూసిన బ్రిటీష్‌ వాళ్లు గూర్ఖాలను ‘బ్రిటీష్‌ ఇండియన్‌ ఆర్మీ’లో భాగం చేశారు.
–  ప్రస్తుతం ‘గూర్ఖా రైఫిల్స్‌’గా కొనసాగుతున్నా ఇంతకు ముందు దీన్ని ‘నుస్సిరీ రెజిమెంట్‌’ అని పిలిచేవారు.
– భారతదేశం స్వాతంత్య్రం పొందాక 1,3,4,5,8,9 రెజిమెంట్లకు చెందిన ఆరు గూర్ఖా రైఫిల్స్‌లను ఇండియన్‌ ఆర్మీలో భాగం చేసుకోగా, 2,6,7,10 జీఆర్‌లు బ్రిటీష్‌ ఆర్మీలో బ్రిగేడ్స్‌గా సేవలందిస్తున్నాయి.
– ఆర్మీలో చాలా కీలకమైన పాత్రను వీరు పోషిస్తారు. 1962 సంవత్సరం లడఖ్‌లో జరిగిన యుద్ధంలో, 1965,1971 సంవత్సరాల్లో జమ్మూకశ్మీర్‌లో జరిగిన యుద్ధాల్లో శత్రువులను మట్టుపెట్టి వీరులుగా నిలిచింనందుకు యుద్ధ పురస్కారాలు పొందారు. భారత్‌ – శ్రీలంకల మధ్య శాంతిని నెలకొల్పడంలో కూడా వీరి పాత్ర హర్షణీయం.
– 3 పరమ వీర చక్ర, 33 మహా వీర చక్ర, 84 వీర చక్ర వీరి ఖాతాలో ఉన్నాయి. గూర్ఖాల శౌర్యానికి ఇవి ప్రతీకలుగా నిలుస్తాయి.
– గూర్ఖా రైఫిల్స్‌కు చెందిన ప్రతి సైనికుడు దగ్గర ‘ఖుక్రీ’ అనే ఆయుధముంటుంది. ఖుక్రీ అనేది నేపాలీకి చెందిన ఒక రకమైన ఖడ్గం.
–  గూర్ఖాలంతా గోర్ఖలి భాషలోనే మాట్లాడుతారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికాలో మన రేడియో

అమెరికాలో మన రేడియో

ఎన్నో ఆశలు, ఆశయాలతో రెక్కలు కట్టుకుని తెల్లదేశం వెళ్లిన వలసపక్షులు వాళ్లు. తమ

బతుకేదో తాము బతుకుతూ నాలుగు డాలర్లు వెనకేసుకుని.. పెళ్లాం పిల్లలతో సుఖంగా
జీవించాలని మాత్రమే అనుకోలేదు. అమెరికా వెళ్లాక ఒక్కసారి వెనక్కి తిరిగి మాతృదేశం
వైపు చూశారు. దేశం మనకు ఎన్నో ఇచ్చింది. మనం తిరిగి ఆ దేశానికి గోరంత అయినా ఇవ్వకపోతే జీవితానికి సార్థకత ఏముంటుంది? అన్న అంతర్మథనం మొదలైంది. అందులో నుంచి వచ్చిన ఆలోచనే www.nrisamay.com అన్న ఆన్‌లైన్‌ రేడియో. దాని నిర్వాహకులు శ్రీహరి అట్లూరి, శ్రీకాంత్‌ కొచ్చర్లకోట..ముచ్చటించిన విషయాలే ఇవి..

శ్రీహరి : ‘‘మాది మండపేట. నాన్న శివరామకృష్ణయ్య ఒక ఫర్టిలైజర్‌ కంపెనీలో పనిచేసేవారు. ఆయన ఉద్యోగరిత్యా కాకినాడ, తిరుపతి, విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల్లో చదువుకోవాల్సి వచ్చింది. విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ పూర్త చేశాక.. ఎంఎస్‌ చేయడానికని అమెరికా వచ్చాను. ఇక్కడ ఉద్యోగం చేస్తూనే ఎంబీఏ కూడా పూర్తి చేశాను. మేమిప్పుడు లాస్‌ ఏంజిల్స్‌లో ఉంటున్నాము. నా భార్య అర్చన. మాకు ఇద్దరు కూతుళ్లు అమూల్య, సిరి.
మన దేశంలో ఎన్నో సమస్యలు. ఈవ్‌టీజింగ్‌, రైతుల ఆత్మహత్యలు, పిల్లలకు చదువు లేకపోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడున్నాయి. వీటన్నిటికీ రాత్రికి రాత్రే పరిష్కారం దొరకదు. ఇప్పుడున్న మీడియా కూడా అన్ని సమస్యల మీద దృష్టి సారించడం లేదు. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలే బ్రేకింగ్‌ న్యూస్‌లు అవుతున్నాయి. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ కొట్టిన క్రీడాకారుని జీవితకథను ఆసక్తిగా చూపించకపోయినా.. ఇటువంటి రాజకీయ వార్తలకే ప్రాముఖ్యం పెరిగిపోయింది. అమెరికాలో ఉంటున్న మాలాంటి వాళ్లం మన దేశానికి ఏదో ఒకటి చేయాలన్న పట్టుదల పెరిగింది. అదే సమయంలో తెలుగువాళ్లు అందరు కలిసి బే ఏరియాలో దండిమార్చ్‌ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే.. నేను కూడా వెళ్లాను. అక్కడ నాకొక స్నేహితుడు పరిచయం అయ్యాడు. అతని పేరు శ్రీకాంత్‌ కొచ్చర్లకోట.

ఆ సంఘటనతోనే ఆలోచన..

శ్రీకాంత్‌ : నేను చెన్నైలోని కల్పక్కంలో పుట్టాను. తిరుపతి, విజయవాడల్లో చదివాను. అనంతపురంలోని జెఎన్‌టియులో ఇంజనీరింగ్‌ చదివాను. 2007లో అమెరికా వచ్చాను. భార్య సింధు, కూతురు సరయులతో కలిసి లాస్‌ఏంజిల్స్‌లో ఉంటున్నాను. ఇక్కడికి వచ్చిన తరువాత – మన దేశాన్ని బయటి నుంచి చూసే అవకాశం దొరికింది. మన దేశంలో ఎన్నో సమస్యలు. వాటన్నిటికీ పరిష్కారం చూపలేము. అయితే వెలుగులోకి తీసుకురావచ్చు. చర్చకు పెట్టొచ్చు. ఇటువంటి ఆలోచనల్లో భాగంగానే – బే ఏరియాలో దండిమార్చ్‌ను నిర్వహించాము. అందులో భాగంగా కవరేజ్‌ ఇవ్వమని అడిగేందుకు అక్కడున్న ఒక మీడియా ప్రతినిధి వద్దకు వెళ్లాను. మాది ప్రజా ఉద్యమం కవర్‌ చేయండి అనడిగితే ‘‘మీది మంచి కార్యక్రమం. ఇది ఎయిర్‌టైమ్‌. డొనేషన్లు భారీగానే వస్తాయి. వచ్చిన మొత్తంలో మీడియాకు కూడా కొంత కేటాయిస్తే.. మీకు ఆశించిన కవరేజ్‌ వస్తుంది’’ అని చెప్పి పంపాడు. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు.
 

ఆన్‌లైన్‌ రేడియో పెట్టాలనుకున్నాం..

శ్రీహరి : దండి మార్చ్‌లో శ్రీకాంత్‌ను కలిశాను అని చెప్పాను కదా! మేము చాలా విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు.. ప్రజల సమస్యలను ఎంతమంది పట్టించుకున్నా ఇంకా మిగిలే ఉన్నాయనిపించింది. మనలాంటి వాళ్లు చేయాల్సింది ఎంతో ఉంది అన్నది మా ఇద్దరి ఆలోచన. మంచి పని చేసేవాళ్ల గొంతును కూడా వినిపించాలి అన్న తాపత్రయం కూడా కలిగింది. ఇద్దరం మాట్లాడుతున్నప్పుడు.. మనమే ఒక మీడియాను పెడితే ఎలా ఉంటుంది? అనుకున్నాము. కాని అప్పటికి మా వద్ద అంత డబ్బు లేదు. మా దగ్గరున్న కొద్దిపాటి ఆర్థిక వనరులతో అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకోవడం ఒక్కటే మా ముందున్న అవకాశం. కొన్ని రోజుల తరువాత మా ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఆన్‌లైన్‌ రేడియో ఎన్‌ఆర్‌ఐ సామే.

పాజిటివ్‌ స్టోరీలకు పట్టం..

శ్రీకాంత్‌ : ప్రస్తుతం మన దేశం మీడియాలో వస్తున్నంత చెడ్డది కాదు. మంచి కూడా ఎంతో ఉంది. ఆ మంచిని కనక చూపగలిగితే మనకన్నా గొప్ప దేశం మరొకటి ఉండదు. ఒక సానుకూల వాతావరణం కూడా ఏర్పడుతుంది. అటువంటి ఎన్నో కథనాలకు మా రేడియో వేదికైంది. మణిపూర్‌లో బీనలక్ష్మి అనే ఒక మహిళ.. కాల్పుల్లో భర్తలను పోగొట్టుకున్న మహిళలకు ఉపాధి అవకాశాలను చూపిస్తోంది. కొత్త జీవితానికి మార్గం చూపిస్తున్నది. ఇది ఎంత గొప్ప కథ. మిజోరాంలో ఒక వ్యక్తి కృషి వల్ల ఆ రాషా్ట్రనికి నేషనల్‌ ఫుట్‌బాల్‌ ఛాపింయన్‌షిప్‌ వచ్చింది. కాని ఆయన గురించి స్థానిక మీడియా పట్టించుకోలేదు. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఒక ఐఏఎస్‌ అధికారి పట్టుబట్టి ఒక ఊరికి 120 కిలోమీటర్ల రోడ్డు వేయించారు. త్రిపుర అక్షరాస్యతలో కేరళను మించిపోతున్నది. సిక్కిం మరో రెండేళ్లలో ఆర్గానిక్‌ పంటలు పండించే రాష్ట్రంగా ఎదగబోతోంది. ఇటువంటి విషయాలన్నింటినీ మా రేడియో ఫోకస్‌ చేస్తోంది. ఇవన్నీ ప్రసారం చేయడం వల్ల మన దేశం పట్ల మనకు పాజిటివ్‌ దృక్పథం పెరుగుతుందన్నది మా ఉద్దేశ్యం.

హంగులు ఉండవు…

శ్రీహరి : మా రేడియోకు నెలకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. మాకంటూ కొంతమంది దాతలు ఉన్నారు. వాళ్లు అందించే సాయంతోనే ఈ రేడియో నడుస్తుంది. మా వెబ్‌సైట్‌లో ఎటువంటి హంగులు ఆర్భాటాలు ఉండవు. మంచి పని చేయడానికి ఇవేవీ అవసరం లేదు. మేము కడపకు చెందిన విజయకుమార్‌ అనే రైతును ఇంటర్వ్యూ చేశాము. అతను సేంద్రీయ రైతు. గాయకుడు, సామాజిక కార్యకర్త కూడా. మా రేడియో ద్వారానే ఆర్గానిక్‌ వ్యవసాయంలో మెళకువలను వినిపించారు. ఇంటర్వ్యూను విన్నవాళ్లు ఎంతోమంది విజయకుమార్‌ను కలుస్తూనే ఉన్నారట. ఇలా మారుమూల గ్రామాల్లోని అరుదైన వ్యక్తుల్ని పదిమందికి చూపిస్తున్నాం.

గద్దర్‌ సలహాలు ఇచ్చారు..

శ్రీకాంత్‌ : మా రేడియో మొదలు పెట్టేముందు ప్రజాగాయకుడు గద్దర్‌తో మాట్లాడాం. ఆయన అందించిన సూచనలు, పంచుకున్న ఆలోచనలు ఎంతో ఉపయోగపడ్డాయి. గద్దర్‌ ఇంటర్వ్యూకు చక్కటి స్పందన వచ్చింది. మా రేడియో నుంచి ప్రముఖులకు ఫోన్లు చేసి ఇంటర్వ్యూలు అడిగినప్పుడు.. ఆశ్చర్యపోయేవారు. ‘‘అమెరికాలో మీరు అంత బిజీగా ఉండికూడా మంచి పని చేస్తున్నారు’’ అనేవారు. ఒకసారి గణిత మేధావి శకుంతలా దేవితో ఇంటర్వ్యూ చేశాము. ఆవిడని చాలాసార్లు అడిగాము. చాలా బిజీగా ఉండేవారామె. మాతో మాట్లాడేందుకు సమయమే దొరకలేదు. ఒక రోజు హఠాత్తుగా మాకు ఫోన్‌ చేసి.. వెంటనే ఇంటర్వ్యూ చేయమని అడిగారు. అప్పటికప్పుడు చేశాము. ఇంటర్వ్యూ వచ్చిన 20 రోజుల్లోనే శకుంతలాదేవిగారు చనిపోయారు. ఇది మరపురాని సంఘటన. అలాగే సైమేర్‌ అనే భాషను మన దేశంలో నలుగురే మాట్లాడుతున్నారు. ఈ అంశం మీద స్టోరీ వినిపించాము. ఇలా మేము చేయాల్సింది ఎంతో ఉంది. ఆసక్తికలిగిన యువత మాతో చేతులు కలిపితే మాకు మరింత శక్తి వస్తుంది.

ఒకసారి గణిత మేధావి శకుంతలాదేవితో ఇంటర్వ్యూ చేశాము. ఆవిడని చాలాసార్లు అడిగాము. చాలా బిజీగా ఉండేవారామె. మాతో మాట్లాడేందుకు సమయమే దొరకలేదు. ఒక రోజు హఠాత్తుగా మాకు ఫోన్‌ చేసి.. వెంటనే ఇంటర్వ్యూ చేయమని అడిగారు. అప్పటికప్పుడు చేశాము. ఇంటర్వ్యూ చేసిన 20 రోజుల్లోనే శకుంతలాదేవిగారు చనిపోయారు.
  • స్వాతి శ్రీరామ్‌, న్యూజెర్సీ నుంచి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వర్తమానం -అందెశ్రీ కవిత – మేడసాని మోహన్ పై వ్యాసం ,జింబో కవిత

 


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వాన కథలు వాసనలు ….కాళిదాసు పురుషోత్తం

వాన కథలు వాసనలు ….కాళిదాసు పురుషోత్తం

మూడు కథలు. ఈ కథల మధ్య ఐదు పదుల సంవత్సరాల కాలం కరిగి ప్రవహించి ఘనీభవించింది. గురజాడ ‘సంస్కర్త హృదయం’ కథకూ, సోమర్‌సెట్‌ మామ్‌ ‘రెయిన్‌’ కథకూ పోలికలున్నాయని నార్లవారు అన్నారు. ఆ స్ఫూర్తితోనే పరిశోధించాను. గురజాడ, మామ్‌, పాలగుమ్మి పద్మరాజు కథల మధ్య కొన్ని సాదృశ్యాలు, సమాన ధర్మాలు నాకు స్ఫురించాయి.
క సముద్ర ప్రయాణంలో (1916) ‘రెయిన్‌’ కథకు వస్తువు స్ఫురించిందని, 1920లో దానికి అక్షరరూపం ఇచ్చినట్లు మామ్‌ గ్రంథస్థం చేశారు. ‘రెయిన్‌’ కథ సంగ్రహంగా పేర్కొని, దానికి ‘సంస్కర్త హృదయం’, ‘గాలివాన’లతో ఉన్న సామ్యాన్ని వివరిస్తాను.
అమెరికన్‌, బ్రిటిష్‌ ప్రయాణీకుల చిన్న బృందం శాన్‌ఫ్రాన్సిస్కోలో నౌక ఎక్కు తారు. మధ్య వయస్సు దాటిన మత ప్రచారకులు డేవిడ్‌ సన్‌ దంపతులు, యవ్వనంలో ఉన్న డాక్టర్‌ మెక్‌ఫిల్‌ దంపతులు సహ ప్రయాణీకులు. అదే నౌకలో చాలా ఆడంబరంగా, గాడీగా, బట్టలు ధరించి, ఎబ్బెట్టుగా ముస్తాబు చేసుకొన్న మిస్‌ శాడిథామ్‌ప్సన్‌ అనే యువతి కూడా ప్రయాణిస్తుంది. ఆమె స్వేచ్ఛగా సహ ప్రయాణీకులతో మాట్లాడుతూ, విరగబడి నవ్వుతూ, ఆడుతూ పాడు తూ కులాసాగా ఉంటుంది. ఆ అమ్మాయి మీద డేవిడ్‌సన్‌ దంపతులకు సదభిప్రాయం లేదు. ఆమె వేశ్య అయి ఉంటుందని వాళ్లు తీర్మానించుకుంటారు.
ఒక నావికుడికి అమ్మవారు సోకడంతో, నౌక నిరవధికం గా పోగోపోగో అనే చిన్న ఓడరేవులో లంగరు వేయవలసి వస్తుంది. పై అధికారుల ఆజ్ఞ అయ్యేవరకు నౌక అక్కడే ఉండే ఏర్పాటు. పోగో పోగో చిన్న టౌన్‌. హార్బరు సమీపంలోనే స్థానిక వ్యాపారి హార్న్‌ ఇంటి మేడ పైగదుల్లో డేవిడ్‌ సన్‌ దంపతులు, డాక్టర్‌ మెక్‌ఫిల్‌ దంపతులు ఉంటారు. విడవకుండా కురుస్తున్న వర్షం రేకుల కప్పుమీద పడి చేసే చప్పుడు, ఆ పరిస్థితుల్లో అక్కడ ఎంతకాలం ఉండిపోవాలో అనే దిగులు ప్రయాణీకులను అసహనం పాలు చేస్తాయి. మిస్‌ శాడిథామ్‌ప్సన్‌ అదే ఇంటిలో కింది భాగంలో, మెట్ల వద్ద గదిలో దిగుతుంది. ఆమె అక్కడ ఉండడాన్ని డేవిడ్‌సన్‌ దంపతులు బొత్తిగా సహించరు. మిస్‌ శాడిథామ్‌ప్సన్‌ గ్రామఫోన్‌లో పాటలు పెట్టి, నావికులతో స్థానిక యువకులతో కలిసి తాగుతూ, పాడుతూ ఆడుతూ మహాసర్దాగా ఉంటుంది.
ఆదివారం వస్తుంది. వాన సెలవివ్వదు. మిస్‌థామ్‌ప్సన్‌ గదిలో షరా మామూలే. ఆటలూ, పాటలూ, కేరింతలూ… ఏవీ ఆగవు. డేవిడ్‌సన్‌ దంపతుల సహనం నశిస్తుంది. ఆమెలాంటి వేశ్య ఆ టౌన్‌లో ఉంటే ఆ సమాజానికే ప్రమాదమని వాళ్లు తీర్మానించుకుంటారు. మత ప్రచారకులంటే అధికారులకూ భయమే. డేవిడ్‌సన్‌ పోగోపోగో టౌన్‌ గవర్నరును కలిసి, మిస్‌ థామ్‌ప్సన్‌ తిరుగు ఓడలో శాన్‌ఫ్రాన్సిస్‌కో వెళ్లిపోయేటట్టు ఆర్డరు వెయ్యమంటాడు. అయిష్టంగానే ఆయన ఓడ రాగానే అందులో వెనక్కు వెళ్లాలని ఆర్డరు జారీ చేస్తాడు.
మిస్‌థామ్‌ప్సన్‌కు ఆ పిడుగులాంటి వార్త అందుతుంది. ఆమె డాక్టర్‌ మెక్‌ఫిల్‌ దంపతులను కలిసి, తనకు ఏదో ద్వీపంలో కేషియర్‌ ఉద్యోగం వచ్చిందని, గవర్నరు ఆర్డరు రద్దు చేయించమని వేడుకొంటుంది. కానీ, డాక్టర్‌ మెక్‌ఫిల్‌ అభ్యర్థనను గవర్నరు మన్నించడు. ‘అయితే ఇక నాకు సాయపడగలిగిన వ్యక్తి డేవిడ్‌సన్‌ గారే!’ అంటుంది థామ్‌ప్సన్‌ .
చివరి ప్రయత్నంగా మిస్‌ థామ్‌ప్సన్‌ డేవిడ్‌సన్‌ను కాళ్లావేళ్లాపడి బ్రతిమాలుతుంది. తనకు మూడేళ్ళ జైలుశిక్ష పడిందని, వెనక్కి వెళ్తే జైలు తప్పదని అసలు విషయం చెప్పి కరుణించమంటుంది. వెనక్కి వెళ్లి, జైలు శిక్ష అనుభవించి, పశ్చాత్తాపంతో పవిత్రురాలివి కమ్మని డేవిడ్‌సన్‌ హితబోధ చేస్తాడు. ఆమె తన ఆడంబర వేషం విసర్జించి మౌనంగా గదికి పరిమితమవుతుంది. డేవిడ్‌సన్‌ ప్రతి రాత్రి భోజ నం ముగించి మిస్‌ థామ్‌ప్సన్‌ గదికి వెళ్లి ప్రార్థన చెయ్యడం మొదలుపెడతాడు. ఆమె అతని బోధనల ప్రకారం మెలుగుతూ ఉపదేశాలు వింటూ, అతనితో కలిసి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ‘మావారు ఆపన్నులను రక్షించడం కోసం నిద్రాహారాలన్నీ త్యజిస్తారు. ప్రకృతి విపత్తులను, విలయాలను దేన్నీ లెక్కపెట్టరు. ఆయన తత్వమే అంత’ అని శ్రీమతి డేవిడ్‌సన్‌ తన భర్త గొప్పతనాన్ని డాక్టర్‌ మెక్‌ఫిల్‌ దంపతులకు వివరిస్తుంది. రోజులు గడిచిపోతుంటాయి. డేవిడ్‌సన్‌ మిస్‌థామ్‌ప్సన్‌ గదికి వెళ్లి స్తుతులు, ప్రార్థనలూ చదువుతూనే ఉంటాడు. విడుపు లేకుండా వర్షం పడుతూనే ఉంటుంది. ఒకరోజు పొద్దున్నే డాక్టర్‌ మెక్‌ఫిల్‌ గది తలుపును ఎవరో సన్నగా తడ్తారు. డాక్టర్‌ తలుపు తీస్తాడు. నిశ్శబ్దంగా తన వెంట రమ్మంటూ ఆ ఇంటి యజమాని హార్న్‌ సైగ చేస్తాడు. రెండు వారాలుగా తెరపి లేకుండా కురిసిన వాన వెలసి, ప్రకృతి ప్రశాంతంగా ఉంది. సముద్రతీరంలో, ఇసకలో మత ప్రచారకుడు డేవిడ్‌సన్‌ పీకకోసుకొని పడి ఉంటాడు. రక్తసిక్తమైన కత్తి అతని పిడికిట్లో అలాగే ఉంటుంది. డాక్టర్‌ మెక్‌ఫిల్‌ అవసరమైన ఏర్పాట్లన్నీ చేసి తన గదికి వెళ్తూ మెట్ల దగ్గర ఆగు తాడు. మిస్‌థామ్‌ప్సన్‌ గ్రామ్‌ఫోన్‌లో అశ్లీలమైన పాటల రికార్డుపెట్టి పూర్వంలాగే అలంకరణతో, ఆడుతూ, పాడుతూ ఉంటుంది. ‘ఏమిటిదంతా’ అంటాడు డాక్టర్‌ మెక్‌ఫిల్‌. ఆవిడ ముఖంలో వ్యక్తమైన పరిహాసాన్ని, తిరస్కార భావాన్ని, ఎవ్వరూ వర్ణించలేరు. “You men! you filthy dirty pigs!you are all the same , all of you pigs! Pigs”  అంటుందామె. Dr macphail gasped . He understood.
డేవిడ్‌సన్‌ దంపతులు వయసు మళ్లుతున్నవాళ్లని, ఆ దంపతుల మధ్య శృంగార భావాలు, కామవాంఛల వంటివేవీ లేవని కథకుడు మామ్‌ మొదట్లోనే అంటాడు. తమ సిద్ధాంతం, ఆచరణ తిరుగులేనిదనే విశ్వాసంలో కూరుకొని పోయినవాళ్లని కూడా మామ్‌ వాళ్ల గురించి వర్ణిస్తాడు. నిజానికి మిస్‌ థామ్‌ప్సన్‌ చాలా నిష్టగా, ఏకాగ్రంగా, పాత అలవాట్లన్నీ విడిచిపెట్టి, చివరకు అన్నపానాలు, స్నానం కూడా విడిచిపెట్టి ప్రార్థనలతో కాలం గడుపుతుంది. అయితే ఏకాంతం, ఆమె స్పర్శ – డేవిడ్‌సన్‌కు తపోభంగం కలిగిస్తుంది.
బహుశా గురజాడ ‘సంస్కర్త హృదయం’ (ఇంగ్లీషు మూలం-stooping to raise) చదివిన వాళ్లకు ఈ కథతో ఉన్న సారూప్యాలు బోధపడి ఉంటాయి. పుస్తకజ్ఞానం తప్ప జీవితానుభవం, ఆచరణ కొరవడిన ప్రొఫెసరు రంగనాథయ్యరు విద్యార్థి చందర్‌ పెట్టిన పరీక్షలో ఫెయిలవుతాడు. ‘బోగం’ యువతి సరళ రూపలావణ్యాలకు, సంగీతవిద్యకు పరవశుడై, ఒక బలహీన క్షణంలో మనసు మీద అదుపుతప్పి, ఆమెను చుంబించి అనుచితంగా ప్రవర్తిస్తాడు. బయట వరండాలోంచి వికటాట్టహాసంతో పాటు ‘‘….సంస్కరణంటే యిదే! ఒకరిని లేవనెత్తబోయి మనమే కిందపడ్డం’’ అనే మాటలు వినిపిస్తాయి. గురజాడ కథలో విద్యార్థి చందర్‌ అన్న ఈ మాటల వంటి మాటలే మిస్‌థామ్‌ప్సన్‌ నోటి నుంచి వినిపిస్తాయి. ఆమె వ్యక్తిత్వానికి సరిపోయే మాటలు. రంగనాథయ్యరు నైతికంగా చచ్చి, అవమానభారంతో రాత్రికి రాత్రే ఊరూ, ఉద్యోగం విడిచిపెట్టి ఎటో వెళ్లిపోతాడు. ‘రెయిన్‌’కథలో మతప్రచారకుడు డేవిడ్‌సన్‌ చావుకన్నా, రంగనాథయ్యర్‌ స్థితి పాఠకుల్లో గొప్ప సానుభూతిని కలిగిస్తుంది. గురజాడ నెథానియల్‌ హేథార్న్‌ కథ ‘రెపాచినీస్‌ డాటర్‌’ సంవిధానాన్నే అనుకరించి ‘సంస్కర్త హృదయం’ రాశారు. చివరి వాక్యాలు హేథార్న్‌ కథలోనూ ఇలాగే ఉంటాయి.
‘సంస్కర్త హృదయం’, ‘రెయిన్‌’ కథలకూ పాలగుమ్మి పద్మరాజు ‘గాలివాన’ కథకూ కూడా కొన్ని పోలికలున్నాయి. ‘గాలివాన’ అంతర్జాతీయ కథల పోటీలో (1951) ద్వితీయ ఉత్తమకథ పురస్కారాన్ని పొందింది. ‘గాలివాన’లో తన పెంకుటిల్లు కూలిన అనుభవం కథకు నేపథ్యంగా వాడుకొన్నట్లు పద్మరాజు అన్నారు. ‘రెయిన్‌’ కథ రెండు వారాల్లో జరుగుతుంది. ‘గాలివాన’ 12.15 గంటల వ్యవధిలో జరుగుతుంది. ‘గాలివాన’ కథలో ప్రధాన పాత్ర ‘రావుగారి’కి యాభైయ్యేళ్లుంటాయి. నీతినియమాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ క్రమశిక్షణతో, నిష్టగా జీవించడం రావుగారు ఎంచుకొన్న జీవిత విధానం. తన పిల్లలు తలదువ్వుకొనే పద్ధతి, అలం కరణ, నోములు ప్రతిదీ ఇంట్లో రావుగారి అభిమతం మేరకే నిశ్చయమయిపోతాయి.
ఏదో వూర్లో ఆస్తిక సమాజంలో ఉపన్యసించడానికి రావుగారు రెండవతరగతి పెట్టెలో ప్రయాణం చేస్తారు. (ఇప్పటి సెంకడ్‌ క్లాస్‌ కాదు, పరుపుల పెట్టె) సన్నగా వానజల్లు మొదలవుతుంది. 30 ఏళ్ల బిచ్చగత్తె ఆ పెట్టెలో యాచిస్తూ ఉంటుంది. రావుగారు ఆమెను చీదరించుకొంటారు. వర్షం పెద్దదై గాలివానగా మారుతుంది. రాత్రి నిర్జనంగా ఉన్న స్టేషన్‌లో రావుగారు దిగుతారు. గాలివానలో ఊళ్లోకి వెళ్లే సౌకర్యం లేక, ఆయన ఒక్కడే వెయిటింగ్‌ రూంలో గడపవలసి వస్తుంది. ఆ గాలివానలో ఆయనకు ఆ బిచ్చగత్తె ఒక్కర్తే తోడు. ‘నిత్యమూ ధర్మా ధర్మ చింతతో బాధపడే అంతరాత్మగానీ, నాగరికులకు సహజమయిన సంకీర్ణ మనస్తత్వంగాని ఆమెకు లేవు. తను ఎన్నడూ ఎరగని మగవాడిక్కూడా ఆమె శరీరాన్ని అర్పించి, తేలికైన మనసుతో సుఖించగలదు’ అని కథకులు ఆమె అంతరంగాన్ని వర్ణించారు. తుపాను బీభత్సంలో రావుగారి పిరికిమనసు ఆవిడ స్పర్శనూ, సాన్నిహిత్యాన్ని అంగీకరించవలసి వస్తుంది. ‘ఆమె మరీ దగ్గరగా జరిగి ఆయన వొళ్లో వాలింది. ఆమె రొమ్ముల బరువు- ఆమె (రావుగారి) మోకాళ్లమీద వాల్చింది. మోకాళ్లు మరికాస్త దగ్గరగా ముడుచుకొని దీర్ఘంగా అవమానకరమయిన ఆలోచనాపరంపరలో (రావుగారు) మునిగిపోయారు. ఆమె అలా మాట్లాడుతూనే ఉంది.’
రావుగారి ఒళ్లో వాలిన తర్వాత ఆమెలోని శృంగార భావనలు నిదురించాయి. ఇంటిదగ్గర రావుగారి పిల్లలు, ఊళ్లో దిక్కూమొక్కూలేని తన పిల్లల్ని మాత్రమే గుర్తుకు తెచ్చుకుంది. కాళ్లు తిమ్మిరెక్కితే, ‘పడుకొని ఉన్న ఆ మూర్తిని కదల్చకుండా మెల్లిగా ఆయన కాళ్లు కదుపుకొన్నారు. ఆయన మనస్సు మేలుకొంది. (టార్చి) లైటు వెలిగించి ఆమె ముఖం వంక చూశారు. నిద్రలో ఆ ముఖం అమాయకంగా, నిశ్చలంగా ఉంది. స్వచ్ఛమైన, నిసగర్గమయిన ఒక శోభ. ఆమె ముఖంలో దివ్యత్వం స్ఫురింపజేసింది.’
గాలివాన ఆగింది. తెల్లవారి రావుగారు ఆమె కోసం వెదికారు. ఆమె చేతిలో రావుగారి పర్సు, టికెట్‌ కౌంటర్‌లోని డబ్బు ఉన్నాయి. ఆమెపైన దూలంపడి మరణించి ఉంది. రావుగారు ఆమె చేతిలోని డబ్బు టికెట్‌ కౌంటర్‌ సొరుగులో ఉంచారు. తన పర్సు మాత్రం ఆమె చేతుల్లో అలాగే ఉంచేశారు. ‘ఆమె ఆఖరుతత్వం… ఆయనలో లోతుగా మాటుపడియున్న మానవత్వాన్ని ఈ జీవి వికసింపచేసింది. ఆయన భార్యగాని, ఆయన పిల్లలలో ఎవరుగాని ఆమె వచ్చినంత దగ్గరగా రాలేదు.’ అని పద్మరాజు వాచ్యంగానే చెప్పి కథ ముగించారు. కథ చదివి ముగించినపుడు పాషాణ సదృశుడైన ఒక కర్కశుడిలో పదేళ్ల బాలిక మానవత్వాన్ని మేల్కొల్పిన ఫెలిని కళాఖండం ‘లాస్ర్టాడా’ నా మనసులో తళుక్కున మెరిసింది.
గాలివాన చదివిన అనుభూతి తీవ్రతను రెయిన్‌ కథ పాఠకులలో కలిగించదు. గాలివాన కథ పాఠకుల మనసుల్లో ఒక ఎరుకను, వికాసాన్ని కలిగిస్తుంది. ఇంతకుమించిన సాహిత్య ప్రయోజనం మరేం కావాలి? మిస్‌థామ్‌ప్సన్‌, డేవిడ్‌సన్‌ పాత్రలే బిచ్చగత్తె, రావుగారుగా నాకన్పిస్తారు. వర్షం, గాలివాన రెండు కథలకూ నేపథ్యం. శిల్పందృష్టిలోనూ గాలివాన సార్వకాలికమైన విలువలను ప్రతిపాదించిన గొప్ప కథ.
పద్మరాజుగారి కథ చదివినపుడు సంస్కర్త హృదయం, రెయిన్‌ గుర్తు రావటం ‘అపచారం కాదు కదా!’ గురజాడ కథ అనువాదం 1951 ఆగస్టు భారతిలో అచ్చ యింది. ఈ పోలికలూ, సాదృశ్యాలు యాదృచ్ఛికాలేనా? గురజాడ ఒరిజినల్‌ స్టోరీ ఆయన జీవిత కాలంలోనే ఏ విదేశీ పత్రికలోనైనా అచ్చయిందా? ప్రస్తుతానికి సమాధానాల్లేవు.
కాళిదాసు పురుషోత్తం
09247564044
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘’బ్లాగ ‘’వతం

‘’బ్లాగ ‘’వతం

బ్లాగవతమునులందరూ   ‘’నెట్టా’’రణ్యం లో చేరి పరమ బ్లాగవతోత్తముడైన బ్లాగానంద మహర్షిని తమకు ఈ జన్మలో అన్నిపాపాలనుండి విముక్తికలిగించే ధర్మార్ధ మొక్షాలనిచ్చే ‘’బ్లాగవ్రతం ‘’బోధించమని కోరారు .ఆయన కాసేపు మౌన ముద్రలో ఉండి,’’మంచి ప్రశ్న వేశారు మహాత్ములారా !శీఘ్రంగా ఫలితమిచ్చే ఒక బ్లాగవ్రత కద చెబుతాను .జాగ్రత్తగా విని ,ఆచరించి సత్ఫలితాలను పొందండి ‘’అన్నాడు .బ్లాగమునుల్లో శునక బ్లాగర్షి ‘’ ఆవ్రత విధానమేమిటి ?పూర్వం ఎవరైనా చేశారా ?ఫలితాలను పొందారా ?’’అని అడిగాడు .లేని గడ్డాన్ని దువ్వుకొంటూ బ్లాగానంద ముని ‘’ఫేస్ బుక్ వ్రతం ‘’అనే వ్రతం ఉత్తమోత్తమైనది ,త్వరలో ఫలితాలనిచ్చేది ,అందరితో పరిచయాలు పెంచి అదే లోకమై  సర్వం మరపించేట్లు చేసి ,కళ్ళు కాయలు కాసి ,చేతులు వణికి అంత్యం లో ఆనంద మొక్షాలనిస్తుంది .ఆచరించి తరించని వారు లేరంటే నమ్మండి .అయినా ఎవరైనా ఆచరించి బాగుపడ్డారా? అని అడి గారు కనుక చెబుతున్నా వినండి .’’ అని లాప్ టాప్ దర్శనం చేసుకొని అందులో మొదటికద చదివి వినిపించాడు .

పరమ దరిద్రుడైన ఒక సన్నాసి ఏ ప్రయత్నం చేసినా డబ్బు రాలక ,పెళ్ళాం పిల్లల్ని పోషించలేక అల్లాడి పోతున్నాడు .ఒక రోజు అతనికి’’ బ్లాగేశ్వరుడు’’ దర్శనమిచ్చి బాగు చేయాలని భావించాడు .గాలిలో చేయి ఊపి ఒక ఐపాడ్ సృష్టించి దాన్ని చేతికిచ్చి ,దాన్ని వాడుకొని సద్వినియోగం చేసుకొంటే సర్వమూ కరతలామలకం అవుతాయన్నాడు .మరి ఎవరు నేర్పిస్తారని అడిగితె వీధికో కోచింగ్ సెంటర్ ఉందని ఎక్కడ నేర్చుకొన్నా చేతి చమురు వదిలి౦చు కోవాల్సిన్దేనని అప్పుడే జ్ఞాన జ్యోతి వెలుగుతుందని జ్ఞాన బోధ చేశాడు .సరేనని సన్నాసి కోచింగ్ సెంటర్ లో చేరి డబ్బు’’ దోచింగ్ ‘’చేసుకొని మిడిమిడిజ్ఞానం పొందాడు  .రోజూ ఆ ఐపాడ్ దేవతను స్తుతిస్తూ తాకుతూ ,మురుస్తూ అందులో దుర్భిణీ లో వెదికి ‘’మొక పొత్తాన్ని’’సృష్టించుకొని ,ముఖ స్నేహితుల్ని సాధించుకొని ,ఒకరికొకరు అవీ ఇవీ పంపుకొంటూ ,ఇహాన్నీ పరాన్నీ మరిచి అదే స్వర్గంగా గడిపాడు .భార్యా పిల్లలు మళ్ళీ మొదటికే వచ్చారు తిండీ లేదు పాడూ లేదు .చివరికి భార్యామణికి విసుగొచ్చి  తానూ దొంగ చాటుగా దాన్ని వాడటం మొదలెట్టి అందులోనే ఐక్యమయింది .పిల్లలిద్దరూ అదే దారి పట్టి బ్లాగేశ్వర స్వామి లో ఐక్యంయ్యారు .ఈ కద విన్నా చదివినా చేసినా పుణ్యమూ పురుషార్ధమూ లభిస్తాయి అని బ్లాగానంద స్వామి కద ముగించారు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-15 –ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-6

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-6

‘’మన ‘’ అమెరికా న్యూయార్క్ లో  కాలు పెట్టిన సీతారామయ్యగారు

న్యూయార్క్ ఓడ రేవు చేరగానే అక్కడ ఉన్న మంచు ను చూసి కంగారు పడ్డారు. దూది పింజలులాగా ఆకాశం నుండి భూమి మీద ,సముద్రం పైనా పడే స్నో  తమాషా అనిపించింది .సముద్రం పై పడి అదృశ్యమయ్యే మంచు ఆకర్షించింది . మంచు దుప్పటి న్యూయార్క్ నగరాన్ని కప్పేసింది అనిపించింది .భూమిమీద పడ్డ మంచు కుప్పలో చెయ్యి పెట్టి చూశారు .చుట్టూ ఉన్నవారు నవ్వారు ఈ పిచ్చి మారాజును చూసి .అందులో ఒకడు ‘’నెత్తిన టోపీ పెట్టుకో కోతీ !లేక పొతే మంచు లో గడ్డ కట్టుకు పోతావ్ సన్నాసీ ‘అన్నాడు .ఈ మాటలేవీ ఆయన్ను బాధ పెట్టలేదు నొచ్చుకోలేదు కూడా .ఆనందం ,ఆశ్చర్యం కలిసి చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోయారు ఆయన .

ఇంతలో ఒక నీగ్రో ‘’మన అమెరికాలో చలి బాగా ఉందికదూ ‘’అన్నాడు ఆయనతో .’’మన అమెరికా అని ఆతను అనటం రామయ్యగారిని మళ్ళీ ఆలోచనలో పడేసింది ..’’మన అమెరికా ‘’అనే మాట పై ఆయన చాలా వితర్కి౦చు కొన్నారు .మాత్రు దేశం అంటే ఏమిటి ?అని ఆలోచించారు .ఆఫ్రికా లో మూలాలున్న ఈ నల్లవాడు ఇది తన అమెరికా అంటున్నాడు .నిజంగా నీగ్రోలకు అమెరికా భూతల స్వర్గమేమీ కాదు .ఎన్నో బాధలు కస్టాలు అవమానాలు అనుభవిస్తున్నారు అమెరికాలోని నీగ్రోలు .అక్కడ వారికి అత్యుష్ణత, కాని ఇక్కడ అతి శీతలం .బానిస వంశ సంజాతుడైనా అతనికి అమెరికా మాత్రు దేశమే .మరొక ప్రపంచం లో కాలు పెట్టానని జాగ్రత్తగా అడుగులు వేయాలని ని,అన్నిటికీ సిద్ధపడాలని నిర్ణ యించుకొన్నారు .

న్యూయార్క్ నగరం లోని ఆకాశ హర్మ్యాలు పరమాశ్చర్యం కలిగించాయి .వాటికి మొదలు చివరా ఉన్నట్లు అనిపించలేదు .ఇక్కడ మనుష్యలు మహా వేగం గా ,దూకుడుగా దూసుకు పోతున్నారు .ఇదొక మానవ మహా సముద్రమే అనిపించింది .ఇక్కడ నిలకడ పనికి రాదు పరుగో పరుగు అయితేనే రాణిస్తాను అనుకొన్నారు .’’జీవితం ఒక విస్త రించే పుష్పం ‘’అని గుర్తించారు .ఇక్కడి ఈ జన సముద్రం మానవతకు ప్రతీక అనిపించింది .ఇందులో వేగం ,శక్తి ,అవిశ్రా౦తత కనిపించాయి .హాస్యం కనిపించలేదు .సీరియస్ నెస్ సర్వ వ్యాపకం గా ఉంది .    ఓడలో కస్టపడి పని చేశారు రామయ్యగారు .దానికి కెప్టెన్ ఒక్క పెన్నీ కూడా ‘’చేపలేదు’’ ..ఏమైనా డబ్బు ముట్ట జెబుతాడేమోనని ఆశగాఎదురు చూశారు .తెలివిగా కెప్టెన్ ‘’నిన్ను పోలీసుల కంట పడకుండా అమెరికా చేర్చటమే బ్రహ్మ ప్రళయమైంది .ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ల బారిన నిన్ను పడెయ్యకుండా న్యూ యార్క్ చేర్చాను .సంతోషించు ‘’అని మరో గుణ పాఠం నేర్పాడు . చేసేదేమీలేదు కదా .ఇక ఇక్కడే ఉండాలి .అందుకని పొట్ట పోసుకోవటానికి దొరికిన అడ్డమైన పనీ చేశారు .కొంత డబ్బు సమకూడిన తర్వాత చికాగో చేరారు .

చికాగో చదువు

గ్రేట్ లేక్స్ భూ భాగం లో  చికాగో నగరం ఉంది .వివేకానందుడు ధర్మ భేరి మ్రోగించిన ప్రదేశం ఇదే .చికాగో యూని వర్సిటి లో ‘’ఆగ్దన్ స్కూల్ ఆఫ్ సైన్స్ ‘’లో 1922 ఆటం క్వార్టర్ (శరదృతువు ) కు దరఖాస్తు చేశారు .మద్రాస్ లో రామయ్యగారు చదివిన సెయింట్ బీసెంట్ యూని వర్సిటీ నుండి ఏ విద్యార్దీ ఇక్కడి ఈ యూని వర్సిటీలో ఇంతవరకు చదవ లేదు .రామయ్యగారే  ప్రధములు .అయన శక్తి సామర్ధ్యాలమీద అంతనమ్మకం లేని యూని వర్సిటి అధికారులు ‘’అన్  క్లాసి ఫైడ్ ‘’విద్యార్ధిగా రిజిస్టర్ చేసుకొన్నారు ..చాలా తీవ్రంగా కస్టపడి చదివి ఫిజిక్స్ ,కేమిస్ట్రి, గణితం లో  నాలుగు మేజర్  క్వార్టర్స్ లో  ప్రావీణ్యత చూపారు . ఈ శాఖలలో ఇన్ఫార్మల్ పరీక్షలు నిర్వహించారు .అన్నిటా అద్వితీయంగా నిలిచారు .డిపార్ట్ మెంట్ ఆఫ్ ‘’కంపారటి వ్ పైలాలజి ‘’వారు రామయ్యగారికి సంస్కృతం లో మిగిలిన విద్యార్ధుల కంటే ప్రతిభ ఎక్కువగా ఉందని .ఈ ప్రావీణ్యత ఏ చార్టర్డ్ యూని వర్సిటీ ‘’లో చదివిన విద్యార్ధి ప్రావీణ్యం కన్నా చాలా ఎక్కువగా బాగుందని రిపోర్ట్ ఇచ్చారు .రామయ్య ఎంచుకొన్న విషయాలపై అనుభవం ,శిక్షణ సాధారణం గా ఉండాల్సిన కనీస జ్ఞానం కంటే చాలా  అధికం గానే  ఉన్నాయని ఏంతో సంతృప్తి చెందారు .వెంటనే 1924 జనవరి 1 న రామయ్యగారిని గ్రాడ్యుయేట్ స్కూల్ కు బదిలీ చేశారు .ఇది సుదూర దేశం లో రామయ్యగారు సాధించిన మొట్ట మొదటి ఘన విజయం ..      ఒక రోజు ఆయనకు దారిలో పరిచయం ఉన్న వ్యక్తీ తారసిల్లాడు .అతనే పొన్నాంబళం.శ్రీలంక వాడు .ఇద్దరం హిందువులమే అనుకొన్నారు రామయ్య .ఇద్దరూ విదేశం అమెరికా చేరటం యాదృచ్చికం . అయిదు వేల తొమ్మిది వందల తొంభై ఏళ్ళ క్రితం తమ కుటుంబాలు తమిళనాడు నుండి లంక కు వచ్చి చేరాయని ,అప్పటి నుండి అక్కడే ఉండిపోయామని ,తాము శ్రీలంక పౌరులం ,సింహళీయులం అని గర్వంగా చెప్పాడు .అప్పటి నుండి తాము శాపగ్రస్త విదేశీయులుగానే లంకీయులు వివక్ష చూపుతున్నారని పొన్నాంబలం వివరించాడు .రామయ్య గారి మనసులో బౌద్ధం మీద సాఫ్ట్ కార్నర్ ఉంది .సిద్ధార్ధుడు బుద్ధుడు అయి ,బోధలు చేసినా ఆయన్ను విషం పెట్టి చంపిన సంగతి గుర్తుకు వచ్చింది .మరణిస్తూ కూడా బుద్ధుడు శిష్యులను దగ్గరకు పిలుచుకొని తానూ ఈ భూమి మీద పుట్టిన పని పూర్తీ అయిందని తానిప్పుడు మళ్ళీ స్వర్గానికే చేరుకొంటు న్నానని  చెప్పిన  విషయం జ్ఞాపకమొచ్చింది .ఆయన కాలం లోనే కత్తులు దూసుకొన్న రాజులున్నారని అన్నారు. బుద్ధ నిర్యాణం తర్వాత  ఆ మతం లో  లో రూప విక్రియ(మెటా మార్ఫసిస్ ) చోటు చేసుకొన్నది జపాన్ లో సమురాయ్ బౌద్ధాన్ని అంగీకరించారు .మనవ గర్వాన్ని అణచుకొని తర్వాత శత్రువుల పీచం అణచాలన్నది వారి ధ్యేయం అయింది .భారత దేశం లో బుద్ధుడిని దేవుడినే చేసి ఆరాధించటం మొదలు పెట్టారు . అనేక విధాల విగ్రహాలు నిర్మించి పూజాదికాలు నిర్వహిస్తున్నారు .క్రమంగా బౌద్ధ సిద్ధాంతాలు కనుమరుగైపోయాయి .వేదాంతం బౌద్ధాన్ని దెబ్బ తీసింది .ఒక్క శ్రీలంక లోనే అసలైన బౌద్ధం సజీవంగా నిలిచి ఉంది అని తెలుసుకొన్నారు రామయ్యజీ .సెయింట్ ‘’ఎక్సూపరి’’ బోధించిన ‘’to love each other means to look together in one direction ‘’ అన్న సూక్తి నచ్చి ,నరనరాల్లో నిలిచిపోయింది రామయ్య గారికి .అలాగే హిక్మేట్ చెప్పిన ‘’love is not separated from the struggle for happiness of people ‘’కూడా బాగా నచ్చింది .

డిగ్నిటీ ఆఫ్ లేబర్

చికాగో లో చదువుకోవాలి అంటే చదువుకొంటూ పని చేయాల్సిందే అన్న సత్యం తెలిసింది .బరువులు మోసేవారు .రెస్టారెంట్  కిచెన్ లో పని చేశారు .ఏ పని ఎప్పుడు దొరికితే ఆ పని చేసి డబ్బు సంపాది౦చు కోనేవారు.అది నీచం అనే భావన ఎన్నడూ ఆయన మనసులో రాలేదు . ‘’డిగ్నిటీ ఆఫ్ లేబర్ ‘’అంటే ఇదే అని గ్రహించారు .అలాగే చదువు కొన సాగించారు .ఇక్కడ బతికి సాధించాలికనుక తిండి తినేవారు .ఆకలితో అలమటించటం లేదు .తాను  యువకుడు ,బల సంపన్నుడు కనుక అనారోగ్యం తన జోలికి వచ్చేదికాదు. కొవ్వొత్తి కరిగినట్లు రామయ్య గారిని చూసి జబ్బులు కరిగి మాయ మయ్యేవని చెప్పుకొన్నారు .తాను  విజ్ఞానాన్ని పొందాలి సైన్స్ ను జయి౦చాలన్నదే రామయ్య గారి ధ్యేయం .

చికాగో లో రామయ్యగారు చదివిన యూనివర్సిటి ఫోటో పెట్టాను చూడండి .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-15- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-5

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-5

కొలంబో  ప్రయాణం లో పదనిసలు

మద్రాస్ నుండి బయల్దేరిన షిప్ కొలంబో చేరింది .అక్కడ’’ ఆ మలయాళీ చోర్ ‘’ గురించి వాకబు చేశారు .కనిపించలేదు .ఒక మంచి గుణ పాఠం నేర్చుకోన్నాననుకొన్నారు .మద్రాస్ –కొలంబో ప్రయాణం జీవితం లో మరపురాని అనుభూతిగా మిగిలిపోయింది .దేశానికి వీడ్కోలు చెప్పారు కొత్త దేశం లో అడుగు పెట్టటం కోసం .ఏంతో విశాలమైన భూభాగాన్ని వదిలేసి వేడుతున్నట్లుగా ఉంది .మన్నారు జలసంధిని దాటటానికి ఫెర్రీ ఎక్కారు .అప్పుడు రామాయణం గుర్తుకొచ్చింది .ఈ ప్రదేశం లో రాముడు సంచరించాడని తానూ శ్రీరామ సంతతి వాడినని అభిప్రాయమేర్పడింది .రాముడు లంకకు వెళ్ళినట్లు తానూ లంక చేరుకొన్నారు .

తన స్నేహితుడి ఇల్లు వెతికి పట్టుకొని ఇంటి తలుపు తట్టారు రామయ్య .భయం తో ఒకావిడ తలుపు తెరిచింది .అతని తల్లి కావచ్చు .కొడుకు అమెరికా వెడుతున్న సంగతి ఆమెకు రామయ్య చెప్పారు .అతని ఆలోచనలేవీ ఆమెకు తెలియవు .అమెరికా ఎందుకు అనిమాత్రం అడిగింది . తనకొడుకును భగవంతుడు క్షమించాలని వేడుకొన్నదామే . కొందరు అక్కడికి వస్తే  తాను  పోగొట్టుకొన్న డబ్బు సంగతి వారికి చెప్పుకొన్నారు. వారు నిజమే నని నమ్మి సానుభూతి చూపించారు .తల్లిమాత్రం కొడుకు పాపాలను యేసు క్రీస్తు ప్రక్షాళనం చేయాలనీ అన్నది .మిగిలిన వారూ దానికే తలూపారు కానీ తను పోగొట్టుకున్న డబ్బు సంగతి ఎవరికీ పట్టినట్లు లేదు .స్నేహితుడి తల్లి ‘’రేపటి గురించి బెంగ వద్దు .దేవుడే అన్నీ చూస్తాడు .అలా చూడమని మేమంతా ప్రార్ధన చేస్తాం ‘’అని ఓదార్చి రామయ్య గారిని  పంపెసింది  .అంతా అయి పోయింది .పూర్తిగా మునిగిపోయాను అని అర్ధమైంది .మనసులో ఇప్పటి దాకా ఉన్న శ్రీలంక సౌందర్యం ఒక్క సారి ద్వంసమయినట్లు అనిపించింది ..

బొగ్గు గదిలో కూర్చుని అమెరికాకు ప్రయాణం –

యెర్ర సముద్రంపై అనుభవం

ఓడ దగ్గరకు చేరి కెప్టెన్ కు జరిగిన విషయమంతా పూస గుచ్చి చెప్పారు .’’దౌర్భాగ్యుడా ! వెళ్లి ,బొగ్గు నిలవ ఉండే గదిలో (కోల్ స్టాక్)ఉండి చావు .’’అన్నాడు కోపం తో అన్నా రామయ్యగారిమీద సానుభూతి కనబరుస్తూ .చాలా చాలా భయంకరమైన పరిస్తితి అది .బొగ్గు నెగడు అతి దగ్గరలోనే ఉంది. వేడి భరించటం మహా కష్టంగా ఉంది .చావ టానికైనా సిద్ధపడ్డారు కాని ఆ బాధలను ఏకరువు పెట్టటానికి ఒప్పుకోలేదు.వెనకడుగు వేసే ప్రశ్నే లేదు  .ఎర్ర సముద్రం పై ప్రయాణం మహాద్భుతమని పించింది  .ఎటు చూసినా కెంపు వర్ణ శోభ అద్వితీయం .మనసులో నిలిచిపోయింది ఆ అనుభూతి .డెక్ మీద కూర్చున్నా ఓడ వేడి సెగలు ఆయన్ను వదిలి పెట్టలేదు .షిప్ లోపల మంట ,బయట సముద్రమూ యెర్ర తోలు కప్పుకున్న మృగం లాగా భయంకరం గా ఉంది .యెర్ర సముద్రం పై ప్రయాణం చేసింది కొద్ది రోజులే అయినా అనంతకాలం ప్రయాణం చేసినట్లు అనిపించింది .ఇ౦త భయంకర వాతావరణం లో కూడా అంగుళం కూడా జంకలేదు .అరనిమిషం కూడా ఇండియా  వెళ్లి పోదామని పించానూ లేదు అన్నిటికి తట్టుకొని స్థిత  ప్రజ్నుడిగా నిలబడ్డారు రామయ్యగారు . అయన సంకల్ప బలం అంట గొప్పది . తరువాత ఎప్పుడో ఒక రష్యా పాట లో బొగ్గు బాయ్ చావు గురించి విన్నారు .నిజంగా కోల్ స్టాక్ లో ఉండి చావ కుండా  బయట పడటం ఎనిమిదో వింతయే .

ఈ’’ యెర్ర తివాచీ ‘’యే ఆ తర్వాత రష్యా జీవితం లో అద్భుత విజయాలకు  రెడ్ కార్పెట్ పరచిందేమో ? ఇందులోనే కొన్ని ఆసక్తికరమైన విషయాలూ ఉన్నాయి .సముద్రం లోంచి పెద్ద పెద్ద చేపలు ఒక్క ఉదుటున నీటిని చీల్చుకొని పైకి యెగిరి వచ్చి మళ్ళీ మునగటం భలే మజా అనిపించేది .తానుకూడా ఒక ఎగిరే మీనం అనుకొన్నారు .భూమి మీద పుట్టి ,ఆకాశం లోకి ఎగరటం .అలాగే ఆకాశం లో పుట్టి ,నక్షత్రాలను చేరుకోవటం మనసులోకి వచ్చి ఏదో గూఢ మైన అర్ధం గోచరించేది .మరోజన్మలో  యెర్ర సముద్రం లో ఎగిరే చేపగా పుట్టాలని పించింది .

సూయజ్ కాలువ దాటి న తర్వాత బ్రహ్మాండమైన తుఫాన్ పట్టుకొంది..దాదాపు జిబ్రాల్టర్ జలసంధి దగ్గరకొచ్చారు .ఓడలో సగం మందికి ‘’ సీ సిక్ నెస్ ‘’ వచ్చి అల్లల్లాడి పోయారు .వాళ్ళను కెప్టెన్, బోటు సిబ్బంది కాళ్ళతో తన్ని లేపుతున్నారు .దేవుడున్నాడో లేదోకాని తన జోలికి సీ సిక్ నెస్ రాలేదు .అదృష్ట వంతుడిని అనుకొన్నారు .చాలాకాలం తర్వాత అమెరికా నుండి యూరప్ వెడుతూ మధ్యధరా సముద్రం లో అంతా తుఫానులోనే గడిపిన రోజులు ఉన్నాయని  గుర్తు చేసుకొన్నారు .ఒక ముసలి  బొగ్గుపనివాడు ‘’ఈ వెధవకేమీకాలేదు బానే ఉన్నాడు ఈ ఇండియన్ ‘’అనటం విన్నారు రామయ్య .ఓడ కెప్టెన్ ఉదార హృదయానికి తోటి పనివారి సహకారానికి రామయ్యగారు మనసులో కృతజ్ఞతలు తెలియ జేసుకొన్నారు .

జిబ్రాల్టర్ జలసంధి దాటి అనంత అట్లాంటిక్ సాగరం పై పయనం

ఓడ  జిబ్రాల్టర్ దాటి అంతులేని జలరాశి లోకి చేరి ప్రయాణం సాగిస్తోంది .మొదట్లో తేడా ఏమీ కనిపించలేదు. స్పెయిన్ తీరం ,ఈజిప్ట్ తీరాలు కనుమరుగైనాయి .కుడి, ఎడమ, ముందు ,వెనక అట్లాంటిక్ సముద్రపు అనంత జలరాశి ..ఇక్కడికే ఒకప్పుడు కొలంబస్ వచ్చాడు .నాగా జాతివారు తాము ఏ లోకాన్నించి అంటే భూమికి అవతలి వైపు నుంచి రాలేదని  చెబుతారు .మన నాగాలను  చూస్తె అమెరికా ఇండియన్లు గుర్తుకొస్తారు .మహత్తర పురానుభావాలను కాలం యెంత త్వరగా ఊడ్చి పారేస్తుందో అనిపించింది .మధ్య అమెరికాలో మనదేశం లో ఉండే హిందూ దేవాలయాలు కనిపిస్తాయి బంధాలు శాశ్వతమైనవీ ,ద్రుఢమైనవి అని పించాయి .కొలంబస్ కన్నా ముందే ఈ ప్రాంతాలలో మానవులు ప్రయాణం చేశారని ,ఆంధ్రులు బాలీ ద్వీపానికి ఎప్పుడో చేరుకోన్నారని గుర్తు చేసుకొన్నారు .జపాన్ లో సంప్రదాయ నాట్యంలో  మన దేశ నృత్యపు చాయలున్నాయని ,ఎందుకు మనం ఒకరి దేశాన్నించి ఇంకోకరి  దేశానికి వెళ్ళ లేదో అర్ధం కాలేదాయనకు .మనసంతా చీకాకుగా ఉంది .తానూ అమెరికా వెడుతున్నాడు కాని అది తనకు వరం అవుతుంది అన్న గ్యారంటీ లేదు . ఇలాంటి వివిధ భావాలు మనసంతా ముసురుకొన్నాయి .’’ఈ డామ్ ఇండియన్ ‘’మొత్తం మీద అమెరికాలో కాలు పెడుతున్నాదన్న మాట అనుకొన్నారు .అక్కడ తనకు ఏది లభించినా దాన్ని తిరిగి ఇచ్చేయాలని ,అక్కడ గౌరవం మాత్రమేకాదు నవ్వులు కావాలని ఆశించారు రామయ్య .తన కోసం ఎవరూ ఎదురు చూడని దేశానికి తాను  చేరుకొంటున్నాడు అనిపించింది .రామయ్య గారు న్యూయార్క్ నగరం చేరుకొన్నారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-15 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment