నా పుట్టిన రోజు

సాహితీ బంధువులకు -ఇవాళ నా పుట్టిన రోజు -75 నిండి 76 లో ప్రవేశిస్తున్న సందర్భం గా అందరికి శుభ కామనలు-మీ -దుర్గా ప్రసాద్ -27-6-15- ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

కలియుగ ధర్మ స్థాపకుడు -పరాశరుడు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇంకా ఊరుకొంటే పరువు పోతుంది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నెహ్రూ అబద్ధమాడారు

నెహ్రూ అబద్ధమాడారు

Added At : Thu, 06/25/2015 – 07:45

ఆంధ్రప్రభ నేషనల్ స్టోరీ
న్యూఢిల్లీ: దేశ ప్రథమ ప్రధాని జవ హర్‌లాల్‌ నెహ్రూపై తాజాగా ఒక వివాదాస్పద పుస్తకం వెలువ డింది. ప్రథమ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌ ఆ పదవిని ఆధిష్ట్టించకుండా అడ్డుకునేందుకు ఒక సందర్భంలో నెహ్రూ అబద్దమాడారని తాజాగా విడుదలైన పుస్తకం పేర్కొంటోంది. ఇంటెెలిజెన్స్‌ శాఖ మాజీ అధికారి ఆర్‌ ఎన్‌పీ సింగ్‌ ‘నెహ్రూ : ఏ ట్రబుల్డ్‌ లెగసీ’ అనే పుస్తకంలో ఈ విషయం వెల్లడించారు. దానిలో మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేల్‌ లేఖలు, వాటిలోని అంశాలను సింగ్‌ ప్రచురించారు.
ఆ పుస్తకం ప్రకారం 1949 సెప్టెంబర్‌ 10న రాజేం ద్ర ప్రసాద్‌కు నెహ్ర్రూ ఒక లేఖ రాశారు. దానిలో రాజ గోపాలాచారిని ప్రథమ రాష్ట్రపతి చేయడమే క్షేమకర మైన, ఉత్తమమైన మార్గమని తాను (నెహ్రూ), పటేల్‌ నిర్ణయించినట్టు పేర్కొన్నారు. (ఇందుకు అధికారిక రికార్డులను సింగ్‌ తమ పుస్త కంలో ఉటంకించారు). ఆ త ర్వాత సర్దార్‌ పటేల్‌, రాజ్యాం గ అసెంబ్లీ సభ్యుల అభి ప్రాయాలకు ఇది భిన్నంగా ఉండడంతో నె హ్రూ తనకు అబద్ధం చెప్పారని రాజేంద్ర ప్రసాద్‌ తీవ్ర వ్యధకు గుర య్యారు. ఆయన తనకు నెహ్రూ రాసిన లేఖ ప్రతిని ఆ సమయంలో బొంబాయిలో ఉన్న పటేల్‌కు పంపారు. తాము చర్చించని విషయం గురించి నెహ్రూ పేర్కొ నడం చూసి పటేల్‌ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్‌ తన విషయంలో నెహ్రూ వ్యవహరిం చిన తీరుకు నిరస నగా సెప్టెంబర్‌ 11న నెహ్రూకు లేఖ రాశారు. పార్టీలో తనకున్న హోదా మేరకు తనకు మెరుగైన స్థానం ఇవ్వడంలో తప్పు లేదని రాజేంద్ర ప్రసాద్‌ ఆ లేఖలో నెహ్రూకు స్పష్టపరిచారు. ఆ లేఖ అం దుకున్న నెహ్రూ తన అబద్ధం బయటపడిందని తాను చేసిన తప్పును ఒప్పుకున్నారని సింగ్‌ పేర్కొన్నారు. అయితే ఆయన నేరుగా ఆ విషయాన్ని వ్యక్తం చేయ కుండా, ప్రసాద్‌ తనను, పటేల్‌ను తప్పుగా అర్థం చేసు కున్నారని ఒక లేఖ రాశారు. అలాగే పటేల్ కు తాను మొదటి లేఖలో రాసిన అంశాలతో సంబంధం లేదని పేర్కొన్నారు. పటేల్‌తో సంప్రతించకుండానే తాను రాజగోపాలపాచారిని ఎంపిక చేయాలన్న అభిప్రా యాన్ని వ్యక్తం చేసానని అంగీకరించారు. అయితే ప్రసాద్‌ తనకు రాసిన లేఖలోని అంశాల పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తెలివిగా ఈ అంశాన్ని పటేల్‌ వైపు నెట్టా రు. ఈ అంశాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత మీదేనని ఆయన పటేల్‌కు రాశారని సింగ్‌ పుస్తకంలో రాశారు.


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
  8520805566
Land Line : 08676-232797

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వికలాంగుల స్పూర్తి -హెలెన్ కెల్లెర్ ,మరియు సెక్షన్ 8 సవాళ్లు

 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”లలిత్ ”లీకేజ్ మరయు ”లోపలి మనిషి ‘



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గవర్నర్ మీదే బాధ్యత పెట్టిన కేంద్రం


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 154—శివ స్వామి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

154—శివ స్వామి

‘’కప్ఫానాభ్యుదయం ‘’ అనే  ఒకే ఒక కావ్యం రాసిన శివ స్వామి కవి కాశ్మీర్ రాజు  అవంతి వర్మ  వర్మ ఆస్థానం లో ఉండేవాడు .కాలం క్రీ శ 855-884. బౌద్ధ ధర్మావలంబి.బౌద్ధం అంటే వీరాభిమానం .పైన పేర్కొనబడిన కావ్యం బుద్ధుని స్తుతి తో ఆరంభ మవుతుంది .ఇరవై కాండలున్న ఈ కావ్యం లో దక్షిణా పద రాజు కప్ఫాన చేసిన దండయాత్రల  వర్ణనలున్నాయి  .శ్రావస్తి రాజు ప్రసేన జిత్తు రాజ్యం పై సాగిన దండ యాత్ర ఇది ..ఈ యాత్ర మలయ పర్వతాల ద్వారా జరుగుతుంది .యాత్రమధ్యలో అనేక ఋతువులు గడిచి పోతాయి .సిల్వన్ అందాలు ప్రేమికుల సరసాలు అన్నీ ఇందు లో కవి వర్ణించాడు .యుద్ధం లో విజయం సాధించినా ,కప్ఫాన  వేదాంత ధోరణిలో పడిపోయాడు .ప్రపంచ బంధాల నుండి విముక్తుడై ప్రశాంత పవిత్ర జీవితం గడిపాడు .బుద్ధ భగవానుని శిష్యునిగా మారి నిర్వాణ సుఖం పొందాడు .

శివ స్వామి కావ్యం మాఘుని శిశుపాల వధ కావ్యాన్ని , కిరాతార్జునీయాన్ని పోలి ఉంది .యమకాల గమకాల  సొగసు చూపించాడు .బంధ కవిత్వం లోనూ ప్రజ్ఞ చూపాడు . కాని కావ్యం పూర్తిగా లభ్యం గా లేదు ‘

155-జిన సేన కవి

జినసేనకవి వీరాచార్య శిష్యుడు . వీరాచార్య సుభాద్రుడు ,లోహార్యుల కాలం లో ఉన్న పవిత్ర  గ్రందాల కు అధిపతి .శ్వేతాంబర జైన మతానికి ఆచరణాంగాల్లో నిష్ణాతుడు .వీరాచార్యుడు,శిష్యుడు  జిన సేన కవి ఇద్దరు కలిసి రాష్ట్ర కూట రాజు అమోఘ వర్మను జైన మతం లోకి మార్చారు . రాజు సర్వ సంగ పరిత్యాగం చేసి రాజ్యాన్ని కుమారుడికి 875 లో పట్టాభి షేకం చేశాడు .వీరాచార్యుడు రాజుకు సన్నిహితుడై ‘’గణిత సార సంగ్రహం ‘’లో ప్రశస్తి చేశాడు

గుణ సేనుడి శిష్యుడు గుణ భద్రుడు అకాల వర్ష కు చెందిన రెండవ కృష్ణ రాజు కు ఆచార్యుడు. జిన సేనుడు అమోఘ వర్మ మనవడు మొదటి కృష్ణ రాజు కాలం లో ‘’పార్శ్వాభ్యుదయం ‘’ను 814లో రాశాడు .ఆది పురాణం లో జినసేనుడు 42 అధ్యాయాలు రాశాడు .చివరి అయిదు అధ్యాయాలను శిష్యుడు గుణ భద్రుడు పూర్తీ చేశాడు .ఈ విషయాన్ని ఉత్తర పురాణం లో చెప్పాడు .దీన్ని లోక సేన కవి రాష్ట్ర కూట రాజు రెండవ కృష్ణుడి కాలం అకాల వర్ష  లో  897 జూన్ లో రాశాడు .పార్శ్వాభ్యుదయం కాళిదాసమేఘ సందేశానికి అనుకరణ.కాళిదాసు శ్లోకం లోని చివరి పాదాన్ని గ్రహించి మిగిలిన మూడు పాదాలు తాను కూర్చాడు .23 వ జైన తీర్ధ౦కరుడైన పార్శ్వనాధుని చరిత్రే ఇది .జిన సేనుని కవిత్వం ఉన్నత సంప్రదాయం లో ఉందడి విశిష్ట గుణ గరిష్టంగా ఉంటుంది .కాళిదాసు కవిత్వానికి సరి సమానంగా ఉంటుంది .కాని కాళిదాసును మించి మాత్రం కవిత్వం ఉండదు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-15 ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గురు పూజోత్సవ ఆహ్వానం

     గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః –గురు స్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః

         శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా)దంపతుల సౌజన్యం తో        

                        గురు పూజోత్సవ ఆహ్వానం

సుమారు 70 సంవత్సరాల క్రితం  ప్రాధమిక విద్య నేర్పిన మా గురు వరేన్యులు కీ .శే.కోట సూర్య నారాయణ శాస్త్రి గారి చిత్ర పట ఆవిష్కరణ కార్య క్రమం  వారి కుటుంబ సభ్యుల సమక్షం లో గురుపూజోత్సవం నాడు 5-9-2015శనివారం ఉదయం 10 గం లకు సరసభారతి ,మరియు పి. ఆర్. ఎస్. ఏం. జూనియర్ కళాశాల సంయుక్త ఆధ్వర్యం లో ఆ కళాశాల ఆవరణలో జరుగుతుంది ..ముఖ్య అతిధిగా శాసనమండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ విచ్చేస్తారు .చిత్రకారుడు శ్రీ టి. వి .ఎస్. బి .శాస్త్రి (ఆనంద్),దంపతులు ,మా గురుపుత్రులు తమ కుటుంబాల తో పాల్గొని కార్యక్రమానికి వన్నె తెస్తారు .ప్రముఖ సంగీత విద్వాంసురాలు శ్రీమతి సింగరాజు కల్యాణి గారు సంగీత కచేరి తో వీనుల విందు చేస్తారు . . శ్రీ రాజేంద్ర ప్రసాద్ కు ,గురు పుత్రుల కుటుంబాలవారికి , ,ఆర్టిస్ట్ శ్రీ  ఆనంద్ దంపతులకు  , కళాశాల అధ్యాపకులకు ,సంగీత విద్వాంసురాలు శ్రీమతి కల్యాణి గారలకు  సన్మాన కార్యక్రమం జరుగుతుంది . ప్రతిభ గల ఒక  పేద విద్యార్దినికి, ఒక విద్యార్ధికి శ్రీ మైనేని గోపాల కృష్ణ దంపతులు ఏర్పాటు చేసిన  శ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి స్మారక నగదు బహుమతిని సరసభారతి ద్వారా  అందజేయ బడుతుంది ..పూర్తి వివరాలతో కూడిన ఆహ్వాన పత్రిక ఆగస్ట్ లో అంద జేస్తాము .

 

గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు –మరియు పి.ఆర్ ఎస్ ఏం .కాలేజ్ –ఉయ్యూరు

26-6-15 –ఉయ్యూరు

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -53

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -53

21-ప్రముఖ ఫ్రెంచ్ ఆధునిక ఇంప్రెష నిజం చిత్రకారుడు- అగస్టే రేనార్ -2(చివరిభాగం )

ప్రకృతికి పరవశం

ముప్ఫైలలో రేనార్ పట్టుదలతో మరింత శక్తి యుక్తులతో రంగుల వైభవం చూపించాడు .ఇప్పుడు విమర్శకులు ఆ రంగుల ప్రపంచాన్ని ఆహ్వానించి ఆరాధించారు .మిగిలిన సహచరుల కన్నా కాంతి సమ్మేళనం లో చిత్రాలకు వృత్తాకార నిర్మాణం చేసి ముందుకు దూకాడు .వారు ఇతన్ని చేరుకోలేక పోయారు .నలభై లలో ఆ గ్రూప్ తో సంబంధాలు వదిలేసుకొన్నాడు . ఇంప్రెష నిజం  బాగా పెరిగిపోయి ,బాగా అనిశ్చితమై ,రంగుల విషయం లో స్పష్టత లేకుండా ,చిత్ర నిర్మాణం లో శ్రద్ద  లేకుండా తయారై పోయిందని గ్రహించాడు .కనుక ముందు తనను తానూ కరెక్ట్ చేసుకొన్నాడు. తన వర్ణాలు చాలా  మృదువుగా  డిజైన్లు మరీ ప్రకాశ వంతంగా ,పరమ శాంతంగా ఉన్నట్లు అనిపించింది .ఇంతకంటే బలీయంగా రంగులు ఉండాలని  శక్తి వంతంగా కనిపించాలని నిర్ణయించాడు .అవి ‘’solid and enduring ‘’గా ఉండాలనుకొన్నాడు .దీనికోసం దక్షిణ దేశమంతా తిరిగాడు .అల్జీరియా లో సమ శీతోష్ణ స్థితి కి అబ్బురపడ్డాడు .క్రీస్తుకు ముందున్న రోమన్ ఫ్రేస్కోలను పామ్పే లో చూశాడు . .మైకేలాన్జేలో , రాఫెల్ వర్ణ సరస్సులో రోమ్ ఫ్లారెన్స్ లలో మునక లేశాడు .ఎక్కడ ప్రకృతి పరవశం గా కనిపిస్తే దాన్ని అంతటినీ మనసులో భద్ర పరచుకొన్నాడు .చూడటమే కాదు వాటిని అధ్యయనం చేశాడు .వాటికి అబ్బురపడ్డాడు .’’nothing  can be taken for granted ,nothing is stereotyped ‘’అన్న ఎరుక కలిగింది .’’the sections of an orange ,the leaves of a tree ,,the petals of a flower ,are never identical .It would seem that beauty derives its charm from this very diversity ‘’అన్నాడు రేనార్ .

మోడల్ తోనే పెళ్లి

యువకుడిగా రేనార్ బక్కగా బలహీనం గా  విశాలమైన కను బోమలతో చిన్న మీసం తో కనిపించేవాడు. జట్టు వెనక్కి దువ్వేవాడు .మిగిలిన చిత్రకారులకంటే నెమ్మది స్వభావి .ఏదిచ్చినా సంతృప్తి పొందే మనస్తత్వం .వయసు మీద కొచ్చాక మనిషిలో గాంభీర్యం ,హుందాతనం వచ్చాయి .తన దగ్గర మొడల్స్ గా ఉన్నవారిలో మరీ అందగత్తె ఎలీన్ చారిగాట్ ను  ఎంచుకొని పెళ్లి చేసుకొన్నాడు .హాయిగా ఆనందంగా ఇద్దరూసామరస్యం తో  గడిపారు .ముగ్గురు కుమారులు పుట్టారు .అందులో జీన్ సినీ దర్శకుడిగా గొప్ప విజయాలు  సాధించాడు .

ఆర్దిటిస్ తో ఆర్టిస్ట్

యాభై లలో రేనార్ ను కీళ్ళ నెప్పులు బాగా బాధించాయి .అరవైలలో ఇవి పెరిగి మరీ బాధ పడ్డాడు .ఆర్దిటిక్ బాధ అనంత వేదనే అయింది .నడవ లేక పోయేవాడు .చివరికి చక్రాల బండీ యేశరణ్యం అయింది .చేతులు మరీ దెబ్బ తిన్నాయి .బొటన వ్రేలు తో ,చూపుడు వేలును కలప లేక పోయేవాడు .కాని పేయింగ్ ను మాత్రం మాన లేదు .చిత్రాలు ఇదివరకు లాగానే తేజో వంతం గా వేస్తున్నాడు .ఒక క్లాంప్ ఆధారం గా వ్రేళ్ళను కదిలించి చిత్ర రచన చేశాడు తన తండ్రి అని కొడుకు చెప్పాడు .కాని చరిత్రకారుడు రేనార్ వ్రేళ్ళు బ్రష్ పట్టుకోలేనంత బలహీనం గా ఏమీ లేవు  చాలా స్పష్టంగా గీసేవాడు అన్నారు .ఆ రంగులు చర్మానికి తగిలి ఇరిటేషన్ కలిగించేవి .తర్వాత అవే కండరాల నెప్పులు గా మారాయి  .తన ‘’పక్క’’ను చూసి .’’this ridiculous invention ‘’ అన్నాడు .ఎందుకు ఆధునిక సైన్స్ ఈ వృద్ధ జ౦బు కాలను ‘’ జాడీలో ఊరగాయ ‘’లాగా భద్ర పరుస్తోందో అర్ధం కావటం లేదన్నాడు .

రేనార్ విధానం

ఆ తర్వాత కాలం లో వేసిన కాన్వాస్ లు మరింత బలీయంగా ,సంపన్నంగా ఉండేవి .ముదురు ఊదా రంగు బాగా ఇష్ట పడేవాడు. బర్గండి ఎరుపు  రోజ్- పర్పుల్ కలర్లు ఎక్కువ గా వాడేవాడు .65 వ ఏట రేనార్ ను అమెరికన్ పెయింటర్ క్రిటిక్ వాల్టర్ పాష్ అతని విధానం ఏమిటి అని ప్రశ్నించాడు .దానికి రేనార్ ‘’I want red to be sonorous to sound like a bell .If it does not turn out that way ,I put on more reds or other colors till I get it .I have no rules and no methods .I look at a nude ,there are myriads of tiny tints .I must find the ones that will make the flesh on my canvass live and quiver .Shall I tell you what I think are the two qualities of art?i must be indescribable and it must be inimitable ‘’అని స్పష్టంగా చెప్పాడు

కీళ్ళ నొప్పులు పెరిగిన కొద్దీ రేనార్ చిత్రకళా పెరిగింది .ఒక సహాయకుడిని పెట్టుకొని శిల్పాలనూ తయారు చేశాడు .వాటిని అత్యున్నతంగా ప్రతిభా వంతంగా శిల్పీకరించాడు .ఎవరూ అతని శిల్పకళ ను  విమర్శించలేదు .అజాగ్రత్త ,నిస్తేజలను దూరం చేసుకొన్నాడు .1919లో కూడా ఇంకా కొత్త విషయాలు నేర్చుకొన్నాడు .’’నేనింకా అభి వ్రుద్ధిలోనే ఉన్నాను ‘’అన్నాడు 78 వ ఏట .ఆ మర్నాడే 1919 డిసెంబర్ 3 న చిత్రాకారుడు శిల్పి అగస్టీ రేనార్ చనిపోయాడు .

జీవితం చివర్లో రూపొందించిన పెద్ద నగ్న శిల్పాలు వెచ్చని స్ట్రా బెర్రీ జూస్ లో స్నానించి నట్లున్నాయి అన్నారు .అతని స్త్రీలు ‘’warm and lush ‘’కాని పసి  మనస్తత్వం తో అమాయకం గా ఉంటారు అన్నారు .అతను దేన్నీ బ్రష్ తో ముట్టుకొంటే అది ఒక కళా ఖండమే అయింది అతని శైలి బాగా ప్రాముఖ్యత ప్రాచుర్యం  పొందింది . ఇమ్ప్రేషనిజం ఆ తర్వాత ఉధృతమైన ఉద్యమగా మారింది .అవసాన దశలో మాటిస్సా వచ్చి  రేనార్ ను చూసి ‘’అతని ప్రతి స్ట్రోకు ఎక్కువ  నొప్పుల్ని కలిగిస్తోంది ‘’అన్నాడు .’’ఎందుకు ఇంకా పని చేస్తున్నావు ?’’అని ఆయన  అడిగితే  రేనార్ ‘’నెప్పులు  మాయమవటానికే .’’అని చెప్పి ‘’the pleasure –the creation of beauty remains ‘’అన్నాడు రేనార్ .

‘’ ఫెమినైన్ సేన్సుయాలిటీ ‘’రేనార్ ప్రత్యేకత . “Renoir is the final representative of a tradition which runs directly from Rubens to Wattea రేనార్  చిత్రాల  అమ్మకం70 మిలియన్ డాలర్లు దాటింది . Renoir mastered the ability to convey his immediate visual impressions, and his paintings showed great vitality, emphasizing the pleasures of life despite the financial worries that troubled him. Several of his masterpieces date from this period: La Loge (1874; “The Theatre Box”), Le Moulin de la galette (1876), The Luncheon of the Boating Party (1881), and Mme Charpentier and Her Children (1878). Charpentier organized a personal exposition for the works of Renoir in 1879 in the gallery La Vie Moderne.

అతని పెయింటింగ్స్ లో ‘’డాన్స్ ఎట్ లీ మోలిన్ డీ లా గెలేట్ ‘’ప్రసిద్ధమైనది ఇందులో ఒక డాన్స్ గార్డెన్ లో ఆరుబయట క్రిక్కిరిసిన జనం కనిపిస్తారు .ఇక్కడే రేనార్ నివసించేవాడు .వేలాది చిత్రాలు గీశాడు

 

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-15 ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఎండ్లూరి సుధాకర్ గారి ఆధునిక అష్టవిధ నాయికలు -చినుకు -ఏప్రిల్-మే సంచిక

ఎండ్లూరి సుధాకర్ గారి ఆధునిక అష్టవిధ నాయికలు -చినుకు -ఏప్రిల్-మే సంచికastanayikas 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -52

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -52

21-ప్రముఖ ఫ్రెంచ్ ఆధునిక ఇంప్రెష నిజం చిత్రకారుడు- అగస్టే రేనార్

చిత్రం వినోదం

20 ఏళ్ళ వయసులో ఆగస్టీరేనార్ తాను గీసిన కొన్ని చిత్రాలను ‘’గ్లేయిర్ ‘’అనే పెయింటర్ కు చూపించాడు .ఒక సారి చూసి ‘’చేతకాని పని చేసి పెయింట్ తో నిన్ను నువ్వే  వినోద పరచుకోన్నట్లున్నాయి  ‘’అన్నాడు .కుర్రాడు వెంటనే ‘’నాచిత్రం నాకు వినోదం  కలిగించక పోయిన రోజు పెయింటింగ్ వేయటం  ఆపేస్తాను ‘’అన్నాడు .చిత్రాలలో వినోదానికి అంత ప్రాధాన్యత నిచ్చాడు రేనార్ .అన్ని రకాల చిత్రాలు గీశాడు .అవి వినోదాన్నే కాదు ఆశ్చర్యాన్నీ కలిగించాయి .అనేక శైలులలో  చిత్రించాడు వైవిధ్యం అతని ఊపిరి .పాలెట్ నైఫ్ టెక్నిక్ దగ్గర్నుంచి,ఎకడమిక్ డ్రాయింగ్ లదాకా అన్నీ చేశాడు .సాధారణం నుంచి సంక్లిష్టం దాకా ప్రయాణించాడు .నగ్న చిత్రాలు కుటుంబ చిత్రాలు కూడా గీశాడు .సూర్య కాంతిలో మెరిసే ప్రక్రుతి దృశ్యాలు ,స్నాన ఘట్టాలలో విషయాలు ,చిన్నారుల నవ్వుల అందాలు అన్నీ అతని చిత్రాలలో జీవం పోసుకోన్నాయి .

సంగీతం నుంచి చిత్రలేఖనానికి

మొదటిసారిగా రేనార్ కాన్వాస్ మీద చిత్రం గీయ లేదు .పోర్సేలీన్ తో చేశాడు ఫ్రాన్స్ దేశం లో లిమోజేస్ అనే చోట రేనార్ 24-2-1841 జన్మించాడు. అసలు పేరు పియరీ అగస్టే రేనార్ .కూలి పని చేసుకొనే అతని తలిదండ్రులు పారిస్ కు మారారు .కొడుకు సంగీత విద్వా౦సుడవుటాడని ఆశించారు .గురువు సంగీతంమేస్తారు .కాని రేనా ర్ చేతులకు  పియానో వాయించటం కంటే పెన్ను తీసుకొని రాయటానికే ఇష్టం గా ఉండేది .14 వ ఏట పారిస్ లోని చైనా ఫాక్టరీలో అప్ర౦ టిస్ గా చేరాడు .కుండలు జాడీలపై చేతి తో పెయింటింగ్ వేసేవాడు .కాని ఇది ఎక్కువ కాలం సాగలేదు .వాణిజ్యపరమైన డిజైన్లు రూపొందించాడు .ఫాన్ లకు ,ట్రేలకు డిజైన్లు వేసి బాగానే డబ్బు కూడ  బెట్టి గ్లేయర్ ఆర్ట్ క్లాసుల్లో చేరాడు .ఇక్కడే సిసిలీ మొనేట్ అనే అతనితో పరిచయమై స్నేహితుడయ్యాడు .అతను ఇతన్ని కళా ప్రపంచపు ద్వారాలు తెరిచి చూపించాడు .కేధలిక్ అయినా కనిపించిన ప్రతిదానిలో అందాన్ని చూసేవాడు .స్టూడియోలకు  సెలూన్ లకు వెళ్లి విషయాలు అర్ధం చేసుకొనేవాడు .తాను  లోవర్ మధ్య ఉన్నట్లు ఫీల్ అయ్యేవాడు. నిజానికి అతను ఉన్నది మౌంటెన్ బ్లీన్ ఫారెస్ట్ దగ్గర .ఆ అరణ్యం అతన్ని బాగా ఆకర్షించింది .

యువ ఆర్టిస్ట్స్  అసోసియేషన్

24  వయసులో రేనార్ గీసిన రెండు చిత్రాలను సెలూన్ మెచ్చి ఆహ్వానించింది ..కాని తన విధానం లో తానూ వేసి చిత్రాలను పంపిస్తే తిరస్కరించింది సెలూన్ .కానీ అది వైఫల్యం కాదు .పోర్త్రైట్లకు కమీషన్ వచ్చేది .మురికి కూపం లోంచి మకాం రూ సెయింట్ జార్జ్ కి మార్చాడు .ఒంటి మీదకు 33 వచ్చాయి .స్వంత కాళ్ళ మీద నిలబడే సత్తా వచ్చింది. ఇరవై మంది ప్రయోగకులతో కలిసి ఒక సొసైటీ ఏర్పాటు చేశాడు .ఇందులో డేగస్ ,పిస్సరొ ,మొనేట్ ,సిజన్నే ,కూడా సభ్యులే .వీరందరూకలిసి మొదటి చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు .చూసినవాళ్ళు పిల్లికూతలు అరుపులు కేకలతో నిరుత్సాహ పరచారు .మళ్ళీ రెండో ప్రదర్శన పెడితే మొదటిదానికంటే భీభత్సం జరిగింది .రేనార్ చిత్రాలను చూసి మొనేట్ అతనికి ప్రతిభ లేదని ఆ విషయం అతనితో చెప్పమని రేనార్ స్నేహితుడికి చెప్పి ఇంక పెయింటింగ్ జోలికి రేనార్ ను వెళ్ళ నీయ వద్దు అనిఒక ఉచిత సలహా పారేశాడు .   ,

ఇంప్రెష నిస్టులు

ఈ కొత్త ఆర్టిస్ట్ గ్రూప్ ను చీదరించుకొన్నారు, అవహేళన చేశారు అందరూ .మొనేట్ ఒక కాన్వాస్ పై ‘’ఇంప్రెషన్- సన్ రైజ్ ‘’చిత్రించాడు .దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఈ గ్రూపు కు ‘’ఇంప్రెష నిస్టులు ‘’అని ముద్ర వేశారు .ఈ పేరును ఈ గ్రూపు తిరస్కరించలేదు .ఆహ్వానించారు .’’treating a subject in terms of the tone and not of the subject itself is what distinguishes the Impressionists from other painters ‘’అని తమ భాష్యం చెప్పుకొన్నారు .వాస్తవానికి ప్రతిబింబం కాదుకాని దాన్ని మరో రకం గా ఆవిష్కరించటమే వారు చేసిన పని .జ్ఞానేంద్రియ జ్ఞానానికి ప్రాధాన్యమిచ్చి ,ప్రకాశవంతమైన చిత్రాలు గీటమే ధ్యేయంగా పని చేశారు .పెయింట్ స్ట్రోక్ లతో ఫలితాలు రాబట్టారు ‘’they succeeded in in blurring the out lines of objects and merging them with the surroundings .This method permitted the introduction of one color into the area of another without degrading or losing it –thus enriching the color effects .The technic of vivid strokes seemed best to their efforts at retaining rapidly changing aspects ‘’అని ‘’the history of impressionism ‘’లో రేవాల్ద్ రాశాడు కాంతికి  చాయకు ఉన్న అనంతమైన మార్పుల్ని గుర్తించటం వాటిని కొత్తగా పిగ్ మెంట్ భాషలో చూపటం ఇందులో ప్రత్యేకత .దీనితో స్టూడియోలకే పరిమిత మైనచిత్రకళ  బాహ్య ప్రపంచం లోకి వచ్చి పొలాలు  అడవులు సరసులు ,సుడులు తిరుగుతున్న నీటి ప్రవాహాలు చిత్రాలలో దర్శన మిచ్చాయి .మొనేట్ ఏకంగా ఒక పడవ మీదే స్టూడియో నిర్మించుకొన్నాడు .చీకటి వెలుగుల  చిందు లాట దర్శించి చిత్రించాడు  .సిజన్నే లాగా రేనార్ కూడా ‘’దిఆర్ట్ ఆఫ్ ఇమ్మీడిఎట్ ‘’ను అభినందించాడు .ఇదే సెన్సిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ అన్నారు .ఒక ఆకు అంతర్నిర్మాణం  ఎలా ఉందొ చెప్పటానికి దాన్ని చిత్రవధ చేయక్కరలేదు స్పాంటేనియస్ విజన్ ఉంటె చాలు అంటాడు .

Inline image 1     Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-15 ఉయ్యూరు


గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దశమ వార్షికోత్సవ చినుకు సంచిక

దశమ వార్షికోత్సవ చినుకు సంచిక

‘’ఇక చినుకు రాదు .అయిపొయింది ,ఆగిపోయింది ‘’అని కొందరు సంబర పడుతున్న కాలం లో చినుకు సాహిత్యపు వానై ,వరదై, పదవ వార్షిక ప్రత్యేక సంచికగా రెండు రోజుల క్రితమే వచ్చి అందర్నీ ఆశ్చర్య పరచింది . రావు అనుకొన్న వర్షాలు ఈ మధ్య విపరీతంగా కురిసి హర్షాన్ని తెచ్చాయి ఆంద్ర దేశానికి .ఇప్పుడు ‘’ఈ చినుకూ’’ అంతే .

ముచటైన ముఖ చిత్రం ముందుగా మనల్ని ఆకట్టు కొంటుంది .’’అక్షరాలూ సేకరిస్తూ చల్లుకుంటూ సాహితీ సేద్యం చేస్తున్న నండూరి మాటలు ఎంకిపాటల్లా కమ్మగా ఉన్నాయి.ఎండ్లూరి వారి అష్ట విధనాయికలు  సంచికకు ఒక హైలైట్ అయితే, పన్నాల వారు అబ్బూరివారితో చేసిన ఇంటర్వ్యు మరో హెవీ లైట్ .’’సహన ద్రుష్టి తో సమీక్షించ గలిగే వ్యక్తిత్వాలే –సముదాత్త జీవన గమనానికి ‘’పధ సూచికలు అన్న సి నా రే కవిత అందరికి గణపాఠమే .’’అత్యాధునిక జీవన  శైలిలో –అంతర్గతంగా దాగిన తృష్ణ ‘’వావి వరసలు విస్మరించే పశుకామ తృష్ణ అని నిఖిలేశ్వర్ సమాజ పోకడను చిత్రించారు .భండారు వారి మనం మరచిన’’ హరికధ’’ను బాగానే ‘’గానం’’ చేశారు .ఎందుకో నరేంద్ర కద మధురాంతకం గా లేదు .సినీకవుల గేయాలు చర్విత చర్వణాలే అయినా ‘’ఆపాత మధురాలే ‘’.జాన్సన్ గారీమధ్య ఏదిరాసినా ‘’చోమన దడి ‘’గా కొత్తగా ఉంటోంది .కవన శర్మ కధకు హాట్సాఫ్ .రాంబాబు గారికద నిజం గా ఆయన ‘’కధా వేదగిరి ‘’అనిపించింది .చలపాక కద కరెంట్ టాపిక్ .పండుముసలి వింజమూరి గారు గోప దంపతులకు గౌరవం తెచ్చారు .’’రాయ్ ‘’గారు రాయాల్సింది పొందికగా రాశారు .

30 కధలు ,20 కవితలు ,8 సమీక్షలు ,10 విశ్లేషణలు ,ఒక ముఖా ముఖం వగైరాలతో బృహత్తర అక్షర వాహినిగా ఏప్రిల్ –మే కలగలపు ప్రత్యెక సంచికగా చినుకు దర్శనమిచ్చింది .కొని చదివి పదిల పరచుకోవలసిన సంచిక ఇది .

గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-15 –ఉయ్యూరు .

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పరిపూర్ణ ,రవిశంకర్ వ్యాసాలూ



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నన్ను నావని రమ్మంది గోదారి -అందెశ్రీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోడీకి మోడీ పరీక్ష

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికా అధ్యకక్ష ఎన్నికలో బాబీ జిందాల్ సాహసం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -5

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -5

20- వ శతాబ్దపు ఫ్రెంచ్ మహా శిల్పి –అగస్టీ రోడిన్ -3(చివరిభాగం)

అసాధారణ శిల్ప నైపుణ్యం

మిగిలిన కళాకారులు రోడిన్ శక్తి సామర్ధ్యాల లతోపాటు అతని విధానాలను ఇప్పుడు బాగా అర్ధం చేసుకొన్నారు .విమర్శకులు రోడిన్ ను పొగడ్తాలతో మున్చేస్తున్నారు .కాని అందులోనూ కొంత జాగ్రత్తా పాటించారు .అతని సాహిత్య ప్రజన తక్కువ అన్నారు అతని సూటి నిజాయితీ తనాన్ని మెచ్చ కుండా ఉండలేక పోయారు .’’కళాకద ‘’అనే పుస్తకం లో ఎస్ రీనాక్ ‘’రోడిన్ చేసిన వ్యక్తిగత సామూహిక శిల్పాలు’’ డోనటేల్లో ‘’శిల్పాల స్పూర్తి నిస్తున్నాయి .మార్బుల్ లో రోడిన్ తన మనోభావాలన్నీ గొప్పగా ప్రదర్శించాడు .భారీతనం ఆకారాలలోనే కాదు అందం లో భావ వ్యక్తీకరణలో అసాధారణం గా ఉంది ‘’అని రాశాడు .

న్యూడ్ హ్యూగో

ఈ అసాధారణం అనే పదం  రోడిన్ కు యాభై ఆరేళ్ళు వచ్చిన తర్వాతవిక్టర్ హ్యూగో శిల్ప  ప్రదర్శన నాడు  మళ్ళీ బయటికొచ్చింది .పాన్దియన్ లు ఆర్డర్ చేస్తే దీన్ని శిల్పీకరించాడు రోడిన్ . ఇందులో నేటివ్ సెన్స్ ను చూపించాడు .కవి  నవలా రచయిత అయిన హ్యూగో ను భారీ శిల్పంగా నగ్నంగా వదులైన బట్టతో చూపించాడు .కానని వాళ్ళు కోరింది ఫ్రాక్ వేసుకొని దర్జాగా కనిపించే హ్యూగో .ఇది చూసి వాళ్ళు అ రోడిన్ అభి రుచిని తిట్టిపోశారు .శిల్ప సౌందర్యం తెలియని ఎద్దు మొద్దు అన్నారు .జుగుప్స కలిగించే భంగిమలకు ఆకర్షితుడు అని దుయ్య బట్టారు

సాంస్కృతిక ఇంప్రెష నిజం –తిరస్కరింప బడిన బాల్జాక్ శిల్పం .

మరో రెండేళ్ళ తర్వాతనాటక కర్త బాల్జాక్ భారీ శిల్పాన్ని1898లో న్యు సెలూన్ లో  ప్రదర్శించాడు .దీన్ని ‘’సొసైటీ ఆఫ్ మెన్ ఆఫ్ లెటర్స్ ‘’సంస్థ ఆర్డర్ చేసింది .రోడిన్ గీసిన బాల్జాక్ శిరసు స్కెచ్ ను చూడగానే వాళ్ళు అగ్గిమీద గుగ్గిలమై తిరాస్కరించారు .ఆ విగ్రహం మెట్రో పాలిటన్ మ్యూజియం లో ఇప్పుడు ఉంది .కాని రోడిన్ ఇందులో సాంస్కృతిక ఇంప్రెష నిజం ‘’ను ప్రవేశ పెట్టాడు .అందువల్ల పురాతన గ్రీకు శిల్పం ళా కనిపించింది.కొందరికి ప్రాధమిక  గోథిక్ శిల్పం ళా తోచింది .మరికొందరికి చరిత్రకు పూర్వం ఉండే నిలబడ్డ పొడవైన శిలలాగా (మెన్హిర్స్) అనిపించింది .నిరాశ చెంది రోడిన్ బాల్జాక్ శిల్పాన్ని ఏమీ మార్చ లేదు తన ధోరణిలోనే చెక్కాడు .పొట్టిగా లావుగా ఉండేఅసలైన  బాల్జాక్ ను శిల్పీకరించలేదు .కాని సింహ శిరసు చైతన్యం తో చెక్కాడు దీన్ని అర్ధం చేసుకొన్నా విశ్లేషకుడు ‘’లామేన్ టైన్ ‘’’’thi figure of an element ‘’అన్నాడు .పేపరు వాళ్ళు కాకిగోల చేశారు .మునిసిపాలితీవాళ్ళు క్షమించరాని అవమానం అన్నారు .దీనీపై ఎన్నో కధనాలు అల్లి ,దూషించారు .ఒకప్పుడు చాలా రియలిస్టిక్ గా చేస్తున్నాడు రోడిన్ అన్న వాళ్ళే ఇప్పుడు అతనికి నేచురల్ గా  ఉండటం అంటే ఏమీ తెలియదు అని అన్నారు .ఈరకమైన వ్యతిరేక ప్రదర్శన రోడిన్ ను మనస్తాపానికి గురి చేయతమేకాడు ఆరోగ్యం పైనా ప్రభావం చూపింది .

చైతన్య పరాకాస్ట

రోడిన్ చేతిలో ఇంకా ఎన్నో అద్భుతాలు ఆవిష్కరింప బడాలి ..ఎన్నో చిరకాలం గుర్తుంచుకోదగిన చిత్రాలు ,శిరస్సులు ఆయన చేయాలి అందులో ముఖ్యం గా జార్జి బెర్నార్డ్ షా ,గుస్టేవ్ మాలర్ ,చార్లెస్ బాడర్లె ,జోసెఫ్ పులిట్జర్ మొదలైనవి .ఇవన్నీ సజీవ చైతన్యం తోణికిస లాదేట్లు నిర్మించాడు .చివరగా’’పోప్ బెనడిక్ట్ -15  ‘’పరమాద్భుత శిల్పం ,ఇవికాక 1909-11 మధ్య కాలం లో ఎన్నో చిన్న చిన్న కంచు విగ్రహాలు ,నాట్యం చేసేవారిని తయారు చేసి ప్రాణ ప్రతిష్ట చేశాడు .ఇంతగోప్పగా ధైర్యం గా చురుగ్గా అంతకు ముందెప్పుడూ దూసుకు వెళ్ళలేదు .న్యు యార్క్ ట్రిబ్యూన్ పత్రికలో ఎమిలి జేనార్  రివ్యు రాస్తూ ‘’they reach far out into space ,so they delineate not so much a specific dance in motion or a pair of acrobats as they do a flowering –out of dynamic energy expressed through the metal forms and the space they measure ‘’అని కీర్తించారు .

గౌరవ ఆదరాలు

అరవైలలో రోడిన్ ను పారిస్ లోని గ్రేట్ ఎక్సి బిషన్ లో సత్కరించటం ప్రారంభించారు .  అప్పటికి ఇంకా ఆయన శిల్పిస్తున్న ‘’నరక ద్వారం ‘’పూర్తికానేలేదు .తిరస్కరింప బడ్డ బాల్జాక్ శిల్పం తో బాటు వందలాది శిల్పాలు చిత్రాలను ఒక ప్రత్యెక భవనం లో పెట్టి దానికి’’రోడిన్ పెవిలియన్ ‘’అని పేరు పెట్టారు .తాను చేస్తున్న మాధ్యమానికి రోడిన్ కొన్ని సూత్రాలు రాశాడు .అసలైన శిల్పి బాహ్య సౌందర్య ప్రదర్శనలో తృప్తి చెందడు .అందులో దూసుకు వచ్చే  పదార్ధాన్ని ఆస్వాదిన్చేట్లు చేయాలి అన్నాడు .’’నేనేదీ కొత్తగా సృష్టించలేదు సృష్టిలో ఉన్నదానినే మళ్ళీ కనుక్కొన్నాను .ప్రతిదీ ప్రకృతిలోనే ఉంది .కళాకారుడు ప్రకృతిని అనుసరిస్తే అన్నీ అందుకోగలదు .మనవ శరీరం దేవాలయ యాత్రలాంటిది .దేవాలయం లో ఉన్నట్లే ఒక మధ్య బిందువు ఉంటుంది .దాని చుట్టూ అంతా అల్లుకు పోయి విస్తరిస్తుంది .ఆధునికులు చాయను అనుసరించారు పూర్వీకులు కాంతిని దర్శించారు .మనకు మైకేలాన్జేలో లోని ఆధ్యాత్మిక ప్రాధాన్యం తెలిస్తే గ్రీకులలాగా ప్రవర్తిస్తే అతని శిల్పాలలో అవిశ్రాంత చైతన్యాన్ని దర్శించగలం .

ఫలితం ఆశించకుండా చేసే కృషిని మనసును అర్ధం చేసుకో గలం ‘’అన్నాడు రోడిన్ .చివరగా ‘’the martyrdom of the creature tormented by un reliable aspirations ‘’అన్నాడు .

హద్దులు మీరిన అభిమానం

 

తాను భావించిన విషయాలన్నిటినీ జీవితకాలం లో ముసలితనం లోనే సాధించాడు రోడిన్ .తన శిల్పాలు తనకాలపు ఆధ్యాత్మిక భావనలకు ప్రకటనలే అంటాడు .మొదటి ప్రపంచ యుద్ధప్రారంభం రోడిన్ ను నిరాశ్ పరచింది .అది అతని జీవా శక్తికి విఘాతం కలిగించి చావుకు కారణం అయింది .ఫ్రాన్స్ దేశం లో ఇంధనం కొరత బాగా ఏర్పడింది .రోజ్ రోడిన్ దంపతులు చలికి వనికిపోఎవారు .1916జులై 10 నరోడిన్ కు తల తిరిగినట్లు అనిపించింది .మేడ మెట్ల నుంచి జారి పడ్డాడు .మంచం మీదనే ఉండిపోయాడు .ఎందరెందరో మహిళలు ఆయన అభిమానులు ,వచ్చి విపరీతంగా అయన చుట్టూ మూగారు .ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా కబుర్లతో కాల క్షేపం చేశారు .భార్య రోజ్ వీళ్ళను చూసి కొంత అసూయ కొంత జుగుప్స కోపం తో భర్తకు దూరంగా ఉంది .వాళ్ళ కోలాహలం భరించలేక పోయింది వాళ్ళ అభిమాన శిల్పి మరణ శయ్యమీద ఉన్నాడని వాళ్లకు స్పృహ లేకుండా పోయినందుకు విచారించింది కాని ఆ విషయం ‘’మాస్టర్ ‘’కు చెప్పే సాహసం చేయ లేక పోయింది ,నిస్సహాయం గా నిస్చేస్తం గా ఉండిపోయింది .రోడిన్ చుట్టూ చేరిన ఆడవాళ్ళు తమలో తాము కలహించుకొని జుత్తూ జుట్టూ పట్టుకొని పోట్లాడుకొన్నారు .తిట్టుకొన్నారు కొట్టుకొన్నారు .చాలా అసభ్యంగా ప్రవర్తించారు .చివరికి జూడిత్ క్లాడ్ వచ్చి పరిస్తితిని చక్క బరచాల్సోచ్చింది .

యాభై ఏళ్ళ కాపురం తర్వాత రోజ్ ను  పెళ్ళాడిన రోడిన్

సెప్టెంబర్ లో రోడిన్ కు ప్రభుత్వ పెన్షన్ ఇచ్చారు ,ఈ పెన్షన్ తో రోజ్ జీవితం గడవటం కష్టం అనిపించింది రోడిన్ కు .ఆమె ను వివాహమాడి భార్య అని తెలియ జేస్తేనే ఆమెకు న్యాయం చేసిన వాడిని అవుతాననుకొన్నాడు.అప్పుడే చట్టప్రకారం తనకున్నదంతా ఆమెకు దక్కుతుందని భావించాడు .1917 జనవరి లో రోజ్ ను రోడిన్ పెళ్ళాడాడు యాభై ఏళ్ళు ఆమెతో కలిసి జీవించి తన 68వ ఏట రోజ ను పెళ్లి చేసుకొని ఆమెకు చట్టా భద్రత కల్పించాడు .ఈ వివాహ వేడుక ముగియగానే రోజ్ కు విపరీతమైన దగ్గు వచ్చి ,గదులను వెచ్చ చేసుకోవటానికి బొగ్గు కూడా లేకుండా గడిపి కొన్ని వారాల తర్వాతా రోజ్ మరణించింది .

మహా శిల్పి మహాభి నిష్క్రమణం

భార్య రోజ్ మరణం తర్వాత రోడిన్ ఎనిమిది నెలలు మాత్రమె జీవించాడు .వాతావరణం తట్టుకోలేనిదిగా ఉండేది .విపరీతంగా దగ్గు తెరలు తెరలుగా వచ్చేది .చలి మరీ విజ్రుమ్భించింది .గడ్డకట్టే చలి బాధించింది .వేడి చేసుకొనే బొగ్గు లేదు .ఈ నరక యాతన భరిస్తూ చివరికి 17-11-1917న  77 ఏళ్ళ వయసులోఅమరశిల్పి రోడిన్  మరణించాడు .మాదన్ లో రోజ్ సమాధి దగ్గరే రోడిన్ సమాధిని కూడా ఏర్పాటు చేశారు .వారి సమాదులమీద కంచు శిల్పం ‘’ది దింకర్’’ను ఉంచారు

.                 రోడిన్ ‘’సర్ఫేస్ మోడలింగ్ కళ’’

1870లో ఇటలీ యాత్ర తర్వాతా అనుకోకుండా రియలిజం కు మారాడు .  1900 నాటికి రోడిన్  ఫ్రాన్స్ దేశపు మహా శిల్పి అని పించుకొన్నాడు .తర్వాత ప్రపంచ మహా శిల్పులలో ఒకడై ప్రపంచ వ్యాప్త కీర్తిని పొందాడు .ధన సంపన్నులేందరో ఆయనకు మహా శిల్పాలు తయారు చేసే బాధ్యతలు అప్పగించారు దాన్ని సార్ధకం చేసుకొన్నాడు .

నేచరిస్ట్ అయిన రోడిన్ భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యత నివ్వకుండా ,వ్యక్తిత్వానికి ఎమోషన్ లకు మాత్రమె విలువ నిచ్చాడు .తరతరాల సంప్రదాయాన్ని ,గ్రీకుల ఆదర్శ వాదాన్ని వదిలేసి ,బోరోక్ నియో బోరోక్ ల డేకరేటివ్ కళను కూడా దూరం చేసుకొని తనదైన రీతిలో వృద్ధి  చేశాడు ,ప్రతి శిల్పం రక్త మాంసాలతో వ్యవహరిస్తున్నట్లు గా తీర్చి దిద్దాడు .భావోద్రేకాలను  అతి స్పష్టంగా వ్యక్త పరచాడు .మనిషి మానసిక స్వభావాలు అతని భౌతిక స్వరూపాలకు ప్రతి బింబాలు అని భావించాడు .రోడిన్ ది ’’సర్ఫేస్ మోడలింగ్ కళ’’అంటారు .అతను సృష్టించిన ‘’దింకర్ ‘’శిల్పాన్ని గురించి రోడిన్ ‘’అందులోని మనిషి మెదడు తో నేకాక  నుదురు ,ముక్కు పుటాలు ,బిగ బట్టిన పెదిమలు ,చేతులు కాళ్ళ లోని ప్రతి కండరం ,ముడిచిన పిడికిలి బిగ పట్టిన మడమలు అన్నీ ఆలోచిస్తాయి అంటాడు .

శిల్పం లో సర్వ  సత్తాక స్వేచ్చ

రోడిన్ శిల్పాలే కాదు శిల్ప ఖండాలు కూడా సర్వ సత్తాక స్వేచ్చను వ్యక్తం చేస్తాయి .శిల్ప ఖండాలైన బాహువులు లేకుండా కాళ్ళు  లేకుండా ,తలలేకుండా ,చేసినవి అనూచానంగా వస్తున్న సంప్రదాయానికి తిరస్కరణలే .ఒకే మాదిరి మూస పోకడ నుండి తమకు తాము వ్యక్తిత్వం తో ప్రకాశించేట్లు చేశాడు .వీటికి ఉదాహరణలే వాకింగ్ మాన్ ,మెడిటేషన్ వితౌట్ ఆర్మ్స్ ,ఐరిస్ ,మెసెం జర్ఆఫ్ ది గాడ్స్ శిల్పాలు.

బాధ ,సంఘర్షణ ఆధునిక కళకు ‘’హాల్ మార్క్ ‘’అన్నాడు రోడిన్ . ‘’Nothing, really, is more moving than the maddened beast, dying from unfulfilled desire and asking in vain for grace to quell its passion.”’’అన్నాడు రోడిన్ .

సంగీత కళాభిమానం

 రోడిన్ కు వీర ఆరాధకుడు కవి బాడరెల్ . రోడిన్ కు సంగీతం ఇష్టం .గ్లాక్ చేసిన ఒపేరా మ్యూజిక్ అంటే అభిమానం .ఫ్రెంచ్ కేతడ్రిల్స్  .పై గ్రంధం రాశాడు రోడిన్ .అందరూ మర్చిపోయిన’’ ఎల్ గ్ర్రీకో ‘’ ,అప్పటికి ఇంకా ప్రాధాన్యం పొందని ‘’వాన్ వొఘ్ ‘’ల సంగీతాన్ని స్వంతం చేసుకొన్నాడు రోడిన్ .

రోడిన్ శిల్పకళలో పరిణామం

తన శిల్పాన్ని తయారు చేయించుకొంటూ జార్జి బెర్నార్డ్ షా రోడిన్ ముందు కూర్చున్నాడు .అప్పుడు రోడిన్ ను బాగా గమనించిన ఆయన ‘’రోడిన్ అనేక అద్భుతాలను ఆవిష్కరించాడు’’అన్నాడు . .తన బస్ట్ శిల్పం తయారీలోని వివిధ దశలను గమనించిన షా ‘’ కళావిర్భావ పరిణామ దశలన్నీ చూపించాడు రోడిన్ ‘’అని శ్లాఘించాడు ‘’మొదటగా బైజాంటిన్ మాస్టర్ పీస్ లాగా ,బెర్నిని ని లాగ  ,తర్వాత గొప్ప హూడన్ ల కళా సంవిధానం దర్శింప జేశాడు .అతని చేతులు ఒక శిల్పి శిల్పించే చేతుల్లా ఉండవు .’’ఎలాన్ వైటల్ ‘’చేత లాగా అంటే అంతరాత్మ చేత లాగా ఉంటుంది అన్నాడు .’’ది గాడ్ ఆఫ్ హాండ్ ‘’అనేది రోడిన్ చేతి పనే .

రోడిన్ వర్కింగ్ మోడల్

ఏ శిల్పం చేసినా మొదట మట్టి తోనే చేసేవాడు దీనికి అతి నిపుణులైన సహాయకులను పెట్టుకొనేవాడు .తర్వాత ప్లాస్టర్ తో చివరికి కంచు తో చేసేవాడు .అదీ అతని పని తీరు .ఈ విధం గా 19 వ శతాబ్దపు శిల్ప కళ దానికి ప్లాస్టర్ ను వాడే తీరుకు నాంది పలికాడు రోడిన్ .

రోడిన్ ప్రత్యేకత

శిల్ప కళను సంప్రదాయ విధానానికి భిన్నంగా తీర్చి దిద్దాడు రోడిన్ .రిపిటీషన్ నుంచి దాన్ని తప్పించాడు  .20 వ శతాబ్దపు శిల్పకళకు దారి చూపాడు . His popularity is ascribed to his emotion-laden representations of ordinary men and women – to his ability to find the beauty and pathos in the human animal.

రోడిన్ జీవితకాలం లో అతన్ని మైకేల్ ఆంజేలో తో పోల్చేవారు .ఆ యుగపు గొప్ప శిల్పి అని భావించారు .రోడిన్ చనిపోయిన మూడు దశాబ్దాలకాలం లో ఆయన్ను అందరూ మర్చిపోయారు .1950 నుంచి రోడిన్ ఆరాధన మళ్ళీ ఊపు అందుకొన్నది .ఆధునికకాలపు మహా శిల్పి అని గుర్తించారు .రోడిన్ చేసిన’’ వాకింగ్ మాన్ ‘’శిల్పం 20 వ శతాబ్దపు ‘’ఆముక్త కళ’’ అంటే ఆబ్ స్ట్రాక్ట్  స్కల్ ప్చర్  ఆర్ట్ కు మార్గ దర్శకమైంది .

బాల్జాక్ శిల్పం

See adjacent text.

Nude man holding is hand out, as if explaining a point.

జాన్ బాప్టిస్ట్

the thinker

మరో వ్యక్తితో మళ్ళీ కలుద్దాం

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-6-15 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుస్తక దినోత్సవ సంధర్భంలో నా అంతరంగములోని తరంగాలకు అక్షర రూపం – పుస్తక పురాణం మరియు పుస్తకానికి పుష్కరాలు – బందా

పుస్తక దినోత్సవ సంధర్భంలో నా అంతరంగములోని తరంగాలకు అక్షర రూపం – పుస్తక పురాణం మరియు పుస్తకానికి పుష్కరాలు – బందాimg140 img141

Posted in సేకరణలు | Tagged | Leave a comment

అమెరికాలో మాయా బజార్ కళల సౌధం లో కదా సాగు

 
 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -50 20- వ శతాబ్దపు ఫ్రెంచ్ మహా శిల్పి –అగస్టీ రోడిన్ -2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -50

20- వ శతాబ్దపు ఫ్రెంచ్ మహా శిల్పి –అగస్టీ రోడిన్ -2

మానవ శరీరం సర్వం సుందరమే

వాల్ట్ విట్మన్ మహాకవి కి లాగానే రోడిన్  కు కూడా మానవ శరీర భాగాలలో అందంగా ఉండనిది ఏదీ లేదనే భావం ఉంది .జీవితం లోని అతి సూక్ష్మ విషయాల పరిశీలన కూడా అవసరం అనేవాడు .రోడిన్  కు సెక్రెటరి గా పని చేసిన రైనర్ మారియా రిల్కే ‘’Rodin  grasped life in its smallest details –he observed it and it followed him –he awaited it at the cross roads where it lingered ,he over took it as it ran before him –he found it in all places equally great ,equally powerful ,and over whelming ‘’అని అతని తత్వాన్ని బాగా అధ్యయనం చేసి చెప్పాడు .రోడిన్ శరీరం అనేక పరీక్షలకు లోనైంది .ఎడారులు అందులో ప్రాకాశించాయి .ఆకలి దాన్ని బాధగా చూపింది  .దప్పిక కూడా వదలలేదు .ఇవన్నీ తట్టుకొని నిలబడి గట్టి వాడయ్యాడు .అతను వంగితే పటకార లాగా కనిపిస్తాడు. నడుస్తుంటే ప్రపంచ దూరాలన్నీ అతని తోనే ఉన్నాయని పిస్తుంది .అతని అడుగు బలంగా ద్రుఢం గా పడేది .అటూ ఇటూ ఊగుతుంటే అతనిబాహువులు అతని అడుగులను గురించి మాట్లాడుతున్నట్లుండేది .గాలిలో తేలిపోయినట్లు నడిచేవాడు .

మార్బుల్ మాస్టర్

కళలో ఎదుగుతున్న కొద్దీ రోడిన్ సున్నితత్వాన్ని శిల్పాలలో తెచ్చాడు .ఇ౦ ప్రెషనిస్ట్ చిత్రకారుడు గా అనిపించేవాడు .అతని తీరును నిశితంగా పరిశీలించిన అమెరికా విమర్శకుడు జేమ్స్ హన్కర్ ‘’the edges of certain parts were amplified ,deformed ,and falsified to ensure the undulating appearance of life ‘’అని చెప్పాడు .అతని ఆలోచన అస్పష్టం అనిపిస్తుంది .శిల్పం లో ఒక ధ్యాన యోగం ఉంటుంది. అదే అతని గొప్ప చిత్ర నిర్మాణ విధానం .అతనికి పాలరాయి అంటే మార్బుల్ అంటే మహా ఇష్టం. ఆ ఇష్టమే అతడిని శిల్ప నిర్మాణం లో పరాకాష్టకు చేర్చింది .అతను రూపొందించిన శిల్పాల శిరస్సులు , శరీర  భాగాలు పుష్ప సౌందర్యాన్ని సున్నితత్వాన్ని గుర్తుకు తెచ్చి మార్బుల్ అతని చేతిలో మట్టి,  మైనం అయి అనేక రూపాలు దాల్చి౦దే మోనని పిస్తుంది  .అంత లావణ్యం గా రోడిన్ శిల్పాలుంటాయి .

శిలా మహా కావ్యం

నలభై ఏళ్ళ వయసులో రోడిన్ పొట్టిగా ఉన్నా ఆకర్షణీయంగా ఉండేవాడు .అతని గడ్డం మాత్రం భలే తమాషాగా ఉండేది .అది నెరసిన తర్వాత ఓల్డ్ టెస్ట్ మెంట్ ప్రాఫెట్ లాగా కనిపించేవాడు .ఇంకా బాగా చెప్పాలంటే ‘’గాలిక్ హాన్స్ సాచ్’’ లా ఉండేవాడు .అద్భుత కళాఖండాలు సృష్టించాలని భావించాడు రోడిన్ .అందుకోసం మొదట ‘’గేట్ ఆఫ్ హెల్ ‘’అనే భారీ ప్రాజెక్ట్ తీసుకొని ఇరవై ఏళ్ళు దానిపైనే పని చేశాడు .ఆ శిల్పం లోని సౌందర్యాన్ని ఆస్వాది౦చనవారు దాన్ని ‘’ఎపిక్ ఇన్ స్టోన్  ‘’అన్నారు .అంటే ‘’శిలా మహాకావ్యం’’ అని వేనోళ్ళ కీర్తించారు  .డాంటే కలగన్న అన్ని భావాలకు ఈ శిల్పం ప్రతీకగా ఉందని మెచ్చుకొన్నారు .విషయ స్పృహ లో నుంచి అలౌకిక స్పృహకు దారి తీసింది ఆ శిల్ప చాతుర్యం .దీని తర్వాత అనేక అద్భుత శిల్ప రచన చేశాడు రోడిన్ .అందులో ‘’ఆడం అండ్ ఈవ్ ‘’,పోలో అండ్ ఫ్రాన్సిస్కా ‘’,ఉగాలినో ‘’,వరుస శిల్పాలను మిగిలినవాటిలో ముద్దు వంటివి –(కిస్ అమాంగ్ అదర్స్) అంటారు .దీనినే రోడిన్ ‘నోవాస్ ఆర్క్ ‘’అన్నాడు .కొందరు మాత్రం లాస్ట్ జడ్జి మెంట్ కు భయంకర రూపం అన్నారు .మరికొందరు మైకెలాంజిలో –మెడిసి కోసం డిజైన్ చేసి రూపొందించిన అసంపూర్తి సమాధులు అన్నారు .

త్యాగధనుల శిల్ప సృష్టి

యాభైలలో రోడిన్ కాలం బహు ఫలవంత మైన కాలం .పోర్ట్రైట్ ,కంచు విగ్రహాలు  ,స్మృతి చిహ్నాలు తయారు చేయటానికి చాలా ఆర్డర్లు వచ్చాయి .నగరాలు అక్కడి హీరోల ,చారిత్రిక పురుషుల విగ్రహాలు తయారు చేసి వారికీర్తిని ఇనుమడింప చేయమని కోరాయి .అలాంటి వాటిలో నాన్సీ టౌన్ క్లాడ్ లోర్ర్రైన్  స్మృతి చిహ్నం ఒకటి .డాం విల్లర్స్ కోసం బాస్తిన్ లేపెజ్ విగ్రహం ,కలైస్ కోసం ‘’దిబర్గర్స్ ఆఫ్ కలైస్’’శిల్పించి అమోఘం అని పించుకొన్నాడు .వీళ్ళందరూ కూడా చారిత్రాత్మక మహా పురుషులే .వీరు పద్నాలుగో శతాబ్దం లో నగరం ఆకలి బారిన పడకుండా మూడవ ఎడ్వర్డ్ రాజుకు తమల్ని తాము బలి చేగా ఆత్మ త్యాగం చే సుకొన్న వీరులు ధీరులు దీరోదాత్తులు త్యాగ దనులు మహా పురుషులు .ఈ ఆరుగురిని ఒక బృందంగా ముందు శిల్పించి ఆ తర్వాత విడివిడిగా ప్రతి ఒక్కరినీ తీర్చి దిద్దాడు .వారి త్యాగాలను అజరామరం చేశాడు రోడిన్ .అందర్నీ ఒకే వరుసలో కాకుండా రెండు నాటకీయ  వరుసలలో ఉంచి అందులో ప్రతి ఒక్కరూ ఒక గొప్ప ప్రదర్శనలో పాల్గొని తమ ప్రత్యేకతను ప్రదర్శిస్తూ సామూహిక౦ గా కదులుతున్నట్లు చేశాడు ఈ ప్రతిభకే అందరూ జేజేలు పలికారు .చిరస్మరణీయం చేశాడు వారి జీవితాలను రోడిన్ .     శిల్ప విషయమై చెబుతూ రోడిన్ ‘’sculpture is the heart of hole and the lump .’’అన్నాడు ఈ హోల్  మరియు ల౦ప్  అనే పదాలను  మొదటిసారిగా సృష్టించి,ప్రయోగాలు చేసి శాశ్వత కీర్తి పొందారు . శిల్పించి వాటి ప్రభావం ఎలాంటిదో చూపించాడు  రోడిన్ .రోడిన్ సిజాన్నే లు  అలౌకిక కాంతి నిర్మాణం లో అజరామరంయ్యారు .ఈ ఇద్దరు శిల్ప మేధావులకు మనం ఎంతో రుణపడి ఉన్నాం అన్నారు విశ్లేషకులు .రాబిన్ ‘’క్యూబిక్ ట్రూత్ ‘’కు ప్రాధాన్యత నిచ్చాడు .ఇదే  స్థల దేశాలకు గణిత పరమైన గౌరవం  అత్యంత ఉత్కృష్టమైన సమతుల్యతః తెచ్చాయి .రోడిన్ గొప్పతనాన్ని ‘’he carved the air as well as the surface of the stone to bring out ‘’the latent heroic in every natural movement ‘’ అని గొప్పగా అభి వర్ణించారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-6-15 -ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మహాపండితులు పుల్లెల శ్రీ రామ చంద్రుడు మృతి


పుల్లెల’కు నగరంతో విడదీయని బంధం

  • 25/06/2015
TAGS:

హైదరాబాద్, జూన్ 24: ప్రముఖ సాహితీవేత్త, సంస్కృత భాషలో నిష్ణాతుడు పుల్లెల శ్రీరామచంద్రుడికి నగరంతో విడదీయలేని బంధం ఉంది. తూర్పు గోదావరి జిల్లా హిందూపల్లి వాస్తవ్యులైన ఆయన కొంతకాలం స్వస్థలంలో పనిచేసినా, ఆ తర్వాత నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగంలో లెక్చరర్‌గా చేరి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అత్యుత్తమ సేవలందిస్తూ క్రమంగా ప్రొఫెసర్‌గా, ఆ తర్వాత సంస్కృత విభాగానికి అధిపతిగా ఎదిగి మరువలేని సేవలందిస్తూ ఇక్కడే స్థిరపడ్డారు. జి.పుల్లారెడ్డి ట్రస్టు తరపున భాషా వికాసం, సాహితీ, సంస్కృతి పరిరక్షణల కోసం నగరం వేదికగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. దీంతో పాటు సంస్కృత భాష ప్రచారం, దాన్ని వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేసిన ప్రముఖుల్లో పుల్లెల ఒకరు. బుధవారం సాయంత్రం ఆయన కనుమూశారన్న సమాచారం తెలవటంతో ఐఏఎస్ అధికారి జెఎస్వీ ప్రసాద్‌తో పాటు పలువురు సాహితీప్రముఖులు జూబ్లీహిల్స్ ఐటికాలనీ సమీపంలో ఉన్న ‘నందనవనం’ భవన సముదాయంలోని ఆయన నివాసానికి చేరుకోవటంతో అక్కడ విషాదం అలముకుంది. పలువురు ప్రముఖులు ఆయన సేవలను స్మరించుకున్నారు. సంస్కృతాంధ్ర భాషలో ఆయన చేసిన రచనలు, భాష వికాసం కోసం చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. మొత్తం 25 రచనలు చేసి, అందులో ఓ రచనకు రాష్టప్రతి పురస్కారాన్ని పొందారు. రచనల్లో ఎక్కువ అనువాదాలు చేశారు. సంస్కృతం, తెలుగు భాషల్లో తనకున్న పట్టును నిరూపించుకున్నారు. అంతేగాక, వాల్మీకి రామాయణాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదించిన గొప్ప సాహితీవేత్త పుల్లెల శ్రీరామచంద్రుడు.

పాలగుమ్మి పద్మరాజు ఆదర్శనీయుడు
కాచిగూడ, జూన్ 24: ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు శతజయంత్యుత్సవ సమాపన సభ తెలుగు రథం, శ్రీవేదగిరి కమ్యూనికేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా సిక్కిం మాజీ గవర్నర్ వి.రామరావు విచ్చేశారు. పాలగుమ్మి పద్మరాజు మానవీయ విలువలు కట్టుబడిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన రచనలు నేటి తరానికి తెలియజేయ వలసిన అవసరం ఉందని అన్నారు. కవిగా, చిత్ర రచయితగా, నవల నాటకకర్తగా ఎన్నో పురస్కారాలను అందుకున్నారని తెలిపారు. ‘బంగారుపాప’, ‘అంతర్జాతీయ కథకుడు’ అనే పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో విశ్వసాహితి అధ్యక్షుడు డా.పోతుకూచి సాంబశివరావు, లేఖిని మహళ చైతన్య సాహితీ సంస్థ అధ్యక్షురాలు డా.వాసా ప్రభావతి, రచయిత విహారి, పాలగుమ్మి సీత, పాలగుమ్మి రత్న, సంస్థ అధ్యక్షుడు కొంపెల్లి శర్మ, డా.వేదగిరి రాంబాబు పాల్గొన్నారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చినుకు10 వ వార్షిక పత్రికలో చలపాక కద”తరగని ముద్ద”

chalapaka2 001 chalapakakadha 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -49

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -49

20- వ శతాబ్దపు ఫ్రెంచ్ మహా శిల్పి –అగస్టీ రోడిన్

అగస్టీ రోడిన్ శిల్పాలను మొదట తిరస్కరించిన వారే ఆ తర్వాత మహా గొప్ప శిల్పి అని ఆరాధించారు .గౌరవించారు సత్కరించారు .మళ్ళీ అతి తక్కువ చేసి మాట్లాడారు .దూషణ భూషణలు ఆయన జీవిత సముద్రం లో కెరటాలయ్యాయి .పావు శాతాబ్దికాలం ఆయన  సృజన అంతా పెద్దగా ఆమోదం పొందలేదు .పై పెచ్చు  అలక్ష్యం చేశారు కూడా .కొన్నేళ్ళ తర్వాత ప్రతిభను గుర్తించి  అగ్రాసనం మీద కూర్చో బెట్టారు .అంతే కాదు 19 వ శతాబ్దపు అత్యుత్తమ శిల్పి అని ,అన్నికాలాలలోని మహా శిల్పుల లో ఒకడు అని వీర తాళ్ళు వేశారు .ఇదీ లోక రీతి .

మట్టి బొమ్మల శిల్పి

12-11-1840 లో పుట్టిన ఫ్రాన్కోస్ అగస్టీ రెనో రోడిన్ ఫ్రాన్స్ లోని పారిస్ లో పురాతన గోధిక్  లక్షణాలున్న   జన సమూహం ఉన్న ప్రాంతం లో పుట్టాడు . తల్లి లోరైనీ నుండి తండ్రి నార్మన్ జాతికి చెందిన పని వారి కుటుంబం లోంచి వచ్చారు .ఆ జిల్లాలో రోడీన్లు అతి పేదవారుగా గుర్తింపు పొందారు .రోడిన్ కు అందువల్లనే 13 వ ఏట నుండి సరైన స్కూల్ విద్య నేర్చుకొనే అవకాశం లేక పోయింది .చిన్నతనం నుండి డ్రాయింగ్ బొమ్మలు గీయటం అతనికి అంది వచ్చిన వరం అయింది .తల్లి గ్రోసరీ షాప్ నుండి తెచ్చే సరుకుల పొట్లాల పేపర్ల పై ఉన్న కామిక్ బొమ్మలను చూసి రోడిన్ కాపీ చేసేవాడు .తర్వాత వాటిని తన స్వయం కృషి తో బాగా గీసేవాడు .ఇది గమనించిన తలి దండ్రులు రోడిన్ మాంచి కమర్షియల్ ఆర్టిస్ట్ అవుతాడని సంబర పడ్డారు .ఇంటి దగ్గర స్పెషల్ టీచర్స్ ను పెట్టి అతని చిత్ర నైపుణ్యాన్ని పెంచే స్తోమత వారికి లేదు .అందుకని అతని ఆసక్తికి ఊతం గా డేకరేటివ్ ఆర్ట్  లో శిక్షణ నిచ్చే’’ పెటైట్ ఈకోల్ ‘’లో చేర్పించారు .పెన్సిల్ డ్రాయింగ్ అంటే అసలు ఇష్ట పడని రోడిన్ మట్టి బొమ్మలు చేయటం లో ఆసక్తి చూపించి అదే తన జీవిత గమ్యం అనుకొన్నాడు .

పోర్సిలీన్ శిల్పి

18 వ ఏట ఈకోల్ బీక్స్ ఆర్ట్స్ లో చేరటానికి ప్రయత్నింఛి పరీక్ష రాశాడుకాని ఫలితాలు దారుణం గా ఉన్నాయి .మూడు సార్లుప్రవేశ  పరీక్షరాసి తప్పాడు .ఇది చూసిన తలిదండ్రులు నీరు కారిపోయారు .అరకొర సంపాదనతో బతుకు బండీ ఈడుస్తున్న తండ్రి  కొడుకును ఆ సంస్థకు పంపటం మానేశాడు .రోడిన్ తన కాళ్ళ మీద తాను నిలబడాల్సిన పరిస్తితి వచ్చింది .ఏదో ఉద్యోగం చేసి పొట్టపోసుకోవాలి .మట్టి బొమ్మల తయారీలో అప్ర౦టిస్ గా ,జర్నీమాన్ గా, ఆర్నమెంట్ వర్కర్ గా  పని చేశాడు .కాపీయిస్ట్ గా ,స్పైరల్ స్క్రోల్స్ తయారీలో అనేక చోట్ల పని చేశాడు .ప్రముఖ జంతు శిల్పి ఆటోయిన్ లూయీ బారీ దగ్గర పని చేసి తాను బారీ శిష్యుడిని అని చెప్పుకోనేవాడు .తర్వాత’’మోల్డర్ ‘’అవతారం ఎత్తాడు .తర్వాత సెవ్రెస్ లో ఉండే పోర్సేలీన్ ఫాక్టరీకి డిజైన్లు తయారు చేసే కారియర్ బెల్లీస్ దగ్గర చేరాడు .ఇక్కడే చిన్న చిన్న విగ్రహాలు తయారు చేయటం ,జంతు భాగాలు కూర్చటం ,బొమ్మలకు అలంకరణ చేయటం నేర్చుకొన్నాడు .తర్వాత మూస పని(మోల్దింగ్) అలవాటు అయింది .ఈయన దగ్గరే అయిదేళ్ళు ఉన్నాడు .రెండు డాలర్ల నెల అద్దె ఇచ్చి ఒక గుర్రపు శాలలో గడిపాడు .అది చీకటి గుయ్యారం .దానికి ఒక చివర పెద్ద బావి ఉంది .తాను  ఇక్కడే ఉండి పని చేయాల్సిన వాడు కనుక తానే ఆ నూతిని పూడ్చేశాడు రోడిన్ .

ముక్కు తెగిన మనిషి బొమ్మ

వయసు ఇరవై అయిదు వచ్చింది .నాగలి పట్టి దున్నే వాడుగా మొరటుగా కనిపించేవాడు .ముక్కు ఫ్లాట్ గా ఉండేది .ఒక బస్ట్ విగ్రహాన్ని చేసి ‘’ముక్కు తెగిన మనిషి ‘’అని పేరు పెట్టి1864 లో సెలూన్ కు తీసుకెళ్ళాడు .దాన్ని వాళ్ళు తిరస్కరించటమే కాదు తిట్టి పంపించారు .యదార్ధాన్ని ప్రతి బించి చేసిన శిల్పాన్ని వాళ్ళు మెచ్చుకోలేక పోయారు .అతను ‘’far too naturalistic and that he had mistaken the medium ‘’ అన్నారు విమర్శకులు .నిరాశ తోమళ్ళీ గురువు గారి దగ్గర చేరి కొన్నేళ్ళు పని చేశాడు .తన ప్రజ్ఞను కనబరుస్తూ లలితమైన ,అనుకరణాత్మకమైన  చిన్న చిన్న బొమ్మలు తయారు చేసి అమ్మి జీవనోపాధి పొండాడు .1870లోపర్షియన్ వాళ్ళు  పారిస్  ఆక్రమణ కోసం చేసిన దాడిలో  నేషనల్ గార్డ్ గా పని చేశాడు .ఫ్రాంకో పర్షియన్ యుద్ధం ముగియ గానే బెల్జియం వెళ్ళాడు .అక్కడ బెల్జియన్ శిల్పి వాన్ రాస్ బోర్గ్ దగ్గర శిల్ప నిర్మాణం లో మెళకువలు నేర్చాడు .

మోడల్ భార్య

ఒక సారి పారిస్ అవతల ఒక బిల్డింగ్ వర్క్  చేస్తుంటే అందమైన కళ్ళున్న అమ్మాయి కనిపించింది .ఆమెకు 19 .పేరు రోజ్ బ్యూరేట్ .’’రోజ్ అంత బ్యూటీ’’అనుకొన్నాడు .  ఆమె కుటుంబం వారు చా౦పేన్ లో రైతులు .పారిస్ లో సీస్మిస్త్రేస్ గా  పని చేయటానికి వచ్చింది . ఆమెను మోడల్ గ పెట్టుకొని బొమ్మలు తయారు చేస్తూ ఇద్దరూ ప్రేమలో పడగా ఆమె అతనికో పిల్లాడిని’’ కని ‘’ పెట్టింది .ఈమెను అతని తలిదండ్రులు ఆదరించారు. అందరూ కలిసి బతికారు .ఆమె సైనికులకు చొక్కాలు కుట్టి సంపాదించేది .ఆ డబ్బుతో కొడుకు ను సాకేది .అప్పుడప్పుడు మొగుడు పెళ్ళాలు పోట్లాడుకోనేవారు. ఆమెలో సహనం ఎక్కువ .రోడిన్ మాత్రం బాధ్యతా రాహిత్యం గా ప్రవర్తించేవాడు. అతని తలిదండ్రులు ఆమె పక్షంగా మాట్లాడేవారు .కాలం గడిచిన కొద్దీ తాను ‘’ప్రకాశించే సూర్యుని కి ఛాయ మాత్రమె ‘’అని గ్రహించింది .అతను ఆమెను మంచీ చెడు తెలిసిన ఇల్లాలు అని కోపం అసూయ ,అనుమానం  ఉన్నా ప్రేమ గుణం ఉందని ,సత్యాసత్య వివేకం తెలిసిన దొడ్డ ఇల్లాలని చెప్పాడు .వారిద్దరిది అలౌకిక ఆత్మీయ ప్రేమ అంటారు  .మోడల్ గా వచ్చిన అమ్మాయి మోడల్ భార్య అయింది రోడిన్ కు .

సహజం నుండి అసహజానికి

1877లో సలూన్ రోడిన్ శిల్పాన్ని ప్రదర్శించటానికి అనుమతి నిచ్చింది .దానిపై 18 నెలలు తీవ్రం గా ద్రుష్టి పెట్టి పని చేశాడు .దీనికి ‘’కంచు యుగం ‘’(ఏజ్ ఆఫ్ బ్రాంజ్ )అని మొదట పేరు పెట్టి తర్వాత’’ప్రక్రుతికి మానవుడి జాగృతి ‘’(మాన్ ఎవేకేనింగ్  టు నేచర్ )అని మార్చాడు .దీన్ని చూసిన నిర్వాహకులు పెదవి విరిచారు .వారికి కావాల్సిన లలిత సుందర నగ్న శిల్పం కాదు అది .వెంటనే తిరస్కరించి ‘’too precise ,too realistic ‘’ అని వ్యాఖ్యానించారు .అది సృజనాత్మక శిల్పం కాదని అన్నారు .ఆ రోజుల్లో ఇవి సాధారణమే . .నకిలీ శిల్పాలు చేస్తున్నకాలమే అది . ఈ ఆరోపణను  చాలెంజ్ గా తీసుకొన్నాడు రోడిన్ .ఒక నాయకుడి శిల్పాన్ని తయారు చేసి మామూలు గా జీవితం లో కనిపించే నగ్నత్వం కన్నా ఇంకా ఎక్కువ నగ్నం గా తీర్చిదిద్ది ‘’నడుస్తున్న మనిషి ‘’అని పేరు పెట్టాడు .కాని శిల్ప విశ్లేషకుడు అక్టేవియాన్ మిరాబూ కు ఇది ‘’సెయింట్ జాన్ ‘’పోలికలున్న శిల్పం అని పించింది .ఈ జాన్ గారే తర్వాత ‘’సెయింట్ జాన్ బాప్టిస్ట్ ‘’గా ప్రసిద్ధుడయ్యాడు .సుప్త స్థితిలో ఉన్న శీలా  సజీవ చైతన్య రూపం దాల్చింది రోడిన్ చేతిలో .రోడిన్ లో  ఆత్మ స్థైర్యం ఒక్కసారిగా పెల్లుబికింది .

Inline image 1  Inline image 2

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-6-15 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఈ తరానికి సాయిబాబా ఎందుకు ఆరాధ్యుడు – బందా ( సర్దాగా చదవండి)

ఈ తరానికి సాయిబాబా ఎందుకు ఆరాధ్యుడు – బందా ( సర్దాగా చదవండి)img137 img138 img139

Posted in సేకరణలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 152- 100 అధ్యాయాల రామాయణం రాసిన మెంధ కవి .

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

152- 100 అధ్యాయాల రామాయణం రాసిన మెంధ కవి .

భర్త్రు మెంద గా ప్రసిద్ధుడైన ఈ కవిని కొందరు కాళిదాసు కంటే ఘనుడు అని తమకావ్యాలలో పేర్కొన్నారు .మెంద అనే పదానికి అర్ధం ఏనుగును నడిపే మావటి వాడు అని .జల్హనుడు  తన సూక్తి ముక్తావళి లో రాజ శేఖరుడు ఈ విషయం పై రాసిన శ్లోకాన్ని ఉదాహరించాడు .మిగిలిన చరిత్రకారులు కూడా ఈకవిని మెంద అనే పేరుతోనే పిలిచారు .’అతని ’హస్తి పాల ‘’మొదలైన వాటిలో అడవి  ఏనుగులను ఏ విధం గా మాటు పెట్టి గోతులలో పడేట్లు చేస్తారో వివరింప బడి ఉంది .దీన్ని  బట్టి మెంద కు  కు ఈ విద్య తో సంబంధం ఉన్నట్లు తోస్తుంది .

కల్హణుడు మెంద ను కాశ్మీర్ రాజు మాతృ గుప్తుని ఆస్థానం లో ఉన్నట్లు రాశాడు .మాతృ గుప్తునికాలం క్రీ శ.430 గా భావిస్తే ఈకవి ఆ కాలం లో  జీవించాడని  చెప్పచ్చు . మృచ్చ కటికం ‘’లి౦ఫ తీయ తమొంగూని ‘’అనే ప్రసిద్ధ శ్లోకం లో ను ,అవిమారకుని బాల చరితం లోను ,కావ్యాదర్శం లోను ,సారంగ ధర పద్ధతిలోను విక్రమాదిత్యుడు ,మెంధతో  కలిసి కావ్యం అల్లినట్లు ఉంది .దీనితో మళ్ళీ కాలానికి గొళ్ళెం పెట్టాల్సోస్తోంది .ఏతా వాతా తేలిందేమిటంటే మెందకవి విక్రమాదిత్యుని కాలం వాడే నని .మంఖ కవి ‘’శ్రీ కంఠ చరిత్ర ‘’లో మెందను సుబందు ,భారవి, బాణులతో తో ముడిపెట్టాడు.రాజ శేఖరుడు మాత్రం ఆయన్ను వాల్మీకి అవతారం  ఆ తర్వాత భవ భూతి అవతారమని చివరికి తాను కూడా మెంద అవతారాన్నే అని మెచ్చుకొని చెప్పుకొన్నాడు   .దీన్ని బట్టి మెంద కవి 100 అధ్యాయాల ‘’రామ చరిత్ర ‘’రాశాడని తేల్చారు .దీని వ్రాత ప్రతి నకలు ఇప్పటికీ బెనారస్ విశ్వ విద్యాలయం లో భద్రం గా ఉందని క్రిష్ణమాచారియార్  రాశారు . .

153-సరస్వతీ పుత్ర-భట్టార హరిశ్చంద్ర

హర్ష చరిత లో బాణ కవి భట్టార హరిశ్చంద్ర కవి ని మెచ్చుకొన్నాడు .హరిశ్చంద్రకవి ‘’మాలతి ‘’అనే ప్రేమ కావ్యం రాశాడు .కనుక ఇతను ఐదవ శతాబ్ది కవి అని అనుకోవచ్చు .’’సదుక్తి కర్ణామృతం’’ లో ఈకవి మహాద్భుత కవిగా పేర్కొన బడ్డాడు .మహా కవుల సరసన చేర్చారు .చాటు పద్యాలలో ఈ కవి శ్లోకాలు విశేషం గా కనిపిస్తాయి .ఈ భట్టార హరిశ్చంద్ర కవి దిగంబర జైన మతానికి చెందినవాడు .తండ్రి ఆర్ద్ర దేవుడు .తల్లి రాధ .సోదరుడు లక్ష్మణ .వీరిది కాయస్తకులం లోని సనోముఖ కుటుంబం .ఈ కవి పాండిత్య ప్రకర్షకు ‘’సరస్వతీ పుత్ర’’ బిరుదం అందుకొన్నాడు .ఈకవిని రాజశేఖరుడు ‘’కర్పూర మంజరి ‘’లో పేర్కొన్నాడు .ఇతను ‘’ధర్మ సార మహాభ్యుదయం ‘’అనే 21 ఖండాల కావ్యాన్ని పదిహేనవ తీర్ధ౦కరుడైన ధర్మ నాధుని జీవిత చరిత్రగా రాశాడు .ఇందులో ధర్మపాలుని జననం నుండి నిర్వాణం దాకా వర్ణించాడు .నాయకుడైన ధర్మనాధుడు ఇక్ష్వాకు  వంశానికి చెందిన  రత్న పుర రాజు మహాసేనుడు   భార్య సువ్రతి ల కుమారుడు .హరిశ్చంద్ర కవి కవిత్వం మాధుర్యానికి నిలయం .స్వచ్చమైన తేట యైనకవిత్వం రాశాడు .

భట్టార హరిశ్చంద్ర కవి ‘’జీవనాధార చంపు ‘’ను కూడా 13 లంభాలలో జైన రాజు జీవనాదారుని జీవిత చరిత్ర గా రాశాడు.ఈ జీవనాధరుడు  సత్య౦ధర రాజు కుమారుడు .ఇందులో కవి ఉపయోగించిన భాష ఆకర్షణీయం గా ,అత్యుత్తమంగా ఉందని విమర్శకులు కీర్తించారు .టి ఎస్ .కుప్పుసామి గారు  ఈకవి ‘’జీవనాధార చరిత్రం ‘’అనే నాటకం కూడా రాశాడని తెలియ జేశారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-6-15 –ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గోదావరి మహా పుష్కరాలు – 2015 – సంక్షిప్త సమాచారం – బందా

గోదావరి మహా పుష్కరాలు – 2015 – సంక్షిప్త సమాచారం – బందాimg133 img134

Posted in సమయం - సందర్భం | Tagged , | Leave a comment

గోదావరి కృష్ణమ్మలు – అంతరంగము లోని తరంగాలకు అక్షర రూపం – బందా.

img136

Posted in కవితలు | Tagged | Leave a comment

బాహుబలి గురించి దర్శకుడు రాజ మౌళి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సి.వి అనే చిత్తజల్లు నరసింహా రావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యోగా యుగం



Gabbita Durga Prasad

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

S సుగుణా దేవి రచనలు -3

S సుగుణా దేవి రచనలు -2

S.Suguna Devi Rachanalu-3a S.Suguna Devi rachanalu-3b S.Suguna Devi rachanalu-3c S.Suguna Devi Rachanalu-3d S.Suguna Devi rachanalu-3e S.Suguna Devi Rachanalu-3f S.Suguna Devi Rachanalu-3g S.Suguna Devi Rachanalu-3h

Posted in సేకరణలు | Tagged | Leave a comment

S సుగుణా దేవి రచనలు -2

S సుగుణా దేవి రచనలు -2S.Suguna devi Rachanalu-2a S.Suguna Devi rachanalu-2b S.Suguna Devi rachanalu-2c S.Suguna Devi Rachanalu-2d S.Suguna Devi Rachanalu-2e S.Suguna Devi Rachanalu-2f S.Suguna Devi rachanalu-2g S.Suguna Devi rachanalu-2h

Posted in సేకరణలు | Tagged | Leave a comment

S సుగుణా దేవి రచనలు -1

S సుగుణా దేవి రచనలు -1

S.Suguna Devi Rachanalu-1a S.Suguna Devi Rachanalu-1b S.Suguna Devi Rachanalu-1c S.Suguna Devi Rachanalu-1d S.Suguna Devi Rachanalu-1e S.Suguna Devi Rachanalu-1f S.Suguna Devi Rachanalu-1g S.Suguna Devi rachanalu-1h S.Suguna Devi rachanalu-1i S.Suguna Devi rachanalu-1j

Posted in సేకరణలు | Tagged | Leave a comment

పతంజలి చేసిన మహోప ”యోగం ”

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దాసు శ్రీరామ కవి -,13 వ శతాబ్దపు కురాన్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహా శాస్త్ర వైద్యుడు అగ్గలయ్య చూడాల్సిన రాణక్ పూర్ ,రంగులు మార్చే జలపాత్తం -ఆంధ్ర ప్రభ

మహా శాస్త్ర వైద్యుడు అగ్గలయ్య చూడాల్సిన రాణక్ పూర్ ,రంగులు మార్చే జలపాత్తం -ఆంధ్ర ప్రభaggalayya 001 jalpath 001 ranakpur1 001 ranakpur2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”ఫన్నింగ్ ”కామెంటరి

1-దేవీ ప్రియ రాసే రన్నింగ్” కామెంటరి ”

  ”వామ ”చూపు తో అవుతోంది ”ఫన్నింగ్ కామెంటరి ”
2- ”తెలక పల్లి” రవి కి కనిపిస్తుంది ”యోగ” 
     ”యెర్ర ”దనాన్నిపూర్తిగా  మింగే ”డేగ ”. 
3-”మోడీ ”తెచ్చాడు యోగాకి అంతర్జాతీయ” మహా యోగం” 
    చాపకింద నీరు అవుతోంది లలిత్ మోడీ ”అభియోగం ”
4- అధికారం రాక ముందు అంతా ”నీతి మంతులే ”
    వచ్చాక  అవుతారు  బీరకాయిలో ”నేతి మంతులు”  
5-”చంద్రు”లిద్దరి మధ్య రాచకీయ ”పోరు”
     మీడియా కధనాలతో చెవులు ”హోరు ”
6- ఎవరి డబ్బు ఎవరు ఎందు ”కిస్తున్నారో ”
  బెమ్మకైనా తెలీని ”కిమిన్నాస్తిరో”. 
7- తెలుగు నాట వర్షాలే” వర్షాలు ”
   బాబు అడుక్కి జనం హర్షాలే” హర్షాలు ”
8- చానెళ్ళ పై ఏడాది పైగా ”నిషేధం”
   ప్రజాస్వామ్యానికి మరో” మానిషాదం ”
9- ఆద్వానికి మళ్ళీ గుర్తొచ్చింది ”ఎమర్జెన్సీ” 
    భయ పెడుతోందేమో  ”మోడీ యమఅర్జెంసీ  ”
10-వోటుకుఇస్తుంటే ” కోట్ల నోటు ”
     ఇక ఎన్నిక లెందుకు”దండగ  చేటు ” 
11-నేడు తండ్రుల దినం – ”ఫాదర్స్ డే ”
    పేర్ల తో అవుతోంది” ఫూలర్స్  డే ”
 మీ– గబ్బిట  దుర్గా ప్రసాద్ -21-6-15 -ఉయ్యూరు 
    

 
Posted in కవితలు | Tagged | Leave a comment

ఉదయ గిరి గుహలు ,బటే శ్వర్ ,దయ్యం కట్టిన వంతెన ,సింగపూర్ లో లిటిల్ ఇండియా -ఆంధ్ర భూమి

ఉదయగిరి గుహలు

  • 14/06/2015
  • |

  • -బి.మాన్‌సింగ్ నాయక్

జైన తీర్థంకరుల స్ఫూర్తితో ఒరిస్సాలోని ఉదయగిరిలో రూపుదిద్దుకున్న రాతి కట్టడాలు కాలక్రమంలో 20 హిందూ దేవాలయాలుగా మారిపోయాయి. గుప్తుల కాలంలో మహావిష్ణు దశావతారాలను ఉదయగిరి గుహల్లో చెక్కారు. దశావతారాలతోపాటు విఘ్నేశ్వరుడు, శివుడు, దుర్గామాత పది చేతులున్న విగ్రహాలు ఒకే భారీ రాతిపై మలిచారు.
అతిలోతైన చెరువు
అమెరికాలోని అతి లోతైన సరస్సు క్రేటర్ సరస్సు. ఓరెగాన్ రాష్ట్రంలోని ఈ సరస్సు లోతు 1,932 అడుగులు (589 మీటర్లు) అంటే ఈఫిల్ టవర్ లాంటి ఎతె్తైన నిర్మాణాలను రెండింటిని ఈ సరస్సులో నిలువునా ముంచవచ్చునన్నమాట.
ఎస్కిమోలు, ఇన్యూట్‌లు
రష్యా ఈశాన్యపు కొసన అలాస్కాలో ఎస్కిమోలు జీవిస్తున్నారు. ఇన్యూట్ తెగ ప్రజలు ఉత్తర కెనడా ప్రాంతమైన నునావుట్, గ్రీన్‌లాండ్‌లలో ఉంటారు. నునావుట్ అంటే వారి భాషలో ‘మా భూమి’ అని అర్థం.

  • బటేశ్వర్

    • 07/06/2015
    • |

    • -పి.వి.

    ఉత్తరప్రదేశ్ లో ఆగ్రాకు 70 కి.మీ. దూరంలో యమునానదీ తీరానగల బటేశ్వర్‌లో దాదాపు 40 దేవాలయాలున్నాయి. ఇక్కడ ఏటా శీతాకాలంలో జరిగే క్యాటిల్ ఫెయిర్‌కు 2 వేల సంవత్సరాల చరిత్ర ఉంది. 15వ శతాబ్దానికి చెందిన ఇవన్నీ శివాలయాలే. ఈ దేవాలయాల సముదాయం 1300 సంవత్సరాల కాలం నాటిది కావడం విశేషం.
    నలంద
    ఆనాడు ప్రపంచానికి విద్య, విజ్ఞానం అంటే ఏమిటో సరిగా తెలీని రోజుల్లోనే ఒక మహా విశ్వవిద్యాలయం ఉండేది. అదే నలంద. వందలాది మంది విద్యార్థులు వివిధ ప్రదేశాల నుండి వచ్చి అధ్యయనం చేసేవారు. ఇది పూర్తిగా గురుకుల తరహాగా ఉండేది. వేల సంవత్సరాల క్రితమే దాదాపు వంద రకాల విభిన్న శాస్త్రాలను అక్కడ బోధించేవారు. గౌతమ బుద్ధుడు పలు పర్యాయాలు నలందను సందర్శించాడు.
    వైశాలి
    గంగాతీరంలో ఉన్న బీహార్ సారవంతమైన భూమి. ఎటు చూసినా పచ్చని చెట్లు, తోటలు. ఇక్కడే గౌతముడు రత్నసూత్రాన్ని బోధించాడు. మహిళలకు సన్యాస దీక్షను తొలిసారిగా బుద్ధుడు ప్రసాదించింది ఇక్కడే. తన పెంపుడు తల్లి గౌతమిని తొలి సన్యాసినిగా, శిష్యురాలిగా స్వీకరించడం విశేషం.
    కపిలవస్తు
    ఇది నేటి ఉత్తరప్రదేశ్‌లో ఉంది. బుద్ధుడు తన జీవితంలోని మొదటి 30 సంవత్సరాలు గడిపింది ఇక్కడే. నాటి సిద్దార్థుని సౌధం, శిథిలాలు నేటికీ కనిపిస్తుంటాయి. ఆ శిథిల సౌందర్యాలనుబట్టి ఆనాడు ఆ రాజసౌధాలు ఎంతటి అందంగా ఉండేదో ఊహించుకోవచ్చు.
    కందిరీగ
    పెప్సిన్ అనే ఆడ కందిరీగ ఒకే ఒక గుడ్డు పెడుతుంది. గుడ్డు పెట్టే ముందు అది ఒక సాలెపురుగును వెదుకుతూ వెళుతుంది. బాగా లావైన టరాంటురా సాలె పురుగు కనిపించగానే దాని మీద వాలి కాటేస్తుంది. ఆ విష కాటుకు సాలె పురుగు చనిపోగానే దానిని గొయ్యి తవ్వి పాతి పెడుతుంది. పాతిపెట్టిన చోట గుడ్డు పెడుతుంది. గుడ్డు నుండి పెరిగి వచ్చే లార్వా సాలెపురుగు అవశేషాలను భుజించి కందిరీగగా పరిణామం చెందుతుంది.
    టొబాగో ద్వీపం
    వెస్టిండీస్ ద్వీపాల్లో ఒకటైన టొబాగో ద్వీపం, బ్రిటీష్, స్పానిష్, ఫ్రెంచ్, డచ్ పరిపాలనలలో ఒకరి నుండి మరొకరికి 31సార్లు మారి రికార్డు సృష్టించింది. కరేబియన్ సముద్రంలో నౌకాదళానికి టొబాగో ద్వీపం ఒక కీలక స్థావరం కావడం మూలాన ఈ దేశాలు ఆ ద్వీపం మీద ఆధిపత్యం కోసం విపరీతంగా పోటీ పడ్డాయి. 1819లో బ్రిటన్ ఈ ద్వీపాన్ని ట్రినిడాడ్ ద్వీపంతోపాటు మత సామ్రాజ్యంలోకి చేర్చుకుంది. 1962 దాకా ఈ ద్వీపానికి స్వాతంత్య్రం లభించలేదు.

  • దెయ్యం కట్టిన వంతెన!

    • 17/05/2015
    • |

    • -దుర్గాప్రసాద్

    ఎంతో అందమైన స్విట్జర్లాండ్‌లోని మరింత అందమైన రియాస్ నది ప్రకృతి సంపదకు నిలయం. అంతేకాదు! ఇక్కడ గల ఒక విచిత్రమైన వంతెన గురించి వినిపించే కథలు భయాన్నీ, ఆసక్తినీ కలిగిస్తాయి.
    ఎందుకంటే ఈ ప్రాంతంలోని షాలొనెన్ జార్జ్ అనే చోట గల టిఫెల్స్‌బ్రక్ అనే వంతెన చూడడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ బ్రిడ్జి అక్కడి రియాస్ నది ఉన్న ప్రాంతాన్నీ, దగ్గరలోని సెయింట్ గోట్జర్డ్‌ను కలుపుతూ ఊళ్లోకి వెళుతుంది.
    రియాస్ నది దగ్గర నుండి ఊర్లోకి వెళ్లాలంటే ఈ బ్రిడ్జే ఆధారం. అక్కడ వంతెన నిర్మించాలని 1230లో అప్పటి అధికారులు భావించారు. నిర్మాణ పని వారిని పిలిచారు. వారు వచ్చి ఎంతో దిగువగా ఉన్న ఆ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించడం అసాధ్యం అని తేల్చేశారు.
    ఎందుకంటే రియాస్ నదిని ఆనుకుని ఉన్న కొండని తొలిచి రహదారి వేశారు. ఆ రహదారి కొనసాగింపుగా బ్రిడ్జి నిర్మించి, ఊర్లోకి వెళ్లేలా వంతెన ఉండాలని ప్లాన్. అయితే నిట్టనిలువునా ఉండే కొండని కలుపుతూ, నది మీదుగా బ్రిడ్జి నిర్మించడం అసాధ్యమని పెద్దగా సాంకేతిక సౌకర్యాలు లేని అప్పటి నిర్మాణరంగ పనివారు చెప్పారు.
    అక్కడ బ్రిడ్జి నిర్మించడం కేవలం దెయ్యాలకే సాధ్యమని వారు పెదవి విరిచారు. అది విని అధికారులకు ఏం చేయాలో బోధపడలేదు.
    సరిగ్గా అప్పుడే అక్కడొక దెయ్యం ప్రత్యక్షమయిందట. ‘మీకు కావలసిన వంతెనని నేను నిర్మించి ఇస్తాను. కానీ ఒక్క షరతు’ అని చెప్పిందట.
    జరిగిన సంఘటనతో అప్పటికే బిత్తరపోయిన అధికారులు కొంతసేపటికి తేరుకుని ‘ఏమిటా షరతు?’ అని ప్రశ్నించారు.
    దానికా దెయ్యం ‘నేను వంతెన నిర్మించిన తర్వాత దీనిపై నడిచే మొదటి జీవిని నేను ఆహారంగా స్వీకరిస్తాను’ అని చెప్పింది.
    దానికి సరేనన్నారు అధికారులు.
    అప్పుడు ఆ దెయ్యం అతి ప్రమాదకరమైన రియాస్ నదిపై అతి చాకచక్యంగా మూడు రోజుల్లో వంతెన నిర్మించి ఇచ్చిందట.
    ‘నేను వంతెన నిర్మించి ఇచ్చి ఇచ్చాను. మాటకు కట్టుబడి ఈ వంతెనపై నడిచే మొదటి జీవిని నాకు ఆహారంగా ఇవ్వండి’ అని చెప్పి బ్రిడ్జికి అటు చివరికి వెళ్లి కూర్చుందట.
    అప్పుడు బాగా ఆలోచించిన అధికారులు, అక్కడి పెద్దలు దెయ్యం అనుకున్నట్లు మనిషిని కాకుండా ఒక మేకపిల్లని ఆ వంతెన మీదికి వదిలారట.
    దానికి ఆగ్రహించిన దెయ్యం తాను కట్టిన వంతెనని తునాతునకలు చేయడానికి అక్కడున్న అతిపెద్ద బండరాయిని పైకెత్తి ఉగ్రంగా ముందుకొచ్చిందట.
    అధికారులు, గ్రామస్థులు భయంతో అక్కడి నుండి పరుగులు పెట్టారు. అయితే ఎంతసేపైనా అక్కడెలాంటి బీభత్సం జరుగుతున్న అలికిడి వినిపించకపోవడంతో వెనుదిరిగి చూశారట. అప్పుడు వారికొక విచిత్రమైన దృశ్యం కనిపించింది. అప్పుడే కట్టిన వంతెనని నాశనం చేయడానికి దెయ్యం బండరాయితో వస్తుండగా, ఒక వృద్ధురాలు చేతిలో శిలువ తీసుకుని ఆ దెయ్యానికి ఎదురుగా వెళుతూ కనిపించిందట.
    వృద్ధురాలి చేతిలోని శిలువని చూసిన దెయ్యం భయంతో అరుస్తూ వంతెనని నాశనం చేయడానికి పైకెత్తిన బండరాయిని పడేసి అక్కడ నుండి పారిపోయిందట.
    దెయ్యం వదిలేసి పోయిన బండరాయి ఆ తర్వాత చాలా సంవత్సరాలు టిఫెల్స్‌బ్రక్ వంతెన వద్ద కనిపించేది. ఆధునిక కాలంలో ఆ బండరాయిని పరీక్షించి చూస్తే దాని బరువు 220 టన్నులని తేలింది. ఆ బండరాయిని 1977లో అక్కడికి దగ్గరలో మోటారు వాహనాలు వెళ్లే దారి నిర్మాణం కోసం తరలించారు. 1230లో దెయ్యం కట్టినట్లు చెప్పబడుతున్న ఆ వంతెనను ఆధునీకరించారు. ఈ బ్రిడ్జి మీద నడిస్తే అవతలికి చేరుకోవడానికి అరగంట పడుతుంది. దీని మీదుగా నడుస్తూ కిందనున్న రియాస్ నదిని చూస్తే ఎంతో అందంగా కనిపిస్తుంది. దెయ్యం కట్టిన వంతెన గురించి తెలుసుకున్న ఎంతోమంది టూరిస్టులు ప్రతి ఏటా ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు.

  • సింగపూర్‌లో లిటిల్ ఇండియా

    • 10/05/2015
    • |

    • -పుట్టా సోమన్న చౌదరి

    సింగపూర్ రోడ్లపై అంతవరకు ప్రశాంతంగా పర్యటిస్తూంటే.. ఒక్కసారిగా హైదరాబాద్‌లోని కోఠి లేదా చెన్నైలోని పాండీబజార్‌కి వెళ్లినట్లు అనిపిస్తే కచ్చితంగా అది సింగపూర్‌లోని లిటిల్ ఇండియా ప్రాంతమని చెప్పవచ్చు. ఢిల్లీ వాసులైతే ఇది చాందినీ చౌకా అనీ, ముంబై వారు ఝవేరీ బజారుకొచ్చామా? అని ఆశ్చర్యపోతారు.
    సింగపూర్ వెళ్లిన ఏ భారతీయుడైనా మెర్‌లైన్ (సగం సింహం సగం చేప బొమ్మ) పర్యాటక ప్రదేశాన్ని చూడటం ఎంత సహజమో ‘లిటిల్ ఇండియా’ ప్రాంతాన్ని చూడటం అంతే సహజం.
    ఒక విధంగా చెప్పాలంటే లిటిల్ ఇండియా ప్రాంతాన్ని ‘మోడల్ ఇండియా’ అని పిలిస్తే బాగుంటుందేమో. లిటిల్ ఇండియా బజార్‌కి వెళ్లగానే హిందీ, తమిళం, తెలుగు భాషలు గుప్పుమంటాయి. మన దేశంలోలాగే ఒకరినొకరు నెట్టుకుంటూ తోసుకుంటూ వెళ్లటం కనిపిస్తుంది. కార్ల హారన్లతోపాటు సైకిల్ గంటల శబ్దాలు వినిపిస్తాయి. ప్లాట్‌ఫారాలు రకరకాల వస్తువులతో నిండిపోయి ఉంటాయి. ఇంకా కొనుగోళ్ల కోసం రాతపూర్వక ఆహ్వాన బోర్డులే కాదు రండి – ఆవోబాయ్ అంటూ ప్రార్థనాపూర్వకమైన గొంతులు వినిపిస్తాయి.
    సింగపూర్‌లోని సెరంగూన్ ప్రాంతంలో లిటిల్ ఇండియా ఉంది. ఇది సింగపూర్‌లోని ఇతర ప్రాంతాలకంటే సందడిగా ఉండటమే కాదు సాంస్కృతిక వైవిధ్యం కూడా ఉట్టి పడుతుంది. షార్టులు, జీన్సులే కాదు లుంగీలు, ధోవతీలు, చీరలు ధరించిన వారు కనిపిస్తారు. ముఖ్యంగా ఇక్కడి వంటశాలల ఘుమఘుమలు ఆఘ్రాణించి తీరాల్సిందే. మల్లెలు, సంపెంగలు, అరటి ఆకులు, వేరుశెనగ గంపలు, కిళ్లీలు, అటుకుల మిక్చర్ తోపుడు బండ్లు, దినపత్రికలు అమ్మే కుర్రాళ్లు, రోడ్డు పక్కన చౌకరకం రెడీమేడ్ వస్త్రాలు అమ్మేవాళ్లు, చివరకు తాయత్తులు కట్టేవారు, వాచీలు, తాళాలు రిపేరు చేసేవారు కనిపిస్తారు. కూరగాయల్లో ములక్కాడలే కాదు ములగ ఆకు, కరివేపాకు, చింత చిగురు కూడా కనిపిస్తాయి. వెండి, రోల్డ్‌గోల్డ్ ఆభరణాలు, మసాలా దినుసులు అమ్మకం గురించి చెప్పనే అక్కర్లేదు. అగరబత్తులు, సెంట్లు సువాసనలు ముక్కులను తాకుతూ ఉంటాయి. ఖర్జూరం బళ్లు కూడా కనిపిస్తాయి. ఈ లిటిల్ ఇండియాలో అన్ని రకాల భారతీయ వస్తువులు దొరుకుతాయి. చౌక భోజనాలు, టిఫినే్ల కాదు కాస్త ఖరీదైన భారతీయ వంటకాలు లభించే ఇండియన్ రెస్టారెంట్లు ఎన్నో ఉన్నాయి. వాటి ముందు డిస్‌ప్లే బోర్డులు దర్శనమిస్తాయి. ఇక టేకా మార్కెట్ ఫుడ్ సెంటర్‌లోని తోపుడుబండ్లపై భారతీయ భోజనం, ముఖ్యంగా మటన్, చికెన్, రొయ్యల బిర్యానీలు దొరుకుతాయి. సింగపూర్‌లో పెద్ద సంఖ్యలో ఉండే అల్పాదాయ కార్మికులకు చౌక భోజనాలు దొరికేది ఇక్కడే. కాస్త ధర ఎక్కువైనా జోజీఆవో ఫుడ్ సెంటర్‌కి తప్పక వెళ్లాలి. అచ్చమైన భారతీయ సంప్రదాయ భోజనం కావాలంటే కోమలా విలాస్ రెస్టారెంట్‌కి వెళ్లాల్సిందే. లోయర్ సెరెంగూన్ రోడ్డు నుండి కిచనేర్ రోడ్డు వరకు ఎన్నో ఆలయాలు, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. బఫైల్లో రోడ్, కెరంబూరోడ్, బలీలియా రోడ్, కరైకొడి సెంటర్, డన్‌లప్ స్ట్రీట్, క్యాంప్ బెల్ లైన్, హెండ్సన్ రోడ్, చందర్‌రోడ్, కాంసోగ్‌కాపూర్ రోడ్‌లలో షాపింగ్ చేయవచ్చు. 1950లో నెహ్రూ శంకుస్థాపన చేసిన గాంధీ మెమోరియల్ హాల్ కూడా ఇక్కడే ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని శ్రీలక్ష్మి మందిరం, కలియమ్మన్ మందిరం, శ్రీనివాస్ పెరుమాళ్ అనే వేంకటేశ్వర స్వామి ఆలయాల వల్ల కూడా లిటిల్ ఇండియా రద్దీ ప్రాంతంగా మారిందని చెప్పవచ్చు. లిటిల్ ఇండియా ప్రాంతానికి అండర్‌గ్రౌండ్ రైలు మార్గం ఉంది. స్టేషన్ నుండి బయటికి రాగానే సెంటర్ కనిపిస్తుంది. ఇది చాలా రద్దీ ప్రాంతంగా చెప్పవచ్చు. ఇక లిటిల్ ఇండియాకి అతి సమీపంలోని ముస్త్ఫా సెంటర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది 24 గంటలూ తెరిచి ఉండే అతి పెద్ద షాపింగ్ మాల్. సింగపూర్ టూర్‌లో గైడ్లు ఈ షాపింగ్ కోసమే పది పనె్నండు గంటలు కేటాయిస్తారు. ఇక్కడ గుండుసూది మొదలుకొని దొరకని వస్తువంటూ ఉండదు.
    సింగపూర్‌లో సుందరమైన భవనంగా కీర్తించే లినోంగ్‌సేన్ బౌద్ధ మందిరం లిటిల్ ఇండియా ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉంది. సింగపూర్ వెళితే మెరలైన్ సింహాన్ని, కేబుల్ కార్లనే కాదు ‘లిటిల్ ఇండియా’ను కూడా తప్పక చూడాలి.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యోగా’కి రాజయోగం

యోగా’కి రాజయోగం

  • 21/06/2015
  •  -బి.వెంకటప్రసాద్

వేల ఏళ్ల చరిత్ర ఉన్న మన యోగా వైపు నేడు ప్రపంచమంతా ఆసక్తిగా చూడటం మొదలుపెట్టింది. గతంలో యోగాను విశ్వసించేవారు, సాధన చేసే వారు, ఆచరించేవారు ఎంతో మంది ఉన్నా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21వ తేదీని యోగా దినోత్సవంగా గుర్తించడంతో ప్రపంచ వ్యాప్తంగా యోగా సంబరాలు మొదలయ్యాయి. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా చెప్పుకునే యోగాను ఇపుడు ప్రపంచం యావత్తూ అక్కున చేర్చుకుంటోంది. యోగా ఐదువేల ఏళ్లుగా భారత్‌లో ప్రాచుర్యంలో ఉంది. గెలుపు స్థిరం కాదు, ఓటమితో అంతా అయిపోదు. కానీ- ప్రతి మలుపులో గెలుపును చూడాలి. ఎందుకంటే విజేతల జీవితాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి. నిలకడ లేని పరిణామాల మీద హృదయాన్ని నిలబెట్టి విజయానికి అదే దారి అనుకుంటూ కలల్లో విహరించడం, ఆ దారిలో ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోవడం సమంజసం కాదు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి. అలా మనసుకు అలవాటు చేసుకోవాలి. మనసును నియంత్రించి, అది మనం చెప్పినట్టు వినాలంటే దానికి ఏకైక మార్గం యోగాభ్యాసం. అన్ని విషయాల్లో ముందు జాగ్రత్తలు పాటించే మనం ఆరోగ్యం విషయంలో మాత్రం తీవ్రమైన అలసత్వాన్ని పాటిస్తుంటాం. రోగాలు రాకుండా జాగ్రత్త పడటం మానేసి, తీరా రోగాలు వచ్చిన తర్వాత వేలకు వేలు పోసి చికిత్సలు చేయించుకుంటాం. అసలు రోగమే రాకుండా నిరోధించే దివ్య ఔషధం అరచేతిలోనే ఉన్నా మనం పట్టించుకోం. ఇంతకీ ఆ దివ్య ఔషధమే- యోగా. భారతీయ సనాతన ధర్మం నుండి ఆవిర్భవించి నేటికీ కొనసాగుతున్న ఆరోగ్య సూత్రమే యోగా. సనాతన ధర్మానికి ఆనవాలుగా నిలుస్తూ, సత్కర్మలు భోధించి సన్మార్గంలో నడిపించే వేదభూమిగా భారతదేశానికి మంచి పేరుంది. ఉపనిషత్తుల్లోని ఎన్నో అద్భుత మార్గాలతో జీవన విధానాన్ని అందించిన నేల మనది. ఈ జీవన విధానానే్న నేడు ప్రపంచం మార్గదర్శకంగా తీసుకుంటోంది. ఆ మార్గదర్శకమే యోగా రూపం. ప్రకృతిపరమైన సౌందర్యం, కోమలమైన శరీరం కావాలనుకునే అమ్మాయిలు చాలా మంది ఉంటారు. ఇలాంటి వారికి కూడా యోగా యోగదాయకమైంది. యోగా కారణంగా శరీరంలో కాంతి పెరుగుతుంది. ముఖవర్ఛస్సుతో కళ పెరుగుతుంది. శరీరంలో అవసరంలేని కొవ్వు కరిగిపోతుంది. హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగంగా భావిస్తున్నా, వేల ఏళ్ల సంవత్సరాల నుండి యోగా పలురూపాల్లో ఆచరణలో ఉంది. అన్ని మతాల వారు, కులాల వారూ యోగాను సాధన చేస్తున్నారు. దాన్ని తెలుసుకుని సరైన రీతిలో సాధన చేస్తే ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న నిజ శక్తిని సాధిస్తుంది. యోగా సాధనకు, ఆంతరంగిక శిక్షణకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిని ఎంతోమంది యోగులు సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా నిర్వచించారు. వేల ఏళ్ల చరిత్ర… క్రీస్తుపూర్వం వంద శకం నుండి 500 శకం మధ్య కాలంలో పతంజలి యోగా శాస్త్రాన్ని రచించారని చరిత్రకారులు భావిస్తున్నారు. ఉపనిషత్తులు, భగవద్గీతలో యోగా ప్రస్తావన ఉంది. పతంజలి వీటిని పతంజలి యోగా సూత్రాలుగా క్రోడీకరించాడు. సూత్రం అంటే దారం. దారంలో మణులను చేర్చినట్టు యోగాశాస్త్రాన్ని పతంజలి ఒక చోట కూర్చాడు. హఠయోగ ప్రదీపిక, శివసంహిత అందులో ప్రధాన భాగాలు, వీటిలో కర్మయోగ, జ్ఞాన యోగ, రాజయోగ, భక్తియోగ అంతర్భాగాలు. వ్యాసుడు రచించిన భగవద్గీతలో కూడా యోగాసనాలపై 18 భాగాలుగా వివరణ ఉంది. అసలు యోగా అంటే ఏమిటి? యోగం అంటే సాధన, యోగం అంటే అదృష్టం, భగవద్గీతలో అధ్యాయాలకు యోగాలు అని పేరు. భారతీయ తత్వశాస్త్రంలోని ఆరు దర్శనాల్లో యోగా దర్శనం కూడా ఒకటి. యోగాదర్శనానికి ప్రామాణికం పతంజలి యోగాశాస్త్రం. యుజ్ అంటే కలయిక అని అర్థం. ఇది సంస్కృతం నుండి వచ్చింది. యోగ లేదా యోగం అనే పదం యుజ్ నుండే ఉత్పన్నమైంది. యోగం అంటే ఇంద్రియాలను వశపరచుకుని, చిత్తాన్ని ఈశ్వరునిపై లగ్నం చేసుకుని మానసిక శక్తులన్నింటినీ ఏకం చేసి సామాన్య స్థితికి చేరడం లేదా పరమార్థతత్వం అర్థం చేసుకుని ఏకాగ్రతను సాధించడమే యోగా. యోగా అంటే చిత్తవృద్ధి విరోధం. స్థిరంగా ఉండి సుఖాన్ని అనుభవించడమే యోగా. యోగాభ్యాసంతో వైరాగ్యం పోతుంది, చిత్తవృత్తులు నిరోధించడం సాధ్యమవుతుంది. ఇలా మనసును మన ఆధీనంలోకి తెచ్చుకునే యోగా సాధననే పతంజలి అష్టాంగ యోగా అన్నారు. దీనినే రాజయోగం అని అలవాటుగా చెప్పుకుంటున్నాం. పతంజలి యోగా సూత్రాలు నాలుగు అధ్యాయాలు. సమాధి పద, సాధన పద, విభూతి పద, కైవల్య పద అని అంటారు. మానసిక శుద్ధికి కావల్సిన యోగాలు అవి. శారీరక దారుఢ్యానికీ, ఆరోగ్య సంరక్షణకు, రోగ నిరోధానికి సహాయపడే శారీరక ఆసనాలను అష్టాంగయోగ కూడా వివరిస్తుంది. సమాధి పద అంటే ఏకాగ్రతతో చిత్తవృత్తులను నిరోధించడం, సాధన పద అంటే రాజయోగాన్ని సాధన చేయడం ఎలాగో తెలుసుకోవడం, విభూతి యోగ అంటే యోగ సాధనలో నైపుణ్యాన్ని సాధించడం, మోక్ష సాధన ఎలా పొందాలో తెలుసుకోవడమే కైవల్యపద. వీటన్నింటికీ ఉదాత్తమమైన మరో మార్గం అష్టాంగపద యోగం. దీనిని సాధన చేయాలంటే అనేక కఠినమైన నియమనిబంధనలను పాటించాల్సి ఉంటుంది. యమ, నియమ, ఆసన, ప్రాణయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితులు ఈ యోగంలో భాగంగా ఉంటాయి. అసత్యం పలకరాదు, హింసకు పాల్పడరాదు, బ్రహ్మచర్యం పాటించాలి, మద్యం తాకరాదు వంటి పలు కఠినమైన నిబంధనలు ఉంటాయి. శుభ్రత పాటించడం, సంతోషంగా, ఆనందంగా ఉండటం కూడా ఈ యోగా చేయాలంటే అనివార్యం. మనిషికి జ్ఞానం, విజ్ఞానం, అర్థం తెలియజెప్పే మహత్తర సూత్రం యోగం. ప్రతి మానవుడి శరీరంలో షట్చక్రాలు అనే నాడీ మండలాలు 6 ప్రధానంగా ఉంటాయి. మానవుడిలో ఉండే ప్రాణశక్తి కారణంగా అతడు సజీవంగా ఉండగలుగుతాడు. ఆ ప్రాణశక్తిని కొన్ని పద్ధతుల ద్వారా ప్రేరేపించడం వల్ల శరీరంలో సహజంగా శక్తి వెలువడుతుంది. వెలువడే ఆ శక్తి పేరే కుండలినీ శక్తి. ఆ శక్తిని ప్రేరేపించడం వల్ల మానవుడికి శారీరక ఆరోగ్యం చేకూరడమే గాక, ఆత్మజ్ఞానం కలిగి సమాధి స్థితిలో బ్రహ్మానుభూతిని పొందగలుగుతాడు. ఆధునిక కాలంలో భారతీయ, పాశ్చాత్య పండితులు ఎందరో ఎన్నో రకాలుగా యోగాభ్యాస ప్రక్రియలను, యోగాసనాలను ఒక క్రమపద్ధతిలో అమర్చి సామాన్య ప్రజలకు అందిస్తున్నారు. తీవ్రమైన ఒత్తిడితో జీవితాలు గడుపుతున్న ఆధునిక సమాజం దీని వల్ల ఎంతో ప్రశాంతత పొందుతోందని పరిశోధనల్లో, స్వానుభవాలతో తేటతెల్లమైంది. ఇతర వ్యాయామాలు శారీరక దారుఢ్యాన్ని మాత్రమే మెరుగుపరచడంపై దృష్టి సారిస్తాయి. యోగాభ్యాసం మాత్రం ధ్యానం, ప్రాణాయామం వంటి ప్రక్రియలతో మానసిక ప్రశాంతతకు, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. మానసిక వత్తిడులు తగ్గించడం, హృద్రోగం, రక్తపోటును అదుపు చేయడం, వ్యాధుల తీవ్రతను తగ్గించడానికి తోడ్పడుతుంది. మనం దేవుళ్లను గమనించినపుడు వారు ఏదో ఒక యోగాసనంలోనే మనకు దర్శనం ఇస్తారు. యోగాపై పురాణాలు, ఇతిహాసాల్లో కూడా ప్రస్తావన ఉంది. దేవదేవుడైన ఈశ్వరుడు తపస్సు చేస్తున్నపుడు పద్మాసనంలో ధ్యానయోగంలో ఉన్నట్టు పురాణాల్లో వర్ణించారు. లక్ష్మీదేవి ఎప్పుడూ పద్మాసినియే, మహావిష్ణువు నిద్రను యోగనిద్ర అంటారు. బౌద్ధ సంప్రదాయంలోనూ, జైన సంప్రదాయంలోనూ యోగా ప్రధానపాద్ర పోషిస్తోంది. ఆశ్చర్యకరం ఏమంటే సింధు నాగరికతలో కూడా యోగా చిత్రాలను మనం గమనిస్తాం. ఇతర వ్యాయామాల కంటే భిన్నమైనది, నిబిడీకృతంగా ఆధ్యాత్మిక భావం ఉన్నది యోగాభ్యాసం. ఇదే కారణంతో దేశవిదేశాల్లో యోగాకు విశేష ప్రాచుర్యం లభించింది. తేలికగా ఆచరించదగింది కావడంతో పాశ్చాత్యదేశాల్లో కూడా యోగాకు మక్కువ పెరిగింది. దీంతో భారతీయ సంప్రదాయక యోగా నిపుణులు ఇతర దేశాల్లో కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి యోగా హిందువుల ధ్యానమార్గంగా భావించడం కూడా ఇటీవల వివాదాలకు దారితీస్తోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సూర్యనమస్కారాలకు ఇటు క్రైస్తవుల నుండి అటు ముస్లింల నుండి అభ్యంతరాలు వ్యక్తమవడం గమనార్హం. యోగా దినోత్సవం సందర్భంగా దిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించే కార్యక్రమంలో ఐక్యతను చాటుకునేలా ముస్లింలు పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వివాదం లేకుండా చూడటానికి అధికారికంగా యోగా కార్యక్రమం నుండి సూర్య నమస్కారాలను తొలగించామని, నిజానికి వాటికి మతంతో ఎలాంటి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. మొత్తం కార్యక్రమం సజావుగా జరగాలన్నదే తమ సంకల్పమని పేర్కొంది. శ్లోకాలు తప్పనిసరేమీ కాదని, వాటికి బదులు అల్లా అని ముస్లిం మతస్థులు వల్లించుకోవచ్చని కూడా సూచించింది. యోగా దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించడంపై కూడా కొన్ని మైనార్టీ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముస్లింలు ఆచరించే నమాజ్- యోగా కాకున్నా, అందులోనూ యోగా ఉందని, నిజానికి యోగాను వ్యతిరేకించేవారు మానవాళికే శత్రువులని, యోగాకు మతానికి అస్సలు సంబంధమే లేదని మజ్లిస్ ఉలేమా ఇ హింద్ అధ్యక్షుడు వౌలానా సయ్యద్ కౌకబ్ మఖ్తాబా అంటున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మద్దతు తెలిపిన 177 దేశాల్లో 47 దేశాలు ఇస్లామిక్ దేశాలేనని గుర్తుచేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. వివిధ వర్గాల విమర్శలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం మతాలకు, వివాదాలకు అతీతంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని భావించింది. ఈ సందర్భంగా నిర్వహించే రెండు కార్యక్రమాలు ప్రపంచ రికార్డును నమోదు చేయబోతున్నాయి. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు సంస్థకు కూడా ప్రభుత్వం ఈ విషయమై సమాచారాన్ని పంపించింది. ఆయుష్ సంస్థ ఈ మేరకు రెండు రికార్డులను నమోదుచేయాల్సిందిగా గిన్నీస్ రికార్డ్సు సంస్థను కోరింది. 651 జిల్లాల్లో… అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భం గా ఈ నెల 21న దేశ రాజధానిలో యోగా ప్రదర్శనలు భారీ ఎత్తున జరుగుతాయి. రాజ్‌పథ్‌లో ఆ రోజు ఉదయం జరిగే కార్యక్రమంలో 45 వేల మంది పాల్గొంటారు. మొత్తం 15 ఆసనాలను 35 నిమిషాల పాటు వేస్తారు. ప్రధాని నరేంద్రమోదీ హాజరై యోగా విశిష్టతను వివరిస్తారు. దేశ వ్యాప్తంగా 651 జిల్లాలతో పాటు దిల్లీ నగరంలోనూ పెద్ద సంఖ్యలో యోగా శిబిరాలు నిర్వహిస్తారు. పాఠశాలల్లో యోగా, సూర్య నమస్కారాలు చేయిస్తారు. సూర్యనమస్కారాలు అభ్యంతరమైతే హిందూయేతర మతస్థులు వారి మతాలకు చెందిన బోధనలను చదువుకోవచ్చు. రాజ్‌పథ్‌లో యోగా దినోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ దేశాల రాయబారులు పాల్గొంటారు. టైమ్ స్క్వేర్‌లో.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్ మన్‌హట్టన్‌లోని టైమ్‌స్క్వేర్‌లో యోగా కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగే ప్రధాన కార్యక్రమం ఇది. సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ అధ్యక్షత వహిస్తారు. యుఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు శ్యాంకుటిసా కూడా దీనికి హాజరవుతారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ ప్రత్యేక ఉపన్యాసం ఇస్తారు. టైమ్ స్క్వేర్ నుండి అనేక కార్యక్రమాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ, యోగాకు అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు. 193 దేశాలకు ప్రాతినిధ్యం ఉన్న ఐరాసలో ఆయన చేసిన ప్రతిపాదనను 177 దేశాలు బలపరిచాయి. సర్వసభ్య సమావేశంలో ఒక తీర్మానానికి ఇంత పెద్ద ఎత్తున మద్దతు రావడం ఇదే తొలిసారి. అలాగే, సమితిలో కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఒక ప్రతిపాదన తీర్మానంగా రూపుదిద్దుకోవడం కూడా ఇదే ప్రథమం. గత అక్టోబర్ 22న తీర్మానం ఆమోదించారు. మొదటి యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓవర్సీస్ వాలంటీర్స్ ఫర్ బెటర్ ఇండియా ఆధ్వర్యంలో అమెరికాలోని వంద నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముందుకొచ్చిన కార్పొరేట్లు.. యోగా పట్ల అంతర్జాతీయంగా అవగాహన పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని, సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని యోగా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అనేక కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. మొబైల్ అప్లికేషన్లు రూపొందిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు బ్లాగ్‌లు, పోర్టళ్లు ప్రారంభించాయి. సమయ పరిమితి మినహాయింపు.. రోజా ఇఫ్తార్ తర్వాత కూడా యోగా చేయాలని భారత్‌లోని ముస్లిం వర్గాలు భావిస్తే అలాగే చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తాము నిర్దేశించిన సమయం కేవలం ప్రభుత్వ కార్యాలయాలకు, ఇతర సంస్థలకు మాత్రమేనని మిగిలిన వారు తమకు అనుకూలమైన సమయంలో చేసుకోవచ్చని పేర్కొంది. సూర్య నమస్కారాలను వ్యతిరేకించే వారు తమ మతానికి చెందిన ప్రవచనాలను మననం చేసుకోవచ్చని కూడా పేర్కొంది. ముస్లిం మతస్థులు నమాజ్ చేయడం అంటే యోగా చేయడం వంటిదేనని యోగా, ఏ ఒక్క మతానికో పరిమితం అయింది మాత్రం కాదని పేర్కొన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తపాలా శాఖ ప్రత్యేక స్టాంప్‌ను విడుదల చేస్తుంది. 10 రూపాయలు, వంద రూపాయలు విలువ చేసే నాణాలను కూడా ఆర్థిక శాఖ విడుదల చేయనుంది. అన్ని రాష్ట్రాల్లోనూ యోగా కార్యక్రమం ఉదయం 7.00 నుండి 7.35 గంటల వరకూ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆసనం ప్రధానం.. యోగాలో ఆసనం అనేది ఒక కీలక ఘట్టం. ఆసనం అంటే ఒక భంగిమ. మానవ శరీరం అసంఖ్యాకమైన భంగిమలను తీసుకోగలుగుతుంది. అందుకు తగ్గట్టు శరీర నిర్మాణం ఉంటుంది. క్రమపద్ధతిలో హృదయానికి, శరీరానికి ఉపయోగపడే భంగిమలను ఆసనాలుగా గుర్తించారు. జీవితాన్ని ఒక ఉన్నతమైన పార్శ్వానికి తీసుకువెళ్లేది లేదా ఉన్నతమైన అవగాహనను అందించేది యోగా. అందువల్ల ఎలాంటి భంగిమ అయితే మనల్ని ఉన్నత అవకాశాల వైపు తీసుకువెళ్తుందో దానినే మనం యోగాసనం అంటున్నాం. మనకు తెలిసి, అలవాటుగా చేసుకుంటున్న యోగాసనాలు చాలా తక్కువ. తెలియనివి చాలా ఉన్నాయి. శరీర వ్యాయామ విధానాలే యోగాసనాలు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రంగాల్లో మనిషి శుద్ధి కావడానికి ఇవి దోహదపడతాయి. ముక్తికి మార్గం.. దైనందిన జీవితంలో శరీరం సహజంగానే ఒక భంగిమను ఎంచుకుంటుంది. అపుడే మనం ఆనందంగా ఒక విధంగా కూర్చోగలుగుతాం. ప్రశాంతంగా లేనప్పుడో, కోపంగా ఉన్నపుడో మనం మరో విధంగా కూర్చుంటాం. ఎవరైనా ఎలా కూర్చున్నారన్న విషయాన్ని ఆధారంగా చేసుకుని వారి మనసు లోపల ఏం జరుగుతుందో చెప్పేయవచ్చు. అయతే, యోగాసన శాస్త్రం ఇందుకు భిన్నమైన సూచన చేస్తుంది. చేతనంగా శరీరాన్ని ఒక నిర్దిష్ట భంగిమలోకి తీసుకువెళ్లి చైతన్యాన్ని పెంచేలా చేస్తాం. ఒక నిర్దిష్ట పద్ధతిలో కూర్చోవడం ద్వారా ఆలోచించే విధానాన్ని మనం మార్చుకోవచ్చు. యోగాసనాల్లో చైతన్యాన్ని పెంచే ప్రాథమిక ఆసనాలు 84 ఉన్నాయి. అవి 84 శరీర భంగిమలని మాత్రం కాదు. ఇవి ముక్తి సాధించడానికి తగిన వ్యవస్థలు లేదా సరైన మార్గాలు. యోగాసనంలో ప్రావీణ్యం ఉంటే చాలు ఈ సృష్టిలో తెలుసుకోదగినవన్నీ తెలుసుకోవచ్చు. యోగాసనాలు కేవలం వ్యాయామ ప్రక్రియలు మాత్రమే కాదు. ప్రాణశక్తిని ఒక నిర్దిష్ట దశలో నడిపించే సున్నితమైన ప్రక్రియలు. వీటిని ఒక స్థాయి ఎరుకతో చేయాల్సి ఉంటుంది. యోగా సూత్రాల్లో పతంజలి ‘సుఖం స్థిరం ఆసనం’ అని అన్నారు. మీకు ఏ ఆసనమైతే అత్యంత సౌకర్యవంతమైనదో, అత్యంత స్థిరమైనదో అదే మీ ఆసనం. మానవ శరీరం పూర్తి ఉత్తేజంతో, సమతుల్యతతో ఉంటే అప్పుడు ఎవరైనా ఊరికే కూర్చున్నా ధ్యానంలోనే ఉంటారు. ఆసనం అనేది సహజసిద్ధంగా ధ్యానంలో ఉండటానికి మనం వేసే ఒక సన్నాహక అడుగు. అందుకే ఆసనాలు చురుకైన ధ్యానమార్గాలు. యోగా సాధనతో శరీరంలోని జీవక్రియలను నియంత్రిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నేడు మనిషి జీవనకాలం పెరిగినా, బతికినన్ని రోజులూ అనేక రోగాలతో బాధపడుతూ ఎంతోమంది రోజూ నరకం అనుభవిస్తున్నారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం యోగా సాధనే. రోగం వచ్చిన తర్వాత పరుగులు తీసేకంటే రాకుండానే శరీరాన్ని అదుపులో ఉంచుకోవడానికి యోగా తోడ్పడుతుంది. ఎక్కువ మంది ప్రాణాయామం, శవాసనం చేస్తుంటారు. వీటివల్ల చాలా లాభాలు ఉన్నా, ఆచరించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని యోగులు చెబుతున్నారు. యోగా ఇపుడు భారతీయులకో పెద్ద పండగ. సగటు భారతీయుడి ఆరోగ్యమే భారతదేశ ఆరోగ్యం. అదే దేశ సమర్థతకు, సామర్థ్యానికి చుక్కాని అవుతుంది. *** ప్రచారకర్తలు యోగాపై ప్రచారం కోసం ఇప్పటికే సినిమా, క్రీడలు, ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీల సేవలను ఉపయోగించుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని నిర్ణయంచింది. యోగా దినం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రముఖ వ్యక్తులు ఇప్పటికే మీడియాలో ప్రచారం ప్రారంభిం చారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, నటి శిల్పాశెట్టి, ప్రముఖ క్రికెటర్ విరాట్ కొహ్లీ లాంటి వారిని యోగాకు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించారు. మోదీ ప్రత్యేకత ఇంటర్నేషనల్ యోగా డే పురస్కరించుకుని ఈ నెల 21న భారీ కార్యక్రమం జరుగుతున్నా, తొలి నుండి ప్రధాని నరేంద్రమోదీకి యోగాసనాలపై మక్కువ ఎక్కువ. గుజరాత్ సిఎంగా ఉన్నపుడు కూడా ఆయన ప్రతిరోజూ తెల్లవారుజామున విధిగా యోగాసనాలు వేసేవారు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సైతం తప్పకుండా యోగాసనాలు వేయాలని, తద్వారా వారి పనితీరు మెరుగుపడుతుందని ఆయన అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. మనుషులంతా ఒక్కటే అనే భావన కూడా యోగా కారణంగా కలుగుతుందని మోదీ విశ్వసిస్తారు. యోగా శారీరక, మానసిక వికాసానికి, సమాజ శాంతికి దోహదం చేస్తుందని, ఒత్తిడి నుంచి దూరం చేస్తుందని ఆయన నమ్ముతారు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాల్పుల విరమణతో కథ కంచికి!?

కాల్పుల విరమణతో కథ కంచికి!?
రుతుపవనాలు విస్తరించడంతో రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ వర్షాలతో వాతావరణం చల్లబడింది. విచిత్రంగా గత కొద్ది రోజులుగా సెగలు పుట్టించిన రాజకీయ వాతావరణం కూడా రెండు రోజులుగా కొంత చల్లబడింది. నువ్వెంత అంటే నువ్వెంత అని కాలు దువ్వుకున్న ఇరువురు ముఖ్యమంత్రులు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చినట్టు కనిపిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత చానల్‌కు ఏపీ పోలీసులు ఇచ్చిన నోటీసు వ్యవహారంతో విషయం మళ్లీ మొదటికి వచ్చిందనే అభిప్రాయం కలిగినప్పటికీ… అందులో నిజం లేదనే చెప్పవచ్చు. గడచిన మూడు వారాలుగా తెలుగు రాష్ర్టాలను సలుపుతూ వచ్చిన టేపులు, ట్యాపింగ్‌ వ్యవహారం హఠాత్తుగా ప్రాధాన్యం కోల్పోవడానికి కారణం ఏమిటి? అసలు ఏమి జరిగింది? అన్న కుతూహలం ప్రజల్లో నెలకొంది. ఓటుకు నోటు వ్యవహారం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయారనీ, ఇక ఆయన పదవీ త్యాగం చేయక తప్పదనీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భలే దెబ్బకొట్టారనీ చంద్రబాబు వ్యతిరేకులు సంబరపడిపోయారు. రాజకీయ పార్టీల అధీనంలో ఉన్న మీడియాల్లో చేసిన హడావుడి అయితే అంతా ఇంతా కాదు. చంద్రబాబు జైలుకు వెళ్లడం ఒక్కటే మిగిలిందని ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో టెలిఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు తెర మీదకు తెచ్చారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూలిపోక తప్పదని ఏపీ మంత్రులు జబ్బలు చరచుకున్నారు. ఇద్దరు చంద్రుల మద్దతుదారులు సోషల్‌ మీడియాలో హైరానా పడిపోయారు. సొంత సమస్యల గురించి ఆలోచించకుండా తమ సృజనాత్మకతను ప్రయోగించి ఫేస్‌బుక్‌ తదితర మాధ్యమాలలో పోస్టింగులు పెడుతూ అలౌకిక ఆనందం పొందారు. మొత్తంమీద మద్దతుదారుల ఉన్మత్త ప్రేలాపనలు కొనసాగుతూ ఉండగానే ఇరువురు ముఖ్యమంత్రులు తెల్ల జెండా ఎగురవేయబోతున్నారన్న సమాచారం అందుతోంది. అంతవరకు అది చేస్తారు, ఇది చేస్తారు అంటూ రెచ్చిపోయిన కేసీఆర్‌ మీడియా కూడా గురువారం నుంచి కొంత వెనక్కు తగ్గింది. ఆయన సొంత పత్రికలో మొదటి పేజీలో ఓటుకు నోటు అంశంపై ఒక్క వార్త కూడా కనిపించలేదు. అంతలోనే ఇంత మార్పు ఎలా సాధ్యం అన్న అనుమానాలు సహజంగానే పొడచూపుతాయి. దీంతో చంద్రబాబు సేఫ్‌ కదా అని ఆయన మద్దతుదారులు అనునయించుకోవడం మొదలుపెట్టారు. ఓటుకు నోటుతో మొదలై ఎన్నో మలుపులు, సుడులు తిరిగి టెలిఫోన్‌ ట్యాపింగ్‌ దగ్గరకు చేరి… రెండు రాష్ర్టాల ప్రజల మధ్య అంతరం సృష్టించిన ఈ వ్యవహారంలో ప్రస్తుతం నెలకొన్న స్తబ్ధత తాత్కాలికమా? శాశ్వతమా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే, రాజకీయ నాయకుల ఎత్తుగడలు తెలియని వారికి మాత్రమే ఇలాంటి పరిణామాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నేను క్రితం వారం పేర్కొన్నట్టుగానే రాజకీయ నాయకులు ఒక హద్దు దాటి ముందుకు వెళ్లరు. వెళితే ఏమవుతుందో వారికి తెలుసుగానీ, వారిని గుడ్డిగా సమర్థించేవారికి తెలియదు. మొత్తం ఈ వ్యవహారంలో ఇద్దరు ముఖ్యమంత్రులదీ పైచేయికాగా, వారి తరఫున వకాల్తా పుచ్చుకున్నవాళ్లు, ఏదో జరుగుతుందని భ్రమించినవాళ్లు మాత్రం చిత్తు అయ్యారు.
 ఎత్తుకు పైఎత్తు
ఇంతకీ ఇద్దరు చంద్రుల మధ్య కాల్పుల విరమణ ఆలోచన రావడానికి కారణం ఏమై ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. అదే సమయంలో ఈ వ్యవహారంతో లాభపడింది ఎవరు? భంగపడింది ఎవరు? కూడా తెలుసుకుందాం. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డి చిక్కుకున్ననాటి నుంచి రెండు రోజుల క్రితం వరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మరక్షణలోనే ఉన్నారు. కేసీఆర్‌ వ్యాఖ్యల వల్ల తెలుగు ప్రజల మధ్య మరింత అంతరం ఏర్పడి అది ఏపీలో చంద్రబాబుకు రాజకీయంగా ఉపయోగపడినా, ఈ వ్యవహారం మాత్రం జాతీయ స్థాయిలో ఆయన ప్రతిష్ఠను మసకబారేట్టు చేసింది. దీంతో రాజకీయ వ్యూహరచనలో కేసీఆర్‌కు ఏమాత్రం తీసిపోని చంద్రబాబు తన బుర్రకు పదును పెట్టడంతో పాటు, తన పలుకుబడిని అంతా ఉపయోగించి టెలిఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి ఆధారాలు సేకరించారు. అంతే, అందుబాటులో ఉన్న మంత్రులను, ఇతర పార్టీ ముఖ్యులను పిలిపించుకుని జరిగినదంతా వివరించి టేపుల వ్యవహారం వల్ల తాను రాజీనామా చేసే పరిస్థితి ఉండదనీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రయోగించడానికి తనకు బ్రహ్మాస్త్రం లభించిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే టెలిఫోన్‌ ట్యాపింగ్‌ చేసిందీ లేనిదీ 24 గంటలలో లిఖిత పూర్వకంగా తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ మంత్రులు అల్టిమేటం జారీ చేశారు. దీనికి కౌంటర్‌గా ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి వేం నరేందర్‌ రెడ్డి ఇంటికి రాత్రి పొద్దుపోయాక ఏసీబీ అధికారులను కేసీఆర్‌ పంపారు. పనిలో పనిగా మరో తెలుగుదేశం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇంటికి కూడా పంపి నోటీసులు జారీ చేయించే ప్రయత్నం చేశారు. ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలు చంద్రబాబుకు లభించలేదని నమ్మడం వల్లనే కేసీఆర్‌ ఈ చర్యకు పూనుకుని ఉండవచ్చు. అయితే, గురువారం సాయంత్రానికి తెలంగాణ ముఖ్యమంత్రికి తత్త్వం బోధపడింది. ఈ దశలో మనం ఒక అడుగు ముందుకు వేస్తే చంద్రబాబు రెండు అడుగులు ముందుకు వేస్తారు. అందరం మునిగిపోతామని అధికారులు కూడా ఆయనను హెచ్చరించారని చెబుతున్నారు. దీంతో అదే రోజు ఆయన గవర్నర్‌ నరసింహన్‌ను కూడా కలిశారు. అప్పటికే ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలు చంద్రబాబుకు లభించాయని తెలుసుకున్న గవర్నర్‌ కూడా ఓటుకు నోటు వ్యవహారంలో ఇక తగ్గండి అని కేసీఆర్‌కు గట్టిగా సూచించారని వార్తలు వచ్చాయి. ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కొట్టుకుంటూ ఉంటే పెద్దన్న పాత్ర పోషించాలనుకున్న కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవహారం ఇంతటితో ఆగకపోతే కొంపలు మునుగుతాయని గుర్తించి గవర్నర్‌ను హెచ్చరించింది. అంతే, వాతావరణం చల్లబడటం మొదలైంది. టేపుల వ్యవహారంలో ఒకరు, ట్యాపింగ్‌ వ్యవహారంలో మరొకరు ఇరుక్కుపోయినట్టు గుర్తించిన ఇరువురు ముఖ్యమంత్రులు కాల్పుల విరమణకు మానసికంగా సిద్ధమయ్యారు. ఫలితంగానే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ గురు, శుక్ర, శనివారాల్లో ఎటువంటి హడావుడి చేయలేదు. ఏపీ మంత్రులు కూడా తాము ఇచ్చిన గడువు దాటిపోయినా ట్యాపింగ్‌ వ్యవహారం తేల్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేదు. ఇదంతా చూసి నిన్నటి వరకు కొట్టుకున్నవాళ్ల మధ్య ఇంత సామరస్యం, అవగాహన ఎలా సాధ్యమని ఎవరికైనా సందేహం వస్తే అది వారి అమాయకత్వమే అవుతుంది. రాజ్యం పదిలంగా ఉంటుందన్న నమ్మకం ఉన్నంత వరకు మాత్రమే రాజులుగానీ, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులుగానీ ఎంత దూరమైనా వెళతారు. ఎన్ని ప్రకటనలైనా చేస్తారు. ఈ క్రమంలో సైనికులు లేదా అభిమానులు కొట్టుకు చచ్చినా పట్టించుకోరు. తమ సీటుకు ఎసరు వస్తుందనుకున్నప్పుడే జాగ్రత్త పడతారు. అప్పుడు ప్రాంత ప్రయోజనాలు, ఆత్మగౌరవం వంటివి ఏమి గుర్తుకురావు. ఇంతకీ చంద్రబాబు సేకరించిన ఆధారాలు ఏమిటి? ఈ ఎపిసోడ్‌లో ఎవరు లబ్ధి పొందారు? ఎవరు బకరాలు అయ్యారో ఇప్పుడు చర్చించుకుందాం.
ఓటుకు నోటు వ్యవహారం వెలుగులోకి రావడానికి పది రోజుల ముందునుంచే తెలంగాణ ప్రభుత్వం తన వ్యూహానికి పదును పెట్టడం ప్రారంభించింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపు కోసం తెలుగుదేశం పార్టీకి చెందిన రేవంత్‌రెడ్డి ఎంతకైనా తెగిస్తారనీ, అందుకోసం తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తారని గ్రహించిన తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యులు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంలో తాము విజయం సాధిస్తామనీ, ఫలితంగా ఏపీ ప్రభుత్వం అప్రతిష్ఠ పాలవుతుందనీ, ఆ పరిస్థితిని ఉపయోగించుకోవలసిందిగా ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌ రెడ్డికి కూడా సూచించినట్టు తెలిసింది. ఈ అంశంపై వివరంగా మాట్లాడుకోవడానికి మంత్రి హరీశ్‌ రావు, జగన్మోహన్‌ రెడ్డి, నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ గత నెల 21వ తేదీన సమావేశమైనట్టుగా తెలుగుదేశం పార్టీ వారికి ఆధారాలు లభించాయి. ఆ రోజు నుంచి తెలంగాణ అధికార పక్ష నేతలు వ్యవహారాన్ని గుట్టుగా మొదలు పెట్టారు. అత్యుత్సాహవంతులైన కొంతమంది తెలంగాణ పోలీసు అధికారులు ఈ వ్యూహం అమలులో సహకరించడానికి ముందుకొచ్చారు. ఆ వెంటనే ఫలానా ఫలానా వారి ఫోన్‌ నంబర్లు ట్యాపింగ్‌ చేయాలని సర్వీసు ప్రొవైడర్లకు లిఖిత పూర్వకంగా ఆదేశాలు పంపారు. ఈ జాబితాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, సెబాస్టియన్‌ నంబర్లతోపాటు కొంతమంది ఉగ్రవాదులు, నక్సలైట్‌ల నంబర్లు చేర్చారు. అధికారికంగా రిక్విజేషన్‌ రావడంతో సెల్‌ఫోన్‌ సర్వీసు ప్రొవైడర్లు గత నెల 23వ తేదీ నుంచి ట్యాపింగ్‌ మొదలు పెట్టారు. అధికారికంగా నిర్వహించిన ఈ ట్యాపింగ్‌తోపాటు ప్రయివేటు సంస్థల ద్వారా కూడా మరికొంత మంది ఫోన్‌లు ట్యాప్‌ చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను ఏపీ సీఎం చంద్రబాబు సేకరించి పెట్టుకున్నారు. తమ పార్టీ ప్రజా ప్రతినిధుల ఫోన్‌ నంబర్లు ట్యాప్‌ చేయడానికి పోలీసు అధికారులు అధికారికంగా రాసిన లేఖ ప్రతిని కూడా సంపాదించారు. ఈ లేఖపై తెలంగాణ ఎస్‌ఐబీ చీఫ్‌ సజ్జనార్‌, ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌రెడ్డి, డీజీపీ అనురాగ్‌ శర్మ, హోం సెక్రటరీ బి.వెంకటేశం సంతకాలు చేసినట్టు చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ లేఖతోపాటు ఇతర ఆధారాలను చంద్రబాబు అండ్‌ కో బయటపెడితే సర్వీసు ప్రొవైడర్లకు రాసిన లేఖపై సంతకాలు చేసిన అధికారుల ఉద్యోగాలు పోవడమే కాకుండా, జైలుకు కూడా వెళ్లవలసి వస్తుంది. అప్పుడు వ్యవహారం అక్కడితో ఆగదు. ఇది తెలంగాణ సీఎం కేసీఆర్‌ మెడకు కూడా చుట్టుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము ఆ పని చేశామని పోలీసు అధికారులు విచారణలో చెబితే కేసీఆర్‌ చిక్కుల్లో పడతారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఉదంతం కేసీఆర్‌కు గుర్తుకు రాకుండా ఉంటుందా? నెపాన్ని అధికారుల మీదకు నెట్టి తప్పించుకోవడానికి కేసీఆర్‌ ప్రయత్నించే పక్షంలో పోలీసు శాఖలో తీవ్ర అలజడి ఏర్పడుతుంది. ఇకపై, ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలను ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులెవ్వరూ అమలు చేయబోరు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి విచారణను ఎదుర్కోవలసి వస్తుంది.
 
ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్‌లను నేరుగా ట్యాపింగ్‌ చేయకపోయినా, తమ ట్యాపింగ్‌లో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేతోపాటు సెబాస్టియన్‌ ఫోన్‌ నుంచి చంద్రబాబుకు వెళ్లిన కాల్స్‌ సంభాషణలను రికార్డు చేశారు. ఈ క్రమంలోనే ఒక ఎంపీకి, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌కు మధ్య జరిగిన సంభాషణను కూడా పోలీసు అధికారులు రికార్డు చేశారు. ఈ నేపథ్యంలోనే తమ వద్ద టెలిఫోన్‌ సంభాషణల టేపులు ఉన్నాయని తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రకటించారు. జరిగింది ఇది! ఓటుకు నోటు వ్యవహారంలో న్యాయస్థానంలో రేవంత్‌ రెడ్డికి శిక్ష పడుతుందో లేదో తెలియదుగానీ చంద్రబాబు మాత్రం తప్పించుకుంటారు. ఎందుకంటే ఆయన స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినప్పుడు డబ్బు గురించిగానీ, తమ అభ్యర్థికి ఓటు వేయమనిగానీ కోరలేదు. పైగా సంభాషణ చివరిలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోమని సూచించారు. ఈ కారణంగా చంద్రబాబును దోషిగా నిరూపితం చేయలేరని న్యాయవాది కూడా అయిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వంటివాళ్లు కూడా బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితులలో ఏసీబీని మరింత ఎగదోస్తే, చంద్రబాబుకు జరిగే నష్టం కన్నా కేసీఆర్‌కు జరిగే నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చంద్రబాబుకు జరగాల్సిన నష్టం ఇదివరకే జరిగింది. కేసీఆర్‌కు మాత్రం కొత్త కష్టాలు ప్రారంభమవుతాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోవడం మొదలైంది. కేసీఆర్‌ మీడియా స్వరాన్ని తగ్గించుకుంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఓటుకు నోటు కేసు కథ కంచికి చేరినా ఆశ్చర్యపోవలసింది లేదు. అదే విధంగా ట్యాపింగ్‌కు సంబంధించి చంద్రబాబు వద్ద ఉన్న ఆధారాలు కూడా వెలుగు చూడకపోవచ్చు. అయితే, ఇద్దరు ముఖ్యమంత్రుల జుట్టు మాత్రం కేంద్రం చేతుల్లోకి వెళ్లింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఇద్దరు ముఖ్యమంత్రుల హితులు రంగంలోకి దిగారు. ‘చేసింది చాలు. ఇక సరిపెట్టండి’ అని హితవు చెబుతున్నారు. అయినా ముందుకు వెళితే ఏం జరుగుతుందో తెలియనంత అమాయకులుకారు మన చంద్రులు. అందుకే వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు.
ఇంతకీ… ఎవరు చిత్తు?
ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఆటలో అరటిపండు అయిందెవరో చూద్దాం. ఈ జాబితాలో ముందుగా గవర్నర్‌ నరసింహన్‌ పేరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటను నమ్మిన ఆయన టెలిఫోన్‌ ట్యాపింగ్‌ జరగలేదని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇంతటితో ఆగకుండా తనను కలిసిన ఏపీ మంత్రుల వద్ద కూడా ట్యాపింగ్‌ ఎవరు చేశారంటూ దబాయించారు. ట్యాపింగ్‌ జరిగిందని నిరూపించడానికి అవసరమైన ఆధారాలు చంద్రబాబుకు లభించడంతో, ఇప్పుడు గవర్నర్‌ కేంద్రం వద్ద తలదించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం అంతిమంగా ఆయన పదవికే ఎసరు తేవచ్చు. వాస్తవానికి, నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా అధికారం చేపట్టగానే ఉమ్మడి గవర్నర్‌గా ఎవరిని నియమించ మంటారంటూ చంద్రబాబును అడిగారు. అప్పట్లో ఆయన ఏ కారణం వల్లనోగానీ నరసింహన్‌నే కొనసాగించవలసిందిగా సూచించారు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబుకు, నరసింహన్‌కు మధ్య వ్యవహారం ఉప్పు నిప్పు అన్నట్టుగా నడుస్తోంది. ఏపీ మంత్రులు నేరుగా గవర్నర్‌ను టార్గెట్‌ చేసి విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు తన వద్ద ఉన్న ఆధారాలు బయటపెడితే తెలుగు ప్రజల ముందు తాను తలదించుకోవలసి వస్తుంది కనుక ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కేసీఆర్‌ను నిలువరించడం ఒక్కటే మార్గమన్న ఉద్దేశంతో బుధవారం నాడు తనను కలిసిన కేసీఆర్‌కు గవర్నర్‌ ఉపదేశం చేసినట్టు చెబుతున్నారు. ఇక ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌ రెడ్డి రెండవ బకరాగా మిగిలారు. ఇద్దరు చంద్రుల మధ్య సాగుతున్న రాజకీయ క్రీడలో చివరకు జగన్‌ ఆటలో అరటిపండుగా మిగులుతారని నేను గతవారమే పేర్కొన్నాను. ఇప్పుడు అదే జరిగింది. కేసీఆర్‌ అండ్‌ కో మాటలు నమ్మి చంద్రబాబు నిజంగానే జైలుకు వెళతారనీ, ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేస్తారనీ, ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకుని తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు తనతో చేతులు కలిపే అవకాశం ఉందనీ, తాను ముఖ్యమంత్రి కావచ్చుననీ జగన్మోహన్‌ రెడ్డి కలలు కని ఉండవచ్చు. లేదా కేసీఆర్‌ అండ్‌ కో అలా భ్రమింపచేసి ఉండవచ్చు. ఈ కారణంగానే కాబోలు గడచిన మూడు వారాలుగా చంద్రబాబుకు శిక్ష తప్పదంటూ పుంఖానుపుంఖాలుగా తన పత్రికలో వార్తలు అచ్చేశారు. చంద్రబాబు స్థానంలో ఫలానా వారు ముఖ్యమంత్రి అవుతారన్న ఊహాగానాలను ప్రజల్లోకి వదిలారు. ఊహల్లో విహరించిన జగన్‌కు బుధవారంనాటి పరిణామాలతో తత్త్వం బోధపడింది.

కేసీఆర్‌ మాటలు నమ్మి ఆయనకు భుజం కాయడం వల్ల ఏపీలో తనపై వ్యతిరేకత ఏర్పడుతోందన్న వాస్తవాన్ని ఆలస్యంగా గుర్తించారు. దీంతో పార్టీ ముఖ్యులను సమావేశపరచి ఓటుకు నోటు వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టి, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకుని, కుటుంబ సమేతంగా జెరూసలెం వెళ్లిపోయారు. దీన్ని బట్టి రాజకీయాలలో జగన్మోహన్‌ రెడ్డి నేర్చుకోవలసింది ఎంతో ఉందని అనిపిస్తోంది కదా! ఇక మూడవ బకరాగా మీడియాను పేర్కొనవచ్చు. కేసీఆర్‌కు భయపడిగానీ, మరే ఇతర కారణాల వల్లగానీ అటు పత్రికలు, ఇటు చానెళ్లు గాలి వార్తలను పోగేసి ప్రచురించి, ప్రసారం చేశాయి. అవినీతి నిరోధక శాఖ సోర్స్‌ పేరిట ఇదిగో పులి, అదిగో తోక అంటూ కథనాలను ప్రజల్లోకి వదిలాయి. చంద్రబాబును అరెస్ట్‌ చేయడమే మిగిలి ఉందంటూ ప్రచారం చేశాయి. టెలిఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలు లభించి ఉండకపోతే ఏమి జరిగేదో తెలియదుగానీ… ఇప్పుడు మాత్రం ఏమీ జరగకపోవచ్చునని చెప్పవచ్చు. చట్టం తన పని తాను చేసుకుపోవాలి కదా! అని అనుకుంటే అలా నమ్మిన వారిదే అమాయకత్వమే అవుతుంది. ప్రజా ప్రతినిధులను ప్రలోభపెట్టడం గతంలో కూడా జరిగింది. ఇకపై కూడా జరుగుతుంది. అయితే, ఈ కేసులో వలె మీడియా ఇంత బాధ్యతారహితంగా గతంలో ఎప్పుడూ వ్యవహరించలేదు. ఇందుకు అనేక కారణాలు ఉండవచ్చు. తాము ప్రచారం చేస్తున్న గాలి వార్తలను ప్రచురించి, ప్రసారం చేయకపోతే ‘ఆంధ్రా మీడియా’ అని కేసీఆర్‌ సొంత మీడియా ఎక్కడ నిందిస్తుందోనన్న భయం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. ఇక నాలుగవ బకరాగా సోషల్‌ మీడియాలో చెలరేగిపోయిన వారిని పేర్కొనవచ్చు. చంద్రబాబుకు వ్యతిరేకంగా, అనుకూలంగా సోషల్‌ మీడియాలో రెచ్చిపోయిన వారు తమలోని సృజనాత్మకతను సొంతానికి ఉపయోగించుకుంటే వారికి ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఇప్పుడు ఆట ముగింపు దశకు చేరుకుంది. కేంద్రం నుంచి కూడా ఆ మేరకు ఇరువురు ముఖ్యమంత్రులకు సూచనతో కూడిన హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే, ఒక్కటి మాత్రం నిజం. ఈ మొత్తం వ్యవహారం వల్ల కేసీఆర్‌, చంద్రబాబు పదవులకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు. అయితే… ఒక రాష్ట్ర ప్రభుత్వం టెలిఫోన్‌లను ట్యాప్‌ చేయడం, అది బయటకు వెల్లడవడం తెలంగాణ క్షేమం దృష్ట్యా కూడా మంచిది కాదు. గుట్టుగా ఉండవలసిన చోట అత్యుత్సాహం ప్రదర్శిస్తే అంతిమంగా ఏమి జరుగుతుందో ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రభుత్వాధినేతల ప్రోత్సాహంతోనే విచ్చలవిడిగా ట్యాపింగ్‌ చేయడం, ఆ టేపులను బయటపెట్టడం వల్ల తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు కూడా భయపడే ప్రమాదం ఉంది. ఈ మాట అన్నందుకు సోకాల్డ్‌ తెలంగాణవాదులు నన్ను విమర్శించవచ్చుగానీ రోజులు గడిచేకొద్దీ వారికి వాస్తవం తెలిసివస్తుంది. నిజానికి, దేశంలో టెలిఫోన్‌ ట్యాపింగ్‌ చేయడం రాష్ట్ర ప్రభుత్వాలకు కొత్తకాదు. దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ నిత్యం ఆ పని చేస్తూనే ఉంటాయి. గుట్టుగా అది సాగిపోతుంటుంది. ట్యాపింగ్‌ ద్వారా తెలుసుకున్న వివరాలను తదుపరి వ్యూహాల రచనకో, లేక విరుగుడు చర్యలకో వాడుకుంటాయి. అంతే తప్ప నేరుగా బయటపెట్టవు. కానీ, తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్‌ చేసుకుని ‘ట్యాపింగ్‌ టేపులను’ బయటపెట్టడం కొత్త అనుభవం. మొుత్తంమీద కథ కంచికి చేరుకునే దశకు చేరుకున్నట్లే అని భావించవచ్చు. కనుక ఏదో జరుగుతుందని ఆశించి భంగపడిన వారి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఎటొచ్చీ చట్టాల పట్ల నమ్మకం పెట్టుకున్నవాళ్లు మాత్రం ఇదంతా చూసి ‘నీ యవ్వ. అంతా తొండి’ అని ఉడుక్కోవచ్చు!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉయ్యూరు లో 21-6-15 అంతర్జాతీయ యోగా దినోత్సవం -ఉదయం 7 గం లకు శాంతి నేకేతన్ హైస్కూల్ లో ,ఉదయం 11 గం లకు ఆర్య వైశ్య కళ్యాణ మండపం లో

ఉయ్యూరు లో 21-6-15 అంతర్జాతీయ యోగా దినోత్సవం -ఉదయం 7 గం లకు శాంతి నేకేతన్ హైస్కూల్ లో ,ఉదయం 11 గం లకు ఆర్య వైశ్య కళ్యాణ మండపం లో

 

https://plus.google.com/u/0/photos/115752370674452071762/albums/6162708660116406785?cfem=1

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వర్షం తెచ్చిన హర్షం – బందా

img135

Posted in కవితలు | Tagged | Leave a comment

యోగ ముద్ర లో ఉయ్యూరు

yoga1 001 yoga2 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

3 ధార్మిక విషయాలు –


 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment