నారద మహర్షి దర్శించిన శ్రీకృష్ణ లీల ను పోతన గారు ఇలా వర్ణిస్తున్నారు
‘’ఒకచోట నుచిత సంద్యోపాసక్తు,నొకచోట బౌరాణికోక్తిలలితు
నొకచోట బంచ యజ్నోచిత కరముని ,నొకచోట దివ్య భూషోజ్వలును
నొకచోట దేనుదానోత్కలితాత్ముని ,నొకచోట నిజ సుత ప్రకార యుక్తు
నొక్క చోటను సంగీత యుక్తచిత్తు ,నొక్కచోటను జలకేళీయుత విహారు
నొక్క చోటను సంమంచ కోప యుక్తు ,నొక్క చోటను బలభద్ర యుక్త చరితు ‘’
ఇలా ఎందెందు వెదకి జూచిన అందందే అందగత్తెల తో హరి ప్రత్యక్ష మయ్యాడు .ఆ విభవాన్ని ఎంత వర్ణించినా తనివి తీరదు .
‘’చతురానన నందనుడం –చిత మతి జని కాంచే ,నొక్క చెలి గేహమునన్
క్రతు కర్మాచరణుని నా-శ్రిత భయ హర నున్,సురేంద్ర సేవిత చరణున్ ‘’
‘’వ్రుత్రారి వినుతు ని బరమ ప-విత్రుని నారదుండు గాంచె వేరొక ఇంటన్
బుత్రుక పౌత్రక దుహిత్రు కళత్రు సమేతు ననంతు లక్షణ వంతున్ ‘’
మతి పోయింది మహర్షికి .ఆ మాయా మోహనుని చిత్రాలు విచిత్రం గా గోచరించి అచ్చేరువందించాయి ..
‘’ఒక ఇంట గజవాజి రోహాకుడు నయి ,యొక్కింత భంజనుడై
సకలాత్ముడు ,పరుండు ,షోడశ సహస్ర స్త్రీ నివాసంబులం
దొక బోటింటను దప్పకుండ నిజ మాయోత్సాహుడై యుండ ,న
య్యకలంకున్ ,వరదున్ ,మహా పురుషు ,బ్రహ్మణ్యున్ నతాబ్జాసనున్ ‘’
ఆ పరబ్రహ్మకే అర్ధం కాని వాడు అంటే ఆయన కొడుకైన నారదుడికేం అర్ధమవుతాడు? ఆ మహా లీలా విలాసం అత్యంత సుందరం ,పరమ రమణీయం, మనోహరం ,అత్యంత పవిత్రం .ఎంత వర్ణించినా తనివి తీరటం లేనే లేదు .అటు బ్రహ్మ మానస పుత్రుడైన నారద మునికి, ఇటు భక్త కవి బ్రహ్మ పోతనకు ఇద్దరూ ఆ భక్త పరాదీనులే . ఆ నారాయణ చణ చారణ చక్ర వర్తులే ఇద్దరూ.’’హరినామం ‘’విన్నా ,పలికినా భవహరమవుతుందనే భావించి ,స్మరించి, స్మరించి తన్మయత్వంతో పరవశించిన వారే .అందుకే ‘’మావాంగనాలీలా విలాసం అనంతం అని పించింది ‘’
‘’అస్తోక చరితు నమిత శ-మస్త సుధా హారు వేద మస్తక తల వి
న్యస్త పదాంబుజ యుగ ళు న-పాస్తాశ్రిత నిఖిల పాపు బరము ననంతున్ ‘’
‘’పరమ భాగవతుండు పరమేస్టి తనయుండు ,మనుజ లీల జెంది మహిత సౌఖ్య
చిత్తుడైన హృషీకేశు యోగ మాయా ప్రభావమునకు నాత్మ నలరి ‘’
‘’మాయురే ,హరిహరి వరద ,య –మేయ గుణా యనుచు నాత్మ మెచ్చి మునీన్ద్రుం
దా యదునాయకు,సుజన వి-దేయుని నిట్లనయే ,దేవా!త్రిజగము లందున్ ‘’
తన వల్ల కాలేదు ఇక ఎవరి వల్లా కాదు అనే నిశ్చయానికి వచ్చాడు ముని .ఆ మయావినోదుని తోనే గాన వినోది నారద మౌని
‘’నీ మాయ దెలియ వారలే –తామరస సురేంద్ర తాపసులైనన్
ధీ మంతులు నీ భక్తీ సు-ధా మాధుర్యమున బొదలు ధన్యులు దక్కన్ ‘’
అని చేతులెత్తేశాడు హర్షించి,పులకించి పరమంద భరితుడయ్యాడు .తానిక వెళ్లి వస్తానని ‘’ఏది తెలుసు కొందామని వచ్చాడో దాన్ని కనుల పండువు గా దర్శించి జన్మ చరితార్ధత ను సాధించుకొన్నాడు మనవడు నారదసంయమి . .
సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –20-3-13-ఉయ్యూరు









కర్నూలు, హైదరాబాద్, మార్చి 11: కర్ణాటక సంగీతాన్ని తెలుగునాట తంజావూరు బాణీలో కొత్తపుంతలు తొక్కించి సంగీతప్రియుల ప్రశంసలు అందుకున్న సంగీత కళానిధి పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణి సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పినాకపాణి అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు కర్నూలులో నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.



‘తెలుగా! అదెందుకు?’ అని ప్రశ్నిస్తే… ఈ రాష్ట్రం తెలుగు. ఈ ప్రజలు తెలుగు. వీరి ఆలోచన తెలుగు. మన జీవన విధానం తెలుగు! మరి… తెలుగుకాక మరో భాష మనకెందుకు?… ఇది నల్లగొండ జిల్లా కలెక్టర్ ముక్తేశ్వర రావు అచ్చ తెలుగులో ఇచ్చే స్వచ్ఛమైన సమాధానం! ‘తప్పనిసరి అవసరమైతేనే ఆంగ్లం!’ అనేదే ఆయన విధానం. కలెక్టర్ చొరవతో జిల్లాలో తెలుగు దివ్యంగా వెలుగుతోంది. జనం భాషలోనే పరిపాలన సాగుతోంది. పల్లె నుంచి జిల్లా స్థాయిదాకా అధికార వ్యవహారాలన్నీ తెలుగులోనే! జిల్లా నుంచి హైదరాబాద్లోని వివిధ శాఖలకు వెళ్లే ఉత్తరాలూ తెలుగులోనే! ఇప్పుడు 95 శాతం పరిపాలనా వ్యవహారాలన్నీ తెలుగులోనే సాగుతున్నాయి. ఇది… కేవలం మూడునెలల కాలంలో తెలుగు సాధించిన విజయం!










































