కొందరు మహోన్నతుల జ్ఞాపక శకలాలు

               కొందరు మహోన్నతుల జ్ఞాపక  శకలాలు
                                                                             అగాతా క్రిస్టీ 
అపరాధ అరిశోధన వాజ్మయానికి మకుటం లేని మహా రాణిగా చలామణి అయిన అగాతా క్రిస్టీ జన్మించి దాదాపు నూట ఇరవైయేళ్ళు దాటింది .ఆమె జయంతి  వేడుకలను ప్రపంచం అంతా సెప్టెంబర్ 15 న జరుగు తుంది ..భీభాత్చ ,భయానక ,హిమ్సడులు లేకుండా మేధస్సుకు మాత్రమే పదును పెట్టె రచనలు ఆమె చేసింది .”అసంఖ్యాక మైన హత్యలు అమ్మిన నిరపకార మయిన రచయిత్రి ”అనే బిరుదు ఆమెకు లభించింది .110   పుస్తకాలలో ,66  detective నవలలే .”మాస్ ట్రాప్ ”అనే ఆమె దేటేక్టివే నాటకం ఇంగ్లాండ్ లో నేటికీ రోజూ ప్రదర్శింప బడుతూనే వుంది .అంత మోజు ఆమె రచనకు .ఆంటే దాదాపు 50 సంవత్చారలనుంచి ప్రదర్శిమ్పబడుతోందన్న మాట .ఇది ప్రపంచ రికార్డు అంటారు .ఆమెవి ఇరవై నవలలు సినిమాలుగా తీశారు .ఆశ్చర్యం ఏమిటంటే ఆమ్మెకు తుపాకి కాల్చటం కూడా రాదు .మంచికి జయం ,చెడుకు పరాజయం ఖాయం అనే విశ్వ జనీన సత్యం ఆమె రచనల్లో కన్పిస్తుంది .మెదడుకు పదును పెడుతూ ,మనసుకు హాయి నిచ్చే రచన ఆగాథా స్వంతం .
                                                             ఉషశ్రీ 
       పండిన విద్య తో పురాణాలను నోట పండించి ,యావదాన్ధ్రము ,పులకిత గాత్రమై వినే అదృష్టం కల్గించిన పురాణ పండ సూర్య ప్రకాశ దీక్షితులే ఉషశ్రీ .వాచికం లో ,భావం పలికించటం లో ఒక ప్రత్యెక శైలి ఆయనది .కవి ,పండితుడు ,,మహాపండితుని కుమారుడు ఆంటే ప్రతిభతో తండ్రిని మించారు .మంచి పౌరాణికుడు కూడా .స్నేహ శీలి .ఆ వాగ్ధాటి అపూర్వం .అనితర సాధ్యం .భారత ,రామాయనాలతో ప్రతి ఇంటినీ ఒక నైమిశారణ్యం గా మార్చిన అపర వైశంపాయనుడు ,శుక మహర్షి ,వ్యాఖ్యాత ఉషశ్రీ .ఆకాశవాణిని అపర సరస్వతీ వాణిగా  మార్చి ,నూతన ధార్మిక ఉషశ్రీ ని ఆవిష్కరించిన పండిన పురాణాల పంట ,,వెద శాస్త్ర ఇతిహాస ,పురాణ ,ఉపనిషత్ సూర్య ప్రకాశాన్ని అందించిన వెలుగు .దీక్షతో జన సామాన్యానికి ఆ పరమార్ధాన్ని యజ్ఞం గా భావించి యజ్న ఫలాన్ని అందజేసిన దీక్షితులు .
                                                                            బీనా దేవి 
                  ప్రముఖ రచయిత బి..నర్సింగరావు కాలం పేరే బిఇనా దేవి .ఆక్రమాలు ,అవినీతి ,అత్యాచారాలపై నిశితంగా రచనలు చేసి లక్ష్యాలను ఆలోచిమ్పజేశాడు .నిష్కాపత్యం ,ధైర్యం ,తెంపరి తనం వున్న రచయిత .స్వంత బాణీ ,కొత్త స్రూస్తే కళ వాడు .”పుణ్యభూమి కళ్ళు తేరు ,”హాంగ్ మే quick   ”రాధమ్మ పెళ్లి ఆగిపోయింది ”కధలు రాసి తానేమిటో నిరూపించారు .రిబ్బను ముక్క కధ లో దారిద్రపు లక్ష్మణ రేఖ ను దర్శింప జేశ్హాడు .”A man with a true warm hearted and a soul and reverent ,very tender and modest ,has keen perspective power ”అని hedbeek  రచయిత హెర్మన్ మేల్విల్లీ గురించి మిస్సెస్ హతారన్ చేసిన వర్ణన బీనా దేవి కి సరి   అరిపోతుందని విమర్శకులఅభిప్రాయం  .
                                                                          హరదాస  స్వామి 
మహా గాయకుడు తాన్సేన్ అక్బర్ చక్రవర్తి కొలువులో సంగీతం పాడి మెప్పిస్తూ వుండే వాడు .”నీ లాగా పాడే వాళ్ళు మరెవ్వరు లేరా?అని అడిగాడు ఒక రోజూ అక్బర్ తాన్సేన్ను .”హరదాస స్వామి ఆశ్రమానికి రాజును తీసుకొని వెళ్ళాడు తాన్సేన్ .ఆయన పాట విన్నాడు చక్రవర్తి ..స్వామి అమితానందం లోభౌతిక   విషయాలకు అతీతం గా ధ్యానం తో,పరవశం తో అలౌకికానందం తో  పాడాడు ఎవరు వచ్చిందీ ఎవరు పోయిందీ ఆయనకేమి పట్టదు ..మైమరపు కల్గించాడు అందరికి .తిరిగి వస్తు అక్బర్అడిగాడు   ”తాన్సేన్ నువ్వు అంత అద్భుతం గ ఎందుకు పాడలేవు ”?అని  .దానికి తాన్సేన్ ”మీరు శలవిస్తే నే నేను పాడాలి –కానీ హరదాస స్వామి భగవంతుని శలవైతేనే గానం చేస్తారు ”అని వినమ్రం గా సమాధానం చెప్పాడు .ఆంటే స్వేచ్చా గానం యెంత మధురమో అనుభూతి పూర్వకమో దీనిని బట్టి తెలుస్తోంది .
అందుకే రవీంద్రుడు ”My song has put off her adornments ”అన్నాడు .ఆంటే భగవత్ సాన్నిధం లో నా కీర్తన నగ్న సుందరం గ వుంది అని భావం .
                                                                      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —-18 -06 -11
Posted in రచనలు | Leave a comment

ఫార్—- –దర్స్ —డే

            ఫార్—- –దర్స్ —డే    

                          ——————–
                 రేపు తండ్రి రోజు -ఫాథర్స్   డే .తండ్రికి , సంతానానికి .దూరం అవుతున్న రోజులివి . దూరంగా ఉంటున్న రోజులు కూడా అందుకే అది ఫార్థర్ డే అన్నాను .దూరపు రోజు అని అర్ధం . నిత్యం ఆఫీసు డ్యూటీ లో,మైళ్ళ కొద్దీ ప్రయాణం లో ,చీకట్లో నే చద్ది మూట కట్టించుకొని ,బండీయో ,బస్సో ,రైలో పుచ్చుకొని కనీసం ఇరవై కిలో మీటర్ల దూరం వెళ్లి ,ఆప సోపాలు పడుతూ ,చేరి .ఆఫీసు బాస్ ల ఇష్టా ఇష్టాలకు సాగుతూ ,కుంచించుకు పోతూ ,రోజంతా గడిపి హలో లక్ష్మణా అని ఇంటికి అంతదూరం ఈదుకొంటు చేరి రోజులు గడుపుకోనేవారు చాలామందే .ఇంటినించి బయల్దేరేటప్పటికి పిల్లలు నిద్ర లేవరు ,తిరిగి వచ్చేసరికి గాఢ నిద్ర లో జోగుతూ ఉ౦టారు .మరి ఈ తండ్రికి పిల్లలు దూరమా ,దగ్గరా ? వుండేది ఒకే ఇంట్లో .కాని వారిద్దరి మధ్య కనిపించని దూరం .వాళ్ల చదువుకు డబ్బు ,సమకుర్చ గలుగుతున్నదే కాని వాళ్ళు ఎలా చదువు తున్నారో ,ఏం చేస్తున్నారో తెలుసు కోలేని స్థితి .తల్లి చదువు కున్న దైతే ఆ సంసారం కొంత నయం .లేక పొతే వాళ్ల గతి అధో గతే .ఈ బాధలన్ని భరించలేక పుట్టంగానే residential లో పడేసి చేతులు దులుపుకొని ,లక్షలు కుమ్మరించి ,వాళ్ల తిండీ బట్ట కార్పోరేట్ పరం చేసి ,అభిరుచులేమిటో ,ఆశలేమితో తెలుసు కోకుండా ,అమెరికా ధ్యేయాన్ని వాళ్ల వంట బట్టించి ,అది నెరవేరే వరకు నిద్రా హారాలు వాళ్ళు మాని సంతానంతో మాన్పించి ఊహా స్వర్గాలలో విహరిస్తూ ,వాళ్ల బాధ్యతను డబ్బు తో దులిపేసుకొంటుంటే ఎక్కడున్నాయి ? ఇంకా ఆప్యాయత ఆనందం ,ప్రేమ వాళ్ల మధ్య ఎక్కడుంటాయి?  కింది తరగతి జనం లో రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి .వున్న కాస్త కోసం తగువులు, కార్పణ్యాలు ,పగా, ప్రతీకారం .  తాగుడు ,వ్యభిచారాలతో కుటుంబ బంధం విచ్చేదనమే . తండ్రికి కొడుకులు చూస్తారని నమ్మకం ,కొడుకులకి తండ్రి న్యాయం చేస్తాడనే నమ్మకం తగ్గిపోయాయి .ఎవరి స్వార్ధం వాడిది .కూతుర్ని ఆప్యాయంగా చూస్తె కొడుకులకు మంట .పోనీ వాళ్ళేమైనా తవ్వి తలకేత్తు తార?ఆంటే అదీ లేదు . కాల౦ గడిచిన కొద్దీ కార్పణ్యాలు పెరగటమే కాని ,కమ్మని పలకరింపులే కరువై నాయి.
                          ఇక అమెరికా లాంటి దేశాల్లో కొడుకులు వుంటే ,ఏదో చుట్టపు చూపుగా పెంచిన వాళ్ళను కొడుకు తీసికొని వెళ్తే అక్కడ కోడలు పెట్టె హింస, ఇటీవలే   అంపశయ్య నవీన్ గారు చాల గొప్ప కధ రాశారు నవ్య వీక్లీ లో . ఆయన్ను సపోర్ట్ చేస్తూ చాల మంది లేఖలురాశారు .  అదే భార్య తల్లి తండ్రి వస్తే ఆమె వాళ్ళను నెత్తినా పెట్టు కోవటం వెంట వుండీ అన్ని చూపించటం ఎన్నెన్నో కోని ఇండియా కు వాళ్ళతో పంపటం కుడా ఆయన రాశారు ..ఇక్కడ తల్లి దండ్రులను చూడటం లో యెంత వ్యత్యాస ముందో తెలుస్తోంది .ఈ జబ్బు ఇతర దేశాల్లో నే వుండదను కొంటే పొర బాటు .  ఇక్కాడా అదే పరిస్థితి చాలా సంసారాల్లో.  భార్య తరుపు వారికి రెడ్ కార్పెట్ స్వాగతం , భార్య కష్ట పడుతుందని తానే అత్తగారికి, మామ గారికి బామ్మర్దికి ,ఆయన గారి భార్యకు ,వాళ్ల సంతానానికి సకలోపచారాలు ,రాచమర్యాదలు చేస్తారు.   అమ్మా ,నాన్న వస్తే భార్య కష్టపడుతుందేమో నని భయం ఇక్కడా వుంటుంది అయితె తానేమి చేయడు ,ఆమెతోను చేయించాడు .  పండగ ,పబ్బాలు వస్తే వీళ్ళకు పరవాన్నం ,పులిహోర అదే అత్తా వైపు వారికి పంచ భక్ష్యాలు ..చూపులో తేడా చేతలో ,ప్రవర్తన లో తేడా స్పష్టం .  ఇదంతా మధ్య తరగతి మంద హాసం .
                                నాన్నా అని, అమ్మా అనీ ఆప్యాయంగా పలకరించే కొడుకులు తగ్గారు .ఫోన్ సంభాషణల్లో ఆ పరమ గౌరవం తగ్గిపోయాయి మెయిల్ రాసేప్పుడూ పొడి అక్షరాలే ..అదే రేపు వాళ్ల సంతానం అలా ప్రవర్తిస్తే సహిస్తారా . ఇవన్నీ సభ్యతా సంస్కారాలకు ,విలువలకు నిలయమైనవి .  కొడుకుల పెట్టు పోతల కంటే వీటినే తలిదండ్రులు కోరుతారు .  వీటికి విఘాతం రా కూడదు.  మామ గారింట్లో ఒక్క రోజు ఉండటానికి కోడలికి తీరిక వుండదు .చుట్టపు చూపు పరామర్శ మాత్రమే. అదే అమ్మకు ,నలత అయితె కలత చెంది భర్త కిబ్బండైనా  వాలి సేవ చేయటం చూస్తున్నాం .  వీళ్ళకే ఈ భావం వుంటే సంతానానికేం చెప్తారు ?అందుకే బంధుత్వాలుగెందె(gender )ర్   బట్టి మారుతున్నాయి
                              వయోవ్రుద్ధుల దీన పరిస్థితి మరీ దారుణం .కొడుకు ఇతరదేశాల్లో వుంటే ఇంకా వారి గతి కుక్కలా గతే .ఆలనా పాలన వుండదు .వృద్ధాశ్రమం లో చేర్పి దులిపెసు కోవటం వంటరి బతుకు ,జీవితం విరక్తి ,జబ్బులు ,వీరి పాలిటి శాపాలు .  వీటిని తట్టుకొని నిలబడే మానసిక ధైర్యం, స్థైర్యం వారికి వుండటం లేదు  .ప్రభుత్వం తలి దండ్రుల బాధ్యతా సంతానానిదే అని చట్టం తెచ్చింది కాని ఆమలులో ఎంతో దూరం ప్రయాణించాలి .  వృద్ధులు దేశ జనాభా లో 50 %ఉన్నారట .వీరందరి గురించి ప్రభుత్వం ఏమి చేయ గలుగుతుంది?  స్వచ్చంద సంస్థలకు కూడా అలవికాని పరిస్థితి .తాత మనవడు సినిమా లాగా తన దాకా వస్తే కాని తెలియదు .కూతుళ్ళే నయం అనిపించేరోజులై పోయాయి ఆవిడ ఏదైనా తలిదండ్రులకు సాయం చేస్తే దోచి పెడుతో౦ది అనినేరం .ఆమెకు వీళ్ళు చేస్తే పక్షపాతం అని ఈసడింపు.
                        ఆప్యాయతకు ,ప్రేమకు ,మమతకు ,మమకారానికి గౌరవానికీ ,మర్యాదకు మంచికి సహృదయతకు ,సానుభుతికి నిలయమైన దేశం లో ఇవన్నే క్రమంగా దూరమవటం విచారకరం .  ధర్మానికి దూరం అవటం లో వచ్చిన ఇబ్బంది ఇది తలిదండ్రుల బాధ్యతా సక్రమంగా సంతానం వహించాలి అప్పుడే వారికి ఆనందం ,వీరికి శ్రేయస్సు .faathers డే ,కుటుంబ బంధాలను ద్రుఢతరం చేయాలి .  ఏక కుటుంబ భావన కలిగించాలి ఆంటే కాని వాటిని మరింత దూరం చేసే ఆంటే ఫార్థర్  చేసే పని చేయ దాని ఆశిద్దాం .  రోజు ను జరపటం కాదు రోజూ  వారితో గడిపే రోజూ రావాలని ఆకాంక్షిద్దాం
                                                                                 గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in రచనలు | 4 Comments

ఎవరు తల్లీ !

 ఎవరు తల్లీ !
అన్న దమ్ముల పంపకాల్లో రెండు చేతులు తెగినా
నిబ్బరం గా నిలిచావు ఇంతకాలం
నీ ముఖం లో తేజస్సు ,ఓజస్సు నిండి వుండేది
మిగిలిన నీ సర్వాన్గాలు బలోపేతం గా చలిస్తూన్దేవి
నీ ముఖం కాంతి చూసి ,క్రాన్తిదిశలో పరుగు మొదలు పెట్టాం
ఛీ చిరు నవ్వుల వెన్నెల్లో ఆనందపు అంచులు చూశాం
అభ్యుదయ పధం లో అడుగేస్తున్నామని భావించాం
అయితె ఒక్కసారిగా   ఏమిటీ మార్పు నీలో ?
మండల మంటల్లో ,నీ చీర కాలిపోయినట్లుందే
పంజాబ్ మారణ కాండతోగాయమై  రక్త సిక్తమై నట్లుంది నీ కాయం
ఒళ్ళంతా తూట్లు పడ్డట్లుంది మానలేని గాయాలతో
మహారాష్ట్ర మహా దానవ కాండలో నీకళ్ళు ,కాళ్ళు తెగి .
బాంబే బాంబులతో సర్వం కూలిపోయి సోలిపోయి
కలకత్తా విస్ఫోటనం తో నాలిక తెగిన కాళిలా
ఏనాడు ఏవైపు ఏం జరుగుతుందో తెలీని స్థితి లో
అపస్మారకం గా ,నిస్తేజం గా ,నిస్సత్తువగా మూల్గుతున్నావా
ఎవరు తల్లీ నీవు ?
 పోల్చుకున్నాములే నిన్ను
భారత భాగ్య విదాయినివి గా
ఆర్ష ధర్మాన్ని విశ్వ మంతా నినదించిన విపంచి వనీ
మురళీ రవాన్నీ ,గీతామృతాన్ని  ఎల్లలు దాటించి
 పరవశించిన మహోన్నత మూర్తి వనీ
సత్యాహింసల సర్వోత్క్రుస్త భావ రాగాలాల పించిన మాతవనీ
 మాతృత్వానికి మహోన్నత స్థానం కల్పించిన ఔదార్య మూర్తివనీ
పరమ పావని వనీ ,మాతవనీ ,భారత మాతవనీ
తెలిసి తల దిన్చుకున్నాము
వినమ్రులమై  ,సిగ్గుతో ,చితికిన ఆశలతో
అణగారిన అహంకారం తో
మ్లానం గా దీనం గా అవమానం గా  ..
                                                                                  రచన —గబ్బిట దుర్గా ప్రసాద్ —17 -06 -11 .
                                                                                   రచనా కాలమ్ —-22 -03 -1993

Posted in రచనలు | Leave a comment

ఎల్లలు

ఎల్లలు 

నా దేశానికి ఉత్తరాన మహోన్నత హిమ నగం
దక్షిణాన అగాధ హిందూ మహా సాగరం
పశ్చిమాన అరేబియా ,తూర్పున బంగాళా ఖాతం
సహజ ఎల్లలు గా ఇప్పటిదాకా చెప్పుకొని
పరవశించి మురిసి పోయే వాణ్ని
కానీ ,నా దేశానికి కాపలా కాస్తున్నది
ఉత్తరాన మిలిటేన్ట్లనీ ,దేశాద్రోహులనీ ,infiltrators అనీ
దక్షిణాన తమిళపులులనీ ,తస్కర ముష్కరులనీ
 పడమట మామియాన్లనీ ,దావూద్ లనీ శివుని ప్రధమ గణాలనీ
 తూర్పున బోడోలనీ ,బడాబాబులనీ ,,జార్ఖండ్ ఉగ్రవాడులనీ
తెలిసి అదిరి పడ్డాను –ఆవేశం తో వూగిపోయాను
ఈ నాలుగు హడ్డులనుంచి అరాచకం సృష్టించి
ఆటవికం గా ,పాశవికంగా ,సామాన్యులపై
విదేశీ శక్తుల క్రూర పద ఘట్టనలతో
నలుగుతూన్న భారతం నాది
నిత్యం రగులుతున్న మహా భారతం నాది
ఇది చాలదన్నట్లు మతం మత్తుతో
ఇజం ఈగో తో హజం కైపులో ,
అన్నదమ్ములు అనునిత్యం నరుక్కుంటున్న  నరక  భూమి నాది
విదేశీ రుణ భారం తో నడ్డి విరిగిన దేశం నాది
నేతల మాటకీ ,చేతకీ పొంతన లేని దేశం నాది
ఇలా ,ఇలా దిగాజారాల్సిన్దేనా? ?ఇంకా ఎంతకాలం ?
అందుకే మళ్ళీ కొత్త సరిహద్దులు కావాలంటాను నేను
ప్రగతికీ ,అభ్యుదయానికీ ,సంక్షేమానికీ ,సౌభాగ్యానికీ
ఉత్తరాన సహనం ,దక్షిణాన సంయమనం
పడమట సఖ్యం ,తూర్పునసామరస్యం
సహజ ఎల్లలు గా రక్షక , కవచాలుగా రూపొందిన నాడు
నా మాత్రు భూమి భారతికి నిజం గా మంగళ హారతి ..
                                                                           రచన— గబ్బిట దుర్గా ప్రసాద్ ——17 -06 -11
                                                                        రచనా కాలమ్ —21 -03 -93 ..

 

Posted in రచనలు | Leave a comment

నిత్య హరిత శ్రీ శ్రీ ————చివరి భాగం

 నిత్య హరిత శ్రీ శ్రీ ————చివరి భాగం 
                        ”సింధూరం ,రక్త చందనం –బంధూకం ,సంధ్యా రాగం –పులిచంపిన లేడి నెత్తురు –ఎగరేసిన యెర్రని జండా –రుద్రాలిక నయన జ్వాలిక –కలకత్తా కాలిక నాలిక —కావాలోయ్ నవకవనానికి ”అని ఆత్మాశ్రయం గా చెప్పినా కవిత్వం లో విశ్వ జనీనత సాధించాడు శ్రీ శ్రీ .
                    ”కదిలేది ,కదిలించేది ,–మారేది ,మార్పించేది –పాడేది ,పాడించేది –పెను నిద్దర వదిలించేది –పరిపూర్ణపు బ్రతుకిచ్చేది –కావాలోయ్ నవ కవ నానికి ”అని వ్యంగ్య వైభవం తో కవిత చెప్పాడు .”సాహిత్య సభాన్గానా  –వ్యంగ్యానిదే మొదటి పద్దు ”అన్నాడాయన .”కవిత్వమొక తీరని దాహం ”గా భావించాడు .”ఉండాలోయ్ కవితావేశం  ”అని ఆవేశమే ఊపిరి అన్నాడు .
             ”నేను సైతం ప్రపంచాగ్నికి –సమిధనొక్కటి ఆహుతిచ్చాను –నేను సైతం విశ్వ వ్రుస్తికి –అశ్రువొక్కటి ధార పోశాను —నేను సైతం భువన ఘోషకు వెర్రిగొంతుక లిచ్చి మోశాను ”అని స్వంత గొంతుకతో ”జయభేరి ”మ్రోగించాడు .అంతులేని శోకం జడివాన గాకురుస్తుంటే   తానూ వో అశ్రు కణం ధార పోశాడట ..ప్రపంచ హోమాగ్నికి తానూ వో సమిధ నిచ్చి జ్వాలా ప్రజ్వలనకు దోహదం చేశాడు .విశ్వ శోకం విలయ ఘోష గా వినిపిస్తోంది .ఆ ఘోష లో వీరావేశం తో తానూ శృతి కలిపాడు .ఒక కొత్త కేక వేశాడు .సామాజిక దృక్పధాన్ని,జాతీయ ,అంతర్జాతీయ స్థాయికి తీసుకొని వెళ్ళాడు .అరసం లో వున్నా ,విరసం లో వున్నా జన బాధ తో శ్రుతికలిపి సహవేదన చెందాడు .
                       సమాజాన్నిసైనిక   సంఘం లా చేయాలని భావించాడు .మాటల్లో మహోత్చాహం ,గతిలో మిలిటరీ బాండు ,వినిపిస్తూ ,గర్జిస్తూ ,గమ్యం చూపాడు .ప్రతి పదం ప్రగతి శీలంప్రతిధ్వనిస్తూ ,సమాజ చైతన్యాని సంఘటితం చేసే శబ్ద శక్తిని సమీకరిస్తూ ,మరో ప్రపంచం వైపు నడిపించాడు .శ్రీ శ్రీ శిల్పానికిది కలికితురాయి గా విశ్లేషకులు మెచ్చారు .అందుకే ”ఆధునిక యుగం లో పాల్కురికి సోమనాధుని వంటి వాడు శ్రీ శ్రీ ”అన్నారు .”మహా ప్రస్థానాన్ని ”సామాన్యుల మనోలోకాన్ని గురించి రాస్తే ,”దేశ చరిత్రలు ”బౌద్ధిక లోకాన్ని ఉద్దేశించి రాశాడు .ఆంటే ఆలోచించే వారి కోసం రాశాడని భావం .అందుకే ఆయన సవ్య సాచి .రెండంచుల కత్తి .ఆయన గీతాలన్నీ ,పాథక జన హృదయాల్లో చేరి పోయాయి .oft quoted lines  అయాయి .ప్రతి సందర్భం లోను ఏదో ఒక శ్రీ శ్రీ కవితా పంక్తిని ఉదాహరించాకుండా మాట్లాడలేం .maarx  భావ దాసుడని అందరూఅన్నా   శ్రీ శ్రీ మహాకవే .సామ్య వాదాన్ని సామవేదం లా వినిపిస్తాడు .”రామనీయారధక ప్రతిపాదక శబ్దం ఆయన కావ్యం ”.శబ్ద శక్తి సారాన్ని ఆపోసన పట్టిన  కవి అగస్తుడు శ్రీ శ్రీ .శబ్దం చేత ఆకారాన్ని ,అర్ధం చేత చిత్రాని గీస్తాడు .ఎంతటి శబ్ద శాసనుదో అంతటి రస వాది కుడా .ఏ వస్తువును తీసుకొన్నా ,ఆవిష్కరణలో అగ్ర స్థానం ఇచ్చే మహా కవి శ్రీ శ్రీ .ప్రళయం శ్రుస్టించినా ,ప్రాణం కల్పించినా ,మంట పెట్టినా మహా చల్లదనం కల్గించినా ,అశాంతి బావుటా ఎత్తినా  ,శాంతి కపోతాన్ని ఎగారేసినా ,విప్లవం సృష్టించినా ,వినిర్మల మనస్కత సాధించినా మాటలతో చీల్చి చెందాడినా ,మమతల వర్షం కురిపించినా .లోకం తీరు నిరసించినా ,లోక చైతన్యం కల్గించినా వాడిగా వేడిగా  రాసినా ,వెన్నెల కురిపించినా  శ్రీ శ్రీకే సాధ్యం .అతని మాట నిత్య హరితమే .అందుకే ఆయన నిత్య హరిత శ్రీ శ్రీ .
                                                                                                     గబ్బిట దుర్గా ప్రసాద్ —–17 -06 -11
                                                                                                 రచనా కాలమ్ 20 -09 -1998
Posted in రచనలు | Leave a comment

నిత్య హరిత శ్రీ శ్రీ —–02

 నిత్య హరిత శ్రీ శ్రీ —–02
                         అభ్యదయ కవిత్వానికి ఖండ కావ్య ప్రక్రియే ఉత్తమ  మైనదని నిరూపించిన వాడు శ్రీ శ్రీ .రచన శస్త్రం లాంటిది .దాన్ని ఉపయోగించేపద్ధతిని   బట్టి ఫలితం వుంటుంది .అన్నాడు శ్రీ శ్రీ .ఉద్యమ భావ జాలాన్ని స్వయం గా నమ్మి ,ఆచరిస్తూ ,వాటిలో జీవిస్తూ ,కవి రాస్తే చరితార్ధమవుతుందని అంటాడు .ఆంటే marxist భావం ,మనసా ,వాచా ,క్రియా రూపం లో వుండాలని అతని భావం .నిబద్ధత లేని కవిత నిలవదు .1970  లో విప్లవ కవితా శంఖాన్ని పూరిస్తూ ,”సాయుధ విప్లవ భీభత్చ రధ సారధి నై ,భారత కురుక్షేత్రం లో నవయుగ భగవద్గీత ఝంఝాను వినిపిస్తా ”అన్నాడు .
                         ”ఈ శతాబ్దం నాది ”అని గర్వంగా చెప్పుకొన్నాడు శ్రీ శ్రీ .”అందుకే ”అభ్యుదయాంధ్ర యుగ కర్త”శ్రీ శ్రీ ఏ నని అందరి భావం .అతను నిజం గా ప్రజా కవి .వాళ్ల బాధలు ,కన్నీళ్లు ,అన్నీ తనవిగా భావించి స్పందించాడు .”నిజం గానే నేను ప్రజాకవినేను–ఎంచేతంటేను -వాళ్ళను చదివేను -చదివిందే రాసేను ”అంటాడు .ప్రజలను చదివి ,చదివింది రాసిన వాడే కదా ప్రజా కవి !
           హాస్య రస గులికల్లాంటి ”సిరిసిరి మువ్వ ”,ప్ప్రాసక్రీడలు ”,”లిమరిక్కులు ‘వగైరా రాశాడు .ఈ మూడిటిని కలిపి ‘సిప్రాలి ”అన్నాడు .దేన్నే విదూషక కవిత్వం అని తనే చెప్పుకొన్నాడు .కార్టూన్ కవిత్వమన్న  మాట. ”రామాయణాలే మళ్ళీ మళ్ళీ తెచ్చి ,మ్రుచ్చలించే కన్నా -ఆ మోస్తరు రచనల్లో క్షేమం కదా రామకోటి –సిరిసిరి మువ్వా ”అంటాడు సరదాగా .”గోల్డ్ వ్యామోహం చెడ్డది ,మైల్డ్ వ్యాపారం శరీర మాద్యం ఖలుడా –చైల్డ్ వ్యాపారం కూడదు –ఓల్డ్ వ్యూ లను హోల్డ్ చేయకోయి సిరిసిరి మువ్వా ”అని మణి ప్రవాళ సంకరం గానూ ప్రతిభావంతం గ చెప్ప గలడు .లిమరిక్కులు లో ”సమకాలిక జీవితమే సత్కవితా వస్తువు .అనృషీ ,కుకవీ చచ్చిన వంటే -పడి చస్తురు -నవ రసాల నాయకుణ్ణి -కవనం నా ఆయుధం -ఈ శతాబ్దం నేనేలు తుంటి ”అన్నాడు .”కరుణ రసం ,శృంగారం ,వాడిన పూరేకులు –వీర రసం ,భీభత్చం ఈ నాటి తుపాకులు ”శ్రీ నాధుని చాటువులకు ,శృంగార నైషధానికి యెంత తేడా వుందో శ్రీ శ్రీ విదూషక కవిత్వానికి ,మహా ప్రస్థానానికి అంత తేడా కనిపిస్తుంది ,.”వెలుగు నీడలు n”లో తన్ను ఆవిష్కరించుకొంటు ”విదుషకుని temperamentu  ,ఏదో ఒక discontentu  ,బ్రతుకులో experimentu ,పదాలు పేటెంట్ ,రసాలు torrent ,,సదసత్షమస్యకి solvent  శ్రీ శ్రీ gaint  ” అని తన రహస్యాన్ని బయలు పెట్టుకొన్నాడు .
              అనంత వచన సాహిత్యాన్ని వండి ,వడ్డించాడు .”అనంతం ”లో తనను తాను పూర్తిగా అవిష్కరించుకొన్నాడు .కధ నాటిక వ్యాసం ,ఉపన్యాసం ,సమీక్ష ,పీఠిక ,గళ్ళ నుడి కట్లు ,లేఖలు ఇలా ఎన్నిటినో పరిపుష్టం చేశాడు .”ప్రక్రియ ”ఆయన కలానికి ఓడిగిందే కాని ఆయన మీద ప్రభుత్వం చేయలేదు ..ఆయన మాటల్లోనే ”పద్యం ఎక్కువా గద్యం ఎక్కువ అనే సమస్య అభేద్యం .అయినా ఘంటా వాద్యంగా నేనంటా –నీ రెండు నాకే నైవేద్యం ”.ఖడ్గ సృష్టి చేస్తూ ”కాలం తో సృష్టిస్తున్న ఖడ్గం ఇది -కుళ్ళి పోతున్న సమాజ వృక్ష మూల చ్చేడం చెయ్యటం డాని ధ్యేయం ””అర్ధాన్ని అధ్వాన్నపు అడవిలో వదిలి-గద్యానికీ పద్యానికి –పెళ్లి చేదాం ”అని సర్రియలిజం ధోరణిలో శ్రీ శ్రీ దూసుకు పోయాడు .”జీబ్రాకి ,ఆల్జీబ్రా చిహ్నం ,లామ్కోటు ,పామ్కోళ్ళు తొడిగి ,సాహిత్య పౌరోహిత్యం యిస్తే –వెర్రికాదు –సర్రియలిజం సోదరా ”అనేస్తాడు తేలిగ్గా .
              ”  శ్రీ శ్రీ దృష్టిలో ప్రతి వస్తువు ,అపూర్వ వ్యక్తీ స్వేచ్చలోంచి పుట్టిన అంతర్ వ్యక్తీ .భాషలో భావన లో ,ఛందస్సు లో ,పద బంధం లో ఉక్తి చమత్కారం లో కొత్త పోకడలు పోయి తనదైన రస జగత్తును సృస్తిన్చుకోనాడు .కవిత్వం  లో స్వేచ్చకు శ్రీ శ్రీ పట్టం కట్టాడు .”భావ లయ”కు ప్రాధాన్యం ఇచ్చ్చాడు .అంతర్లయకు ప్రాణం పోశాడు .చెవికిమ్పైన శబ్ద ప్రయోగం చేశాడు .వచన కవిత్వం లో నడక వైవిధ్యానికి స్థానం కల్పించాడు .తిరుగు బాటుకు స్వేచ్చను ఊతకర్రను చేశాడు .”సంస్కృతం ,ఆంధ్రం ,పాశ్చాత్య సంస్కృతీ సంప్రదాయాల త్రివేణీ సంగమమే శ్రీ శ్రీ ప్రతిభా పరివాహక క్షేత్రం ”అన్న పెద్దల మాట చద్ది మూటే .
              ” నేనేదో రచిస్తాననీ -నా రచనలలో -లోకం ప్రతిఫలించి ,నా తపస్సు ఫలించి –నా గీతం గుండెలలో ఘూర్ణిల్లగ –నా జాతి జనులు పాడుకొనే మంత్రం లా మొగించాలనీ –నా ఆకాశాలను లోకానికి చేరువగా -నా ఆదర్శాలను సోదరులంతా పంచుకొనే వెలుగు రవ్వల జడిగా –అందీ అందక పోయే –నీ చేలాన్చాలముల -కొసగాలులతో నిర్మించిన —నా నుడి నీ గుడిగా –నా గీతం నైవేద్యం గా –హృద్యం గా అర్పిస్తానో -నా విసరిన రస విసృమర కుసుమ పరాగం —వోహో –రసదునీ –మనిఖనీ –జననీ వో కవితా కవితా వో కవితా వో కవితా ”ఈ గీతం సభలో శ్రీ శ్రీ చదువుతున్నప్పుడు అధ్యక్ష స్థానం లో వున్న కవి సమ్రాట్ విశ్వ నాద సత్య నారాయణ గారు చెమ్మగిల్లిన కళ్ళతోకోగిలించుకొని  కాగిత  గౌరవిన్చారట .అదీ ఆకవితకు ,కవితా నిర్వచనానికి ,శ్రీ శ్రీ కవితా ప్రాభవానికి లభించిన సరస్వతీ పురస్కారం .
                                                                                   ముగింపు తర్వాత
                                                                                          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —-17 -06 -11 ..

 

Posted in రచనలు | Leave a comment

నిత్య హరిత శ్రీ శ్రీ

                 నిత్య హరిత శ్రీ శ్రీ 
”అగ్ని సరస్సున వికసించిన వజ్రం ”అన్నారు   శ్రీ శ్రీ ని  శ్రీ అద్దేపల్లి రామ మోహన రావు .శ్రీ ఒక వండర్ ,థందర్ ,.మహా ప్రస్థానానికీ ,మరో ప్రస్థానానికి తన మాటల మంత్రం తో తనతో పాటు మనల్ని ,తీసుకొని వెళ్లి న మాటల మాయ గాడు .ఆయన ఒక word finder  .
                        సామ్య వాద వ్యవస్థను సమాజం లో స్థాపించే ధ్యేయం గల ఉద్యమ కవిత్వం అభ్యుదయ కవిత్వం .బాగా స్థిర పడ్డ వ్యవస్థ నిర్మూలన ,సామ్య వాదఅవగాహన కల్పించటం   ,దానికి తగ్గ భావ జాలం తయారుచేయటం ,దీనికి అనుగుణ మైన నవ్య కవితా రూపాని ప్రక్రియా స్వరూపాన్ని కల్పించటం ఈ ఉద్యమం లక్ష్యం .శ్రీ శ్రీ రాసిన ”సుప్తాస్తికలు ”తో అభ్యుదయ కవిత్వం ప్రారంభమైంది .ఛందస్సుని చేదించారు .పూర్వ కవులు కావ్య వస్తు వు గా తీసికొని అంశాలను ,ఎన్నుకొని ,కవిత్వం చెప్పారు .కొత్తదనం కోసం ప్రయోగాలు చేశారు .దీన్ని ప్రయోగ దశ అన్నారు .ఈ కోవకు చెందిన వారే శ్రీ శ్రీ ,శిష్ట్లా ,నారాయణ బాబు ,ముద్దుకృష్ణ ,పట్టాభి వగైరా కవులు .
                    ఛందస్సును ఫేదేల్ మని తన్నిన తర్వాత కవిత్వం ఏ రూపం లో ,ఏ ప్రయోగం కోసం ,ఎలా నిర్మించాలో తెలిసిన వాడు ,దర్శించిన వాడు శ్రీ శ్రీ మాత్రమే .ప్రతిభ తో గొప్పప్రయోగాలు చేశాడు .పరిణత ప్రజ్న కన పరిచాడు .అందుకే ప్రయోగ వాదుల్లో అతనే నాయకుడైనాడు .యూరప్ లో కవితా పరంగా వచ్చిన మార్పులనితికి ఇక్కడ రూప కల్పన చేశాడు .
             ఉద్యమాన్ని సమాజానికి అందించాడు శ్రీ శ్రీ .ఉద్యమ కవితకు ”మహా  ప్రస్తానం ”,కవితావోకవితా  ””జగన్నాధ రధ చక్రాలు” ఉదాహరణలు అభ్య్దయోద్యమ . కవితకు ఆదర్శ వంత మైన ప్రయోగాలు చేసి ,ఉద్యమానికి కావలసిన ఇంధనం అంతా సమకూర్చాడు .కవితా రూప శిల్పం కూడా కూడా బాగా వుంది .”రుక్కులు ”,”జయభేరి ”, ఇ ”దేశ చరిత్రలు ”లో ఆలోచనతో కూడిన భావ జాలాన్ని ,కవితను కళా ఖండం గా మార్చే స్థితినీ కల్పించాడు .ఆవేశం ,ఆలోచన అన్న జోడుగుర్రాల స్వారి చేశాడు .”హృదయం ఎలా కంపిస్తే ఆ కంపనాలను మాటలుగా రూపొందించటం అతన్కే చేతనవుననిందరి చేత భేష్ అనిపించుకొన్నాడు .అతని మాటలు అక్షరాలూ కావు .ఉద్రేకాలు ,బాధలు ,యుద్దాలుహృదయం లోంచి డైరెక్ట్ గా పంపిన ఉత్చాహాలు ,నెత్తురు కాలువలు ,”అన్న చలం ఇంట్రో లోని మాటలు అక్షర సాక్ష్యాలు .ఉద్యమ ప్రారంభానికి కావలసిన ఆవేశం ,స్థిర పడటానికి ఆలోచనా ముఖ్యం .ఆ రెండు శ్రీ శ్రీ లో మెండు .గా వున్నాయి .కనుకనే శ్రీ శ్రీ ”కవిత్వ తత్వ విజయోజ్వలుడు ”,;;ఉభయ కవి మిత్రుడు ”అని ఆచార్య జి .వి.సుబ్రహ్మణ్యం  అన్నారు
                                                                           రెండో భాగం తర్వాత
                                                                                     మీ
                                                                                గబ్బిట దుర్గా ప్రసాద్ —–16 -06 -11 .

 

Posted in రచనలు | Leave a comment

బాలెట్ బాలే

             బాలెట్ బాలే 
01 -ఖండిత హస్తాలతో వృద్ధ వీరుల వీరంగం తో –ధనస్వాముల ప్రాభవంతో -మౌన  నరసింహ రంగ ప్రవేశం
02 -రామ నామ భజన -వాజపేయి సృజన -కమల భావ రచన –భా.జ.పా .వివరణ
03 -దానా కుంభకోణం -వర్గ వైషమ్యం –చీలిక పెలిక రణ రంగం –లాలూ జనతా వీరంగం
04 -మాయావతి -బాణా మతి -దళిత దళపతి -కాన్షీరాం గతి ,శృతి
05 -తారా బలం తో చంద్ర బలం తోడై –సారానిషేధ సత్తువతో —సైకిల్ పై భారీగా –నారా బాబు స్వారి
06 -ఖర్చుకు ,హామీకి ,జమకు –ఎన్నికల నియంత్రణ అనే యెర్ర త్రికోణం —శేషన్ ,గిల్లూ ,జి,వి,.జి
07 మండు తెన్డల్లో ఎన్నికలు -మండే గుండెల మంటలు –ఆర్పే నాధుడే లేదు అయినా అయిదేళ్ళ కోసారి –ఓటు అడుక్కునే భిక్ష గాళ్ళే రోడ్డంతా
08 -స్కాముల కంపు -మందిరం వాసన -మసీదు ముంపు –తీవ్రవాద గర్జన –హింసా దౌర్జన్యం —కోటీశ్వ  లకే    దక్కిన టికెట్లు –ప్రజలకేమో నిత్యం ఇక్కట్లు
09 బ్లేజ్ వాడలో ఎన్నికల మంటలు –చల్లార్పి స్వంతం చేసుకొనే దెవ్వరో –విజయ వాటికకు –ఉపేంద్ర వైభోగామా -శోభనాలన్కారమా –రాజ శేఖర(ప )వరమా /
10 హిందూపురం ”హరి”పురమా –తిప్పాపురమా అల్లా టప్పా కాదీసారి —
11 -వెంకయ్యకు కర సేవ చేస్తే -ఒవైసీ కి అమానుల్లా లో అల్లా కనిపిస్తున్నాడు –ఒడ్డుకు చేరే  దొడ్డ ఎవరో /
12 -శారద నీరద కు –ఓట్ల వర్షం కురుస్తుందా –బ్రాహ్మణ సింగం పై –గెలుపు వరిస్తుందా
13 -నంద్యాల భూమి భూమాదా –శేష శయనమా –మళ్ళీ నార సింహమా
14 -అత్తిలి బాపి బావ –నర్సాపూర్ లో -మీసాలు మేలేస్తున్నారు –కృష్ణం రాజు ,రాయుడు గార్ల ఇంటి వాసాలు లెక్కిస్తున్నారు
15 -”ప్రతాపుల  ”పాలిటి రాజం కోట –గెలుపు ఆటో లో ”సుంకు ‘వుంటాట్టా /
16 -కాకినాడ ఓట్ల వాకిట –;;తోట ”కాపరులు –”చిక్కాల ”తో –ఓట్ల మామిడి కోస్తాడా /
17 -ఖమ్మం ఎర్రకోటను –హస్తం నాయుడుధీ కొంటాడా  -”వీర భద్ర పళ్ళెం ” లో ఓట్ల కట్టలు నిండేనా /-
18 -తమిళ నాట పోరు –బహు రంజుగుంది చూడు –మూపనారు దెబ్బకు –నీరు గారే పీ.వి .గారు
19 -అరుణాచలం లో –చిదంబర రహస్హ్యం –రజనీ కాంత వైభోగం లో –కరుణ కు ఓట్ల నిధి అందేనా
20 -గాడ్ లేకున్నా పర్లేదు –ఫాదర్ లేకున్నా ఏం కాదు –గాడ్ ఫాదర్ పైనుంటే టికెట్టు కేం –ఇక్కట్టు లేదు
21 -ఎన్నికల ముందే పతన సూచిక –విల్స్ కప్ ,సింగర్స్ కప్ ,”లిప్”జారిన వైనం
22 -బెంగాలు పులి ”బాసు ”–కలకత్తా కాళి ”మమత ”–యమర్జన్సీ రే ఆఫ్ హోప్ ”-పశ్చిమ బెంగాల్ తెరపై –పాత ఆటే మళ్ళీ
23 -ఆయారాం గయారాం –దేవీలాల్ ,పుత్రాలాల్ ,–సగోత్రాలాల్ కమలాల్ –ఎరుపు లాల్ –హర్యానా వికాష్ ”మంచే’క్కేనా?
24 -తెలుగు వాడికి ఇంత కాలానికి —దేశమంతా టికెట్లిచ్చే చాన్సు వచ్చింది –ఇది తెలిసి జనం –ఓట్ల పంటలు పండించి –నజరానా సమర్పిస్తారా నరసింహానికి /
25 కాంగ్రెస్ రావు -తివారి –దేశం బాబు-పార్వతి –బాజపాపాయ్ -ద్వాని –జనత దళ్  ఏటు జాడ్ –సిపియం -ఇం-ఎల్ కే –అతుక్కోవాలనే ఆదుర్దాతో –పీలికల అకాలీలు –ఇవీదేశం   లో పార్టీల ముఖార విందం
                                                                                       రచన –గబ్బిట దుర్గా ప్రసాద్
                                                                                     రచనా కాలమ్ —-07 -04 -1996
                                                                               ఇది     పదిహేను ఏళ్ళ నాటి  ఎన్నికల రాజకీయం
Posted in రాజకీయం | Leave a comment

మరక మంచిదే

         మరక మంచిదే 
రోడ్డు వెయ్యకుండా డబ్బు  నోక్కావని మరక పడిందా –పర్లేదు నువ్వు సర్పంచికి అర్హుడివే
 స్మశానం కబ్జా చేశా వని నింద పడిందా –మరక మంచిదే బడా కంట్రాక్టర్ ఖాయం
బడి  లో పేకాట,,వ్యభిచారం చేస్తున్నావన్న  ఆరోపనా ?మండలాద్యక్షుడు గారెంటీ
కోటా బియ్యం నోక్కేశావని చెవులు కోరుక్కున్టున్నారా ? నువ్వు సివిల్ సప్ప్లై కి అధిపతివే
నల్లదనమ్ కూడ బెట్టావని ఆరోపనా ?వెంటనే ఏం ఎల్.ఏ చాన్సు ఉందనే   మరక మంచిదే
ఔటర్ రింగ్ రోడ్ ,కారిడార్లు ,సెజ్ లలో అపార ధనం దోచావన్నారా ?సి.ఏం .ఖాయం .
దేశాన్ని తాకట్టు పెట్టావని మరక పడిందా ఇంకేం పీ.ఏం .నువ్వే .
అవినీతి కుంభకోణం బయట పడిందా నువ్వే కేంద్ర మంత్రివి .
నువ్వు పాలించిన కాలమ్ లో ని అవినీతి బట్ట బయలయిందా నువ్వు ప్రతిపక్ష నేతవే
అధికారి గా వుండి ,అన్నీ నోక్కేశావా ఇంకేం నువ్వే అవినీతి శాఖ మంత్రి –సారీ అవినీతి నిరోధక శాఖా మంత్రి ,
వీధి రౌడీవని సెట్టిల్మెంట్లు  చేస్తావని మరక పడిందా ?నగర మేయరువే–మేసే వాడు    -మేయరు అని సామెత
కులగజ్జి ,మతపిచ్చి ,మూర్ఖత్వం అని ముద్ర పడిందా —నువ్వు బురిడీ బాబావే \
దేవాలయం నీ ధనాలయం అనుకున్నావని నిన్నన్నారా ?నువ్వే  ఏడుకొండల వాడి విధి రాత రాసే ఆఫీసర్ వి —
చూశావా బ్రదర్ –మరక అంటితే ఎంత మేలో ఎంత గా ఎదిగి పోతావో
అక్షరం రాదనీ ఆంటే నువ్వే విశ్వ విద్యాలయాన్ని గిర్రున తిప్పే అధికారివి
నటన వాచకం రాదనీమరక అంటించార   ?నువ్వే సూపర్ డూపర్ హీరో
అన్గాన్గంప్రదర్శించిందని ఆరోపణ ఉందా ?ఆమె బిజీ హీరోయిన్గా ఎదిగేది
ఎన్నని ఇలా చెప్పను ? ఏది రాక పోయినా కాకా పట్టావని చెవులు కోరుక్కున్నారా -భేష్ నీకు అడ్డులేదు -తిరుగు లేదు
కనక బ్రదరూ ,మరక అంటించు కొండి .అడ్డం గా ,నిలువుగా ఎదిగి పొండి –అందుకే అన్నిటికీ మరక ముఖ్యం
మరక అన్తిండా ,తేనే తుట్టెపట్టినట్లే   రొట్టెనేతిలో పడ్డట్టే    —-
అందుకే మరక మంచిది -మంచిది -మంచిది .
ఒళ్ళంతా అంటించుకోండి అడ్డు ,ఆపు లేకుండా ఎదిగి పొండి
మరక కడిగే వాడు లేదు ,తుడిచే వాడు లేదు .
మరకనీకు   వరంమాకు   శాపం …
                                                                                             గబ్బిట దుర్గా ప్రసాద్ —15 -06 -11

Posted in రచనలు | Leave a comment

సాహితి మండలి ఉయ్యూరు -256 వ సమావేశం -ఆహ్వానం

Sahithi Mandali 256 110619_0001

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ఆలోచనా లోచనం అతిధి సంరక్షణ

       ఆలోచనా లోచనం 
                                                                   అతిధి  సంరక్షణ 
                         స్నేహం చాలా విలువైనది .అవసరానికి ఆదుకొనే వాడు మిత్రుడు .అందరు వదిలేసినా స్నేహితుడే మనల్ని కంటికి రెప్ప లాగ కాపాడుతాడు .ఇంటికి వచ్చిన అతిధి మంచి చెడ్డలు విచారించి ,ఆదరించటం లోక రీతి  .అనుకోని అతిదికే అలాంటి మర్యాదలూ చేస్తున్నాప్పుడు ,ఇంటికి అతిధి గా వచ్చి స్నేహం గా యజమాని తో ఉంటూ ,అతని సంరక్షణ లో తన పిల్లలు క్షేమంగా ఉంటారని భావించటం సహజం .కాని దీనికి విరుద్ధం గా జరిగితే ,ఆ స్నేహమే పగ తీర్చుకుంటుందని తెలియ జెప్పే ”పక్షిని ”కధ హరివంశం లో వుంది
                          ఒకప్పుడు బ్రహ్మ దత్తుడు అనే రాజుండే వాడు .ఒక రోజు అనుకోకుండా ఒక ఆడ పక్షి ఆంటే పక్షిని రాజగృహం చేరింది .డాని చూపులు ,చలాకి తనం చూసి రాజు ముచ్చట పడ్డాడు .క్రమంగా పక్షికి ,రాజుకు స్నేహం పెరిగింది .ఆ పిట్ట ఆకారం వింతగా వుండేది .డాని రెక్కలు ,వీపు పొట్ట నల్లగా ,తలమాత్రం ఎర్రగావుండేది .రోజూ ఉదయమే అది రాజభవనం నుంచి యెగిరి పోతుంది .నదీ నదాలు .పర్వతాలు ,సముద్రాల మీదుగా యెగిరి ఆహారం సంపాదిస్తూ ,లోకం లోని వింతలను గమనిస్తూ ,సాయంకాలానికి బ్రహ్మ దత్తు డుండే కామ్పిల్య నగరం చేరేది .తాను చూసిన వింతలూ ,విశేషాలు రాజుకు చక్కగా వివరించేది .రాజు ఆనందంగ్గా వినేవాడు .రాజుకు వార్తాహరుని గా పనిచేసేది అన్నమాట    .రాత్రి పూట రాజభవనం లోనే వుండేది .రాజుకు కొడుకు పుట్టాడు .ఈ పక్షికి ఒక పిల్ల పుట్టింది .దానికి తల్లి పోలికలన్నీ వచ్చాయి .పక్షిని రాజకుమారున్ని ,తన పిల్లను సమాన ప్రేమతో చూసుకొనేది .ప్రతిరోజూ బయటి నుంచి రెండు పళ్ళు తెచ్చి ఒకటి రాజకుమారిడికి రెండోది తన పిల్లకు ఇచ్చేది i వారిద్దరి సంతోషం చూసి పొంగిపోయేది
                               పగటిపూట ఆహారం కోసం పక్షి బయటికి వెళ్ళినపుడు ,దాది వచ్చి రాజ పుత్రుణ్ణి ఆపక్షి పిల్లతో ఆడించేది .ఒక రోజు రాజకొడుకు ఆ పక్షి పిల్ల కంఠం పిసికి చంపేశాడు .రాజుకు ఈ సంగతి తెలిసి బాధ పడ్డాడు .పక్షికి ఏమి సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతునాడు .దాదిని నిందించాడు .పక్షి గర్భ శోకం మాంచటం తన వల్ల కాదని దుఃఖించాడు .సాయంత్రమయింది రోజు లానే రెండు పళ్ళు తెచ్చింది పక్షిని .చని పోయి వున్న తన పిల్లను చూసి హృదయ విదారకం గా ఏడ్చింది .సోమ్మసిల్లింది తేరుకొని తన పిల్ల ఆట పాట  గుర్తు చేసుకొని పొగిడింది విధిరాత అని భావించి దిగులు పడింది .కాసేపటికి తేరుకొని రాజును ”రాజా !నీవు క్షత్రియుడివి .నీపాలన లో జీవులను రక్షించే బాధ్యత నేది హాయిగా గూటిలో ఆదుకొనే నా పిల్లను దాది చేత బయటకు లాగించి,నీకొడుకుతో చంపించావు .క్రుతఘ్నుడివి .నీతో స్నేహం చేసినందుకు ,నీ అతిదినయినందుకు ,నాకు నా పిల్లకు గొప్ప బహుమానమే ఇచ్చావు .ప్రాణాలను రక్షించే వారే భక్షిస్తే ,లోకం లోశుఖం  ,శాంతి ఎలావస్తాయిస్తే ?కంచే చేను మేసినట్లింది .నీ కొడుకును నా   పిల్ల తో సమానం గా చూశాను .ఇంత ఘోరం లోకంలో వుండదు .నమ్మక ద్రోహం చేశావు .నీకు సనాతన ధర్మ తెలియదా ?చిర కాలమ్ తన ఇంట్లో వున్న వారిని రక్షించాలి .రక్షించక పొతే కుంభీపాక నరకం లో పడతారు అప్పుడు అతనికిచ్చే ఆహారాన్ని దేవతలు ,పితరులు ముట్టుకోనే ముట్టుకోరు ”అని శోకం తో వివేకం కోల్పోయి ,రాజుకొడుకు రెండు కళ్ళను తన ముక్కుతో పీకేసింది .రాజు కూడా జరిగిన దానికి తనకు తగిన శాస్తే జరిగిందని భావించాడు .దుఖం తగ్గిన తర్వాత పక్షి వచ్చి మళ్ళీ తనతో స్నేహం చేస్తే సంతోషిస్తానన్నాడు .అప్పుడు పక్షిని ”నేను పుత్ర శోకం తో వున్నాను .నువ్వు గుడ్డి వాడైనా నీ కొడుకు ను చూసి దుఃఖ పడుతున్నావు .నేనిక్కడ వుంటే నీకు ఏదో రోజు నామీద ఆగ్రహం కలిగి  నాకు అపకారం చేయచ్చు .చెడు మిత్రుని ,,నీచుడైన రాజునూ నమ్మ కూడదు వాళ్ళను వదిలి పెట్టేయాలి .నిన్ను ఇక నమ్మటం న్యాయం కాదు .”అని హితవు చెప్పి యెగిరి పోయింది ,
                                                                                                         గబ్బిట దుర్గా ప్రసాద్
                                                                                                       రచనా కాలం 31 -01 -11 .
Posted in రచనలు | Tagged | Leave a comment

ఆలోచనా లోచనం అతిధి సంరక్షణ

        ఆలోచనా లోచనం 

                                                            అతిధి సంరక్షణ 
                                   స్నేహం విలువైనది ఆపదలో ఆడుకొనే వాడు స్నేహితుడు .అతిద్హిని ఆదరించటం లోక రీతి .ఇంటికి వచ్చిన అతిధి స్నేహితుడైతే అతని సంరక్షణ లో తన వారు క్షేమమ్ గా ఉంటారని భావిస్తారు .దీనికి విరుద్ధం గా జరిగితే ఆ స్నేహమే పగ తీర్చుకొంటుందని చెప్పే ”పక్షిని ”కధ హరివంశం లో వుంది
                                   బ్రహ్మదత్తుడనే రాజు గృహం లోకి అనుకోక్కుండా ఒక పక్షిని ఆంటే ఆడ పక్షి వచ్చింది డాని ఆకారం వింతగావుంది రాజు కు అది నచ్చింది దాని రెక్కలు ,వీపు ,పొట్ట నల్లగాను తలమాత్రం యెర్ర గాను వుంది చలాకీ పిట్ట అది.. రాజుకు దానికి స్నేహం కలిసింది .రోజు ఉదయమే అది బయటికి యెగిరి పోయేది నదీ నదాలు పర్వతాలు ,సముద్రాలు చూసుకుంటూ ఆహారం సేకరిస్తూ లోకం లోని వింతలన్నీ గమనించి రాత్రికి రాజ గృహం చేరేది .ఒక వార్తాహరునిలా తాను చూసినవన్నీ రాజుకు వివరించి చెప్పేది ఆయన శ్రద్ధగా వినేవాడు .రాత్రిఅక్కడే   వుండేది .కొంత కాలానికి రాజుకు కొడుకు పుట్టాడు .పక్షికీ పిల్ల పుట్టి అచ్చంగా తల్లి పోలికలతో ఆకర్షణీయం గా వుండేది అది రాకుమారున్నీ ,తన పిల్లను సమాన ప్రేమతో చూసేది .రోజు ఇంటికి తిరిగి వచ్చేప్పుడు రెండు పళ్ళు తెచ్చి ఒకటి రాజుకోడుక్కి రెండోది తన పిల్లకు ఇస్తూండేది .
                                   పక్షి బయటకు వెళ్ళినప్పుడు దాది రాజ కుమారున్ని పక్షి పిల్లతో ఆడించేది .ఒక రోజు వాడు డాని పీక పిసికి చంపేశాడు .రాజుకు తెలిసి వుసూరుమన్నాడు .పక్షికి ఏమి సమాధానం చెప్పి వోదార్చాలో తెలియలేదు .దాదినీ కొడుకునీ తిట్టాడు .విపరీతం గా దుఃఖించాడు .ఇంతలో పక్షి మామూలుగా రెండు పండ్లతో వచ్చింది .చనిపోయిన తన పిల్లను చూసి తల బాదుకుంది డాని ముద్దులు ,మురిపాలు చిలిపి చేష్టలు గుర్తుకు తెచ్చుకొని విపరీతంగా దుఖించింది .చివరికి మనసు కుదుట పరచుకొని ”రాజా! నువ్వు క్షత్రియుడివి .నీ సంరక్షణ లో అంతా క్షేమం గా ఉంటారని నా పిల్లను ఇక్కడే వదిలి రోజూ,నేను హాయిగా బయటకు వెళ్లి వస్తున్నాను రక్షించే బాధ్యతనుంచి నువ్వు తప్పుకోన్నావు .హాయిగా గూట్లో ఆడుకొనే నాపిల్లను బయటకు తెప్పించి నీ కొడుకు తో చంపించావు .రక్షకులే భక్షకులైనట్లుంది .నీ కొడుకుని నా పిల్లతో సమానం గ ప్రేమించానే .నమ్మక ద్రోహం  చేశావు .నీకు సనాతన ధర్మం తెలుసా ?చిర కాలమ్ తన ఇంట్లో వున్న వారిని రక్షించాలి.లేక పొతే కుంభీ పాక నరకం లో పడిపోతారు .అప్పుడు ఇచ్చే ఆహారాన్ని దేవతలు .పితృదేవతలు ముట్టుకోనే ముట్టు కోరు .”అని శోకం తో వివేకం నశించి  ,రాజు కొడకు కళ్ళను తన ముక్కు తో పీకేసింది .రాజు తనకు తగిన శాస్తే జరిగిందని భావించాడు .పశ్చాత్తాపం తో కుమిలి పోయాడు .చివరగా పక్షితో డాని కోపం శోకం తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చి అక్కడే ఉండమని తమ స్నేహం మామూలుగా కోన సాగించాలని కోరాడు /.దానికి ఆ పక్షిని ”నేను పుత్రశోకం లో వున్నాను .నువ్వు గుడ్డి వాడైన నీ కొడుకుని చూసి బాధ పడుతున్నావు .నేనిక్కడ ఉండ కూడదు .నీ వల్ల అపకారం నాకు జరగ వచ్చు .చెడ్డ మిత్రుణ్ణి ,నీచుడైన రాజును విడిచి పెట్టాలనిపెద్దలంటారు .  నిన్ను ఇక నమ్మ టం న్యాయం కాదు ”అని చెప్పి ఎగిరి పోయింది పక్షిని .
Posted in రచనలు | Tagged | Leave a comment

ఆలోచనా లోచనం ధన తృష్ణ అనర్ధం

        ఆలోచనా లోచనం 
                                                              ధన తృష్ణ అనర్ధం 
                  కోరికలుండటం మానవ సహజం .అవి తీర్చుకోవటానికి అన్ని ప్రయత్నాలు చేస్తాము .దేనికైనా ధనం కావాలి ధనమూలమిదం జగత్ .అన్నారు .దాన్ని సక్రమ మార్గం లోనే సంపాదించాలి .అంతు లేని ధనాశ అనర్ధం అని చెప్పే ”మంకి ”అనే వాడి కధ మహా భారతం లో శాంతిపర్వం లో వుంది .
                        మంకి ఒక బ్రాహ్మణుడు .ధనాశ ఎక్కువ .భగవధ్యానం కంటే ధనం మీడే ధ్యాస .ధన సంపాదనకు వ్యవసాయం ఎన్నుకొన్నాడు .పొలం దున్ని విత్తు నాటి నీరు పెట్టి ఎరువు వేస్తేనే కదా మంచి ఫల సాయం వచ్చేది ?తాను కూడా బెట్టిన ధనం తో రెండు కోడె దూడలను కొన్నాడు .అవి అప్పటికింకా కాడికిన్డకు రాలేదు .ఆంటే వాటికి దున్నటం తెలీదు .ఆ విషయం ఇతనికే తెలీదు .నెమ్మది గా వాటికి దున్నటం అలవాటు చేయాలని భావించాడు .వాటి సత్తా ఏమిటో తెలుసుకోలేదు .ఒక రోజు ఆ రెండు కొడెల్ని బంతి కట్టి పొలానికి తోలుకు పోతున్నాడు .మధ్యలో అవి తమ కున్న యవ్వన మదం చేత ,వయసు చేత ,పొగరు చేత ఆ బ్రాహ్మణ యజ మానికి అంద కుండా పరుగు లంకిన్చుకోన్నై .వాటిని ఆపటానికి పట్టుకోవటానికి విశ్వ ప్రయత్నం చేశాడు .అతని వల్ల కాలేదు .అతనికీ కొత్తె ,వాటికీ కొత్తె .పరిగెత్తి ,పరిగెత్తి అవి దారి మధ్యలో పడుకొని వున్నాఒక పెద్ద ఒంటె మీద పడ్డాయి .ఆ పడటం తో ఒంటెకు రెండు వైపులా కోడె దూడలు ,మధ్య లో ఒంటె గా ఉనాయి .బంతి కట్టు తెగకుండా అట్లాగే వుంది పోయింది .ఒంటె బెదిరి పోయి ఒక్క సారిగా లేచి పరిగెత్తింది .బంతి కట్టు ఒంటె మూపురంకు  చిక్కుకు పోయింది గిత్తలు కాలు నేల మీద ఆనిన్హకుండా విపరీతం గా దౌడుతీస్తున్నాయి   .బంతి తాడు ఒంటె మూపురం మీద బిగించి వుండటం తో అదే ఆ గిట్టలకు ఉరితాడు   గా మారి వాటి ఊపిరితీసేసింది  తన్నుకొని ,తన్నుకొని అవి బ్రాహ్మణుడు నిసచేస్తుడై చూస్తుండగానే చచ్చిపోయాయి .ఒక్క సారిగాఅతనికికి జ్ఞానోదయం కలిగింది .విరక్తి పుట్టి,తన మీద తనకే అసహ్యం కల్గింది .తన ధన ఆశ వల్ల బంగారం లాంటి కోడె దూడలు మరణించాయని రోదించాడు .కామం మీద మమ కారం పోయింది కామాన్ని త్యజించి జితెన్ద్రియుడయాడు .
                              కామం ఆంటే తృష్ణ .అంతశ్శత్రువుల్లో కామామికి గొప్ప ప్రభావం వుంది తన్ను ఎవరు . చేరపలేరని కామానికి అహంకారం అని అశ్వ మేధ పర్వం లో ధర్మ రాజుకు శ్రీ కృష్ణుడు ఉపదేశిస్తాడు .కోరిక సంకల్పం వల్ల కలుగుతుంది దానికి కష్టం ,నష్టం తో పని లేదు .సాధ్యాసాధ్యాల జోలికి పోదు .కోరిక నేరవేరాలి అంతే .డాని వల్ల వచ్చే బాధలు దానికి పట్టవు .స్వర్గం లో వున్న వాడిని కోరిక అధః పాతాళానికి నేటేస్తుంది .ప్రశాంతం గా వున్న వాణ్ని అశాంతికి గురి చేస్తుంది .బంధాలలో పెద్ద బంధం కోరిక .కోరికనువిసర్జిస్తే  ఆత్మ అమ్రుతానందం పొందుతుంది .ధన విషయమైన కోరికమరీ  m పతనాన్ని తెస్తుందని ”మంకి ;;అనే బ్రాహ్మణుని కధవల్ల  మనకు అవగతమైన విషయం .మనకు అచ్చిరాని ,చేతకాని విషయాలలో చేతులు పెట్టి కాల్చుకోరాడు .ఏ పని చేసి డబ్బు సంపాదించాలన్న ,దాని ఆనుపానులు గురించి అన్నీ తెలుసు కోని మొదలు పెట్టాలి .లేడికి లేచిందే పరుగు అన్నట్లు ప్రవర్తిస్తే ఆ కోడె దూడల గతే అవుతుంది   మంకి  కి పట్టిన దుర్గతే పడ్తుంది
                                                                          గబ్బిట దుర్గా ప్రసాద్
                                                                            రచనా కాలమ్ –29 -01 -11 .
Posted in రచనలు | Tagged | Leave a comment

ఆలోచనా లోచనం అపాయం తప్పించే ఉపాయం

 ఆలోచనా లోచనం 
                                                                   అపాయం తప్పించే ఉపాయం 
కొన్ని సమయాలలో కొడుకు కఠోర ప్రతిజ్ఞలు చేస్తాడు .అవి వాడికి ఆనందం కలిగిస్తాయి .సంతృప్తినిస్తాయి .కాని వారిని నమ్ముకొని జీవించే వారికి ఇబ్బంది కలుగుతుంది .ప్రతిజ్న చేసే వారి మనసు మార్చటానికి శత విధాల ప్రయత్నిస్తారు .వాళ్ళు ఒప్పుకోరు .ఈ ఆపద గడవ బెట్టతానికి ఉపాయం ఆలోచిస్తారు .అది చక్కగా పని చేసి అందర్నీ ఒడ్డున పడేస్తుంది .సావిత్రి సత్యవంతుని ప్రాణాలను యముని నుంచి పొందటానికి ఒక్క మాటే పనిచేసింది .ఇలాగే కరంధముడు అనే రాజు తన కొడుకు అవీక్షిత్తు బ్రహ్మ చర్య వ్రతం చేస్తుంటే ఉపాయం తో ఆ దీక్షను విరమింప జేసి సంతాన వంతుని చేసిన కధ మార్కండేయ పురాణం లో వుంది వివరాలలోకి వెళ్దాం .
                           రంభుడు అనే రాజు కుమారుడు ఖనీ నేత్రుడు .ఇతని పెద్దకోదుకే కరందముడు .తండ్రి ప్రజావ్యతిరక పాలనను సహించ లేక అతన్ని రాజ్య భ్రస్తున్ని చేసి కరంధమునికి పట్టాభిషేకం చేశారు మంత్రులు .అతను చాలా జాగ్రత్తగా పాలిస్తున్నాడు .ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ,వారికి తన కున్న దంతా పంచి పెట్టి ధన హీనుడిగా బ్రతుకు తున్నాడు .అతిమంచి కూడా అనర్ధమే .ధనా గారం ఖాళీ అయింది .శత్రురాజు దండెత్తి ఓడించి ,రాజ్యం ఆక్రమించుకొన్నాడు .అరణ్యాలకు చేరిన కర్దముడు తీవ్ర తపస్సు చేసి ,దివ్య విభూతులు పొందాడు .తిరిగి రాజ్యం సంపాదించే కోరిక బలీయం అయింది .తన చేతిని మధించాడు .అందులోంచి గుర్రాలు ,ఏనుగులు సైన్యం పుట్టాయి .కరం ఆంటే చేయి దాన్ని మధించాడు కనుక కరంధముదని పేరు వచ్చింది .ధనవంతుడై సైన్యాన్ని సమకూర్చుకొని ,శత్రువును వోడించి రాజ్యం సంపాదించి మళ్ళీ రాజు అయాడు
                        కరంధముడు వీర అనే రాకుమారిని వివాహం చేసుకొన్నాడు .పుత్రుడు కల్గాడు .వాడి గ్రహయోగం ఎలావుందో జ్యోతిష్యుల చాత చూపించాడు .గ్రహ వీక్షణ చేయ బట్టి అవీక్షితుడు అని పేరు పెట్టాడు .విద్య లన్ని నేర్చాడు .వివాహ వయసు వచ్చింది .విశాల దేశ రాజు తన కుమార్తె స్వయం వరం ప్రకటించాడు .తాను అసహాయ శూరుడను అనే గర్వం తో ఒంటరిగా స్వయం వరానికి వెళ్ళాడు .అక్కడ రాజకుమారులంతా ఏకమై ఇతన్ని బంధించారు .తండ్రి కరంధముడికి విషయం తెలిసి సైన్యం తో వెళ్లి వారందరినీ ఎదుర్కొని కొడుకు అవీక్షితున్ని చెర నుండి విడిపించాడు .అవీక్షితుని అవమానం కల్గి ఇంక పెళ్లి చేసు కొనని భీషణ ప్రతిజ్న చేశాడు .బ్రహ్మ చర్య దీక్ష కొనసాగించాడు .రాజ దంపతులకు బాధ గా వుంది .రాజ్యానికి వారసులు లేరు .అప్పుడు రాజుకు ఒక ఉపాయం తట్టింది
                      రాజు భార్య చేత ”కిమిచ్చక ”వ్రతం చేయించి కొడుక్కి కబురు చేశాడు అతను వచ్చి దగ్గరుండి అన్నీ స్వయంగా పర్యవేక్షించాడు .కోరికలు తీర్చే వ్రతం అది .తల్లి వ్రతం చేసే రోజుల్లో ఎవరు ఏమి కోరినా తీరుస్తానని శపథం చేశాడు .తండ్రి కొడుకుతో ”నాయనా !గొప్ప వాగ్దానం చేసి నందుకు సంతోషం .మాకు ఇంకేమి కావాలి ?మాకు మనవడిని ఇవ్వు .అంతకంటే మాకేమి కోరికా లేదు ”అన్నాడు రాజు …వాగ్దాన భంగం పాపం కనుక వెంటనే ఒప్పెసుకొన్నాడు .తండ్రికిచ్చిన మాట కోసం విశాల దేశపు రాకుమారిని ,వివాహం చేసు కొని,బ్రహ్మ చర్యం వదిలి దాంపత్య జీవితమ్ సాగించి వంశాంకురం గా రాజ్యానికి వారసునిగా మరుత్తు అనే కుమారుని కన్నాడు .మాటల్లో చక్కగా అవతలి వారిని మురిపించి కార్య సాధన చేయ వచ్చునని కరంధముని కధ మనకు తెలుపు తోంది .
                                                                            రచన ———-గబ్బిట దుర్గా ప్రసాద్ —-రచనా కాలమ్ —31 -౦౧-11
Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఆహ్వానం — 27 వ సమావేశం

ఆహ్వానం —

                                         సరస భారతి —సాహిత్య సాంస్కృతిక సంస్థ – ఉయ్యూరు 
  27  వ సమావేశం 
                                                                 కార్య క్రమం
                                                                ————–
తేది ,సమయం ———————-28 -06 -2011 –మంగళ వారం —-సాయంత్రం –గం –6 -30   కు
-వేదిక ——————————-శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం  –మహిత మందిరం –

విషయం —————————-”ఆధునిక భరత ముని –నటరాజ రామ కృష్ణ ”
సభాధ్యక్షులు ———————-శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి —-సరస భారతి ,గౌరవాధ్యక్షులు (ప్రిన్సిపాల్ –ఫ్లోరా హై స్కూల్ -ఉయ్యూరు )
వక్త —————————-–శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –—తెలుగు పండిట్,- –కార్య దర్శి –సరసభారతి 
                                   సంగీత,సాహిత్య నాట్యాభిమానులందరికి  సహృదయ స్వాగతం .పాల్గొని జయ ప్రదం చేయ ప్ప్రార్ధన
గౌరవాధ్యక్షులు                               కార్యదర్శి                                        కోశాధికారి                                                       అధ్యక్షులు
జోశ్యుల శ్యామలా దేవి  ,                   మాదిరాజు శివ లక్ష్మి                       గబ్బిట  వెంకట రమణ                                         గబ్బిట దుర్గా ప్రసాద్
                                                                                                                                                                          సరస భారతి –ఉయ్యూరు .
Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

మరిన్ని నటరాజు జ్ఞాపకాలు

          మరిన్ని నటరాజు జ్ఞాపకాలు 
          స్వర్గీయ నటరాజ రామ కృష్ణను మొన్న నేను ”నవీన భరత ముని ”అని రాశాను .ఆ మాటను ప్రఖ్యాత రచయిత ,పరిశోధకులు శ్రీ వకుళాభరణం రామ కృష్ణ గారు కూడా తమ వ్యాసం లో పేర్కొన్నారు . అందు లోని మరి కొన్ని విశేషాలు వివరిస్తాను .కృష్ణా జిల్లా దివి తాలూకా లో జన్మించి ,కాకతీయ సామ్రాజ్య ములో సేనా నాయకత్వం వహించిన జాయప సేనాని రచించిన ”నృత్త రత్నావళి ”ని అధ్యయనం చేసి రామప్ప గుడి లోని శిల్ప రీతులను పరిశీలించి ,”పేరిణి ”నృత్యాన్ని అందించిన మరో భరత ముని రామ కృష్ణ అప్పటికే అనేక నృత్య రీతుల్ని అధ్యయనం చేసిన అనుభవం సంపాదించారు .దేవదాసీల నృత్యం అంతరిస్తున్న సమయం లో ,తన సర్వస్వాన్ని ,ఆనృత్యాన్ని కాపాడ టానికి వినియోగించి ,సంఘం విధించినా ఆంక్షలను ఎదిరించి కాళహస్తి రాజమ్మ ను తన గురువు గా స్వీకరించారు .నవజనార్దన పారిజాతం అభినయించే ప్రసిద్ధ కళాకారిణి పెండేల సత్య భామను ,బొబ్బిలి జీవ రత్నమ్మ ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు గానంచేసి   అభినయించే సరిదే మాణిక్యమ్మ ,మొదలయిన వారి వద్ద నెలల తరబడి విద్య నేర్చి ”ఆంద్ర నాట్యాన్ని ”పునరుద్ధరించారు నటరాజు .పైన పేర్కొన్న వారందరికీ ఆంద్ర దేశం రుణ పడి వుంది .ఈ నాట్యానికి ఒక రూపం కల్పించి ,పాఠ్య ప్రణాలికను తయారు చేసి ,నృత్య కళాశాలలో పాత్యాంశం గా ప్రవేశ పెట్టించే వరకు విశ్రాంతి తీసుకో లేదు .నాట్యాన్ని అన్ని కులాల వారు నేర్చుకో వచ్చని ప్రకటించి అందరికి నేర్పారు .భారత నాట్యం ,కదక్ ,మణిపురి నాట్యాలు ఆయనకు అప్పటికే కరతలామలకాలు .కూచి పూడి సంప్రదాయంలో  దిట్ట అయిన వేదాంతం లక్ష్మి నారాయణ గారి శిష్యరికం చేసి అదీ అభ్యశించిన నిత్య విద్యార్ధి నట రాజు .దానిలో తన ముద్రను ప్రవేశ పెట్టి వన్నె తెచ్చారు .దీనితో ఒక నూతన అభినయ ప్రక్రియ ను రామ కృష్ణ ఏర్పరచి నట్లయింది .కూచిపూడి నాట్య కళకు జాతీయ హోదా సాధించటానికి ,శాస్త్రీయ కళగా గుర్తింపు పొందటానికి 1959 లో హైదరాబాద్ లో ఒక జాతీయ సదస్సును తన ఆధ్వర్యం లో నిర్వహించారు .ఆ సభల్లో ప్రఖ్యాత కళాకారిణులు మారం పల్లి వైదేహి ,ఇందువదన లచేత రెండు గంటల పాటు అభినయం చేయించారు .తెలుగు వారి లాస్య నర్త నానికి అందరు ఆశ్చర్య పోయారట .
                         హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయానికి నృత్య విభాగానికి పెద్ద గా ఉండమని vice chancellor ఆచార్య భద్రి రాజు కృష్ణ మూర్తి కోరగా అంగీకరించి పనిచేశారు .విశ్వ విద్యాలయంలో post graduate స్త్హాయిలో నృత్యాన్ని అధ్యయన అంశం గాచ్ర్చటం   ఇదే మొదలు .ఆరుద్ర ,,ఆచార్య పోణంగి శ్రీరామ అప్పారావు గార్లతో చర్చించి  నాట్య కళ నేర్చుకోవటానికి కావలసిన వాటిని పాఠ్య ప్రణాళిక లో చేర్చారు .సమాజానికి ,కళకు వున్న సంబంధాన్ని సోదాహరణం గా వివరిస్తూ ,కళలన్నీ సమాజం నుండే వస్తాయని అవి ప్రజల వుమ్మడి కృషి అని వివరిస్తూ విద్యార్ధులలో ఆసక్తి కల్పించి నేర్పించే వారు .కలపి సామాజిక స్పృహ కల్గించారు .భారతేయ నృత్య రేతులతో పాటు ,ప్రపంచ వ్యాప్తం గా వున్న నాట్య సంప్రదాయాలను మిళితం చేసి నాట్య విద్యకు ఒక సమగ్ర ఆకృతిని కల్పించిన నాట్య విరించి ,నటరాజు .అనేక నాట్య రీతుల మూలాలలోకి వెళ్లి పరిశోధించిశాశ్త్రీయ  , దృక్పధాన్ని జోడించి ,డాక్టరేట్ పట్టాల కోసం పరిశోధనలకు ప్రోత్చాహించిన విశాల హృదయుడు .నాట్య వ్యాప్తికోసం అభినయ సదస్సులు నిర్వహించారు .కళాకారులకు ఆర్ధికం గా సాయం అందించారు .దొమ్మరి ఆట ,వీధి నాటకం ,తోలు బొమ్మ లాట ,తూర్పు భాగవతమ్ ,చిందు భాగవతం ,వంటిగ్రామీణ   కలలనుకూడా పరిశోధించి వాటి వ్యాప్తికి సహాయ పడ్డారు .ముస్లిం ,క్రైస్తవ ,బంజారా గిరిజన దళిత విద్యార్ధులకు కులమత భేదం లేకుండా నాట్యం నేర్పి న మనీషి ఒక దళిత యువతికి నాట్యం నేర్పి విదేశాలకు కూడా పంపిన నిజ మైన కర్మ యోగి నాట్య యోగి .. నాట్యాచార్యుడు ,,. ,నాట్య శాస్త్ర వ్యాఖ్యాత ఒకరే గా వుండటం అరుదైన విషయం .ఈ రెండింటి సమగ్ర స్వరూపమే మన నట రాజు .ఆంద్ర దేశం లోని కూచిపూడి వారి బాణీ ,కాకర పర్రు వారి బాణీ ,మైనం పాటి వారి బాణీ ఈ మూడు బాణీలాను అర్ధం చేసు కోన్నా” త్రిబాణీ త్రివేణీ సంగమం నటరాజ రామ కృష్ణ” .ఆయన వార సత్వ సంపద అనంతం గా కోన సాగాలాన్నదే అందరి వాంచితం    .
                                                                         ఆధారం –”-అభినవ భరతుడు ”   –రచన   — వకుళాభరణం లలిత ,రామ కృష్ణ
                                                                                  సేకరణ ,కూర్పు ——-గబ్బిట దుర్గా ప్రసాద్ ——–13 -06 -11

 

Posted in సేకరణలు | Leave a comment

జై బోలో బాపు మహారాజ కీ – దీక్షో రక్షిత రక్షితః

నేను చదివిన ఆర్టికల్ మీకోసం

Posted in సేకరణలు | Leave a comment

మూడు ముత్యాలు

నమస్తే శ్యాం గారు

                                మీరు పంపిన పుస్తకాలు మూడు చదివాను .ఒమర్ ఖాయం కవితల్ని సంస్కృతం లో శ్లోకాలుగా రాసిన హరికధా పితామహుడు ,అచ్చ తెలుగు కవి ,మహా పండితుడు స్వర్గీయ ఆది భట్ల నారాయణ దాసు గారి కి ఆంద్ర జాతి రుణ పడి వుంది వారు రాసిన ఉపోద్గాతంలో  చాల విలువైన విశేషాలు చర్చించారు .”సుర ”ను దైవ భక్తీ గా ”  సాకీ  ని శ్రద్ధ గా పేర్కొనటం తో ఖయ్యాం మీద గొప్ప గౌరవం కలుగు తుంది .మితాహారం ,అరణ్య వాసం ,శివ శక్తి నామ సంకీర్తనం ను దాసు గారు ఆ కవితల్లో దర్శించటం బాగుంది వున్నత జీవిత సత్యాలవి .ఉమర్ పెద్ద జ్యోతిష్యుడని ,ప్రారంభం లో సూర్య దేవ స్తుతి చేయటం దీనికి నిదర్శనం అనటం భావ్యం గా వుంది .ఆయనలో గణిత శాస్త్ర వేత్తను చూపారు .ప్రాచీన పార శీకమే ప్రాకృత భాషా విశేషం గా గుర్తించటం విశేషం .ఒక గొప్ప ఆరాధనా భావం తో దేవ భాష లోకి దాసు గారు ఖయ్యాం ను ప్రవేశ పెట్టటం సాహసం తో చేసిన పనే .ఆనాటి సాహితీ వేత్తలపై విరుపులు ,మరకలు ఆదిభట్ల వారు విసిరారు .చాలా ఉదాత్తం గానే వారి రచన సాగింది అయితే నాకు ఏమనిపించిందంటే  ఒమర్ చాలా లలితమైన భాషను ఉపయోగిస్తే దాసు గారు కొంత క్లిష్టమైన ,భారమైన పదాలనుపయోగిన్చారనిపించింది ఆయన పాండిత్య ప్రతిభకు అదొక నిదర్శనం కావచ్చు .లాలిత్యం లేక పోవటం కొంత ఇబ్బంది అని పించింది ఆ ఇబ్బందిని స్వర్గీయ యామిజాల పద్మ నాభ స్వామి తన అనుభవాన్ని రంగ రించి చాలా తేలిక మాటలతో ,లలిత సుందరం గా అనువాదం చేసి ఖయ్యాం ను తెలుగు వాడిని చేసి సఫలీ క్రుతులైనారు .హట్స్ ఆఫ్ to svaami  మంచి పుస్తకము,అరుదైనది అందజేసి నందుకు అభినందనలు
                             రెండోది రావు బాల సరస్వతి గారి అభినందన సంచిక .అరుదైన ఫోటో లతో ,ఆంద్ర ,ఆంగ్ల భాషల్లో వ్యాసాలు ,ఆకర్షణీయ మైన ముద్రణా మనసుకు హత్తు కోనేట్లుంది .ఆ సంగీత సరస్వతికి అపు రూప కానుకే ఇది .thanks .ఇందులో సరస్వతి భర్త గారి ఫోటో లో ఆయన కళ్ళుచూస్తె   ఆనాటి వేమూరి గగ్గయ్య గారి కళ్ళు కన పడి భయమేసింది .పాపం ఆమె యెంత భయ పడ్డారో అని పించింది .ఈ సంచిక రావటానికి భ.రా.గో .గారు యెంత శ్రమ పడ్డారో తెలుస్తుంది .ఇలాటివి తెసుకు రావటం లో ఆయనకు ఆయనే సాటి .మరనిచే వరకు ఆయన ఫోన్ లో మాట్లాడే వారు .ఆయనంటే నాకు అభిమానం ,మాత్రమే కాదు ,ఆరాధన కూడా .ఆయన జీవిత చరిత్ర ”ఆరామ  గోపాలం’ చదివి స్పందించి రాస్తే ,దాన్ని ఫోటో స్టేట్ తీయించి బంధువు లందరికి పంపించి నట్లు ఫోన్ చేసి చెప్పిన సహృదయుడు గోపాలం గారు .ప్రత్యెక అభినందన సంచికలు తేవటం లో ఆయన నిబద్ధత ,కృషి పై ఎవరైనా చక్కని విశ్లేషణ చేయ తగిన సమాచారం వుందని పిస్తుంది .
          పతంజలి గారి మూడు నవలలు .సామాన్య జన జీవితం లో వున్న భయాలు ,పీడన ,వేదన లను హాష్యం తో మేళవించి రాయ గల సామర్ధ్యం పతన్జలిది .సీరియల్ గా వచ్చిన వాటిని చదివాను .ఇంకొంచెం శ్రద్ధ గా వీటిని చద వాలి ఇదేమిటి ఇలా వుంది ,అనిపిస్తూనే ముందుకు నడిపిస్తాడు .వ్యంగ్యం అంగాంగం లో వుంటుంది .ఆలోచన రేకెత్తిస్తుంది .ఇదీ అందరినీ అలరించేది .
                     పాథకుల అభిప్రాయాలకు అనుగుణ మైన అపురూప విషయాలను అందిస్తున్నందుకు మరో మారు అభినందనలు .
                                                                                         మీ– గబ్బిట  దుర్గా ప్రసాద్ —12 -06 -11
                        

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | Leave a comment

కొడవటి గంటి చెప్పిన కధ కాని కధలు

      కొడవటి గంటి  చెప్పిన కధ కాని కధలు 
      ——————————————-
తెలుగు సాహిత్యం లో కొడవటి గంటి కుటుంబరావు కు ప్రత్యెక స్థానం వుంది .కధ ,నవల,వ్యాసం ,గల్పిక విమర్శ ,విశ్లేషణ ,సినిమా ,రాజకీయ సంగీతా లపై సాధికారత ,ఆయనది .చాలా మామూలు భాషలో అలంకారాలు లేకుండా నిసర్గాన్ గా రాయటం ఆయన ప్రత్యేకత .అలా చదువుకుంటూ పోతూనే వుంటాం .క్లిష్టత ,డొంక తిరు గుళ్ళు వుండవు .పాఠకుడి మనసులోకి సూటిగా హత్తుకు పోయేట్లు రాయటం ఆయన శైలి .దేనిమీద రాసినా ఇదే విధానం .చదివించే మహత్తర శక్తి వుంది .అభ్యుదయ భావాల గని .మానవుడి బలం ,బలహీనతలు తెలిసిన వాడు .ప్రపంచ సాహిత్యం పూర్తిగా అధ్యనంచేశాడు  .సైంటిఫిక్ గా ఆలోచించే తత్త్వం వున్న వాడు .ఆయన రాసిన వన్నీ రాసి పోయాల్సినంత వుంది .సమగ్ర సాహిత్యం లభ్యమవుతోంది చదివి తెలుసు కావలసినవి ఎన్నో వున్నాయి రుచి కోసం కొన్ని మీకు అందిస్తున్నాను
                          ఎనిమిది వందల ఏళ్ళ క్రితం హేమ చంద్రుడు అనే జైన ఆచార్యుడు ;”సవిరావాలీ చరితం ”అనే పుస్తకం రాశాడు అందులో కధలపై వ్యాఖ్యానం లాంటి ”గల్పిక ”రాశాడు .
రమణీయం అనే దేశానికి రాజుకు కధలంటే మోజు .పౌరుల్లో రోజు ఒకరిని పిలిపించి కధ చెప్పించుకొనే వాడట .ఒక రోజు ఒక చదువు రాని పూజారి వంతు వచ్చింది .ఆయన కుమార్తె నాగశ్రీ .తండ్రికి బదులు కధ చెప్ప టానికి వెళ్ళింది .కధ చెప్పటం ప్రారంభించింది నా పేరు నాగ శ్రీ .నా తండ్రి నాగ శర్మ .తల్లి సోమశ్రీ .నా తలిదండ్రులు నన్ను ”చట్టుడు ”అనే వాడికి ప్రధానం చేసి పెళ్లి నిశ్చయించారు .ఒక రోజు వాళ్ళిద్దరూ వూరెళ్ళారు .చట్టుడు వచ్చాడు .మర్యాదలు చేశాను .నా మంచం అతనికిచ్చి ,నేను కింద పడుకున్నాను .అర్ధ రాత్రి దాకా వుండి ,నిద్ర పట్టక ,ఆ మంచం దగ్గరకు వెళ్ళా .అతను మేలుకొనే వున్నాడు .ఉద్రేకం తో ఊగి ,నిగ్రహించుకోలేక ప్రాణం వదిలాడు .నేనే చంపానని అంతా అనుకుంటారని భయ పడ్డా .శిక్ష తప్పదు అనిపించింది .అతని శరీరాన్ని ముక్కలు,ముక్కలు చేసి రహశ్యం గా పాతి పెట్టా .అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డా .ఇంతలో మా వాళ్ళు వూరినుంచి తిరిగి వచ్చారు .”ఇంతవరకు కధ విన రాజు ”ఇది నిజమా ?అని అడిగాడు  ”మీరు రోజూ వినే కధలు ఎంత నిజమో యిదీ అంతే నిజం ”అని చెప్పింది నాగ శ్రీ .ఆమె గడుసు తనానికి రాజు అబ్బుర పడ్డాడు .దీన్ని బట్టి తెలిసేదేమి టంటే వాస్తవికత వుంటే వినే వాడిలో ఎంత చైతన్యం వస్తుందో తెలియ జేస్తుంది అని ముగిస్తాడు కో.కు .
        దక్షిణాంధ్ర            రాజు రఘు నాద నాయకుడు గొప్ప prodigy  పారిజాతాపహరణం అనే ప్రబంధాన్ని ఒక్క రాత్రిలో  ఆశువు గా చెప్పి తన తండ్రి చేతనే నిండు సభలో కనకాభి షేకం చేయించుకొన్న విద్వత్ కవి .
             నవలను నిర్మించటం లో” విశ్వ నాద ”కు వున్న శ్రద్ధ చాలామంది నవలా కారుల్లో లేదు .అన్నారు కుటుంబరావు
        ర్రావిశాస్త్రి” master of monologue ” అంటారు కుటుంబరావు
”దేశమును ప్రేమించు మన్నా ”అన్న గురజాడ గీతానికి విశ్వ సాహిత్యం లో స్థానం వుందని రావు అభిప్రాయం .’
”వీరేశలింగం కర్మిష్టి .జాతి చెవులు పిండి .బుద్ధి చెప్పి ,కోప్పడి ,అడుగడుగునా విమర్శిస్తూ ,మంచి మార్గం చూపిస్తూ ఒక  పెద్ద దిక్కై కాపాడాడు .గారాబం ,మెప్పు ,లాలన చూపి ,తెలుగు జాతిని ”పాడు ”చెయ్య లేదు .మౌధ్యం ,మరుకు తనం ,వున్న తెలుగు జాతి ,వీరేశ లింగం పెంపకానికి లొంగి వచ్చింది .మరొకరి వల్ల ఇది సాధ్యమయ్యేది  కాదు .తన ద్వారా జాతి పైకి రావటమే ”లింగం”గారి ఆత్మ విశ్వాసం ,కీర్తనం .సంఘం కార్యం నేట్టికేసు కొన్న వాడేవాడు సాహిత్యం జోలికి పోడు .దీనికి వ్యతిరేకం గా వీరేశలింగం పని చేసి చూపించాడు .”veereshlingam ”రాక్షసుడు అన్నాడు కృష్ణ శాస్త్రి .అంచనాలకు అందనిది రాక్షస బలమే .అందుకే ఆయన శత్రువుల్ని హడల కొట్టాడు .సర్వతోముఖాభి వృద్ధి కోరే వాడెవడైనా ఇలానే చేస్తాడు .అయితే వీరేశలింగం పుట్టి 160  ఏళ్ళు దాటినా ఆయన రచనల అవసరామ్  ఏమాత్రం తీరలేదు .దేశాభ్య్దయం కోరే ఏ రాజ కీయ పక్షమైనా ఆయన్ను ,ఆయన భావాల్ని  విస్మరించ రాదు ”అని చాల గొప్పగా estimate వేశాడు కుటుంబరావు .
”మిమ్మల్ని ఆంద్ర చెకోవ్ ”అంటారు మీ కామెంట్  ?అని ఒక విలేకరి కుటుంబరావు ను అడిగితే నిర్మోహ మాటం గా ,నిజాయితీ గా ”విశ్వ సాహిత్యం లో చెకోవ్ ఒక్కడే వున్నాడు ”అని బదులిచ్చాడు .
”శ్రీ కి ఏ మాత్రం తీసి పోని అంత కంటే ఎక్కువ గానే కృషి చేసిన మీకు వామ పక్షాలు శ్రీ శ్రీ కిచ్చినంత ప్రచారం ఇవ్వలేడెం ?”అని అడిగాడు ఒక విలేకరి ”దానికి  స్పందనగా ”శ్రీ శ్రీ కి populaarity  వుంది దాన్ని వాళ్ళు వాడుకొన్నారు .నాకు లేదు .వాడుకో లేదు ”అని తక్కున చెప్పాడు .
  మాధవ పెద్ది గోఖలే ను మా,.గోఖలే అంటారు .మంచి కధకుడు దళితుల జీవితాన్ని కధల్లో వారి భాషలో అద్భుతం గా చిత్రించిన బ్రాహ్మణుడు .ఆ కధలు చదివి ఒక royist  మిత్రుడు ”యెంత అన్యాయం జరిగిందండీ .నేను రాయాల్సిన కధలు మీ బ్రాహ్మణ అబ్బాయి రాసేశాడు ”అని నెత్తీ ,నోరు కొట్టుకోన్నాదట .అంత గొప్పగా గోఖలేకధలుంటాయి  అని కుటుంబరావు కితాబు .
సోమర్సెట్ maaughum   చివరి రోజుల్లోతన  కధా సంపుటిని చదివి ఆయనే ”ఈ కధలు రాయ కుండా వుంటే బాగుండేది ”అని ఆత్మ విమర్శ గా చెప్పాడట .మంచి రచయిత లక్షణం.
”తెలుగు వాడి జాతీయ గుణం -ఓర్వలేని తనం –జాతీయ కార్య క్రమం –కోడిగుడ్డు మీద వెంట్రుకలు లెక్కించటం ”అన్నాట్ట శ్రీ శ్రీ అని మనకు చెప్పాడు కో.కు .
”విశ్వ నాద తన రామాయణాన్ని చదివి వినిపిస్తుంటే ఆ పథనాన్ని ప్రేక్షకులు యే విధం గా స్వీకరించినదీ ,నేను సయం గా చూశాను .అలాగే శ్రీ శ్రీ ,కృష్ణ శాస్త్రి ,ఏ వ్యాఖ్యానం లేకుండా పద్యాలు చదువుతుంటే శ్రోతలు వింటూ ఎలా కంగారు పడ్డది నేను స్వయం గా చూశాను ”అని కుటుంబరావు వారి వారి ధోరణుల ప్రభావంపై చక్క గా స్పందించారు
                                                                                  మీ  గబ్బిట దుర్గా ప్రసాద్ ——11 -06 -11 –
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | 1 Comment

‘మాదీ స్వతంత్ర దేశం–మాదే స్వతంత్ర జాతీ శ్రీ బాలాంత్రపు రజనీ కాంతా రావు గారి గీత ప్రతిభ

   శ్రీ బాలాంత్రపు రజనీ కాంతా రావు గారి గీత ప్రతిభ 
                                లలిత సంగీతం ఆంటే తెలుగు లో ముందు గుర్తొచ్చే వారు బాలాంత్రపు రజనీ కాంత రావు గారు .గీత రచయిత ,సంగీత కర్తగా ప్రయోక్తగా radio డైరెక్టర్ గాసినీ   నేపధ్య గాయకునిగా వాగ్గేయ కారునిగా బహుముఖ ప్రతిభ వారిది .భానుమతి తో ఆయన పాడిన పాటలు మనసులను ఉయ్యాల లూగించాయి .ఆంద్ర వాగ్గేయ  కార చరిత్ర రాసి న ఘనుడాయన ఎన్నో మధుర గీతాలను పాడి రసమయం చేశారు .ఎన్నిటికో బాణీల  వోణీలు కట్టారు .రామాయణ ఆవిర్భావాన్ని మహోన్నతం గా radio లో ప్రదర్శించి ఆకాశ వాణి విజయ వాడ కేంద్రానికి బహుమతిని సంపాదించారు .ప్రయోగా లెన్నో చేసి ప్రయోక్త గా గణన పొందారు .స్వయం గ కవి అయిన ఆయన కలం లోంచి జాలు వారిన కొన్ని పాటలను మీకు పరిచయం చేస్తాను .ఈ తరం  వారికి చాలా మందికి అవి తెలియవు ..”చల్లగాలిలో ”అని వినపడంగానే అది రజని పాట అని చెవులు రిక్కించి వినే వాళ్ళం .”స్వైరిణి అన్నారు నన్ను శ్యామ సుందరా ”అని వింపిస్తే చాలు పరవశమే .”మాదీ స్వతంత్ర దేశం ,మాదీ స్వతంత్ర జాతి ”వినిపిస్తే దేశ భక్తి వుప్పొంగేది అదీ ఆయన రచన స్వర ,రాగ  ప్రతిభ .ఆది వారం నాడు  ”శ్రీ సూర్య నారాయణా వెద పారాయనా ”అన్నది వింటే మనసు గగన తలం లో భక్తి తో విహరిన్చాల్సిందే .”ఓహో పావురమా ఒహోహో పావురమా ”అని భానుమతి పాడే పాటకురాగపు పయ్యెద   వేసింది రజనీయే ..ఇప్పుడు రజని పాటలను అనుభవించండి .
  01 –                  చల్ల గాలిలో యమునా తటి పై శ్యామసుందరునీ   మురళి —–ఉల్లము కొల్ల గోనే మధు గీతాలు –మెల్ల మెల్ల  చెవి సోకు నవే –తూలి రాలు వటపత్రమ్ముల పయి  -తేలి తేలి పడు నడుగులవే —పూల తీవ పొదరిండ్ల మాటుగా —పొంచి చూచు శిఖిపించమదే –తరువు తరువు కడ డాగి డాగిన –న్నర  యు కన్నుగవ మురుపులవే —మురిసి మురిసి నావెనుక దరసి– కను మూయు చివురు కేంగేలులివే —
02 -”స్వైరిణి అన్నారు నన్ను శ్యామ సుందరా =–నీరవ  నిశి వెన్నెలలో –నీదు మధు మురళీ రవము —ద్వారములను తెరచి ప్రతి హృదయము పిలుచు –నిలువ నీదే –
        స్నాన సమయమున యమునా సరిత్తటిని  సఖీ జనులు
        నిన్ను జూచి మైమరచిన నన్ను జూచి నవ్వి నారు —-స్వైరిణి అన్నారు —
        బంధువులను ,పతిని ,సకల బంధములను ,వదలి వైచి
        బృందావని నీదు రాగ బంధ మొదవ తరలితి   నని –స్వైరిణి అన్నారు –
03 -”మాదీ స్వతంత్ర దేశం–మాదే స్వతంత్ర జాతీ
        భరత దేశమే మాదేశం–భారతీయులం మా ప్రజలం
        ఆలయంముల శిల్ప విలాసం –ఆరామంముల కళా ప్రకాశం
        మొఘల్ సమాధుల రస దరహాసం –మాకు నిత్యనూతనేతి హాసం
        అహింసా పరమోధర్మః –సత్యం వద ధర్మం చర
        ఆది ఋషుల వెద వాక్కులు –మా గాంధి ,గౌతమ సువాక్కులు
        స్వతంత్ర భ్రాత్రుత్వాలూ –సమతా మా సదాశాయాలు
        జననీ — స్వతంత్ర దేవీ —
        కొనుమా -నివాళులు మావి         మాదీ స్వతంత్ర దేశం-
                                                                                               సేకరణ —–గబ్బిట దుర్గా ప్రసాద్ –11 -06 -11

 

Posted in సేకరణలు | Leave a comment

కృష్ణా జిల్లా రచయతల సంఘం – ఆహ్వానం నా రచన రేపటి తెలుగు ప్రజలు

ప్రస్తుతం అది వ్రాసే పని లో ఉన్నాను…….

Posted in సభలు సమావేశాలు | Leave a comment

పద్య మంద హాసం

పద్య మంద హాసం

————————–

తెలుగు పద్యాలు కొన్ని విన్నవి గానే వుంటాయి .కాని అందులోని భావం తెలుసు కోవాలంటే బుర్ర బద్దలు కొట్టు కోవాల్సిందే. అలాంటి తెలుగు పద్యాలు ,అందు లో నిక్షిప్త మైన భావ ధారను తెలుసు కోని తెలుగు పద్య వైభవానికి జే జే లు పలుకుదాం శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానం లో అష్ట దిగ్గజ మహా కవులున్నారని మనకు తెలుసు .స్వయం గా రాయలే మహా కవి .ఎప్పుడు ఇతర దేశ కవులు రావటం ,తమ పాండిత్య ప్రకర్ష చూపి బహుమతులందు కోవటం పరి పాటే .రోజు కవితా గోష్టి ,రాయల భుజ శౌర్య దాన ధర్మాల మీదా కవితా పాండిత్యం మీద కవులు ప్రశంసల వర్షం కురిపిస్తూనే వుంటారు .కొన్ని సామాన్యులకు అర్ధమవుతాయి కొన్ని ఆ కవే విప్పి అర్ధం చెబితే కాని తెలియని సందర్భాలు వుంటాయి ఒక రోజు అల్లా సాని పెద్దన గారు రాయలను కీర్తిస్తూ చెప్పిన పద్యాన్ని తెనాలి రామ లింగ వికట కవి స౦దర్భ శుద్ధి గా లేదు అన్నాడు .పెద్దన నొచ్చు కున్నాడు .రాయలకు ఆంతర్యం తెలుసు కనుక నువ్వో పద్యం చెప్పు అన్నారు. మంచి సమయం .తన ప్రతిభ బయట పడేఆలోచించి సందర్భం .తన ఊహకు పదును .అని చిన్న పద్యమే పెద్ద భావం ఇమిడే లా చెప్పాడు .ఆ పద్యం అందరికి తెలిసిందే .వినటానికి సరదా గా వుంటుంది .అయితె బావం అంత తేలిగ్గా అందదు తనే ఆ భావావిష్కరణ చేసి అందర్నీ ,ఆశ్చర్య పడేట్లు చేశాడు . ”నర సింహ కృష్ణ రాయని –కరమరుదగు కీర్తి యొప్పె –కరిభిద్గరిభిత్కారి కరి కరిభిద్ –త్కరి భిద్గిరి భిత్తురంగ కమనీయంబై ..” రాయల కేర్తి కరిభిత్ –గజాసురున్ని సంహరించిన శివునిలా ,గిరిభిత్కరి –ఇంద్రుని ఐరావతం లా ,కరిభిద్గిరి –కైలాస పర్వతం లా ,గిరిభిత్ –వజ్రాయుధం లా ,కరిభిద్గిరిభిత్తురంగ –శివుని ఇంద్రుని వాహనాలైన నంది ,వుచ్చైశ్వరం లా అండం గా అతి స్వచ్చంగా అతి తెల్లగా వుందని అర్ధం .ఆయన కీర్తి అంత స్వచ్చం గా వుందని భావం . రెండో పద్యం శ్రీ హను మంతుని గురించిన ది ఎవరు రాశారో తెలీదు కాని చమత్కారం గా వుంది నర్మ గర్భం గా వుండటం దీని ప్రత్యేకత ”అంచిత చతుర్ధ జాతుడు —పంచమ మార్గమున నేగి ప్రధమ తనూజన్ —గాంచి తృతీయం బక్కట —-నుంచి ద్వితీయంబు దాటి యొప్పగా వచ్చెన్ పంచ భూతాలు ఆంటే మొదటిది భూమి ,రెండు నీరు మూడు అగ్ని ,నాలుగు వాయువు అయిదు ఆకాశం .దీన్ని బట్టి అన్వయం చేసుకోవాలి చతుర్ధ జాతుడు ఆంటే నాల్గవది అయిన వాయువు కు జన్మించిన వాడు ఆంజనేయుడు .పంచమ మార్గామమున ఆంటే అయిదవది అయిన ఆకాశ మార్గం లో ,ప్రధమ తనూజ ఆంటే మొదటిది అయిన భూమి కుమార్తెను ఆంటే సీతా దేవిని ,త్రుతీయంబక్కత నిల్పి అనగా మూడవదైన అగ్నిని అక్కడ అంటించి ,ద్వితీయంబు దాటి ఆంటే నీటిని ఆంటే సముద్రాన్ని దాటి ,వచ్చాడు .అని భావం మూడవదైన ముచ్చటైన పద్యం ”నలుగురు పలికిరి సరియని —నలుగురు బలికిరి సురూప ,నయన ,దాన ,ధారా—వలయ ధారా చరణోన్నతి —పొలుపుగ గద్వాల సోమ భూపాలునకున్ ” గద్వాల ప్రభువు సోమ రాజు గారిని పొగిడిన పద్యం ఇది .గద్వాల రాజు గారు సురూప ఆంటే అందం లో నలుడు .నయ -బుద్ధిలో –గురుడుంటే బృహస్పతి –దానం లో బలి చక్ర వర్తి –భూమిని మోయటం లో -కిరి వరాహ అవతారం ఆంటే ఆది వరాహమైన విష్ణు మూర్తి –సరి యని ఆంటే ఒప్పుకొని -నలు-గురూ-బలి–కిరి .అందరు పలికారని ,చెప్పిన మాటలనే వేరే అర్ధం లో అద్భుతం గా చెప్పి తమాషా గా ఆయన కీర్తిని ఆవిష్కరించాడు ఆ కవి . సంస్కృత శ్లోక వైభోగం ఒకటి చూడండి ”శతేషు జాయతే శూరః –సహస్రేషు చ పండితః -వక్తా దశ సహస్రేషు —దాతా భవతి వానవా ” వందలో ఒకడు శూరుడు అవుతాడు .వెయ్యిమందిలో ఒకడు పండితుడవు తాడు .పది వేలలో ఒక్కడు మహా వక్త కా వచ్చు .కానీ దాత అనే వాడు ఉంటాడో ఉండడో ?అని సందేహం దాత అవటం చాల కష్టం అని భావం . ఇలాంటి అద్భుత పద్యాలను చాలా గొప్పగా ఆవిష్కరించారు స్వర్గీయ ఆచార్య తిరుమల సేకరణ —గబ్బిట దుర్గా ప్రసాద్ ——11 -06 -11 .

Posted in రచనలు | 1 Comment

రెండు మహోన్నత శిఖరాలు

            రెండు మహోన్నత శిఖరాలు 
         ———————————
ఒక రోజు తేడా తో ఇద్దరు మహోన్నతులు అస్తమించారు .ఒకరు కళా ప్రపూర్ణ ,పద్మశ్రీ నటరాజ రామ కృష్ణ అయితే రెండవ వారు పద్మ విభూషణ్ పురస్కార గ్గ్రహీత ప్రఖ్యాత చిత్ర కారులు ఏం .ఎఫ్ .హుస్సేన్ .మొదటి వారు మన రాష్ట్రానికీ ,రెండవ వ్వారు ,మహారాష్ట్రానికి చెందిన వారు ఇద్దరు జీవిత సర్వస్వం తమ కళకు అంకితం చేసి ధన్య జీవులైన వారే .నటరాజు తాను సంపాదించినదంతా కళ కోసమే ఖర్చు చేసి తనకంటూ ఇల్లు కూడా మిగుల్చు కొకండా అచ్చమైన భారతీయ ధర్మానికి ప్రతీక గా నిలిచారు .హుసేన్జీ చిత్ర కళ లోని వివిధ అంగాలను స్పృశించి తనదైన శైలిలో పరిపుష్టి చేసి ,కోట్లు ఖరీదు చేసే చిత్రాలు గీసి ,సంపాదన అంతుచూసి ,ఈ దేశం పై ప్రేమాభి మానాలు వున్నా ఇక్కడి వారి మనోభావాలను కించ పరిచారనే ఆరోపణ కు ఖిన్నుడై లండన్ చేరి ,ప్రవాసి గానే వుండి పోయారు .మొదటి వారు భారతీయ ధర్మానికి ,రెండవ వారు అంతర్జాతీయ విదానాన్కి ప్రతి బింబాలు ..ఇద్దరు సృజన తో ఉన్నత శిఖా రాలు చేరు కొన్న వారే. వారి మరణం కళామ తల్లికి గర్భ శోకమే .అభిమానులకు అనంత శోకమే .
                            రామ కృష్ణ గారికి చిన్నాప్పుడే తలి దండ్రులు చనిపోతే రామ కృష్ణ ఆశ్రమం లో పెరిగారు .వారి పుట్టుక ఇండొనీషియా లోని బాలి ద్వీపం .18  వ ఏటనే ప్రఖ్యాత నాట్యా చార్యులయారు నటరాజ ”బిరుదు పొందారు ,అదే ఆ తర్వాత ఆయన ఇంటి పేరు అయింది దేవదాసీ నాట్యానికి స్థాయి కల్పించిన సంస్కారి .దాన్ని శాస్త్రీయ నాట్యం గా మలిచారు .పది వేల ప్రదర్శనలిచ్చి వేలాది మందికి శిక్షణ నిచ్చారు .విద్యార్ధులకు అన్నీ తానే అయి ,ఖర్చు అంతా భరించి నాట్యం నేర్పారు .ఆయన దశ భాషా పండితుడని చాలా మందికి తెలియదు .నిగర్వి .తన పని తాను చేసుకు పోయేవారు అవసరమైతే . ప్రభ్హుత్వం పై వత్తిడి తెచ్చి కళకు న్యాయం చేసే వారు .ఆయన నల్లభై రెండు ప్పుస్తకాలను నాట్య శాస్త్రం పై రాశారు .వాటిపై దాదాపు పది మంది పరిశోధనలు చేయటం విశేషం .తన అనుభవాలను ‘[‘అర్ధ శతాబ్ది ఆంద్ర నాట్యం ”లో వివరించారు .ఇది వారి జీవిత చరిత్రే ..జీవితాంతం వివాహం చేసు కోకుండా ,ఆంద్ర నాట్య కళకే అన్కితమయారు .
                       తెలుగు వారి అసలు నాట్యం మూలాలను వెదికి ,ఆంద్ర నాట్యం పేరున దాన్ని నేర్చి నేర్పించి వ్యాప్తి చేసిన మహానుభావుడు నటరాజు .కాక తీయుల నాటి పేరిణి శివ తాండవం కు పరిపుష్టి కల్గించి రామప్ప దేవాలయం లో ప్రదర్శనలు ఇచ్చారు ..ఆయన సృష్టించిన ”నవ జనార్దన పారిజాతం ..”ప్రముఖ నగరాలన్నిట ప్రదర్శించారు ..ఆయనకు ”నటరాజ ”బిరుదును బందార సంస్థాన  రాజు గణపతి పాండ్య గారు పద్దెనిమిదవ ఏట ప్రదానం చేశారు ..ఆయన కు భారత కలా ప్రపూర్ణ బిరుదుంది .దక్షిణ భారత ఉత్తమ నాత్యాచార్యుని గా మంచి గుర్తింపు పొందారు .ఆయన శ్రీశైలం దేవస్థాన నాట్యాచార్యులైనారు .ఆంద్రప్రభ్త్వం   ఆస్థాన నాట్యా చార్యునిగా నియమించింది(1980 ) ప్రఖ్యాత రాజ్య లక్ష్మి ఫౌండేషన్ పురస్కారం పొందారు .నిబద్ధత ,నిమగ్నత గల నాట్యా చార్యులు రామ కృష్ణ అని చుక్కా రామయ్య ,జితేంద్ర బాబు వంటి వుద్దండులన్నమాట నూటికి నూరు పాళ్ళు సత్యం .కళను కాసులకు అమ్ముకోలేదు .అదొక తపస్సు గ భావించి జీవించిన” ”నృత్య తపస్వి ”నాట్యాన్ని ఉద్యమం గా నడిపిన కారణ జన్ముడు .”శ్రీ వెంకటేశ్వర కల్యాణం ”,కుమార సంభవం ,,మేఘసందేశం నృత్య రూపకాలను ఆయన రూపొందించి ప్రదర్శనలు ఇచ్చారు .”నవ జనార్దన పారిజాతం ”నృత్యాన్ని ,తొమ్మిది రాత్రులు ,తొమ్మిదిమంది నర్తకులు ,తొమ్మిది మంది నర్తాకీమనులతో ,తొమ్మిది వాయిద్యాలతో ప్రదర్శించిన ఘనత నట రాజు ది ..ఆయన శిష్యులలో ప్రధముడు కలా కృష్ణ ఆయన్ను జీవితాంతం వెంట వున్నారు .ఇద్దరు  కళకు అన్కితమయారు ..త్యాగమయ జీవితం ఆయనది ఎందరినో ప్రభావితం చేసి ,నాట్యకళ జ్యోతి లా మిగిలి పోయారు నిండు జీవితం అనుభవించి పండు గా రాలి పోయారు విదేశ మైన ఇండోనేషియా లో జన్మించి ,భారత దేశం చేరి ఆంద్ర నాట్యానికి జీవం పోసి ,నిలబెట్టి ,మన సంస్కృతీ వైభవాన్ని పవిత్రం గా భావించి ఈ నేలలో కలిసి పోయిన మరో” నాట్య భరతుడు ‘నట రాజ రామ కృష్ణ .
                            అంతర్జాతీయ చిత్రకలాకారుడిగా హుస్సేన్ జీ పేరు ప్రపంచం అంతా మారు మోగింది .ఆధునిక పికాసో అని అంటారు .95 ఏళ్ళ వయసు లో తనువు చాలించారు .ఆయన ఎప్పుడు వివాదాల సుడి గుండం లో చిక్కుకొనే వాడు .900 కేసులు ఆయనపై వున్నాయి .స్థిర చిత్తం తక్కువ వైవిధ్యం కోసం ఆరాటం .హిందూ దేవతామూర్తులను నగ్నం గా చిత్రిన్చారనే ఆరోపణ తో పెద్ద దుమారం రేగి భారత్ నుంచి ఇంగ్లాండ్ వెళ్లి పోయారు .ఆధునిక కళా జగత్తుకు ఊపిరి ఆయన అంటారు .గజగామిని అనే సినిమాను తన ఆరాధ్య దేవత, ప్రేరణ అయిన మాధురీ దీక్షిత్ ను heroyin  గా పెట్టి తీసాడు .తర్వాత ఆయన మనసు మీనాక్షి ,ఊర్మిలా వగైరాలపై మల్లిందట .నిలకడ లేని మనసు తో వుండటం .ఆయనకు మైనస్ పాయింట్ .ఎంత గొప్ప కళా కారుడైనా బుద్ధి వక్రిస్తే ఇలాగే బాధలు పడాల్సి వస్తుందని ఆయన జీఎవితం కళాకారులకు హెచ్చరిక .ప్రజల పొపులర్ సెంటిమెంట్ తో ఆడుకోరాదని ఆయన తెలుసు కోలేక పోవటం విచార కారం .ఇండియా పై ప్రేమ అభిమానం చివరి దాకా వున్నా ఇక్కడికి రాలేక పోవటం ఆయన చేతులారా చేసు కొన్నదే .అందుకే ఆయన అంత్య క్రియలు లండన్ లోనే జరుగు తున్నాయి .రాజ్య సభా సభ్యత్వం ఇచ్చి భారత జాతి ఆయన్ను గౌరవించింది పద్మ భూషణ్ ..,పద్మ విభూషణ్ లతో సత్కరించింది .అయినా ఆయన మన వాడే అని చెప్పుకో లేని దౌర్భాగ్యం .కేరళ ప్రభుత్వం ”రాజా రవి వర్మ ”పురస్కారాన్ని హుస్సేన్ కు 2007  లో ఇచ్చి గౌరవించింది మహారాష్ట్ర లో జన్మించి ,మంచి చిత్రకారునిగాఎదిగి  ముంబాయ చిత్ర కళా  మొఘల్ గా జీవించి అంతర్జాతీయ చిత్రకళా సీమలో చౌధవీకా చాంద్ గా వెలిగి చివరికి దేశం కాని దేశం ఇంగ్లాండ్ లో మరణించట .బాధాకరం
                                      ఒకరు మట్టిలో మాణిక్యం ఇంకొరు మినుకు మినుకనే సుదూర తార
                                  అందరికీ  నట రాజ రామ కృష్ణ జీవితం ఆదర్శం ఎందుకంటె ఎంత ఎదిగినా వొదిగి వున్న సంపూర్ణ కలాజీవి ఆయన .ఆయన్ను గురించి ఆయనే చెప్పుకున్న పద్యం  లోని భావం కళాకారులందరికీ  -కళాకారులే కాదు సమస్త జనానికీ అనుసరణీయం ,స్ఫూర్తి దాయకం
                                     ”చదివితి సకల శాస్త్రములు
                                       అందలి సారములెల్ల గ్రహించితి
                                       అంత విజ్ఞాన నేత్రంబు విప్పిచూడ
                                       తెలిసి కొంటిని నాకేమి తెలియదనుచు  ”.
                                                                                                       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10 -06 -11

 

Posted in రచనలు | 3 Comments

ప్రసాద్” pun ” చేసే గాయాలు

 ప్రసాద్” pun ” చేసే గాయాలు 
01-అణు’ బుష్ ‘ కొటులో ఈ ”రాక్ ”తో తల బద్దలు కొట్టుకున్న బుష్
02 -రుక్కు’ l’ లతో రక్కినా చమ్మ గా వుండే’ జరుక్ ‘ వాక్కులు
03 -ప్రధాని సోమయాజిఅవ్వాలనే   ఆరాటం లో ”మండల ”కమందలోదకం తో ”సెక్యులర్ ”హోమ గుండం ఆర్పిన వాజ పేయి .
04 – బి.సి ‘గంగ  పై ప్రేమతో’ వో.సి ”పార్వతీ ఆంటే గంగా గౌరి సంవాదం లో రెంటికి చెడ్డ రేవడి ప్రతాపం ”విశ్వ నాధుని  ‘ది .
05 -తావు ఇస్తే పెళ్లి ‘తాపు ‘ఇస్తే పిండం పెట్టె ”థావూ శ్రీ ‘
06 – స్కడ్ దేశ ద్రోహాన్ని విచ్చిన్నం చేసిన అమెరికన్ ”petriat ‘.
07 -గోర్బ ”చెవులు ‘పట్టి ఆడిస్తున్న ”లుదివేనియా ”కన్నియ .
08 -ఆంద్ర కేసరి ఆంధ్రకే  సరా ?కాదు సారా భారత్ కేసరి” .sher e-bhaarath ”.
09-”పులులు”పై స్వారి చేస్తే ఎంత ”ప్రేమదాసు ”డైనా మరెంత ”కరుణా నిధి ”యైనా వేట పాలు కాక తప్పదు .
10 – ”చంద్ర స్వామి ”శేఖర్ నెత్తిన హస్తం —హిందూ jaw  కోరల్లో భారత్ .
11 – కాలమ్ జీలకర్ర ఏరుల రేవులు దాటినా ”సిరి మువ్వల సింగినాదం ”వినిపించడెం ”విశ్వనాధం ?( నాదం /)
12 -గల్ఫ్ లో ” నూ ‘నే”ఆధిపత్యం కోసం సెల్ఫ్ పోరు
13 -operation success కాని desert storm  లో ఇరాక్ patient డైడ్ .
14   -పాంచాలితో ,షత్రంజ్ తో ఆపూ సంసారం తో సినీశిఖరారోహనం చేశాడు వారే వా ”రే”
15 –  – దా  ”సరి” గా చేస్తే సూపెర్ హిట్ కాదా నారాయణా ?—-రా (ల)వు పైత్యం ప్రకోపిస్తే నిర్మాత ”హరి హరీ నారాయణా ”.
16 – అమృతం కురిసిన రా (దా )తరికి శోభా తిలకం బాల గంగాద్గారం —-విశ్వ కుతుమ్బ్బ భవనం పై ఎగరేసిన మాన వీయ విజయ కేతనం
17 ఘటోత్కచ ,కీచక ,రాక్షస గణం లోనే కాదు ”యశాస్వే’రంగా రావు   అన్నయ్యినా ,వియ్యన్న అయినా రారాజైనా ,దేనికైనా ”నట యశస్వీ ”
18 -,కళకు నటన తో, అందచందం తో, పట్టిన సుమాంజలి –సువర్ణ సుందరికీ ,అనార్ చిగుళ్ళ ”శోభ ‘సక్కు  ‘భక్త్యాంజలి .
19 -కావెషాల విలన్ వేషాలకు అందుకొన్న ”నీరాజనాల ”కా (క )లేశ్వరుని కి నేడు కాలే కడుపు దుస్థితి .
20 -ఇరాకీ ”రోమం ”తగల బడుతుంటే —బంకర్లో కదన కుతూహల ”రాగా ”లాలపిస్తున్న” నీరో ” హీరో సద్దాం
21 -స్వర ”చక్రవర్తి ”సంగీత హోరు .
22 – రాజుల ”ఉప్పుల దడియం ”అనే పోతాన్నే చిత్తూరు నాగయ్య –స్వరమాధురిలో త్యాగయ ,రామ భక్త గోపయ్య –”-నా ఇల్లు ”వదిలి ”నాదేశం ””అని ”వందే మాతరం ”,అన్నా ,చివరికి తప్పలేదు ”బీదల పాట్లు ”.
23 -”నిఘా ”తో ”నిఖా ”రద్దయింది ”.శేఖర్ ”తో రాజీవ్ పానిగ్రహనానికి ”తలాక్ ”.
24 – ప్రళయం ,ప్రణయం ,విరహం ,జాలి ,కరుణశ్రీ ఘంటా రావాలు నినదించే ”మొగ సాల ”
        ఏడు కొండ లేక్కినా భూకైలాసం చేరినా ,మాధుర్య భక్తీ ,సమ్మోహన శక్తీ పులకరించు ”ఘంట సాల ”
25 -నండూరి వారి చిన్నది ”ఎంకి నాయుడి ”ముగ్ధ ప్రణయ కవి సుబ్బా రావు
        సౌభద్రుని జైత్ర యాత్రా రధ సారధి సుబ్బా రావు ”నాయనే” .
                                                                                                   మీ
                                                                                       గబ్బిట దుర్గా ప్రసాద్
                                                                                    రచనా కాలం 18 -02 -91
                                                                       విషయాలన్నీ ఆ కాలానికి  సంబందించినవి అని గుర్తు చేస్తున్నాను .
Posted in రచనలు | Leave a comment

నృత్య తపస్వి నట రాజ రామకృష్ణ ఆంద్ర పద్మశ్రీ

Posted in సేకరణలు | Leave a comment

మల్లాది వారి ”కృష్ణా తీరం ”నవలలో అన్నప్ప అన్న వైభోగం

        మల్లాది వారి ”కృష్ణా తీరం ”నవలలో అన్నప్ప అన్న వైభోగం 
                                                              ————————————————————-
  మల్లాది రామ కృష్ణ శాస్త్రి గారి నవల ”కృష్ణా తీరం ”అందరు తప్పక చదవాల్సినది .ఒకరకమైన చిలిపితనం ,పాండిత్యం ,లాలిత్యం కలగలిసిన వ్యక్తిత్వం మల్లాది వారిది .ఒకవైపు ఆధునిక శ్రీ నాధుని లా ,మరోవైపు ఆత్మీయ తాతయ్య లా కన్పిస్తారు .కధల్లో వర్ణనలు ,ముచ్చట్లు ఆయన ప్రత్యేకత .సంభాషణా చాతుర్యం అద్భుతం .నవలలు గోలుసుల్లా సాగుతాయి .చంద్ర హారం లో బిల్లల్లాగా పాత్రలు ఒకదానిలోనుంచి ఇంకోదానిలోకి సాగి పోతాయి .ఆయన శైలి ముత్యాల ముగ్గు .దస్తూరి ముత్యాల కోవ  .కృష్ణా తీరం నవల లో అన్నప్ప ప్రత్యెక పాత్ర .ఒక విధం గా అది మల్లాది వారే అని పిస్తారు .సహృదయత ,సౌమ్యత ,నిరాడంబరత ,సమన్వయము ,హాశ్యం ,వ్యంగ్యం ,పాండిత్యం భోజన ప్రియత్వం ,సంభాషణా చాతుర్యం ,అన్యోన్య దాంపత్యం పట్ల ఆరాధన ,స్త్రీ స్వాభిమానం పట్ల గౌరవం ,కులమత విచక్షణా రాహిత్యం ,అభ్యుదయ ధోరణి ,ఆచరణ శీలత శ్లాఘనీయాలు .చెయ్యి ఎత్తి నమస్కరించా బుద్ధి కలుగు తుంది .అన్నప్ప అందరికి ప్రీతి పాత్రుడు .సంసారాల్లోని కలతల్ని ,సామరస్యం గా పరిష్క రిస్తాడు .అన్ని వయస్సుల వారితోను సమానం గా మెలిగే నేపుఆయనది ,మల్లాది వారి కృష్ణా తీరం ఒక వచన కావ్యం అనిపిస్తుంది .ఆంధ్రుల వేదం .నిత్య పథనీయం .ఈ నవల శైలి కోసమే రాసింది కాదు .మానవ సంబంధాల్ని మెరుగు పరచటం కోసం ,మూఢ విశ్వాసాలను విసర్జించటం కోసం అందరు అన్యోన్యం గా మెలగటం కోసం ప్రేమతో వారధులు కట్టుకోవటం కోసం రాశారు .శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గోదావరీ తీర వ్యావహారిక భాష లోని నుడికారాలను ,ఉచ్చారణా వైచిత్రిని ప్రదర్శిస్తే ,మల్లాది వారు కృష్ణా తీరపు వ్యావహారిక భాష లోని వైవిధ్యాన్ని ,విలక్షణతను ,జోడించారు అందుకు ఈ నవల వో ప్రత్యేకత అని ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయా దేవి అన్న మాటలు అక్షర సత్యాలు .
                            అన్నప్ప ఒక సత్కార్యం కోసం ఒక వూరు వస్తాడు ,.లచ్చి ఇంటికి చేరాడు .ఆ ఇల్లు కడగొట్టు వారిది అవధాని గారి కొడుకు వీళ్ళ అమ్మాయిని  వలచి పెళ్లి చేసుకున్నాడు .ఆయన అగ్గి మీద గుగ్గిలం అయాడు కొడుకు ఇక్కడే ఉంటున్నాడు .ఈ రెండు కుటుంబాల్ని కలిపే బాధ్యత తీసుకున్నాడు అన్నప్ప అందుకే వీల్లిన్తికే వచ్చాడు .తన భోజనమూ వీల్లిన్ట్లోనే తనకు వంటలో ఏమి చేసి పెట్టాలో పురమాయిస్తున్నాడు చూడండి ”నా కోసం నవ కాయ పిండి వంటలేమీ చెయ్యద్దు .మరి ,వంకాయ నాలుగు పచ్చాలు చేసి పోపులో వేసి ,ఆనపకాయల (సొరకాయ )మీద ఇఇంత నువ్వు పప్పు జల్లి ,అరటి దూత (ఊచ )ముఖాన ఇంత  ఆవేట్టి ,తోటకూర కాడల్లో ఇంత పిండి బెల్లంపారెయ్యి   .కొబ్బరీ,మామిడీ అల్లం పచ్చళ్ళు చాల్లే .పెరుగు లో తిరగ బొత పెట్టి ,దాన్లో    పది గారెలు పడీ .రవంత శనగ పిండి కలిపి ,మిరప కాయలు ముంచి ,చమురు లో  వెయ.సరేక్షీరాన్నం   (పరవాన్నం )అంటావా ! అదోవంటా?  ?ములక్కాడలు మరి కాసిని వేసి పులుసు ఒక పొయ్యి మీద పడీ .ఈ పూటకు ఇలా లఘువు (తేలిగ్గా )పోనీయ్ .ఇదిగో నేను స్నానం చేసి వస్తున్నా గానీ వో అరతవ్వేడు గోదుం పిండి తడిప్పెట్టు   .రత్తమ్మ .వస్తే  నాలుగు వత్తి ,అలా పడేస్తుంది .మధ్యానం పంటికిన్డకు ఉంటాయ్.”ఈ మాటలకు అవధాని గారి కోడలు ముచ్చటపడి నవ్వేసింది
          ఇంతలో రత్తమ్మ వచ్చింది బచ్చల ,వామన గాయలతో  .”రాత్తమ్మప్పా !నాకుబచ్చలి   కూరంటే ప్రాణం .నాలుగు వెల్లుల్లి రెబ్బలండులో వేసి దిమ్మ తిరిగెట్లు తిరగ బోతేడితే ఆహా !ఇంకా పంచ భక్ష్య పరవాన్నలేందుకు ?ముఖ్యం గా బొబ్బట్లలో నంజుకునేందుకు మా మంచి వనరు .అలా నున్చున్తావెం మడి    కట్టుకో .నీవు కూడా చేయి చేసు కో పోతే మా ఇదరి వల్లా యెట్లు లేదు .”అని రాత్తమ్మకూ పురమాయిన్చిఅప్పుడే  ఆ ఇంటిలో ఒకడై పోయాడు అన్నప్ప శాస్త్రి .పెద్ద వైదిక బ్రాహ్మణుడు .అనుస్టాన పరుడు .అయినా కుల విచక్షణ చూపనిఉపనిషత్  ,వేదాంత విధానం .ఇక అన్నప్ప మాట వినకుండా ఎవరు వుంటారు .?అతను ఏది చెప్పిన పర హితం కోసమే ఏది చేసినా ఇతరులు బాగు పడాలనే .చివరికి అందరిలో మార్పు తెప్పించి ఆత్మ పరిశోదన చేయించి కర్తవ్యోన్ముఖులను చేస్తాడు అన్నప్ప ..ఇదీ అన్నప్ప పాత్ర ..వీలును బట్టి మరి కొన్ని కృష్ణా తీరం విశేషాలు  తరువాత తెలుసు కొందాం
                                                                                       మీ —దుర్గా ప్రసాద్    09 -06 -11 .

 

Posted in రచనలు | Leave a comment

మధుర మైన కొన్ని రాజా రాం కధలు

 

  మధుర మైన కొన్ని రాజా రాం కధలు 
    స                                                                     —————————————————————————————–
                     మధురాంతకం రాజా రాం కధల్లో మానవత్వానికి ఎంత ప్రాధాన్యత వుంటుందో తెలియ జేసే కొన్ని కధలు టూకీ గా మీకు తెలియ జేస్తున్నాను
                                    ”పిచ్చి వెంకట్రావు ”కధలో తన తోటి ఉపాధ్యాయుడికి ఆక్సిడెంట్ అయి చికిత్చ చేయించ టానికి వెంకట రావు మేష్టారు రైల్ ను ఆపాల్సి వస్తుంది పట్టాలమీద నిలబడి . చొక్కా విప్పి దాన్ని ఊపుతూ ,రైలును ఆపాడు వెంకట రావు మేష్టారు .ఆనుకోకుండా ఇంజెన్ డ్రైవర్ ఆయన శిష్యుడే అయాడు .గురువు గారి త్యాగానికి ముగ్దుడైనాడు .చికిత్చ జరిగి ఆ ఉపాధ్యాయుడు కోలు కున్నాడు .అప్పుడు మేష్టారు ”బోడి రూల్స్ నాకు చెప్పద్దు .మొదట మనిషి ,ఆ తర్వాతే రూల్స్ ”అన్నాడు అదీ ఆయన కధ .అయితే చెప్ప టానికి ,వినటానికి ఈ కధలు బానే వుంటాయి .యెక్క డైనా నిజ జీవితం లో అలాంటి మేస్టార్లు ఉంటారా ?అని మీకు ,నాకు సందేహం కలగటం సహజం .వున్నారు శ్రీ రాయసం వెంకట శివుడు ,కపిథలం కృష్ణ మా చార్యులు వంటి వారికి వ్రుత్తి ఏ దైవం .మనిషే దేవుడు .అలాంటి వారు జనం ద్రుష్టి లో పిచ్చ వారే .అందుకే దీన్ని ”పిచ్చి వెంకట్రావు”కధ అన్నాడు .
                      ఇంకో మంచి కధ ”రాతిలో తేమ ”భర్త అహంకారి .ఎన్ని చెప్పినా వినడు ,పంధా మార్చు కోడు మరి భార్య కర్తవ్య హీనం గా వున్దాల్సిన్దేనా ?కాదు ఆమె కర్త వ్యం ఆమె చేసి భర్త  మనసు మార్చిన మరో మానవతా మూర్తి అయిన మహిళ కధ ఇది .భర్త రెడ్డి గారి తో వచ్చిన భూమి తగాదా తో నిరాశ్రయులైన వూరి జనం రెడ్డి గారిన్టికే వచ్చారు .ఆయన పనులకు ఎప్పుడు అడ్డు చెప్పని భార్య సహజ కరుణామయి .నోరు లేని ఆ పాటక జనాన్ని బంధువులు గా భావించింది .వంటామెను పిలిచి వంట చేయించింది ఆమె ”అమ్మ గారూ !చుట్టా లెవరైనా వస్తున్నారా ”అంది అమాయకంగా .”ఇంకా రావటం ఏమిటి?   .ఎప్పుడో వచ్చారు .వీరంత్తా నా చుట్టాలే ”అంది ఆప్యాయత కురిపిస్తూ .రెడ్డి గారి మనసూ మారింది .ఆయనా తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాడు .వేరొక చోట వారందరికి పాకలు వేయించాడు .”యుద్ధాలు మనుష్యుల మెదళ్ల లోనే పుడతాయి ”అనేది ఐక్య రాజ్య సమితి నివేదిక .నిజానికి శాంతి ,సహజీవనం కూడా మనసు లోనే ఉదయిస్తాయి .అని అనితర సాధ్యం గా రాజా రాం ఈ కధను ముగిస్తారు .
                          మరో మంచి కధ ”నరసప్ప మేష్టారు ”ఆయన స్థావర జగత్తు లో సాహిత్య జగత్తును చూసే ”రాయవరం నరసప్ప మేష్టారు ”నరసప్పగారు  ”మిరప మొక్కలలో వేమన పద్యాల్ని ,మామిడి తోట లో రామాయణాన్ని ,బిల్వ(మారేడు )వృక్షం లో హరవిలాసాన్ని ,పనస చెట్టు లో ఆముక్త మాల్యదను ,ఏడాకుల అరటి చెట్టు లో భాగవతాన్ని” ,చూసు కుంటాడు .పోయిన బడి పంతుల వుద్యోగం లో రావలసిన జీత భత్యాల గురించి కించిత్తైనా చింతలేదు ఆయనకు. బహుశా ఆ నరసప్ప మేష్టారు మన దామల చెరువు మాస్టారు రాజా రాం గారేనేమో .
                     ఈ కధలు ”కూన లమ్మ కోన ”అనే రాజా రాం కదా సంపుటి లోవి .”అవక తవకలు అరికట్టే శక్తి మనకు లేక పోవచ్చు .అయినా మన చిన్న గొంతు తో అసమ్మతి తెలియ జేయాలి ..”అనేది మాస్టారిసిద్ధాంతం.  .ప్రజలే ఆయన పుస్తకాలు .దేవుని పట్ల ఎంత ఆరాధనా భావం వుంటుందో ,మానవ జీవితం పట్ల కూడా అంతే ఆరాధనా భావం ఆయనకు .జీవితం పట్ల ఆసక్తినీ ,అనురక్తినీ ,భక్తినీ కలిగివుంటేనే కదా వస్తువులకు కొదవ వుండదు అంటారాయన .ఉపాధ్యాయ వ్రుత్తి లో వుండటం వల్ల అద్భుత మైన లోక పరిశీలనా శక్తి కలిగింది .దానితో మాన వత్వం మూర్తీభావించే గొప్ప కధలు రాశారు .ఆంద్ర దేశం లోని అన్ని వృత్తుల వారి మనో విశ్లేషణను ఆయన తన కధల్లో చూపించారు .ఆయన శైలి నిర్మల ,పవిత్ర గంగా ప్రవాహమే .ఏ మాత్రం తెలుగు వచ్చిన వాడైనా హాయిగా చదువుకో గలడు .”మానవులంతా మాధవులు కాలేక పోవచ్చు కాని కనీసం సామాన్య మానవులు గా నైనా వుండాలి ”అన్నది మధురాంతకం గారి మనో భీస్తం .ఎప్పటి కైనా అది నెరవేరాలని ఆశిద్దాం .ఆ దిశ లో అడుగులు వేద్దాం .వీలైనప్పుడల్లా రాజా రాం కధలు చదువుదాం   .మనసు లో మాన వత్వం నింపుకుందాం . .జీవితాన్ని అమ్రుతోపమానం చేసు కుందాం
                                                                                                                             మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —09 -06 -11 .

 

Posted in రచనలు | Leave a comment

రాయల వసంత రుతు వర్ణన

   రాయల వసంత రుతు వర్ణన
                                                           —————————–
                         గోదా దేవి లోని సాత్విక భక్తినీ ,మధుర భక్తినీ భగవదర్పితం చేయ టానికి రాయలు వసంత ఋతువు ను అద్భుతం గా వర్ణించాడు .రుతు రాజైన వసంతాన్ని ,రాజ కవి రాయలు సందర్భ సుందరం గా వర్ణించాడు .
                ”ఆముక్త మాల్యద విరహ తాపం ఎక్కువైందని ,దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి 
చేరటం తో వసంతం ఆరంభమయింది .ఆమె విరహ నిట్టుర్పుల వేడికి ఆగ లేక సూర్యుడు చల్లగా ఉంటుందని హిమాలయం వద్ద ఉత్తరానికి మొగ్గాడట .విరహం అనే బాట సారికి దాహమైతే అగ్ని వెంట తడి కూడా వచ్చినట్లు మన్మధుడు దండెత్తి వస్తున్నాడని సూచించే అతని జెండా పై గల మీనం (చేప )తో పాటు మేషం (రాశి )కూడా వచ్చింది .హేమంత చలి యువతుల్ని కావలించింది .వసంతుడు అనే ప్రియుడు ముందుకు వచ్చి వెచ్చదనం కల్పిస్తాడనే భావంతో హేమంతం చివరి ముద్దు పెట్టుకొని వెళ్లిందట .చలాకీ చంద్రుడు సూర్య కిరనాలంత వేడి పుట్టించి విరహుల్ని వేధిస్తున్నాడు .వసంత రుతువు అనే మంత్రిని ,కొత్త గా పుట్టిన వసంతుని బొడ్డు కోసిన కొడవలి లాగా కోయిల కూత యువతీ యువకుల్ని విరహం తో కోస్తున్నాయి .శివునికీ పార్వతీ దేవికీ ప్రణయం కల్పించ టానికి మన్మధుడు వేసిన పూల బాణాల మొనలు విరిగి ,చివుళ్ళు గా వేలుస్తున్నాయత. భూదేవి కడుపు లోంచి పుట్టిన వ్రుక్షాలనే పిల్లలకు పాల పళ్ళు ,దంతాలు మొలిచి నట్లు లేత చిగుళ్ళు పువ్వులు ,పిందెలు పుడుతున్నాయి .వన లక్ష్మి రాబోయే మాధవుని అలంకరించ టానికి సింగారించు కొందిట .”.
                              దేవత్వం సిద్ధిన్చినా ,మధు పానం అనే దురభ్యాసాన్ని వదలని తుమ్మెదలను వెక్కిరిస్తూ ,తనకుపంచత్వం రారాదని ,పంచమ స్వరం తో కోయిల కూస్తోంది .మాధవుడు మామిళ్ళకు ,పూలను సృష్టించి ,పిందెలు గా మార్చి ,మన్మధునికి ఆయుధాలు ,సరఫరా చేస్తున్నాడట .దేవుడే శత్రువుకు మేలు చేస్తుంటే విరహ గ్రస్తులకు దిక్కు లేకుండా పోయిందట .మధు మాసం అనే ఆవు పొదుగు నుండి పాలు కారు తున్నట్లు చంద్రుని వెన్నెలల తో భూలోకం తడిసి ,కమ్మని వాసనలనిస్తోంది .తుమ్మెద బారులు మన్మధ బాణానికి నారిగా మారు తోమ్దట .యువతుల చంద్ర బింబాల వంటి మొహాల కన్నా ,చను దోయి కంటే మాకే ఎక్కువ యవ్వనం వుందని పద్మాలు విరగ బూసి నవ్వు తున్నాయట .భ్రుగు మహర్షి తన్నినా నవ్వేసిన విష్ణు మూర్తి వెంకటేశ్వరుడై ,పద్మాతిని పెళ్ళాడాడు .ఆమె సత్య భామ గా మారింది .స్త్రీలందరికీ ఆ అంశ అంటించింది .ఏ స్త్రీ తన్నినా అశోకవృక్షం బంగారు పూలతో పూసినట్లు navvu తోందట .మాధవుడు రాసాతలాన్ని ,మకరంద వర్షం తో ,భూమిని పూలతో ,ఆకాశాన్ని పుప్పొడి తో జయించి ,త్రిలోక విక్రముడైనాదట .చిలకకు జామి పళ్ళు మేత గా ఇచ్చిన వసంతుడు ,ప్రేయసీ ప్రియులకు పూలు పంచి ,తుమ్మెదలకు తేనె లిచ్చి ,వసంత లక్ష్మికి వెచ్చని కొగిలి ఇచ్చి ,పక్ష పాతం లేదని పించాడట  .–
                                                                 గోదా కల్యాణం
                                                                 ——————
                             వసంతం ఇంతగా విజ్రుమ్భిస్తే రంగ  నాద స్వామి విరహ వేదన తో  తపిస్తున్న గోదా దేవి బాధ ఏమిటో తండ్రి విష్ణు చిత్తుల వారికి తెలియనే తెలియదు .చివరికిమన్నారు దేవునికి మొర పెడ్తే ఆయన గోదాదేవిని శ్రీ రంగానికి తీసుకు వెళ్ళాడు .ఆమె పై స్వామి మరులు గోన్నాడు .పెళ్ళికి స్వామి విష్ణు చిత్తుల వారింటికి సపరి వారం గా తరలి వచ్చాడు .దేవలంతా పాల్గొన్నారు .దివ్య వేదిక పై శ్రీ గోదా రంగ నాయకుల వివాహం  శాస్తోక్తం      గా వైభవం గా జరిగింది .సప్తపది పూర్తి చేసి ,అరుంధతీ దర్శనం చేశారు .కాదు రాయల వారు చేయించారు .భార్యా భర్తలిద్దరూ కలియుగ వైకున్థం  నుంచి అసలువైకున్థం    చేరారు .అందుకే ఆముక్త మాల్యద ముక్తి మాల్యద అయింది చిర యశస్సును ఆర్జించింది ..
దీనితో  ఆముక్త మాల్యద లోని నాలుగు రుతువులను శ్రీ కృష్ణ దేవ రాయలు వర్ణించిన,తీరును ఆ వర్ణనలు కధకు ,.కదాగామనానికి తోడు పడిన విధానాన్ని తెలుసు కొన్నాం .ఇక చాలు సెలవ్
                                                                                        మీ —-గబ్బిట దుర్గా ప్రసాద్ 08 -06 -11
Posted in రచనలు | Leave a comment

ఆముక్త మాల్యద లో రాయల గ్రీష్మ వర్ష రుతు వర్ణన

   ఆముక్త   మాల్యద లో రాయల గ్రీష్మ వర్ష  రుతు వర్ణన 
                                                          —————————————————-
ఆముక్త మాల్యద లో గ్రీష్మ రుతువును ముందు ప్రవేశ పెట్టాడు కృష్ణ దేవ రాయలు .అదే ఆయన ప్రత్యేకత ,.కారణం లేకుండా చేసిన పని కాదిది .గ్రేష్మ ప్రతాపాన్ని అంత ప్రతిభావంతం గా వర్ణించి కధకు కావలసిన నేపధ్యాన్ని సృస్తిమ్చటం రాయల మార్గం రాజ మార్గం .తాను చెప్ప దలచు కొన్న కధకు జీవితాన్ని ప్రసాదిస్తాడు ఇదే ప్రకరణ వక్రత..
               ఆ వేసవిలో పుష్ప బాణుని విల్లు చేయి జారి పడిపోయిందట .చేతులు చేమరిస్తున్నాయి .రతి ప్రేరణకు అవకాసం లేదన్న మాట .జీవుల్లో అలసత్వం పెరిగింది .దంపతుల పొందు ”అనార్యుల పొందు ”గా ఉందట .రతి కి విమఖత చెమట అలసత్వం వల్ల కల్గింది .దీన్ని ”వాక్య వక్రత ”అన్నారు ఆచార్య జి.వి సుబ్రహ్మణ్యం గారు .వేసవి తాపానికి సోమ్మ సిల్లిన యువతీ ముఖ చంద్రుడు తన ఓషధ ధర్మాన్ని వుపయోగించి మన్మదునితో కలిసి ,పాతాళానికి పారి పోతున్నా ,కమ్మని పిల్ల తెమ్మెరను ,శీరాపు తాటి విసన కర్ర తో బలవంతం గా తెప్పించుకొని అనుభావిస్తున్నాడట .మలయ పావనమ్ లేదు కనుక మరుని బాధలే లేవు .మంట గాలిని మోయ లేక సూర్య రధ పగ్గాలైన పాములు ముడులు వదిలేశాయత .నీటి తో నిండి ఉండాల్సిన బావులు నీరు లేక చక్రాకారం లో ఆకాశానికి యెగిరి పోతున్నాయి .జల దేవతలు చలువ పందిళ్ళు కు చేరారు .కా ళ్ళు పడిపోయిన మన్మధుడు ,అక్కడే కుక్కి మంచం ఎక్కాడట .మల్లె మొగ్గలు అగ్గి బొబ్బల్లగా వున్నాయట          .చరకు పానకాలు,సేద తీరుస్తున్నాయత ..
                   మన్మధ రంగాస్తలమైన మధుర నగరం లో   వుంది ఈ గ్రీష్మం అంతా .ఆంటే శ్రుంగారం తగ్గి పోతోందని భావం .దంపతులు దగ్గరలో వున్నా పొందు సుఖం లేదు .ఇంతటి దారుణ గ్రీష్మం లలో రాజు మాత్య ద్వజుడు వేశ్య పొందు కోసం వెళ్తున్నాడు .వో పరదేశి బ్రాహ్మణుడి ప్ర్రబోధం విని ,మనసు మార్చుకున్నాడు .అదేవసంతం  అయితే అలా జరిగేది కాదు .కామోద్దీపన పెరిగేది .ఇలా గ్రీష్మం తో రాజు మనసు మార్చిన ఘనత రాయలది .”వక్రోక్తి స్వభావాన్ని అద్భుతం గా వుపయోగించి తాను చెప్ప బోయే కధకు బలాన్ని అందజేశాడు రాయలు ”అన్న ఆచార్యుల వారి విశ్లేషణ  అమోఘం అని పిస్తుంది
                     తరువాత యమునా చార్యుల వారి వివాహం జరుగు తుంది .అక్కడ వర్ష రుతువును అద్భుతం గా వర్ణిస్తాడు రాయలు గార్హస్త ధర్మ పోషణకువర్శర్తు   బాగా దోహదం చేస్తుంది .ఇక్కడ రాయల ప్రకృతి పరిశీలనకు ముక్కు మీద వేలు వేసు కోని ఆశ్చర్య పోతాము .వేసవి లో అతిగా సుద్రపు నీరు తాగిన సూర్యుని కడుపు లో ఉప్పు ద్రవం గా మారి దాన్ని వుముస్తుమ్తే ఫెళ ఫేలార్భాటులు విన్పిస్తు న్నాయట .పుట్తాల్లో వున్న కట్ల జెర్రి పాములు ఆకాశం లో నడుస్తున్నట్లు వర్ష మేఘాలున్నాయట .ఆ జెర్రుల వేయి కాళ్ళ లాగ వర్ష ధారలు పడుతున్నాయి .గాలితో కూడిన ధారలు వుట్టి త్రాళ్ళ లాగా గోగు పుల్లల్లా జనపనార లా తళ తళ లాడు తున్నాయట .ఆకాశం ,భూమి ,తెల్లని తాళ్ళతో ముడి వేసి నట్లుందట .ఇదంతా ఎంతో సహజ సుందర వర్ణన .ఇంతకు ముందు ఏ కవీ ఇలా వర్ణించ లేదు .
                      ఇంద్రుడు అడవి నెమిల్లను ఆడిమ్చతానికి .మేఘాలలు అనే మద్దేల్లను రెండు వైపులా మొగిస్తున్నాదట .వర్షుడు సముద్రాలన్నీ తాగేసి ,ఆ నేరంతా ఒక్క సారి కక్కితే భూమి వరదల్లో మునిగి పోతుందని జాలి పడి బ్రహ్మ సూర్యుని చుట్టూ ,గూడు కట్టాడట .కోకిల పంచమ స్వరం తో ,నెమలి షడ్జమం తో ,పాడుతున్నాయి .ఆ రెండు కలిసి పాడి నపుడు సముద్రుడనే భర్త దగ్గరకు నదులనే భార్యల్ని సాగనంపుతున్న చెలి కత్తెల పాటల్లా వున్నాయట .
                           వర్షా కాలమ్ రచ్చ సావిల్లలో చేరిన జనం కాలక్షేపం కోసం పులి ,మేక ఆటలు ఆడుతున్నారు .కాయ గూరలు దొరక్క జనం ఆకు కూరలను ,చింత చిగురుతో కలిపి వండుకున్తున్నారు .రెడ్డి దంపతులు పొలం గుడిసె లో మంచం కింద కుంపటి పెట్టు కోని ,దూరం గా కట్టివేయబడ్డ దూడలు తమ శరీరాల్ని నాకు తునా పట్టించు కోకుండా కామ కేళి జరుపు తున్నారు .రాజులు మాత్రం నెమల్లు కూసే దాక నిద్ర లేవటం లేదు .ఆంటే క వారి భోగాలకు ఏమీ కొరత లేదు అని ఒక చురక అంటించాడు రాజైన రాయలు .వాళ్లకు ఎన్ని సుఖాలైనా అమరుతాయి కదా అంటాడు .
                     ఆంటే వర్షా కలం లో ఎంత ముసురు పట్టినా ఇబ్బందు లేదురైనా ,అన్నంతినటం   తొనే తృప్తి పడ కుండా మన్మధుని మరచి పోలేని వారుగా జన జీవితం సాగుతోంది గ్రీష్మానికి వర్హ్ర్టు కు ఎంత తేడా ? ఇలాంటి పజల మనో ధర్మ వ్రుత్తి ద్వారా రాజు గారి ప్రవర్తన కూడా వుంది అని ధ్వని గర్భితం గా రాయలు తెలియ జేస్తున్నాడు .యామునా చార్యులు రాజుగా  హాయిగా వర్షా కాలమ్ లో దాంపత్య సుఖాన్ని అనుభవిస్తున్నాడు .ఇదంతా అతని జైత్ర యాత్ర కు ముందు చేసిన వర్ణన ..దీని తర్వాత శరదృతు వర్ణన చేసి కదా గమనాన్ని  మార్చి వేశాడు అది మీకు ఇదివరకే తెలియ జేశాను
                    ఇంకో సారి వసంత ఋతు వర్ణన తిలకిద్దాం
                                                                                                    మీ గబ్బిట దుర్గా ప్రసాద్ —-08 -06 -11

 

Posted in రచనలు | 1 Comment

ఆముక్త మాల్యద —–శరదృతు వర్ణన

 ఆముక్త మాల్యద —–శరదృతు వర్ణన 
                                                      ——————————————
కృష్ణ దేవ రాయల ”ఆముక్త మాల్యద ”కావ్యం వర్ణనా విశేషాలతో నిండి వుంటుంది అందరు కవులు వసంత ఋతువు ను ముందు వర్ణిస్తే రాయలు గ్రీష్మ రుతువు తో ప్రారంభించాడు .రుతు వర్ణనకు ,కధకు లంకె పెట్టటం రాయల నేర్పు ప్రస్తుతం శరత్తు లో వున్నాం కనుక కధకు ,వర్ణనకు సంబంధం గురించి ఆలోచిద్దాం .యామునా చార్యుడు కాల ప్రభావం వల్ల భోగిగా వీరమయ జీవితం గడుపు తున్నాడు .ఆచార్యత్వాన్ని ,రాజరికం కమ్మేసింది .కాని అది ఆయన ప్రవ్రుత్తి కాక పోవటం ఇబ్బంది గా పరిణమించింది .మత్యధ్వజ రాజులో ,యామనప్రభవు   లో వున్న లోపలి ప్రవృత్తుల లోని భేదాలను రాయలు గొప్పగా ఆవిష్కరించాడు .దీన్ని వర్ణనా వక్రత అన్నారు ఆచార్య జి.వి సుబ్రహ్మణ్యం గారు .ఇదే అందరి కవుల కంటే రాయలని ప్రత్యేకం గా వేరు చేసింది .కధలో ప్రాణ చైతన్య స్పందన దీని వల్లే వచ్చినది mఅంటారు  జి.వి .కాల ప్రభావం ,రుతు ప్రభావం మానవునిపై పెద్ద ప్రభావాన్నే చూపుతాయి .రుతు వర్ణన లతో ,అద్భుత కదా సంవిధానాన్ని రాయలు సాధించాడని అర్ధం అవుతుంది .
                  వర్షా కాలమ్ లోపన్నాగ   శాయనుడైన విష్ణు మూర్తికి  ,ఆది శేషుని  పడగల  కదలికలతో మెలకువ వచ్చింది నిద్ర లేచి భూమి పై కాలు పెట్టి అనుగ్రహించి నట్లుగా భూమి పంటలతో నిండి పోయింది .సూరీడు నీటితో పాటు తాగిన ముత్యాలనూ ,వుమిసి (వుమ్మేసి)పద్మాల మీద ,తామరాకుల మీద కొత్త ముత్యాలతో అందాలుదిద్దు తున్నాడట  .ఆకాశం లో నక్షత్రాలు తలంటు పోసుకోనిన కుంకుడు రసం నురగలు ,నదుల మీద రెల్లు పూలతో కలిసి ,తేలు తున్నాయట .సముద్రం నుంచి చల్లదనాన్ని ,తియ్యని నీటినీ అప్పు తీసుకొన్న సూర్య చంద్రులు ఆ అప్పు తీర్చటమే కాదు ,అందాలు అనే నగలు కూడా ఇచ్చి వడ్డీ తీర్చేశారట .
                                చెరకు గడలంత ఎత్తుకు పెరగలేక పోయామని సిగ్గుతో వరిచేలు కంకులతో తలలువంచుకొని వున్నాయట      .విశ్వామిత్ర యాగం వంటి వేసంగి తొలకరి వచ్చింది .వర్షము ,గాలీ రామ లక్ష్మణుల లాగా వచ్చాయట .శరత్తులో రాముడు శివ ధనుస్సును ఎత్తి పట్టాడు .ఇక సీతా అనే భూదేవి మనసు నుంచి పొంగక ఏమి చేస్తుంది?అని కుప్ప నూర్పిల్ల ను గురించి పంట దిగుబడి గురించి అద్భుతం గా వర్ణించాడు .ఇది కధకు  ఏ విధం గా సహకరిస్తుంది అని మన సందేహం .ఆంటే యామున ప్రభువు జైత్ర యాత్ర చక్కని ఫలితాన్నిస్తుందని సూచన . ఇంత వివరం గా వర్ణన చేసిన రాజు రాయలు యామున ప్రభువు దిగ్విజయాన్ని ఒకే ఒక మహా స్రగ్ధర లో చెప్పి వదిలేశాడు .వర్ణనా నేపధ్యం లోంచి మంచి ఫలితాన్ని అందించి ఔచిత్యాన్ని ఘనం గా పోషించాడు .యుద్ధ  వర్ణనను అతి గా చేస్తే అది రాయల రచన అవుతుందా ?అందుకే కవులందరి లో కృష్ణ దేవ రాయలు అందనంత ఎత్తున వున్నాడు .రాయల్ టచ్ ఆంటే అదే .ఆముక్త మాల్యద రాయల ప్రతిభా దర్పణం .
               మరిన్ని విశేషాలు వరుస క్రమం లో తెలుసు కుందాం  .సెలవ్
                                                                                                               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్       08 -06 -11

 

Posted in రచనలు | Leave a comment

శ్రీ మధురాంతకం రాజా రాం

మధురాంతకం రాజా రాం

————————-

మధురాంతకం రాజా రాం ఆంటే నాకెందుకో విపరీత మయిన ఇష్టం .ఆయన చని పోవ టానికి ఒక సంవత్చరం క్రితం విజయ వాడ లో ఒక సన్మాన సభలోపాల్గొన్నారు . .ఆయన్ను చూడాలన్న తహ తహ తో వెళ్లాను .”అచ్చ తెలుగు కధకు నిలువు తద్దం రాజా రాం .”అని నా నోట్ బుక్ లో నేను రాసు కోని వారిని సంతకం పెట్ట మన్నాను .చదివి నవ్వుతు సంతకం చేశారు .నాకు మహదానందం కలిగింది కాళ్ళకు నమస్కారం చేసాను .”అదేన్దప్పా .ఒద్దప్పా అట్లా చేయ్యద్దప్పా ”అని వారించారు కాని నేను వినకుండా నా పనినేను చేశాను .ఆప్యాయం గా కౌగిలించు కున్నారు .ఎంత ఆనందాన్ని అనుభావిమ్చానో చెప్పలేను .నా కల సఫలం అయింది .ఆ నెల లోనే ఆయన రాసిన బెజవాడ కనక దుర్గమ్మ ముక్కెర మీద కధ ప్రచురితం అయింది .దాన్నిఇక్కడ మళ్ళీ చెప్పారు .ఆయనది అద్భుత మైన ఫినిషింగ్ .కావ్యం చదువు తున్నట్లు అనుభూతి కలుగు తుంది .మనిషి లోపలి పొరలను తాకే భావ జాలం ,వాక్య విన్యాసం రసార్ద్రత వారి కధల్లో కొల్లలు మనసు ద్రవిన్చాల్సిందే సున్నిత హాష్యం అనుపానం .న హృద్యమైన కదా విధానం ,వైవిధ్యమైన ఇతి వృత్తం ,మనోజ్ఞా మైన శైలి మధురాంతకం కధకు నిండు దానాన్ని ,పుష్టిని కలిగిస్తాయి .కధలను అల్లడం లో ఏ చిక్కులు వుండవు .మాటలను అత్యంత సమర్ధం గా ప్రయోగించే నేర్పు ఆయనది .ప్రతి కధ పాడి కుండ లానిమ్డు గా వుంటుంది మధించాలే . కాని అద్భుత మైన వెన్నా ,నెయ్యి లభిస్తాయి .అదో ప్రపంచమే .అందులో ప్రవేశించ గానే మనల్ని మనం మరచి పోతాం .కధ అయిపోయిందని పిస్తూనే ముందుకు సాగుతుంది .ఎలా మొదలు పెడతారో ,అలాగే అంత గొప్ప గా ముగిస్తారు .ఏ రచయితకు ఇంత భావ పుష్టి వున్నట్లు అనిపించదు .ఏ ఇజం వుండదు .ఏ స్లోగాన్ను పెన్ను గన్నుకు ఎక్కించాడు సాదా సీదా,ఆశా మాషీ గా సాగిపోతూ ,అడుగడుక్కు వెనక్కు చూసుకొన మనే హెచ్చరిక లాంటి హితోపదేశం కధల్లో కన్పిస్తాయి .జీవితం కన్పిస్తుంది .అందులో బాధలు ,కలిమి లేములు స్పష్టం గా కపిస్తాయి .గొప్ప వాడి పై ద్వేషం కాని ,లేమి వానిపై అసహ్యం కని కన్పించవు .ఆ రెండు అంతస్తులు సారి సమానం కావాలనే భావన వ్యాప్త మావు తుంది .ఇలపై గొప్ప సాంఘిక విప్లవం వస్తుందనే ఆశా రేఖ గోచరిస్తుంది .ఆ విప్లవం ”చంపు ,నరుకు ”అనే తీవ్ర వాదం కాదు .గాంధీ మార్గం .అహింసాయుతం .శాంతి యుతం .మనసు లో పూర్తిగా మార్పు రావాలని భావం ఆయనది .అందుకు తగిన విధం గా కధనం వుంటుంది .ఆంతరంగికం గా మార్పు రానప్పుడు సామాజిక మార్పు తేవటం భగీరధ ప్రయత్నమే నన్న భావం ఆ కధల్లో కన్పిస్తుంది .మనసు మారితే అది శాశ్వత మార్పు అవుతుంది .ఆ విలువలు కల కాలమ్ నిలుస్త్సాయి .హంగామాతో ,మాటల గారడీతో ,వచ్చే మార్పు తాత్కాలిక మైనదే .ఈ దృక్పధం రాజా రాం కధ లన్నిటి లోను దృగ్గోచరమవుతుంది ముద్దబంతి పూల వంటి మాటలనే ఆయన ఉపయోగిస్తారు .కొరడా ఝాలిపిమ్పులుండవు .కదా మార్గం లో వుమ్మేత్తలు ,జిల్లేళ్ళు కన్పించవు .అదొక రాజ మార్గం .హాయిగా నడవవచ్చు .గొప్పగా అనుభవం పొంద వచ్చు .మానసికం గా గొప్ప ఆనందాన్ని అనుభావిన్చచ్చు .కావ్యం లోనే కాదు కధలో కూడా ”రాసోవైసః ”అన్న సూక్తిని నిజం చేసిన మహా కధకుడు రాజా రాం .అందుకే ఆయన్ను నేను ”కుటుంబ కదాశ్రీ రాజా రాం ”అంటాను .. కధ చదివితే అనుభూతి మిగుల్తుంది .అది శాశ్వతం గా మనసు లో నిలిచి పోయి మళ్ళీ మళ్ళీ చదివింప జేస్తుంది రాజారం కధ రామాయణం లాగా ,భాగవతం లాగ .రాజారాం కధలను పారాయణం చేసే వారు ఆంద్ర దేశం లో కో కొల్లలు .ఏ విదేశీ భావ జాలం ఆయన పై పద లేదు .దేశీయ మైన కధ ,దాని బలం ,విభిన్నమైన శైలి ఆయన్ను రాయల సీమలో మట్టిలో మానిక్యాన్ని చేశాయి .అవి సజీవ చిత్రాలు .ఆ మాటల పోహలింపు ,వాక్య విన్యాసం ,గడుసు దనం ,అనుభవ సారం ఆయన్ను అంత ఎత్తులో నిల బెట్టాయి .ఆయనతో పోల్చటానికి ఏ ఇతర భాషా రచయిత మనకు కన్పించడు రాజారం కు సాటి రాజ రామే .కదా రాజా రాముడు ఆయన .నిసర్గ సుందర రచన .మాండలికాల జోరుండదు .అవసరమైన చోట వాటి వాడకం మానసిక ఆహ్లాదం గా వుంటుంది .పదాలు ఇబ్బంది పెట్టావు .హాయిగా తీయగా ,మల్లెల దొంతర లా మంచు చల్ల దనం లా,మంచి గంధం లా ,మధురసాయణం లా ,మానస్ తేలికగా ,సుందర దృశ్యం లా కధను రాయటం లో ,మధురం గా మలచటం లో ,మధు మధురం గా అంతం చేయటం లో ఇంటి పేరు సార్ధకం చేసు కొన్నారు మధురాంతకం . చిత్తూరు జిల్లా దామల చెరువు గ్రామం లో జన్మించి ఉపాధ్యాయ వృత్తిలో జీవితాన్ని సార్ధకం చేసు కోని ”దామల చెరువు అయ్యవారు ”గా లబ్ధ ప్రతిస్తులు .కేంద్ర సాహిత్య అకాడెమి వీరి కూన లమ్మ కోన ”కదా సంపుటికి పురస్కారం లభించింది 1996 జనవరి 14 న జీవన సాఫల్య పురస్కారాన్ని అప్పజోస్యుల విష్ణు భొట్ల ఫౌండేషన్ వారు రాజా రాం సాహిత్య కృషికి అందజేశారు .మానవ సంబంధాలను ప్రధానం గా దృష్టి లో పెట్టుకొని కధలు రాసిన మహా రచయిత ఈ మట్టి మనిషి మధురాంతకం రాజా రాం. .మూడేళ్ళ క్రితం తిరుపతి నుంచి కాణిప్పాకం వెళ్తుంటే దామల చెరువు గ్రామమ్ కన్పించింది చెరువు నిండా తామరపూలే తామరల చెరువు దామల చేరు వు అయిందేమో నని పించింది మనసారా అయ్య వారు ఆహ్వానిస్తున్నార నిపించింది .చెరువే రాజారాం గారు అనుకోని మనసులో నమస్కారం చేసుకుంటూ ముందుకు సాగాము .ఆయన కధలు తామరపూలు లా ఆకర్షిస్తాయి ,మానసిక వికాసం ఇస్తాయి .పద్మం వికసనానికి చిహ్నం .అయ్య వారి కధల్లో ఆ వికసనం విస్పష్టం గా కన్పిస్తుంది .జై రాజా రాం . మీ గబ్బిట దుర్గా ప్రసాద్ 08 -06 -11 .

Posted in రచనలు | 1 Comment

అస్పృశ్యత పై సమరం – మహాత్ముని కంటే ముండు మొదలైంది

    అస్పృశ్యత  పై సమరం 
                                                                         ————————–
భారత దేశం లో అస్పృశ్యత ఒక అంటూ వ్యాధి లాగా దేశాన్ని తార తరాలు గా పట్టి పీడిస్తోంది .వారికి సంఘం లో గౌరవం లేదు .పక్కన కూర్చొనే యోగ్యత నివ్వ లేదు .దేవాలయ ప్రవేశం లేదు .అందరు దీన్ని రూపు మాపాలని అనుకుంటున్నా ముందుకు వచ్చిన వారు బహు కొద్ది మంది మాత్రమే .గాంధిజీ ఏ దీన్ని గురించి ముందు ఆలోచించారు అని అంతా అనుకుంటారు . .కాదు అని తెలుస్తోంది ఆయన వల్ల ఆ ఉద్యమం ఊపు అందుకొంది ,అంతకు ముందే కవులు సంస్కర్తలు  గళం విప్పారు .కొంత కృషి చేశారు  ఆ వివరాలు తెలియ జేస్తాను
                 1906  వ సంవత్చరం లోనే దేశోద్ధారక కాశీ నాధుని నాగేశ్వర రావు పంతులు గారు కృష్ణా జిల్లా లో వారి స్వగ్రామ మైన ఎలకుర్రు లో హరిజనులకు స్వంత డబ్బులు ఖర్చు పెట్టి హరిజనులకు ప్రత్యెక మైన కాలనీ నిర్మించారు .హరిజనులకు ప్రత్యేల మైన ప్రాధమికస్కూల్ నిర్మించారు ..ఇంతే కాదు ఆ వూరి వారి స్వంత శివాలయం లోకి హరిజనులకు ప్రవేశం కల్పించి దైవ దర్శనం చేయించి గాంధి గారి కంటే ఆదర్శం లో ముందున్నారు .అప్పటికి ఇంకా గాంధి భారత రాజ కీయాలలో పూర్తి గ ప్రవేశించ లేదు .ఈ విషయాలన్నీ  ఈ నెల నాల్గవ తేది న మచిలీ పట్నం లో ఆంద్ర సారస్వత సమితి అధ్యక్షులు ,కవి కదా రచయిత నవలా కారుడు అయిన శ్రీ కొట్టి రామా రావు గారికి స్వర్గీయ కాశీ నాధుని నాగేశ్వర రావు గారి ”విశ్వ దాత ”పురస్కారాన్ని వారి మనుమడు శ్రీ కాశీ నాధుని నాగేశ్వర రావు గారు అందజేసిన సందర్భం గా ,బందరు లో వివిధ సంస్థలు  ఏర్పాటు చేసిన అభినందించినా సభ లో . .కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి ,విశ్లేషకుడు డాక్టర్ జి .వి .పూర్ణ చంద్ తెలియ జేశారు .అంతే కాదు పంతులు గారు ఆంధ్ర దేశం లో జన్మించటం వల్ల ఆయనకు రావాల్సినంత కీర్తి రాలేదని అదే బెంగాల్ లో జన్మించి ఉన్నట్లయితే గాంధీ గారికి బదులు పంతులు గారికే ”మహాత్మా ”బిరుదు లభించేది అని అన్నారు .ఇది కాదన లేని సత్యమే నని పిస్తుంది
                                  ఇంకో విషయం మీ దృష్టికి తెస్తాను .1909 లో నే స్వర్గీయ మంగి పూడి వెంకటేశ్వర శర్మ గాంధిజీ కంటే ముందు గా అస్పృశ్యుల పై స్పందించి కవిత రాశారు .అప్పటికి ఇంకా హరిజనులు అన్న పేరు వారికి రాలేదు .
        ”అందారు పుట్టిరి హిందమ్మ తల్లికి –అందారు ఒక్కటై వుండాలి సక్కంగా –కష్టమ్ములోచ్చినా- ,నిష్టూర మొచ్చినా –ఇష్టమ్ము గా నుండి కట్టూగా నుమ్దాము అందారూ –తమ్మూల మణి మీరు మామ్మూల జూడండి –అమ్మోరు దీవించి –ఐశ్వర్య మిచ్చేను ”అని గొప్ప సామాజిక స్పృహతో సంస్కరణాభి లాష తో శర్మ గారు ముందే స్పందించారు .
              శతావధాని వేలూరి శివ రామ శాస్త్రి గారు అస్ప్రుష్యులకు ఆలయప్రవేశం లేనందుకు బాధ పడుతూ గొప్ప కవిత రాశారు
                   ”కుక్కలు చూడ వచ్చునట -కోతులు చేతులు సాచి –భక్తి మై మ్రొక్కగా వచ్చు ,–చీమలు ముంగిట సాగిల బార వచ్చు ,–నల్ప్రక్కల నీగలున్ ముసర వచ్చును గాని –మనుష్య కోటిలో నేనొక్కడ నయ్య నేనిచట నుండగ రాదు గదా శివా ”అంటూ అస్ప్రుష్యుని ఆవేదనను తన వేదన గా వెలి బుచ్చారు .
               1943 లో చదల వాడ నరశింహం గారు ”మూడు కొట్లామ్ద్రులను తోడును గల్గి –దీనుడఅరుంధతి కుమారుండు –అస్పృశ్యతా దోష మంట గట్టి అది –పక్ష పాత సమేత భారత మాత ”అని ఆ తప్పు అంతా తల్లి భారత మాత దే నని ఆమెకే  దోషాన్ని  అంట గట్టారు   .
   రాష్ట్ర కవి, ప్రబోధకులు రాయ ప్రోలు సుబ్బా రావు గారు ”ప్రేమ వృత్తికి జగడాల భేద మేల —బ్రాహ్మణాగ్ర హారము నందు పవలు రేయి –విసరు పవనుమ్డు –కడ జాతి వీటి యందు –తాక లేక వీచునే -పక్ష తంత్ర జడిమ ?”అని ప్రశ్నించారు .వాయుదేవుడికి పక్ష పాతం లేదు అగ్రహారం లోను ,అస్ప్రుశులున్న చోట ఒకటిగానే వీస్తాడు మనుష్యులకే ఈ మాయ దారి భేద భావం అని దెప్పి పొడిచారు .
  బసవ రాజు అప్పా రావు గారు ”డబ్బు గలోడు దారికి రానీరు —ఈ గోరా మేమి ,ఈ నేర మేమి –మాల మాదిగలం –మనుషులం గామా ?”అని అస్పృశ్యుల తరఫున వకాల్తా పుచ్చుకొని వాదించారు ..
                   దేశం లోని ప్రష్టుత పరిస్థితిని చూసి ఆచార్య కొలక లూరి ఇనాక్ గొప్ప కవితలోతనభావాన్ని ఆవిష్కరిస్తూ దేశానికి ఎలాటి వాడు ప్రధాని అయి ఎలా పాలించి ఎలా దిగి పోవాలి అనేది  అద్భతం గా వర్ణించారు
    ”పైసా లేని వాడు –పైగా హరిజనుడు –ప్రధాన మంత్రి కా గలిగి  —అయిదేళ్ళు వుండి  -ఆపైన వదిలి –పైసా లేకుండా పాత మనిషి గా –బ్రతగ్గలిగిన నాడు -భారత దేశం బాగు పడ్డట్టు .”ఇది భారతీయులందరి ఆకాంక్ష .అది తీరు తుందని ఆశిద్దాం .
                                                                          మీ
                                                                         గబ్బిట దుర్గా ప్రసాద్ —–08 -06 -11
Posted in రచనలు | 1 Comment

ఇంటింటికి విద్యుత్ కేంద్రం

Posted in సేకరణలు | Leave a comment

శంకర్ బొమ్మలకొలువు

Posted in సేకరణలు | Leave a comment

మరణం లేని ముళ్ళపూడి మార్క్ -శ్రీ రమణ

Posted in ముళ్ళపూడి & బాపు | Leave a comment

ముళ్ళ పూడి వెంకట రమణ శతకం ——అబ్బూరి రామ కృష్ణా రావు

ముళ్ళ పూడి వెంకట రమణ శతకం ——అబ్బూరి రామ కృష్ణా రావు

1        ‘’పున్నామ నరక భయమున

కన్నా డొక గేస్తు పుత్రికా రత్నములన్

పన్నెండుగురు ను వరుసగా

విన్నావా ముళ్ళ పూడి వెంకట రమణ

 

2.     అన్నా తురుడై  తానొక

సన్నాసిని  బిచ్చ  మడుగా

సరిరా పోదామన్నాడని బిచ్చమడుగా

విన్నావా ముళ్ళపూడి వెంకట రమణా

 

  ఆరుద్ర కూన లమ్మ పదం 

 

౩.      కొత్త పెళ్ళాము వండు

గొడ్డు కారము మెండు

తీపి యను హజ్బెండు

వో కూన లమ్మా

 

 పూర్ణచంద్   వెలుగు రాగాలు

 

4.     “ దోమ తెరకి  ప్రాంతీయ తత్త్వం జాస్తి

బైట దోమల్ని లోపలి రానీయదు

లోపలి దోమల్ని బయటకు పోనీయదు

మధ్య లో దూరాడంటూ

నా పైన లోపలి దోమల దాడి

ఈ  “పక్క” నాది కాదా ?

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in ముళ్ళపూడి & బాపు | Leave a comment

ఆరుద్రాభిషేకం

                                         ఆరుద్రాభిషేకం 
                   ఒకసారి ఆరుద్రకు ఘన సన్మానం జరుగు తోంది వేదిక మీద విశ్వనాధ సత్యనారాయణ గారు వున్నారు ,ఆ ముచ్చట చూసి ”సాధారణం గా శివుడికి రుద్రాభిషేకం చేస్తారు .ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ”ఆరుద్రాభిషేకం ”అని అందరి హర్ష ధ్వానాల మధ్య ప్రకటించారట .
                       ఇంతకీ ఆరుద్ర ఆంటే ఎవరు? ఆరుద్ర ఆంటే ”సిల్కు పురుగు ”.అందులోని సిల్కు దనం ఆరుద్ర రచనల్లో మిల మిల మెరుస్తుంది .ఆరుద్ర ఒక నక్షత్రం పేరు కూడా .దాని తళుకు మినుకు ,కులుకు ,నైశిత్యం అతని రచనలలో ప్రతిఫలిస్తాయి .లక్ష రూపాయల విలువ చేసే తన స్వంత గ్రంధాలయాన్ని ”సుందరయ్య విజ్ఞాన భవన్ ” కు    అర్పించి తన కంటూ ఏమీ మిగుల్చు కోని వితరణ శీలి ,త్యాగి ఆరుద్ర .
                    లబ్ధ ప్రతిష్టులైన ఎంతో మంది ఆరుద్రను మనసార అభినందించారు .ఆ అక్షరాభినందన అభిషేక వైభవాన్ని చూద్దాం ”ఛందస్సు చేత ఇంత వెట్టి చాకిరీ చేయించు కున్న ఆధునిక కవి  ఆరుద్ర కంటే ఎవరూ లేరు ”.  ”ఆరుద్ర ఒక చైతన్య కిరణం ”.
 ”సాహిత్య రుషీ —నీ కలం పేరు కృషి —నీ బలం పేరు కుషీ   జోహార్ —–వ్యాసానందా ,–   వాక్యాక్షర శబ్ద భావ విన్యాసానందా  ప్రసానందా’ అంత్య ప్రసానందా  జోహార్ ”వెయ్యేళ్ళు  నీ ఎకాడెమీ -నడిపించు సుమీ ” అని బాపు ,రమణ తమ ప్రియ మిత్రుని కీర్తించారు .
”ఆస్తి ఆంటే భువనాలు ,జాగీర్లు ,ఫ్యాక్టరీలు బ్లాకు మనీ ,గిద్డంగులూ ,కాదు కనుక తెలుగు వాడి ఆస్తి ,భాగవతుల శంకర శాస్త్రి ”అంటూపొగడ్తల బొగడ పూల దండ వేశాడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ
”ఆధునిక కవిత్వం పై ఆరుద్ర ముద్ర చిరస్థాయి ”అని చెరిగి పోని ముద్ర వేశారింకొకరు .
”వంద ఎకాడెమీ లకు మారు పేరు –నడుస్తున్న ఎన్సైక్లో పీడియ ఆరుద్ర ”అన్నారు  ఆయన సాహితీ కృషి చూసి ఇంకొకరు పొంగి పోయి
”ఆంద్ర సాహిత్యం లో ఆరుద్ర చిరంజీవి ”అని అతని సాహిత్యము ,అతను అమరం అనే భావం తో వేరొకరు
 ”పద్యం ,గేయం ,పాట అన్నీ సమాన ప్రతిభ తో వ్రాసిన శిల్పి ”అనీ ”స్నేహ శీలి ,చమత్కారి స్వంత వ్యక్తిత్వం వున్న మహా మనీషి ”అని శ్లాఘించిన వారున్నారు .
  ‘ఆకాశం వున్నాన్నాళ్ళు ,ఆరుద్ర నక్షత్రం వుంటుంది .ఈ కాలమ్ వున్నన్నాళ్ళు ఆరుద్ర సంతకం అలానే వుంటుంది ” అన్నాడు సిరి వెన్నెల సీతా రామ శాస్త్రి  చంద్రుని వెన్నెల వుమ్దేంత కాలము    ఇది సత్యం
   ”ఆరుద్రకు ఆంద్ర లోకమే రుణ పడి వుంటుంది ”అనికితాబు ఒకరిస్తే ”ఒకే ఒకడు ఆరుద్ర ”అన్నది ఆంద్ర ప్రభ అతని సాహితీ ప్రభకు జీజీ లు పలుకుతూ .
”  versatile writer ” /’.అని పొంగిపోయారు ఇంకో   అభి మాని .
”ఒక శ్రీ శ్రీ ,ఒక రావి శాస్త్రి ,ఒక విశ్వ నాద లా ఒక ఆరుద్ర ఒకే ఒక ఆరుద్ర ..”అని బేరీజు వేసిన విశ్లేషకులు ఇంకొకరు .
 ”సాహితీ రంగం లో అందరు చేసిన వన్నీ ఆరుద్ర చేశాడు .కానీ ఆరుద్ర చేసినవన్నీ అందరూ చేయ లేదు ”అని అతని సాహితీ విశ్వ రూపాన్ని ఒక్క వాక్యం లో తేల్చి చెప్పారు మరో విశ్లేషకుడు
”కవిత లోన వేయిటు ,పరిశోధనకు లైటు –అన్నిటా హైలైటు  వో కూనలమ్మా ”అని గ్రేట్ గా గుర్తించారు ఆచార్య యెన్ .గోపి .ఇది నిజం గా చాలా  వెయిటే .’
”ఒకే కాలమ్  లో గుండెలో కవిత్వాన్నీ  ,గొంతు లో పాటనీ ,మస్తిష్కం లో పరిశోధనా పండించు కుంటూ ,ఆసాంతం జీవించిన ”సాహితీ త్రిమూర్తి స్వరూపం ‘ఆరుద్ర ”అన్న మాట కోట్లకుదీటైన  మాట ..
                              ఇన్ని రూపాలుగా విస్తరించిన ఆరుద్ర బహుముఖ వ్యక్తిత్వం ,సహస్ర ధార కల ఇంద్రుని వజ్రాయుధమే .అందుకే ఆయన్ను ”ఆరు రుద్రులు ”ఆంటే అదిచాలా చిన్న   మాటే అవుతుంది .”ఏకాదశ రుద్రులు ”అన్నా చాలదు . శైవ ఆగమం లో ”శత రుద్రీయం ”వుంది ‘అదీ సరిపోదని నాకు తోచింది .కనుక నేను ”శత మహా రుద్ర -ఆరుద్ర ”అని ఆ మహా మనీషికి, ఆ శేముషికి నమస్కరిస్తాను వినమ్రం గా .
  ”  ఎదగ  డాని కెందుకురా  తొందర ”అని హెచ్చరించిన ఆరుద్ర  తన చుట్టూ మరుగుజ్జు భావాదిపతున్న కాలమ్ లో అందరి కంటే తొందర పడి బాగా ఎదిగి పోయి ,దుర్నిరీక్షుదు అయినాడు .ఆ శ్రమ లో అలసట లో ,బడలికతో ,ఆరోగ్యం కోల్పోయి ,శాశ్వతం గా చదువుల తల్లి సరశ్వతి ఒడిలో ఒదిగి చంటి పిల్లాడిలా నిదుర పోయాడు  .ప్రభుత్వం పట్టించు కొక పోయినా ,అభిమానులు లక్షలు పోగు చేసి కిడ్నీ   చికిత్చ చేయించి రుణాని తీర్చుకున్నారు  .ఆ నిరంతర పరిశీలన పరిశోధనా వర్తికి ,సాహితీ విశ్వరూపునికి ఇదే నా అక్షర నివాళి ..
                   మహారచయిత, కవి ఆరుద్ర పై ఇది చివరి వ్యాసం ”
                                              06 -09 -98  న ఉయ్యూరు సాహితీ మండలి లో ఆరుద్ర మరణం తర్వాత నేను ”[ఆరుద్ర శత మహా రుద్ర ” అన్న పేరు తో చేసిన అక్షరాభి షేకమే ఈ వ్యాస పరంపర .
                                                                                      మీ
                                                                              గబ్బిట దుర్గా ప్రసాద్ 
                                                                                05 -06 -2011
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in రచనలు | Leave a comment

ఆంధ్రప్రదేశ్ కు పేరు పెట్టినది ఈయనే – శ్రీ పాగ పుల్లారెడ్డి

ఆంధ్రప్రదేశ్ కు పేరు పెట్టిన తెలంగాణా నాయకుడు శ్రీ పాగ పుల్లారెడ్డి

Posted in సేకరణలు | 1 Comment

రెండవ కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రపంచ రచయితల మహా సభలు ఆగస్ట్ 13 ,14 ,15

జాల బంధువు లకు

                                 కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో విజయవాడ లో ఆగస్ట్ 13 ,14 ,15  తేదీలలో ”రెండవ ప్రపంచ రచయితల మహా సభలు ”అత్యంత వైభవం గా   నిర్వహింప బడుతున్నాయి .మీరు మీ సాహితీ మిత్రులు  ,దీనిలో పాల్గొని విజయవంతం చేయ వలసినది గా ఆహ్వానం పలుకు తున్నాం .రిజిస్ట్రేషన్ రుసుము 300 రూపాయలు ముందుగా కృష్ణా జిల్లా రచయితల సంఘానికి పంపి మీ పేరు రిజిస్ట్రేషన్ చేయించు కోవలసినది గా అభ్యర్ధిస్తున్నాం   దీనితో జత జేయబడిన ఆహ్వాన పత్రికను సాకల్యం గా అధ్యయనం చేయ ప్రార్ధన .
                                                                                                                             భవ దీయుడు 
                                                                                                                     గబ్బిట దుర్గా ప్రసాద్
                                                                                                                             05 -06 -20011
Posted in సభలు సమావేశాలు | 1 Comment

సరసభారతి ప్రగతి

సరసభారతి ప్రగతి
సరసభారతి జరిపిన కార్యక్రమాలు మీకోసం
వరుస సంఖ్య

 

తేది / వారం

 

కార్యక్రమం

 

ముఖ్య అతిధి

 

వేదిక

01 24-11-2009 మంగళ వారం సంగీత విభావరి శ్రీమతి సింగరాజు కళ్యాణి శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
02 22-12-2009 మంగళవారం శ్రీ కృష్ణ తత్త్వం శతావధాని డా. శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
03 05-01-2010 మంగళ వారం త్యాగరాజ స్వామి ఆరాధన శ్రీమతి జోస్యుల శ్యామల దేవి శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
04 27-01-2010బుధవారం వందేళ్ళ తెలుగు కద శ్రీ నండూరి రాజ గోపాల రావు (చినుకు పత్రిక సంపాదకులు) ఫ్లోరా హై స్కూల్
05 21-02-2010 ఆది వారం సుగమమైన తెలుగు పాట శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ (స్టేషన్ డైరెక్టర్ అల్ ఇండియా రేడియో ) శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
06 14-03-2010 ఆదివారం శ్రీ వికృతి ఉగాది మహా కవి సమ్మేళనం శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ (మాజీ మంత్రి)  శాఖ గ్రంధాలయం(A.C. Library)
07 24-03-2010మంగళ వారం శ్రీ రామ తత్త్వం శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
08 13-04-2010మంగళ వారం అన్నమయ్య పద కవిత డా. తుమ్మల శ్రీనివాస రావు శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
09 18-05-2010 మంగళవారం శ్రీ శంకరాచార్య జయంతి శ్రిమతి మాదిరాజు శివ లక్ష్మి శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
10 07-06-2010 సోమ వారం శ్రీ మద్ రామాయణంలో ఆంధ్రయణం శ్రీ స్వర్ణ రాజ హనుమంత రావు శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
11 27-06-2010ఆదివారం పురాణాలు కావ్యాలు నేటి సమాజం డా. మడక సత్యనారాయణ శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
12 24-07-2010  శని వారం కధా సదస్సు శ్రీ నండూరి రాజగోపాల్ & శ్రీ గుత్తికొండ సుబ్బారావు AG & SG SIDDHARDHA DEGREE COLLEGE
13 17-08-2010మంగళ వారం తెలుగు కావ్యాలలో ఉదయస్తమయాలు శ్రీ పెదపోలు విజయ సారధి & శ్రీ నారాయణం శ్రీనివాస మూర్తి శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
14 26-09-2010ఆదివారం పుస్తకావిష్కరణ వేడుక శ్రీ వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ (M.L.C) శాఖ గ్రంధాలయం(A.C. Library)
15 26-10-2010ఆదివారం చితికే సాహిత్యం శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
16 23-11-2010మంగళ వారం శ్రీ శివ తత్త్వం –  శ్రీ నాదుడు శ్రీ యల్లాప్రగడ వెంకట రామ రాజు శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
17 02-12-2010 బుధ వారం ఉయ్యూరు ఊసులు ఆవిష్కరణ డా. జి.వి. పూర్ణచంద్  & సి.హెచ్. వి.వి.కే. రాజు V.R.K.M SCHOOL AUDITORIUM
18 24-01-2011సోమ వారం త్యాగరాజ ఆరాధన శ్రీమతి జోస్యుల శ్యామలా దేవి శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
19. 25-01-2011మంగళ వారం హాస్యం త్యాగరాజ కృతి నీరాజనం శ్రీ దండిభట్ల దత్త త్రేయ శర్మశ్రీమతి కాలిపత్నపు  ఉమ శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
20 08-02-2011మంగళ వారం తెలుగు పౌరాణిక చలన చిత్ర వైభవం శ్రీ పొన్నాడ సత్య ప్రకాశ రావు శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
        21. 26-02-2011 శనివారం అక్షర నివాళిముళ్ళపూడి రమణకు శ్రీ గుంతక వేణుగోపాల్ రెడ్డి శాఖ గ్రంధాలయం(A.C. Library)
22 13-03-2011 ఆది వారం శ్రీ అన్నప రెడ్డి సన్మాన సభ శ్రీ అన్నప రెడ్డి వెంకటేశ్వర రెడ్డి శాఖ గ్రంధాలయం(A.C. Library)
23 27-03-2011 ఆది వారం శ్రీ ఖర ఉగాది అనురాగ కవి సమ్మేళనం డా. రావి రంగా  రావు శాఖ గ్రంధాలయం(A.C. Library)
24 12-04-2011మంగళ వారం శ్రీమత్ రామాయణం శ్రీ గుడిసేవ భాస్కర రావు శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
25 25-05-2011 బుధ వారం రామాయణం లో ఆయుర్వేదం డా. దీవి చిన్మయ శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
26 26-05-2011 గురు వారం శ్రీ హనుమత్ వైభవం శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)
27 27-05-2011శుక్రవారం శ్రీ హనుమాన్ చాలీసా మహిళా భక్త బృందం శ్రీ సు. స్వామి దేవాలయం (మహిత మందిరం)

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

స్వర్గీయ ఏం.ఎస్ సుబ్బు లక్ష్మి కి ”స్మృతి గీతం ”

స్వర్గీయ ఏం.ఎస్ సుబ్బు లక్ష్మి కి ”స్మృతి గీతం 

                                                                     ———————————————————-
                      తన గానాన్ని భగవదర్పితం చేసి ,స్వర రాగ రంజితం తో ప్రపంచాన్ని పరవశింప జేసి ,మధుర ,మంజుల గాత్రం తో సమ్మోహన పరచి ,భారత దేశానికి సాంస్కృతిక రాయ బారి గా నిలిచి భారత రత్నమైన సంగీత రత్నం స్వర్గీయ ఏం.ఎస్ .సుబ్బు లక్ష్మి .ఆమె పరమ పదించినా ఆ  పద మంజీరాలు వినిపిస్తూనే వున్నాయి .సంగీత రసజ్ఞుల హృదయాలలో శాశ్వతం గా నిలచిన ఆ సంగీత మహా సామ్రాజ్ఞి మరణించటం జీర్ణించు కో లేని అభిమానులు ,ఆమె స్వంత రాష్ట్రం లో కూడా చేయ లేని అపూర్వ స్మృతి గీతం ను ప్రచురించి ,సహృదయ స్పందనను ,అభిమానులకు అందించారు .ఇందులో ముఖ్య పాత్ర దారి ,కృష్ణా జిల్లా విస్సన్న పేట వాస్తవుడు ,ఆకునూరు వారి అల్లుడు ,నాగార్జున సాగర్ లో ఇంజనీరింగ్ డిపార్టుమెంటు లో ఆఫీసు superintendent  శ్రీ లకుమా అని పిలువ బడే బూదేస్వర రావు .నిన్న సాయంత్రం మా ఇంటికి వచ్చి ఆ పుస్త కాన్ని నాకు ఇచ్చారు .ఆయన మంచి కవి ,”రజనీ- కుందుర్తి అవార్డు ”గ్రహీత .సుబ్బు  లక్ష్మి ఫౌండేషన్ స్థాపకులు కూడా .ఆమె 95  వ జయంతి జూలై లో వస్తోంది .ఆ నాడు సమగ్ర మైన సుబ్బు లక్ష్మి జీవిత చరిత్రను వెలువరించే పనిలో వున్నట్లు చెప్పారు లకుమ ను .హార్ధికం గా అభినందించాను .అంతే కాదు షహనాయి మాస్ట్రో ,భారత రత్న బిస్మిల్లా ఖాన్ స్మృతి గీతం కూడా త్వరలో రాబోతోందని మంచి కబురు తెలియ జేశారు .వారి అకుమ్తిట దీక్షకు     ,కార్య దక్షతకు అభినందన శతం .
                                       ఇప్పుడు ”స్మృతి గీతం ”;;లోని విశేషాలను తెలియ జేస్తాను .భారతీయ మూర్తి మత్వాన్ని తన నడకలో ,ఆహార్యం లో ,స్వర ,రాగ గానం లో మేలవించుకొని చూడం గానే రెండు చేతులు ఎత్తి మనసార నమస్కరించాలనే భావన కలుగుతుంది .భారతేయ మహిళా స్వరూపానికి ఆమె నిలు వెత్తు అద్దం ‘.ఈ భావాన్ని ప్రతిబింబించే చక్కని చిత్రాలు ఈ పుస్తకం లో పొందు పరిచి అందరికే ఆనందం కల్గించారు .ఆమె మరణానికి బాష్పాంజలి ఘటించిన వారి కవితలు మనో భావాలు ఇందులో  పొందు పరిచారు .ముందున్న ముఖ చిత్రం లో ఆమె తన్మయ స్థితి లో పాడుతున్న అద్భుత రంగుల ఫోటో చిరస్మరణీయం గా వుంది .చివరి ముఖ చిత్రం రెండు చేతులు కలిపి నమస్కరిస్తున్న ఫోటో” గానానికి, లోకానికి ఇంక సెలవు ”,అన్న భావన కలిగించి కన్ను చెమరిస్తుంది .లకుమ గారి ఎడిటింగ్ కు అభినందనలు .
                                      మాజీ రాష్ట్ర పతి ,యువజన స్ఫూర్తి దాత భారత రత్న అబ్దుల్ కలాం సుబ్బు లక్ష్మి ని స్మరిస్తూ ఆమె వషంత యామిని అనీ ,అలనాటి తాన్సేన్ ను స్ఫురణకు తెచ్చిందని అంటారు .ఆమె కాల పురుషుడు బహూకరించిన కమనీయ బహుమతి అని కీర్తించారు .సర్వేశ్వరున్నే సంగీతం తో విభ్రం చెందించిన విదుషి అని మన సార ”గీతాంజలి ”గేయం లో అభి వర్ణించి ,నివాళు లర్పించారు .
                               ప్రతి భార్య వెనక ఒక భర్త ఉంటాడని ,ఆమె అభ్యుదయానికి సకల సహకారాలు అందించిన ఆమె భర్త” కల్కి ”అనే సదాశివం గారిని ప్రస్తుతించారు లకుమ 
.”ఆమె పాడక పోతే దేవుళ్ళకు కూడా తెల్ల వారదు ”అన్న గీతం లో ఈ భావాన్ని అత్యద్భుతం గా పలికించారు .ఆమెను” మెలోడి సబ్ lime  ”అన్నారు .తనకి తనే కాదు మనలోకీ తొంగి చూడ గల కమనీయ స్వరం అని .సంగీతాని ఊగించి ,శాసించి పాలించగల అసామాన్య ప్రావీణ్యం వున్న మహా విద్వాంశు రాలని మెచ్చారు .”బతుకు డొల్లను పూరించే స’జీవ’స్వరం అనటం ఆయనకే చెల్లింది ”నేను సుబ్బు లక్ష్మి సమకాలికున్ని ”అనే ఒకే ఒక్క వాక్యం తో దేవుణ్ణి గెలిచాను అని లకుమ మినీ కవితలో మెగా భావాన్ని పోదిగాడు .
                     డాక్టర్ భూసుర పల్లి వెంకటేశ్వర్లు ”friend of pleasure ”కవితలో  ఏం.ఎస్ ను రాధ చేతి లోంచి ద్వాపరం లో జారి పోయిన వేణువు అని ,ఆమె లేని ప్రపంచం పక్షు లేగిరి పోయిన గూడు లా వుందని ,ఆమె ఆధునిక మీరా అని భక్తి భావంతో అంజలి ఘటించారు .నన్నపనేని రాజకుమారి ఆమెను ”సంప్రదాయ మూర్తి నీవు ,సంగీత సామ్రాజ్య కీర్తి నీవు ”అని చెమ్మగిల్లిన కన్నులతోఅంటారు ”.గళ దేవత ” కవితలో చిల్లర భవానీ దేవి ”ఉదాత్త మృదు మధుర భక్తీ సంకేతాన్ని  –నాద మయం గా దర్శనం చేయిన్చిందనీ ,ప్రతి ఇంటి సుప్రభాతం     గా వెలిగిందనీ , మానవతా సంగీతాన్ని విన్పించిన మనస్విని అని    హృదయ పూర్వక నివాళు లందించి భవానీ మాత గా  ఈ జాతి అంతా ఆమెకు రునగ్రస్త  శ్రోతలే  నని     మన రుణాన్ని      గుర్తు     చేయటం   తో పాటు  శిరసు వంచి జోతలర్పించారు .
                                     ”జ్ఞాన రస సంగీత కర్మిని  ”అని లలిత సంగీత మధుర వాణి అని ,శ్రవణ పేయ అమేయ రసధుని అని ధ్వని తరంగాల రస రాణి  అంటూ ఆమె మరణ వార్తకు సంగీత వల్లి తల్లడిల్లిందని  కలత చెందారు కానూరి వెంకటేశ్వర రావు .నటుడు ఏ .వి ఎస్ ”సదా వెంకటేశం స్వరామి స్వరామి ”వచన రచనలో ”నా దేశం సంగెత భారత ప్రధానిని కోల్పోయింది .ఏం అనే మాధుర్యాన్ని ,ఎస్ అనే సుస్వరాన్ని ఆమె ఇంటి పేరు గా మార్చుకొంది .మా కోసం మళ్ళీ రా అమ్మా .  నువ్వొస్తే దేవతలంతా వస్తారు .నువ్వు కావాలి నీ పాట కావాలి .అందుకోసం మా మనో శ్వేత పత్రాలపై నూరు కోట్ల చే వ్రాల్లతో దేవతలకు దరఖాస్తు చేసు కుంటాం .నా  దేశం లో వో కాశ్మీరం ,వో స్వర్ణ దేవాలయం ,వో తిరుపతి క్షేత్రం ,వో సుబ్బు లక్ష్మి గాత్రం ”మాత్రమే వున్నాయని ఆమెకు భారతీయులకు వున్న సంగీత స్మరణీయ  వైభవ సత్ సంబంధాన్ని స్పష్టంగా తన శైలి లో చెప్పారు ఏ ,వి ఎస్ .
                 ”నిద్ర లేచిన దేవుడు సైతం –తలచుకొనే తొలి నామం ఏం .ఎస్ అని ,ఇప్పుడు కచ్చేరీలలో ”కల్యాణి ”విన్పించటం లేదని ,హృదయ లిపి లో ఒక గీతం శోక మూర్చనలు పోతూ తాళం వేస్తోందని ”తొలి నామం ”లో ఈత కోట సుబ్బా రావు బాధా తప్త హృదయం తో ఆవేదన చెందారు .మొహమ్మద్ ఖాదర్ ఖాన్ ”పునరపి  జననం  పునరపి మరణం –పదే పదే పాడే నీ పాట కోసం నువ్వు మళ్ళీ వెంటనే రావాలని        ఆశిస్తూ       ఆకాంక్షిస్తూ   శోకిస్తున్నాం తల్లీ ”అని ఆమెను పునః జన్మించమని  వేడు కొన్నారు         .స్వరాలమ్మ అని ఎల్ కే సుధాకర్   ఆంటే అమరగాన సరస్వతి అని ఏం వి అప్పారావు అన్నారు యి రఘు ”మల్లె పూలు ,మట్టి గాజులు  ”కవితలో ఆమెకు అవే ఇష్టమని ,అసలైన మట్టి మనిషని మెచ్చారు ,.కవి ,రచయిత నట దర్శకుడు భరణి ”ఆమె భారత ధాత్రి గౌరవ పతాకాన్ని –భూగోళం మీద పాతిన త్రివర్ణ గాత్రి –ఆమె సాక్షాత్తు వర వీణా మృదు పాణి ” అని సంగీత స్వరార్చనతో ఘన నివాళు లిచ్చారు . ”ఆమె పాటలపూదోట  లో   పూచిన ముకుందమాల -నిత్య నూతనం గా గుబాలిస్తుందని  భక్తి కుముద మాల వేసారు . ”పాటల పాల వెల్లి ” లో ప్రముఖ కవి శిఖామణి . .”సాధన చేసి చేసి -పరమపద సోపానానికి –చివరికి —గొంతునే సాధనం గా మలచుకున్దామే ”  అంటూ ఆమె పాట ఆపాత మధురం -అజరామరం -వెన్నెల కోయిల మల్లె పూవు  పసిపిల్లల నవ్వు ఉన్నంత కాలమ్ అని మురిసి పోయారు అక్షర మణి నీరాజనమందించారు శిఖా మణి .ప్రఖ్యాత సితార్ విద్వాంశుడు రవి శంకర్ తనకు తెలిసిన ఆమెను స్మరిస్తూ అహంభావం లేనిదని ,వినయ విధేయతలు ఆమె ఆభారణాలని .సంగీతాన్ని ఆమె లాగా ఆధ్యాత్మిక స్థితి కి తీసుకు వెళ్ళ గలిగిన సంగీతజ్ఞుడు తనకు ఇంత వరకు తారస పడ లేదని ,ఆమె దైవత్వం మూర్తీభవించిన సంగీత విద్వన్మని అన్నారు .భర్త  చేసే  దాన ధర్మాలను చూసి ఆయన్ను సదా” గివం” –ఆంటే ఎప్పుడూ ఏదో ఒకటి అవతలి వారికి ఇచ్చే వాడు అనే వారట సరదాగా .  .అమెది అన్ని శైలుల కంటే అతీత మైనదని గళం నిజంగా అద్వితీయమిందని ,చాలా లోతు గా పరిశుద్ధమైన భావోద్వేగం తో నిండి ఉంటుందని నిండు మనసుతో స్మృత్యంజలి ఘటించారు రవిశంకర్ నిజం గానే ఆయన సంగీత పండిట్ కదా .
                                 ఇవి కాక బాల మురళి ,జేసుదాస్ ,పట్టమ్మాళ్ ,సుశీల ,వైజయంతి మాల మున్నగు వారంతా ”ఆ గానం మధురామృతం ” అని మనస్ఫూర్తి గా జే జే లంద జేశారు .చివరలో ఆమె జీవితం లోని వివిధ ఘట్టాలను ”మైలు రాళ్ళు ” గా నిలిపారు ..       ఏం .ఎస్ అంత    అందంగా     ఆమె గాత్రమంత  పరిశుద్ధం గా           ,ఆమె గానం అంత       పవిత్రం   గా  ,,,ఈ స్మృతి గీతాలను  ఆంటే elegy  , లను  ఘన నివాళిగా ఆమెకు అందజేసిన ”లకుమ ;;గారిని మన సార అభినందిస్తున్నాను . .మన జాతి మణి దీపాలై ,మనల్ని సంస్కృతీ సుసంపంనులను చేసిన మహాను భావు లందరికి ఇలాంటి నీరాజనాలు మనం అందించాలి ..లకుమకు సహకరించిన వారందరినీఅభినందిస్తున్నాను     ఇది నిజం గా  అందరు గళం కలిపిన’ ‘ స్మృతి స్వరమే ” .
                                                                                                                         మీ
                                                                                                                    గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in రచనలు | 1 Comment

ఆ” రుద్రునికి ”ఇంకో రుద్రం ”

ఆ” రుద్రునికి ”ఇంకో రుద్రం ” —————————————————————–

కవన రుద్రుడు ,నిత్య ప్రయోగ శీలి ,బహుముఖ ప్రజ్ఞా శాలి అయిదు దశాబ్దాలు సాహిత్య క్షేత్రాన్ని సుసంపన్నం చేసి ,73 మూడవ ఏట అలసి ,సొలసి ,దీర్ఘ నిద్ర లోకి జారు కున్న వాడు ఆరుద్ర అనే భాగవతుల సదా శివ శంకర శాస్త్రి .౭+౩=10 సంఖ్యా శాస్త్రం లో. వందా పూర్తి అయినట్లే . శ్రీ రంగం శ్రీని వాస రావు వైష్ణవ నామం .శంకర శాస్త్రి శివ నామం ..మేన మామ ,మేనల్లుడు విష్ణు ,శివ రూపాలుగా వెలిగి ,”త్వమే వాహం”ఆంటే నువ్వే నేను అనిపించుకున్నారు .బాంధవ్యం ,స్నేహం ,అపూర్వం .శ్రీ శ్రీ తర్వాతా పేర్కొనదగిన స్థాయి సంపాదించి ఆరుద్ర మామకుతగ్గ అల్లుడైనాడు .మహా ప్రస్తానం తర్వాత పేర్కొన దగిన రచన ”త్వమేవాహం ”.ఆధునిక మహా కావ్య త్రయం లో త్వమేవాహం ఒకటి .మొదట్లో శ్రీ రంగం నారాయణ బాబు ,శ్రీ శ్రీ పురిపండా ,పఠాభి ల ప్రభావం బాగా వున్నా ,క్రమం గా అందులోంచి జారి ,స్వంత గొంతుక తో ,స్వీయ వ్యక్తిత్వం తో ,మహాకవుల స్థాయికి ఎదిగిన వాడు ఆరుద్ర తెలంగాణా నేపధ్యం గా ”త్వమేవాహం ”రాశాడు ఆరుద్ర . యే నాటి తెలం గాణా కాదు .పొరపడ కండి .నిజాం నిరంకుశత్వాన్ని నిర్భయం గా ప్రత్యక్షర శిల్పం గా మలిచాడు .పొట్టి వాడినా గట్టివాడైన దాశారదికి తోడై ,గట్టిగా గళం విప్పాడు .ఇదొక సింబాలిక్ రచన .టి ఎస్ .ఇలియట్ రాసిన వేస్ట్ లాండ్ లోని లక్షణాలన్నీ నిక్షిప్తం చేసి ”,ఆంద్ర ఇలియట్ ”అనిపించు కున్నాడు .అయితే దీనికి టీకా ,టిప్పణి ఉంటేనే బోధ పడుతుంది .అందుకే మొదటి ప్రచురణ జన రంజకం కాలేదు .తర్వాత దాశరధి తో చక్కని ఉపోద్ఘాతం రాయించి ప్రచురించాడు .అతడు నిజం గా ఆరుద్ర హృదయాన్ని అద్భుతం గా ఆవిష్కా రించాడు .readability కలిగించాడు .అప్పటి నుంచే త్వమేవాహం పాథక హస్తాలను ,మస్తకాలను అలంకర్న్చింది .oft quoted lines కు జీవం పోసింది .హరీన్డ్ర్స నాథ చట్టోపాధ్యాయ రాసిన ”తెలంగాణా విప్లవ గాధలు ” ఆరుద్ర త్వమేవాహం కు ప్రేరణ .దీన్ని ఆరు కధలుగా కూర్చి కదా కావ్యం చేశాడు .ఈ ప్రక్రియ లో ఇదే మొదటిది ఆరుద్ర మౌలికం గా ప్రయోగ వాది .ఆవేశం కంటే ఆలోచనతో కవిత్వం రాస్తాడు .చమత్కారం ,శబ్దాలంకారం ,భావ వ్యక్తీకరణకు తోడ్పడేతట్లు రాయటం ఆయన ప్రత్యేకత .ఖండ కావ్యాన్ని కదా సూత్రం తో బంధించి ,పెద్ద కావ్యం గా ప్రయోగం గా రాశాడు .అభ్యుదయ కవితా చైతన్యాన్ని మరో మలుపు తిప్పాడు .”technic లేని కవిత్వాన్ని నేను ఊహించలేను ”అంటాడు .అయితే ”ఆరుద్ర కవిత్వం టెక్నిక్ లో కూరుకు పోయింది ”అన్న వాళ్ళూ వున్నారు . ”ట్రెయిన్ లో స్టీన్ గన్ .లా చెట్లు ,చిట్టెలుకలు —-చేయిన్సులో మగాళ్ళు -చెరచ బడ్డ ఆడాళ్ళు —చెడ పురుగులు –మదమెక్కిన సోల్జర్లు ”అనటం ఆరుద్ర మార్కు కవిత్వం . పైథాగరస్ సిద్ధాంతాన్ని చక్కగా కవిత్వీకరించాడు ”.చిన్ని చీమలు వగైరా అడుగు భుజం అనుకోండి —బలవంత మైన సర్పం -గట్రా ఎట్ సేటేరా -లంబం అవదా మరి ?–రెండు విభిన భుజాలపై గల చతురశ్రాలలోని తమిశ్రం –థీసీస్ ,యాంటి థీసీస్ సుల మిశ్రమ -రెండు భిన్న పక్ష సంజ్ఞల పోరాటం –అనగా ఒక నూతన వ్యవస్థ ” ఆరుద్ర కవిత్వం చదివి ”ఇంకా నేను కవిత్వం మానేసినా ఫర్వాలేదు ”అని కితాబు ఇచ్చాడు శ్రీ శ్రీ తన ముద్దుల మేనల్లుడికి .ఆంగ్లం లోని క్రియ ను తెలుగు లో కూడా వెర్బ్ గా చేసి ప్రయోగించాడు . చెరిష్+ఇంచు=చరిషించు అనీ రన్ +అండి ==రనండి ,అలాగే ఆమెన్ -ఆమెన్ ఒక చోట మెన్ అనీ ఇంకోచోట ఆమె అనీ శ్లేష . గతం లోని మంచి ద్వారా వర్త మానం తీర్చి దిద్ది ,భవిష్యత్తు పై ద్రుష్టి కేంద్రీకరించిన ప్రతిభా మూర్తి ఆరుద్ర అందుకే శ్రీ శ్రీ అంటాడు సాహిత్యోపనిషత్ లో ” చూశావా ఆరుద్రా !సంప్రదాయం నిలిచే వుంటుంది హమేషా –మూడ్హాచారాలు మారుతూన్తున్నాయి నిజం -కాని –సంప్రదాయం తాత ముత్తాతల ధనం -జాతికి జీవ నాళిక —జాన పద గీతిక ” .ఇదే మహా కవుల జంట ద్రుష్టి తెలుగు సాహిత్యాకాశం లో శ్రీ శ్రీ ,ఆరుద్రలు సూర్య చంద్రులు . .. ఈ వరుసలో చివరి భాగం రేపు మీ దుర్గా ప్రసాద్

Posted in రచనలు | 1 Comment

అరిచే కుక్కలు కరుస్తున్నాయి !! – ఏ వి స్

Posted in సేకరణలు | 2 Comments

విశ్వ నాధ ను గురించి శ్రీ శ్రీ

విశ్వ నాధ ను గురించి శ్రీ శ్రీ

 మాటలాడే వెన్నెముక ,–పాట పాడే సుషుమ్న
                              నిన్నటి నన్నయ భట్టు –ఈ నాటి కవి సామ్రాట్టు
                              గోదావరి పలకరింత –కృష్ణా నది పులక రింత
                              కొండవీటి పొగమబ్బు —తెలుగు వాళ్ల గోల్డు నిబ్బు
                              అకారాది క్షకారాంతం –ఆసేతు మిహికావంతం
                              అతడు తెలుగు వాళ్ల ఆస్తి –అనవరతం తెలుగు నాటి ప్రకాస్తి
                              ఛందస్సు లేని ఈ  ద్విపద
                              ”సత్యానికి”నా ఉపద ..
                                              ఆ –స్థాన కవులు 
                                              ——————-
                               అవాచ్యం అయితే కొట్టండి చెప్పు దెబ్బ
                               ఆది ఆంద్ర ఆస్థాన కవి మటుకు చెళ్ళ పిళ్ళ
                               శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి ద్వితీయుడు
                               పురాణేతి హాసాల రచనకు అద్వితీయుడు
                               సంస్కృత బోధిని కాశీ కృష్ణా చార్యుడు
                               కవి కాక పోతేనేం గాని అయినాడు మూడు
                               వేయిపడగల విశ్వనాధ సత్యనారాయణ
                              అందరికీ మిన్న అయినా నాలుగో ఆయన
                              శరధి ఘోష డాక్టరు దాశరధి ఇప్పుడు
\                             ఆంద్ర దేశానికి ఆస్థాన కవి ”పంచముడు ;”
                                                                                                   రచన —–శ్రీ విరించి
                                     మహా    గాయకుడు మహావాది వెంకటప్పయ్య శాస్త్రీ        ————--రచన కరుణ శ్రీ 
                               ”బోణీ   మచేసెను తెల్గు  నాట రసమున్ పొంగారు బంగారు ,నీ
                                 బాణీ ,తేట తెలుంగు పాటలకు ,మేల్ బంగారు ,నిద్దా   జరీ
                                వోనీ వేయుట నేర్పే ,నీ సరిగామల్ ”వోకల్ ”కళా కన్యకున్
                                వాణీ సుందరి మేజు వాణి యోనరిమ్పం బోలు నీ నాల్క పై .”
                                           ”కమ్మని కాంత మెట్టి రసిక ప్రవరుల్ తలలూచి మెచ్చ గా
                                            నమ్మోనరించు ,నీ మధుర నాద మికన్ వినలేము మేము ,స్వ
                                            ర్గంమున నమ్మహేంద్ర సముఖంమున  ,ముప్పది కోట్ల దేవతల్
                                            సమ్మద మంద నింక కోన సాగును లే ,భావ దీయ గానముల్ ”.
                                                              ”మధుర గాయక ”కుంతి కుమారి ”లేక
                                                               నీడు కచ్చేరియ లేదు  నేటి వరకు
                                                               నీవు లేవన్న రాదు కుంతీ కుమారి
                                                               మెడ దిగి వత్త మన్న ఆ ”మెట్లు” లేవు .
                                                                                                                             ఈ పద్య మధువును సేకరించి నిక్షిప్త పరచి మీ కోసం అందించాను .
                                                                                                                             తని వార గ్రోలి ఆనందాను భూతిని పొందండి .
                                                                                                                                       మీ ———–దుర్గా ప్రసాద్
                                                                                                                                                   01 -06 -11

 

Posted in రచనలు | Leave a comment

సినీ వాలి — ఆరుద్ర మరో పార్స్వ్యం

ఆరుద్ర మరో పార్స్వ్యం 
                                                 సినీ వాలి 
            ఆరుద్ర వచన కావ్యాలలో పేరు పొందింది ”సినీ వాలి ”ఆంటే అమావాశ్య ముందు కన్పించే ”చంద్ర రేఖ ”.పార్వతీ దేవికి కూడా ఆ పేరుంది .ఎంత కటిక చీకటి ముందు వున్నా ,ఆశా కిరణం తోడు వుంటుంది ,నిరాశ పనికి రాదనీ ఇందులోని ధ్వని .ఈ పేరు ఈ కావ్యానికి పెట్టి సార్ధకం చేసిన వారు ప్రముఖ కవి కాటూరి వెంకటేశ్వర రావు గారు .ఆధునిక కవిత్వానికి మూల వస్తువూ ,స్ఫూర్తీ ఆర్తీ అన్ని తనే అయిన వాడు ,మనిషిని ,అతని వ్యధను యుగయుగాల పీడనను ,వచ్చే యుగం పట్ల ఆశను ,ఆకాంక్షను ,తన కవితా దృష్టి లో ప్రతిఫలింప జేయటం ఆరుద్ర ఆనవాయితీ .అందుకే ప్రయోజన వాది గా గుర్తింపబడ్డాడు .అభ్యుదయం అతని వాదం .మనిషే అతని నాయకుడు .అనుభూతి తో పాటు ,ఆలోచన వైపు మనిషినీ ,patha కుడినీ     నడిపించిన మహా కవి . ..సినీ వాలి నగర జీవితం పై వ్రాసిన గేయ కావ్యం ..విలక్షణ హీరో జగ్గయ్యకు అంకితమిచ్చి మామ అయాడు .మధ్య తరగతి క్లార్కు సూర్యారావు జీవిత చిత్రమే ఇది .కాంక్రీటు  అరణ్యాలు అయిన నగర ఘోష ..
                                                         ప్రక్రియా వైవిధ్యం 
                                                       ——————–
               ” ఇంటింటి పద్యాలు ”రాసి ప్రతి ఇంట్లో పాడుకోనేట్లు చేశాడు ఆరుద్ర .”గాయాలు -గేయాలు ”రాసి మనసు లోని బాధను వెళ్ళ గక్కాడు ..”విశ్వ నాద నాయకుడు ”చరిత్రను నాటకం గా మలిచాడు .అందరు స్త్రీ పాత్రలే వుండే నాటికలు రాశాడు .”ఆరుద్ర నాటికలు ”పరమ ప్రయోజనం కోసమే రాశాడు .అవి కాలక్షేపం బఠానీలు కావు .”సర్రియలిస్ట్ ”కవిగా రాణ పొందాడు కధకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు .”నేను చెప్పానుగా ”అనే కదా సంపుటి తెచ్చాడు .దేశీయ ఛందస్సు లో ‘కూనలమ్మ పదాలు ” ”రాసి అందర్నీ కొరడాతో ఝళిపించాడు .”పైలా పచ్చీసులు ”తో పరవళ్ళు తొక్కాడు .”వెన్నెల -వేసవి-”లతో చల్లదనం ,చంద్ర గాడ్పులు విసిరాడు .”అచ్చు తప్పులు ”రాసి కొత్త వరవడి సృష్టించాడు .ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి .”కొండంత మనిషి చ (క) నుమరుగైనాడు ”
                     ”anthropology  ”,  ప్రీ హిస్టరీ వ్రాసి పాత చరిత్రను తవ్వి తలకెత్తాడు .”ఆరుద్ర గళ్ళ నుడికట్టు ”సాహితీ ప్రియులకు గొప్ప కని కట్టు గా వుండేది .”స్థల నామాలు ”పై తీవ్ర పరిశోధన చేశాడు .”వ్యాస పీఠం ”రాసి ఆధునిక వ్యాసుడే అయాడు .”detective ”సాహిత్యం సృస్తించి ,నేర పరిశోధన లో కొత్త దనం ప్రవేశ పెట్టాడు .జర్నలిస్ట్ గా పత్రికా సేవ కూడా చేశాడు .”సమగ్రాంధ్ర చరిత్ర ”తో ఆరుద్ర సాహితీ విశ్వ రూపం మనకు దర్శన మిస్తుంది .అంతకు ముందే ”త్వమే వాహం ”కావ్యాన్ని తెలంగాణ నేపధ్యం లో రాశాడు .ఇది symbolic  రచన   .చదరంగం మీద ప్రత్యెక అభిమానం వుంది దాని లోతులు తరిచి పుస్తకం రాశాడు .’ఇంత విస్త్రు తం గా వైవిధ్యం గా తన సాహితీ జేవితాన్ని పండించు కొన్నాడు భాగవతుల సదా శివ శంకర శాస్త్రి అయిన ఆరుద్ర ..సిని పాటల మాటల రచయిత గా శ్రీ శ్రీ తో పాటు నిలబడ్డాడు .డబ్బింగ్ రచయిత గా మామకు తగ్గ అల్లుడని పించు కున్నాడు . తాను చే బట్టిన ప్రతి ప్రక్రియను సర్వాంగ సుందరం చేసి భళా అనిపించుకున్న ఆరుద్రను గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలే వుంటుంది ..మరిన్ని విశేషాలు మరోసారి .
                                                                                           మీ
                                                                                       దుర్గా ప్రసాద్
Posted in రచనలు | Leave a comment