వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.46 వ భాగం.25.11.25

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.46 వ భాగం.25.11.25

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.23 వ భాగం.25.11.25. Part -2

మహాకవి కాళిదాసు కుమార సంభవం.23 వ భాగం.25.11.25. Part -2

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.23 వ భాగం.25.11.25.

మహాకవి కాళిదాసు కుమార సంభవం.23 వ భాగం.25.11.25.

Posted in రచనలు | Leave a comment

కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి.1 వ భాగం.24.11.25.

కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి.1 వ భాగం.24.11.25.

కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి.1 వ భాగం.24.11.25.

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.13 వ భాగం.24.11.25. Part -2

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.13 వ భాగం.24.11.25. Part -2

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.13 వ భాగం.24.11.25. Part -2

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.13 వ భాగం.24.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.13 వ భాగం.24.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.13 వ భాగం.24.11.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.45 వ భాగం.24.11.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.45 వ భాగం.24.11.25.

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.22 వ భాగం.24.11.25.

మహాకవి కాళిదాసు కుమార సంభవం.22 వ భాగం.24.11.25.

Posted in రచనలు | Leave a comment

జీవన సాఫల్య పురస్కారం -2(చివరిభాగం )

జీవన సాఫల్య పురస్కారం -2(చివరిభాగం )

ఈ ఆగస్ట్ లో హైదరాబాద్ నుంచి శ్రీ తనికెళ్ళ భరణి ఫొన్ చేసి ‘’మీరు రాసిన వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి ‘’పుస్తకం ఎవరిదగ్గరో ఉంటే తీసుకొని చదివాను .అద్భుతం .మీకు నాపాదాభి వందనం ‘’ఆని మూడు సార్లు అన్నారు .ఇంతకంటే గొప్ప అవార్డ్ నాకు ఇంకేవరుఇస్తారు ఆని పించింది .సరసభారతి పుస్తకాలన్నీ కావాలి అంటే అన్నీ పిడిఎఫ్ లో ఉన్నాయి డౌన్ లోడ్ చేసుకోవచ్చు అన్నా .మర్నాడు ఉదయం మళ్లీ ఫోన్ చేసి అన్నీ డౌన్ లోడ్  చేసుకొన్నాననీ  కాని ఒరిజినల్స్ కావాలన్నారు .డబ్బు ఎంత అయితే అంతా పంపుతానన్నారు .’’మాపుస్తకాలన్నీ ఉచితమే .మా అబ్బాయి శర్మ హైదరాబాద్ లో ఉంటాడు అతనే మీ ఇంటికి తెచ్చి అందిస్తాడు ‘’అన్నా .’’ఆశ్చర్యంగా ఉందే’’ అన్నారు .తాను  మల్లినాథ సూరి పుట్టిన  తెలంగాణలోని సిద్ధిపేట దగ్గరున్న కొలచలగ్రామం లో సూరి ఇంట్లో ఒక కార్యక్రమంచేయాలను కొంటున్నాననీ ,దానికి ‘’మీరుకూడా తప్పక రావాలి ‘’అనగా ‘’అది నా అదృష్టం మహద్భాగ్యం ‘’అన్నా.నేను అన్నట్లే మా అబ్బాయి శర్మ,మా మనవడు హర్ష వారింటికి వెళ్లి సరసభారతి పుస్తకాలు అందజేసి వీడియో తీసి యుట్యూబ్ లో పోస్ట్ చేశాడు .

  నేనుదాదాపు రెండున్నర ఏళ్లనుంచి ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు సరసభారతి ఫేస్ బుక్ లో వివిధ గ్రంథాలను ప్రత్యక్ష  ప్రసారం చేస్తున్నాననీ ,అవన్నీ యుట్యూబ్ లో పోస్ట్ అవుతున్నాయని ఇప్పటికి నాలుగు వేల ఎపిసోడ్ లు నాలుగు వేల గంటలు చేశానని చెప్పాను .

 సుబ్బారావు గారు మాటల మనిషికాదు చేతల మనిషి .అర్ధాంగి స్మృతినిఇంత అర్ధ  వంతం గా  నిర్వహించటం మనీషులకే సాధ్యం ఆని ,అలాంటి మనీషి గుత్తికొండ అనీ ,దీనికి సహకరిస్తున్న అమెరికాలో సెటిల్ అయిన వారి ముగ్గురు కుమార్తెల సహకారం, అంతకు మించి  వారి అల్లుళ్ళ సహృదయత మాటలలో చెప్పలేనిదని అన్నాను .వారందరికి మా అందరి శుభాశీస్సులని చెప్పాను .ఈ ఓల్డేజ్ హోమ్ లో  ఇరవై మంది మహిళలున్నారు .వారందరూ ఉచిత సేవ పొందుతున్నారు  ఈ ట్రస్ట్ సహకారంతో .ఎవరైనా ఒకరోజు భజనం స్పాన్సర్ చేయాలంటే 2500 రూపాయలు పంపిస్తే వారి పేర మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయిస్తారని నెలకు ఇలాంటి స్పాన్సర్లు సుమారు పది మంది ఉంటారని,గదులలో ఆహార పదార్ధాలు స్టోర్ చేసి ఉంటాయని ,వంటమనిషి కూడాఉంటారనీ ,ఆశ్రమం లోని ఓపికున్న వారు వంటకు, వడ్డనకు సాయం చేస్తారని ,ఉదయంతిఫిన్ కాఫీ మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ రాత్రి భోజనం ఉంటాయి .దాతలు ఇచ్చిన స్థలం లో ఈ భవన నిర్మాణం సుబ్బారావు గారు చేశారనీ చెప్పాను .అనాధలు ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియలు కూడా ట్రస్ట్  ఖర్చు తో నిర్వహిస్తారు.,నేను కొందరు ఇన్ మేట్స్ తో మాట్లాడితే వారంతా ఎంతో సంతోషంగా ఉన్నట్లు ఏలోటూ లేనట్లు చెప్పారని తెలియజేశాను .చిలకలపూడి రైల్వే స్టేషన్ ఎదురుగా ఈ సేవాభవనం ఉందని చెప్పాను .దీన్ని ఎ లోట్టు రాకుండా సమర్ధతతో నిర్వహిస్తున్న శ్రీమారి సుశీల గారిని అభినందించాలి .ఆమె అందరికి తలలో నాలుకలా ఉంటారు .ముఖ్యంగా సుబ్బారావు గారి కుటుంబానికి చాలా సన్నిహితురాలు .రెండేళ్లక్రితం సరసభారతి ఉగాది పురస్కారం ఆమెకు అందజేశాం .ఈసభకు సరసభారతితో పరిచయమున్న శ్రీమతి గురజాడ రాజరాజేశ్వరి ,శ్రీమతి మేరీకృపాబాయి శ్రీమతి అన్నపూర్ణమొదలైన  వారు వచ్చారు .ఇదంతా నిన్నటి సభా విశేషాలు .

శ్రీ గుత్తికొండతో 50 ఏళ్ల క్రిందటి తొలి పరిచయ విశేషాలు

.బహుశా ఆయనకు గుర్తు ఉండకపోవచ్చు .1970 దశకం లో అనుకొంటా బందరు సెంట్రల్ లైబ్రేరియన్ కృష్ణా జిల్లా గ్రంథాలయ సెక్రెటరి శ్రీ చ౦ద్ర శేఖర రావు గారు ఉండేవారు .అప్పుడు శ్రీ దొండపాటి దేవదాసుగారు అటెండర్ .తర్వాత ఆయనా లైబ్రేరియన్ అయ్యారు అక్కడే .అప్పటికే మంచి కథారచయితగా పేరు పొందారు .మేము ఉయ్యూరులో సాహితీ మండలి నిర్వహించినపుడు ,సరసభారతి కార్యక్రమాలకుఆహ్వానిస్తే వచ్చి చక్కని ప్రసంగం చేసేవారుదేవదాసుగారు .అపుడు ఆ లైబ్రరీలో శ్రీ ఆవంత్స సోమసుందర్ గారి ఉపన్యాసం కు ఉయ్యూరు నుంచి నేనూ,ఉయ్యూరులో నాతో పాటు సైన్స్ మాస్టర్ గా పని చేస్తున్న  ,ప్రముఖవిమర్శకుడు ,శ్రీశ్రీని అవపోసన పట్టిన  మిత్రుడు టి ఎల్ కాంతారావు ,లెక్కలమాస్టారు ఆంజనేయ శాస్త్రి ,హిందీ మాస్టార్ శ్రీ కొడాలి రామారావు  కాంతారావు ప్రేరణ తో ఆ మీటింగ్ కు వెళ్ళాం .సభలో ఉపన్యాసం విన్నాం .మాకు లైబ్రరి సెక్రెటరి గారింట్లోనే భోజనం పడక కూడా .ఆయన శ్రీ కొల్లూరి కోటేశ్వర రావు గారికి దగ్గర బంధువు ఆని గుర్తు .

  మర్నాడు ఉదయం కాంతారావు  మమ్మల్నిముందుగా శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారింటికి తీసుకు వెళ్లారు .అక్కడే వారితండ్రిగారు కవిపాదుషా శ్రీ పువ్వాడ శేషగిరి రావు గారిని మొదటిసారీ,ఆఖరి సారి చూశాం .ఆతర్వాత ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు శ్రీ ‘’జిసనార ‘’ గారిని వారింట్లో చూశాం .ఆతర్వాత శ్రీ విహారి గారి నీదర్శించా౦  ,వీరి జంట శ్రీ శాలివాహన ఊర్లో లేరట .పిమ్మట శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారినీ కలిశాము .ఆయన అప్పుడు  ఇన్ షర్ట్ర్ట్ ,బెల్ట్ తో, సన్నగా రివటగా ఉన్నట్లు గుర్తు . కాంతారావు ఆయన్ను పరిచయం చేస్తూ ‘’మాంచి చురుకైన వ్యక్తి .ఒకరకంగా మాలీడర్ ‘’ఆని చెప్పాడు .తర్వాతప్రసిద్ధ కథా రచయిత ‘’సి. రా .‘’ఆని పిలువబడే శ్రీ సింగరాజు రామ చంద్రమూర్తి గారినీ చూసి మాట్లాడిన గుర్తు .వీరంతా బందరు ఎల్ .ఐ. సి. లో ఉద్యోగస్తులే .అలా సుబ్బారావు గారితో ఆనాటి బంధం ఈనాడూ సుమారు 20 ఏళ్లనుంచి మళ్లీ కొనసాగటం  నా అదృష్టం .

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -24-11-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

జీవన సాఫల్య పురస్కారం -1

జీవన సాఫల్య పురస్కారం -1

నిన్న 23-11-25 ఆదివారం బందరు దగ్గర చిలకలపూడిలో కృష్ణాజిల్లా రచయితల  సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారి ఆధ్వర్యం లో వారి ధర్మ పత్ని కీ.శే.శ్రీమతి గుత్తికొండ రామరత్నం గారి 12వ వర్ధంతి సందర్భంగా జీవన సాఫల్య పురస్కారాలను గుత్తికొండ రామ రత్నం చారిటబుల్ ట్రస్ట్ -అన్నపూర్ణ వృద్ధుల సేవాశ్రమం లో లోని రామరత్నం ఆడిటోరియం లోఒక గంట ఆలస్యంగా ప్రారంభమైనా  కమనీయంగా జరిగింది .సభాధ్యక్షులు సాహితీ సింధు,శతాధిక గ్రంధకర్త ,మహా సాహితీవేత్త  డా.జి వి పూర్ణచంద్ నేతృత్వంలో అవనిగడ్డ శాసనసభ్యులు తెలుగు భాషా సంస్కృతీ పరిరక్షకులు మాన్యులు డా.మండలి బుద్ధప్రసాద్ ముఖ్యఅతిధిగా ,అన్నపూర్ణ వృద్ధుల సేవాశ్రమం అధ్యక్షురాలు ,సాంఘిక సేవా తత్పరురాలూ శ్రీమతి కరెడ్ల సుశీల స్వాగత ప్రసంగం తో ప్రారంభమైంది .ఉయ్యూరునుంచి కారులో నేనూ ,సరసభారతి సాంకేతిక నిపుణులు శ్రీ గంగాధరరావు ,మా మూడవకోడలు రాణి ,నాల్గవ కోడలు మహేశ్వరి వెళ్ళాం .సాయంత్రం 4-30కె సభాస్థలి చేరాం .కారణం మా ఉయ్యూరు సరసభారతి సభలకు సుబ్బారావు గారు ఎప్పుడూ అందరికంటే ముందే వస్తారు .మేమూ దాన్నే అనుసరించాం .

జీవన సాఫల్య పురస్కారాలు అందుకొన్నప్రముఖులు 1-ఆచార్య ఎం.సి దాస్ -విద్యా ,సామాజిక వేత్త (బెజవాడ )2-శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ -నిరంతర రచనా నిమగ్నులు ,సరసభారతి అధ్యక్షులు (ఉయ్యూరు )3-శ్రీమతి మందరపు హైమవతి -స్త్రీవాద రచయిత్రి (బెజవాడ )3-డా.  గుమ్మా సాంబశివరావు -ప్రసంగ ప్రజ్ఞానిధి,విమర్శక శిఖామణి (బెజవాడ )4-శ్రీమతి తేళ్ళ అరుణ-సామాజిక వేత్త ,గౌరవాధ్యక్షులు ,నవ్యాంధ్ర రచయితల సంఘం 5-శ్రీదామెర్ల నరసింహారావు -విద్యా వేత్తసాహితీ ప్రియ౦భావకులు*(మైలవరం ) 6-భవిష్య -భావతరంగిణి సంపాదకులు-(బందరు)  .వీరందరికీ శ్రీ బుద్ధప్రసాద్ గారి చేత శాలువా జ్ఞాపిక  తెల్ల చామతుల పుష్పహారం తో పాటు 5 వేల రూపాయల నగదు కానుకగా అందించి అపూర్వంగా సత్కరించి గౌరవించారు .

  బుద్దప్రసాద్ గారు,పూర్ణ చంద్ గారు సన్మానితులందరి గురించి విపులంగా వివరించారు . సన్మానితులూ ఉచితరీతిని కృతజ్ఞతలు చెప్పారు .ఆడిటోరియం నిండిపోయి అదనపు కుర్చీలు వేయాల్సి వచ్చింది .నేనూ బందరు సభలకు వెళ్లి ఆరేళ్ళు దాటి ఉంటుంది .అందరికి ఈసభ గొప్ప జోష్ నిచ్చింది .ఇదంతా సుబ్బారావుగారి పై ఉన్న ఆప్యాయత గౌరవం కారణం .సభాన౦తరం అందరికి గొప్ప విందు నిచ్చారు .   

  సభకు ముందు నేను బుద్ధప్రసాద్ గారి ప్రక్కన కూర్చుని మాట్లాడుకున్నాం.శ్రీకాకుళం. లో కృష్ణ దేవరాయల సభలు జరపటం లేదేమని అడిగా .ఎలెక్షన్ కోడ్ అడ్డం వచ్చి అప్పుడు జరపలేదు ఈసారి చేద్దాం అన్నారు .నేను సభలకు హాజరైనప్పుడు ఎవరు ఏమి మాట్లాడిందీ చక్కగా నోట్ చేస్తానని ఆ డైరీలన్నీ ముద్రించాలనీ  లేకపోతె విలువైన సమాచారం మిస్ అవుతుందని  చెప్పారు .ఇదేమాట వేదికపైనా అందరికి తెలియజేశారు .సరే అన్నాను .

 వేదికపై నేను కృతజ్ఞత తెలియజేస్తూ మాట్లాడుతూ ‘’12ఏళ్ల కాలాన్ని పుష్కరం అంటారు .ఇవాళ ఇక్కడ కొంత హృదయభారంతో జరిగినా’’ సాహితీ పుష్కరం’’ గా ఉంది.సాహితీ వాహినులు అయిన ఆరుగురికి జీవనసాఫల్య పురస్కారం అందించటం  కనువిందుగా ఉంది .కృష్ణా జిల్లా రచయితల సంఘం జరిపిన జాతీయ సభలో నాకు ఈ  సంఘం తో మొదటి సారి పరిచయం ఏర్పడింది .అప్పుడు సెకండరి విద్యా విషయమై ఒక వ్యాసం రాయాల్సి వచ్చినప్పుడు సుబ్బారావు గారు నేషనల్ అవార్డీ గొప్పకధకులు మా అందరికి పితృసమానులు శ్రీ సోమంచి రామం  గారిని అడగటం ,ఆయన  నాపేరు  చెప్పటం , ఆవిషయం రామం గారు కూడా నాకు ఫోన్ చేసి చెప్పటం  జరిగింది .ఆ వ్యాసం రాసి పంపాను అప్పుడే సుబ్బారావు గారు కూడా మొదటిసారిగా నాతో ఫోన్ లో మాట్లాడటం .సభలోనే మొదటిసారి పూర్ణ చంద్ గారితో పరిచయం ..అప్పుడే ఇటీవలే పరమపదించిన శ్రీ కాలనాథ భట్ల వీరభద్ర  శాస్త్రి గారితో పరిచయం .అయన మా కజిన్ సిస్టర్ శారదక్కయ్య ఆడపడుచు భారతి భర్త విశాఖ లో ఉండే మాధ్స్ లెక్చరర్ శ్రీ పొన్నపల్లి రామకృష్ణయ్య వారి బంధువు . అప్పటి నుంచి   ఈసంఘం అన్నికార్యక్రమాలలో నేను పాల్గొంటూనే ఉన్నా.వారు ప్రచురించిన అన్ని పుస్తకాలలో నాతో ఆర్టికల్స్ రాయిస్తూనే ఉన్నారు .పూర్ణ చంద్ గారు ఫోన్ చేసి ‘’మాస్టారూ! ఈ టాపిక్స్ ఉన్నాయి .వ్యాసం రాయాలి మీ ఇష్టం వచ్చింది తీసుకొని రాయండి ‘’అనేవారు .’’అలాకాదు .మీరూ ఏది రాయమంటే అది రాస్తా ‘’అనే వాడిని .అలానే రాసేవాడిని .ఉయ్యూరులో మా సరసభారతి కార్యక్రమాలనన్నిటికి ఈ’’ త్రయం’’ తప్పక వస్తారు .రావటంలో ఆనందం ఉంటుదిమాకు .వేదిక ముందు కూర్చున్నప్పుడు బుద్ధప్రసాద్ గారు సుబ్బారావు గారితో ‘’దుర్గా ప్రసాద్ గారు ఎందరెందరికో పురస్కారాలిస్తారు ఆయనకు మనం ఎప్పుడూ ఇవ్వలేదు ‘’అంటే సుబ్బారావు గారు ‘’అందుకే ఇప్పుడు ఇస్తున్నాం ‘’అన్నారు .మిగిలిన విషయాలు ఈసారి .

సశేషం

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -24-11-25-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.44 వ భాగం.23.11.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.44 వ భాగం.23.11.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.44 వ భాగం.23.11.25.

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.21 వ భాగం.23.11.25.

మహాకవి కాళిదాసు కుమార సంభవం.21 వ భాగం.23.11.25.

మహాకవి కాళిదాసు కుమార సంభవం.21 వ భాగం.23.11.25.

Posted in రచనలు | Leave a comment

ఆంధ్ర ప్రభ ఆంధ్ర జనత  పత్రికల సంపాదకుడు , ,కాలేజి రోజుల్లోనే ఖాదీ వస్త్ర ధారణ చేసిన బాల కధక రచయిత ,’’పాదచారి ‘’ఇంగ్లిష్ పత్రిక స్థాపించిన -శ్రీ పండితారాధ్యుల నాగేశ్వరరావు

ఆంధ్ర ప్రభ ఆంధ్ర జనత  పత్రికల సంపాదకుడు , ,కాలేజి రోజుల్లోనే ఖాదీ వస్త్ర ధారణ చేసిన బాల కధక రచయిత ,’’పాదచారి ‘’ఇంగ్లిష్ పత్రిక స్థాపించిన -శ్రీ పండితారాధ్యుల నాగేశ్వరరావు

పండితారాధ్యుల నాగేశ్వరరావు (26 మార్చి 1912 – 13 నవంబర్ 1976)  తెలుగు భాషా భారతీయ జర్నలిస్ట్.

నాగేశ్వరరావు ఆంధ్రలోని గుంటూరు జిల్లాలోని ఇంటూరులో బ్రాహ్మణ దంపతులైన మల్లయ్య మరియు భైరవంబ దంపతులకు జన్మించారు. చేనేత కార్మికుల పట్ల గౌరవంతో, ఆయన కళాశాల రోజుల నుండే ఖాదీ ధరించేవారు.

భారతదేశంలో బ్రిటిష్ పాలన చివరి సంవత్సరాల్లో ఆయన తన వృత్తిని ప్రారంభించారు మరియు స్వాతంత్ర్యం తర్వాత తన సంపాదకీయాలతో కొనసాగారు. ఆయన ఆంధ్ర జనత మరియు ఆంధ్ర ప్రభలతో ప్రాముఖ్యత పొందారు

స్వాతంత్య్రం తర్వాత వార్తాపత్రిక మాత్రమే కమ్యూనికేషన్ మాధ్యమంగా ఉన్నప్పుడు, పండితారాధ్యుల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ హయాంలో “కత్తి కంటే కలం గొప్పది” అని నిరూపించి ఉన్నత స్థాయికి ఎదిగారు.

ఆయన దేవుళ్ల గురించి అనేక చిన్న కథలు రాశారు మరియు ప్రసిద్ధమైన వాటిలో “వాలి & సుగ్రీవుడు మరియు దాచిన రాముడి మధ్య పోరాటం” ఉన్నాయి.

“రైలు తప్పిన ప్రయాణికులు” అనే ఆయన రాసిన శక్తివంతమైన సంపాదకీయాలు 1956 ఎన్నికలలో కాంగ్రెస్ విజయానికి దోహదపడ్డాయి. ఇది ఆయనకు జాతీయ స్థాయిలో ప్రశంసలు తెచ్చిపెట్టింది మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారు (అప్పటి భారత ప్రధానమంత్రి) మరియు సుభాష్ చంద్రబోస్ ఆయనను సందర్శించారు. ఆయన జలగం వెంగళరావు గారు, తిమ్మారెడ్డి గారు, ఎన్.జి. రంగా గారు, నీలం సంజీవ రెడ్డి గారు మరియు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు వంటి వారి సన్నిహితులు. ఆయన ఎప్పుడూ ‘పేరు మరియు కీర్తి’ సాధించాలని లక్ష్యంగా పెట్టుకోలేదు కానీ చట్టబద్ధంగా మరియు సహేతుకంగా ఉండటం ద్వారా తన రచనల నిజాయితీని ఎల్లప్పుడూ నమ్మేవారు. ఇది కలం మరియు పర్సు కోసం పోరాటాన్ని సృష్టించింది. కానీ శక్తివంతమైన కలం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండలేదు. ఆయన ఒక అడుగు ముందుకు వేసి “పాదచారి” అనే ఆంగ్ల వారపత్రికను ప్రారంభించారు.

నాగేశ్వరరావు పరవత వర్ధనిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు మరియు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన తన పెద్ద కొడుకును ఆగస్టు 1976లో కోల్పోయారు. 13 నవంబర్ 1976న గుండెపోటుతో మరణించారు.

కెరీర్

నాగేశ్వరరావు గారు ఈ క్రింది వాటికి సంపాదకులుగా ఉన్నారు: కాలక్రమానుసారం

గోభూమి (బ్రిటీష్ పాలనలో)

వాహిని పొలిటికల్ వీక్లీ (N G రంగా స్థాపించారు).

క్రాంతి పత్రిక.

ఆంధ్రపత్రిక వార్తాపత్రిక – (1943-1959) మద్రాసు

ఆంధ్రభూమి వార్తాపత్రిక – (1960) వ్యవస్థాపకుడు

సంజయ పత్రిక

ఆంధ్ర జనతా వార్తాపత్రిక (APCC – 1965)

ప్రజాప్రభ వారపత్రిక

పాదచారుల ఆంగ్ల వార్తాపత్రిక

ఆంధ్రప్రభ వార్తాపత్రిక (1966 – 1976 – ఆయన మరణించే వరకు)[1]

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -22-11-25-ఉయ్యూ

Posted in రచనలు | Leave a comment

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.28 వ చివరి భాగం.22.11.25.

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.28 వ చివరి భాగం.22.11.25.

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.12 వ భాగం.22.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.12 వ భాగం.22.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.12 వ భాగం.22.11.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.43 వ భాగం.22.11.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.43 వ భాగం.22.11.25.

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం. 20 వ భాగం.22.11.25.

మహాకవి కాళిదాసు కుమార సంభవం. 20 వ భాగం.22.11.25.

మహాకవి కాళిదాసు కుమార సంభవం. 20 వ భాగం.22.11.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.27 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.21.11.25

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.27 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.21.11.25.

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.27 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.21.11.25.

.

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.11 వ భాగం.21.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.11 వ భాగం.21.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.11 వ భాగం.21.11.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రా మాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలవినో దినీ వ్యాఖ్య.A

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రా మాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలవినో దినీ వ్యాఖ్య.A

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రా మాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలవినో దినీ వ్యాఖ్య.A

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.19 వ భాగం.21.11.25

మహాకవి కాళిదాసు కుమార సంభవం.19 వ భాగం.21.11.25

Posted in రచనలు | Leave a comment

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.26 వ భాగం. మధురవాణి ఇంటర్వ్యూలు.20.11.25.

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.26 వ భాగం. మధురవాణి ఇంటర్వ్యూలు.20.11.25.

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.26 వ భాగం. మధురవాణి ఇంటర్వ్యూలు.20.11.25.

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.10 వ భాగం.20.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.10 వ భాగం.20.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.10 వ భాగం.20.11.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.41 వ భాగం.20.11.25. part

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.41 వ భాగం.20.11.25. part

-https://youtu.be/6RahVtHeDf8

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.18 వ భాగం.20.11.2

మహాకవి కాళిదాసు కుమార సంభవం.18 వ భాగం.20.11.25. https://youtu.be/tQiaE-NIZzI

మహాకవి కాళిదాసు కుమార సంభవం.18 వ భాగం.20.11.2 part -2

Posted in రచనలు | Leave a comment

శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమద్వ్రతం –

  ‘’ శ్రీ సువర్చలాధిష్టిత వామ దేహం – నిరస్త కందర్ప సురూప దర్శన౦-

 భానుప్రభ౦  రాఘవ కార్య దక్ష్యం –అస్మత్కులేశం  శ్రీ హనూమంత మీడే’’.

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లోశ్రీ విశ్వావసు నామ సంవత్సర  మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు శ్రీ  హనుమద్వ్రతం కార్యక్రమం 2-12-25 మంగళ వారం  నుండి 3-12-25  బుధవారం   వరకు రెండు రోజుల కార్యక్రమ౦ గా జరుగుతుంది .భక్తులు పాల్గొని,అర్చించి , స్వామి వారల అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుతున్నాము

కార్యక్రమం

2-12-25 మంగళ వారం  మార్గశిర శుద్ధ ద్వాదశి –ఉదయం 5గం .లనుంచి -అష్ట కలశ స్నపనం ,స్వామి వారలకు  మన్యు సూక్తం తో అభి షేకం  -నూతన వస్త్ర ధారణం –గంధ సిందూరం ,అరటి పళ్ళు ,చేమంతిపూల తో సహస్రనామ ,అష్టోత్తర పూజ –నైవేద్యం –హారతి –మంత్ర పుష్పం -తీర్ధ ప్రసాద వినియోగం .

3-12-25  బుధవారం   మార్గశిర శుద్ధ త్రయోదశి –శ్రీ హనుమద్వ్రతం

        ఉదయం 9గం .లకు -పంపానదీ కలశ ఆవాహన , అష్టోత్తర పూజ ,’’13ముడులు గల తోరాల’’కు  పూజ –

తమలపాకులతో శ్రీ సువర్చలా౦జనేయ స్వామి వారలకు  సహస్రనామ, అష్టోత్తర పూజ – భక్తులు  మంత్రం తో తోర ధారణం – శ్రీ హనుమద్వ్రత కథలు  -నైవేద్యం –హారతి –మంత్ర పుష్పం –తీర్ధ ప్రసాద వినియోగం ..

 గబ్బిట దుర్గా ప్రసాద్ –ఆలయ ధర్మ కర్త

మరియు భక్త బృందం .

20-11-25–ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

ప్రముఖ పంజాబ్ వైద్యుడు జలియన్ వాలా హత్యముండు అరెస్టయిన స్వాతంత్ర్య సమరయోధుడు ,శాసన సభ్యుడు -డాక్టర్ సత్యపాల్

ప్రముఖ పంజాబ్ వైద్యుడు జలియన్ వాలా హత్యముండు అరెస్టయిన స్వాతంత్ర్య సమరయోధుడు ,శాసన సభ్యుడు -డాక్టర్ సత్యపాల్

సత్యపాల్, డాక్టర్ సత్య పాల్ (11 మే 1885 — 18 ఏప్రిల్ 1954 అని కూడా పిలువబడే బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్‌లో వైద్యుడు మరియు రాజకీయ నాయకుడు, జలియన్‌వాలా బాగ్ ఊచకోతకు మూడు రోజుల ముందు, 1919 ఏప్రిల్ 10న సైఫుద్దీన్ కిచ్లూతో పాటు అరెస్టు చేయబడ్డాడు.

ప్రారంభ జీవితం

సత్యపాల్ కేంబ్రిడ్జ్‌లోని పీటర్‌హౌస్‌లో విద్యనభ్యసించాడు, అక్కడ అతను జవహర్‌లాల్ నెహ్రూ స్నేహితుడు.మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, 1915 సెప్టెంబర్ 17న, అతను ఇండియన్ మెడికల్ సర్వీస్‌లో లెఫ్టినెంట్‌గా తాత్కాలిక కింగ్స్ కమిషన్[5] పొందాడు, విశిష్ట సేవలందించాడు.[6][7] పేర్కొనబడని కారణాల వల్ల, అతను సెప్టెంబర్ 16, 1916 నుండి తన కమిషన్‌ను వదులుకున్నాడు] మరియు భారతదేశానికి తిరిగి వచ్చి రౌలట్ చట్టం తర్వాత అతను బ్రిటిష్ పాలనకు సహాయ నిరాకరణ మరియు అహింసా ప్రతిఘటన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు.

అతను జియాన్ దేవిని వివాహం చేసుకున్నాడు.[8] అమృత్‌సర్ నగరంలోని పాత ప్రాంతంలో అతను విజయవంతమైన ప్రాక్టీస్‌ను నిర్వహించాడు.

అరెస్టు

మైఖేల్ ఓ’డ్వైర్ ఆదేశాల మేరకు CID 1919 మార్చి మధ్యకాలం నుండి కిచ్లూ మరియు సత్యపాల్‌పై నిఘా ఉంచింది. మళ్ళీ, ఓ’డ్వైర్ ఆదేశాల మేరకు, వారిని 1919 ఏప్రిల్ 10న సివిల్ లైన్స్‌లోని డిప్యూటీ కమిషనర్ ఇంటి మైల్స్ ఇర్వింగ్‌కు పిలిపించారు. “నేను ఈ విషయానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు మరియు ఎప్పటిలాగే నా రోజువారీ రౌండ్లు చేసేవాడిని” అని సత్యపాల్ గుర్తుచేసుకున్నాడు, దానిని గొప్ప ప్రాముఖ్యతగా భావించలేదు. వారిద్దరినీ ఇప్పటికే రాజకీయ కార్యకలాపాల నుండి నిషేధించారు మరియు ఆ రోజు వారి స్నేహితులు హన్స్ రాజ్ మరియు జై రామ్ సింగ్‌తో హాజరయ్యారు. సత్యపాల్‌కు కొద్దిసేపటి ముందు కిచ్లూ వచ్చాడు మరియు కొన్ని నిమిషాల నిరీక్షణ తర్వాత, వారిని పిలిపించి, ఇద్దరూ వెంటనే అమృత్‌సర్ నుండి బయలుదేరాలని కోరుతూ ది డిఫెన్స్ ఆఫ్ ఇండియా ఆదేశాలు ఇచ్చారు. మైల్స్ ఇర్వింగ్ ఆపరేషన్ యొక్క రహస్య స్వభావాన్ని వివరించాడు, ఎందుకంటే “ఎవరికీ తెలియకముందే వారు ధర్మశాలకు వెళ్లే మార్గంలో 30 మైళ్ల దూరంలో ఉంటారని నిర్ణయించుకున్నాడు”. వారి కుటుంబాలకు లేఖలు వ్రాయడానికి అనుమతి ఇచ్చిన తర్వాత, సత్యపాల్ మరియు కిచ్లూలను జాన్ ఫెర్గూసన్ రెహిల్  తోలుకు వెళ్ళారు మరియు వేట సామాగ్రి ధరించిన నలుగురు సైనికులు వారిని కాపాడారు. కిచ్లూ మరియు సత్యపాల్ చాలా దూరం వెళ్ళే ముందు అరెస్టు వార్త వ్యాపించకుండా ఉండటానికి హన్స్ రాజ్ మరియు జై రామ్ సింగ్‌లను ఇర్వింగ్ వరండాలో వేచి ఉంచారు. ఇర్వింగ్ వారి కుటుంబాలకు లేఖలు పంపే ముందు వారు ఒక గంట వేచి ఉన్నారు. “ప్రతి కారులో తుపాకులతో సైనిక ఎస్కార్ట్ ఉంది” మరియు “కార్లు అధిక వేగంతో నడపబడ్డాయి మరియు మేము అమృత్సర్ నుండి 50 మైళ్ల దూరంలో ఉన్న నూర్పూర్ డాక్ బంగ్లాకు చేరుకునే వరకు ఆగలేదు” అని సత్యపాల్ గుర్తుచేసుకున్నాడు,  ఇది అమృత్సర్ నుండి 50 మైళ్ల దూరంలో ఉంది. వారు ఆ సాయంత్రం 8 గంటలకు హిమాలయాల పాదాల వద్ద ఉన్న ధర్మశాలకు చేరుకున్నారు మరియు వారిని గృహ నిర్బంధంలో ఉంచారు.

అరెస్టు వార్త వ్యాపించగానే, మద్దతుదారులు ఇర్వింగ్ ఇంటి దగ్గర గుమిగూడడం ప్రారంభించారు మరియు విచారణ చేయడానికి శాంతియుత ప్రయత్నంగా మొదట కనిపించినది హింసాత్మక ఘర్షణకు దారితీసింది. 1919 ఏప్రిల్ 13న, అరెస్టును నిరసిస్తూ, జలియన్ వాలాబాగ్‌లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు.

1919 జూన్‌లో ‘లాహోర్‌లో అమృత్‌సర్ కుట్ర కేసు’ విచారణలో, అప్రూవర్‌గా విచారణకు హాజరైన హన్స్ రాజ్ ప్రకటన తర్వాత, సత్యపాల్‌తో పాటు 14 మంది దోషిగా నిర్ధారించబడి, రెండేళ్ల జైలు శిక్ష విధించారు.

తరువాతి జీవితం

రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తర్వాత, సత్యపాల్ తిరిగి ఇండియన్ మెడికల్ సర్వీస్‌లో చేరాడు, 1941 డిసెంబర్ 8న కెప్టెన్‌గా అత్యవసర కమిషన్‌ను పొందాడు (1936 డిసెంబర్ 8 నుండి ముందస్తు సీనియారిటీతో).  భారత స్వాతంత్ర్యం తర్వాత, అతను రాజకీయాల్లో చురుకుగా ఉన్నాడు మరియు 1952లో పంజాబ్ విధానసభ ఎన్నికలలో పోటీ చేయడంలో విజయం సాధించాడు. అతను 1954 ఏప్రిల్ 18న హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో మరణించాడు.

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -20-11-25-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.25 వ భాగం. మధురవాణి ఇంటర్వ్యూలు.19.11.25.

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.25 వ భాగం. మధురవాణి ఇంటర్వ్యూలు.19.11

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.25 వ భాగం. మధురవాణి ఇంటర్వ్యూలు.19.11.25.

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.25 వ భాగం. మధురవాణి ఇంటర్వ్యూలు.19.11.25.

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.,9 వ భాగం.,19.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.,9 వ భాగం.,19.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.,9 వ భాగం.,19.11.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.40 వ భాగం.19.11.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.40 వ భాగం.19.11.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.40 వ భాగం.19.11.25.

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.17 వ భాగం.19.11.25 Part -3

మహాకవి కాళిదాసు కుమార సంభవం.17 వ భాగం.19.11.25 Part -3

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.17 వ భాగం.19.11.25 Part -2

మహాకవి కాళిదాసు కుమార సంభవం.17 వ భాగం.19.11.25 Part -2

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.17 వ భాగం.19.11.25

మహాకవి కాళిదాసు కుమార సంభవం.17 వ భాగం.19.11.25

మహాకవి కాళిదాసు కుమార సంభవం.17 వ భాగం.19.11.25

Posted in రచనలు | Leave a comment

కులపతి అడివి బాపిరాజుగారి కీర్తిచ్ఛటలు -3(చివరిభాగం )

కులపతి అడివి బాపిరాజుగారి కీర్తిచ్ఛటలు -3(చివరిభాగం )

 జైలులో ఉన్నప్పుడు బాపిరాజుగారు బోలెడు పెన్సిల్ స్కెచెస్ వేశారు .అవన్నీ ఆయన జ్ఞాపకాలలోంచి వచ్చినవే .అందులో ద్వారం నాయుడు గారి వయోలిన్ కచేరి ,రామప్పదేవాలయ నాగిని నృత్యం ,సాలార్ మ్యూజియం లో నవాబుల హుక్కా వగైరాలున్నాయి .ఇవన్నీ కూడా బాగా ప్రసిద్ధి పొందినవే . ఆయనకాలం లో ఉన్న గొప్ప చిత్రకారులలో దామెర్ల రామారావు ,కవికొండల వెంకటరావు ,ఆయన సతీర్ధులు .బాపిరాజుగారి వర్ణ చిత్రాలన్నీ ఎవరూ జాగ్రత్తచేయలేదు .బందరు నేషనల్ కాలేజిలోరెండు ,విశాఖ మ్యూజియం లో కొన్ని ,చితికిపోయిన సంస్థానాలలో కొన్ని అలా ఎక్కడి కెక్కడికో చేరిపోయాయి .బాపిరాజుగారి ‘’శబ్ద బ్రహ్మ’’ చిత్రం మాత్రం డెన్మార్క్ చిత్ర శాలలో సజీవంగా ఉన్నది .

  ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం లో తెలుగు వారిని అత్యంత హీనంగా చూడటం భరించలేక కవితలు రాశారు బాపిరాజు గారు .ఆ  అణచిచి వేత చరిత్రలో రాలేదు కనుక కవిత్వం లోకి ఎక్కించాను ఆని చెప్పారాయన .-

‘’ఆంధ్రులప్రతిభ ,ఆంధ్రులకీర్తి -ఆఖరుకాదనీ ఆరిపోవదనీ -మోగి౦ప వమ్మా జయజయ ఢంకా -తెలుగుగానమూ తెలుగు నాట్యమూ-తెలుగు రంగులు తెలుగు తేనెలు – ఆగిపోవనీ అందం వీడవనీ -రూపం చెడదనీ ,రుచులు తగ్గవనీ -మోగి౦ పవమ్మా జయజయ ఢంకా’’ఇలాంటి వెన్నో రాశారు స్వయంగా పాడే వారు బాపిరాజుగారు .’’జ్యోతిర్మయి ఆంధ్రీ ‘’లాంటిపాటలలో మిగిలిన భాషలవారి పట్ల ద్వేషం లేదు.మహాత్మా గాంధీ మీద రాసిన పాటలలోనూ ఇంగ్లీష్ వారిపై ద్వేషం లేదు ఆని చెప్పారాయన  ..ఈ పాతలన్నే ఆయన భావనా శక్తి వల్ల బ్రతికి ఉన్నాయి అందుకే విశ్వనాథ ‘’బావా !నీకున్నంత భావనా శక్తి నాకు లేదోయి.నాకున్న భాషా పాటవం నీకు లేదోయి ‘’అంటే నవ్వేసే వారు బాపిబావ .

  బందరు జాతీయ కళాశాల ప్రిన్సిపాల్ గా బాపిరాజుగారున్నప్పుడు దాని అభివృద్ధికి ఎంతో కృషి చేశారు .అప్పుడు కాటూరి వెంకటేశ్వరరావు గారు అక్కడ అధ్యాపకుడు .వీరిద్దరికలయిక ‘’ప్రకృతి ,పురుషులకలయిక గా ‘’ఉండేది .ముట్నూరి కృష్ణారావుగారు వీరి గురుదేవులు .బాపిరాజు గారి ఇంటిపేరు ‘’అడివి’’ అయినా సాహిత్యం ‘’నందనోద్యానం ‘’  .ఆరోజుల్లో బాపిరాజు ,బసవరాజు నండూరి గార్లు ‘’గేయ కవిత్రయం ‘’.బాపిరాజు గారి గేయాలెన్నో అముద్రితాలు ఆని ఆయన బాధ పడేవారు .ఆయన గేయాలు అన్నీ ‘’Poems ‘’అనే ఆయన ముచ్చటైన నోట్ బుక్ లో ఉన్నాయని అది తన కూతురు రాదా వసంత వద్ద ఉందని చెప్పారు .తంజావూరు రాజు రఘునాధ నాయకుడి ఊరేగింపు తో ప్రారంభమయె నవల ‘’మధుర  వాణి ‘’ రాశారు .అది రఘునాధ రాయలు ,మధురవాణి చుట్టూ తిరిగే కధ .

 త్రివేణి పత్రికకు బాపిరాజుగారు కొంతకాలం సంపాదకులుగా ఉన్నారు.సతీఅనసూయ ,ధ్రువ విజయం ,మీరాబాయి సినిమాలకు కళాదర్శకులుగా పని చేశారు .’’బాపిరాజుగారికి చిత్రకళ పిలిస్తే పలికే దివ్య శక్తి ఉంది’’అన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు సాహితీ ప్రియులు శ్రీ గూడూరి నమశ్శివాయగారు .ముట్నూరి కృష్ణారావుగారు బాపిరాజులోని  కళా తృష్ణ గుర్తించి ‘’కులపతి ‘’బిరుదునిచ్చారు .బందరు ఆంధ్రజాతీయ కళాశాలనుబాపిరాజుగారు ఆదర్శమైన ‘’గురుకులం ‘’.గా తీర్చిదిద్దారు .

‘’నువ్వటే,నువ్వటే – పువ్వు వంటీ వయసు ,-నవ్వులాంటీ సొగసు -రువ్వి నాయెదపైన-పర్వు లెత్తా వటే ‘’అంటూ ఎప్పుడూ  పాడుకొనే వారు కులపతి శ్రీ  అడివి బాపిరాజు గారు .

ఆధారం

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగారి ‘’మధుర వాణి ఇంటర్వ్యూలు ‘’.

మీ – గబ్బిట దుర్గాప్రసాద్ -19-11-25-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.24 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.18.11.25.

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.24 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.18.11.25

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.24 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.18.11.25.

https://youtu.be/7qFIRnnRO8E.

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.8 వ భాగం.18.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.8 వ భాగం.18.11.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.39 వ భాగం.18.11.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.39 వ భాగం.18.11.25.

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.16 వ భాగం.18.11.25.

మహాకవి కాళిదాసు కుమార సంభవం.16 వ భాగం.18.11.25.

Posted in రచనలు | Leave a comment

కులపతి అడివి బాపిరాజుగారి కీర్తిచ్ఛటలు -2

 .ఖాన్ బహదూర్ అహ్మద్ నవాజ్ జంగ్ అల్లుడు కలకత్తాకు చెందినగులాం మహమ్మద్ మీజాన్  పత్రికను ఇంగ్లీష్ ఉర్దూ తెలుగు భాషలలో ప్రచురించేవాడు .తెలుగుపత్రిక సంపాదకుడు బాపిరాజుగారు .తెలుగు మీజాన్ నిజాం వ్యతిరేక శక్తులను సమర్ధించేది.ఆంధ్రమహాసభను సమర్ధించేది .ఇదేమిటి ఆని స్వామి శివ శంకర స్వామి ఇలాంటి వాళ్ళను పెట్టావేమిటి ఆని అడిగితె బాపిరాజు గారు ‘’వీణలో ఒక తీగ షడ్జమం పలుకుతుంది .మరొకటి రిషభ౦,ఇంకోటి గా౦ధారం  నాలుగవది దైవతం,అయిదవది మధ్యమం ,ఆరు నిషాదం ఏడవది పంచమం . పలుకుతాయి .ఇవన్నీ పలికితేనే వీణ అంటాం .కనుకనే సప్తతంత్రి అన్నారు మా స్టాఫ్ కూడా వీణ వంటి వారే .అ౦తా కలిసి మీజాన్ పత్రిక తయారు చేస్తాం .’ఆని సమర్ధించారు .

  ‘’ఓపలనాటి యలమందా’’-పలవరిస్తావా జైలు కోట్లలో ‘’ఆని బాపిరాజుగారు పాడితే పరిసరాలన్నీ మారు మోగేవి .’’లేపాక్షి బసవయ్య లేచి రావయ్యా ‘’ఆని గొంతెత్తితే జనాలు ఉర్రూతలూగేవారు .రాజుగారు మంచి  వంటవాడు .’’బాపిరాజు గాంధీ వంటి వాడు ‘’ఆని పడటానికి బదులు పేపర్లో ‘’వంట వాడు ‘’ఆని అచ్చుతప్పు పడితే ‘’నేను నిజంగానే మంచి వంటవాడిని ‘’ఆని సమర్ధించుకొన్నారు .’’ఉప్పొంగి పోయింది గోదావరీ తానూ తెప్పున్న ఎగసింది గోదావరి ‘’అనే బాపిరాజుగారి గేయం ఆనాడు ఆంధ్ర దేశం లో పాడని వారు లేరు .

  ఒక సారి బాపిరాజు గారి తల్లి కొడుకు జైలులో ఉండగా చూడటానికి వచ్చి గుండె తరుక్కుపోయి బోడబోడా కన్నీరు కార్చారు .అప్పుడు బాపి రాజుగారు’’కటకటాల చేయి సాచి ,కౌగిలించి బోజ్జతడుము అమ్మ చేయి అమృత రేఖ అమ్మప్రేమ అమృతమే ‘’ఆని తానుకూడా కన్నీటితో గేయం చెప్పారు .జైలులో ఉన్నప్పుడుపలకరించటానికి వచ్చిన  భార్య ఖద్దరు చీరకట్టుకొని రానందుకు ఆమెతో మాట్లాడనే లేదట .అంతటి దేశభక్తి బాపిరాజుగారిది .తెలుగు వారికి నేటికీతెలుగు మీద అభిమానం లేదని బాధపడుతూ ,ఆవేదనతో -‘’తెలుగు తనము జారిపోయిన -తెలివి మాలిన తెలుగు వాడా -పేరుమార్చుకు దారి నడువుమురా-నీ దారిలోనే ఊరి పొవుమురా ‘’ఆని రాశారు .బాపిరాజుగారి ‘’దూడూ బసవన్నా ‘’గేయం కూడా ఒక ఊపు ఊపింది ఆనాడు .అది పువ్వులరేవు అయింది .కూల్డ్రే దొర ఆపాట పాడించుకొని ఆ దృశ్యం ఊహించుకొని తన్మయుడయ్యాడు .’’అసలు ఇలాంటి దృశ్యం ఉంటుందా రాజూ’’ ఆని అడిగితె ఒక సంక్రాంతికి ఒక పల్లెటూరుకు  తీసుకు వెళ్లి చూపించారు గురూ గారికి.గంగిరెద్దు మేళం .ఆనందంతో దొర ఆ చిత్రం గీసి బాపిరాజుగారికి బహూకరించారు .ఆబొమ్మ సంక్రాంతికి వేస్తె దొర జూన్ లో సంతకం చేసి ఇచ్చాడు .కారణం బొమ్మలో పర్ఫెక్షన్ కోసం  .పర్ఫెక్షన్ రానిదే కూల్డ్రే ఎవరికీ తన చిత్రం చూపించే వాడు కాదు .

  సశేషం

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -18-11-25-ఉయ్యూరు .–

Posted in రచనలు | Leave a comment

కులపతి అడివి బాపిరాజుగారి కీర్తిచ్ఛటలు

కులపతి అడివి బాపిరాజుగారి కీర్తిచ్ఛటలు

త్రివేణి పత్రిక సంపాదకులు శ్రీ కోలవెన్ను రామకోటేశ్వరరావు బాపిరాజుగారిని రేడియో టాక్ లో ఆయన చేతులు తిప్పటం చూసి’’ శ్రీమతి బాపిరాజు’’ అనేవారట .ఆకాలం లో అందరూ ‘’బాపిబావ ‘’అనే పిలిచేవారు .సౌందర్య పిపాసి అయిన ఆచంట జానకిరాం గారికి బాపిరాజుగారి సుతిమెత్తనిభావాలతో పాటు ,నిత్యసహజ చేష్టలూ ఇష్టమే .బాపిరాజుగారికితెలియకుండానే ఆవేశమో ఉద్వేగమో చెందుతారు.అందుకే ఆయన బ్రతుకు ‘’పరిమళార్ద్ర నందనోద్యానం’’ అయింది .

 ‘’అతడు గీసిన గీత బొమ్మై -అతడుపలికిన పలుకు పాటై -అతడిహృదయములోని మెత్తన -అర్ధవత్క్రుతియై ‘’అన్నారు విశ్వనాథ బాపి బావ గురించి .కాలపురుషుడు ఉల్లాసంగా ఉన్నప్పుడు’’కాటూరీ విశ్వనాథా జాషువా బాపిరాజు ‘’పుట్టారుకనుకనే అంతకు పూర్వం ఏకాలం లోనూ పుట్టని ఈ మహాను భావులు పుట్టారు .బాపిరాజుగారి ఊహా సుందరి శశికళ ‘’అభవ ,సద్యో యవ్వన ,అయోనిజ .ఎవరికీ ఎంతవలచినా ఆమె గృహిణి కాలేదు .

  వ్యవహార దక్షత లేని బాపిరాజుగారు లాయరుగా అధ్యాపకుడుగా ,పత్రికా సంపాదకుడుగా రాణించలేక పోయారు .ఆయన హృదయం కళా సృష్టి లేని చోట రమించదు..కల్లాకపటం లేని ఆయన లోకాన్ని మాత్రం జయించారు .ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే మందు కొనడానికి బజారుకు వెళ్లి  ఆడబ్బుతో యే నక్కపల్లి బొమ్మో ,కాళహస్తి కంచు విగ్రహమో కొని తెచ్చే కళాపిపాసి .ఆ బొమ్మలగురించి ఎంతసేపైనా లెక్చర్ దంచే వారు .ఆయన్ను చూస్తె ఆంగ్లకవి ‘’ఆలివర్ గోల్డ్ స్మిత్ ‘’మళ్లీ పుట్టాడని పిస్తుంది .

  ఆయన పిల్లల ప్రపంచంలో ఇట్టే ఇమిడిపోతారు .పిల్లలపోషణ బాగా తెలిసిన శ్రీమతి బాపిరాజు అయిపోతారు .కొత్తవాళ్ళు అంటే మహా బెరుకు .త్వరగా మాట్లాడి కలవలేరు ..ఆయన పాండిత్యం అంతా గురుముఖతా నేర్చింది కాదు .సాహిత్య సభల్లో రక్తితగ్గి బోరు కొట్టినప్పుడు ‘’పిలవండి బాపిరాజు ‘’ను అనగానే వేదిక ఎక్కి ‘’గవళ్ళ సెల్లాయి కూతురు .-కడు చక్కనిదని సూతురు ‘’అంటూ పాడితే ముసిముసి నవ్వులతో సభ  వెలిగిపోయి మాంద్యం వదిలి పోయేది ..

  బాపిరాజుగారి చిత్రలేఖన గురువులు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్’’ఆస్వాల్డ్ జెన్నింగ్  కూల్డ్రేదొర , ‘’ప్రమోదకుమార్ ఛటర్జీలు .సాహిత్యం శిల్ప లేఖనం ,శిల్పం సంగీతం, నాట్యం అనేవి అయిదూ పంచనదీ పరివేష్టితమైన పంజాబు వంటిదికళ ..వాటిలో నిష్ణాతులను కులపతి అంటారు .అలా౦టికులపతి బాపిరాజుగారు

  కవులు ఆయనను చిత్రకారుడు ఆని చిత్రకారులు ఆయన్ను కవి ఆని అనుకొంటూ ఆయనకు రావాల్సిన కీర్తి రాలేదని విజ్ఞులు అంటారు ..తన శశిని ఒక తల్లికి ,కళను మరో తల్లికి పంచి ఇచ్చానన్నారు .చంద్రుడు కవిత్వానికి అధిపతి .వెన్నెల అంతా కవిత్వమే .సూర్యుడు  వర్ణపతి .చిత్రలేఖానికి అధిపతి ‘’.ఆని చెప్పారాయన .బాపిరాజుగారిభార్యకు చిన్నప్పటినుంచి నెర్వస్ బ్రేక్ డౌన్ .కదలలేని స్థితి .తనను ఎప్పుడూ దగ్గరే కూర్చోమనేది .పెద్దమ్మాయి రాధా వసంతకు చిన్నతనం లోనే పోలియో వచ్చి నడవలేదు .అయినా వాళ్ళిద్దరికీ  అత్యంత స్థైర్యం  కలిగించారు బాపిరాజుగారు .పిల్లల్ని కనటం తప్ప అన్నీ ముమ్మూర్తులా స్త్రీత్వమే ఆయనది .ఆయన నోట్లో ఆడవాళ్ళులాగా’’ నువ్వు గింజనానదు ‘’అనేవారట కాటూరి .

  ఆస్వాల్డ్ కూల్డ్రే గారితో ఆజంతా ఎల్లోరా గుహలన్నీ తిరిగి చూసి ప్రకృతి సౌందర్యం వెల్లి విరిసే చోటు కోసం బాపిరాజు గారు వెతికి ఆ రాత్రి పాపికొండల మీద అడవిలో చిక్కుకున్నారు .అన్నీ లతా నికు౦జాలే . గలగలపారే సెలయేళ్ళ  ప్రక్క తలలూపుతున ఎత్తైన వృక్షరాజాలు ,, వాటి దగ్గర రాతి బండలు .వాటిపై ప్రసరించే పండు వెన్నెల .అలసి సొలసి బాపిరాజు ఒక బండమీద నిద్రపోయారు .అప్పుడు కూల్డ్రే దొరకు ఒక అద్భుత దృశ్యం కనపడింది .ఆవెన్నెల అంతా ఒక స్త్రీ మూర్తిగా మారి బాపిరాజుగారిమీద వాలిపోయింది .ఆ దృశ్యాన్ని దొరగారు చిత్రించి శిష్యుడు బాపిరాజుగారికి బహూకరించారు అదే ‘’ఎండి మియాన్ ‘చిత్రంగా ప్రసిద్ధి కెక్కింది .ఇదీ ఆంగ్లకవి కీట్స్ రాసిన ఒక కవిత .చంద్ర దేవత సెలీన్ కు అత్యంత ప్రియమైన గొర్రెలకాపరి ’ఎండిమియాన్ పై కురిపించిన ప్రేమ వర్షం .కూల్డ్రే గీసిన ఈఅద్భుత చిత్రంపై శిష్యుడు బాపిరాజు -‘’చంద్రలోకం తూర్పు దెసలో -సూర్యలోకం పశ్చిమంలో -చిన్నిలోకం ఒకటున్నాదే-ఓ నా వెన్నెలా చిన్నారి పడుచా -ఆలోకమేలే కన్నె రాశివి -నువ్వే నువ్వేనే ‘’

  తెలుగు భాష భాషా మాధుర్యానికి  చక్కగా సేవ చేసిన  ,’’షట్ చక్రవర్తుల’’ లో బాపిరాజుగారు ,చిలకమర్తి లక్ష్మీ నరసింహం ,,శ్రీపాదసుబ్రహ్మణ్య శాస్త్రి , విశ్వనాథసత్యనారాయణ , ,నోరి నరసింహశాస్త్రి ,మల్లాది రామకృష్ణ శాస్త్రి గార్లు ఆని అంటారు విజ్ఞులు .బాపిరాజు గారి ఆహార్యం విచిత్రంగా ఉండేది .ఖద్దరుపంచ ఖద్దరు లాల్చీ ,పైన ఉత్తరీయం ,దువ్వని జుట్టు ,కాళ్ళకు బందరు చెప్పులు .

  స్వాతంత్రోద్యమం లో జైలుకు వెడితే ,మిత్రులుఎవరైనా బాపిరాజుగారికి డబ్బు ఇస్తే ,దాన్ని ఎదురైనా ‘’తన కుచేల మిత్రుల ‘’చేతుల్లో పెట్టి నిర్విరామంగా ఇంటికి తిరిగి వచ్చేవారు .తెలుగు సాహితీ వనం లో ఆ నాడు ఆయన ఒక రసాలవృక్షం  గా నిలబడి అన్నివైపులకు చేతులు సాచేవారు .బాపిరాజుగారికి స్వర్ణాభిషేకం జరిగింది .’’నాకు గురుత్వం వహించిన నా శిష్యుడు బాపిరాజు ‘’అనూ కూల్డ్రే దొర ఒకపుస్తకాన్ని బాపిరాజుగారికి అంకితం చేయటం చరిత్రలో అపూర్వ విషయం .గొప్ప అదృష్టం .తెలుగు సాహిత్యాభిమానులకు బాపిరాజు ,విశ్వనాథ గార్లు సూర్య చంద్రులు .’’పూర్వకవుల ఆఖరి కాపు శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రిగారు ,నవ్యకవుల ప్రధమ సంతానం రాయప్రోలు సుబ్బారావు ,నవ్యకవిత్వం లో వంకర కొమ్మ శ్రీ శ్రీ ‘’ఆని బాపిరాజుగారు ఎస్టిమేట్ చేశారు ..

  హైదరాబాద్ లో మీజాన్ పత్రిక నడుపుతూ ,పత్రికలో సీరియల్ నవలారచనకు ఆద్యులై , సినిమాకాలం కూడా ప్రవేశ పెట్టిన ఘనత బాపిరాజుగారిది .’’ఆకాశ మల్లె దీవి -ఆమల్లెపూల తావి -అల్లదిగో బావ చూడు -అల్లారు ముద్దుబావ -అడివి బాపి బావ ‘’

ఆధారం -పురాణ౦ వారి ‘’మధుర వాణి ఇంటర్వ్యూలు ‘’

సశేషం

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -18-11-25-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.23 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.17.11.25.

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.23 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.17.11.25.

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.7 వ భాగం.17.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.7 వ భాగం.17.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.7 వ భాగం.17.11.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.38 వ భాగం.17.11.25

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.38 వ భాగం.17.11.25

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.38 వ భాగం.17.11.25

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.15 వ భాగం.17.11.25 Part -2 .

మహాకవి కాళిదాసు కుమార సంభవం.15 వ భాగం.17.11.25 Part -2 .

మహాకవి కాళిదాసు కుమార సంభవం.15 వ భాగం.17.11.25 Part -2 .

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.15 వ భాగం.17.11.25.

మహాకవి కాళిదాసు కుమార సంభవం.15 వ భాగం.17.11.25

మహాకవి కాళిదాసు కుమార సంభవం.15 వ భాగం.17.11.25.

https://youtu.be/-frOb2NsESs.

Posted in రచనలు | Leave a comment