చరిత్ర –సాహిత్యం –5 (చివరి భాగం )
రవీంద్ర నాద టాగూర్ ‘’literature is really not reflections of social process ,but the essence ,the abrifgement and summary of history ‘’అన్నాడు .కనుకనే సంఘ సంస్కరణా పేక్ష తో స్త్రీ పునర్వివాహం ,కన్యా శుల్కం ,పాశ్చాత్య వ్యామోహం పై నిరసన ,భారతీయ సంస్కృతీ పునరుద్ధరణ ,స్త్రీ స్వాతంత్రం ,,సామ్య వాదం మొదలైన విషయాల పై కందుకూరి ,గురజాడ ,పానుగంటి ,చిలక మార్తి ,,చలం ,విశ్వనాధ ,శ్రీ శ్రీ లు విస్తృతం గా రాశారు .చైతన్యం తగ్గి నిద్ర పోతున్న సమాజాన్ని జాగృతం చేశారు .వైతాళికులు అని పించు కొన్నారు .art not only reproduces life ,but also shapes it ‘’అన్నారు .’’అపారే కావ్య సంసారే కవి రేవ ప్రజా పథిహ్ –యధాస్మై రోచతే విశ్వం –తదే దం పరి వర్తతే ‘’అన్నాడు ఆనంద వర్ధనుడు అనే ఆలన్కారికుడు .అంటే సాహిత్య జగత్తు లో కవే బ్రహ్మ .ఈ విశ్వాన్ని తనకు ఎలా కావాలో అలా మలచు కుంటాడు .విలియం బ్లేక్ కూడా he sees a world in a grain of sand and heaven in a wild flower –holds infinity in a palm of your hand and eternity in an hour ‘’అన్నాడు .కవికి ఉన్న ప్రతిభ అనంతం .అతని ప్రభావం కూడా గొప్పదే .మనం చరిత్ర ,సాహిత్యం గురించి కదా మాట్లాడు కొనేది—అందుకే ప్లేటో అంటాడు ‘’poetry comes nearer to vital truth than history ‘’ఉన్న విషయాన్ని చరిత్ర కారుడు వివరిస్తాడు .అందులోని పరమార్ధాన్ని నిరూపిస్తాడు కళా కారుడు .
శ్రీ కృష్ణ దేవ రాయలు దక్షిణ భారత దేశాన్ని సమైక్యం గా ఉంచాడు .ఈ భావ వ్యాప్తికే ఆముక్త మాల్యద రాశాడు ..తంజావూరు పాలకులు మహారాష్ట్రులు ,మైసూరు రాజులు ద్రావిడ భాషా సాహిత్యం తో తెలుగు భాష సన్నిహితం గా మేలగేట్లు చేశారు .జాతీయ సమైక్యత కావాలంటే భాషా సమైక్యత అవసరం .దీని వల్ల భావ సమైక్యతా వస్తుంది .ఇది అన్ని సమైక్యత ల కంటే గొప్పది .అదే మనకు కరువైన్దిప్పుడు .అలాగే యాత్రసాహిత్యాన్ని రాసి భారతీయ సాంఘిక ,సాంస్కృతిక ,సాంప్రదాయ స్తితి గతుల్ని ప్రజలకు అందించారు ఏనుగుల వీరాస్వామి తన ‘’కాశీ యాత్ర’’అనే త్రావేలోగ్ లో .’’నీలగిరి యాత్ర లో ‘’కోలాచల శేషాచల కవి ,కాశీ మజిలీ కధలు ,జానపద కధలు ఆనాటి వైభవాలను అద్దం లో చూపాయి .
అక్షరం మన ఆయుధం .దాని ప్రతాపం తోనే వీరేశ లింగం గారుమూఢ ,చాందస ఆచారాలను ఎండ గట్టారు .తెలుగు లోని అన్ని ఆధునిక ప్రక్రియలకు ఆయనే ఆద్యుడు .అయితే మన జీవన మూలాను మరువ రాదు .మన వేళ్ళను విచ్చేదం చేసుకో రాదు .అమెరికా లోని నీగ్రో ల దయనీయ స్తితుల్ని చూసి తన జాతి వ్రేళ్ళు ఎక్కడ ఉన్నాయో పరిశోధన చేసి నల్ల జాతిని మేల్కొల్ప టానికి ‘’ది రూట్స్ ‘’అనే పుస్తకం రాశాడు నల్ల జాతీయుడు .రాహుల్ సాంకృత్యాయన్ ఓల్గా సే గంగా లో చారిత్రకాదారంగా పూర్వపు మన నాగారకతా ప్రయాణం అంతా వివ రించాడు .కవులు ,కళా కారులు మన సాంస్కృతిక రాయ బారులు .పూర్వం నన్నయ ,తిక్కన ఈ పనే చేసి తమ రాజ్యాలను ,రాజులను ఆపదల నుండి కాపాడు కొన్నారు .భారతీయ సంస్కృతీ పై పాశ్చాత్య ప్రభావం పెరిగి మనమేవరమో ,మన పూర్వ చరిత్ర ఏమిటో మరిచి పోయే సమయం లో విశ్వ నాద వేయి పడగలు నవల ,రామాయణ కల్ప వృక్షం మన జాతీయ జీవ నానికి మహా భాష్యం గా రాశాడు .తరతరాల భారతీయ సంస్కృతికి సమైక్యతా కు అవి చిహ్నాలు
అయితే విజ్ఞాన శాస్త్రం తెస్తున్న విప్లవం మర్చి పోరాడు .దాన్ని వినాశనాన్ని గుర్తుంచు కోవాలి .జూల్స్ వేర్న్స్ ,హక్సిలీ విశ్వాంతర ప్రయాణాలను గురించి ఊహించి సైంటిఫిక్ ఫిక్షన్ రాశారు .అవి ఆ తర్వాతా నిజమే అయ్యాయి .అందుకే కవిని క్రాంత దర్శి అన్నారు.ఎంత శాస్త్ర వేత్త అయినా హృదయ వాది కావాలి .అందుకే డార్విన్ ,తిన్దాల్ డేవీ లు పరిశోధనల్లో ఎంత మునిగి ఉన్నా టెన్నిసన్ ,షేక్స్ పియర్ మిల్టన్ ,షెల్లీ ల కవితలు చదివారు ,ఆనందించారు .టా లమి ,ఉమర్ ఖయ్యాం లు గొప్ప ఖగోళ శాస్త్ర వేత్తలు కూడా .గొప్ప కవిత్వమూ రాసి మెప్పించారు .మలేరియా పై పరిశోధన చేసిన రోనాల్డ్ రాస్ గొప్ప కవే.తన డైరీ ని పద్యాలలో రాశాడు .వ్వ్యక్తి ,సమాజం ,జాతి మానసిక స్తితి లను చక్క దిడ్డ టానికి సైకాలజీ సాహిత్యమూ వచ్చింది .
ఏది చెప్పినా హితం గా ,మితం గా కమ్మగా చంమగా ,చమత్కారం గా చెప్పాలి ..ఎన్నో వాదాలు ఇతర దేశాల్లో వ్యాపించి తర్వాతా మనకు చేరాయి .claassism ,neo clascism ,romaantism ,naturalism ,futurism ,sarrialism ,symbolism ,impressionism ,imagism ,daadaaism వగైరా ఎన్నో వాదాలు అక్కడ పురుడు పోసుకొని ఇక్కడికి చేరాయి ఇవన్నీ ఎక్కువగా ఫ్రాన్స్ దేశం లోనే ఆరంభ మైనాయి .ప్రాచీనుల్లో నవ్యుడు ,నవ్యుల్లో ప్రాచీనుడు విశ్వనాధ క్లాసికల్ ,రోమాన్తిజం కవిత్వం రాసి భేష అని పించుకొన్నాడు .కృష్ణ శాస్త్రి ,రాయప్రోలు కూడా ఈ మార్గాలను సు సంపన్నం చేశారు .కృష్ణ శాస్త్రిని ఆంధ్రా షెల్లీ అన్నారు .
ఛందస్సు సంకెళ్ళు తెంచు కొని పఠాభి రాశాడు .నిఘంటువుల్ని విసిరేయ మన్నాడు .కాల్పనిక సాహిత్యం లో ‘’లిరిక్ ‘’కు ప్రాధాన్యం వచ్చింది .ఛందస్సు లో మార్పు వచ్చింది .ఆట వెలది తేట గీతి ప్రాచుర్యం పొందాయి .ఎంకి పాటలు వచ్చాయి .అయితే అంతా ఊహల్లో తేలి పోయారు .జనం సంగతి మరిచారు .అప్పుడు వీళ్ళను చూసి ‘’పరుగెత్తే మబ్బుల్లారా !ప్రపంచామిది గమనిస్తారా ‘’అని శ్రీ శ్రీ వాళ్ల దృష్టిని భూమి మీదికి మరల్చాడు .తానూ అభ్యుదయ కవిత్వం రాశాడు .కవిత్వానికి కొత్త నిర్వచనం చెప్పాడు .’’కాదేది కవితకనర్హం ‘’అన్నాడు .శ్రామిక జీవుల శ్రమైక సౌందర్యానికి విలువ నిచ్చాడు .తాజమహల్ కట్టించింది ఎవరో కాదు ,దానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు /అని ప్రశ్నించాడు .తారీఖులు ,దస్తావేజులు చరిత్ర కాదన్నాడు .మానవత కు విలువ నిమ్మన్నాడు .కవితను భూ మార్గం పట్టించాడు .శక్తి ఖలేజా ఉన్న వాళ్లనే రమ్మన్నాడు .లేకుంటే జగన్నాధ రాధా చక్రాల కింద నలిగి పోతారని హెచ్చ రించాడు .’’మీ కోసమే ఈ సమస్తం ‘’అని సామాన్యులకు అండ గా నిలిచాడు శ్రీ శ్రీ .ఆకలి రాజ్యం సినిమా లో కమల హాసన్ చేత శ్రీ శ్రీ కవితలు ఎన్నో విని పించారు .టాగూర్ సినిమా లో ‘’నేను సైతం ,నేను సైతం ప్రపంజాబ్జపు తెల్ల రేకై పల్ల విస్తాను –నేను సైతం ప్రపంచాగ్ని లో సమిధ నౌతాను ‘’లాంటి కవితలు పెట్టి ప్రేరణ కలిగించారు .
ఈ విధం గా సమాజం వ్యక్తీ అవినా భావ సంబంధాన్ని కలిగి నడిచి అభ్యుదయాన్ని సాధించాలి .చరిత్ర ముందుంటే సాహిత్యం తరువాత ,సాహిత్యం ముందు ఉంటె చరిత్ర తర్వాతా ,కొన్ని సందర్భాలలో రెండు కలిసి నడుస్తాయి
సమాప్తం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ — 1-6-12—కాంప్—అమెరికా

