అమెరికా ఊసులు –12 జన ప్రియ ప్రెసిడెంట్ -జాక్సన్

 అమెరికా ఊసులు –12
                                  జన ప్రియ ప్రెసిడెంట్ -జాక్సన్ 

అమెరికా ఏడవ ప్రెసిడెంట్ ఆండ్రూ జాక్సన్ ప్రజల మనిషి గా పేరు పొందాడు .ప్రజల కోసమే తన ప్రభుత్వం అని చెప్పి ,అలాగే నిర్వ హించిన వాడు .ప్రజా హితమే ధ్యేయం గా పాలించిన వాడు .వారి కోసం అడ్డు వచ్చిన వారిని తొక్కి పట్టాడు .సైన్యానికి అది నాయకుడైనా ప్రజా సంబంధాలను కోన సాగించాడు .అమెరికా ప్రెసిడెంట్ లలో అంతకు ముందువారు చేయని పనులను చేసి మంచికి ఆద్యుడని పించుకొన్నాడు .సరిహద్దు రాష్ట్రాలనుండి ఎన్ని కైన మొదటి అధ్యక్షుడు జాక్సన్ .ప్ర భుత్వం ప్రజల కోసమే నని ప్రకటించిన మొదటి అధ్యక్షుడాయన .ప్రజలను పాలించేది ,కాంగ్రేస్ కాదు ప్రెసిడెంట్ మాత్రమె నని తేల్చి చెప్పిన మొదటి ప్రెసిడెంట్ .అధ్యక్షుల్లో మొదటి సారి అభి శంశనను ఎదుర్కొన్న వాడు కూడా ఆయనే .అంతకు ముందు పని చేసిన ప్రెసిడెంట్లు అందరు కలిసి చేసిన వీటో ల కంటే ఎక్కువ సార్లు వీటో హక్కును ఉపయోగించిన వాడు .జాతీయ అప్పును రద్దు చేసిన మొదటి ప్రెసిడెంట్ .ప్రభుత్వాన్ని సంస్కరించి ,ప్రజోప యోగమైన పనులకు వీలు కల్పించిన మొదటి వాడూ ఆయనే .అమెరికా ప్రజాస్వామ్యాన్ని సమూలం గా మార్పు చేసిన మొదటి అధ్యక్షుడు .”ప్రజలే అంతిమ అది కారులు ”అని చెప్పి ఆ మాటకే కట్టు బడ్డ వాడు వీరుడు ,ధీరుడు ప్రజా ధ్యక్షుడు జాక్సన్ .అయితే46,000మంది నేటివ్ అమెరికన్లను వారి స్థావరాల  నుండి ఖాళీ చేయించి మిసిసిపి నదీ తీరానికి వారి అసహనానికిగురి అయిన వాడూ ఆయనే . ”ప్రజల సేవకుడు ప్రెసిడెంట్ ”అని డిక్లేర్ చేసిన వాడు .ప్రజలు అంటే ,కూలీ లు ,వ్యవసాయ దారులు ,సామాన్య ప్రజలే కాని ,వ్యాపారస్తులు వాణిజ్య వేత్తలు కాదని స్పష్టం చేసిన వాడు .ఇన్ని విధాల ఆయన అగ్ర గామి గా ఉన్నాడు .రెండు సార్లు అమెరికా అధ్యక్షుడై అత్యధిక మెజార్టీ ని సాధించిన వాడు .తన తర్వాతా అధ్యక్షుని గా ఎన్ని కైన జేమేస్ పొలాక్ టేన్నిసి  రాష్ట్రం నుండి ఎననిక అయినవాడు .ఆయన్ను ”i thank my god that the republic is safe ”అని మనసారా అభి నందించిన వాడు జాక్సన్ .తన ఒళ్లంతా నీరు పట్టి నంజు వ్యాధి తో బాధ పడుతూ తన స్తితిని ”నేను నీటి బుడగ గా ఉన్నాను ”అని జోకేసుకొన్న వాడు .చని పోతు తన పిల్లలకు ”do not cry -be good -we will meet in heaven ”అని ధైర్యం చెప్పిన వాడు .జాక్సన్ తోనే అమెరికా ప్రెసిడెంట్ల ఫోటోలు మొదలైనాయి .అంతకు ముందు వారివారి ఫోటోలు లేవు .ఇందులోనూ ఆయన ముందే ఉన్నాడు 
ప్రెసిడెంట్ పదవి లోంచి దిగి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆయన దగ్గరున్న డబ్బు కేవలం 90  డాలర్లు మాత్రమె .అమెరికన్ కాన్సల్ అధికారులను మెక్సికన్ ప్రభుత్వం బాధిస్తుంటే ”మా యే ఒక్క పౌ రుడి నెత్తి మీద వెంట్రుక జోలికి వచ్చినా మిమ్మల్ని సర్వ నాశనం చేస్తాం ”అని హెచ్చరించిన ధైర్య శాలి . అతన్నిold  hickery  అని ముద్దుగా పిలుచుకొనే వాళ్ళు జనం .అంటే అంత గట్టి గా     గా ఉంటాడని, వ్యవహరిస్తాడని భావం .ఆయన అధ్యక్షుడు గా వైట్ హౌస్ లో ప్రమాణ స్వీకారం చేస్తుంటే వేలాది మంది అధ్యక్ష భవనానికి చేరి ,కళ్ళారా చూశారు .అందుకనే jaansan created mobocracy  not democracy ”అన్నారు గిట్టని వాళ్ళు .అయితే భార్య కొద్ది కాలం ముందే చని పోయింది .ఆ దుఖం తోనే నల్ల బట్టలతో ప్రమాణ స్వీకారం చేశాడు .అసలు జాక్సన్ కు స్వంత పిల్లలు లేరు .పెంచుకొన్నాడు .వారిని అపార ప్రేమాభి మానా లతో పెంచాడు .ఆయన పై పెట్టిన అభి శంషన  ను రికార్డు నుంచి తొలగించాలని డెమోక్రాట్లు పట్టు బట్టారు .కాని టోరీలు అలానే ఉంచాలన్నారు .చివరికి ఓటింగ్ జరిపితే ,ఇరవై నాలుగు మంది తీసేయాలని పందొమ్మిది మంది ఉంచాలని వోటేసి రికార్డుల నుంచి తొలగించేశారు .
          ఆనాడు ప్రభుత్వాధి కారులంతా లంచ గొండులై ప్రజా ధనాన్ని దుర్విని యోగం చేస్తే వారిని అదుపు చేయటానికి పాలనా సంబంధ మైన సంస్కరణలను ప్రవేశపెట్టి అమలు చేసిన మొదటి ప్రెసిడెంట్ .చిల్లర నాణాలు ప్రజలకు అందు బాటు లో లేక పోతే మింట్ లకు ఆజ్న జారీ చేసి బంగారు వెండి నాణాలను ముద్రింప జేసి ప్రజలకు అందు బాటులో తెచ్చాడు .వీటిని ”జాక్సన్ నాణాలు ”అన్నారు .ద్వంద్వ యుద్ధాలంటే జాక్సన్ కు ఇష్టం .రెండు సార్లు అలా పాల్గొన్నాడు .రెండో సారి పిస్టల్ తో ప్రత్యర్ధి తో పోటీ చేశాడు .తను కాల్చిన గుళ్ళు రెండు చేతి లో దిగి చివరి దాకా అక్కడే ఉన్నాయి .చివర్లో కత్తి  పెట్టి కోసి తానే తీసేసు కొన్నాడు .బాంక్ ఆఫ్ యు నైటేడ్ స్టేట్స్ అవి నీతికి ఆలా వాల మై ప్రభుత్వ ధ నాన్నిస్వీకరించక పోతే దాని ప్రెసిడెంట్ అధికారాలను పీకేసి దారికి తెచ్చాడు . the bank is trying to kill me but i will kill it ”అని చెప్పి అన్నంత పనీ చేశాడు .ఆయన కేబి నేత ను కిచెన్ కాబినెట్  అని పార్లల్ కాబినెట్ అని విమర్శించే వారు .దగ్గిర వారు చేప్పే  మాటలే వినే వాడనిఅందుకే కిచెన్ కాబినెట్ ,ఏర్పరచిన అధికారుల మాట వినక పోవటం వల్ల పారలల్ కాబి నేట్ అని అనే వారు .,preserve your people and nation అని నేటివ్ అమెరికన్ల కు నచ్చ చెప్పాడు .వాళ్ళు కూడా god bless you my great father అని ఆశీర్వ దించారు .అమెరికా ప్రజాస్వామ్యం ,సంయుక్త రాష్ట్రాల ఐక్యతా వర్ధిల్లాలని మనసారా చెప్పే వాడు ,దానికోసమే కృషి చేశాడు .అమెరికా అధ్యక్షుని గా ప్రమాణ స్వీకారం చేస్తూ ప్రజలకు వంగిఅభివాదం తెలియ జేశాడు .దానితో జనం చప్పట్లు చరచి అభి నందించారు .ఆయన  టేన్నీసి రాష్ట్రం నుండి ఎన్ని కైన ప్రెసిడెంట్ .అందుకే ఫ్రాంటియర్ ప్రెసిడెంట్ అని పించుకొన్నాడు .
ఫ్లారిడా ను ఫ్రెంచ్ వారి నుండి విముక్తం చేశాడు .టేన్నిసి యూ నియన్ లో చేరి నపుడు దాని కన్వెన్షన్ కమితిసభ్యుడై తెల్ల మగ వారందరికి వోట హక్కు కలిపించి అందరి అభిమానం సంపాదించాడు .జాక్సన్ march 15 ,1767 లో జన్మించాడు .సౌత్ కే రోలినా లోని వాక్సా లో పెరిగాడు .ఆ ఊరు మేముంటున్న శార్లేట్ కు రెండే రెండు కిలో మీటర్ల దూరం లో ఉంది .తర్వాత్ గ్ర్రెన్ బరో కు చేరాడు .కెంటకీ లో తన రాజ కీయ జీవితాన్ని ప్రారంభించాడు .1845జూన్ ఎనిమిదిన అరవై ఎనిమిదేళ్ళ వయసు లో మరణించాడు ప్రజా ప్రెసిడెంట్ ఆండ్రూ జాక్సన్  .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –31-7-12.–కాంప్–అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.