తిక్కన భారతం –24 శాంతి అనుశాసన అశ్వమేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ -2

 తిక్కన భారతం –24
శాంతి అనుశాసన అశ్వమేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ -2

”మనుజులు సేయ నెవ్వరు సమస్తము నీశ్వరు నాజ్ఞ జెల్లెడు- న్వినుము  ,కుఠార పాణి ధరణీ రుహముల్ నరకంగ,బాప మొం-దునొకొ,కుఠారమున్ జనులు దోసము బొందరు  కర్త ,ఈశ్వరుం –డని యేడు నిశ్చయంబు ద్రుధమది నిల్చిన జాలు భూవరా ”,అని ధర్మజుని కి వ్యాస మహర్షి జ్ఞానోప దేశం చేశాడు .అహంకార మమకారాలు ,రాగ మొహాలు ,వీడి పోగా మనస్సు కుదుట పడింది .ఆత్మా జిజ్ఞాస ఏర్పడింది .అందుకే యోగాభ్యాసం లో ఉన్న శ్రీ కృష్ణుని సందర్శించి ,మార్గం బోధించా మని కోరాడు .దీని వల్ల అతనికి యోగా నిష్ఠ లో ఆసక్తి ,పర తత్త్వం ఐ కోరికా బలపడ్డాయని తెలుస్తోంది .శాంతి ,అనుశాసనికపర్వాలలో ఆధ్యాత్మిక తత్త్వం  ప్రకృతి రహస్యం అంతా అతన్ని కర్మ యోగి గా మార్చాయి .
కదా నాయకు లైన పాండవుల జీవిత చరమాంకం ప్రశాంతత పొందటమే .నాయకుడూ ,ఫలాది కారి అయిన ధర్మ రాజు స్వర్గం చేరా లాంటీ ,చిత్తశాంతి పొందాలి .అతని విషయం లో ఒక వేదాంత అర్ధం కూడా ఉంది .పూర్వ జన్మ సంస్కారం కారణం గా సత్య నిష్ఠ ,ధర్మ పర తత్త్వం దైవ భక్తీ మొదలైనవి కలిగాయి .ఇంద్రియాలను వశ పరచు కొన్నాడు .రాగ ద్వేషాదులను జయించి ,స్వధర్మ నిర్వహణ చేశాడు .క్షత్రియులకు ఉచిత మైన యుద్ధమూ చేశాడు .రాజసం అవలంబించి ,విజ్రుమ్భించినా ,యుద్ధం తర్వాతసహజ సిద్ధ మైన ప్రశాంతత పొందటం అతని ప్రకృతికి చాలా సమంజస మైనది .కల్పాంతం లో తీవ్ర మైన గాలితో ఉప్పొంగి ,సమస్తాన్ని ఆక్రమించి ముంచేసే మహా సముద్రం ,మళ్ళీ శాంతి పొంది ,మేర అంటే చెలియలి కట్ట దాటకుండా ఉండే విధం గా స్వభావం తో సౌమ్య మైన బ్రహ్మ జ్యోతి కారనాన్తరంగం గా ,రాజసం మొదలైన వికారం పొందినా ,మళ్ళీ సహజ స్వభావం అయిన సౌమ్యాన్ని పొందు తుంది .ఈ విషయాన్నే  –”నిసర్గ సౌమ్య మేవ బ్రహ్మం జ్యొథిహ్ కుతోపి కారణా –త్ప్రాప్త ,వికార మాపి ,పునః ,స్వభావమే వావ తిష్టతే–కల్పాంత వాత సంక్షోభ లంఘితా శేష భూభ్రుతః –స్థైర్య ప్రసాద ,మర్యా దాస్తా ఎవహి మహొదధెహ్ ”అన్న దాని లో వివ రించారు .
మొహం తో ద్యూతం లో పాల్గొన్నా ,అరణ్య వాస తపోనియమాడులతో పూరమ సంస్కార స్మృతిని ధర్మ రాజు పొందాడు .ఇంద్రియాలను జయించి ,శ్రీ కృష్ణుని ఆలంబనం గా భీమార్జునుల సహాయ సాధన సంపత్తి తో దుర్యోధనాది శత్రు వర్గాన్ని జయించి ,భీష్మ గురూప దేశం చేత జ్ఞాని యై ,ఆత్మా సాక్షాత్కారాన్ని పొంది ,చివరికి స శరీర స్వర్గ ప్రాప్తి అనే జీవన్ముక్తి ని పొందటం అంతా పైన చెప్పిన వేదాన్తార్ధం లో సమన్వయం అవుతుంది .ఆధ్యాత్మికత్వాన్ని ప్రతి పాదించటం లో వ్యాస విధానం చాలా విశిష్ట మైనది .దివ్యామ్ష సంభూతుడు ,జితేంద్రియుడు ,మనో వాక్కాయ కర్మ ల చేత” సంయమి ”అని పించు కొన్న వాడు ,జ్ఞానిగా జీవించి ,వీరోచిత యుద్ధాన్ని ప్రతి ఫలా పేక్ష లేకుండా నిర్వహించి ,చివరకు ప్రశాన్తుడై ,అంపశయ్య మీద తన మరణం నిమిత్తం  ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తూ ,పరమ నిష్ఠ లో ఉన్న భీష్మ పితామహుడు ధర్మజునికి తగిన ”ఉప దేష్ట ”.అంటే ఆచార్యుడు ,,ఉపదేశించదగిన శ్రేష్టుడు .ఎంత ఔచిత్య వంతం గా ఉందొ ఆలోచిస్తే మన మనసులకు మనకే ఎంతో ఆనందం గా ఉంది .ప్రాపంచిక కష్ట సుఖాలను అనుభవించాడు .ధర్మ పరుడు ,ఆత్మా విమర్శ తో పశ్చాత్తాపం తో శుద్ధుడు ,రాగ ద్వేశాడులను తొలగించు కొన్న వాడు ,జిజ్ఞాసువు అయిన ధర్మజుడు” శ్రోత ”.పరమ గురువుకు పరమోత్క్రుష్ట శిష్యుడు .శాంతి ప్రదాయక మైన ఆధ్యాత్మికం ఇంతటి విశిష్ట పరిస్థితి కి అనుగుణం గా తిక్కన రచన కూడా ప్రశాంత గంభీరం గా ఉంటుంది .భావోద్వేగం వదిలి తిక్కన సోమయాజి చక్కని సంయమనం తో రచన చేశాడు .విపుల ప్రపంచానుభావం ,విశిష్ట లౌకికాలౌకిక జ్ఞానం కల్గి జితేంద్రియత్వం యోగా నిష్ఠ మొదలైన వాటి వల్ల ఆత్మా సాక్షాత్కారం పొంది ,బ్రహ్మానందాన్ని అనుభవించిన గురువు భీష్ముల వారు . ఇహ లోక విరక్తుడు ,పరిణత మనస్కుడు  భక్తుడు  ముముక్షువు అయిన  ఉత్తమ శిష్యుడు అయిన ధర్మ రాజుకు ఉత్తమోత్తమం గా ఉపదేశించిన విషయాలన్నీ ఈ పర్వం లో అపూర్వం గా చెప్పా బడ్డాయి .అర్ధానికి మాత్రమె ప్రాధాన్యత నిచ్చి ,కతిన పదాలు ఆడంబరాలు లేకుండా ,సమాసాల జోలికి వెల్ల కుండా ,తిక్కన చాలా సరళ మైన రచన చేశాడు రాజ నీతి మొదలైన వాటిని బోధించే తప్పుడు తగిన ఉపమానాలు ,ఉదాహరణలను ఎన్నుకొని మనస్సు కు హత్తు కోనేట్లు చెప్పాడు .కావ్యము ,ప్రబంధమూ అనే విధానాలు కాకుండా” పౌరాణిక మార్గం” లో రచన చేశాడు .అర్ధం కాని వేదాంత ,అధ్యాత్మిక విషయాలను  చాలా సులభ మైన శైలి లో ,లోక సహజ దృష్టంతా లతో వివరించాడు .సమతలం లో ప్రవహించే గంభీర గంగా ప్రవాహం లాంటి శైలిని తిక్కన మహా కవి అవలంబించి ప్రతిభా విశేశాడు లతో నిర్వహించి ఔనని పించుకొన్నాడు .అదీ మహా కవుల లోకోత్తర విధానం .
యుద్ద  విషయాలన్నీ వర్నించా ల్సి వచ్చినా ,చాలా క్లుప్తం గా వ్యంగ్యం గా వివ రించి ఔచిత్యాన్ని పాటించాడు .నకులుడికి భీష్ముడు ఖడ్గ ప్రభావాన్ని తెలుపుతూ ,శివుని రౌద్రాన్ని వర్ణించే ఘట్టం లో –”హరుండు బెట్టుగా నవ్వి ,పెల్లార్చుటయును ,విని సముద్ధత రయమున ,దనుజ కోటి -మునుగ బర తెంచి తాకిన మును కొని ,వ –దించి ,ఇల ఎల్ల నెత్తుట ముంచే నతడు .”నాలుగు పొడి మాటలతో తేల్చి పారేశాడు .అలాగే కార్త వీర్యుడు హైహయులను చంపటం కూడా ఒకే ఒక పద్యం లో చెప్పాడు .ప్రశాంత చిత్తం తో చని పోవాలని ఎదురు చూసే భీష్ముని చేత శాంతి రస ప్రధాన మైన విషయాన్ని చెప్పించటం లో ఎంతో సంయమనం పాటించాడు తిక్కన .అశ్వ మేధ పర్వం లోని యుద్ధ వర్ణన లో కూడా ఇంతటి ఔచి త్యాన్నే నెల కోల్పాడు .–”నవ్వుచు నానా శరముల -నవ్వీరుల బొలియ జేయ నంతయు విని ,తా –నేవ్వగతో ,దుస్స ల ,యా –కవ్వడి బౌత్రాన్వితముగా, గానగ వచ్చెన్ ”–అని సింధు దేశాదీషులు అర్జునుని పైకి యుద్ధానికి వచ్చి నప్పుడు అతడు ప్రవర్తించిన విధానాన్ని వివరించాడు –”రాజుల జంపకు మని మా –రాజానతి ,ఇచ్చే ,నుద్దురత ,నేననిన –య్యోజ విడిచి ,నట్లైన -బరాజితుగా ,నన్నద్ధరారా పతి దలచున్ ”అవసర మైన యజ్న కర్మ నిర్విఘ్నం గా జరగతమే ధర్మ రాజు ,అర్జునుల ఆశయం .అందుకని యుద్ధం లో రాజసం కంటే ,సాత్వికం ప్రధానం గా పోషించ బడింది .విజజ్రుమ్భణ అర్జునుని యుద్ధం లోను లేదు ,తిక్కన శై లి లోను కనీ పించక పోవటమే ఇక్కడ గొప్ప విషయం .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –3-8-12-కాంప్–అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.