తిక్కన భారతం –25
శాంతి అనుశాసన అశ్వ మేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ –3
తిక్కన మహాకవి కవితా సరస్వతీ స్రవంతి శాంతి ,అనుశాసన పర్వాలలో సాత్వికం గా ప్రత్యక్ష మైతే ,అశ్వ మేధం లో అంతర్వాహిని గా ,నిగూధం గా ప్రవహించింది .”ఇంద్రియములు దామ ఇచ్చ నట్టు నిట్టు ,–దిరిగె నేనియు ,దుఖముల్ దెచ్చు నవియ –కట్టు వడి ,సుఖ యాత్మ –గావలయు నింద్రియ చోర గణము వలన ”–ఇది తికన శైలికీ వర్తిస్తుంది.ఇంద్రియాలను అణచి వేస్తె ,ఆత్మా చక్కగా ప్రకాశి స్తుంది .అలాగే అలంకారాలను తగ్గిస్తే ,శాస్త్రాల అర్ధం చాలా సులభ గ్రాహ్యం అవుతుంది .–”విను ,కేవలుడగు జీవుడు ,-దను బరముం గాగ ,జూతి ,తల్లీనత్వం –బున ,వెలుగు నది ,నిరామయ –మనంత మగు పదము సూవే యతుల వివేకా ”అని అర్ధ గౌరవానికి ప్రాదాన్యమిచ్చాడు .శబ్దార్ధ చమత్కారాడు లను వదిలేసి శుద్ధ సాత్విక రూప రచనను చేశాడు .దీన్నే నిసర్గ రమణీయం అన్నారు .ఈ విధానం లోను చదు వరులను అత్యంతంగా మెప్పించాడు ..గాలి లేని చోట దేపం నిశ్చలం గా ఉంటుంది .సుఖ నిద్ర వల్ల ప్రశాంతత ,మేఘాడంబరం లేని ఆకాశం లో నిర్మ లత్వం ,తరంగాలు లేని మహా సముద్రం లో ప్రసాద స్తితి అంటే ప్రశాంతత ,అలాగే అంతర్ముఖుడై,ఆత్మా సాక్షాత్కారం తో జనిచిన బ్రహ్మానందం లో లీన మైన యోగి స్తితి కూడా అలానే ఉంటుందని చక్కని ఉపమానాలతో విస్పష్టం గా తెలియ జేశాడు .
”అవ్రుష్టి సంరంభ మివామ్బు వాహం –అపా మీవా ధారా మనుత్త రంగం –అంతశ్చరాణాం మరుతాం నిరోధా –న్నివాత ,నిష్కంప మివ ప్రదీపః ”అన్నిమహా కవి కాళిదాసుగారి రచన తిక్కన రచన కు సమాన ఉజ్జీ లా ఉంది .తిక్కన రచన నిశ్చలత ,ప్రశాంత స్వచ్చ్తా ,లక్షణా లతో ”వేద వాజ్మయం ”లాగా మహా తేజో మయం గా ప్రకాశించింది .ధర్మ రాజు తాను తపోవనానికి వెళ్లి హాయిగా జీవితాన్ని గడ పాలని అను కొంట న్నట్లు తమ్ములకుతెలిపాడు .వారందరూ ఏమంటున్నారో చూడండి –”కేవల నిష్కర్మత ,మో-క్షావహ మగు నేని గిరులు ,నవనీజములున్–భూవర ,ముక్తిం బడయం –గా వలదే ,యడవి నునికి ,కైవల్యదమే ?”శక్తి ధైర్యం ఉన్న వారు శత్రు ప్రయతనాన్ని వ్యర్ధం చేసి ,కార్య సిద్ధి పొంది ,,రాజ్యానుభావాన్ని వద్దనటం ,అవి వేకం అన్నారు .యే కార్యక్రమం లేకుండా అంటే నిష్క్రియత్వం తో మోక్షం వస్తుందని భావిస్తే -యే పని లేని కొండలు, చెట్లు, అడవులు మోక్షాన్ని పొందాలి కదా !అలా పొందు తున్నాయా ఆలోచించు అని చాలా చిన్న మాటలతో అనంత సత్యాన్ని వివరించారు అన్నకు -కాదు వివ రించి చెప్పించాడు తిక్కన .అదీ కవితా రహస్యం .చాలా అర్ధ వంత మైన దృష్టాంతాలను చెప్పి ,ఒప్పించారు అన్నయ్యను .హింస లేకుండా జీవించటం ఎవరి తరమూ కాదన్నారు .దీనికో పద్యాన్ని తిక్కన సమయోచితం గా చెప్పాడు –”కాయల ,బండ్ల ,నీళులు గల్గవె ,సూక్ష్మ జంతువుల్ మునుల్ –సేయరే హింస ,వాని ,నుప జీవిత ద్రవ్వరె ,కంద మూలముల్ –నీ యెడ జూడు ప్రాణములు నిలవగా నేర వహింస నేరికిన్ –వేయును నెల ,భక్ష్యముగ ,వేధ విధింప బడే ప్రాణి ప్రానికిన్ ”అని లోక సహజ మైన హింసను వివ రించారు .నీళ్ళల్లో గాలిలో ,కాయల్లో కూరల్లో పాళ్ళలో స్ ఉన్న సూక్ష్మ జీవులు మునులు తీసుకొంటుంటే హింస చేసినట్లా ?కందమూలాలు తవ్వుతుంటే ఎన్నో జీవులు నశిస్తాయి ఇది హింసే అయితే జీవిత విధానం సాగాడు .ఒక ప్రాణి చావు ఇంకో దాని చేతి లో ఉండటం లోక సహజం .ఈ భక్షణ అనేది వేధ అంటే చంపటం హింసించటం అని పించు కోదు .ఇలా వేదాంత రహస్యాలను సులభం గా ,సరళం గా చెప్పాడు తిక్కన .తేట తెలుగు మాటలే ఉప యోగించాడు .శాంతి ఆనుశాసనిక పర్వయే ఆర్య సాహిత్యం లో మహా భారతానికి విశిష్ట స్థానాన్ని సంపాదించి పెట్టాయి .మహా భారత రచనా ప్రకొజనమ్ కూడా దీని తోనే సిద్ధి పొందింది .వ్యాసుని హృదయం దివ్య జ్ఞానం అర్ధం చేసుకొని సులభ గ్రాహ్యం గా తిక్కన మహా కవి తెలుగు చేశాడు .”తెలుగింటి వ్యాసుడు ”అని పించుకొన్నాడు తిక్కన సోమయాజి .
ధర్మ సంకటం చాలా క్లిష్టం గా ఉంటుంది .తేల్చి చెప్పటం మహా కష్టం .శాస్త్ర జ్ఞానం లేని వారికి ఇలాంటి పరి స్తితే యేడు రైతే ఎలా నడుచు కోవాలో అద్భుతం గా చెప్పాడు మహా భారతం లో .–”ధర్మమధర్మము భంగిన -ధర్మము ధర్మంబు మాడ్కి, దనయా, తోచున్ –నిర్మల మతి నరయ వలయు –ధార్మికతన కోరు వాడు దానకేర్పడగన్ ”–బ్రహ్మ చర్య ,గృహస్త ,వాన ప్రస్తా ,సన్యాస ఆశ్రమాలను అవలంబించిన వారు అనుసరించే ధర్మాలు యే విధం గా స్తూల దృష్టికి పరస్పర విరుద్ధం గా కన్పించినా ,సూక్ష్మ పరి శీలన లో ఉత్తమ ధర్మాలుగా వర్తిస్తాయి .శాంతి తో జీవ యాత్ర చేసే వారికి –”వినుము బ్రతి గ్రహంబును ,–యాజనంబును ,నద్యాపనమును ధరామరులకు –ప్రజ రక్ష,నృపులకు బసు పాలనము గృషి ,వాణిజ్యము నివి వణిజులకు ”అని వర్ణాశ్రమ ధర్మాలను తెలిపాడు .అయితే అన్ని వర్ణాల వారు ఆచరించ వలసిన ఉత్తమ ధర్మాలను కూడా వివ రించాడు .–”సత్య శౌచంబులును ,నహింసయు ,ననసూయయు ,శ్రాద్ధంబు ,నాటిది పూజ నమును నాత్మ దార పరతయు సర్వ సాధారణంబు లనఘ వీనను ,నిజ వృత్తులను సమస్త –జాతులును నిహా పర సౌఖ్య సంపదలకు –నాస్పదములగు నింద్యంబు లన్య విధులు ”అని స్పష్టం చేశాడు .వివిధ ధర్మాలను అవలంబించటం లో తమ ధర్మం పట్ల దురభి మానం ,అన్య ధర్మాల పట్ల నీరసం కలగా కుండా సర్వ ధర్మ సమానత్వాన్ని ప్రతి పాదించి చెప్పాడు .–”వినుమనేక విధంబుల విస్తరిల్లు –ధర్మముల యన్దోకండును దలప ,నిష్ప్హ–లంబు లేదాత్మ మొక్షావ లంబీ యైన –ధర్మ ముత్తమమండ్రుతత్వజ్ఞు లధిపా ”అని సర్వోత్తమ మైన ధర్మ స్వరూపాన్ని విడమరచి చెప్పాడు . .అనేక ధర్మాలున్నాయి అందులో ఏదీ పనికి మాలినది కాదు .కాని మోక్షం కోరు కొనే వారు మాత్రం తగిన ధర్మాన్ని ఎన్ను కొని ఆ మార్గం లో మోక్షాన్ని సాధించాలి .
కొన్ని ధర్మాలు పాపం గ కన్పిస్తాయి .కాని సూక్ష్మ విచారణ లో అవి సత్క్రియలు గా తెలియ బడతాయి .ఎలాగో చూడండి –”దూరమున గైదువు గొని తను –బోరి గోన నేతెంచు నట్టిపు రుషుని –వేదాంత రహస్య వేది నయినను –బోరి గొనినను ,గిల్బిషంబు వొందదువత్సా ”దూరం గా ఉండి ఏదో అనుకొని దగ్గరకు వచ్చి చూస్తె అసలు రహస్యం తెలుస్తుంది .అలాగే వేదాంత రహస్యం కూడా ఆచరణ లో దాని విలువ కనీ పిస్తుంది .ప్రాణి హితం కోసం మాట్లాడినవన్ని సత్యాలే .భూత హితం పరమ ధర్మం .అన్ని మతాలకు ఇదే మూలం అనితెలియ జేశాడు .–”సత్యంబు పల్కుట సర్వ ధర్మములకు –మిక్కిలి ,యనృతంబు మేటి పాత –కము ,తద్విశేషంబు గలదు చెప్పేద నోరు –నరదంబు ,ప్రాణంబు నపహరింప –జూచు పాతకులతో సూనృతంబాడుట –పాపంబు ,బొంకులు వలికి యట్టి –వారి హింసించుటవర ధర్మ మిది యొక్క –డేల భూతములకు హితము సేయు –బొంకు లెల్లను ధర్మముల్ భూత బాధ –కంబు లగు నిక్కములు ,పాతకులు వినుము –భూతముల దుష్ట శిష్టత్వములు వివేక –సూక్ష్మతా వేద్యములు ,వాని జూడ వలయు ”నిజం మాట్లాడటం అబద్ధం చెప్పక పోవటం అందరు తప్పక చేయాల్సిన పనులే .ప్రాణాన్ని డబ్బును సంపదను దోచుకొనే పరమ పాపు లతో నిజం చెప్పటం మంచిది కాదు అక్కడ తప్పించుకోవ టానికి అబద్ధం తప్పదు .అసలేప్పుడూ అబద్ధాలు చెప్పే వారిని దండిన్చాల్సిందే .సర్వ భూతాలకు మేలు చేసే టప్పుడు అబద్ధమాడినా అది సత్యం తో సమానమే .కనుక ప్రాణుల దుష్టత్వం శిష్టత్వం చాలా ధర్మ సూక్ష్మా లతో పరిశీలించి నిర్ణయించాలి .పిడుక్కీ బియ్యానికీ ఒకే మందు పనికి రాదు .ఇదే ధర్మ సూక్ష్మం .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -4-8-12–కాంప్–అమెరికా
వీక్షకులు
- 1,120,886 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.7 వ భాగం.8.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.24 వ భాగం.8.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.19 వ భాగం.8.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.1112 వ భాగం.8.2.26.
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.7.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.23 వ భాగం.7.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.18 వ భాగం.7.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.111 వ భాగం.7.2.26
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.6.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.110 వ భాగం.6.2.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,729)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
