అమెరికా డైరీ ” సినీ సంగీత మణి ” శర్మ వారం

  అమెరికా డైరీ
                                  ” సినీ సంగీత మణి ” శర్మ వారం 

జులై ముప్ఫైసోమవారం  నుంచి ఆగస్ట్ అయిదు ఆదివారం   వరకు విశేషాలు .వారం లో మొదటి అయిదు రోజులు సాదా సీదా గానే గడిచి పోయాయి .మా అమ్మాయి పంటి డాక్టర్ వద్ద ఆరు పళ్ళను తీయించు కొంది బుధవారం .చాలా సునాయాసం గా అరగంట లో తీశేశాడు .ఆరోజు కొంచెం నెప్పితో బాధ పడింది కాని మర్నాడు నుంచి పిల్లల్ని సమ్మర్ కాంప్ లకు తీసుకొని వెళ్లటం తీసుకొని రావటం తప్ప లేదు .డ్రైవింగ్ చేయక తప్పని పరిస్తితి .గురువారం లైబ్రరీకి వెళ్లి తొమ్మిది పుస్తకాలిచ్చి కొత్తవి ఆరు తెచ్చు కున్నాను .ఈ వారం లో చదివినవి అన్ని  మంచి ఉపయోగమైన పుస్తకాలే .శుక్ర వారం సాయంత్రం మా వాళ్ళ ఇంట్లో రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది వరకు భజన .ముప్ఫై మంది వచ్చారు .ఇది మూడవ శుక్ర వారం భజన .ఆ తర్వాత విందు .మా అమ్మాయి నిమిగిలిన స్నేహితురాళ్ళు ఏమీ ఇంట్లో తయారు చేయద్దని చెప్పినా పులిహోర ,అన్నం ,సాంబారు కాకర కాయ కారం సెనగ పిండి కూరిన కూర, పెరుగు తయారు చేసింది .మిగిలిన వాళ్ళు సేమ్యా పాయసం ,గారెలు ,ఉప్మా ,చానా మసాలా బీన్సు కూర ,దొండ కాయ  కూర వండి తెచ్చారు .అందరం సరదాగా కలిసి భోజనం చేశాం .అందరు వెళ్ళే సరికి రాత్రి పది అయింది .
శనివారం మా వాళ్ళ ఇంటికి ఎదురు గా మాకు పది గజాల దూరం లో నిర్మించ బడ్డ స్విమ్మింగ్ పూల్ పూర్తీ అయి ఉదయం పది గంటలకు ప్రారంభించారు .పిల్లలు ,పెద్దలు అందరు సరదా గా స్విమ్మింగ్ చేశారు .సాయంత్రం విజ్జి స్నేహితురాలు ,భర్త వచ్చారు .వాళ్ళు ఈ కాలనీ లోనే కొత్త  ఇల్లు కొన్నారట .గృహ ప్రవేశం ఎప్పుడు చేయాలని అడిగారు .వాళ్ళు సెప్టెంబర్ లో చేరాలని అనుకొంటున్నట్లు చెప్పారు .అది అధిక భాద్ర పదం పనికి రాదనీ చెప్పాను .మంచిది చూడమంటే ఆగస్టు ఎనిమిదో తేది బుధవారంఉదయం యేడు యాభై కి  ముహూర్తం పెట్టాను .సంతోషించారు .
                ”  స్వరమణి”శర్మ సంగీత విభావరి
శార్లేట్ లోని ”తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శార్లేట్ ఏరియా ”అనే సంస్థ-” ఆటా”కు అను బంధం గా పని చేస్తోంది .వాళ్ళ ఆధ్వర్యం లో సినీ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీత విభా వరి అయిదవ తేది ఆదివారం సాయంత్రం జరిగింది .మా ఇంటికి నలభై అయిదు నిమిషాల ప్రయాణ దూరం లో, పాతిక మైళ్ళ పైనదూరం  ఉన్న కాన్కార్డ్ పార్కు వే లో ఉన్న రిచింగ్ టన్ హై స్కూల్ ఆడిటోరియం లో జరిగింది .మా అల్లుడు సెప్టెంబర్ నుంచి పిల్లల కోసం ”వీక్లి రీడింగ్ ”క్లాసులు ఇంటి దగ్గర నిర్వ హించాలని అనుకొని ప్రోగ్రాం కు స్పాన్సర్  షిప్ మూడు వందల డాలర్లు కట్టాడు .అందులో వంద డాలర్లు మా అందరి టికేట్లకే సరి పోయింది .మిగిలిన రెండొందలు స్టాల్ పెట్ట టానికి .దీనితో మాకు ముందు వరుస లో కూర్చునే అవకాశం వచ్చింది .షో రాత్రి ఆరున్నరకు ప్రారంభమైంది .తెలుగు సంస్థ కు చెందినజ్యోతి మంచి వాక్యాలను సమ కూర్చుకొని స్వాగతం చెప్పింది .అయితేఎందుకో  మాటలు తడ బడ్డాయి .ఆడిటోరియం బాగా ఉంది .సుమారు నాలుగు వందల మంది జనం వచ్చారు .టికెట్టు ఖరీదు పాతిక డాలర్లు .ఆడవాళ్ళందరూ సాంప్రదాయ దుస్తుల్లో చీర కట్టుకొని రావటం ముచ్చట గా ఉంది .ఇంత మంది తెలుగు వాళ్ళను ఒక్క వేదిక వద్ద చూడటం చాలా ఆనందం గా ఉంది .
ఈ సంగీత విభావరిని వీళ్ళు మ్యూజిక్ ధమాకా అన్నారు .మణి శర్మ ఆధ్వర్యం లో జరిగిన కార్యక్రమం ఇది .కుర్ర వాళ్లైన లబ్ధ ప్రతిష్టులు ఎన్నో సంగీత పోటీలలో విజేతలు సుస్వరం తో అందర్ని అలరించిన హేమ చంద్ర ,కారుణ్య లు అసలైన నాయకు లని పించుకొన్నారు .ఎన్నో పోటీలలో ,గెలుపు సాధించిన ఆడ పిల్లలు గీతా మాధురి ,శ్రావణ భార్గవి ,మాళవిక లు తమ సత్తా ను చాటారు .మణి శర్మ అంటే బీట్ కు ప్రాధాన్యం అని అందరికి తెలిసిన విషయమే .మాధుర్యం కంటే హోరెత్తిన సంగీతం తో జనం కిక్కు కు లో నైనారు .అయితే పాడిన వాటన్నిటి లో నాకు స్వర్గీయ వేటూరి సుందర రామ మూర్తి కలకత్తా నగరం పైన రాసిన ”యమహా  నగరి కలకత్తా పురి ”పాట చాలా నచ్చింది .అందులోని సంగీతస్వరానికి కాక పోయినా పాటలో కలకత్తా గొప్ప తనాన్ని వంగ దేశం లోని మహా మహులను జ్ఞప్తికి తెచ్చిన సంగతి నాకు ఎంతో స్పూర్తి దాయకం గా ఉందని పించింది .ఒక రకం గా చెప్పా లంటే కళ్ళు చెమర్చాయి .గుండె ఆనందం లో నిండి పోయింది .మిగిలినవన్నీ” ఆర్టు  బీట్ ” కంటే ”హార్ట్ బీట్ ”ను పెంచాయనే చెప్పా వచ్చు .ఆ ఘోష భరించలేక చెవులకు రుమాలు అడ్డం పెట్టు కొన్నాను .గంటన్నర తరువాత విరామం .ఆర్టిస్టు లందరూ స్టేజి వెనుక ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్లి కలిశాం .మణి గారితో ఫోటోలు దిగాము .మిగిలిన ఆర్టిస్టు లతో కూడా కలిసి ఫోటోలు తీసుకొన్నాము .వాళ్ళందరూ చాలా సహకరించి ఎంతో ఓపిక తో ఫోటో లకు సిద్ధ పడ్డారు .స్టేజి మీద ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ,ఆడి పాడి అభినయించి  న వాళ్ళల్లో ఉత్సాహం ఉరకలు వేస్తూనే ఉంది .మణి శర్మ తో ”మీరు స్వర మణి శర్మ ” గా కనిపిస్తున్నారు ”అన్నాను ”థాంక్ యు సార్”అని షేక్ హాండ్ ఇచ్చాడు . ” వరుడు”సినిమా లో మేమందరం ఉన్నామని సంగీతం బాగుందని అందులోని ఒక పాట పాడ మని  కోరాను .సరే నని అన్నాడు . విరామ సమయం లో తెలుగు సంస్థ వాళ్ళు స్పాన్సర్ల కు జ్ఞాపికలు అంద జేశారు .అక్కడి స్టాల్ లో ఉన్న” రెండు గారెలు సాంబారు ” పాకెట్ ను మూడు డాలర్లు పెట్టి అందరం తలో పాకెట్ తిన్నాం .

This slideshow requires JavaScript.


మళ్ళీ విరామం తర్వాత సంగీత కార్య క్రమం ప్రారంభ మయింది . గంటన్నర జరిగింది .వరుడు సిని మా పాట తో మొదలైంది .ఈ పాటకు కారుణ్య కు ఫిల్ము ఫేరు అవార్డు వచ్చిందని చెప్పి చక్క గా పాడాడు .చివరి వరుస లోని జనం బాల కృష్ణ పాటలు పాడమని గోలా, అరుపులు ,కేకలు .కొంత ఇబ్బంది కల్గించాయి .ఆయనకు కొంచెం కోపం కూడా తెప్పించాయి .తాను సంగీత దర్శకత్వం చేసిన సిని మాల లోని పాటలే పాడించాడు .జాన పద శైలి లో మధు ప్రియ ,హేమ చంద్ర పాడిన పాట చాలా హై లైట్ గా ఉంది .ఇక్కడొక విషయం చెప్పాలి మా టి.వి .ప్రోగ్రాం లో ”మధు ప్రియ” అనే అమ్మాయి జాన పదగీతాలను బాగా పాడి అందర్ని ఆకట్టుకొన్న విషయం అందరికి తెలిసిందే .ఈ స్టేజి మీద ఆ అమ్మాయి అమ్మ మీద ,నాన్న మీద ,పల్లె టూరి మీద పాడిన పాటలు అసలైన పాటలని పించి గుండెల్ని తట్టి ఆలోచింప జేశాయి .ఈ మొత్తం కార్య క్రమం లో వీటికే ఎక్కువ విలువ నిచ్చారు శ్రోతలు చప్పట్లు మారు మో గించి అభి నందనలు తెలిపారు .మిగిలిన పాటలకు పూర్తీ సపోర్టు మాత్రం ఖచ్చితం గా రాలేదని చెప్ప వచ్చు .పాపం గాయనీ గాయకులూ అడిగి చప్పట్లు కొట్టించు కోవాల్సి వచ్చిందంటే ప్రోగ్రాం ఎందుకో అందర్నీ అలరించ లేదేమో నని పించింది .గుండెల్ని పిండే  పాటో , దేశ భక్తీ ,దైవ భక్తీ ఉన్న పాట లో వుంటే, మనసును కరిగించే స్వరాలుంటే ఇంకా గుండెలు కరిగే వేమో అని పించింది .అయితే బీటు వాడికానందం .
అయితే కారుణ్య ,హేమ చంద్ర లె ఈ విభావరికి నిజ మైన విజేతలు .వారి లో ఉన్న ఎనర్జీ లన్ని టిని ఒడ్చేశారు .కాదు మణిశర్మ పిండేశాడు .ఆ బాణీలు అలాంటివి ఫాస్ట్ బీట్ ఉన్నవి .వారిద్దరూ పాడుతూ ,నటిస్తూ ఎక్కడా సభ్యతకు ఏమాత్రం లోటు రానీయ కుండా చేసిన ప్రయత్నానికి ”హాట్స్ ఆఫ్ ”.ఆడ పిల్లలు గీతా మాధురి ,శ్రావణ భార్గవి ,మాళవిక లు శక్తి యుక్తుల్నిధార పోసి పాడారు .అడ పిల్లలు కదా షో చివర వాళ్ళను చూస్తె లేత తమల పాకుల్లా వాడి పోయి నట్లు కనీ పించారు పాపం .లాలిత్యాన్ని మాళవిక పోషిస్తే ,గీతా మాధురి లాలిత్యం బీటు లను సమం చేసి పాడితే ,భార్గవి ఉషా ఊతప్ లాకొంచెం మగ గొంతుక తో  పాడి  ఆకట్టుకొంది .అందరు తమ లోని ఎనెర్జీ లెవెల్స్ ను ఖాళీ చేసుకొనే దాకా పాడి అందరికి అంటే ఆ బీటు ను ఆనందించే వారికి వినోదం కలిగించారు .
రాత్రి పదిన్నరకు   షో ను అకస్మాత్తుగా ముగించారని పించింది .వెనక నుండి కేకలు, వాళ్ళు కావాలన్న పాటలు పాడక పోవటం ఇబ్బంది కలిగించి అలా చేశాడేమో  మణి శర్మఅనుకొన్నారు .జనగణమన తో పూర్తి .మళ్ళీ మేమందరం మణి శర్మ ,హేమ చంద్ర ,కారుణ్య, గీతా ,శ్రావణ భార్గవి ,మాళవిక ,మధు ప్రియ లతో ఫోటోలు తీసుకొన్నాము .అలసి పోయినా ఆ భావం కాన పడ కుండా వారంతా పోజు లిచ్చి నవ్వు మొహాలతో అందరి తో ఫోటోలు దిగారు .మేము స్పాన్సర్ కోటా లో వాళ్ళం కనుక మమ్మల్నేవరు అడ్డగించలేదు .నేను మణి శర్మ తో ”మీ కుర్రాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చాలా గొప్పవి .అంతా ఖర్చు పెట్టించారు మీరు .వారందరూ ”మణులు ,మీరు శర్మ ”అన్నాను నవ్వి సంతోషం తెలియ జేశాడు .ఖేమ చంద్ర స్టేజి రిహార్సల్సు దగ్గర్నుంచి అన్నీ చూశాడు .అతని కాంట్రిబ్యూషన్ విలువ కట్ట లేనిది .అతనికి మూడు నాలుగు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన అనుభవమూ ఉంది . ఈ క్రెడిట్ అంతా గాయకులకే ఎక్కువ గా చెందుతుంది .శర్మ దర్శకు డైన,కష్టం ,శ్రమా  అంతా హేమ చంద్ర ,కారుణ్యలదే .సందేహం లేదు .అందుకే వారిద్దరికి షేక్ హాండ్ ఇచ్చి నా ఆనందాన్ని వ్యక్తం చేసి మనసు లో మాట ను చెప్పాను .వారిద్దరి ముఖాలు కృతజ్ఞతా భావం తో వెలిగి పోయాయి .
కార్య క్రమం పూర్తీ అవటానికి ముందు ”చేతక్ ”అనే చిన్న కుర్రాడు చాలా జోష్ గా మణి శర్మ స్వర పరచిన రెండు గీతాలను పాడి అందరి అభి నందనాలు పొందాడు .ఆ చిరంజీవికి మంచి భవిష్యత్తు ఉందని పించింది .విభావరి లో డ్రమ్ములు వాయించిన పొట్టి కుర్రాడు మహా విశ్రుం ఖలం గా చెవులు చిల్లులు పడేట్లు, గుండెలదిరే ట్లు  గా క్షణం తీరిక లేకుండా వాయించి శర్మ అనుకొన్న ది సాధించటానికి కారకుడయ్యాడు .మిగిలిన వారు కూడా తగిన సహకారం ఇచ్చి విజయానికి కారకు లైనారు .
సరిగమలు –మణి శర్మ ఎంత సేపు ప్రేక్షకులకు వీపు చూపిస్తూనే దర్శకత్వం వహించాడని సన్నాయి నొక్కులు నొక్కు కొన్నారు -ఆయన స్వచ్చమైన మల్లె పువ్వు లాంటి తెల్ల బట్టలే వేసుకొన్నాడు కాని ఆ చొక్కాపై ఆ శిలువ గుర్తుల్లాంటి వేమిటి?అని బుగ్గలు కొరుక్కున్నారు కొందరు .అది బాపు తీసిన ఏదో సినిమాలో నూతన ప్రసాద్ ”కొత్త దేవుడండీ ”అనే పాటను పాడుతూ వేసుకొన్న డ్రెస్ లా ఉందని, సినిమాలు బాగా చూసి ,కాచి వడ పోసిన ఒక పెద్దాయన నవ్వుతూనే అన్నాడు .ఎవరి డ్రెస్ వారిష్టం .ఇందులో మనకేమిటి ఇబ్బంది ?అన్నాను
పదనిసలు –బాల కృష్ణ పాటలే పాడాలని ఇబ్బంది పెట్టటమేమిటి అని కొందరు సణుక్కున్నారు .బాలికలు ముగ్గురు పాడిన పాటలు మణి శర్మ సినిమాలలో  వారు పాడినవి కావు .అందుకే పాడ టానికి ఇబ్బంది పడ్డారు .పాడాల్సి నంత గొప్పగా ఆడ వాళ్ళు పాడలేక పోయారని ఒక సంగీతాభిమాని, మణి శర్మ గారి సంగీతాన్ని అధ్యయనం చేసిన ఆయనా అన్నాడు .తెలుగు సంస్థ నిర్వ హించిన కార్యక్రమం  కదా !పాడిన పాటల్లో ఎక్కడా తెలుగు పదాలు కనీ పించలేదే -సంగీతం అంతా పాశ్చాత్య పోకడ లో ఉంది .శ్రావ్యత ఎక్కడ ?మాధుర్యం ఏదీ ?తెలుగుదనం ఏదీ ?అని తెలుగును అభి మానించే ఒక అమెరికన్ తెలుగు పెద్దాయన గోడు వెల్ల బోసుకొన్నాడు .ఇది కాల వైపరీత్యం అన్నాడు ఇంకోఆయన .అందరికి ఒకే అభిప్రాయం ఉండాలని లేదు కదా .అయినా ఇంతమంది తెలుగు వాళ్ళను ఒక చోట చేర్చి నందుకు మనం అభి నందించాలిఅని  మరో పెద్ద మనిషి  పెద్ద మనసు తో సంతోషించాడు .ఇదీ–” మణిశర్మాయణం ”–.ధమాకా- ధమ ధమ ధమ ధమాకా ”.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ — 6-8-12- కాంప్–అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.