అమెరికా డైరీ -భారత స్వాతంత్ర దినోత్సవ వారం

           అమెరికా డైరీ -భారత స్వాతంత్ర దినోత్సవ వారం

ఆగస్ట్ పదమూడు  సోమ వారం నుంచి  పందొమ్మిది ఆది వారం వరకు విశేషాలు –
దాదాపు యాభై ఏళ్ళు గా సంగీత కారుడు బీథోవెన్ గురించి వింటూనే ఉన్నాను .కాని ఆయన యే దేశం వాడో ,ఆయన ప్రతిభ ఏమిటో నాకు ఇప్పటి దాకా తెలీదు .మూడు సార్లు అమెరికా వచ్చినా ఆయన మీద నా దృష్టి పడలేదు .ఈ నాలుగో సారి వచ్చిన దగ్గర్నుంచి ఎందుకో తెలుసు కోవాలనే ఆరాటం పెరిగింది .లైబ్రరీ లో కొన్ని పుస్తకాలు తెసుకొచ్చి చదివాను .కాని నాకు కావలసిన్దేమీ కనీ పించలేదు .అయితే ఆయనపూర్తీ పేరు” లుడ్విగ్ వాన్ బీథోవెన్”అనీ ,  జర్మనీ దేశస్తుడు అ ని, చిన్నప్పటి నుండే సంగీతం లో గొప్ప పేరు తెచ్చుకోన్నాడని మాత్రం తెలిసింది .అంతకు మించి ఆయన్ను పూర్తిగా ఆవిష్కరించే రచన దొరక లేదు .కిందటి వారం అలాంటి అరుదైన పుస్తకం దొరికి నా ఆరాటం తీరింది .దాన్ని పూర్తిగా చదివి నాకు కావలసిన నోట్స్ రాసుకోన్నాను .నా దాహం తీరింది .ఆయన ప్రతిభ తెలిసింది .క్రమంగా ఎప్పుడో ఆయన గురించి సమగ్రం గా రాస్తాను .ఆయన సామాన్యుడు కాదు మహా మాన్యుడు .మన వాళ్ళు అందుకనే ఆయన సంగీతాన్ని ,ఆయన సింఫనీ ని పదే  పదే పొగుడుతారు .”సిరి వెన్నెల ”సినిమా లో దర్శకుడు విశ్వనాద్  ఆ అవకాశాన్ని చక్క గా ఉపయోగించాడు .బీథోవెన్” మూన్ లైట్” సొనాటా ”లాగా వెన్నెల్లో బృందావనాన్ని చూపించాడుమురళి గానం తో  కళ్ళు లేని అమ్మాయికి .హరి ప్రసాద్ చౌరాసియా  తో పలికించాడు .మనకూ ఆ ఆనందాన్ని కల్గించాడు .మా విజయ వాడ రేడియో స్టేషన్ డైరెక్టర్ ఆదిత్య ప్రసాద్ గారు బీతోవన్ చూపించిన ఈ అద్భుత దర్శనాన్ని ఎప్పుడు తమ ఉపన్యాసం లో వివ రిస్తూఉంటారు . .ఇన్నాళ్ళకు ,ఇన్నేళ్ళకు ఆ నాద బ్రహ్మ బీథోవెన్ సమగ్ర సంగీత దర్శనాన్ని పొందిన ధన్యుడిని అని పించుకోన్నాను .ఈ  వారమంతా బీథోవెన్ లో మునిగి తేలాను .

 చివరి మంగళ వారం -భోజనం 

శ్రావణ మాసం లో ఇది చివరి మంగళ వారం ”.ప్రక్కి” వారి అమ్మాయి శ్రీ మతి అరుణ చక్కగా నాలుగు వారాలు నోము నోచుకోని మొదటి వారం నాడు మా అమ్మాయిని ,వాళ్ళ అమ్మను భోజనానికి పిల్చింది .ఈ వారం వాళ్ళతో పాటు ”పోతు పేరంటానికి ”నన్నూ పిలిచింది .మా ప్రక్కనున్న రాఘవేంద్ర రావు గారు, భార్య కూడా వచ్చారు .చక్కగా పట్టు బట్ట తో శ్రద్ధ గా పూజ చేసుకొని మా వాళ్లకు వాయనం ఇచ్చి ,తర్వాత భోజనాలు పెట్టింది .పూర్నపు బూరెలు పులిహోర ,టమేటా పప్పు ,బెండకాయ కూర వంకాయ చెట్నీ ,సాంబారు అన్నం ,పెరుగు లతో సంతుష్టికర మైన భోజనం పెట్టి మా పోతు పేరంట గాళ్ళకు కూడా దక్షిణ, తాంబూలాలు ఇచ్చింది . .ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం మూడు అయింది .లైబ్రరీ కి వెళ్లి పుస్తకాలు ఇచ్చి కొత్తవి తెచ్చుకోన్నాము .ఆ అమ్మాయి మంచీ మర్యాదా బాగున్నాయి .

జనాన్ని చెవలాయిలను చేసి,ఆడించిన” జులాయి ”

బుధ వారం రాత్రి రెండో ఆటకు జులాయి  సినిమా కు వెళ్ళాం .మేము ఎడుగురం .మా తో పాటు ఇంకో ”తెలుగు బకరా” తో సహా హాలులో ఖచ్చితం గా ఎనిమిది మంది మాత్రమె .సినిమా ఎందుకు తీశారో ,ఎలా నడుస్తుందో తెలీదు .ఎప్పుడేవాడు వచ్చి కాలుస్తాడో ,ఎవడు చస్తాడో ఎవడు తప్పించుకొంటాడో తెలీదు .పాపం అల్లు అర్జున్ కు నిరాశే .ఇలియానా అందాల కంటే నీరసాలు బాగా ఒలక బాసింది .దేవిశ్రీ ప్రసాద్ ”సంఘీతం” ఘోషా ,మోతా తాషా మరబా తప్ప చెవి కింపైన దేమీ విని పించలేదు .త్రివిక్రమ్ దర్శ కత్వం పేరుకు తగ్గ త్రివిక్రమం గా ఉంటుందను కొంటె ,తిక మకాలుగా ఉంది .షార్ట్ డైలాగుల్లో అల్లు బాగానే చెప్పాడు .లాంగ్ డైలాగుల్లో ఏం చెప్తున్నాడో తెలీలేదు- దొర్లించాడు .పాపం రాజేంద్ర ప్రసాద్ అనే , పోలీసు ఆఫీసరు గారికి తుపాకి పేల్చటం రాదట .చెవిలో కాబేజీ లకు మించిన వేవో పెట్టాడు .”వరుడు” తీసి దానయ్య, చేతికి ఎముక లేదని పించుకొని డబ్బు పోగొట్టు కున్నాడు .పాపం ఇప్పుడైనా వెనకేసు కొంటా  డేమో నను కొన్నాను .ఆ ఆశ ఏమీ క నీ పించలేదు  .జనాన్ని చేవలాయలను చేసి ఆడించాడు ”జులాయి ”.

                       చివరి శుక్ర వారం -భజన 

ఇది చివరి శుక్ర వారం .ఇప్పటికి నాలుగు వారాల నుంచి మా అమ్మాయి వాళ్ళింట్లో భజనలు జరిగాయి .ఇది చివరి వారం భజన .అంటే దీనితో అయిదు వారాలు చేయాలి అనుకొన్న కోరిక తీరింది .ఇరవై మంది వచ్చారు .రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు భజన జరిగింది . ఆ తర్వాత విందు .బ్రెడ్ హల్వా ,వడ ,సొరకాయ కూర ,చెట్నీ ,సాంబారు ,అన్నం ,పెరుగు పుచ్చ కాయ ముక్కలు ,ఆపిల్ ముక్కలు తో విందు బాగానే జరిగింది .

అమెరికా లో  భారత స్వాతంత్ర దినోత్సవం

భారత దేశ 66 వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఇక్కడి ‘‘హిందూ సెంటర్ ”వారు గాంధీ భవన లో  ఘనం గా నిర్వ హించారు .మన దేశం లో లాగా ఇక్కడ యే రోజు పండగ అయితే ఆరోజు చేయరు .శనివారం లేక ఆది వారం నాడు జరుపు తారు .ఈ ఆదివారం అంటే నిన్న పందొమ్మిదో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల పాటు నిర్వ హించారు .మేమందరం వెళ్ళాం .ముందుగా భారత జాతీయ పతాకను, అమెరికా జాతీయ పతాకను వేదిక పై చెరొక వైపునా ఆవిష్కరించారు .వేదిక పై ఆరడుగుల గాంధీ మహాత్ముని కాంశ్య విగ్రహాన్ని ఉంచారు స్పూర్తి దాయకం గా . రెండు దేశాల జాతీయ గీతాలను చిన్నారులు భక్తిగా ఆలపించారు .ఆ తర్వాతా హిందూ సెంటర్ అధ్యక్షులుడాక్టర్ సురేంద్ర పాల్ ముఖ్య అతిధి గా విచ్చేసి స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని ఇచ్చారు .ముఖ్యం గా భారత దేశపు అభి వృద్ధికి స్వాతంత్ర పోరాటానికి సిక్కుల పాత్రను గుర్తు చేశారు .వారి త్యాగాలను చక్కగా గణాంకాల తో వివ రించారు .అమెరికా కాకు వచ్చిన మొదటి తరం భారత దేశీ యులలో సిక్కులు ఉన్నారని ఇక్కడి వ్యవసాయానికి వారే ఆద్యులని ,ఆ తర్వాత అనేక వ్యాపార వాణిజ్యాలలో వారి పాత్ర గణనీయం గా ఉందని హర్ష ధ్వానాల మధ్య తెలిపారు .ఆ స్పూర్తి ని అందరు పొందాలని, ఇక్కడి హిందూ సెంటర్ కు ఈ బాలాజీ దేవాలయానికి అందరు కృషి చేసి అభి వృద్ధి లోకి తెస్తున్నారని ,ఇంకా చెయ్యాల్సింది చాలా ఉందని అందరి సహకారం తోనే అభ్యుదయం  సాధ్యం అని చాలా ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. భారత దేశానికి మచ్చ లేని మన్మోహన్ సింగ్ ప్రధానిగా రెండు సార్లుగా ఉన్నారని కొని యాడారు .బెంగాలీ అయిన ప్రణబ్ ముఖర్జీ అన్ని తెలిసిన పూర్ణ జ్ఞాని ,అత్యంత అనుభవం,  అన్ని శాఖల్లో పని చేసిన నేర్పు ఉన్న మనీషి అని అలాంటి వారు భారత దేశాధ్యక్షు లవటం హర్ష దాయకం అనీ అభి నందించారు .
”  హేమంత్ అమిన్” సభా సంచాలనం చేశారు .”మేడ్ ఇన్ ఇండియా ”అనే సినిమా పాటకు పిల్లలు చక్కని డాన్సు చేశారు .తర్వాత మరో దేశ భక్తీ గీతం ”నన్హా మున్నా ,రాహి హూన్ ”అనే పాటకు మంచి నృత్యం చేశారు పిల్లలు .రాజస్తానీ గీతానికి నలుగురు పిల్లలు ఆ డ్రెస్ వేసుకొని గొప్ప గా నృత్యం చేశారు .భారత నాట్యం జతి స్వరాన్నిఅందంగా అద్భుతం గా నృత్యం చేసి చూపారు కొంచెం పెద్ద వయసు లోని అమ్మాయిలూ .ఇదే అన్నిటి కంటే హైలైట్ .ఆ తర్వాత”షహీద్ ”సినిమా లోని పాట పాడుతుండగా దేశ భక్తులంతా వరుస గా కదిలి నడవటం దానికి తగ్గట్టు అభి నయించటం అందర్ని ఆకర్షించింది .ఇందులో మా పెద్ద మనవడు చి. శ్రీ కేత్ అందరి కంటే తన నాట్య ప్రావీణ్యాన్ని చూపించి మన్ననలు పొందాడు .ఆ తరువాత ”యే మేరె వతన్ ”అనే లతా మంగేష్కర్ దేశ భక్తీ గీతాన్ని ఒకామె పాడింది .ఇలా రెండు గంటల పాటు జనానికి స్వాతంత్ర స్పూర్తి కలిగించారు .అందరు అభి నంద నీయులే .కార్య క్రమం లో పాల్గొన్న చిన్నారు లందరికి బహుమతులు అంద జేశారు నిర్వాహకులు .సుమారు యాభైకి పైగా చిన్నారులు పాల్గొనటం ,వారికి తలిదండ్రులు డ్రెస్ సమకూర్చటం, వీరందరికీ నేర్పి ప్రదర్శింప జేయటం అంత ఆషామాషీ వ్యవహారం కాదు .కాని తలచుకొంటే ఏదైనా చెయ్యచ్చు అని నిరూపించారు ”హిందూ సెంటర్ ”వారు .వారికి ఇంతటి సహాయ సహకారాలు అందించిన వారందరికి అభి నందనాలు .సభలో సుమారు రెండు వంద లకు  పైనే ప్రేక్షకులు రావటం దేశ భక్తికి నిదర్శనం .అందరికీ సిక్కు అల్పాహారం ”పావూ భాజీ ‘‘నిప్రక్కనే ఉన్న  ”వివేకా నంద హాల్” లో ఏర్పాటు చేసి కడుపు నింపారు .బంగాళ దుంప కూరను బాగా మెత్త గా పప్పు లాగా ఉడి కించి దానితో పాటు రెండేసి గుండ్రని మెత్తటి రొట్టెల తో ఇచ్చేదాన్నే ”పావూ భాజీ ”అంటారని మొదటి సారిగా ఇక్కడే తెలిసింది .చాలా రుచి కరం గా ఉంది .ఇంటికి వచ్చే సరికి మధ్యాహ్నం మూడు అయింది .–జై హింద్ –
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20-8-12-కాంప్–అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.