వంద మంది బాలికల తల్లి (one hundred girl’s mother )
‘’Lenore Carole అనే ఆమె రాసిన నవలే పైన పుస్తకం .అమెరికా లోని కాలి ఫోర్నియా లో నిజం గా జరిగిన కధకు కల్పన జోడించి రాసిన నవల .Thomasina Mc intyre అనే ఆవిడ కాలిఫోర్నియా లోని‘’స్కాట్స్ చైనా చైన్’’ అనే చోట ఉంటోంది .ఆ రోజుల్లో చైనా నుంచి ఆడపిల్లల్ని తెచ్చి చైనా టౌన్ లో అమ్మేస్తూండే వారు . వీరితో వ్యభిచారం చేయిస్తూ ,బానిసలుగా చూస్తూ ,పిల్లల్ని కంటే బైటికి విసిరేసి ,ఇళ్ళల్లో గొడ్డు చాకిరీ చేయిస్తూ ,వీలైతే అమ్మేస్తూ ఉండే వారు .ఈ ముఠాకు వ్యతి రేకం గా ,బానిసలకు ,బాధితులకు ఆసరాగా ‘’ప్రెస్బిటేరియన్ మిషన్ ‘’పని చేసేది .’’తోమాసినా’’ ఈ మిషన్ లో 1895 నుండి పని చేసి చిరస్మరణీయమైంది .ఈవిడకు ముందు మిస్ మార్గరెట్ కుల్బెస్తాన్ పని చేసింది .ఈమెకు సాయం గా చున్ మీ ఉండేది .ఈవిడకు వయసు మీద పడటం తో తోమా సీనా కు శిక్షణ నిచ్చి సహాయ టీచర్ గా వేసుకోంది .వీరంతా కలిసి క్రూర రాజకీయాలను ,పనికి రాని న్యాయ ,చట్టాలను ఎదిరించారు .చైనా నుంచి తరలించ బడ్డ ఆడపిల్లల్ని రక్షించటానికి ,ఈ మిషన్ చాలా జాగ్రత్త గా వ్యవహరించి ,ఆ ఆడపిల్లల్ని అభాగ్యులైన గర్భ వతుల్ని ,పోలీసుల సహాయం తో ,చట్టం రక్షణలో ఈ మిషన్ లో చేర్పించి ,బ్రతక టానికి తగిన విధం గా తీర్చి దిద్దుతున్నారు .వీరు పెద్ద వారైన తర్వాత తమ ఇష్టం మేరకు తలి దండ్రుల దగ్గరకు చైనా వెళ్ళ టానికి సహాయం చేస్తున్నారు .లేక పోతే ఇక్కడే క్రాఫ్ట్, ఎంబ్రాయిడరీమొదలైన వి నేర్చుకొని ఉండి పోవచ్చు .వీళ్ళ పని న్యాయ బద్ధం గా దళారీ దారుల నుండి యువతులను విముక్తి చేయటమే .
ఈ విధమైన సేవ చేస్తుంటే కుల్బెస్టన్ తీవ్ర అనారోగ్యానికి గురై కొద్ది కాలానికి మరణించింది .అప్పుడు ఈ మిషన్ నిర్వహణ బాధ్యత తోమాసీనా పై పడింది .ఆమె అత్యంత సేవా భావం తో ,అంకిత మనస్సు తో ,ఆ పిల్లలకు తల్లిలా ధైర్యం గా నిలబడి ,అవసర మైతే పోరాడి చివరి దాకా నిలబడింది .దీనికి తోడు ఆమె కధ మధ్యలో ముగ్గురితో ప్రేమ లో పడుతుంది .కాని కర్తవ్యమ్ బలీయం కనుక ఎప్పుడూ హద్దులు దాటలేదు .చివరికి ‘’రాస్ ‘’అనే ముసలాయన పెళ్లి చేసుకొంటానన్నాడామెను ..సరే అన్నది .ఇంతలో అతను అకస్మాత్తుగా చని పోతాడు .మళ్ళీ ఒంటరిగా నే ఉండి పోతుంది .మిషన్ వ్యవహారాల్లో సర్వం మర్చి పోయింది .తన జీవితాన్ని ఈ అభాగ్యుఅలకోసం త్యాగం చేసి చరితార్దురాలైంది .అలాంటి త్యాగ మూర్తి జీవితం గురించి చదివిన గొప్ప సంతృప్తి మనకు మిగిలి పోతుంది .సేవా భావం అంటే తెలికైన్దేమీ కాదని కత్తి మీద నడకే నని ఈ నవల చదివితే అవగాహన మవుతుంది .
1906 లో కాలి ఫోర్నియా లో తీవ్ర భూకంపం వచ్చింది .సర్వం నేల మట్టమైంది .ఈ మిషనరీ కూడా కూలి పోయే స్తితిలో ఉంది .అప్పుడు సుమారు యాభై మంది పిల్లలతో వేరొక చోటికి మార్చి తల దాచుకొన్నారు వీరంతా .ఆ తర్వాతా దాతల సహకారం తో సకల సదుపాయాలున్న వంద గదుల భవనాన్ని అదే స్తలం లో నిర్మింప జేసి తన ఉదాత్త ఆశయానికి ప్రాణం పోసింది .సంకల్పం ,దీక్షా ఉంటె సాధించలేని దేమీ ఉండదు అని రుజువు చేసిన సేవా మూర్తి తోమాసీనా .మాతృమూర్తి గా భాసించింది .అందుకే మనవారు ‘’ముదితల్ నేర్వగా రాణి విద్య గలదే ముద్దార నేర్పించినన్ ‘’అన్నారు .
ఈ నవలలో కొన్ని పదాలకు రచయిత్రి గొప్ప అర్దాలనిచ్చింది .prostitute –అంటే వందమంది మగాళ్ళకు భార్య .అలాగే సేవా భావానికి ఆ స్త్రీ మూర్తికి లోని ఒక సూక్తి స్పూర్తి నిస్తుంది ‘’ask and it shall be given –seek and ye shall find –love and help are always here-if you remember to ask ‘’.
వివాహం కాని చైనా అమ్మాయి దురదృష్ట వంతురాలు .అలాగే తోమాసీన తన ప్రేమ ను గురించి ‘’if you do not know me well ,enough to know that then you have not been paying attention .i suggest you find another girl who does not mind finding out if you are compatible ‘’అంటుంది మిషనరీ లో ఉన్న ఆడపిల్లల్ని గురించి ‘’మీరంతా భయం తో మాకు చిక్కి పోయారు .మీరు సగం దెయ్యాలు సగం చిన్న పిల్లల మనస్తత్వం వాళ్ళు ‘అని సముదాయిస్తుంది తోమాసీనా ను అందరు‘’లో మొ’’అని ఆప్యాయం గా పిలుస్తారు అంటే ‘’RESPECTED MOTHER ‘’
ఆమె తరచుగా తనను గురించి ‘’it is better to be one hundred girls’s mother than to be one hundred men’s wife ‘’అను కొనేది .27 ఏళ్ళ వయసులోనే ఈమెకు ఇంతటి మిషన్ కార్యం మీద వేసుకొని సమర్ధ వంతం గా నిర్వహించి అందరికి తల్లి అని పించుకోంది .ఆమె దృష్టిలో పని లేని విశ్వాసం శూన్యం (faith without work is empty ).డబ్బుకు కొరత ఏర్పడ్డప్పుడు బోర్డ్ మీటింగ్ పెట్టి మాట్లాడుతూ‘’we have to change water into wine ,when the budget is low ‘’అని ప్రోత్సహించేది .తనకు ముందు పని చేసిన క్యూబెర్స్తాన్ చెప్పిన ‘’take heart and call on the Lord ‘’’అన్నది తోమాసీ కి వేద వాక్కే .దాన్నే అనుసరించి సఫలీక్రుతురాలైంది .ఈ మాటనే నమ్మి ఎక్కడో ఉన్న చైనా దేశపు ఆడపిల్లల కోసం తన జీవితాన్ని అంకితం చేసుకొని ధన్య మాత అని పించుకోంది .తోమాసీనా పెద్దదై ‘’tomsen ‘’అయింది అంటే ‘’పెద్దమ్మ గారు ‘’అయింది .అమ్మల గన్న యమ్మ అని పించుకోంది .రచయిత్రి కరోల్ ఇంతటి త్యాగ మూర్తి కధను నవల గా రాసి మహోప కారమే చేసినందుకు అభిమాన పాత్రురాలైంది .
15-8-2002 గురువారం నాటి అమెరికా డైరీ నుండి మీ కోసం
మీ—గబ్బిటదుర్గా ప్రసాద్ –6-5-13-ఉయ్యూరు

