రాచకీయ ‘’ద్విప్లెట్స్’’
1-డిల్లీ లో అమ్మగారి కృపకు రాణి ‘’కిల్లి ‘’
ఇక్కడ గల్లీ గల్లీ లో అవుతోంది మ్యావ్ మ్యావ్ ’’ పిల్లి ‘’
2-నిన్నటి దాకా అధికారం చెలాయించిన’’ చిన్నమ్మ’’
ఇప్పుడు అయిపొయింది కాణీకి కూడా ‘’చెల్లననమ్మ’’
3-పేరులోమాత్రమే ఉండి పోయిన ‘’శీలం’’
ప్రజాదర్బారు లో పోగొట్టుకొన్నాడు కావాల్సిన ‘’ శీలం’’
4-.నటుడుగా ఉండిపోతే అయ్యే వాడుచిరకాలం నట’’ చిరంజీవి ‘’
పార్టీ పెట్టి కూల్చి, ఖద్దరు గుడారం లో దూరి అయ్యాడు ‘’అభాగ్య జీవి’’ .
5-మాటలలే కాదు శరీరం కూడా లావుగా ఉన్న మంత్రి’’లక్ష్మి’’
సమైక్య భావనలో సామాన్యుల చేత అని పించుకోంది ‘’ఛీఛాలచ్చి’’
6- మేధావి,వాక్య విశారదుడు ,అవగాహన ఉన్న ‘’ఉండవల్లి ‘’
ఇవాళ ఇక్కడ హీరో అక్కడ కోటరీ కళ్ళలో ‘’కారం కలిపిన ఉల్లి ‘’
7-చిరును నమ్మి కాంగ్రెస్ గంట బజాయించి కొట్టిన ‘’గంటా ‘’
అందరికంటే ముందు ఎదురు తిరిగి వాయించాడు’’ సమైక్య గంట ‘’
8-జగడం,లగడం లో జెట్టీలో ,ఎన్నికల ముందే ఫలితాలుకరెక్ట్ గాచెప్పే ‘’లగడ పాటి ‘’
అటు ధిల్లీ లో ఇటు గల్లీ లో కాలేక పోయాడు ‘’ ఏగాణీ పాటి’’ .
9-కుర్చీ ఎక్కించి చెప్పిందే వివింటాడు అనుకొంటే ‘’కిరణ్ ‘’
సమైక్య ఆశా కిరణంమై , పై ఏలికల పాటిమేకై చేశాడు’’మాన్చలేని వ్రణం’’ .
10-సమైక్య శంఖా రావం తో పైకెగసిన ‘’రాకెట్ అశోక్ ‘’
అందర్నీ కలుపు కొంటూ యుద్ధ భేరి మోగించి అయ్యాడు ’’ది గ్రేట్ అశోక్ ‘’
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-10-13- ఉయ్యూరు

