గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాలు -స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –ప్రొఫెసర్ ఎల్ లక్ష్మణ మూర్తి
498 –శ్రీ కోవి కందాలై రంగా చార్య (188 5 -19 6 7 )
వరంగల్ లో ఉంది వందలాది విద్యార్ధులకువసతి భోజనం కల్పించి సంస్కృతం బోధించిన రంగా చార్య సంస్కృతం లో మహా పండితులు .గీర్వాణం లో ‘’వేదాంత శాస్త్ర హృదయం ,వేదాంత పంచ వింశతి ,గీతార్ధ సంగ్రహం ‘’రాశారు .గీతార్ధ సార సంగ్రహాన్ని స్రగ్ధరా వృత్తాలో రచించారు .
499 –శ్రీ శ్రీ దూపాటి వెంకట రామణా చార్య (—19 6 1 )
శేషాద్రి రమణ కవులలో వీరు ఒకరు .’’మేదినీ కోశం ,ఏకాక్షర నిఘంటు మాల ,విశ్వ నిఘంటు ,అమర శేషం ‘’కూర్చారు .19 6 1 లో చనిపోయారు .
50 0 –శ్రీ ఒద్దిరాజు సోదరులు (19 7 0
ఒద్దిరాజు సోదరులైన సీతా రామ చంద్ర రావు ,రాఘవ రంగారావు లు పాణిని అస్టాధ్యాయికి ‘’వ్యాఖ్యానం ‘’రాశారు .అలాగే ‘’భట్టికావ్యం ‘’పైనా వ్యాఖ్య రచించిన విజ్ఞాన సర్వస్వం అనిపించే సమర్ధ జ్ఞాన సంపన్నులు .సంస్కృత పాఠ శాల ఏర్పరచి సమర్ధంగా నిర్వహించారు .
50 1 –శ్రీ ముదిగొండ నాగ లింగ శాస్త్రి (19 ౩౦
భగవద్గీత పై నీల కం ఠ భాష్యానికి వ్యాఖ్య రాశారు ‘’భగవద్గీత తాత్పర్య నిర్ణయ ‘’సంస్కృతం లో19 50 లో రచించారు .
50 2 –శ్రీ ముదిగొండ వీరేశ లింగ శాస్త్రి
వరంగల్ ఎస్ వి ఎస్ ఏ కళాశాల ప్రిన్సిపాల్ చేశారు .’’భగవద్గీతా తత్వ ప్రభ ‘’రాశారు .
శ్రీ ఉదయరాజు శేషగిరి రావు ‘’శారదా స్తుతి ,శృంగార తరంగిణి ‘’రాశారు .
50 3 –శ్రీమాన్ ఎస్ యెన్ వి రఘునాదా చార్య
వరంగల్ కాలేజిలో ఆచార్య లెక్చరర్ .’’విద్వాన్. మనో రంజని ‘’అనే వ్యాస సంపుటిని ‘’మణిమాల ‘’అనే కవితా సంపుటిని వెలయించారు .తిరుపతి ర్రాస్త్రీయ సంస్కృత పరిషత్ నుండి ‘’మహామహోపాధ్యాయ ‘’బిరుదు పొందారు .
50 4 –శ్రీ శ్రీ భాష్యం విజయ సారధి
రాష్ట్రం లోనేకాక రాస్త్రే తరంగా కూడా సంస్కృతం లో ప్రాముఖ్యం పొందారు .సంస్కృతం లో 20 ఖండ కావ్యాలు రాశారు .అందులో మణిపూస ‘’మందాకినీ ‘’అనే దీర్ఘ కవితా కావ్యం .గంగానది ఆకాశం నుండి దిగిన ట్లు అతి వేగంగా ప్రవహిన్చినట్లు కవితా ప్రవాహం తో రాశారు .’’బిర్లా ఫౌండేషన్ అవార్డ్ ‘’అందుకున్నారు .
నల్గొండ జిల్లా
50 5-శ్రీ అంబటి పూడి వెంకట రత్నం
వీరు తెలుగు సంస్క్రుతాన్గ్లాలలో గొప్ప పట్టు ఉన్నవారు .ఇందిరా గాంధీకి అంకితమిస్తూ ‘’ఇందిరా విజయం ‘’నాటకం రాశారు .19 7 2 లో ప్రచురితం .ఇంగ్లీష్ మాతృక ఆధారం గా సంస్కృతం లో ‘’అక్రుతజ్నో నరః ‘’నాటకం రాశారు .
50 6 –శ్రీ పెరుమ్బుదూర్ రాఘవాచార్య బహు స్తోత్ర ,స్తుతులు రాయగా ,శ్రీ నల్లడిగ శ్రీనివాసా చార్య ‘’భద్రాచల రామ ‘’శతకం ,శ్రీ కల్వ కుంట అలహా శృంగార ఆచార్య మహా వ్యాకరణ వేత్త .నృసింహ శ్రీరంగానాదులపై స్తోత్రాలు రాశారు .
50 7 –శ్రీ చిదంబరం వీరభద్ర శర్మ
ఆజన్మ విద్వాంసులైన శర్మగారు కాశీ శివా రాధ్య పీఠం ‘’కు ముఖ్యాధికారి .కాశీలో విద్య నేర్చారు .న్యాయ ,మీమామ్సలను మధించారు .తెలుగు కన్నడ మరాటిసంస్కృతాలలో రచనలు చేశారు .సంస్కృతం లో కొన్ని శ్లోకాలు తప్ప మిగిలినవి ప్రచురితం కాలేదు .
50 8- ఆచార్య శ్రీ రవ్వా శ్రీహరి
ఆచార్య శ్రీ రవ్వా శ్రీహరి కుప్పం ద్రవిడియన్ విశ్వ విద్యాలయ వైస్ చాన్సలర్ గా ఉన్నారు . గురుకులాభ్యాసం లో విద్యనేర్చారు .ఫిరదౌసి గబ్బిలం తోబాటు నారాయణ రెడ్డిగారి ‘’ప్రపంచ పది ‘’నికూడా సంస్కృతీకరించారు .ఆయన వ్యాసాలు ‘’సంస్కృత వైజయంతి ‘’గా ప్రచురితమైనాయి .అన్నమాచార్య సూక్తి సుధను సంస్కృతంలో రాశారు .వారి స్వంత రచన ‘’మాత్రు గీతి ‘’
ఖమ్మం జిల్లా
50 9-యెన్ సి పార్ధ సారధి అయ్యంగార్ ‘’రామ పాదుకా స్తవం ‘’,శ్రీ దాశరధి వెంకటా చార్య ‘’సంస్కృత శబ్ద ధాతు పద వాక్యాలపై వ్యాకరణం ,శ్రీ తిరుమల గుడి మెళ్ళఅంతర్వేది నరసింహా చార్యులు ‘’పాంచచ జన్యం ;;పై వందలాదిస్రగ్ధరా శ్లోకాలు రాశారు.శ్రీ మల్లాది సుబ్బా రాయుడు’’ శ్యామల ,వైద్యనాధ ,మాతంగి ‘’స్తోత్రాలు రాశారు .
తరువాత మెదక్ జిల్లా చూద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -౩౦ 9 -15- ఉయ్యూరు

