—
’మత్స్వప్నః ‘’(నాకల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయన శాస్త్రి గారు -9
101-‘’తంబా తీత్య ప్రస్తితాస్తన్యసేనా-సంరంబోత్దా ఆసురీర్నిర్ద దాహా
కల్పాన్తేష్వీశ్వః పశూనాం జగంతి-భస్మీకుర్యాద్యేన శస్స్త్రేణతేనః ‘’
తా-కల్పాంతం లోపశుపతి అయిన శివుడు లోకాలను సమూలంగా దహించినట్లు ఈశ్వరి భండాసుర సైన్యాన్ని సమస్తాన్నీ పాశుపతాస్త్రం తో దహించే సింది .
102-‘’సర్వాత్మీయానాం ప్రనాశం సమీక్ష్య-దేవీ మేవాభ్యద్రవ చ్చూన్య కేన
సాప్యేనంకామేశ్వరేణా భి జఘ్నే-భండం శూన్యాసుం సశూన్యం దదాహ ‘’
తా-అంతా కోల్పోయినవాడు కామకం అనే తన పట్టణం తో సహా దేవిపైకి వచ్చాడు .భవానీ దేవి వాడిని కామేశ్వరమనే అస్త్రం తో కొత్తగా వాడినీ వాడి పట్టణాన్ని కాల్చి బూడిద చేసింది .
అస్త్రాలలో కామేశ్వరాస్త్రం పాశుపతాస్త్రం కంటే శక్తి వంతమైనది .అమ్మవారి నామాలలో ‘’కామేశ్వరాస్త్ర ‘’అని ఉంది .భండుడు మొహానికి, శూన్యనగరం శూన్య వాదానికి ప్రతీకలు అని గ్రహించాలి .దేవుడిని చూపించి శూన్యవాదాన్ని చిత్తు చేసింది అనీ భావం .
103-‘’బ్రహ్మోపేంద్రాదయ స్స్మస్తువంతి-విస్మేరాస్యా విక్రమ ప్రక్రమర్ధిం
దేవా స్స్వస్థాస్సుస్తితాశ్చాన్యలోకాః –సోయం కామేశాన పత్నీ,ప్రసాదః ‘’
తా-త్రిమూర్తులు మున్నగు దేవతలు దేవి పరాక్రమాన్ని కొనియాడారు .లోకాలన్నీ స్వస్థత చెందాయి .శూన్యవాదం నశించి మనో బుద్ధీ మొదలైన ఇంద్రియాలు సువ్యవస్తితమై సాధకులు నిర్వృతి పొందారని అంతరార్ధం .
104-‘’గాదా సేయం వర్నితా విస్తరేణ-స్వీయే గ్రందే వ్యాస భట్టార కేన
లోకోద్దారార్ధం హి నారాయణేన –సంగృహ్యేయం ప్రస్తుతార్ధం మయోక్తా ‘’
తా-వ్యాసమహర్షిగా జన్మించిన నారాయణుడు బ్రహ్మాండ పురాణం మొదలైన వాటిలో చాలా విస్తారంగా దీన్ని రాశాడు .నేను సంగ్రహం గా చెప్పాను అంతే.అన్నారు శాస్త్రీజీ .
105-‘’అంతర్యామీ వ్యాస నారాయణో సౌ –సర్వ త్రాస్తేసనాస్తే మయ్యహో కిం సనాస్తే
మాతస్త్వంమే జాగ్రతి స్వప్న సుప్త్యోః-ప్రత్యా సన్నా లక్ష్యసే భాగ్య మేతత్ ‘’
తా-వ్యాస నారాయణుడు సర్వాంతర్యామి .అలాంటి వాడు నా యడల ఉండడా?అమ్మా !నువ్వు నాకు మెలకువలోను ,కలలోను ,నిద్రలో కూడా సన్నిహితంగా ఉంటున్నావు .ఇదే నా భాగ్యం .
106-‘’నామం నామం త్వాం చ బ్రవీమి –స్థాతవ్యం వామాభి ముఖ్యేన మేం బ
ఉద్వాహే తే లోక మాతృత్వ కార్యే (కీర్తౌ )-పౌర్వా పర్యం తద్వి మ్రుస్టవ్య మత్ర’’
తా-నీకూ వ్యాసునికి పదే పదే నమస్కరిస్తూ మళ్ళీ అడుగుతున్నాను .నీ వివాహం ,లోకాలను కనటం లలో ఏది ముందు ?వివాహం నాటికే దేవాసురులతో ఉన్న ప్రపంచం ఉందికదా .మరి ఆ ప్రపంచాన్ని ఈ అమ్మ ఎలా కన్నది ?అని సందేహం .
107-‘’ఈశ స్స్రస్టా లోక జాలస్య తాతః –పత్నీ తాత స్యా౦బి కైవ ప్రజానాం
ఇత్ధం గౌర్యా లోక మాతృత్వ మూచే –సర్వజ్ఞో సౌ కాళిదాసః కవీశః ‘’
తా-అన్నిలోకాల్ని సృష్టించిన ఈశ్వరుడు వాటికి తండ్రి అవుతాడు కదా .తండ్రి పెళ్ళాం ప్రజలకు తల్లి అవుతుందికదా .అని మహా కవి కాళిదాసు పార్వతీ దేవి యొక్క లోక మాతృత్వాన్ని సమర్ధించాడు .
108-‘’శక్త్యా యుక్త శ్శక్తఏతత్ క్రియాసు –నో చే దీశ స్స్పందితుం చాప్య శక్తః
ఇత్యాచార్యా స్శంకరశ్శన్కరోయం-వ్యాచ స్టేద్ధా డిండిమం వాద యన్నోన్’’
తా-శక్తితో కూడిన శివుడు సృష్టి స్తితి లయ కారకు డౌతాడు .శక్తి లేకపోతె ఆయన వలన ఏ పనీ జరుగదు అని సాక్షాత్తు శంకరావ తారమే అయిన శ్రీ శంకరాచార్యులవారు చెప్పారు కనుక తిరుగు లేదు .
109-‘’వేదో మూలం వ్యాస వాచాం న చేత్స-మంత్రం ద్రస్టానో వదేత్కించ నాపి
వేద వ్యాసోక్త ప్రభావ ప్రపంచే –హ్యూహా పోహే సాధయే త్సత్కవీశః ‘’
తా-మంత్ర ద్రష్ట వ్యాసుడు చెప్పిన ప్రతిదానికి వేదమే మూలం .వారి వాక్కుల ప్రభావం తో ఊహా పోహాలను మేళవించి సత్కవి కావ్య రూపం లో ప్రపంచానికి తెలియ బరుస్తాడు .
110-‘’వేదస్త్వమే దృశ్యసే భాగ్య యోగాత్ –వ్యాసో మౌనీశశ్చ సర్వత్ర గోస్తి
యుష్మ స్సాన్నిధ్యం ప్రకల్ప్య ప్రాసాదాత్-ప్రశ్నంతస్యా వ్యుత్తరం వర్ణ యామి ‘’
తా-అసలు వేద వాణివి నువ్వేకదా తల్లీ !నా అదృష్ట వశాన కలలోను , నిజంగాను కన్పిస్తున్నావు .ముని ముఖ్యుడు వ్యాసుడు ఈశ భావం తో సన్నిహితుడయ్యే ఉన్నాడు .మీ ఇద్దరి సమక్షం లో నేను సంధించిన ప్రశ్నాస్త్రానికి నేనే ఉపసంహారం చేసి వివరిస్తాను. దయ చేసి వినండి మీ రిద్దరూ ‘’అన్నారు శాస్త్రిగారు .
సశేషం
మహర్నవమి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-10-15-ఉయ్యూరు

