సాహితీ బంధువులకు దీపావళి శుభా కాంక్షలు -స్వర్గీయ సద్గురు శివానంద మూర్తి గారి ”సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ”చేసే సేవా,ధార్మిక సాహిత్య ,సాంస్కృతిక కార్యక్రమాలను,సరసభారతికి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు అమెరికాలో ఉంటున్నా నిశితంగా పరిశీలిస్తూ సద్గురువు లపై ఉన్న భక్తీ తాత్పర్యాలకు నిదర్శనం గా , సంస్థ అభివృద్ధికి ప్రోత్సాహకంగా , ఆసంస్థ కు సరసభారతిద్వారా రూ 11,116(పదకొండు వేల నూట పదహారు రూపాయలు ) సభక్తికంగా 2-11-15 న అందజేయి0చారని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాను . గొపాలకృష్ణ గారి వితరణకు అభినందనలు తెలియ జేస్తూ ,ఇందులో సరసభారతికి సముచిత స్థానం కల్పించినందుకు ,వారికి, వారి కుటుంబ సభ్యులకు భగవానుడు ఆయు రారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుతున్నాను . దుర్గాప్రసాద్
—

