గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 41-మానవల్లి జగన్నాధ శాస్త్రి (1920)

నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

41-మానవల్లి జగన్నాధ శాస్త్రి (1920)

కాశీకి చెందిన మానవల్లి జగన్నాధ శాస్త్రి మహామహోపాధ్యాయ మానవల్లి లక్ష్మణ శాస్త్రి కుమారుడు ,గంగాధర శాస్త్రికి సోదరుడు .కవిత్వం విమర్శ ,కధలు సంస్కృతం లో రాశాడు .అతని ‘’శాంత రస విమర్శ ‘’అందరిని ఆకర్షించింది .శాంత రస స్వరూప స్వభావాలు దానిపై విమర్శ ,అన్ని రసాలకన్నా శాంత రసమేఎందుకు ఉత్క్రుస్టమో వివరంగా చర్చించాడు .రెండవ రచన ‘’కాంతి ద్రుష్టి ‘’వచనం .కవి రాసిన చాలాకవితలు కధలు ప్రముఖ సంస్కృత పత్రికలూ సూర్యోదయ ,మొదలైన వాటిలో వచ్చాయి ఇండియా చైనా యుద్ధం పై ‘’మత్తేభ కుంభ దలన మృగాది రాజః ‘’శ్లోకాలు రాస్తే గా౦డీవం పత్రిక ప్రచురించింది ఇందులోంచి ఒక శ్లోకం –

క్రవ్యాదచీన బహుళ తాండవ ఖండ నయ ఛండోదమః ప్రభావితా నను హిందూ వీరః –గాడాంధకార హరణాయసహస్ర రశ్మిఃమత్తేభ కుంభదళనాయ మ్రుగాదిరాజః ‘’

ప్రవ్రుత్త సమరం బలం కుటిల చీనసంచాలితం –స్వకీయ బాతి బాన్ధవేః సహా విలోక్య రోషాత్ష్టితః

ప్రవ్రుద్వివిధాయుదో ధ్వనిత దుందుభిః సధ్వజే –న యాతి మహిమాలయో భువి హిమాలయో నిమ్నతాం ‘’

42-ఉపద్రష్ట జీవ బుధ (17వశతాబ్దం )

ఉపద్రస్ట కోనేరి కొడుకే జీవ బుధుడు .17వ శతాబ్దం వాడు .పండితరాయల ఇంటిపేరు కూడా ఇదే .’’నలానందం ‘’అనే 7 అంకాల సంస్కృత నాటకం రాశాడు .నల దమయంతి కద.-మొదటి శ్లోకం –

‘’శ్రీమన్మాధవ పాద పంకజ యుగం పాయాదపాయా త్సదా—పారావార సుతా కరాంబుజ మృదు స్పర్శేన సంలాలితం

గంగా యన్నఖ నిర్గత సామ భవత్కళ్యాణ దాసర్వదా –సర్వేషాం భావినం భవాబ్ది తరణిః త్రైలోక్య చింతామణిః’’

సూత్ర దారుని చేత తండ్రి కోనేరి జీవిత విశేషా లను చెప్పించాడు .తండ్రికోనేరి వేదాంత భాను కుమారుడు .ఒక బ్రాహ్మ గురు ఆశీస్సులతో ఖడ్గం పట్టి స్వీయ జన రక్షణ చేశాడు .నాటకం లో అద్భుత రస పోషణ జరిగిందని సూత్ర దారుడు వివరిస్తాడు .కవితాత వేదం భానుడు ,అని కవి తలిదండ్రులు జయంతి కోనేరి అని తెలుస్తుంది .కవి పిన తండ్రి సుబ్రహ్మణ్య యే గురువు .ఆశ్వాసాంత గద్యలో

‘’ఇతి శ్రీ కవికుల తిలక జీనామక విబుధ కృతౌ  నలానంద నాటకే నల రాజ్యాభి షేకో నామ సప్తమోన్కః’’

43-త్యాగ రాజు కవి

ఈ త్యాగరాజు సంగీత మూర్తిత్రయ త్యాగయ్య కాదు .కాలం పుట్టుక తెలియవు. కాశ్యప గోత్రీకుడు. ఆనంద నాధుని శిష్యుడు .1-ఉపదేశ శిఖామణి 2-పంచ కోశ విమర్శిని 3-స్వాత్మ స్పూర్తి విలాసం రాశాడు .అన్నీ వేదాంత గ్రంధాలే .ఐహికానికన్నా ఆముష్మికానికి ప్రాదాన్యమిచ్చాడు .తానూ ఆంధ్రుడనని చెప్పుకొన్నాడు –‘’ఇత్యానంద నాద పద పద్మోప జీవినా కాష్యపసగోత్రోత్పన్నే ఆంధ్రేన  త్యాగరాజ నామ్నా విరచితః ‘’ఉపదేశ శిఖా మణిః’సంపూర్ణం ‘’

రెండవ రచన అయిదు పాదాల ‘’పంచ కోశ విమర్శిని ‘’.పంచ భౌతిక శరీరం పై కాంక్ష తొలగి పరమ పద సోపానం వైపు ద్రుష్టి మరల్చాలన్న ఉద్బోధ .

మూడవది 37శ్లోకాల స్వాత్మ స్పూర్తి విలాసం .ఇవికాక శివమీడే స్తోత్రం శాంతి స్తవం ,నవ మల్లికా స్తవం ,ఆర్య పంచాదశి ,ధర్మా౦ బికాస్తావం ,నవాక్షర స్తోత్రం సంవిత్సతకం కూడా రాశాడు

ఉపదేశ శిఖామణి శంకరాచార్యుల భజ గోవి౦దా నికి అనుకరణ –

‘’భజ గౌరీశం భజ గౌరీశం భజ గౌరీశం ముగ్ధ మతే –భజ గౌరీశం భజ గౌరీశం భజ గౌరీశం భజ ముగ్ధ మతే

సత్యం వదరే ధర్మం చరరే క్రుత్యాక్రుత్య విచారం కురురే –కాలో యాతి గృహీత్వా దేహ వ్యర్ధం మా కురు మానుష జన్మ ‘’

పంచ కోశ విమర్శనం –

‘’న చాహం శరీరం జడత్వాత్ ప్రుధక్త్వాత్ న చ ప్రాణ వర్గః పిపాసాది మత్వాత్ –మనో నాపి సంకల్ప మూలా క్షయత్వాత్ తతసత్యాగ రాజ స్వరూపో హమేవ ‘’చివర్లో

‘’న చేశః ప్రభుత్వాత్వ మాయా వ్రుతత్వాత్ న జీవో ప్యావిదావ్రుతత్వాత్ బహుత్వాత్

న మాయస్య స్వరూపో ప్యాస త్వప్ప్రసంగాత్ తతస్త్యాగ రాజ స్వరోపోహ మేవ ‘’

త్యాగరాజ కవి రాసిన స్వాత్మ స్పూర్తివిలాసం నుండి ఒక ఉదాహరణ –

‘’వందే గురు పద ద్వంద్వం వాంచితా ర్ద ప్రదాయకం –వాగీశ విష్ణు రుద్రేంద్ర వాచార ౦భణాహేతుకం

స్పూర్తి రూపేణ తిస్టామి సద్రూపః ఫలయస్యహి –ఆదా వంతేతదా మధ్యే కటకే హాటకం యదా ‘’

చివరలో –

‘’సచ్చిదానంద రూపే తు మాయా సత్చిత్సుఖాత్మికా –శర్కరాల ౦ డ్రుకై ర్యద్వత్ శర్కరా రూపమేవ హి

ఏషాహ్వానంద నాధస్య పద పంకో ప జీవినా –స్వాత్మ స్పూర్తి విలాస సఖ్యో గ్రందో విరచితోవ్యయః ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-12-15-ఉయ్యూరు

 

 

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.