గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం గ్రంధ ప్రాయోజకులు
సౌజన్య శీలి ,సహృదయులు ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ
జననం –విద్యా భ్యాసం
శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు కృష్ణా జిల్లా ఉయ్యూరుకు సమీపం లోని కుమ్మమూరు గ్రామం లో శ్రీ మైనేని వెంకట నరసయ్య ,,శ్రీమతిసౌభాగ్యమ్మ దంపతులకు 10-1-1935న ఆరవ సంతానం గా జన్మించారు .వీరి అన్నగార్లు స్వర్గీయ సూర్య నారాయణ ,స్వర్గీయ తాతయ్య అనేరాజ శేఖర్ ,అక్కయ్యలు శ్రీమతి అన్నపూర్ణాదేవి ,స్వర్గీయ శ్రీమతి కనక దుర్గా దేవి ,శ్రీమతి భారతీదేవి .చెల్లెళ్ళు శ్రీమతి హేమలతా దేవి,శ్రీమతి సత్యవాణి .బాల్యం లోనే పిల్లల చదువుకోసం తండ్రిగారు కుటుంబాన్ని ఉయ్యూరు కు మార్చారు .ప్రాధమిక విద్య ను గోపాల కృష్ణ గారుకీ శే కోట సూర్య నారాయణ శాస్త్రి గారి వద్ద నేర్చారు .కోటమాస్టారు అంటే మైనేని వారికి అమితమైన గౌరవం భక్తీ .వారి పేరు చెబితే పులకి౦చిపోతారు ..1950వరకు తాడంకి స్కూల్ లోచదివి ఎస్. ఎస్. ఎల్. సి .పాసై ,తరువాత విజయవాడ ఎస్ .ఆర్ .ఆర్ .కాలేజి లో ఇంటర్ చదివి1954లో ఉత్తీర్ణులయ్యారు .కొంతకాలం నాటకాలు ,సోషలిస్ట్ పార్టీ సభలతో కాలేజీకి డుమ్మా కొట్టారు ..బెజవాడ హోటల్ వర్కర్స్ యూనియన్తో చేరి ,వర్కర్ల జీవన పరిస్థితులను మెరుగు పరచటానికి వారిని యాజమాన్యం గౌరవం గా చూడటానికి కృషి చేశారు .
ఉన్నత విద్య –వివాహం –మొదటిసారి అమెరికా ప్రయాణం
1953-54లో ఉయ్యూరులో డ్రమాటిక్ అసోసియేషన్ స్థాపించి ఆత్రేయ గారి యెన్ .జి.వో నాటికను ప్రాక్టీస్ చేశారు .1955-58కాలం లోవిశాఖ ఆంద్ర విశ్వ విద్యాలయం లో ఫిలాసఫీ మెయిన్ సబ్జెక్ట్ గా ఎడ్యుకేషనల్,సోషల్ అండ్ చైల్డ్ సైకాలజీ మైనర్ సబ్జెక్ట్ లుగా తీసుకొని చదివి1959లో ఏం.ఏ .సెకండ్ క్లాస్ లో పాసైనారు .1960లో గుంటూరు జిల్లా రేపల్లెతాలూకా నల్లూరు గ్రామవాసి కీ శే .పరుచూరి భావ నారాయణచౌదరి ,శ్రీమతి రత్న మాణిక్యమ్మ దంపతుల కుమార్తె శ్రీమతి సత్య వతి ని వివాహం చేసుకొన్నారు .1960-61లో అమెరికా వెళ్లి మిన్నియాపోలీస్ లోని మిన్నెసోటా యూని వర్సిటి లో ఎడ్యుకేషన్ సైకాలజీ ,స్టాటిస్టిక్స్ లో కొంత కోర్సు వర్క్ చేశారు .గోపాల కృష్ణ గారు 1961-62లోమాడిసన్ లోని విస్కాన్సిన్ విశ్వ విద్యాలయం లో ఇండియన్ స్టడీస్ కు అనుబంధం గా ఉన్న తెలుగు గ్రంధాలను కేటలాగ్ చేయటానికిసహాయ పడుతూ ,కొన్ని లైబ్రరీ కోర్సులు పూర్తి చేశారు . .1962లో ఇండియా తిరిగి వచ్చికొంతకాలం .చిరు ఉద్యోగాలు చేస్తూ ,కొంతకాలంనిరుద్యోగి గా ఉంటూ ,కొంతకాలం ఉయ్యూరు కే సి పిలో అతి చిన్న ఉద్యోగం చేసి,స్థిరమైన రాబడి లేక కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందిపడుతూ మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ 1968వరకు ఆరేళ్ళు గడిపారు .
తలపు తట్టిన అదృష్టం లైబ్రరీ సైన్స్ కోర్స్ -ఉద్యోగం
అదృష్టం తలుపు తట్టగా 1969లో అమెరికా వెళ్లి టెన్నేసిలో లైబ్రరీ సైన్స్ లో ఎం..ఎస్..చేసి,,అందరి ఆదరాభిమానాలు పొంది డిగ్రీ తీసుకొనిసంతృప్తి చెందారు .సుమారు ఏడేళ్ళు పడిన మానసిక వేదనకు ,శారీరక శ్రమకు విముక్తికలిగింది . కోర్సులో ఉండగానే కెంటకీలోని లూవిల్ యూని వర్సిటి లో కేటలాగర్ అండ్ ఇన్ స్త్రక్టర్ ఇన్ లైబ్రరీ సైన్స్ కు ఎంపికై ,పదవీ బాధ్యతలు చేబట్టారు .అమెరికన్ లైబ్రరి ఆఫ్ కాంగ్రెస్,న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరి ,ఇతర విశ్వ విద్యాలయాల లైబ్రరీలను సందర్శించారు . .మెషీన్ రీడబుల్ కేట లాగింగ్ కు ఇన్ హౌస్ ట్రెయినింగ్ఇచ్చారు .ఆంగ్లో అమెరికన్ కేటలాగింగ్ రూల్స్ పై వర్క్ షాప్ నిర్వహించారు .ఆబ్ స్ట్రాక్ట్ ఆఫ్ అకడేమిక్ ప్లాన్ అండ్ బిల్డింగ్ ప్రోగ్రాం కుసహకరించారు .లాంగ్ రేంజ్ బడ్జెట్ ,పర్సనల్ అండ్ రిసోర్సెస్ ప్రొజెక్షన్ కు సహాయకుడిగా సేవలందించారు .యూనివర్సిటి ఆఫ్ లూయీ విల్లైబ్రరి సిస్టం కు టెక్నికల్ సిస్టం అందించటం లో ప్రముఖ పాత్ర పోషించారు . మైనేనిగారి బాస్ ప్రోత్సాహం తో కేటలాగింగ్ కన్సల్టంట్ గా 1974నుంచి 76వరకు రెండేళ్ళు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్ట్ నాక్స్ లైబ్రరీ ,నేషనల్ ఆర్కైవ్స్ ,సన్స్ ఆఫ్ అమెరికన్రివల్యూషన్ లో 1976-78 వరకుసలహా దారుగా ,కెంటకీ లోని లూయీ విల్ లో ఉన్న లైబ్రరీ ఆఫ్ వరల్డ్ ఫెయిత్ సెంటర్ లో 1980-82 వరకు ఏంతో సంతృప్తిగా సేవ లందించారు . తనపై బాస్ కున్న నమ్మకానికి ఎంతో కృతజ్ఞత చూపిస్తారు శ్రీ గోపాల కృష్ణ ..,పై ఉద్యోగులచేత ప్రశంసలు,సహోద్యోగుల చేత ఆత్మీయ మిత్రులుగా అభినందనలు పొందారు .1997లో అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ స్పెషల్ అసిస్టంట్ టు యూని వర్సిటిలైబ్రేరియన్ గా పదవీ విరమణ చేశారు .
కుటుంబం
మొదటి నుండి సత్యం ధర్మం న్యాయం లపై మక్కువ ఉన్న గోపాల కృష్ణగారు కెంటకీ సదరన్ బాప్టిస్ట్ దియలాజికల్ సెమినరి,ముర్రె స్టేట్యూని వర్సిటీలలో హిందూ ధర్మం పై ప్రసంగాలు చేశారు .లూయీవిల్ యూని వర్సిటి లో రెలిజియన్ స్టడీ డిపార్ట్ మెంట్ ఆహ్వానం పై బౌద్ధధర్మం పై దార్మికోపన్యాసమిచ్చి అందరి మన్ననలు అందుకొన్నారు .అతిధులను గౌరవం గా ఆదరించటం .బాధితులకు సాను భూతిసహవేదనలనుచూపటం మైనేని వారికి తలిదండ్రుల నుండి సంక్రమించిన గొప్ప సుగుణం .గోపాల కృష్ణ దంపతులకు ఇద్దరు కుమారులు.పెద్దకుమారుడు శ్రీ కృష్ణ –కోడలు శ్రీమతి రమ.మనుమ రాళ్ళు ఛి శ్రేయ ,సెరీన.చిన్న కుమారుడు శ్రీ రవి .కోడలు శ్రీమతి కవిత .మనుమడు ఛికిరణ్ .మనుమరాళ్ళు ఛి రియా ,కరీనా . మనసాంప్రదాయం ప్రకారం
…
