— వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -28
‘’ఏకావలి’’ కి రాసిన ‘’తరల ‘’వ్యాఖ్యానం లో మల్లినాధుడు చర్చి౦చిన రసాల౦కార విషయాలు -2
ఏకావలి లో రసవిధానం
రసం పై విస్తృత వర్ణన అసలు అర్ధం తెలుసుకోవటానికి నిర్వచన పరిధి దాటి పోయింది .రస వివరణ అతి విస్తృతం గా ఉంది .ఇప్పుడు రుచి –మనోభావం యొక్క స్వభావం తెలుసుకొందాం.అది విభావాల-నిర్ణయాల నుంచి అంకురిస్తుంది.మరియు ఆలంబనలు పనికత్తేలలాగాకారణ మవుతాయి .అది ప్రేరణ కలిగించే కారణాలైన చంద్రకాంతి , ,మధురమైన కోయిల పాట,చల్లని మలయ మారుతం అనే దక్షిణానిలం ,శృంగార క్రీడలు ,సుందరవనాల వలన ఉత్తేజితమవుతుంది .అది ప్రక్క చూపులు ,చిరునవ్వు ,లతలనుచేతులు ఊపినట్లు నెమ్మదిగా కదిలించటం ,ఆదుర్దా వంటి ఆకస్మిక స్వభాలను పెంచుతుంది .ఇలాగా అని స్పష్టంగా అర్ధం చెప్పేట్లుఉండదు .వినిపించుకొనే స్థితిలో ఉండదు రెండవ దాన్ని గురించి ఆలోచించటం ఉండదు .ఇదమిద్ధం గా ఏమీ చెప్పలేని పరిస్థితి .జ్ఞాపకాల బాట నుంచి వెనక్కి వచ్చే వీలు ఉండకపోవటం .సృజనను అధిగమించ లేకపోవటం,గుర్తింపు ను గుర్తించలేక పోవటం ఉంటుంది .. తెలిసిన మరో వస్తువుతో గుర్తించ లేని స్థితి .నిత్యమైన మానసిక స్థితి అంటే స్థాయీ భావం అంటే ఆనందాన్ని ప్రేక్షకులకు కలిగిస్తుంది .అదే మానసిక స్థితి విభావ వరకు నిలిచి ఉంటుంది .పానక రస సూత్రం వలన మహా రుచికలుగుతుంది .అదే ఆనందం .ఆనందం మెరుపులా వచ్చినపుడు అదే పరమాన౦దమై బ్రహ్మానందమై ,ఉత్కృష్ట బ్రహ్మ జ్ఞాన అనుభూతికలుగుతుంది .అది అపూర్వ ,అపరిచిత ఆహ్లాదాన్ని కలిగిస్తుంది .అదే అస్పష్టమైన ఆనందం .అని లాల్యే వ్యాఖ్య .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-12-16-ఉయ్యూరు
