గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 57-కోదండ రామ దేవస్థాన స్థల పురాణ కర్త –అన౦త రాజ గోపాలాచార్య (1923 )

— .గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

57-కోదండ రామ దేవస్థాన స్థల పురాణ కర్త –అన౦త రాజ గోపాలాచార్య (1923 )ణం -4

1923 మే 8  తమిళనాడు చెంగల్పట్టు లోని అన్నదూర్ లో జన్మించిన అనంత రాజ గోపాలాచార్య  శిరోమణి .గురువులు –గోష్టి పూర్ వాసు దేవాచార్య ,దొరై స్వామి అయ్యంగార్లు .కోదండ రామ స్వామి స్థల పురాణం  అనే ఒకే ఒక సంస్కృత గ్రంథం రాసినట్లు తెలుస్తోంది .

58-సాహిత్య దర్శన కర్త –అరలి  కట్టి రామ చంద్ర నరసింహ (19 31 )

కర్నాటక జాం ఖండి లో 5-5-1931 జన్మించిన అరలి కట్టి రామ చంద్ర నరసింహ సంస్కృత ఎం ఏ .తిరుపతి కేంద్రీయ సంస్కృత విశ్వ విద్యాలయ ప్రోఫెసర్ ,రిజిస్ట్రార్ .సాహిత్య ,దర్శన లింగ్విస్టిక్స్ లలో నిధి .వీటిపై 21 పుస్తకాలు రాశాడు .రాష్ట్ర పతి పురస్కార గ్రహీత అయిన నరసింహ ప్రస్తుతం పూనే లోని తిలక్ మహారాష్ట్ర విద్యా పీఠ్ విద్యామణి.

59-సంస్కృత ,అర్ధమాగధి  నిధి –అర్జున్ వాద్కర్ కృష్ణ (  19 26 )

సంస్కృత ,అర్ధమాగధి  నిధి –అర్జున్ వాద్కర్ కృష్ణ 31-10-19 26 బెల్గాం లో జన్మించాడు .బాంబే యూని వర్సిటి రీడర్ .20 గ్రంధాలు ,300 పరిశోధక పత్రాలు రచించాడు .బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటి విజిటింగ్ ప్రొఫెసర్ (1973-74 ),1999 -2000 లో లండన్ వేదిక్ పాఠశాల విజిటింగ్ లెక్చరర్ . సంస్కృత  సంస్కృతీ సంశోధిక కు గౌరవ డైరెక్టర్ .ప్రెసిడెంట్ అవార్డీ .

60 –కావ్య మనీషి –నారాయణ శంకర్ అర్వికార్ (1906 )

1906 మార్చి లో మధ్యప్రదేశ్ నాగపూర్ లో జన్మించిన నారాయణ శంకర్ అర్వికార్ కావ్య తీర్ధ ,సాహిత్య మనీషి ,పంజాబ్ శాస్త్రి .అసిస్టెంట్ ప్రొఫెసర్ .గురువు –పండరినాద శాస్త్రి ఘటే .కావ్య ,సాహిత్యాలలో విశేష కృషి చేశాడు .సంస్కృత భాషపై ఉన్న సాధికారతకు కంచి కామ కోటి పీఠం నుండి స్వర్ణ పతకం పొందాడు .

61 –కావ్య దీపికా పరిష్కరణ కర్త –మధు ఆర్య (1947)

సంస్కృత ఎం ఏ పిహెచ్ డి మధు ఆర్య 20-7-1947 న మీరట్ లో జన్మించాడు ,రఘునాద్ గర్ల్స్ పిజి కాలేజి అసిస్టంట్ ప్రొఫెసర్ .కావ్య దీపికా పరిష్కరణ అనే ఒకే ఒక్క సంస్కృత రచన చేశాడు .

62-ప్రపంచ వేదిక్ కాలెండర్ నిర్మాత –రవి ప్రకాష్ ఆర్య (1961 )

6-6-1961 హర్యానాలో జన్మించిన రవి ప్రకాష్ ఆచార్య 35 పుస్తకాలు రాశాడు .ఆంగ్లం లో రచించిన –ఆరిజిన్ ఆఫ్ ఇండో యూరోపియన్స్ ,ధనుర్వేద ,వైదిక కన్కార్డన్స్,కంకార్డన్స్ ఆఫ్ వేదిక్ మంత్రాస్ ఆజ్ పర్  దేవతాస్ అండ్ రిషీస్,ప్రముఖమైనవి .అనేక సార్లు విదేశే పర్యటన చేశాడు .అమెరికా ,కెనడా ట్రినిడాడ్ బ్రిటిష్ గయానా ,రష్యా , హంగేరి , హాలండ్   జర్మని ,ఆస్ట్రేలియా ప్రభుత్వాల ప్రశంసా పత్రాలు అందుకున్నాడు.ప్రస్తుతంపన్నెండే ళ్ళు గా ‘’వేదిక్ జర్నల్ ‘’సంపాదకుడుగా ఉన్నాడు .6 సంవత్సరాలనుండి ‘’వరల్డ్ వేదిక్ కాలెండర్ ‘’తయారు చేస్తున్నాడు

63-మాతలి మహిమ కర్త –హరి హర శర్మ ఆర్యాల్ (1952 )

1952 లో నేపాల్ లోని లుంబినిలో పుట్టిన హరిహర శర్మ ఆర్యాల్ –ఆచార్య ,విద్యా వారధి ఉత్తర ప్రదేశ్ కబీర్ నగర్ లోని శ్రీరాం శంకర్ వేదిక్ పాఠశాల ప్రొఫెసర్ చేశాడు .రాసిన అయిదు పుస్తకాలలో –మాతలి మహిమ ,సమయా శతకం ,నవగ్రహావదానం ,భావ నక్షత్ర మాలిక ముఖ్యమైనవి .

  సశేషం

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -20-1-18 –ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.