గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
73 –నారీ గీతం కర్త –శంకర దేవ్ అవతారే (1921 )
15-4-1921 ఉత్తరప్రదేశ్ బులంద సహర్ లో పుట్టిన శంకర దేవ్ అవతారే సంస్కృత హిందీ ఎం ఏ ,ఆచార్య,పి హెచ్ డి,డిలిట్.ఢిల్లీ మోతీలాల్ నెహ్రు ఈవెనింగ్ కాలేజి ప్రిన్సిపాల్ చేసి రిటైరయ్యాడు .సంస్కృతం లో జీవన ముక్తకం నారీ గీతం ,సీతారామీయం రచించాడు .ఢిల్లీ సంస్కృత అకాడెమి ,మైసూర్ హిందీ పరిషత్ అవార్డ్ లతోపాటు రాష్ట్రపతి పురస్కార గ్రహీత .
74-యుగ దర్శనం కర్త –బాబూరాం అవస్తి (1929 )
యుగ దర్శనం ,లోక గీతాంజలి ,కథా ద్వాదశి ,నయా నవనీతం ,నయా నీరాయణం రాసిన బాబూరాం అవస్తి 1929 ఫిబ్రవరి 28 లక్ష్మి పుర ఖేరి లో జన్మించాడు .సంస్కృత ఎం ఏ ,ఆచార్య .కవి ఏవం సాహిత్యకార్ అనే భావన ఉన్నవాడు .
75-కావ్య తత్వ బోధిని కర్త –బచ్చూలాల్ అవస్తి –(1918 )
వ్యాకరణ ,దర్శన ,సాహిత్యాలలో ఆచార్య ,ఎం ఏ పిహెచ్ డి, డిలిట్ బచ్చూలాల్ అవస్తి 8-8-1918 యుపి లో బహారైచ్ జిల్లా సిపాహియా లో జన్మించాడు .సాగర్ వర్సిటి ఆచార్యుడు .పండిట్ రాజారాం భట్ట ,భాగీరధ మిశ్రా ,వేదాంత మిశ్రా ,పండిట్ ఘుతార్ ఝా ,సంతోష్ పాండ్యా లు గురుపరంపర .20 గ్రంధాలు రాశాడు .అందులో కావ్య తత్వ బోధిని ,భారతీయ దర్శన శాస్త్ర కా బృహత్కోశ,కావ్యమే రహస్య వాద,ధ్వని సిద్ధాంత ,తులనీయ సాహిత్య చింతామణి ,భారతీయ కావ్య సమీక్ష మే ధ్వని సిద్ధాంత ,కావ్య తత్వ బోధిని ,ప్రతానిని ముఖ్యమైనవి. ప్రతానిని అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ పొందాడు 1993 లో రాష్ట్రపతి పురస్కారం అందుకున్నాడు .
76 –శ్రీ మద్భగవద్గీతా విజ్ఞాన భాష్య కర్త –నరేంద్ర అవస్తి (1955 )
22-9-1955 రాజస్థాన్ జోద్పూర్ లో పుట్టిన నరేంద్ర అవస్తి ఎం ఏ పి హెచ్ డి..జోద్ పూర్ జే యెన్ వ్యాస్ యూని వర్సిటి లో సంస్కృత ప్రొఫెసర్ .దయానంద భార్గవ శిష్యుడు .శ్రీమతి రాణి దధీచి కి గురువు ., –శ్రీ మద్భగవద్గీతా విజ్ఞాన భాష్య,,అత్రి ఖ్యాతిః,నూపుర ధ్వని ,వేద ఉపనిషత్ వంటి 6 పుస్తకాలు రాశాడు .జర్మని ,ఫ్రాన్స్ మొదలైన దేశాలలో పర్యటించి భారతీయ వేదాంత ప్రచారం చేశాడు .
77-సుధర్మ ,నారాయణీయం సంపాదకుడు –కల్లె నలత్తూర్ వరద రాజ అయ్యంగార్ (1921 )
30-9-19 21 కర్నాటక కల్లె లో జన్మించిన కల్లె నలత్తూర్ వరద రాజ అయ్యంగార్ –కస్తూరి శ్రీనివాసా చార్య ,లక్ష్మీ కాంత అయ్యంగార్ ల శిష్యుడై విద్వాన్ అయ్యాడు .సంస్కృత ప్రెస్ నిర్వహించాడు .సుధర్మ ,నారాయణీయం లను తన సంపాదకత్వం లో వెలువరించాడు .విశిష్టా ద్వైత వేదాంత వ్యాప్తికి విశిష్ట సేవలు చేశాడు .సంస్కృత సేవా ధురీణ ,వాణీ భూషణ ,విద్యానిధి బిరుదాంకితుడు .
78- సావిత్రి కావ్య కర్త –నీలకంఠ శాస్త్రి సుందరం అయ్యర్ (19 04 )
20-6-19 04 తమిళనాడు తిరునల్వేలి జిల్లా శింగా కులం లో జన్మించిన నీలకంఠ శాస్త్రి సుందరం అయ్యర్ వ్యాకరణ ఆచార్యుడు .ఉపాధ్యాయుడు చేసి రిటైరయ్యాడు .పద్మనాభ శాస్త్రి ,రాఘ వేంద్రా చార్య ,శ్రీ కృష్ణ శాస్త్రి గురువులు .సావిత్రి కావ్యం ఒక్కటే రాశాడు .వ్యాకరణ ,కావ్య శాస్త్రాలలో గొప్ప కృషి చేశాడు .
79- భారత గౌరవం కర్త –పరమేశ్వర అయ్యర్ (1916 )
16-7-19 16 కేరళలో పుట్టిన పరమేశ్వర అయ్యర్ మహర్షి యూరోపియన్ రిసెర్చ్ యూని వర్సిటి లెక్చరర్ .న్యాయ,వేదాంత శాస్త్ర ఆచార్యుడు .దేవి నవరత్నమాల ,భారత గౌరవం ,ఆభానక మంజరి సంస్కృత రచనలు చేశాడు .ఆంగ్ల జాతీయాలకు సంస్క్రుతానువాదం చేసి రాసినదే ఆభానక మంజరి .
80-ధర్మ సూరి కృత నరకాసుర విజయ వ్యాయోగ కర్త –షర్మిలా బగాచీ (19 60 )
6-8-1960 ఉత్తర ప్రదేశ్ ఝాన్సి లో జన్మించిన షర్మిలా బగాచీ ఎం ఏ ,బిఎద్ ,పిహెచ్ డి..బరోడా ఓరియెంటల్ ఇన్ స్టి ట్యూట్ రిసెర్చ్ ఆఫీసర్ .గురువు ప్రొఫెసర్ రాదా వల్లభ త్రిపాఠి .రచనలు-ధర్మ సూరి కృత నరకాసుర విజయ వ్యాయోగ,అభినయ లక్షణ ఆఫ్ శివదాస ,మొదలైనవి.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్-21-1-18 –ఉయ్యూరు
