గీర్వాణ కవుల కవిత గీర్వాణం -4 101- సామవేదార్షేయ దీపః సంపాదకుడు -ఆర్.ఆర్. శర్మ(20 వ శతాబ్దం ౦ )

   గీర్వాణ కవుల కవిత గీర్వాణం -4

మనవి –గీర్వాణ౦  -4 లో ఇప్పటి వరకు రాసిన 100 మంది కవుల రచనకు ఎక్కువభాగం ఆధారం –రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ – న్యు ఢిల్లీ వారు శ్రీ రాదావల్లభ త్రిపాఠీ గారి ముఖ్య సంపాదకత్వాన  ఆంగ్లం లో వెలువరించిన ‘’Inventory Of Sanskrit Scholors ‘’  అనిమనవి చేస్తూ ,అందులో ఆవగింజలో శతభాగం మాత్రమె వాడానని,మిగిలిన వారి గురించి తరువాత రాస్తానని తెలియ జేస్తూ ,ఇప్పటికి దానికి’’ కామా’’మాత్రమే పెడుతూ ,ఇప్పుడు 101 నుండి రాసే దానికి ఆధారం – రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠ్ –తిరుపతి వారు ప్రచురించిన సంస్కృత ప్రచురణల జాబితా అని తెలుపుతున్నాను .

101- సామవేదార్షేయ దీపః సంపాదకుడు -ఆర్.ఆర్. శర్మ(20 వ శతాబ్దం ౦ )

సామవేద అనుక్రమణిక విధానం లో అపురూపమైనతొలి ప్రచురణ పొందిన  గ్రంధం.ఛందస్సు క్రమపద్ధతి అనుసరి౦పబడింది  .దేవతల ఋషుల ,రుచ ,గాన ల రికార్డ్ ఉన్నది .  సంపాదకుడు చాలా శ్రమ కోర్చి 4 వ్రాత ప్రతులను అధ్యయనం చేసి కూర్చిన గ్రంధం .దీని నుండి మనకు కావాల్సిన గీతం ,గానం లను తేలికగా పొందవచ్చు .అనుబంధం లో సామగాన ,గ్రామ గేయ ,ఆరణ్య కాలను వర్ణక్రమం లో కూర్చారు .ఛ౦దో ,వేద పరిశోధకులకు ఇది కరదీపిక .

10 2-పంచ విధ సూత్ర మాతృకా లక్షణే –సంపాదకుడు –బి ఆర్ .శర్మ (20 వ శతాబ్దం ౦ )

సామవేదానికి చెందిన 10చిన్న  పరిశీలన గ్రంధాలలో వరుస క్రమ౦ లో 8 వది .ఇది ముఖ్యంగా ప్రస్తావ ,ప్రతి హరణ ,నిధాన అనే మూడు భక్తిమార్గాలను వివరిస్తుంది .మిగిలిన రెండు భక్తిమార్గాలు ఉద్గీత ,ఉపద్రవల విషయం ఇందులో ఉండదు .1913 లో ఆర్.సైమన్ సంపాదకత్వం లో వచ్చిన ‘’పంచ విధ సూత్ర’’తోపాటు శర్మగారు 9 వ్రాతప్రతులనాధారంగా దీన్ని కూర్చారు .విస్తృత వ్యాఖ్య  కూడా రాశారు .మాతృకా లక్షణ అనే చిన్న పరిశీలనలో హ్రస్వ ,దీర్ఘ ,ఫ్లుత,వృద్ధ లక్షణాలు వివరించారు .దీనికోసం 5 వ్రాతప్రతులను పరిశీలించారు .ప్రస్తుతం ఈ రెండు కలిపి ప్రచురణ పొందింది .ఛందస్సు పై సాదికారానికి ఇది గొప్ప మార్గ దర్శనం చేస్తుంది .

103- ప్రతి హరణ సూత్రం –సంపాదకుడు –బి ఆర్ శర్మ(20 వ శతాబ్దం ౦ )

 కల్ప సూత్రాలలో అనుబంధంగా ఉన్నవాటిని వివరించేది ప్రతిహరణ సూత్రం .సామ వేద సాంకేతిక క్షేత్రానికి చెందిన ఈ పుస్తకం సామ లక్షణ గ్రంధాలలో విలక్షణమైనది . సులభ గ్రాహ్యత కోసం వరద రాజ వ్యాఖ్య జోడి౦పబడింది .9 వ్రాతప్రతులు అనేక మైక్రో  ఫిలిం లు పరిశీలించి కూర్చిన పుస్తకం .ముఖ్య  గ్రంథం లోని అనేక సమస్యలపై సంపాదకుడు శర్మగారు అర్ధవంతమైన సులభ గ్రాహ్యమైన వ్యాఖ్యానం రచించి తమ ప్రతిభను వెల్లడించారు .ముందుమాటలు ,అనుబంధం వేదాధ్యయన పరులకు మంచి సహకారి .

104-దేవతాధ్యాయ సంహితోపనిషత్   -సంపాదకుడు –బి ఆర్ శర్మ (20 వ శతాబ్దం ౦ )

సామవేదం లోని మూడు బ్రాహ్మణాలను ఒకే చోట చేర్చిన గ్రంథమిది .7 వ్రాతప్రతుల ,సత్య వ్రత సమశ్రామిన్ ,జీవనాద విద్యా సాగర్ ,రామనాధ దీక్షితార్ ల3 ప్రచురణ గ్రందాల విస్తృత పరిశోధనతో శర్మగారు దీన్ని తెచ్చారు .దీని వ్యాఖ్యానం సాయనుని అనుసరించి రాశారు .ఇందులో సంహితోపనిషత్ బ్రాహ్మణం మొదటి కీలక గ్రంధం .దీనికి టీకా ఉంది.మూలం తో పాటు సాయనాచార్య  ,ద్విజ రాజ వ్యాఖ్యానాలు చేర్చారు.వంశ బ్రాహ్మణాన్ని  వ్రాతప్రతులు ,బర్నేల్ ,సత్యవ్రత సమాశ్రమిన్ లు ముద్రించిన ప్రతులను పరిశీలించి కూర్చారు .ఈ బ్రాహ్మ ణ౦  లో రుషుల వంశక్రమం ,వారు సామవేద వ్యాప్తికి చేసిన సేవల వివరణ ఉన్నది .వేదాధ్యన పరులకు ఇందులోని గమనికలు ,వ్యాఖ్యానం అనుబంధం అద్భుతంగా ఉపయోగపడుతాయి .

105-ఛందో విచితి –సంపాదకులు –బి ఆర్ శర్మ ,ఎల్ యెన్ భట్ట (20 వ శతాబ్దం ౦ )

సామవేదానికి చెందిన పరిశీలనమే ఛందో విచితి .నిదాన సూత్రంలో భాగం .వేద ఛందస్సులు ,అందులోని రకాల గూర్చి చెప్పేది .ఇది తాతాప్రసాద ‘’తత్వ బోధిని వ్రుత్తి ‘’,పెద్ద శాస్త్రి ‘ఛందో విచితి వ్రుత్తి ‘’వ్యాఖ్యలతో సహా చేర్చి ప్రచురింప బడింది .వేద గ్రందాల ప్రచురణ నిష్ణాతుడైన శర్మగారు దీనిని అత్యంత వ్యయ ప్రయాసలతో చక్కని వ్యాఖ్యతో వెలువరించారు .ఇండాలజిస్ట్ లకు ఇతోధికంగా ఉపయోగ పదే గ్రంథమిది .

 ఇంతటి తో ‘’తిరుపతి ‘’వదిలి, 106 నుండి మళ్ళీ ‘’ఢిల్లీ’’ దారి పడుతున్నాను –

 సశేషం

 మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -23-1-18 –ఉయ్యూరు  

 

 .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.