గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 136-రాధికా ప్రేక్షిక కర్త –శివ ప్రసాద్ భరద్వాజ్ (19 24 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

136-రాధికా ప్రేక్షిక కర్త –శివ ప్రసాద్ భరద్వాజ్ (19 24 )

45 గ్రంథాలు రాసిన శివ ప్రసాద్ భరద్వాజ 1924 అక్టోబర్ 15 ఉత్తరాఖండ్ పౌరి ఘర్వాల్ లో జన్మించాడు .సాహిత్య ఆచార్య ,సాహిత్య రత్న ,ఎం ఏ ,ఎం వో.ఎల్ పిహెచ్ డి,డిలిట్.పంజాబ్ లోని హోషియార్పూర్ ,పంజాబ్ యూని వర్సిటీ లలో సంస్కృత ప్రొఫెసర్ .అతని రచనలో ముఖ్యమైనవి –భారత సందేశ్ ,హూణపరాజయం ,జీవన సలధి , రాధికా ప్రేక్షిక.,సాహిత్య  శాస్త్ర నిధి .ప్రెసిడెంట్ అవార్డీ .పంచనదీయ సాంస్క్రిట్ పరిషత్ వ్యవస్థాపకుడు .యుపి సంస్కృత అకాడెమి విశిష్ట పురస్కారం పొందాడు . ‘’విశ్వ సంస్కృతం ‘’ క్వార్టర్లి పత్రిక సంపాదకుడు .

137-14 సంస్కృత నవలా రచయిత –ప్రమోద్ భారతీయ (19 65 )

20-9-1965 బీహార్ ఖగారియా జిల్లా నయాగాం లో పుట్టిన ప్రమోద్ భారతీయ సంస్కృత ,ఆంగ్లాలలో పిహెచ్ డి.ముస్సోరీ ఎం పి జి కాలేజి అసిస్టంట్ ప్రొఫెసర్ .సహపాహిని మొదలైన 14 సంస్కృత నవలలు రాశాడు .

138- శారదామణి లీలాచరిత కర్త – బాలకృష్ణ భరద్వాజ (1921 )

1921 లో హర్యానా కురుక్షేత్రం లో పుట్టిన బాలకృష్ణ భరద్వాజ సంస్కృతం లో శారదామణి లీలాచరితం ,రామకృష్ణ పరమహంస దివ్య చరితం రాశాడు .139-పద్య పుష్పాంజలి కర్త –కృష్ణ దత్ భరద్వాజ (19 08 )

1908 ఆగస్ట్ 15 ఉత్తర ప్రదేశ్ బులందర్ సహర్ లో జన్మించిన క్రిష్ణదత్ భరద్వాజ సంస్కృతాచార్య ,ఎం ఏ పి హెచ్ డి .ఢిల్లీ మోడరన్ స్కూల్ ప్రిన్సిపాల్ .పద్య పుష్పాంజలి మాత్రమె రాసి ‘’పద్మశ్రీ ‘’పొందాడు .ఢిల్లీ సంస్కృత అకాడెమి ,అవార్డ్ ,భారత రాష్ట్ర పతి నుంచి శ్రేష్ట సంస్కృత విద్వాన్ పురస్కారం అందుకున్నాడు .

14 0-ఆర్యనామాది నివాసస్థానం కర్త –పురుషోత్తమలాల్ భార్గవ్ (1909 )

1909 జైపూర్ లో జన్మించిన పురుషోత్తమలాల్ భార్గవ్ సంస్కృత ,హిందీ ఎం ఏ పిహెచ్ డి.రాజస్థాన్ యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్ ,హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ .’’ఆర్య నామాది నివాస స్థానం ‘’అనే రిసెర్చ్ పేపర్ రాసి ,అమెరికాలో ని ప్రాచ్య విద్యా ప్రతిస్టాన్  ‘’లో సమర్పించాడు .

141-ఋగ్వేద చ రహస్యం కర్త –దయానంద భార్గవ (1937 )

సంస్కృత ఎం ఏ పి హెచ్ డి దయానంద భార్గవ 22-2-1937 రాజస్థాన్ జోధ్పూర్ లో జన్మించాడు .గంగారామ శాస్త్రి ,ఇంద్ర చంద్ర శాస్త్రి ,క్రిష్ణదత్ శాస్త్రి లు గురువులు .పండిత మధుసూదన ఓజా వేద విజ్ఞాన పీఠం చైర్మన్ .రాజస్థాన్ సంస్కృత యూని వర్సిటి రీడర్ .ఋగ్వేద చ రహస్యం సంస్కృతం లోరాసి ,వైదిక విజ్ఞానం  ,వేద ధర్మ వ్యాఖ్యానాలకు  సంపాదకత్వం వహించాడు .ప్రెసిడెంట్ అవార్డీ .

142-వైదిక స్వాధ్యాయ కారత్ –భావానీలాల్ భారతీయ –(1928 )

19 28 నాగోర్ లో పుట్టిన భావానీలాల్ భారతీయ ఎం ఏ పి హెచ్ డి.సంస్కృత హిందీ భాషలలో 80 పుస్తకాలు రాశాడు .అందులో వైదిక స్వాధ్యాయ ,వేదాధ్యయన్ కె సోపాన్ ,ఆర్య లేఖనా కోశ ,ఆర్య సమాజ్ కె సాహిత్య కా ఇతిహాస  ఉన్నాయి .

14 3-స్తవ కుసుమాంజలి కర్త –కె.ఎస్. భాస్కర భట్ (1921 )

3-2-19 21 కర్నాటక సాగర్ తాలూకా లో పుట్టిన భాస్కర భట్ –దేవీ విలాస కావ్యం ,స్తవ కుసుమాంజలి రచించాడు .సాహిత్య భూషణ ,కవి కిశోరం బిరుదులు పొందాడు .

14 4-జలవాధాద నిశ్చలతత్వ విచారః కర్త –కె గణపతి భట్ (196 2 )

కర్నాటక జల్సూర్ లో 21-2-196 2 పుట్టిన గణపతి భట్ ఎంఏ పి హెచ్ డి.తిరుపతి రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ లో అసిస్టంట్ ప్రొఫెసర్ . -జలవాధాద నిసశ్చల తత్వ విచారః,న్యాయావయవ విచారః రాశాడు .ఋగ్వేద క్రమ పాఠ నిధి .

145-పద రూపావళి కర్త –కె గణపతి భట్ (19 60 )

సంస్కృత ,సంగీతాలలో ఎం ఏ చేసిన కె గణపతి భట్ కర్ణాటకలో 4-7-1960 పుట్టి సంస్కృత టీచర్ చేశాడు .పండిట్ బాల చంద్ర ,పండిట్ మార్తాండ దీక్షిత్ ,పండిట్ చంద్ర శేఖర పౌరాణిక్ లవద్ద విద్య నేర్చాడు.6 పుస్తకాలు రాశాడు –అవే-  పద రూపావళి ,వేద గణితం,సంస్కృత గాన ధ్వని ,సంస్కృత ప్రభ ,దేవ పూజావిధానం.

146-కావ్యస్య శబ్ద నిస్టత కర్త –రాఘవేంద్ర భట్ (1977 )

ఎంఏ పిహెచ్ డి రాఘవేంద్ర భట్ 19 77 ఏప్రిల్ 2 కర్నాటక సంప లో పుట్టాడు .శృంగేరి రాజీవ్ గాంధి కాంపస్ అసిస్టంట్ ప్రొఫెసర్ .కావ్యస్య శబ్ద నిస్టత రాశాడు .

147-సుభాషిత శతకం కర్త-సరోజా భాటే (19 42 )

సరోజా భాటే 5-1-19 42 మధ్యప్రదేశ్ ఔంద్ లో పుట్టి ఎం ఏ పి హెచ్ డి చేసి ,పూనే భండార్కర్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ సంస్కృత ,ప్రాకృత శాఖ హెడ్ గా పని చేసింది .మొత్తం 16 పుస్తకాలు రాసింది .అందులో సుభాషిత శతకం తో పాటు ,ది రోల్ ఆఫ్ పార్టికల్  ‘’చ’’ ఇన్ ది ఇంటర్ ప్రిటేషన్ ఆఫ్ అష్టాధ్యాయి ,ది ఫ౦డ మెంటల్స్ఆఫ్ అను వృత్తి ,ది మహాభాష్య దీపికా ఆఫ్ భర్తృహరి ఆహ్నిక 6 ,లా ఇన్ వైదిక అండ్ ప్రాకృత లిటరేచర్ రచించింది .రాష్ట్ర పతి పురస్కార గ్రహీత .

148-భాషా కౌస్తుభ కర్త-భువన ఘోటే గణేశ భట్ (19 29 )

21-1-19 29 కర్నాటక శృంగేరి లోని విశ్వనాధ పురం లో పుట్టిన భువన ఘోటే భట్ విద్వాన్ .మైసూర్ మహారాజా సంస్కృత మహావిద్యాలయ  టీచర్ చేసి రిటైరయ్యాడు .చతుర్వేది రామ చంద్ర ,విష్ణుమూర్తి భట్ట శిష్యుడు .భాషా కౌస్తుభం ఒక్కటే రాశాడు .

149-శబ్ద విద్యా సౌరభ కర్త-గంగాధర భట్ (1927 )

రాజస్థాన్ ఆల్వార్ లో 19 27 జనవరి 1 జన్మించిన గంగాధర భట్ ఎం ఏ పిహెచ్ డి.జైపూర్ లో రాజస్థాన్ యూని వర్సిటీ ప్రొఫెసర్ .రాయ్ బహదూర్ చంపాలాల్ రిసెర్చ్ యూని వర్సిటి డైరెక్టర్ .రాజస్థాన్ సంస్కృత అకాడెమి చైర్మన్ .రాజస్థానీ యమాభినవ సంస్కృత సాహిత్యం ,శబ్ద విద్యా సౌరభం ,రాజస్థాన గౌరవం సంస్కృత రచనలు .స్వరమంగళ సంస్కృత పత్రిక ఎడిటర్ .భారత ప్రభుత్వం చే విద్వత్ సమ్మాన్ అందుకున్నాడు ఆయన రచనలపై గుప్తా అనే విద్యార్ధి రిసెర్చ్ చేశాడు .మహా రాణామేవార్ ఫౌండేషన్ నుంచి హరిత్రిషి పురస్కారం లభించింది .

150-జయభారతాదర్శ కావ్య కర్త –గోస్వామి ఫల్గుణ్ భట్ (1915 )

1915 బికనీర్ లో పుట్టిన గోస్వామి ఫల్గుణ్ భట్ ,బికనీర్ నగర పాలికా డైరెక్టర్ .జయభారతాదర్శ కావ్యం రచించాడు .కావ్య ,జ్యోతిష ,సాహిత్య ,కర్మకాండ ,ఆయుర్వేద ఘనుడు .

151-లలనా లోచనోల్లాస కర్త –హరి వల్లభ భట్ (18 6 6-1920  )

1866 లో జన్మించి శ్రీ క్రిష్ణరాం భట్ ,శ్రీ కుందనరాం ,భాయినాద్ ఓజా వంటి సుప్రసిద్ధుల శిష్యుడై వ్యాకరణ ,వైద్యకశాస్త్ర ,న్యాయ శాస్త్ర విద్వా౦సుడ య్యాడు .జయనగర పంచరంగ ,లలనా లోచనోల్లాసం ,కాంత వక్షోజ శక్త్యోదయః ,శృంగార లహరి ,దాస కుమారదాసా వంటి 10 గ్రంధాలు రాశాడు. 54 ఏళ్ళు జీవించి 1920 లో చనిపోయాడు .కవిమల్ల అవార్డ్ గ్రహీత .

152-రామాయణ కాలీన  సమాజంఏవం  సంస్కృతి కర్త –జగదీశ్ చంద్ర భట్ (19 5 6 )

సాహిత్యాచార్య ,ఎం ఏ పిహెచ్ డి జగదీశ్ చంద్ర భట్ 10-5-1956 యుపి లోని పితౌఘర్ లో పుట్టాడు .గురువులు మదననారాయణ త్రిపాఠీ ,పండిట్ వేదానంద ఝా ,డా.హరినారాయణ దీక్షిత్ . -రామాయణ కాలీన  సమాజంఏవం  సంస్కృతి అనే గ్రంధం మాత్రమె రాశాడు .

153-శంకర భాష్య గీతా  ముద్దిస్య గీతాయా వివేచనాత్మకాధ్యయనం కర్త –జయంత్ కరుణా శంకర్ భట్ (1933 )

కావ్య తీర్ధ ,పురాణ ,ఇతిహాస ,సాహిత్య ,జ్యోతిష వేదాంత ములలో శాస్త్రి డిగ్రీ పొందిన జయంత్ శంకర భట్ 25-1-1933 గుజరాత్  జునాగడ్ జిల్లా బాదల్పూర్ లో జన్మించాడు .అసోసియేట్ ప్రొఫెసర్ .కమల్కాంత మిశ్ర ,ప్రతాప్ రాయ్ మోడీ గురువులు . శంకర భాష్య గీతా  ముద్దిస్య గీతాయా వివేచనాత్మకాధ్యయనంఅనే విలువైన ఒక్క గ్రంధమే రాశాడు .

154- అను భూతి శతక కర్త –జీత్ రాం భట్ (1 6 2 )

9-11-19 62 ఉత్తరాఖండ్ భట్వారి లో పుట్టిన జీత్ రాం భట్ ఎం ఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ,బిఎడ్ ,పిహెచ్ డి.ఢిల్లీ సంస్కృత అకాడెమి డిప్యూటీ సెక్రెటరి .భక్తి  రసామృతంఏక అధ్యయన ,అనుభూతి శతకం రాశాడు .గొప్పకవి విమర్శకుడు .

155-స్వర్ణ కోశ కర్త –కాకు౦జే కృష్ణ భట్ (1916  )

కౌటిల్య అర్ధ శాస్త్రం ,స్వర్ణ  కోశం ,వ్యాకరణ వ్రుత్తి రచించిన కాకుంజే కృష్ణ భట్ 1916 ఏప్రిల్ 1 కేరళ కాసర్ గోడ్ జిల్లా కాకుంజే లో పుట్టాడు .కర్నాటక నీలాచల మహా రాజా సంస్కృత కాలేజి మీమాంస ప్రొఫెసర్ చేసి రిటైరయ్యాడు .విష్ణు  భట్ట ,వెంకటప్ప శర్మ ,బాల సుబ్రహ్మణ్య శాస్త్రి గురుపరంపర .మీమాంస ,అద్వైత వేదా౦తాలలొ ఘనుడు .

136 నుండి 155 వరకు ఆధారం –Inventory Of Sanskrit  Scholors .

 

   సశేషం

  భారత రిపబ్లిక్ డే శుభా కాంక్షలతో

   మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -26-1-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 .

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.