గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 416-పార్వతీ పరిణయ చంపూ కావ్యకర్త –చంద్ర భట్ట ఈశ్వరప్ప (16వ శతాబ్దం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

416-పార్వతీ పరిణయ చంపూ కావ్యకర్త –చంద్ర భట్ట ఈశ్వరప్ప (16వ శతాబ్దం )

16వ శతాబ్దికి చెందినాచంద్రభట్ట ఈశ్వరప్ప ‘’పార్వతీపరిణయం ‘’అనే చంపూకావ్యం రాశాడు .దీని వ్రాయసకాడు కూడా చంద్ర భట్ట వంశం వాడే .గురు స్తుతి –

‘’సదా శివగురుం భజే సకల ధీర నిత్యస్తుతం –ద్విజాధిపతి సేవితం వివిధ వేద వక్త్రా౦ బుజం

స్పుట స్పటిక మాలికా స్పురిత కంబుకంఠంసదా –శ్రిత ప్రకార వాంఛిత ప్రబల దివ్య వస్తు ప్రదర్శితం ‘’

తర్వాత వంశ చరిత్ర చెప్పాడు .కథలో హిమవంతుడు మేనకను పెళ్ళాడటం ,మైనాక ,పార్వతీ జననాలు ,నారదుడు రావటం ,శివుని గుణగణాలు పార్వతి విని పరవశం చెందటం శివుడి తపస్సు ,శివుని సేవకు పార్వతి వెళ్ళటం ,దేవతలు తారకాసురునిఆగడాలుఇంద్రునికి  వివరించటం ,అతడు మన్మధ సాయంకోరటం,అంగీకరించి శివునిమనసును పార్వతిపై లగ్నం చేయటానికి వెళ్ళటం ,ముక్కంటికంటిమంటకు మాడి మసి అవటం ,రతీ విలాపం ,శివుని అనుగ్రహం పార్వతి తపస్సు ,చివరికి  పార్వతీ పరమేశ్వరుల వివాహం .

ఈశ్వరప్ప కాళిదాసమహాకవిరాసిన కుమారసంభవం ప్రేరణతో దీన్ని రాశాడు .కొన్ని చోట్ల వ్యాకరణ విరుద్ధాలు ,యతి భంగాలున్నాయి .ఇవి వ్రాయసకాని దోషాలు కూడాకావచ్చు అంటారు ఆచర్యశ్రీ .పార్వతీ దేవి పాదాల వర్ణన –

‘’రాత్రౌ సుధాంశు రిపు రేత్యవిజ్రు౦భణ౦ మే- హన్తీతిపర్వత సుతాంప్రతి సాదు జప్త్వా

పద్మ౦ తదీయ చరణావతర౦ ప్రపద్య –తత్సంజ్ఞయా విజయతే కిము నిత్య భ్రుంగం ‘’

మాయావటువు వేషం లో వచ్చిన శివుడు  పార్వతి మనసు శివునిపైనుండి మరల్చే యత్నం –‘’జానామి జానామి తవానుభావం –జాగర్తి జాగర్తి తదస్టమూర్తౌ-భావంతదాపి ప్రచురాన్ గుణా౦ స్తాం-తత్సాన్ని విస్టాన్వికృతాన్ ప్రపద్యే ‘’.-కాలకూటాశనోవాయు భుగ్భూషణః-క్రూర శుండాల చర్మా౦శుకో యాచకః –ప్రేతకా౦తార  సంచారణే తత్పరః –కిం వృతస్సత్వయా భీకర శ్చే స్టయా ‘’

పెళ్లి కొడుకైన శివుని వర్ణన –

‘’జటాజూట శ్శంభో స్సపది హరితోష్ణీష వసనం –సుధాంశు స్తత్రతః ప్రభవతి మహా భాషికమపి

గలాలంబా ముక్తావళి శ్శిరురగరాజస్స మణిః-కరాద్దిస్సాసర్పాఃకటక ముఖ భూషామహితః  ‘’

చివరగా పార్వతీ  పరమేశ్వర రహః కేళి వర్ణ న –

‘’ కళ్యాణ ప్రదస్తయోస్త్రిజగతా మాస్వాదితా మూల్యత –త్తాంబూలాది పదార్ధయోః కృత బహిర్జాతవ్య వాయాస్ధయోః

పర్యాయాత్కుసుమేషు వస్య మనసో రంతర్వ్యయా స్ధయో –రాచ్ఛి  న్నాత్మ మదృశ్యత త్రిభువనం మోదం ప్రపేదే తదా ‘’

ఆధారం –ఆచార్య బిరుదురాజు రాజుగారి ‘’చరిత్రకెక్కని  చరితార్ధులు ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-6-19-ఉయ్యూరు

 

 

 

 

 



Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.