గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4
426-చిన్నమ్మ (10వ శతాబ్దికి పూర్వం )
భోజుని ‘’సరస్వతీ కంఠా భరణం ‘’లో చిన్నమ్మ శార్దూల విక్రీడితం లో రాసిన ఒక్క శ్లోకం ఉదాహరి౦ప బడింది .10వ శతాబ్దికి ముందున్న కవయిత్రి ఆమె .సారంగధర పద్ధతిలోనూ ఇదే శ్లోకం ఉంది .శివుడు తన మనోభావాన్ని దేబ్బతీశాడని నింద చేసే శ్లోకం .ఆయన తీవ్రస్వభావంకలవాడని అహంకారి అనీ ,మహాభైరవాకృతిలో ఆయన అయిదు అవతారాలెత్తిన విష్ణువును తిరస్కరించాడని,మించిపోయాడని చెప్పింది .గంభీరమైన శైలీ విన్యాసం ,సమ్మేళన పదార్భాటం ఆమె విధానం .ఆమెకు స్మృతి,శ్రుతులపై లోతన అవగాహన ఉన్నట్లు అర్ధమౌతుంది .
‘’కల్పాన్తే శమిత త్రివిక్రమ మహాకంకాళ దండో స్ఫురచ్-ఛేషస్యత్ నృసింహ పాణి నఖర ప్రోతాది కోలామిషః
విశ్వైకార్ణవతా నితాంత ముదితౌ తౌ మాతృస్య కర్మా బుభౌ –కర్షన్ ధీవరతాం గాతోస్యతు మహా మోహం మహా భైరవః ‘’
427-గంధ దీపిక
సారంగధరపద్ధతిలో గంధ దీపిక ఆర్యా వృత్తం లో రాసిన ఒకే ఒక శ్లోకం ఉదాహరి౦ప బడింది .ఇందులో ఆమె గృహిణి ధర్మాలను విధులను వస్త్రాలునేసే పద్ధతిని ,ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటాన్నీ తెలిపింది .
‘’శశి నరవ గిరిమదమా౦సీ జాతు భాగో మలయలోహమో ర్భాగ్యౌ –మిలితైర్గుణపరి మృదితై వస్త్ర ర్గుహాదీని ధూపయే శ్చతురః’’
428-గౌరి (17వ శతాబ్ది )
సుందరదేవుని సూక్తి సుందర లో గౌరీ షాజహాన్ ను పొగుడుతూ రాసిన శ్లోకం ఉదాహరించాడు .పంచతత్వ ప్రకాశిక రాసిన వేణీ దత్తకూడా తన పద్య వేణి లో గౌరీ రాసినశ్లోకాలు పేర్కొన్నాడు .శివుడు కల్ప వృక్షం ,రాజు ,స్త్రీ,ప్రకృతి రాజకీయం శృంగారం మొదలైన వాటిపై ఆమె కవనం ధారతో అమృతతుల్యంగా ఉంటుంది .శివుడిని భయంకరంగా లయకారుడుగా కాక ,అభయ దాతగా సంరక్షకునిగా వర్ణించింది .శివపార్వతులు లోకకల్యాణ కారకులని చెప్పింది .తనరాజుపౌరుషపరాక్రమాలను ఆరు శ్లోకాలలో వర్ణించింది భ్రస్టుపట్టిన సనాతన ధర్మాన్ని రాజుమాత్రమే పునరుజ్జీవి౦ప చేయగలడలని చెప్పింది .భుశండి ఆయుధ వర్ణన చేసింది .యుద్ధాన్ని బాగా చిత్రించింది .చివరి శ్లోకం లో లొంగిపోయిన వీరుని భార్యపడే కస్టాలు ఆశ్రయం ఆదరణ దొరకకపోవటం ,విజేతరాజును ఆశ్రయం కొరలేని దైన్యస్థితి బాగా వర్ణించింది గౌరి .స్త్రీసౌన్దర్యాన్ని అద్భుతంగా వర్ణించింది .నీటిలో స్నానం చేసి బయటకు వచ్చిన స్త్రీ రతీ దేవిని మించిన సౌందర్యం తో కనిపించింది ఆమెకు .స్త్రీ సర్వాంగ సౌందర్యం ఆమె కవిత్వం లో పోతపోసుకోన్నది .ఆమె కోరికల కల్పవృక్షంగా కనిపిస్తుంది .సృజన ,భావుకత మేధావితనం ఆమె సొమ్ము .కృత్రిమతకు దూరం సహజత్వానికి అతి సమీపం ఆమె కవిత్వం .అలంకార శోభతో కవిత్వాన్ని మైమరపించే నేర్పు గౌరికి ఉన్నది .
శివుడు-‘’అనుఫుల్ల గల్ల పరిఫుల్ల ముఖారవింద –సౌగంధ్యలుబ్ధమధుపాకులయ రతాం
భుగ్న పీనకుచ చూచుకాయాతిగాఢ-మాలింగితౌగిరిజయా గిరిశః పునాతు ‘’
రాజు – ‘’ప్రభ్రశ్స౦గ తిమస్తకః ప్రవిగలత్ సద్వర్ణ విప్రస్థితి –ర్నశ్యత్ స్వాన్గబలః ప్రణస్టవచన ప్రాగ్భార పూర్ణ స్మృతిః
వృద్ధో త్సంతమయం స్వయం కాలి మహా మ్లేచ్చేన నిర్మాలితౌ –ధర్మః సంప్రతి చాల్యతే తవ కరాలంబేన భూమీపతే’’
భుశండి –‘’మహా చండీయ సంభాతి భుజండీ భవతఃకరే –ప్రతాపజ్వర సంభ్రాంత గోలికా జీవ హారిణీ’’
అరినారి –‘’చంద్రాననా చంద్రక చారు గాయత్రీ –సా కోప విత్రస్తచకోర నేత్రా
శైలే య మృగాభిః స్మరభావ వద్భిః-సంసేవ్యతే ద్రావారి భామినీ తే ‘’
నేత్రం –‘’ముఖే శృంగార సరసి లావణ్యామృత పూరితే –కామక్రీడా హితం భాతి నయనం శఫరీ యుగం ‘’
కల్పతరు – సంత్యేవ నందనవనే శతశః సువృక్షాః-కాలేన పుష్ప ఫలతర్పిత నాకి దక్షాః
తేత్వేక ఏవ సురరాజ మనోభిలాష –తాత్కాల దాన పటురస్తి స కల్ప వృక్షీ’’
ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-6-19-ఉయ్యూరు
