గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4
429-ఇందులేఖ (14వ శతాబ్దం )
15వ శతాబ్దికి చెందిన వల్లభ దేవుడు తన ‘’శుభాషితావలి ‘’లో ఇందులేఖ రాసిన ఒకే ఒక్క శ్లోకాన్నిమాత్రమే ఉదాహరించాడు .మంచికళాత్మకంగా ఉన్న శ్లోకం ఇది .విభావన అలంకారాన్ని తగినట్లుగా వాడింది .సూర్యాస్తమయాన్ని చూసి సూర్యుడురాత్రివేళ ఎక్కడ దాక్కుంటాడు అనే సమస్య వస్తుంది .దీనికి చాలామంది చాలారకాలుగా సమాధానాలు చెబుతారు .కానీ ఇందులేఖ మాత్రం ‘’సూర్యుడు ప్రేమతో తపించే వారి హృదయాలలో ఉండి,రాత్రింతా ఇంకా జ్వలిస్తూ ఉంటాడని ‘’చమత్కారంగా సమాధానం చెప్పింది .
‘’ఏకవారీనిధౌ ప్రవేశమపరే లోకాన్తరాలోకనం –కేచిత్ పావక యోగితాం నిజ గదృఃక్షీణోహ్ని చండార్చిషః
మిధ్యాచై తద సాక్షికం ప్రియ –సఖి ప్రత్యక్ష తీవ్రాతపం
మన్యేహం పునరధ్వనీన రమణీ చేతో ధీ శోతే రవిః’’
430-జఘన చపాల
భర్త దూరంగా ఉన్న భార్య కృతఘ్నత ను గురించి జఘన చపాల తనపేరుకూడా కలిసివచ్చేట్లు చెప్పిన శ్లోకం ‘’కవీన్ద్రవచన సముచ్చయ ‘’లో చోటు చేసుకొన్నది .
‘’దుర్దిన నిశీధ పవనే నిః సంచారాసు నగర వీధీషు
పాత్యౌ విదేశయాతే పరం సుఖం జఘన చపాలాయాః’’
431-కేరళి
వాణీ దత్తుని పద్యవాణిలో కేరళి ఆర్యా వృత్తం లో రాసిన శ్లోకం ఒకటి ఉంది .ఈ శ్లోకంలో సరస్వతీ దేవికి ఉన్న రెండురకాల స్వభావాలను వర్ణించింది .ఆమె బాగా చదువుకున్నవారికి ,కవులకు సమీపంగా ఉంటుంది వారి ప్రతిభకు ప్రేరకురాలౌతుంది .
1-‘’యస్యాఃస్వరూప మఖిలం జ్ఞాతుం బ్రహ్మాదయోపి న స్పస్టాః
కామగావీ సుకవీనాం స జయతి సరస్వతీ దేవీ ‘’
432-కుటల (17శతాబ్దికి పూర్వం )
ఆర్యా వృత్తం లో ‘’కులటోక్తి’’గా కుటల రాసిన ఒక శ్లోకం 17వ శతాబ్దిలో హరికవి రాసిన ‘’శుభాషిత హారావళి ‘’లో కనిపించింది .అపవిత్రురాలి పై రాసిన శ్లోకం ఇది .
‘’సుఖ శయ్యా తాంబూలం విశ్రబ్ధాశ్లేష చు౦బనాదీని – తుల్యంతి న లక్షాంశంత్వరిత క్షణా చౌర్య సురతస్య ‘’
433-లక్ష్మి(14వ శతాబ్దికి పూర్వం )
14వ శతాబ్దిలోని సారంగధరపద్దతి లో లక్ష్మి శ్లోకం కనిపిస్తుంది .లయ,మధురశబ్ద , శృతి సుభగంగా ఉంటు౦ది కవిత్వం .భగద్విలాసమే సృష్టిలో మానవులలో ఉంటుంది.
‘’భ్రమన్ వనాంతే నవమంజరీషు న షట్పదో గంధ ఫలీ మజిఘ్రత్
సా కిం న రమ్య స చ కిం న గంతా –బలీయసీ కేవలమీశ్వరేచ్ఛ’’
434-లక్ష్మీ దేవీ ఠాకూరాణి(15వ శతాబ్ది )
15వ శతాబ్ది మిధిలానగర రాజు శివ సి౦హుని భార్య రాణి లక్ష్మీదేవి .తోటక వృత్తం లో ఆమె రాసినకవితలో నాటి సామాజిక వర్ణన ,ఆమె సోదరిలు వివాహసమయం లో అమ్ముడుపోవటం ఇదంతా రాణికి నచ్చకపోవటం బాగా వర్ణించింది .
-ధనలోభి –‘’చపలం తురగం పరిణర్తయతః-పథి పౌర జనాన్ పరిమర్దయతః
నహి తే భుజ భాగ్యభవో విభావో –భగినీ భగ భాగ్యభావో విభవః ‘’
435-మదాలస (14వ శతాబ్దం )
14వ శతాబ్దికి చెందిన మదాలస రాసిన రెండు శ్లోకాలు సారంగధర పద్ధతిలో చోటు చేసుకొన్నాయి .వీటిలో ఒకదానిలో భక్తీ రెండవదానిలో ప్రకృతివర్ణన ఉన్నాయి .మొదటిదానిలో విత్తును బట్టే ఫలితం అని మనం చేసే మంచీ చెడు మన జీవితాలను ప్రభావితం చేస్తాయని చెప్పింది .రెండవదానిలో జోరుగా కురిసే వర్షం వియోగంలో ఉన్న వారిని ఎలా బాధిస్తాయో తెలియ జేసింది .మానవ ఆలోచనలను భగవంతునిపైకి మరల్చటానికి మదాలస బాగా ప్రయత్నించింది .
1-‘’ధర్మ వివృతి –‘’పరలోక హితం తాతప్రాత రుత్దాయ చిన్తయ –ఇహ తేకర్మణాభేవ విపాకశ్చింతార్యప్యతి’’
2-మేఘ గర్జన –‘’సాంద్ర చంద్ర విరూతైఃస్థిత వాణౌ నర్జితం జగదిదం మదనేన
అ౦బుదో దిశదిశ ప్రధమానో గర్జితైరితి నివేదయతీవ ‘’
ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-6-19-ఉయ్యూరు

