గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
467-వైద్యనాధ ప్రసాద ప్రశస్తి కర్త –దేవకుమారిక (17-18శతాబ్దం )
వైద్యనాధ ప్రసాద ప్రశస్తి ని రాసింది దేవకుమారిక అని మహామహోపాధ్యాయ హరిప్రసాద శాస్త్రి ధృవీకరించాడు .ఈ శ్లోకాలు వైద్యనాథ దేవాలయం గోడలపై చెక్కబడి ఉన్నాయి .చిత్తూర్ రాణాఅమరసి౦హునిపట్టమహిషి రాజకుమారిక .జయసింహుని కోడలు .సంగ్రామ సి౦హ, చంద్రకుమారికల తల్లి , శబలసి౦హుని కూతురు ,సుల్తాన సి౦హుని సోదరి .కాలం 17వశతాబ్దం చివరలేక 18 శతాబ్ది ప్రారంభం .ఆమెకుమారుడి పట్టాభిషేకం 1710-11లో .భర్తమరణి౦చినతర్వాతకాల౦లొ 1716 లో వైద్యనాధ దేవాలయం నిర్మించింది .
ఈమె రాసిన ప్రశస్తికావ్యం లో వంశవర్ణన ,సంగ్రామ సింహ పట్టాభిషేకం ,దానప్రశంస ,చాహూవానోదయ ,ప్రతిష్టఅనే 5ప్రకరణలున్నాయి .దీన్ని వైద్యనాధ దేవాలయ నిర్మాణ ప్రతిష్ట సమయం లో రాసింది .మొదటిప్రకరణలో రాజవంశ చరిత్ర రాసింది .రాణాఅనేపేరును మొదట రాహప్ప ఉపయోగించాడనీ, అప్పటినుంచి అదే ప్రచారం లో ఉందని చెప్పింది .సంగ్రామ సింహునికొడుకు ఉదయసి౦హుడు ఉదయపురం నిర్మించాడు .క్షత్రియరాజులందరూ చేతులు ముడుచుకొని కూర్చుంటే రాణాప్రతాప సింహుడు హిందూమత సంరక్షణకోసం దిల్లీపాదుషా అక్బర్ తో పోరాటం ప్రారంభించి జీవితాంతం పోరాటం చేశాడు .కర్ణ సి౦హుని కొడుకు జగత్ సింగ్ రాజప్రాకారం మధ్య అత్యున్నత విశేషమైన విష్ణు మూర్తి ఆలయం నిర్మించాడు .ఇతనికొడుకు రాజసింహ రాజసముద్ర తటాకం నిర్మించాడు .ఢిల్లీ చక్రవర్తికి చెందిన అజ్మీర్ సరిహద్దు మాల్పూర్ ను జయించి వశపరచుకొన్నాడు .ఇతనికొడుకు అమరసింహుడు ‘’వరసద్విలాసం ‘’అనే మహా అందమైన రాజ అంతపురం జగన్మందిర దేవాలయం కూడా కట్టించాడు .సాహాపురం కూడా జయించి కీర్తి ఉద్ధృతంగా ఉన్న సమయం లో మరణించాడు .ప్రకరణ శీర్షిక ‘’రాణా’’గాపెట్టటం మేవాడ్ రాజ వంశ ధీర వీర గాధలను చిత్రించటం తగినట్లు ఉన్నది .
రాహప్ప తర్వాత పాలించిన నరపాలుని ధైర్యసాహసాలకు దినకర అంటే సూర్య ప్రతాపం కు తగినట్లు బిరుదుపొందాడు .నాగపాలుని గజసైన్యం అమోఘమై౦దికనుక కూడా అతనికి నాగపాల సార్ధకం .పూర్ణపాలుడు ప్రజారంజకంగా పాలించాడు .పృధ్వీ పాలుడు శత్రువులనందర్నీ ఓడించి సామ్రాజ్యవ్యాప్తి చేశాడు .భీమసి౦హుడు అరి వీర భీకరుడై శత్రువుల గుండెల్లో నిద్రపోయాడు .లక్ష్మణ సింహ శ్రీరాముని తమ్ముడు లక్ష్మణుని తలపి౦ప జేశాడు .అరిసి౦హుని పాదాలు శత్రు రాజుల ఏనుగుల రత్నాలతో అల౦క రింప బడ్డాయి .లక్ష్మీ సింహ లక్షమంది ని చంపి లక్షనాణాలు ముద్రించాడు .మోకాల సింహుడు శివ విష్ణు స్వరూపంగా ప్రజలు భావించారు .రాణాకు౦భకర్ణ అగస్త్యుని అంతటి వాడు .రాయమల్లుని సాటి ఎవరూ లేరు .ప్రతాప సింహునికొడుకు అమరసింహుడు దేవతలనే మెప్పించగా కొడుకు కర్ణ సింహ దానకర్ణునే మరపించాడు .
రెండవ ప్రకరణం సంగ్రామ సి౦హుని పట్టాభి షేక వర్ణన.వృద్ధ రాజపురోహితుడు’’సుఖరామ ‘’ఆధ్వర్యం లో పట్టాభిషేకం ఘనాతిఘనంగా జరిగింది .కాయస్తరాజు కాన్తజిత్ మేవాతిస్ లతో పోరాటానికి సాయం చేశాడు .యుద్ధంలో సంగ్రాముడు ,శత్రువు దాలేలఖాన్ ఇద్దరూ చనిపోయారు .చివరివిజయం రాణా దే .రెండవ సంగ్రామ సింహుడు చుట్టూ ఉన్న రాజ్యాలన్నీ జయించాడు .మంత్రి విహారిసింహ తెలివి గలవాడు బుద్ధి సూక్ష్మత ఉన్నవాడు. రాజుకు చక్కగా దిశా నిర్దేశంచేసి రాజనీతితో ప్రజా సంక్షేమాన్ని అమలుపరచాడు .విద్యా సంస్కృతులను ప్రజలలో బాగా విస్తరించేట్లు చేశాడు .రాజు మంత్రి పరస్పర సహకారం తో రాజ్యం లో ధర్మపాలన సాగింది .సంపద పెరిగి ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లి సంగ్రామ సి౦హుని కీర్తి దశ దిశలా వ్యాపించింది .
మూడవ ప్రకరణం లో సంగ్రామసి౦హు ని దాన ధర్మ కార్యాలు .విద్వాంసులకు సన్మానాలు ,అందులో ముఖ్యంగా దక్షిణాదికి చెందినా దక్షిణామూర్తికి,బెనారస్ కు చెందిన దినకర్ (1724-25),తర్క వేత్త సుఖానంద ,వేద కార్యనిర్వహణలో ప్రతిభ చూపిన పుండరీక ,దేవరామ ,జ్యోతిష పండితుడు కమలాకాంత భట్ట మున్నగువారికి ఘనసత్కారం దేదీప్యమానమై చరిత్రలో నిలిచాయి .
నాలుగవ ప్రకరణం లో సంగ్రామ సి౦హుని మాతామహుల వంశ విశేషాలు .రచయిత్రి దేవకుమారిక జీవిత విశేషాలు ఉన్నాయి .అయిదవ ప్రకరణలో 1716లో వైద్యనాధ దేవాలయ ప్రారంభోత్సవ వైభవం హాజరైన కోటరాజు భీమ ,దుంగార రాజు రామ సింహ ,సమర్ధులైన పురోహితుల చే అత్య౦తనవైభవంగా జరిగిన తీరు ,రాజమాతగా దేవకుమారిక చేసిన మత విధులు మంత్రి హరాజి ,ఆమెచెలి కత్తే ‘’ప్రేమ’’ కుమారుడు’’ ఊదా ‘’అందించిన సహకారం ,దేవాలయ ప్రతిస్టామహోత్సవం .చివరలో రాజమాత నాలుగవసారి జరుపుకున్న తులాదానం చివరలో హరిశ్చంద్ర రాసిన శివ అష్టోత్తరం తో కావ్యం పరిసమాప్తిఅవుతుంది .మిగిలిన విశేషాలు తరువాత తెలుసుకొందాం .
ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-6-19-ఉయ్యూరు
‘’

