నా దారి తీరు -118 కృష్ణా జిల్లా ప్రధానొపాధ్యాయుల సంఘ పునరుద్ధరణ

నా దారి తీరు -118

కృష్ణా జిల్లా ప్రధానొపాధ్యాయుల సంఘ పునరుద్ధరణ

నేను హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ పొందాక ,అంతకుముందు కూడా కృష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘానికి అధ్యక్షులు సో’’మంచి’’ రామం అని అందరి చేతా  ఆప్యాయ౦గ  పిలువబడిన  శ్రీ సోమంచి శ్రీరామ చంద్ర మూర్తిగారు  .కవి ,నాటకరచయిత ప్రయోక్త మంచి కథకులు ముఖ్యంగా బాలసాహిత్యం లో తనదైనముద్ర వేసినవారు.  బందరు లో ఫోర్ట్ రోడ్లో ఉండేవారు .నాకూ శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి వంటి మా అందరికి ఆదర్శం .ఒకరకంగా హెడ్ మాస్టర్ లకు గైడ్ ,ఫిలాసఫర్ .హెడ్ మాస్టర్స్  హాండ్ బుక్ రాసి కొత్తగా ప్రమోట్ అయిన  హెడ్ మాస్టర్లకు  రూల్స్ ,విద్యాలయాల నిర్వహణ వార్షిక తనిఖి అనే ఇన్స్పెక్షన్  పరీక్షల,స్కూల్ ఫీజులనిర్వహణ మొదలైన అంశాలపై గొప్ప అవగాహన కలిపించారు .ఆ పుస్తకం అనేక ముద్రణలు పొందింది .అసలు జిల్లా హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఆయన శ్రీ ఏ వి సుబ్బారావు గారు ఆయన ప్రాతస్మరణీయులు .తర్వాత దాన్ని రాష్ట్ర సంఘంగా తీర్చిదిద్ది జిల్లా సంఘాలకు ప్రాతినిధ్యం కలిపించారు .ఆయన  రిటైరయ్యాక శ్రీరామం  గారు జిల్లా సంఘం నాయకులుగా రాష్ట్ర సంఘం నాయకులుగా ఎంతో కాలం విశిష్ట సేవలు అందించి అందరికి చేరువయ్యారు .జిల్లా విద్యాశాఖాధికారి ప్రతి ఏడాది, జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం  వార్షిక సమావేశం ఏర్పాటు చేయటం ,అందులో ఉత్తమ ఫలితాలు సాధించిన  హైస్కూల్స్ ,ప్రధానోపాధ్యాయులు ,సబ్జెక్ట్ టీచర్స్ ,విద్యార్ధులకు కు సన్మానం చేయటం, తర్వాత వచ్చేఏడాది ఆటలపోటీలకు సబ్ జోన్లు, సెంట్రల్ జోన్ ఏర్పాటు వ్యాయామోపాధ్యాయుల సహకారం తో జరిగేది  .ఇవనీ అయ్యాక జిల్లా ప్రధానోపాధ్యాయుల  సంఘ సమావేశం జరిగేది .అన్నిటిలో క్రియా శీలకపాత్ర పోషించేవారు రామంగారు ,డియివోలకు తలలో నాలుకగామీటింగ్  ఎజెండా తయారు చేయటం అమలు పరచటం లో ఆయన పాత్ర అద్వితీయంగా ఉండేది .

  చివరికి జరిగే సంఘ సమావేశానికి మాత్రం హెడ్ మాస్టర్లు  వ్రేళ్ళమీద  లెక్కించ తగినట్లుగా మిగిలేవారు .నాబోటి వాళ్లకు చాలా బాధగా ఉండేది .కానీ ఏమీ చేయలేము .రామం గారు రిటైరయ్యాక పెనమలూరు హెడ్ మాస్టర్ శ్రీ ప్రసాద్ ,నున్న హెడ్ శ్రీ రమణారావు వగైరా ఆరునెలలు ,ఏడాది పని చేసి తప్పుకోవటం వలన సంఘం కుంటి నడక  నడిచింది .దీన్ని గాడిలో పెట్టాలనే ఆలోచన ఆసక్తికల మాందరికీ వచ్చింది .అయితే ‘’హు బెల్స్ ది కాట్ ?’’అన్నది సమస్య.

   దీనికి తోడు జిల్లా కామన్ ఎక్సామినేషన్ బోర్డ్  పరిస్థితీ బాగాలేదు .చాలాకాలం దీన్ని పెడన జిల్లాపరిషత్ హై స్కూల్ హెడ్  మాస్టర్ , జిల్లాలో చాలా సీనియర్ మోస్ట్ హెచ్ ఏం శ్రీ  వీరమాచనేని విష్ణువర్ధనరావు గారు అత్యంత సమర్ధవంతంగా నిర్వహించారు .అయన ఒకకాలు కుంటి కాని తెల్లని పంచ తెల్లచొక్కా ఖండువాతో వెడల్పు ముఖం దబ్బపండు మై చాయతో చాలా ఆకర్షణీయంగా  హుందాగా ఉండేవారు .ఆయనంటే భయంగా కూడా ఉండేది .అన్ని రకాల పరీక్షలు చాలా పకడ్బందీ గా జరిగేవి .పేపర్లు లీక్ అవటం అనేది లేదు. సమర్ధులైన  హెడ్ మాస్టర్లు , సబ్జెక్ట్ టీచర్ల చేతక్వస్చిన్  పేపర్స్ తయారు చేయి౦ చేవారాయన .కక్కుర్తి లేని పాలనగా ఉండేది .ఆయనతర్వాత ఎవరెవరు మారారో గుర్తు లేదుకాని మేము ప్రమోషన్ పొందేనాటికి బెజవాడ ఎస్ కే పి వి హిందూ హైస్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ నరసింహారావు గారున్నారు .ఆయన చేస్టలగురించి అప్పటికే కధలు గాధలు ప్రచారం లో ఉండేవి .అందులోనూ కామన్  ఎక్సామినేషన్ బోర్డ్ జిల్లా పరిషత్ వాళ్ళ చేతుల్లోంచి జారిపోయి ప్రైవేట్ మేనేజిమెంట్ వారి చేతుల్లోకి వచ్చింది .దీన్ని నియమించేది డియివో .ఆయనను ఏదో రకంగా ప్రసన్నం చేసుకొని పొందే పదవి అయిపొయింది. పరువు పాతాళానికి పోయింది. ఇది మా బోటివారికి నచ్చని విషయం .పైగా క్వార్టర్లీ హాఫియర్లీ యాన్యువల్ పరీక్ష పేపర్లే కాదు ప్రతినెలా జరిగే టెస్ట్ పేపర్లు కూడా లీకై బజారు లో విక్రయాలు జరుగుతున్నట్లు పేపర్లన్నీ కోడై కూశాయి .ఇంతటి అవినీతి అసమర్ధత కామన్ ఎక్సామినేషన్ బోర్డ్ లో  విశ్రుంఖలంగా  విజ్రుమ్భించటం తో జిల్లాపరిషత్ హెడ్ మాస్టర్లు గా సహి౦చ లేకపోయాం .ఏదో చేయాలి ఏదో చేయాలనే తలంపు తీవ్రమైనది .

   ఒకసారి జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ హనుమారెడ్డి గారు పామర్రు జిల్లాపరిషత్ హై స్కూల్ సందర్శించినపుడు అడ్డాడ హెడ్ మాస్టర్ గానేను ఆయనను కలిసి  కామన్ బోర్డ్ తంతూ తమాషా అంతా వివరించి ,ఆపదవిని మెజారిటీ హెడ్ మాస్టర్లు ఉన్న సమర్ధుడైన జిల్లాపరిషత్  హెడ్ మాస్టర్ కు అప్పగించి అవినీతి పంకిలం నుంచి ఆపదవిని ఉద్ధరించాలని చెప్పాను .ఆయన ప్రశాంతంగా నేను చెప్పినదంతా విన్నారు .’’మంచి ఆలోచన  హెడ్ మాస్టారూ  !తప్పకుండా దీన్ని అన్ని కోణాలలోనూ పరిశీలించి తగిన న్యాయమైన నిర్ణయం చేస్తాను ‘’అన్నారు .కొంత ఊరట లభించింది .కాలం కూడా కలిసిరావాలికదా .అప్పుడు పామర్రు హెడ్ మాస్టర్ శ్రీ సుబ్బారెడ్డి గారని గుర్తు

        నాందీబీజం

  ఒకసారి బందరు హిందూ హైస్కూల్లో పదవతరగతి పరీక్షపేపర్ల  స్పాట్ వాల్యుయేషన్ జరుగుతున్నప్పుడు నేను ఇంగ్లీష్ -1పేపరుకు చీఫ్ ఎక్సామినర్ గా ఉన్నాను .నాకు అసిస్టెంట్స్ గా ఉన్నవాళ్ళల్లో పెదముత్తేవి ఓరిఎంటల్ హైస్కూల్ హెడ్మాస్టర్ శ్రీ కోసూరి ఆదినారాయణరావు ఒకరు .రోజూ మాట్లాడుకొనే విషయాలలో హెడ్మాస్టర్ సంఘం గురించి మాటలు వచ్చెవి . అతని సమర్ధత స్పీడ్ చాతుర్యం నిబద్ధర అంకితభావం నన్ను బాగా ఆకర్షించాయి . ఆ సందర్భం లో ఒకరోజు నేను ‘’మీరు సంఘ కార్యదర్శిగా ఉంటె మంచి భవిష్యత్తు ఉంటుంది ,సమర్ధులను అధ్యక్షులుగా  ఎన్నుకొందాం ,వారికే కామన్  ఎక్సామినేషన్ బోర్డ్ కూడా అప్పగిస్తే మరీ బాగుంటుంది ‘’అన్నాను .ఆయన నాతో ‘’మీరే సమర్ధులు మీరు ఉండండి మేమంతా సహకరిస్తాం ‘’అన్నారు .కాసేపు ఇలా ఇద్దరం అనుకొన్నాక ఆయనే నా మాట విని ఉండటానికి ఒప్పుకొన్నారు .కనుక సమర్ధుడు కార్యదర్శి అవుతున్నాడని అందరం హాయిగా ఊపిరి పీల్చా౦  .

    కలిసోచ్చినకాలం

  మళ్ళీ ఒకసారి స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ లో బహుశా సర్కిల్ పేట దగ్గరున్న మిషన్ హైస్కూల్ లో మేమంతా ఈ సెంటర్ లోనే జిల్లా ప్రదానోపాధ్యాయ   సంఘ అధ్యక్ష కార్య దర్శులను  ఎన్నుకోవాలనీ కామన్ యెక్సామినేషన్ బోర్డ్ కూడా జిల్లాపరిషత్ కు సాధించాలని నేనూ ఆదినారాయణ మొదలైన లైక్ మైండెడ్ మిత్రులం నిర్ణయించాం .అనుకోకుండా అప్పుడే కొత్త విద్యాశాఖాధికారిగా శ్రీ నూకల శ్రీరామమూర్తి గారు రావటం మా అదృష్టంగా మారింది .ఆయన లోగడ పరిషత్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా సమర్ధంగా పని చేసిన ఆఫీసర్ .ముక్కు సూటిమనిషి. జిల్లాలో అందరి సంగతీ బాగా తెలిసినవారు .మా రామంగారికి చాలా ఇష్టమైన ఆఫీసర్ కూడా. ఇద్దరి మధ్య గొప్ప అన్యోన్యత ఉండేది .మూర్తిగారు  స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ బాధ్యతలో ఉన్నారు .పటమట హైస్కూల్ ప్రదానోపాధ్యాయిని శ్రీమతి ప్రమీలారాణి,గన్నవరం గరల్స్ హై స్కూల్ హెడ్ మిస్ట్రేస్ గా చాలామంచి  పేరు పొందారు. నిర్దుష్టంగా ఉంటారు .దేనికీ లొంగని వ్యక్తిత్వం .సమర్ధత ఆమె సుగుణం .’’లేడీ లయన్ ‘’.ఆమె కూడా ఈ స్పాట్ లో మాతో ఉండటం ఇంకా కలిసొచ్చింది .ఒకరోజు స్పాట్ లో ఆమెను నేను ఆదినారాయణ మొదలైనవాళ్ళం కలిసి మా ప్రపోజల్ చెప్పాము .ఆమె ముందు వద్దన్నా మా పైఉన్న అభిమానం తో అంగీకరించారు .కామన్ బోర్డ్ కూడా ఆమె తీసుకోవాలని కోరాం. సరే అన్నారు .

   ఈ విషయం వెంటనే లీకైంది . కొడాలి హెడ్మాస్టర్  శ్రీ గోపాలరావు గారు నాదగ్గరకు వచ్చి ‘’ప్రసాద్ గారూ !నరసింహారావు గారిని మార్చి సి.యి .బోర్డ్ వేరెవరికో ఇవ్వాలని  మీరూ కొందరూ అనుకొంటున్నట్లు చెప్పుకొంటున్నారు .ఆయన్ను ఈ ఏడాదికూడా కంటిన్యు చేస్తే బాగుంటుంది  రిటైరైపోతారు .నన్ను మీతోమాట్లాడమని పంపించారు .మీరు చెబితే అందరూ వింటారని కూడా అంటున్నారు ‘’అన్నారు .నేను ‘’గోపాలరావు గారూ !ఇప్పటికే నరసింహారావు గారి అవినీతి కంపుకొట్టి భరించారానిదిగా ఉంది .ఇక ఒక్క క్షణం ఆయన్ను ఆపదవిలో ఉంచటానికి మేమెవ్వరం ఒప్పుకోము .దయచేసి ఆప్రపోజల్ మానేయండి .మాతో సహకరించండి ‘’అని నిర్మొహమాటంగా చెప్పాను .ఆయన మొహం కందగడ్డ అయినా మా ముందు ఆయన బలహీనుడై ఇక మాట్లాడలేక వెళ్ళిపోయారు .కనుక మాకు లైన్ క్లియర్ అయింది .

   సాయంత్రం స్పాట్ పూర్తయ్యాక శ్రీ రామం గారిని పిలిపించి మా ప్రాపోజల్ చెప్పి ఆయన అధ్యక్షతగా మీటింగ్ పెట్టి ప్రమీలారాణిగారిని కృష్ణాజిల్లా ప్రధానోపాధ్యాయ సంఘం అధ్యక్షురాలిగా ,శ్రీ కోసూరి ఆదినారాయణరావు కార్యదర్శిగా నేను ఉపాధ్యక్షుడిగా కొత్త బాడీని ఏర్పాటు చేసుకోన్నాము అందరూ సంతోషించారు .కొందరు ‘’ఆడది ఈ అని సమర్ధంగా చేస్తుందా ?/అని గోనుక్కున్నవాల్లూ ఉన్నారు .తర్వాత డియివోగారిని కలిసి ఈ విషయం చెప్పి ఆయనతో రామంగారు మేమూ కామన్ బోర్డ్ పదవికూడా ప్రమీలారాణిగారికిస్తే మళ్ళీ జిల్లాపరిషత్ చేతిలోకి పదవి వచ్చి మెజార్టీ కి న్యాయం జరుగుతుందని ఈరెండు పదవులు ఒకరి చేతిలోనే ఉంటె ఖర్చుతక్కువ సేవలు బాగా సమర్ధవంతంగా జరుగుతాయి అని చెప్పాము .ఆయనా మా ప్రపోజల్ అంగీకరించి ఆమెకే కామన్ ఎక్సామినేషణన్ బోర్డ్ పదవికూడా ఖాయం చేసి ఎన్నాళ్ళనుంచో ఉన్న మాకోరికి తీర్చారు .ఇలా ‘’టు బర్డ్స్ యట్ వాన్ షాట్ ‘’తో సాధించాము .మా సంఘం అత్యంత శక్తివంతంగా జవజీవాలతో సమర్ధవంతంగా పని చేసింది .మేము రిటైర్ అయినా నా శిష్యురాలు శ్రీమతి కొల్లిభారతీదేవి ని ,తర్వాత కాజ హెడ్మాస్టర్ శ్రీశర్మగారిని  ప్రెసిడెంట్ చేశాం .మా సంఘం విద్యాప్రణాలిక అమలు, పరీక్షపెపర్ల తయారీ, క్వస్చిన్ బాంక్, సోర్స్ బుక్స్ తయారు పబ్లిక్ పరీక్ష పేపర్ల లోని లోపాలు తొలగించటం ,లెక్కలు ,ఫిజిక్స్ ,ఇంగ్లిష్ పుస్తకాలలో కష్టతరమైన విషయాలనుతొలగి౦ప జేయటం   స్కూళ్ళను సమర్ధవంతంగా నడపటం లో సహాయం అందించటం సబ్జెక్ట్ టీచర్లు లేకపోతె ఆదినారాయణ వంటివాళ్ళు వెళ్లి లెక్కలు, ఇంగ్లీష్ బోధించటం లలో  బాగా కృషి చేసి మెప్పుపొందింది మా బాచ్ లో శ్రీ రాజు, శ్రీ ఆ౦జనేయులు, శ్రీ విశ్వం ,శ్రీమతి సుగుణకుమారి శ్రీమతికస్తూరి  శ్రీ రాజేంద్రప్రసాద్ మున్నగు సమర్దులేందరో ఉన్నారు   .ప్రాతిఏదాది సంఘ సమావేశం చాలా మందితో కళకళలాడుతూ జరిగేది .రిటైరయినవారిని ఘనం గా  సత్కరించేవాళ్ళం .అదొక గోల్డెన్ పీరియడ్ .తర్వాత సంఘం మా చేతుల్లోంచి జారిపోయింది .అయినా కనీసం పదిమందిమి తరచూ కలుస్తాము .దీనికితెన్నేరుకు చెందిన శ్రీ దేవినేని మధుసూదనరావుగారు  మాకు ఆత్మీయ సహకారం అంది౦చారు .ఇప్పటికీ  ఇస్తున్నారు .   సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-6-19-ఉయ్యూరు

No

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.