17.12.2020 గోరసం వారు బాలుపై తెచ్చిన 88మందికవుల కవితల నీరాజనం జూమ్ ద్వారా సాతంత్రం 6గంటలకు ఆవిష్కరణ జరిగింది

 

 

“గోదావరి రచయితల సంఘం(గోరసం)”చే ఈరోజు అనగా 17 డిసంబర్ 2020 నాడు జూమ్ వేదికగా ప్రముఖ గాయకుడు కీ.శే. శ్రీ ఎస్.పి.బాలు గారికి కవితార్చన సంకలనాన్ని ఈరోజు గోరసం సంస్థ ఆవిష్కరణ చేసింది. దీనిలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ జానపద అకాడమీ పూర్వాధ్యక్షులు శ్రీ పొట్లూరి హరికృష్ణ గారు, ప్రముఖ మాటల పాటల రచయిత శ్రీ వెన్నెలకంటి గారు, ప్రముఖ కవి విమర్శకులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు, ఆంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ చలపాక ప్రకాష్ గారు, గురువులు సరసభారతి సాహిత్య సేవాసంస్థ ఉయ్యూరుకు చెందిన శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారు, తెలంగాణా సాహిత్య కళాపీఠం అధ్యక్షురాలు శ్రీమతి దాసరి శాంతాకుమారి గారు, అక్షరకౌముది సాహిత్య సాంస్కృతిక అధ్యక్షులు శ్రీ తులసి వెంకటరమణాచార్యులు గారు, తెలుగు భాషాచైతన్య సమితి అధ్యక్షులు శ్రీ బడేసాబ్ గారు, తెలుగుభారతి అధ్యక్షులు శ్రీ పక్కిరవి శేఖర సత్యనారాయణమూర్తి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమములో గంధ్ర సమీక్షను ప్రముఖ బాలసాహిత్య రచయిత్రి-విభిన్న ప్రక్రియల రచయిత్రి అయిన శ్రీమతి గుడిపూడి రాధికారాణి గారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోరసం అధ్యక్షులు శ్రీ శిష్టు సత్య రాజేష్ గారు అధ్యక్షత వహించారు. గోరసం కార్యవర్గం పాల్గొన్నారు. 

 

శిష్టు సత్య రాజేష్

.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.