నామ సంకీర్తనావతార పురుషుడు కుందుర్తి వేంకట నరసదాసు గారు -8
నామ ప్రచారం
అ కాలంలో శ్రీ అవదూతేంద్ర సరస్వతి గారు నామ ప్రచారం లో దూసుకు పోతున్నారు .పగోజి అత్తిలి లో పుట్టి న వీరికి తలిదండ్రులు పెట్టినపేరు విశ్వేశ్వరావు .వీరి 12వ ఏట మహాభక్తులైన తండ్రి మరణించారు .రావు గారు నాటకాలాడి పేరు ప్రఖ్యాతులు పొందారు .తల్లి కూడా చనిపోయాక వైరాగ్యం పెరిగి ,బ్రహ్మ చర్యం పాటిస్తూ ప్రయాగ వెళ్లి ,బ్రహ్మ చారి ఆశ్రమం లో సాధన చేసి అయోధ్య చేరి ,మంత్రం దీక్ష పొంది ‘’షియా రఘువర దాస్’’అనే దీక్షానామ ధారియై హిందుస్తానీ సంగీతం నేర్చి ,ఆగాన౦లో నామాన్ని లీనం చేశారు .ఆ నామ గానా మృతం తో జనాలను పరవశ పరచారు .ఆంద్ర దేశం చేరి చాందస భావాలను పారద్రోలటానికి నామాన్ని ప్రయోగించి మనసులను గెలుచుకొన్నారు .
శ్రీ రఘువర దాసుగారు మన నరసదాసు అంటే శ్రీరామ శరణ గారికి బాగా సన్నిహితులయ్యారు .శరీరాలు వేరే కాని ఆత్మ ఒక్కటే .ఇద్దరివీ రామాయత్త చిత్తాలే.ఆయన గానం యెంత మాధుర్యమో ఈయన ప్రవచనం అంతటి మాధుర్యాన్ని కలిగి ఉండేది .ఆధునికకాలం లో రామనామ ప్రచారం లో వీరిద్దరూ అద్వితేయులై నిలిచారు
తులసే రామాయణ ప్రవచనం
శ్రీ రామ శరణ గారు ఉత్తర దేశం లో ఉండి అక్కడ అందర్నీ ప్రభావితం చేసే తులసీ దాసు రాసిన రామ చరిత మానసం ను పూర్తిగా తెలుసుకొన్నారు ..అందులోని విశేషాలు అనేకార్ధాలను చక్కగా విశదీకరించి చెప్పేవారు .ఉన్నత భావ వ్యాప్తియే వారి ముఖ్యోద్దేశం ..బాపట్ల ఆంజనేయ దేవాలయం లో భానువార సంకీర్తనలో పాల్గొనటానికి రాగా సభ్యులు రామనామ ప్రాశస్త్యాన్ని గురించి చెప్పమని కోరారు . వెంటనే తులసీ రామాయణం లోని ‘’వందవు నామ రామ రఘువరకో , హేతు కృశాను భాను హిమకరకో –విధి హరే హరమయ వేద ప్రాణసో,అగుణ అమాపమ గుణ నిదానసా ‘’అనే చౌపాయి ని ఒక గంట సేపు ఉపన్యాసంగా చెప్పారు . ఆ సంఘ సభ్యురాలు శ్రీమతి వల్లూరి రాజమ్మగారు ‘’స్వామీ !మీద్వారా మాకు తులసీ రామాయణం ఆసాంతం తెలుసుకోవాలని కోరిక గా ఉంది ‘’అనగా సరే అన్నారు దాసుగారు .
ఆమె ఒక వారం లోపే ముహూర్తం పెట్టి ఆహ్వానించారు .అప్పటికి దాసు గారు తులసీ రామాయణం లో రెండు మూడు ఘట్టాలు తప్ప చదివి ఉండలేదు .ఎలా చెప్పాలో అంతుపట్టక రెండు రోజులు సంస్కృత శ్లోకాలతో కాలక్షేపం చేశారు .మూడవ రోజు మందిరం లో కూర్చుని శ్రీరామునితో ‘’రామా !ఏదో మొహమాటానికి తులసీ రామాయణ ప్రవచనానికి ఒప్పుకొన్నాను .నాకు ఆభాష కొత్త.నువ్వు తులసీ దాసు హృదయాన్నుంచి పలికించావు .ఇప్పుడు మీరిద్దరూ నా హృదయం లో ఉండి పలికించాలి ‘’అనగా రాముడు నవ్వి నట్లు కనిపించగా ,ఆ ధైర్యం తో అవధి భాషలోని తులసీ రామాయణ ప్రవచనం మొదలు పెట్టారు .కొన్ని ఘట్టాలు తాను ఎలా పలికారో ఆయనకే తెలీదు .ఆ ఉపాధి ద్వారా ఎన్నెన్నో విషయాలు జనరంజకం గా ప్రవచనం చేశారు .శ్రీరమ చంద్ర మూర్తి స్వయంగా తనద్వారా పలికి౦చాడని దాసుగారి పూర్తీ విశ్వాసం .
కథా సంకీర్తనం
పట్టు వస్త్రాలుకట్టి చేతిలో చిడతలు ధరించి ఆర్తిగా రామా రామా అంటూ చిందులేస్తూ ,నామనామ గానం మధురాతిమధురం చేస్తూ చూపరులకు పరవశం కలిగించేవారు శ్రీ రామ శరణ .తానూ తన్మయులై భక్తులను తన్మయత్వం లో ముంచి తేల్చేవారు .ఎవ్వరికీ ఇహ లోక స్పృహ ఉండేదికాదు .భక్తి మహా సముద్రంలో మునిగి తేలేవారు అందరూ .
ఉపన్యాసం
శ్రీ రామ శరణ గారు ఉపన్యసిస్తుంటే మాటలు తేనెల ఊటలు గా జాలు వారేవి వేదం శాస్త్ర పురాణ ఉపనిషత్తులనుండి ఎన్నో ఉదాహాహరణలు దొర్లి ,ప్రేక్షకహృదయాలు ఆన౦దరస ప్లావితమయ్యేవి .భగవన్నామముతో ప్రారంభించి అందరి చేతా చేయిస్తూ ఆపైన ఉపన్యాసం ప్రారంభించి గొప్ప నేపధ్యాన్ని కలిగించేవారు .కంతేరు గ్రామం లో వారు చెప్పిన ఉపన్యాసం చిర స్మరణీయం .సంకీర్తన విగ్రహారాధన ఇష్టం లేని ఆగ్రామ ప్రజలు అత్యంత ఆశ్చర్యం తో విని ,ముగ్ధులై అనుమానాలన్నీ పటాపంచలు చేసుకొని భక్తివాహినిలో కలిసిపోయారు .దురా చారులు వీరి ఉపన్యాసంతో సదా చారులయ్యారు .చాలామంది నాస్తికులు ఆస్తికులయ్యారు ఇదంతా దాసుగారి ప్రభావమే .
కృష్ణా జిల్లా దివి తాలూకా వేక నూరు గ్రామం లో నామ సప్తాహం జరుపుతుంటే కొందరు పాషండులు రామనామం తో ముక్తి రాదనీ వాదిస్తే ‘’రామేతి వర్ణద్వాయ మాదరే ణ సదా స్మరన్ ముక్తి సముపైతి ,జంతుః’’,’’రామయను రెండక్షరములు నాదరముతో సదాస్మరించిన ముక్తి పొందును ‘’అనీ , ‘’రామనామ సముత్పన్నఃప్రణవో మోక్షదాయకః ‘’7కోట్ల మహా మంత్రాలలో రామనామమే గొప్పదని ,అనేక ఉదాహరణలతో ప్రసంగం చేసి సంకీర్తన ప్రారంభించగా భక్తులు పరవశంతో ఉర్రూత లూగి పోయారు .గ్రామప్రజలు పశ్చాత్తాపం ప్రకటించి మన్నించమని కోరారు .రామ శరణ గారి ఉపన్యాస మహిమ గానగరిమ అంత గొప్పవి .ఆంద్ర దేశం లోని వార్షికోత్సవాలలో తప్పక వారి ప్రసంగం ఉండి తీరాల్సిందే .లాక్షణిక ,తార్కిక ,వైయాకరణ సభలలో కూడా వారి ప్రసంగం హై లైట్ గా ఉండేది .
పగోజి ఆకుల ఇల్లిందపల్లి లో సప్త సప్తాహాలు దాసుగారి ఆధ్వర్యం లో జరిగాయి .తులసీ రామాయణ ఉపన్యాసం నామ సంకీర్తన ధార్మిక ప్రసంగాలతో ఆ సప్తాహాలు గొప్ప విజయం సాధించాయి అక్కడ నారాయణ స్వామి అనే భక్తునికి దాసుగారు ‘’హరేరాం ‘’దీక్షనిచ్చారు .ఆయన హరేరాం బాబా గా ప్రసిద్ధి చెందారు .ఈబాబా గారి ఆధ్వర్యం లో కవిటిం అనే ఊర్లో 100 రోజులు అఖండ హరేరామ సంకీర్తన జరిగింది .కాకుల ఇల్లిందపల్లి లో ద్వాదశ వార్షిక హరి రామ నామ సంకీర్తన జరిగింది .
రామకోటి మన శ్రీ రామ శరణ గారికి చాలా ఇష్టం ..2కోట్ల రామ నామం రాసిన పుణ్యాత్ములాయన .రామకోటి ప్రభావాన్ని చెప్పి ఎందరితోనో రాయించారు .1946నుంచి రామనామంతో ఏరిన బియ్యాన్నే వండుకొని తింటున్నారు .గ్రామస్తులతో కూడా అలాగే చేయిస్తూ మరోరకమైన రామనామ ప్రచారం సాగించారు .రామనామ బియ్యపు అన్నమే తాను తినటానికి కారణాన్ని వివరిస్తూ ‘’నేను కంటితో రాముని ,రామభక్తులి రామనామాన్నీ,ప్రపంచాన్నీ సీతారామ మయంగా చూస్తున్నాను .చెవులతో రామ చరిత వింటాను .నోటితో రామనామమే పలుకుతాను ,దాన్ని గురించే మాట్లాడతాను .ముక్కు శ్వాస మీద రామనామ జపం చేస్తాను .చేతులతో రామనామం రామకధలు రాస్తూ ఉంటాను.కాళ్ళతో రామభక్తుల దగ్గరకు, రామాలయాలకు వెడతాను .మనసులో రామ రూప ధ్యానమే చేస్తాను .ఇక మిగిలిన ఈ పంచ భౌతిక శరీరాన్ని అంటే అన్నమయ కోశాన్ని రామ నామం తో ఏరిన బియ్యాన్నే అన్నంగా వండి రాముడికి నైవేద్యం పెట్టి తింటాను .అప్పుడు నేను ఈ పాంచ భౌతిక శరీరం తో సహా శ్రీరముడినే అవుతాను .నేను రామ సాగరం లో ,రామనామం తో పుడతాను .రామనామం తో పెరుగుతాను రామనామం తో చనిపోతాను ‘’అదీ నరసదాస శ్రీరామ శరణ గారి అనన్య భక్తీ .ఇలాంటి వారిని మనం చూసి ఉండం.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-6-21-ఉయ్యూరు
వీక్షకులు
- 1,107,475 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

