త్రిభాషా కోవిదుడైన స్వాతంత్ర్య సమరయోధులు ,భారత రాజ్యంగచరిత్ర కర్త,శాసన సభ్యులు –శ్రీ ఆత్మకూరి గోవిందా చార్యులు

త్రిభాషా కోవిదుడైన స్వాతంత్ర్య సమరయోధులు ,భారత రాజ్యంగచరిత్ర కర్త,శాసన సభ్యులు –శ్రీ ఆత్మకూరి గోవిందా చార్యులు

ఆత్మకూరి గోవిందాచార్యులు (1895-1973) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు, ఆంగ్లం, సంస్కృత భాషల కోవిదుడు, పలు గ్రంథకర్త, పత్రికాధిపతి, సంపాదకుడు, శాసన సభ్యుడు.

బాల్యం, విద్యాభ్యాసం
ఆత్మకూర గోవిందాచార్యులు 1895లో పశ్చిమగోదావరి జిల్లాలోని అగ్రహారగోపవరం గ్రామంలో పుట్టారు. సంపన్నులైన వైష్ణవ బ్రాహ్మణుల కుటుంబంలో, వేంకట కృష్ణమాచార్యులు, సుభద్ర దంపతులకు కుమారునిగా జన్మించారు. ఆయన తెలుగు, ఆంగ్లం, సంస్కృతం అభ్యసించారు. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి శిక్షణ కోర్సును చదవడం ప్రారంభించారు.

స్వాతంత్ర సమరంలోకి
ప్రభుత్వోపాధ్యాయ కోర్సు చదవడం ప్రారంభించిన ఆత్మకూరి గోవిందాచార్యులు 1920 అక్టోబర్ 13న గాంధీజీ ఇచ్చిన పిలుపును అందుకుని విద్యాభ్యాసం వదలిపెట్టారు. 1920లో కలకత్తా, నాగపూర్ లలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలకు హాజరై పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల తరఫున గాంధీ సహాయ నిరాకరణను సమర్థిస్తూ మాట్లాడారు. 1921లో ఏలూరులో గాంధీ ప్రబోధించిన జాతీయ విద్యాలయం స్థాపించినవారిలో ఆయన ఆత్మకూరి కూడా ఉన్నారు.

పత్రికా సంపాదకునిగా
వీరు ఏలూరు నుండి 1924లో సత్యాగ్రాహి అనే పేరుతో ఒక రాజకీయ వారపత్రికను స్థాపించి దానికి సంపాదకులుగా ఉన్నారు[1].

రచనలు
· గోవింద రామాయణము[2]

· మహాత్మా గాంధీ చరిత్ర

· భారతదేశ ఆర్థికచరిత్ర

· భారతీయ రాజ్యాంగ చరిత్ర

· పాహిమాం శతకము

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-9-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.