పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-3

పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-3

కలికాల్, కల్లోల్ ,లతోపాటు ఉపాసనా ,దూప్ ఛాయా మొదలైన పత్రికలూ తారాశంకర్ ను కధలు రాసిపంపమని కోరితే రాసిపంపితే ప్రచురించాయి .జమీందార్ల దోపిడీ ,కాబూలీవాళ్ళ దౌష్ట్యం ,మలేరియా మసూచి పట్ల ప్రభుత్వ ఉదాసీనత లతో నలిగిపోయిన ఒక గ్రామ చరిత్రను ‘’ శ్మశా నేర్ పధే’’-శ్మశానానికి  దారి కధగా రాశాడు .ఇదీ చైతాలీ ఘూర్ణి నవలకు బీజమైంది .కలకత్తా వెళ్లి వస్తున్నా అక్కడి జనజీవితపు లోతుపాతులు తెలియవు .ఆయన స్వభావంగా అవేశపూరితుడు .సున్నితఃరహృదయుడుశాంత చిత్తుడు .కలికాలం ఎడిటర్ మురళీ ధర బసు ఆయన్ను బాగా ఆకర్షించాడు .తర్వాత ప్రసిద్ధ రచయితలతో పరిచయం సాధించాడు .ఉపాసన సంపాదకుడు సావిత్రీ ప్రసన్న చటర్జీ చైతాలీ ఘూర్ణి ప్రచురణకు తోడ్పడ్డాడు .

  1929నుండిఅలజడి  ఆందోళన అశాంతి ఇండియాలో ఎక్కువయ్యాయి.మీరట్ కుట్ర తోఏర్పడిన అశాంతికి  గాంధీ సహాయనిరాకరణంద్వారాశాంతికి దారి చూపాడు దండియాత్ర చేశాడు ఆసేతు హిమాచలం గాంధీ బాట లో నడిచింది .మేనెలలో గాంధీని అరెస్ట్ చేసి కాంగ్రెస్ ను నిషేధ సంస్థగా ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం 10నెలల కాలం లో 90వేల సత్యాగ్రహుల్ని అరెస్ట్ చేసింది .పోలీస్ కాల్పుల్లో ఇద్దరు రాజకీయ నిర్బంధితులు మరణిస్తే ,కలకత్తాలో బ్రహ్మాండమైన నిరసన సభజరిగి  టాగూర్ అందులో ప్రసంగించాడు .1930లో తారాశంకర్ కూడా జైలుకు వెళ్ళాడు జైలు లోనే పాషాణ పూరి , ఘూర్ణి నవలలు రాశాడు  , డిసెంబర్లో విడుదలయ్యాడు .

 విడుదలకాగానే సుభాష్ చంద్ర బోస్ ను కలుసుకొన్నాడు బంద్యోపాధ్యాయ .బోస్ కు సేన్ గుప్తాకు మధ్య విభేదాలువస్తే పరి శీలించ టానికినిఆనె కలకత్తావస్తే ,బీర్భం నుండి మనవాడిని సాక్షిగా ఆహ్వానించారు .ఈయన నిర్మొహమైన మాటలకు బోసు సంతోషించాడు .సుభాష్ వ్యక్తిత్వం ఈయన్ను ఆకర్షించింది .చైతాలి ఘూర్ణి నవల బోసుబాబుకే అంకితమిచ్చాడు .ఇంటికి వచ్చి స్త్రీలనగలు అమ్మి అచ్చు యంత్రం కొని ఇంట్లో ఒక గదిలో పెట్టాడు .తారా రచనలను ఉపాసన అభ్యుదయపత్రికలు ప్రచురించేవి .

  బెంగాళ జానపద నృత్యాలను పునరుద్ధరి౦చాలనిఒక జిల్లా ఆఫీసర్ గ్రామాలనుండి ప్రాచీన కళాఖండాలను బలవంతంగా దౌర్జన్యంగాసేకరిస్తుంటే ,అది జాతీయోద్యమాన్ని పక్కదారి పట్టించే ఎత్తుఅని కొందరు భావించారు .కోపం తో ఒక రాజకీయకార్యకర్త బాగా ప్రచారంలో ఉన్న ఒక జానపద గీతానికి పేరడీ రాసి ,ఈయన ముద్రణాలయం ఎవరు లేని సమయంలో ముద్రించాడు .అధికారికి తనగురించే అది అని తెలిసి అరెస్ట్ చేయించాడు .తారాశంకర్ కూడా  గురయ్యాడు తప్పు లేకపోయినా .కుటిలకారణాలతో అరెస్ట్ ప్రయత్నం చేశారు .భోల్ పూర్ స్టేషన్ లో బోసును ఈయన రెండో సారికలియగా హామీపత్రం ఏదీ రాసివ్వద్దు,లొంగిపోవద్దు  అని హితవు చెప్పాడు  .ఈలోగా అచ్చు యంత్రం విప్పదీసి విడివిడిగా ఎడ్లబండీమీద లాభ పూర్ తీసుకు వెళ్ళాడు .

  అశా౦తమనస్సుతో మళ్ళీ జిల్లా పర్యటన చేశాడు. ఒక చిన్న పిల్ల చావు కు సంబంధించిన కధ రాస్తుండగా ఆరేళ్ళ ఆయన కూతురు’’ బులు’’ చనిపోయింది .అత్య౦త విషాదంతోకలకత్తా చేరాడు .ఉపాసన పత్రిక మూసేస్తూ చటర్జీ ఆపత్రికలో ప్రచురించిన రచనలకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చాడు .మనసుబాగోక స్వగ్రామం వెళ్ళినా లాభం లేక శాంతినికేతన్ వెళ్లి టాగూర్ గ్రామాభి వృద్ధి గురించి చర్చించాడు .భార్యబందువులు ఈయన్ను బొగ్గు వ్యాపార ముగ్గు లో దింపే ప్రయత్నం చేస్తే ఈయన ఒప్పుకోలేదు .ఆయన్ను అక్కడ అర్ధం చేసుకొన్న వారు అతితక్కువే .ఆవూళ్ళో ఒకయన ఇంగ్లాండ్ వెళ్లి వచ్చినవాడికి తనకూతుర్నిచ్చిపెళ్లిచేస్తే ,ఊళ్ళో వారు ఒప్పుకోకపోతే ఈయన ఒక్కడూ ఆయన్ని సమర్ధించాడు .

  గురుడు మళ్ళీ కలకత్తా చేరగా ,పసిపిల్లాడి మరణం పై కధ’’శ్మశాన్ ఘాట్ ‘’ సజనీ కాంత్ దాస్ కు  నచ్చి వగాశ్రీ మొదటి సంచికలోనే వేశాడు .ప్రముఖ చిత్రకారుడు జైమిని రాయ్ సలహాపై కలకత్తాలోనే ఉండిపోవాలనుకొని ఉన్నాడు .అక్కడ ఉండాలంటే కనీసం నెలకు పాతిక రూపాయలు కావాలి  .మిణకలేక తిరిగి స్వగ్రామం చేరాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-9-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged , . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.