పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-5

పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-5

తారాశంకర్ కథలతోనే సాహిత్యం లో అడుగుపెట్టి అసంఖ్యాకం గా కథలురాశాడు .వాటిని కేటగరైజ్ చేయటం కష్టం.ముఖ్యమైన వాట్ని గురించి తెలుసుకొందాం .జల్సాఘర్ ,రాయ్ బారి ,సారే సత్ గండర్ జమీందార్ –చిన్న జమీందార్ లుఆనాటి జమీందార్ల జీవన విధానాన్ని వివిధ కోణాలలో ప్రతిబింబించేవి .విలాసాలు కామ వా౦చలకు   అలవాటైన రోజే ఒక జమీందార్  మందిరంలోనే భార్యకుమారుడు చనిపోగా నిరాశతో  వెళ్ళిపోదామనుకొని ఒక్క సారి మందిరం వైపు చూస్తె లోపలి దీపాలుఆహ్వానం పలికినట్లనిపించి మళ్ళీ లోపలి వెడతాడు .రాయ్ వంశీయుల పాత్ర చిత్రణ అద్భుతం .మరోజమీందర్ రైతులకు విపరీతపన్నులు  వేసి పీడిస్తే ఎదురుతిరిగి కట్టకపోతే మేనల్లుని బతిమాలి కాశీకి  వెళ్ళిపొతాడుఅవమాన౦ భరించలేక .అనురాగ మాధుర్యం తెలిసినవారే జీవించటానికి అర్హులు అని చెప్పే కథ’’బేదిని’’ గొప్పకథ .పడవనడిపే వ్యక్తీ ప్రవృత్తిని గొప్పగాచిత్రించాడు మరోకథలో .వరద భీభత్సంలో అతడు ,భార్యా కొట్టుకుపోతుంటే వాడికి బతకాలనే కోరికకల్గి భార్యను చంపేసి ఈదుకొంటు ఒడ్డుకు చేరాడు .తెచ్చిపెట్టుకున్న గుణాలు కోల్పోయాక మనిషి ఎలాప్రవర్తిస్తాడో వివరించాడు ఇందులో ..చలనామోయి అంటేఅంతు చిక్కనిమనిషి లో మనిషి ఆధునికమానవుడిగా ఆదిమ మానవుడిగా ఎలాప్రవర్తించ వచ్చో చూపాడు .

  శంకర్ సంభాషణా చాతుర్యానికి ,రసవత్తరచిత్రీకరణకు అద్దంపట్టేది ‘’అగ్రదాని ‘’-తద్దినం బ్రాహ్మణులు కథ .మనుషులకు పశువులకు మధ్య ఉన్న సంబంధాన్ని ముఖ్యంగా పాములతో అనుబంధాన్ని గురించి ముచ్చటైన’’పడతి-పాము’’కథ, నాగకన్యనవల  రాశాడు .హృదయాన్నికరిగించే ఎద్దు కథా రాశాడు .ఆయనకథలన్నీ భూమికిసంబంధించినవే .ఇలాంటికథలు దేశంలో ఎక్కడైనా జరగవచ్చు .చక్కగా పంట పండించి పౌష్యలక్ష్మిని చూసుకొని గర్వం ఆనందంపొంది ,వయసు పైబడి దుర్బలుడైనా ,అమానుష శక్తి తోపంటకోసి ధాన్యం బస్తాలు బండీకి ఎక్కించి ,ఒక ఎద్దు కాడి ఎత్తలేకపోతె,తానే కాడికాసి ,పట్టుతప్పి బండీకి౦దపడి ప్రాణాలు కోల్పోతూ చేతిలోకి ధాన్యంగింజల్ని చేతిలో తీసుకొని ,తన బంగారుపొలాన్ని ఆఖరి సారి చూస్తూ తుది శ్వాస వదిలే కథ గుండెల్ని పిండేస్తుంది .ఇల్లు కట్టే మేస్త్రీకి కూడా కొన్ని విలువలు ఉంటాయని ఇదూరత్ లో చూపించాడు .పల్లెప్రాంత పాత్రలు ప్రశ్నలు వేయవు ,ప్రతి ఘటి౦చవుకూడా .కానీ అరుదైన మానవతా లక్షణాలు వారిలో ఉంటాయి అని చెప్పేదే పోస్ట్ రన్నర్ దీను గురించిన కథ.

  వంగ కథానికా రచయితలు ఎన్నెన్నో ప్రయోగాలు చేశారు .కానీ తారాశంకర్ కథలలో నాటకీయత తగ్గటం క్లిష్టత  కావాలని చెక్కే నగిషీ ఉండవు.అయినా ఉత్తమకథానిక రచయితగా పేరు పొందాడు .ఆయనకు జీవితం ఇంద్రధనుసులాగా బహు వర్ణ శోభిత౦గా కన్పించటం ,ఆయన్ను పరవశి౦ప జేయటం ,తాదాత్మ్యం పొందటం మనల్నికూడా ఆనుభూతులకు లోను చెయ్యటం  వలన ఆకథలు ఉత్తమోత్తమంగా గుర్తింపు పొంది సర్వోత్క్రుష్టకథా రచయితగా భాసించాడు తారాశంకర్ బంద్యోపాధ్యాయ్ .నిర్జీవ మానవ మేధస్సు ఆయనకు పనికి రాదు .ఆయనకు నచ్చింది ఎప్పుడూ సగటు మనిషిమాత్రమే .పరిణతశిల్పం లేకపోయినా,బలీయమైన నాటకీయత ,స్వచమైన నిజాయితీ కన్పిస్తాయి .సూటిగా పఠితల హృదయాలలోకి చొచ్చుకుపోతాడు తారాశంకర్ .ఆయనకథలలో సగటు మనిషి తన నిజమైన ప్రతి బింబాన్ని చూసుకో గలడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-9-22-ఉయ్యూరు     

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.