హాస్యానందం
33-సరసోక్తి –
మనం కోతుల్లోంచి వచ్చాం అనేది మృదువైన సరసోక్తి ప్రియురాలి చెంప దెబ్బఅంత మధురం .’నేను మా అబ్బాయికి మనం కోతుల్నించి పుట్టాం ‘’అని చెప్పా. వాడు వాళ్ళమ్మకు ఈవిషయం చెప్పాడు .ఆవిడ పరిగెత్తుకొచ్చి ‘’ఏమో నాయనా మా తండ్రీ తాతాఅందరూ ఒక మోస్తరు మనుషులని తెల్సు .మీ నాన్న తలి దండ్రుల సంగతి మాత్రం నాకు తెలీదు ‘’అంది మాస్టారి నవ్వుముఖం బల్బు మాడి పోయింది.మరో సరసం .ఒకాయన భార్య వాగుడుకాయ .రాత్రీ పగలు జలపాతం లా హోరు పెడుతుంటే ,ఆయన నిద్రలేక అఘోరిస్తుంటే ఆమె డాక్టర్ ను చూడమంది .వెళ్లి మందు తెచ్ఛి ఆమెకిచ్చి రోజూ రెండు వేసుకొని పడుకుంటే హాయిగా నిద్ర వస్తుంది అన్నాడు .రెండెం కర్మ మూడేసుకోండి అంది ‘’అవి నాక్కాదు నీకు ‘’అనగానే అవాక్కైంది .అసలు విషయానికి సరసంగా సుకుమారంగా ప్రియం గా భర్త ఆమెకు విషయం చెప్పాడన్న మాట అన్నారు మునిమాణిక్యం.మూడో ఉదాహరణ .ఒకాయన డాక్టర్ తో తాను ముసలితనం లోకూడా ఆరోగ్యంగా ఉండటానికి కారణ౦ శాంతి సౌఖ్యాలతో ఆనంద జీవితం గడపటమే ‘’అన్నాడు .’’అంటే మీ ఇంట్లో పోట్లాటలు గట్రా ఉండవా ?అన్నాడు డౌట్ గా డాట్రు .’’లేకేమి మేమిద్దరం ఒక రాజీ కొచ్చాం .ఆవిడకు కోపం వస్తే నేను మాట్లాడకూడదు .నాకు కోపం వస్తే నేను ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళాలి ‘’అన్నాడు పగలబడి నవ్వాడా డాక్టర్ .
ఛలోక్తి
నడిమింటి మంగళేశ్వర శాస్త్రి గారి ఛలోక్తి ఒకటి ఉంది .పూరీ జగన్నాధం లో మర్రాకుల విస్తరిలో ఎవరూ భోజనం చచెయ్యరు .నిషిద్ధం .అక్కడి పండితుల్ని ఈయన అడిగితె ‘’వటపత్రశాయి పడుకొనే పత్రాలలో భోజనం నిషిద్ధం .ఇది స్వామి వారి అవతార క్షేత్రం ‘’అన్నాడు .శాస్త్రిగారు నవ్వి ‘’ఇలాంటి మహా క్షేత్రంలో స్వామి వారి అవతార మూర్తుల్నే తినేమీకు ఆయన శయనించే పత్రం నిషిద్ధమా ?అన్నారు .స్వామి మత్స్యావతారం ఎత్తాడు గా .ఆరూపం లో ఉన్న చేపలు తి౦ టారుగా మీరు అని ఎద్దేవా .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-9-22-ఉయ్యూరు
వీక్షకులు
- 1,107,406 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
- శ్రీ ఆర్. ఎస్.సుదర్శనం గారినూరు సమీక్షలు.1 వ భాగం.20.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త0.2 వ చివరి భాగం.20.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,545)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

