జ్యోతిర్మఠపీఠాధిపతి-స్వామి బ్రహ్మానంద సరస్వతి

జ్యోతిర్మఠపీఠాధిపతి-స్వామి బ్రహ్మానంద సరస్వతి

20-12-18 6 8 న జన్మించిన రాజారావు  సన్యాసి అయి 15 0ఏళ్ళు ఖాళీగా ఉన్న ఉత్తర భారత దేశంలోని బదరీ క్షేత్రానికి దగ్గరలో ఉన్న జ్యోతిర్మఠఉత్తర ఆమ్నాయ పీఠాధి అవటం వింతయైన కధ.

అయోధ్య దగ్గర  గణ గ్రామంలో ‘’మిశ్ర ‘’అనే బ్రాహ్మణ కుటుంబం లో రాజా రావు పేరుతో జన్మించి  ,ఆధ్యాత్మిక భావ లహరిలో మునిగి తేలుతూమహా యోగి రాజు అని పించుకొని , మన ఆది శంకరాచార్యులవలె 9 వ ఏట తగిన గురువును అన్వేషిస్తూ ఇల్లు వదిలి పెట్టి వెళ్ళాడు .కాని ఒక పోలీసు గుర్తుపట్టి ఇంటికి తీసుకు వచ్చి అప్పగించాడు  .తనకు  గృహస్తాశ్రమం లో ఇష్టం లేదని  సన్యసించాలని ఉందని చెప్పాడు .పెళ్లి చేసుకోమంటే వద్దన్నాడ్డు .ఇంటి పురోహితుని అడిగారు ఆయన కుర్రాడి యోగ జ్ఞానానికి అబ్బుర పడి అతని ఇష్టం ప్రకారమే చేయమని సలహా ఇచ్చాడు తలిదంద్రులకూ కొడుకు రాజారాం ఆధ్యాత్మిక బలం అర్ధమై సరేనన్నారు .  రెండు రోజులతర్వాత ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి తపస్సుకోసం హిమాలయాలకు వెళ్ళాడు .  .సరైన గురువుకోసం  అణ్వేషిస్తూ ఎందరినో చూసి వారెవ్వరూ తన ఆధ్యాత్మిక దాహం తీర్చే సమర్దులుకారని నిర్ణయించుకున్నాడు .హరిద్వార్ రుశీ కేష్ లకు వెళ్ళాడు .14 వ ఏట ఉత్తర కాశిలో స్వామి కృష్ణానంద సరస్వతిని దర్శించి ఆయనే తాగిన గురువని  శిష్యుడయ్యాడు .ఆయన ‘’బ్రహ్మ చైతన్య బ్రహ్మ చారి ‘’అనే పేరుపెట్టాడు రాజా రామ్ కు . గురువు చెప్పినట్లు సాధన చేస్తూ ప్రక్కనే ఉన్న గుహలో తపస్సు చేసి వారానికి ఒక్క సారిమాత్రమే గురు దర్శనం చేసేవాడు .25 వ ఏట గుహ నుండి బయటికి వచ్చి గురువుగారి ఆశ్రమం లో ఉండి పోయాడు .34 వ ఏట కుంభ మేళ సమయం లో  గురువు శిష్యునికి సన్యాస దీక్షనిచ్చి స్వామి బ్రహ్మానంద సరస్వతి అనే  దీక్షా నామం ఇచ్చాడు .ఇక్కడి నుంచి మధ్య భారతం చేరి ఒక గుహలో ఏకాంతం గా తపోధ్యానాలతో 40 ఏళ్ళు ఉన్నాడు .

 7 0 వ ఏట  .అనేక విద్యావంతులు బ్రహ్మానంద ను అప్పటికి 150 సంవత్సరాలుగా తగిన పీఠాధిపతి దొరకకక ఖాళీగా ఉన్న జ్యోతిర్మఠ పీఠాదిపత్యం వహించటానికి ఆయనే సర్వ సమర్ధుడు అని అందరూ అనేకసార్లు కోరగా సరే నని ‘’మీరు అరణ్యం లో స్వేచ్చగా తిరిగే సింహాన్ని బంధిస్తున్నారు .మీ రందరి ఇష్టం ప్రకారంమీ మాటలను గౌరవించి  పీఠాదిపత్యాన్ని స్వీకరించి ఆది శంకరా చార్యుల అడుగు జాడలలో నడుస్తాను ‘’అన్నాడు దీనికి ముఖ్య ప్రేరకుడు కరపత్ర స్వామి . నియమించే ‘’ధర్మ మహా మండలి ‘ ఎంతో సంతోషంగా ఆహ్వానించింది /19 41 ఏప్రిల్ 1 న పీఠాదిపత్య విధానం అంతా వారణాశి పండితులు ,పూరీ శంకరాచార్య శ్రీ శ్రీ భారతీ కృష్ణ తీర్ధ ,శృంగేరి శంకరాచార్యులు శ్రీ చంద్ర శేఖర భారతి స్వాముల సమక్షం లో మహా వైభవంగా నిర్వహించారు .గర్వాల్, వారణాసి ,దర్భంగా మహా రాజులు ఎందరెందరో మత ప్రముఖులు హాజరయ్యారు .వేదం లో చెప్పబడిన సర్వ లక్షణ సంశోభితుడు స్వామి బ్రహ్మానంద సరస్వతి అని అందరూ శ్లాఘించారు .

 బ్రహ్మానంద సరస్వతి మొదటి సారిగా జ్యోతిర్మఠాన్ని  పునర్నిర్మించాడు . ఆప్రాంతమంతా స్థానికుల ఆక్రమణలో ఉంటె స్థానిక డిప్యూటీ కమీషనర్ స్థానిక పెద్దల సహకారం తో ఖాళీ చేయించి  30 గదులతో రెండస్తుల భవన నిర్మాణం చేసి ‘’జ్యోతిర్మఠ పీఠ భవనం ‘’అని పేరు పెట్టాడు .దీనికి వంద గజాల దూరం లో దర్భంగా మహా రాజు మొదలు పెట్టిన ‘’పూర్ణ గిరి దేవి ‘’దేవాలయాన్ని బ్రహ్మాన౦ద  పూర్తీ చేయించాడు .సంప్రదాయ అద్వైత మత ప్రచారానికి ఉత్తర భారతం లో జ్యోతిర్మఠం అతి ముఖ్యమైన గొప్ప కేంద్రం . జ్యోతిర్మఠ శంకరాచార్యునిగా ఉత్తర భారత దేశమంతా పర్యటించి ప్రబోధాత్మక ప్రసంగాలతో  శంకరాద్వైత  భావ వ్యాప్తి చేశాడు  మహర్షి మహేష్ యోగి కరపత్రి స్వామి ,స్వామి స్వరూపానంద సరస్వతి ,స్వామి శాంతానంద సరస్వతి మొదలైన వారు బ్రహ్మానంద సరస్వతి ముఖ్య శిష్యులు .భారత ప్రధమ రాష్ట్ర పతి డా బాబూ రాజేంద్ర ప్రసాద్ ,ఫిలసాఫికల్ ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బ్రహ్మానంద సరస్వతిని దర్శించి ఆశీర్వాదాలు పొందారు .రాదా కృష్ణన్ ‘’మూరీ భవించిన వేదాంతం   సత్య స్వరూపం స్వామి బ్రహ్మానంద సరస్వతి ‘’అన్నారు .19 53లో 8 5 వ ఏట  బ్రహ్మైక్యం చెందటానికి 5 నెలల ముందు స్వామి బ్రహ్మానంద వీలునామా రాసి తన తదనంతర పీఠాదిపతి స్వామి శాంతానంద సరస్వతి అని పేర్కొన్నాడు .

స్వామి బ్రహ్మానంద గొప్ప శ్రీ చక్ర ఉపాసకుడు ఆయన వద్ద అరుదైన రూబీ శ్రీ చక్రం ఉండేది .ఆయన పీఠాదిపత్యకాలం లో ఎందరెందరో రాజులు ధనికులు ఆశ్రమానికి వచ్చి విలువైనకానుకలు సమర్పించేవారు .మంత్ర దీక్ష స్వీకరించేవారు .    ఈ ధన సంపద పీఠ ఆధ్యాత్మిక కార్య క్రమాలకు సద్వినియోగమయ్యేది . ‘’మహర్షి మహేష్ యోగి 20 08లో ‘’మహేష్ యోగి ట్రస్ట్ ‘’ఏర్పరచి బ్రహ్మానంద సరస్వతి పేరుతొ దేశంలోని 30 వేల వేద పండితుల కు ఆసరా కలిపించి గురు ఋణం తీర్చుకున్నాడు .కారణ జన్ముడు స్వామి బ్రహ్మానంద సరస్వతి శంకరాచార్య .

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2ఇన్‌లైన్ చిత్రం 3

          మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా


Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మణిద్వీప పూజ

షార్లెట్ లో మా అమ్మాయి స్నేహితురాలు శ్రీమతి గోసుకొండ అరుణ ఇంట్లో 28-4-17 శుక్రవారం మధ్యాహ్నం  మణిద్వీప ప్పోజ ,వాయనం భోజనం ఫోటోలు 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

కొందరు హిమాలయ యోగులు -2(చివరిభాగం )

కొందరు హిమాలయ యోగులు -2(చివరిభాగం )

3-నిప్పు స్వామి

హిమాలయాలలో ఒక స్వామి నోటినుంచి నిప్పు అంటే మంటలను వెదజల్లెవాడు ..చిన్న అగ్గి పుల్ల ఆపని చేస్తు౦ది కదా యోగ శక్తులను అంతర్ముఖం చేసుకో కుండా ఈ ప్రదర్శనలేమిటని గురువు ఈసడిస్తే ఆశ్రమం వదిలి వెళ్ళిపోయాడు .

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2

4- నీమ్ కరోలి బాబా

నీం కరోలి బాబా కు ఎక్కడెక్కడ ఏమి జరిగిందో జరుగుతుందో తెలుసు .ఎవరైనా ఆయన్ను దర్శించటానికి వస్తే నువ్వు ఫలానా రోజున ఫలానా సమయం లో  ఫలానా చెట్టు కింద నన్ను గురించి చెడ్డగా మాట్లాడావు గుర్తుందా  ఇప్పుడు నన్ను చూడటానికి వచ్చావా వెళ్ళు వెళ్ళు అని తరిమేసేవాడు ఒక సారి ఆయన శిష్యుడైన ఒక ఫార్మసిస్ట్ దర్శించటానికి వచ్చాడు బాబా తనకు ఆకలిగా ఉందని ఆతని చేతిలో ఏది ఉంటె దాన్ని ఆహారంగా పెట్టమని కోరాడు .ఆతను తనదగ్గర ఆర్సేనికి ఉందని అది ప్రమాదమని వెంటనే భోజనం తెస్తానని అన్నాడు .బాబా అతని దగ్గర్నుంచి ఆర్సెనిక్ పౌడర్ లాక్కుని  గుప్పెడు నిండా తీసుకొని గ్లాసెడు మంచి నీళ్ళతో తినేశాడు చచ్చి పోతాడేమో నని అందరూ కంగారు పడ్డారు .కాని బాబాకు ఏమీ కాలేదు మర్నాడు యదా ప్రకారం తన కార్య క్రమాలు చేసుకొన్నాడు .

 బాబా ఎప్పటికప్పుడు ఆకలిగా ఉందనే వాడు .ఎదుటివారు ఆయన అంతక్రితమే భోజనం చేశాడని చెబితే ‘’అయితే’’ వాకే ‘’ఆకలి లేదు ‘’అనేవాడు .ఒక రోజు ఆయన 45 సార్లు భోజనం చేశాడు .తన శక్తిని ప్రదర్శించాలని ఆయన తహతహ ..అంతటి గొప్ప స్థాయి ఉన్నబాబా పసిపిల్లడిలాగా ప్రవర్తిస్తాడు .

ఇన్‌లైన్ చిత్రం 3

5-దిగంబర అస్సాం సన్యాసిని

అస్సాం కామాఖ్య దేవాలయం ప్రక్కనే చిన్న గదిలో ఈ దిగంబర సన్యాసిని ఉండేది . 96 ఏళ్ళ వయసు .ఆమె పగటిపూట గదిలో నుంచి బయటికి వచ్చి అప్పటికి 20 ఏళ్ళయింది గదిలోనే సమాధిలో ఉండిపోయేది .అయితే అర్ధరాత్రి దాటాక తెల్లవారు జామున మూడు గంటలకు ఆమె కామాఖ్యశక్తి దేవాలయానికి వెళ్లి మంత్రాలు చదువుతూ అమ్మవారిని పూజించేది .ఒంటి మీద నూలు పోగు కూడా ఉండేదికాదు .బక్క చిక్కి శాల్యావశిస్టమై ఎముకలకు చర్మం అతికించినట్లు ఉండేది .కళ్ళు మాత్రం అగ్ని గోళాలుగా ప్రకాశం తో ఉండేవి .స్వామి రామా ఆమె గది ప్రక్కనే మరో గదిలో ఉండేవాడు ఆమె చర్యలన్నీ గమనించేవాడు .ఒక రోజు రాత్రి ఆమె దేవాలయానికి వెళ్ళినప్పుడు చప్పుడు చేయకుండా తానూ వెనక వెళ్లి ఆమె చేసేవన్నీ చూశాడు .రావద్దని హెచ్చ రించి బెత్తం పెట్టి కొట్టి తరిమేసింది ఒక రోజు. అయినా ఈయన మానలేదు అప్పుడు రామా కున్న మారు పేరుతొ పిలిచింది ఆశ్చర్య పోయాడు ఈ నిక్  నేం ఆయన గురువుకు తప్ప ఎవరికీ తెలియదు .అప్పుడు స్వామి రామాను దగ్గర తీసుకుని తొడడ పై కూర్చో బెట్టుకొని’’నీసాధనలో కొన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకే వెడతావు నా శీస్సులు ఇస్తున్నాను ‘’అని  ఆశీర్వదించగా రామా కు స్వర్గం లో  తల్లి ఒడిలో ఉన్నట్లనిపించింది .అర్ధ రాత్రి అంకమ్మ శివాలులాగా ఈ గుడిలో ఏం చేస్తున్నావని రామా ఆమెను చనువుతో అడిగాడు .శక్తి పూజ చేస్తున్నట్లు చెప్పింది .రాత్రి 12 నుంచి మూడువరకు నా దగ్గర ఎవరున్నా సహించలేను ‘’అన్నది అందుకనే ఆ శక్తి దేవాలయానికి అర్ధ రాత్రి 12 నుంచి 2 వరకు మళ్ళీ 3 నుంచి నాలుగున్నర వరకు ఎవరూ దర్శించరు.స్వామి రామా ఆమెను మాతృ గురువు ‘’గా మదర్ టీచర్ గా భావించాడు .చాలా శక్తి సామర్ధ్యాలు ఉన్న చాలా ప్రశాంతం గా ఉండేది .ఆమె ఏది చెబితే అది జరిగేది .ఆమె రాత్రి ఏనాడు నిద్ర పోయి ఎరుగదు  తపో భంగిమలో కూర్చునే ఉండేది రాత్రంతా .ఒక రోజు స్వామిరామా ‘’అమ్మా మీరు పడుకుని నిద్రపోతే మీ మీకాళ్ళకు మాసేజ్ చేస్తాను ‘’అన్నాడు ఆమె వెంటనే ‘’నిద్రా ! అది నాకు పడదు .నేను జడత్వానికి ,బద్ధకానికి  అతీతం .నేను నిద్ర లేని నిద్ర పోతాను .దానికి పడుకోవాల్సిన పని లేదు యోగ నిద్రలో ఆన౦ దించేవారికి  పంది నిద్ర ఎందుకు ?’’అన్నది .దీని అర్ధం ఏమిటి అని అడిగితె ‘’పందులు శక్తికి మించి తెగతిని అరగటానికి గురక పెడుతూ నిద్రపోతాయి అవి అంతకాలం ఎలా నిద్రపోతాయోనని ఆశ్చర్యమేస్తుంది ‘’అంటూ ని ద్రా శాస్త్రాన్ని చక్కగా వివరించింది ..అప్పుడు మాండూక్య ఉపనిషత్ లోని మూడు నిద్రావస్తలు గుర్తుకు వచ్చాయి .స్వామి రామకు చివరిసారిగా సందేశమిస్తూ ‘’ఈ భౌతిక తల్లి బి౦బానికి అతుక్కు పోకు .నేను విశ్వ మాతను .సర్వాంతర్యామిని నీ అంతరాత్మను తెలుసుకో .భయం వీడు నేను నీతో ఎప్పుడూ ఉంటాను ‘’అనగానే రామా కళ్ళు నీళ్ళతో సుళ్ళు తిరిగాయి

 6-దేవర బాబా

ఉత్తర ప్రదేశ్ లోని దేవరబాబా వయస్సు 15 ౦ ఏళ్ళు అని అంటారు అప్పటికే .హిమాలయ పర్వత గుహలలో ధ్యాన తపస్సులు చేస్తూ అప్పుడప్పుడు తూర్పు ఉత్తర ప్రదేశ్ కు వస్తాడు ప్రధమ రాష్ట్ర పతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ఆయన ముఖ్య భక్తుడు .తన చిన్నతనం లో తండ్రి బాబా దగ్గరకు తెసుకు వెళ్ళాడని అప్పటికే ఆయన చాలా ముసలివాడని రాజేంద్ర ప్రసాద్ రాశాడు . రిషీ కేష్ లో  తాత్కాలిక పైన్ వుడ్ గుడిసె లో ఉండేవాడు  .ఒక్కోసారి చెట్టుకిందే ఉండి పోయేవాడు .చాలా నియమ నిష్టలతో పవిత్రంగా ఉండేవాడు ఎవరినీ తాక నిచ్చేవాడు కాదు .ఉత్తర భారత దేశమంతా దేవర బాబా శిష్యులే ఆయన కిందికి దిగి వచ్చాడని తెలిస్తే వేలాది మంది దర్శనానికి వచ్చేవారు .గట్టి పోలీసు బందోబస్తు ప్రభుత్వం చేసేది . కుంభ మేళాలో ఆయన్ను చూడటానికి విదేశాలనుంచి కూడా వేలాది భక్తులు వచ్చేవారు .ఆయన ఆహారం పళ్ళు కూరలు మాత్రమె .’’సంతోషమే గొప్ప సంపద .నియమ నిబద్ధత జీవితానికి అవసరం నూతన శ్వాస విధానాలు పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది టెక్నిక్ ఆఫ్ ఏజ్ లెస్ నెస్ ఈజ్ టెక్నిక్ ఆఫ్ ప్రాణ యామ’’అన్నది ఆయన సిద్ధాంతం ప్రేమైక మూర్తిగా దేవర బాబా ప్రసిద్ధుడు

ఇన్‌లైన్ చిత్రం 4

  మరి కొన్ని విషయాలు

బదరీనాద్ దగ్గర వాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంది .అవి వికసించే కాలం లో అందరూ వెళ్లి చూసి మహదానందం పొందుతారు అనేక రంగులు రకాలు వాసనలతో కనులకు వైభోగం ఉంటుంది .అయితే ఆ పూల వాసన ఎక్కువ సేపు పీలిస్తే మత్తు మైకం వచ్చి జ్ఞాపక శక్తి తాత్కాలికంగా కనుమరుగౌతుంది కొన్ని గంటల ఆతర్వాత కాని మళ్ళీ విషయాలు గుర్తుకు రావు ..ఇక్కడే సిక్కుల గురుద్వారాకూడా ఉంది

ఇన్‌లైన్ చిత్రం 7ఇన్‌లైన్ చిత్రం 8ఇన్‌లైన్ చిత్రం 9

 వారణాసి లో ఒక వేశ్య ఉండేది .ఆమె పేరు బాగా ప్రచారం లో ఉండేది .ఒక చిన్న బోటు లో గంగానదిలో ఉండేది బోటు బయట ‘’నేను వేశ్యను నన్ను సాధువుగా అపార్ధం చేసుకోవద్దు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి భంగం కలిగించవద్దు ‘’అని బోర్డ్ ఉండేది .సాయం సమయం లో నీటినుంచి బయటికి వచ్చి ఇసుక తిన్నెలపై కూర్చుని ఏకాంతంగా మంత్రాలు చదువుకొనేది వేలాది మంది ఆమెతోపాటు  చదివే వారు ..ఎవరితోనూ మాట్ల్లాదేదికాడు సౌజ్ఞలు చేసి తనతోపాటు దైవ స్మరణ చేయమని చెప్పేది .ఒక రోజు సాయంత్రం దాదాపు ఆరు వేలమంది ఆమె దగ్గర ప్రార్ధనలు చేస్తుంటే ‘’నేను ఉదయానికల్లా వెళ్లి పోతాను నా శరీరం గంగలో పడెయ్యండి ‘.అది చేపలకన్నా ఆహారంగా ఉపయోగ పడుతుంది ‘’అని చెప్పింది  .చెప్పినట్లే మర్నాడు ఉదయం ఆమె దేహం చాలించింది ఆమె కోరిక తీర్చారు భక్తులు .

ఇన్‌లైన్ చిత్రం 5ఇన్‌లైన్ చిత్రం 6

  మహాత్మా గాంధి నడుస్తుంటే చాల తమాషా గా ప్రత్యేకంగా  ఉంటుంది  మునుల మహర్షుల నడకకంటే అతి భిన్నంగా ఉంటుంది .ఆయన నడుస్తుంటే ఆయన -శరీర౦ నుంచి విడిపోయినట్లు కనిపిస్తుంది  .గుర్రం బండిని లాగినట్లు ఆయన శరీరాన్ని లాగుతూ నడుస్తున్నట్లు అనిపించటం విశేషం .దీన్ని ఆతెన్ బరో తీసిన గాంధి సినిమాలో గాంధీగా నటించిన బెంక్లిన్  చక్కగా చూపించాడు దీనికి కారణం అయన ఎప్పుడూ కులమతాలకు అతీతంగా అందరినీ ప్రేమించటం అందరి క్షేమం కోసం ప్రార్ది౦చ టమేఅంటారు . .ఆయన కు ముగ్గురు గురువులు క్రీస్తు కృష్ణుడు బుద్ధుడు .

ఇన్‌లైన్ చిత్రం 10

 స్వామి బ్రహ్మానంద అరుదైన సిద్ధుడు .శ్రీ విద్యపై నిష్ణాతుడు .ఆయనకున్న అద్భుత శక్తులను గుర్తించి స్వామి కరపత్రి అనే మహా విద్వాంసుడు ఆయనను మూడు వందల ఏళ్ళుగా ఖాళీ గా ఉన్న ఉత్తర శంకరాచార్య మఠానికికి పీఠాధిపతి గా ఉండమని కోరగా అయ్యాడు .వేలాదిమంది అనుచరులతో యాత్రలు చేసేవాడు భక్తిని అద్వైతం తో జోడించి ప్రసంగించటం ఆయన ప్రత్యేకత .స్వామి బ్రహ్మానంద వద్ద అరుదైన కెంపు లతో చేయబడిన శ్రీ యంత్రం ఉండేది

ఇన్‌లైన్ చిత్రం 11ఇన్‌లైన్ చిత్రం 12ఇన్‌లైన్ చిత్రం 13

  సమాప్తం

          మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఈ రోజు డొక్కా సీతమ్మ గారి 107 వ వర్ధంతి

హైదరాబాద్ నుంచి శ్రీమతి గబ్బిట గిరిజ- నిరతాన్నదాత ,అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి 107 వ వర్ధంతి ఈ రోజే నని నాకు మెయిల్ ద్వారా గుర్తు చేసి0ది ఆమె కు కృతజ్ఞతలు తెలియ జేస్తూ సీతమ్మ తల్లిని మరోక్క సారి మళ్ళీ తలచుకొని మనసారా నివాళు లర్పిద్దాం  -దుర్గా ప్రసాద్

 

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2ఇన్‌లైన్ చిత్రం 3

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

హిమాలయ యోగిపు౦గవులు -1 యువ రాజ స్వామి భావల్ సన్యాసి

కొందరు హిమాలయ యోగిపు౦గవులు -1

యువ రాజ స్వామి  భావల్ సన్యాసి

 ఈయన జీవితం ఒక వింతకధ .బెంగాల్ లో భావల్ ప్రాంత రాజు  భావల్ సన్యాసి .పెళ్లి అయ్యాక అందమైన భార్యతో డార్జిలింగ్ లో హాయిగా గడుపుతున్నాడు .భార్య ఒక డాక్టర్ కు దగ్గరై౦ది .ఈ ఇద్దరూ కలిసి భావల్ ను చంపే ప్రయత్నం లో రోజూ రాజుకు కొద్దిమోతాదు లో నాగుపాము విషాన్ని ఇంజెక్షన్ గా ఇవ్వటం ప్రారంభించారు .రాజు ఎందుకు అని అడిగితె అది బలానికిచ్చే  ఇంకేక్షన్ అని నమ్మకంగా చెప్పేవారు .క్రమంగా డాక్టర్ డోసు పెంచాడు .రెండు నెలలతర్వాత రాజు అపస్మారకం గా ఉంటె చనిపోయాడని డాక్టర్ ప్రకటించి అంత్యక్రియలకు హిమాలయ పర్వత ప్రాంత సెల యేరు దగ్గర ఏర్పాటు చేశారు .చితి అంటించారు .భూమి ఆకాశం బద్దలయ్యేట్లు విపరీతంగా ఆగకుండా వర్షం కురిసి చితి ఆరి పోయి  రాజు శరీర౦ ప్రవాహం లో  కొట్టుకు పోయింది .

 మూడు మైళ్ళు కిందకు కొట్టుకు పోయి స్వామి రామా గురువు ఆశ్రమం దగ్గరకు  కాంచన గంగ నుంచి కుమయూన్ హిమాలయాలదాకా కొట్టుకు వచ్చి చేరింది. ఆయన  తాళ్ళతో బంధింపబడిన శవాన్ని చూసి  ఆ వ్యక్తీ మరణించలేదని అపస్మారకం లో ఉన్నాడని ,మామూలు శ్వాస నాడి కొట్టుకోవటం లేదని గ్రహించి  శిష్యులను  తాళ్ళు కోసేయమని అతడు తన శిష్యుడు అని చెప్పి  పంపాడు . వాళ్ళు వెళ్లి అలానే చేసి ,రాజును గుహలోకి తీసుకువచ్చారు .కొద్ది రోజులకు రాజు మామూలు స్థితి లోకి వచ్చాడుకాని గత౦  ఏమాత్రం గుర్తులేదు . గురువుగారి శిష్యుడయ్యాడు .అయన సన్యాస దీక్ష నిచ్చాడు .గురువు వద్ద ఏడేళ్ళు గడిపాడు ..తరువాత గురువు ఆయనను పుణ్య క్షేత్రాలు దర్శించమని , ,యోగులను కలుసుకోమని చెప్పి పంపాడు . ,బాస్వాల్ సన్యాసి తప్పక తన అక్కగారి ఊరు  వెడతాడని అక్కడ గతం జ్ఞాపకం వస్తుందని ముందే ఊహించి  తనకు ఇక్కడ తపోభంగం జరుగుతోందని ఇంకా కొంచెం పైకి  వెళ్లి  అక్కడ ఉంటానని  చెప్పి పంపాడు .

  బాస్వాల్ సన్యాసి అనేక ప్రదేశాలు తిరిగి తిరిగి గురువు ఊహించినట్లే ఒక రోజు అక్కగారి ఊరు  చేరి  అక్క ఇంటికి భిక్షకు వెళ్ళాడు .ఆమె తమ్ముడిని గుర్తించి ఆహ్వానించింది  ఆరు  గంటలు ఆయనతో అక్క మాట్లాడిన తర్వాత కాని ఆయనకు గత స్మృతులు జ్ఞాపకం రాలేదు .అక్కడి బంధు మిత్రుల ప్రోద్బలంతో   తానే రాజ్యానికి వారసుడినని కోర్టులో కేసు వేశాడు సాక్ష్యాధారాలన్నీ రాజు పక్షం లో బలం గా ఉండటం చేత  తనకు  విషం  ఇంజెక్షన్ ఇచ్చిన డాక్టర్ విషాన్ని బొంబాయి లాబ రేటరి లో కొన్నట్లు రుజువు అవటం వలన ,తనను భార్య ఆమె ప్రేమికుడైన డాక్టర్ ఎలా నయ వంచన తో మోసగించిందీ హిమాలయ స్వామి ఏ విధంగా ఆదుకున్నదీ ఆయన శిష్యుడుగా ఉన్న విషయం  పూస గుచ్చి నట్లు తెలియ జేయటం వలన  కేసు గెలిచి సంస్థానం డబ్బు సంపదా అన్నీ దక్కాయి .గురువు కోర్టుకు రాలేదుకాని శిష్యులను పంపాడు సాక్ష్యాలకోసం .కేసు ఎన్నో ఏళ్ళు నడిచింది . కేసు గెలిచి రాజ్యం సంపదా దక్కిన ఏడాదికి భాస్వాల్ సన్యాసి  మరణిం చాడు ఈ కేసుతో గురు స్వామి విషయం ప్రపంచ  మంతా తెలిసిపోయింది .ఈ గురువును వెదుక్కుంటూ అనేక ప్రదేశాలనుండి  సాధకులు వెళ్లి శిష్యులయ్యారు  గురువు ఎందుకు జనావాసాలకు దూరం గా ఉంటున్నారో అర్ధం చేసుకున్నారు .

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2

        2-ఆప్త మంత్రోపదేశికుడు -వాలా బాబా

ఒక్క గోచీ తప్ప ఏ రకమైన ఆచ్చాదన లేకుండా కాళ్ళకు పాద రక్షణ లేకుండా యెంత దూరమైనా నడిచే జడలు విపరీతంగా పెరిగి భూమిని ఆనుకోనేట్లు ఉన్న వాలా బాబా వద్ద ఆప్త మంత్రాన్ని నేర్చుకోమని స్వామి రామ గురువు పంపాడు .రామా కొన్ని రోజులు ఆయన గుహలో ఉన్నాడు ఒక రోజు వాలాబాబా ఒక చెట్టు ఎక్కి అక్కడ ఉన్న పెద్ద తేనెటీగ తుట్టె దగ్గరకు వెడుతుంటే వద్దని స్వామి రామా ఆపాడు .వినకుండా తేనే తుట్టె దగ్గరకు చేరి తెనేటీగలతో నోటితో ఏదో మాట్లాడాడు .అంతే.అవి చెదర లేదు బెదరలేదు ఆయన్ని ఏమీ చేయలేదు .రామాను కూడా తేనెతుట్ట దగ్గరకు వెళ్ళమన్నాడు మంత్రం చెబితే వెడతానన్నాడు రామా చెట్టు ఎక్కాక చెబుతానన్నాడు వాలా .అలాగే చేయగా అప్పుడు తీనేటీగలతో ‘’నేను ఇక్కడ మీతో ఉన్నాను మీకు హాని చేయను .నాకు హాని చేయద్దు ‘’అని చెప్పమన్నాడు అది మంత్రం కాదుగా అన్నాడు రామా .వాటికీ నీ భాష అర్ధమవుతుంది చెప్పినట్లు చేయమన్నాడువాలా .కాని ఏమి చేయలేక అలానే చేశాడు .అవి రామా జోలికి రాలేదు .చెట్టు దిగగానే ‘’ఇది నీకు మాత్రమె పనికొస్తుంది ఇంకా ఎవరికీ చెప్పద్దు ‘’అని హెచ్చరించాడు వాలాబాబా .చాలా సార్లు స్వామి రామా అలానే చేసి తేనే సేకరించేవాడు .ఒక సారి పంజాబ్ లో ఉండగా ఒక కంసాలి మంత్రం చెప్పమని ప్రాధేయపడితే వాలా బాబా చెప్పింది మరిచి వాడికి చెప్పాడు .వాడు తేనే తుట్టె దగ్గర ఈయన చెప్పినట్లే చెబితే  ఆ మంత్రం పారక వందలాది తేనెటీగలు కుట్టి బాధిస్తే  హాస్పిటల్ లో చేరిస్తే కోమాలో మూడు రోజులు ఉండిపోయాడు విశ్వ బ్రాహ్మణుడు

.ఇన్‌లైన్ చిత్రం 3.

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

న పురుష స్వాతంత్య్ర మర్హతి

ఇన్‌లైన్ చిత్రం 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 13 4- లక్షణ శాస్త్ర కర్త -శకటాయణుడు(8 18 -8 6 7 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3

13 4-  లక్షణ శాస్త్ర  కర్త -శకటాయణుడు(8 18 -8 6 7 )

కాశ్మీర్ కు చెందిన శకటాయణుడు ,నైరుక్త కర్త..వ్యాకరణ వేత్తలలో అతిప్రాచీనుడు.తరువాత వారైన యాస్కుడు ,పాణిని ఆయన రచనలను ఉదాహరించటం వలననే లోకానికి తెలియ బడ్డాడు .నామ వాచాకాలన్నీ క్రియా జన్యాలేనన్నాడు .దీనినే సంస్కృతం లో ‘’కృత్ ప్రత్యయం ‘’అన్నారు .దీనిపై ప్రముఖ వ్యాకరణ వేత్త బిమల్ కృష్ణ మాతీలాల్ ‘’నైరుక్తకారులకు అంటే ఎటిమాలజిస్ట్ లకు పాణినీయులకు అంటే వ్యాకరణ వేత్తలకు మధ్య గొప్ప చర్చ జరిగింది .ఎటిమాలజిస్ట్ లునామవచాకాలన్నీ కొన్ని క్రియల నుండి ఏర్పడ్డాయన్నారు .నిరుక్త కర్త యాస్కుడు దీనినే సమర్ధింఛి శకటాయనుణుడిని.సమర్ధించి ఉదాహరించాడు .దీనివలమ పదాలన్నీ అత్యంత సూక్ష్మ రూపంలోకి అంటే దాతు రూపం లోకి విభజించటానికి వీలు కలిగింది .దీనికే ధాతు-ప్రత్యయ  వ్యవస్థ అనే పేరు కలిగింది .గార్గ్యుడు శకటాయణుడి అభిప్రాయాన్ని వ్యతిరేకిన్చాడని యాస్కుడు తెలియ జేశాడు .యాస్కుడు అన్నినామవాచకాలుధాతువులనుంచే రావాలనే నియమం లేదు అన్నాడు ‘’అని తెలియ బరచాడు .విభక్తి ప్రత్యయాలకు ప్రత్యేక అర్ధం ఉండదని , శకతాయణుడు అంటే  అవి నామవాచకం లేక క్రియ లు చెప్పే దాన్ని సమర్దిస్తాయని గార్గ్యుడు అన్నాడు .ఇలా ప్రాచీనకాలం లో మీమా౦స కులకు వ్యాకరణ కారులకు సుదీర్ఘ చర్చలు జరిగాయి ..శకటాయనుని రచనను ‘’లక్షణ శాస్త్రం ‘’అంటారు .ప్రాణమున్న ,ప్రాణం లేని వాటి లింగాలను తెలుసుకోవటానికి ఇది సహకరిస్తుంది .ఇతను క్రీ శ.818 లో జన్మించి 867 లో మరణించాడు. ఈ శకటాయణుడు యాస్క ,పాణిని లకు ముందు ఇనుప యుగం లోని వాడు

క్రీ .శ 9 వ శతాబ్దం లో మరొక వ్యాకరణ కర్త శకటా యణుడు అమోఘ వర్షుని కాలం లో ఉన్నాడని తెలుస్తోంది

135-  బృహద్దేశి సంస్కృత సంగీత కర్త -మతంగ ముని (6 వ శతాబ్దం )

భారతీయ సాంప్రదాయ సంగీతం పై ‘’బృహద్దేశి’’గ్రంధం రాసిన మతంగ ముని కాలం క్రీ శ 6 -8 శాతాబ్దిమధ్య .సంగీత రాగాలపై వచ్చిన మొట్టమొదటి గ్రంధం బృహద్దేశి.ఇందులో మార్గ  దేశి రాగాల వివరణ ఉన్నది  సర్గం నోటేషన్ ల వివరణ కూడా ఉంది .తన రచనలో భరతముని నాట్య శాస్త్రాన్ని మతంగముని చాలా సార్లు పేర్కొన్నాడు .సంగీత ప్రమాణాలు -మ్యూజికల్ స్కేల్స్ ,శృతి లపై విస్తృతంగా చర్చించాడు .బృహద్దేషి ప్రేమలతా శర్మ సంపాదకత్వం లో వెలువడింది .తెలుగులో కూడా శ్రీ ద్వారం భావనారాయణ  వ్యాఖ్యానం  రాసి 20 02 లో ప్రచురించారు  .

           సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 12 6 -శ్రాద్ధ -హాస్యనాటక రచయిత -ఎస్.జగన్నాధ (19 5 6 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

12 6 -శ్రాద్ధ -హాస్యనాటక రచయిత -ఎస్.జగన్నాధ (19 5 6 )

ఎస్ .జగన్నాధ 19 5 6 అక్టోబర్ 12 కర్ణాటకలో జన్మించి ,సంస్కృతం లో ఏం ఏ ఫ్లూట్ లో విద్వాన్ అయ్యాడు .సంస్కృతం లో ‘’అంధకాసుర సంహారం  కౌటి ల్యాభరణం ‘’నృత్య నాటికలు రాశాడు .శ్రాద అనే హాస్య హాస్యనాటకమూ రాశాడు .కాదంబరి ని ‘’పుండరీకం ‘’పేరుతొ పిల్లలకోసం  రాశాడు .మందా క్రాంత వృత్తం లో ‘’తీరం ‘’ఖండకావ్యం ,కాళిదాస మేఘ దూతం కు పేరడీగా ‘’మేఘదూతం శంకరాచార్యుల ప్రస్థాన త్రయ భాష్యం పై ‘’బ్రహ్మ కావ్య ‘’అనే పురాణకావ్యం ,అర్దాలంకారాలపై 111 అలంకారాలను ఉదాహరిస్తూ వ్యాఖ్యానం తో ‘’లోకాలంకార పాణి కీయం ‘’,’’ఆభానక జగన్నాధ ‘’పేరిట 500  కొత్త సంస్కృత సామెతలను రాస్శాడు .

 బాల సాహిత్యం గా ‘’రుజు రోహిత ‘’అనే 21 కధలు ప్రబంధ సౌద అనే వ్యాస సంపుటి ,వందనామాలిక అనే సంగీత కృతులు ,ఉత్తరాలు ఎలా రాయాలో తెలియ జేస్తూ ‘’పత్ర సౌదః ‘’బసవేశ్వరుని 200 వచనాలను ‘’వీచి మాలికా ‘’గా సంస్కృతం లో రాశాడు .భాష  శిల్పాలపై గొప్ప పట్టు ఉన్నవాడు జగన్నాధ .

12 7 -భోజ విలాస ఏకాంకిక రచయిత -వాసుదేవ భాల్లాల (19 5 2

కర్నాటక ఉడిపి లోని అమ్బలపడి లో వాసుదేవ భాల్లాల పుట్టాడు .బెంగుళూరు సరస్వతి విద్యామందిర్ హై స్కూల్ లో బోధించాడు 19 7 6 లో ‘’భోజ విలాసం ‘’అనే ఏకాంకిక రాసి ప్రచురించాడు .భోజమహారాజు జీవితం సాహిత్యం పాలన  వివరిచాడు .ఇందులో 6 దృశ్యాలున్నాయి .

12 8- స్వామి శివానంద విలాస మహాకావ్య కవి -రామ కృష్ణ భట్టు (19 50

వెంకమ్మ కృష్ణ భట్టులకు మంగుళూరు  వద్ద కు౦బ్లాలో రామ క్రిష్ణభట్టు జన్మించాడు .ఢిల్లీ హిందూకాలేజీ లో సంస్కృత ప్రొఫెసర్ గా ఉన్నాడు .విద్యాభాస్కర విద్యా సాగర కవితా చతుర బిరుదులను స్వామి శివానంద  ,ద్వారకా శ౦కరాచార్యుల నుండి పొందాడు .సంస్కృతం లో 11 కాండల ‘’శివానంద విలాసం ‘’పురాణకావ్యం ,గీతికావ్యంగా ‘’శ్రీరామ దాస గీత ‘’శ్రీ రామ కృష్ణ సహస్ర నామ స్తోత్రం ,గురు చరితం   గురు సపర్య భక్తీ గీతాలు ,అర్జున అనే వచన పుస్తకం ,కావ్యోద్యానం ,కావ్య మంజరి అనే స్వీయ సంస్కృత శ్లోక కదంబం రాశాడు .వరాహ మిహిరుని ‘’బ్రహ్మ సంహిత ‘’కు సంపాదకత్వం వహించాడు .

 కావ్యమంజరిలోని రెండు స్తబకాలలో 2 వేల శ్లోకాలు రాశాడు .మొదటి స్తబకం లో ఆరు భాగాలకు బాహ్య పుష్ప ,పాంచజన్య పుష్ప ,ఆతపత్ర పుష్ప ,సుమానుష పుష్ప ,సూనృత పుష్ప అని పేరుపెట్టాడు .రెండవ స్తబకాన్ని శతక స్తబకం అన్నాడు .ఇందులో వియోగినీ శతకం ,మందా క్రా౦త శతకం , ,ఉపజాతిశతకం ,మృత్యు పాశీయం అనే 4 శతకాలున్నాయి .

శివానంద విలాసం స్వామి శివానంద జీవిత చరిత్ర .మహాకావ్య లక్షణాలన్నీ పుష్కలంగా ఉండి,మంచి శైలీ విన్యాసంతో భక్తీ భావ బంధురంగా రచించాడు .అర్జున వచనరచన హృద్యంగా ఉంటుంది . కావ్యోద్యానం లో భాగవతం సారస్వతం పత్ర పుష్పం ,సాప్తపదీనం ,మౌక్తికం భాగాలున్నాయి .వైవిధ్యభరిత రచన ఇది .అతని వైదుష్యానికి ప్రతీకగా నిలుస్తుంది

12 9-సిద్ధ లింగ మహా కావ్య కవి -బసవ రాజ శాస్త్రి (19 50)

బసవ రాజ శాస్త్రి సంగమాంబ ,రుద్ర మూర్తి దంపతులకు 19 50 లో కర్ణాటకలో జన్మించి వ్యాకరణ తీర్ధ ,వ్యాకరణ శాస్త్రి  సాహిత్య శిరోమణి డిగ్రీలనుపొందాడు .19 7 1 లో 26 కాండల   4 వేల శ్లోకాల  ‘’సిద్హ లింగ మహా కావ్యం ‘’సిద్ధ లింగేశ్వరుని జీవితం పై రాశాడు .శక్తి విశిష్టాద్వైతాన్ని ,శక్తి స్థల మహాత్మ్యాన్ని చాలా గొప్పగా  వర్ణించిన కావ్యం .ఇంద్ర వజ్ర ,ఉపేంద్ర వజ్ర ,ద్రుత విలంబిత ,మందా క్రాంత వృత్త శ్లోకాలతో రామణీయకత కల్పించాడు .కవి పొందిన డిగ్రీలకు గొప్ప సార్ధకత కల్పించిన మహా కావ్యమిది .

130- గాంధి సంస్మరణ సంభ్రమ ఏకాంకిక రాసిన -ఎస్.ఆర్ .లీల (19 5 2 )

  ఇంగ్లీష్ లో ప్రసిధ ఏకా౦కి కలైన ‘’ది వాలియేంట్’’,’’రిమెంబర్ సీజర్ ‘’లను ఎస్ ఆర్ లీల  ‘’అమరానాయకం ‘’గాంధీ స్మరణ సంభ్రమం ‘’గా సంస్కృతం లోకి అనువర్తనం చేసింది . దానిని బెంగుళూర్ కే వి  ఆర్ మహిళా కాలేజి 19 91లో ‘’సంప్రయోగం ‘’పేరుతో ప్రచురించింది .

13 1-యమ గోపాల రాసిన -సి జి .పురుషోత్తం (19 50

 మైసూర్ కు చెందిన పూర్వపు సంస్కృత ప్రొఫెసర్ కు వెంపు అనబడే కే వి పుట్టప్ప అనే కన్నడ రచయితరాసిన ‘’నంద గోపాల ‘’ను సంస్కృతం లో ‘’యమగోపాల ‘’గా అనువదించాడు .దీనిని బెంగుళూర్ జయ మూర్తి ప్రకాశాన్ 19 92లో అచ్చు వేసింది .

13 2-సోక్రటీస్ నాటకం రచయిత -ఆత్మా రామ శాస్త్రి (19 6 2

 గ్రీకు తత్వ వేత్త సోక్రటీసు జీవితం పై సంస్కృతం లో ‘’సోక్రటీస్ ‘’నాటకం రాశాడు సంస్కృత ప్రొఫెసర్ ఆత్మా రామ శాస్త్రి .బొంబాయ్ భారతీయ విద్యాభవన్ మేగజైన్ ‘సంవిత ‘’ఆగస్ట్ సంచికలో ప్రచురితం .

13 3-సాక్షి శీల నాటక కర్త -హెచ్ వి సత్యనారాయణ శాస్త్రి(19 54)

గో.రు .చన్నబసప్ప కన్నడ నాటకం ‘’సాక్షికల్లు ‘’ను హెచ్ వి నారాయణ శాస్త్రి ‘’సాక్షి శీల’’గా సంస్క్రుతీకరించ గా బెంగుళూరు పల్లవ ప్రకాశన్ 19 8 9 లో ముద్రించింది ..

 సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా   

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బైజాంటిన్ నాగరకత -3 (చివరి భాగం )

బైజాంటిన్   నాగరకత -3 (చివరి భాగం )

బైజాంటిన్ సామ్రాజ్యకాలం లో అది ప్రపపంచ మార్కెట్ ను శాసించింది . కాన్ స్టాంటి నోపిల్ ను గోల్డెన్ సిటి అని పాలనకాలాన్ని స్వర్ణయుగమని అన్నారు .క్రిసేండం లో జ్యుయేల్ అనేవారు .విశాల మైన రాజవీదులు ,ఎత్తైన ప్రాకారాలు అందాల భవనాలు మంచినీటి సౌకర్యం తోపాటు మురికి నీటి పారుదల ఏర్పాట్లు గొప్పగా ఉండేవి .బంగారు కిరీటాల గదులు  విందు వినోద మందిరాలు ఫల పుష్ప ఉద్యానవనాలు ,పోలో గ్రౌండ్  ,గుర్ర౦ స్వారీ నేర్పే స్కూళ్ళు  చెత్త పారవేసే పకడ్బందీ ఏర్పాట్లు ఉం బైజాది .పడమటి యూరప్ లో ఎక్కడా ఇలాంటి ఏర్పాట్లు లేవని చరిత్ర కారులు రాశ్హారు .స్వర్ణయుగమే కాదు బంగారు గనికూడా .అందుకే శత్రువుల కళ్ళు ఎప్పుడూ దీనిపైనే ఉండేవి .ఓడ రేవులలో వ్యాపారం ,అన్ని రకాల బోట్లు , వీదులనిండా  స్కాండి నేవియన్లు   ఫ్రాంకులు ,ఈజిప్షియన్లు ,బెర్బెర్లు ,ఉత్తర ఆఫ్రికా ,పెర్షియన్ జనాలతో కళకళ లాడుతూ జన   సమ్మర్దం గా  ఉండేవి .అరుదైన బంగాగారు ఆభరణాలు నగా నట్రా ,దంతపు బొమ్మలు ,సున్నిత చర్మ వస్తువులు  సుగంధ ద్రవ్యాలు సెంట్లు  నాణ్యమైన గాజు పింగాణీ  వస్తువులు  షాపుల్లో దర్శన మిచ్చేవి .ఒక ఆరకంగా నగరం ధగ ధగ మెరిసిపోతూ ఇతర దేశీయులకు అసూయ కలిగించేది .

 బైజాంటిన్ లకు రధాల స్వారీ పందాలు మహా ఇష్టం .అక్కడ కోడి గుడ్డు  ఆకారపు స్టేడియం లుండేవి .60 వేల మంది ప్రేక్షకులు కూర్చుని చూచే ఏర్పాటు ఉంది .అవినీతి అధికారులపై ప్రజలు తిరగ బడేవారు .వారిలో బ్లూస్ అని గ్రీన్స్ అని రెండు గ్రూపులు ఉండేవి .ఒకసారి శత్రురాజు రధాన్ని ప్రశంసిస్తూ చక్రవర్తి  జస్టినియన్ ను యెగతాళి చేయటం జరిగితే సహించలేక మూడు వేలమంది సైన్యాన్ని హిప్పోడ్రోం ప్రదర్శన శాలకు పంపి ,తలుపులన్నీ మూయించి 30 వేలమందిని ఊచకోత కోయించాడు . దీనినే నీకా ఆందోళన అన్నారు .దీనితో బ్లూ గ్రీన్ గ్రూపులు అంతరించాయి .

 దాదాపు లక్షన్నర సైన్యం ఉండేది 7 నుంచి 12 వ శతాబ్ది వరకు అది అత్యంత క్రమశిక్షణ మెరుగైన శిక్షణ ఉన్నదిగా పేరు పొందింది అదే లేకపోతె సామ్రాజ్యం చిక్కుల్లో పడేది .ఆశ్విక దళం సర్వ సమర్దమైంది .దాదాపు ఆత్మ రక్షణకే సైన్యాన్ని ఉపయోగించారు .వారి పవర్ ఫుల్ ఆయుధం ‘’గ్రీక్ ఫైర్’’ఇది అకస్మాత్తుగా అంటుకొని ఒక గొట్టం గుండా ప్రయోగిస్తే యుద్ధ నౌకలపై పడి మండించేది .నీటిలో పడినా ఇంకా కాలుతూనే ఉండేది .దీన్ని చూస్తే శత్రువుల గుండెల్లో  రైళ్ళు పరిగెత్తేవి . .దీన్ని పట్టణాన్ని ఆరబ్ ముస్లిం ల దండయాత్ర లో కాపాడుకోవటానికి మొట్టమొదట తయారు చేశారు .రష్యా నౌకల్ని దగ్ధం చేసి లోనికి ప్రవేశించకుండా పట్టణాన్ని కాపాడింది .ఇందులో గంధకం ,సాల్ట్ పీటర్ ,నాఫ్తా  లిక్విడ్ పెట్రోలియం ఉపయోగిస్తారని ఊహించారు తప్ప ఇప్పటికీ దాని రహస్యం ఎవరికీ తెలియదు అంత సీక్రెట్ గా కాపాడుకొన్నారు .  సామ్రాజ్యం గ్రీకు –రోమన్ సంస్కృతి నాగరకత లకు  నిలయమైంది ముఖ్యమైన సిటి గా పాగాన్ ఆరాధనా నిలయంగా ఉండి తర్వాత కాలం లో విగ్రహారాధన నిషేధింప బడింది .క్రైస్తవాన్ని విస్తరింప జేయటానికి బలీయమైన ఆఫీసర్లను నియమించారు .రోమ్ లో బిషప్పులు ఉన్నతాదికారులైతే ఇక్కడ  పాట్రియార్క్ బిషప్పులపైన ఉన్నతాధికారి .చక్రవర్తి ,పాట్రి యార్క్  నిర౦తర సంప్రదింపులు జరిపేవారు .బైజాంటిన్ సామ్రాజ్యం అంటే ‘’హెవెన్ ఆన్ ఎర్త్ ‘’అంటే అందరికి సమానావకాశాల కల్పనా, యేసు పేరుతో అందరూ కలిసి ఉండటం .ఆయనే ‘’ప్రిన్స్ ఆఫ్ పీస్ ‘’చక్రవర్తి దైవాంశ సంభూతుడు పాగాన్ దేవతలలో ఒకడు. దైవ ప్రతినిధి .దేవుడే ఎంపిక చేసి భూమికి పంపాడని నమ్మకం .ఆయన ఎవరికీ బాధ్యుడుకాడు .దైవం పై నమ్మకం తో ఆయన ప్రవర్తిస్తాడు సామ్రాజ్యం పూర్తీ ఆటోక్రసీ కేంద్రం .చక్రవర్తితో సహా అందరూ యుద్ధాన్ని కోరని శాంతిప్రియులు .విదేశీ దండయాత్ర చేయరు .బైజాంటిన్ అనే మాటకు రెండు అర్ధాలున్నాయి వంచకుడు ,రహస్య ప్రవర్తకుడు ,అని. అందుకే శత్రువుని నయానా భయానా బెదిరిస్తారు. ముందు ,చర్చలు జరుపుతారు ,డబ్బు ఇచ్చి మచ్చిక చేసుకొంటారు .బంగారం నగదు ఇచ్చి వశ పరచుకొంటారు .వీరి ప్రవర్తన చాలా సంక్లిష్టంగా ఉంటుంది .దీనికి కారణం అతిపెద్ద బ్యూర్రాక్రాసి ఉండటం .వీరి తెలివి తేటలతో చక్రవర్తికి మంచి మార్గం చూపిస్తారు లేక కపటం తో ముంచుటారు .కనుక ద్విస్వాభువులు. లోకం లో ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే ‘’బైజాంటిన్ ప్రవర్తన ‘’అనే పేరు స్థిరపడింది .

 ఒక బైజాంటిన్ చక్రవర్తి పేరు ‘’బేసిల్ బల్గారో క్తానాస్ అంటే బల్గర్లను వధించిన బేసిల్ .9 7 6 రెండవ బేసిల్ అధికారానికి వచ్చాడు పొట్టిగా రాజ ఠీవి లేకుండా సామాన్య దుస్తులతో ఉండేవాడు గుర్రపు సవారిలో ఎక్స్పర్ట్ .క్రమంగ్గా పాలన అంతా నేర్చి సైన్యాన్ని నడిపించటం తెలుసుకొన్నాడు .అతని జీవితమంతా యుద్దాలతో గడిచింది .బాగ్లర్లు అనే ఆటవిక జాతి సమర్ధుడైన వాడి నాయకత్వం లో 9 8 6 లో బేసిల్ చక్రవర్తిపై దాడి చేశారు .చాలా యుద్ధాలు చేశాడు గట్టి సైన్యం కూర్చుకున్నాడు చివరికి 10 14 లో వారిని ఓడించి 15 వేలమందిని బందీలను చేసి అందరి కళ్ళు పోడిపించి వందమందికి ఒక్కకన్ను మాత్రమె ఉంచి పంపించేశాడు .బర్గ్లర్ రాజు ఈ షాక్ తో చచ్చిపోయాడు .వాళ్ళ ధైర్యం సడలిపోయి బైజాన్టిక్ పాలనలోకి వచ్చారు అందుకే బేసిల్ ను బేసిల్ ది బగ్లర్ కిల్లర్ ‘’అన్నారు

 మొదటి కాన్ స్తాన్తిన్ ‘’చర్చ్ ఆఫ్ ది హోలీ  విస్డం ‘’ను చాలా ఎత్తైన ప్రదేశం లో రాజధానిలో కట్టించాడు .అయిదేళ్లపాటు నిర్మాణం జరిగి 5 37లో పూర్తయింది .21 ఏళ్ళ ఆతర్వాత చర్చి డోమ్ భూకంపం వలన కూలింది .శిల్పి నిరాశ చెందక మరింత పెద్దది కట్టాడు .ఇప్పటికీ ఇది ఉంది .సున్నిత రిం విండో లపై ఇది బహు నాజూకుగా ఉంటుంది .గాలిలో తేలుతున్నట్లే ఉంటుంది 18 ౦ అడుగుల ఎత్తులో  100 అడుగుల వ్యాసం తో .చర్చి అంతా బంగారం వెండి దంతం కళ్ళు చెదరే మొజాయిక్ తో సుందరాతి సుందరం గా ఉంటుంది వేలకొలది దీపాలతో ధగ ధగ లాడుతుంది .ఈ చర్చినే ‘’హేగియా సోఫియా ‘’అంటే సోఫియా ముని అంటారు .సోఫియా జ్ఞాపకార్ధం హోలీ  విస్డం అనే ఈ చర్చిని కట్టించాడు .14 53లో టర్కీల ఆక్రమణ తర్వాత ఇదే మసీదుగా మారింది

  జోర్డాన్ లో 2 వేల ఏళ్ళనాటి పెట్ర నగరం త్రవ్వకాలలో ఈ మధ్య బయట పడింది .అది పెద్ద సంపన్న వ్యాపార పట్టణం ఆరబబుల  రాజధాని పేరు నేబతెనియన్స్ .తర్వాత రోమన్ సామ్రాజ్య వశమైంది .ఇప్పటిదాకా పెట్రా నగరం భూకంపం వలన నాశనమైందని భావించారు ఈ త్రవ్వకాలలో అసలు విషయం తెలిసింది ఇది ప్రాచీన బైజాంటిన్ సామ్రాజ్యం లో ఉండేది .ఇందులోని చర్చి లోపలి గదులలో పాపిరస్ చుట్టలు కనిపించాయి.అగ్నిలో కొంతభాగం కాలి ఉన్నాయి ఇప్పటికీ వాటిని చదివే వీలు ఉంది ఈ వ్రాత ప్రతులు 53 7-5 9 4 కాలానివి .వేటిలో వీలునామాలు రసీదులు కాంట్రాక్ట్ పత్రాలు కనిపిస్తాయి .ధనవంతుల ఇళ్ళుఉన్నాయి  ఈ ప్రజలు చర్చి హాస్పిటల్ స్కూల్స్ నిర్మించటానికి ఆర్ధిక సాయం చేసిన దాఖలాలు కనిపిస్తాయి కొందరు మిలితరిలో పని చేసినట్లు ,బలమైన కోతలు ఉన్నట్లు  35 ౦ మంది బానిసల పేర్లున్నాయి అందులో ఆడవారు 27 మందిమాత్రమే   ఆకాలం లో పేత్రా ఆదాయం వర్త్కమేకాక వ్యవసాయం కూడా .6 వ శతాబ్దానికే అది విడిచి పెట్టబడిన నగరం కాలేదని ఆతర్వాత చాలా ఏళ్ళు నిలబడి ఉందని 19 93 త్రవ్వకాల ద్వారా తెలిసింది ఇంత సుదీర్ఘ సంస్కృతీ నాగరక చరిత్ర ఉన్నది బైజాంటిన్ సామ్రాజ్యం లో

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2ఇన్‌లైన్ చిత్రం 3

ఇన్‌లైన్ చిత్రం 4.ఇన్‌లైన్ చిత్రం 5ఇన్‌లైన్ చిత్రం 6

  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-17-కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బైజాంటిన్ నాగరకత -2

బైజాంటిన్  నాగరకత -2

క్రీ.పూ.6 5 8 లోనే బైజాంటిం లో గ్రీకు కాలనీ వాసులు స్థావరాలు ఏర్పరచుకున్నారు .క్రీ శ.2 93లో డయోక్లిటాన్ రోమన్ సామ్రాజ్యాన్ని వ్యవస్థీ కృతం చేశాడు 30 6 లో కాన్స్తాన్తిన్ చక్రవర్తి అయ్యాడు .312లో క్రైస్తవ మతం స్వీకరించాడు .32 4 లోమొత్తం రోమన సామ్రాజ్యాన్ని తన హస్తగతం చేసుకుని బైజాంటిం  ను రాజధాని చేసుకొని పాలించాడు ౩౩ ౦ లోదానికి  కాన్ స్టాంటి నోపిల్  అని పేరు పెట్టి  రోమన్ సామ్రాజ్యానికి నూతన రాజధాని చేసి పాలించాడు  .అంతకు అయిదేళ్ళక్రితం నికియాలో మొదటి ఎక్యూమేనికల్ కౌన్సిల్ సమావేశమై ఆర్ద డాక్స్ క్రిస్టియన్ మత౦  పై విశ్వాసం ప్రకటించింది . 392 లో పాగాన్ మతాన్ని ,దేవతలను దేవాలయాలను నిషేధించారు .413-434 మధ్య రెండవ ధియో డో సియస్ అనేకమైన నగర గోడలను కట్టించాడు 476లో రోమ్ఆస్ట్రో గోతస్ వశమై పడమటి రోమన్ సామ్రాజ్యం అంతమైంది .ఇక్కడ కాన్స్తాన్తిన్ తర్వాత జస్టినియన్ రాజ్యానికి 5 27 న వచ్చి 6 5 వరకు పాలించాడు .తరువాత చాలామందిపాలించారు 14 5 3 లో బైజాంటిన్ సామ్రాజ్యం కాన్ స్టాంటి నోపిల్ పట్టణం  అట్తోమాస్ టర్కుల స్వాధీనమై బైజంటిన్ సామ్రాజ్యం కను మరుగైంది . ఆ సంస్కృతిలో సాహిత్య విశేషాలు ఇంతకూ ముందే తెలుసుకున్నాం .

                                  చట న్యాయాలు

 ఇప్పుడు చట్ట న్యాయాలు తెలుసు కొందాం .చట్ట ప్రకారం అందరూ నడవాలన్నది  ముఖ్య విధి .రోమన్ ల ను సంక్రమించిన అనేక చట్టాలు సూత్రాలు ఎలా మార్చాలన్న దానిపై మొదటి జస్టి నియాన్ చక్రవర్తి నిష్ణాతులైన వారితో ఒక కమిటీ వేసి తేల్చమన్నాడు .వారి సలహాలతో ఒక చట్టం ఏర్పరచాడు దీన్ని కోడ్ ఆఫ్ జస్టి నియాన్ అన్నారు .చట్టాలలో మానవత్వానికి అధిక ప్రాధాన్యత నిచ్చాడు .యేసు చెప్పిన సోదర ప్రేమ కు విలువ కల్పించాడు .వీటివలన స్త్రీలకు బానిసలకు ,అప్పులవాళ్ళకు అధికారానికి దూరంగా ఉన్న వర్గాలవారికి వెసులు బాటు కలిగింది .బలహీనులకు వెనుకబడిన వారికి బలవంతులు అధికార వర్గాలవలన బాధ తగ్గింది .మరణ శిక్ష అరుదు గా ఉండేది .ఒక వేళ మరణ శిక్ష విధిస్తే ప్రజలందరి సమక్షం లో అమలు చేసేవారు చాలా నేరాలకు శిక్ష అంగవైకల్యం కలిపించటమే .అంటే చెయ్యో కాలో కన్నో తీసెయ్యటం .అతి సహజమైన శిక్ష కళ్ళు తీసెయ్యటం ..దీనివలన బలమైన శత్రువు భయపడి మీద పడటానికి జంకేవాడు .బైబిల్ లో చెప్పిన ‘’ఇతరులను చంపే అధికారం నీకు లేదు ‘’అన్నదాని ని బాగా అమలు చేసేవాళ్ళు చావుకంటే వాడి మానాన వాడిని పోనిద్దాం అనే ఉదార బుద్ధి ఉండేది .క్రిస్తియన్లు ఒకరికొకరు సాయం చేసుకోవాలని ముఖ్యంగా బీదలను ఆదుకోవాలని ఉండేది .దీనికోసం స్కూళ్ళు హాస్పిటళ్ళు ,అనాధ శరణాలయాలు కట్టించారు ముసలివారికి  అదృష్ట హీనులకు ఆదుకోవటానికి ఆశ్రమాలు ఉండేవి .రెండవ జాన్ కంయునాస్ చక్రవర్తి 50 పడకల ఆసుపత్రి కట్టించి అందులో గదులు ఆపరేషన్ దియేటర్ ఏర్పరచాడు ఈ విషయం లో బైజాంటిన్ సామ్రాజ్యం పశ్చిమ యూరోపియన్ సామ్రాజ్యం కంటే చాలా ముందు చూపుతో వ్యవహరించి బాధిత దుఖిత జనాలను గొప్పగా ఆదుకోన్నది .

                                సంగీతం

  బైజాంటిన్ నాగరకత లో సంగీతానికీ ప్రాధాన్యం ఉన్నది .మత ఉత్సవాలలో గాయక స్వరం మాత్రమే ఉండేది .వాయిద్యాల  హోరు  ఉండేవికావు .ఆకాలం లో ఫ్లూట్ ,వయోలిన్ ,డ్రమ్స్ ,కొమ్ము బూరాలుమొదలైన వాద్యాలను మతేతర ఉత్సవాలలో మాత్రమే వాడేవారు .దియేటర్ ,బాన్కేట్ ,వినోదాలలో వాద్య సంగీతం బాగా ఉండేది .సంగీత కర్తలు మ్యూజికల్ నోటేష న్స్స్ రాసేవారు  .ఆకాలపు సెక్యులర్ సంగీతం ఇప్పుడు కనిపించదుకాని మత సంగీతం భద్రంగానే ఉంది .సంగీత సంప్రదాయం అవిచ్చిన్నంగా కొనసాగించారు .తూర్పు యూరప్ ఆర్ధడాక్స్ చర్చి లలో ఇంకా బైజాన్టిక్ సంగీతం వినిపిస్తుంది

                            కళ,నిర్మాణం

బైజాంటిన్ కాలపు సెక్యులర్ ఆర్ట్ ఇప్పుడు లేదు .ఎక్కడో కాన్ స్టాంటి నోపిల్ లోని రాజ ప్రాసాదాలలో మాత్రమె గోచరిస్తుంది .అదృష్టవశాత్తు మత సంబంధ కళ సజీవంగా నే ఉంది .కాన్ స్టాంటి నోపిల్ ను క్రైస్తవ మత కేంద్రంగా చేయాలని కాన్ స్తాన్తిన్ చక్రవర్తి తీవ్రంగా కృషి చేశాడు సృజనకు  మేధస్సుకు  చర్చి నిర్మాణాలకు చాలా డబ్బు ఖర్చు చేశారు .. చర్చి  విభిన్నంగా మధ్యలో చతురస్రాకారం పైన అతి పెద్ద డోమ్ ఉంటుంది .చర్చి లోపల ఉన్నవారికి తాము స్వర్గ ఖండం లో ఉన్నామని పిస్తుంది డోమ్ లోపలి భాగమంతా అందమైన చిత్రాలతో కళాక్రుతులతో స్వర్గమే నని పిస్తుంది .చర్చి లలో మేరీ కన్య ఒడిలో బాల యేసును పెట్టుకున్న శిల్పాలు చిత్రాలు ఎక్కువగా ఉంటాయి .యేసు క్రీస్తు క్రాస్ అనేది ఎక్కడా ఉండదు .ఇది ఆర్ద డాక్స్ చర్చి ప్రత్యేకత .మేరీ ముఖం లో విధాదం కనిపించటమూ వింతగానే ఉంటుంది .ఏదైనా చాలా హుందాగా ఉంటాయి

 బైజాంటిన్ నాగరత ప్రత్యేకత దాని మొజాయిక్ ఆర్ట్ ..చిత్రాలు కాని శిల్పాలు కాని దానితోనే చేస్తారు .చైనా చిన్న రంగు  క్యూబ్ లతో వీటిని కూరుస్తారు .అద్భుత రంగుల ప్రదర్శన తోబాటు బంగారు నగిషీ కూడా గొప్ప అందాన్ని చేకూరుస్తాయి .ప్లాస్టర్ పై పెయింటింగ్ ళు వేసి చక్కగా అతికిస్తారు .రోమన్ కళలో పాగాన్ మైదాలజి గాధలకు ప్రాముఖ్యం ఎక్కువ .నీటి జంతువులూ జంతువులతో హీరో పోరాటాలు ఎక్కువ . రోమన్ మొజాయిక్ ఆర్ట్ నేలమీద ఎక్కువగా ఉంటుంది .కాని బైజాంటిన్ మొజాయిక్ ఆర్ట్ గోడలపై ఎత్తైన డోమ్ లపై అద్భుతంగా రాణిస్తుంది .మొజాయిక్ ఆర్ట్ లో వాడే చిన్న చిన్న చతురస్రాకార ముక్కలను రాళ్ళనుందడి  రంగు గ్లాస్ నుంచి  సేరామిక్ నుంచి కోసి చేస్తారు .దీనినే  ‘’టేస్సేరా’’అంటారు .గోడలకు ప్లాస్టర్ బాగా పూసి తర్వాత ఇంకో రకమైన పేస్ట్ పూసి దానిపై డిజైన్ గీసి టేస్సేరా ముక్కలను దానిపై కలర్ ఫుల్ గా అ౦టిస్తారు .ఇదే మొజాయిక్ ఆర్ట్ .బైజాంటిన్ మొజాయిక్ ఆర్ట్ ప్రత్యేకత విపరీతంగా బంగారు రేకులను వాడటమే.వీరి ఈ కళఎక్కువగా గోడలపై డోమ్ లోపలా కనిపించినా ఇటీవల ఇస్తాంబులో అంటే పాత కాన్ స్టాంటి నోపిల్ లో త్రవ్వకాలలో 6 వ శతాబ్దికి చెందిన భవనం బయట పడి జంతువులూ  పురాణ చిత్రాలు   వేటగాళ్ళు చెట్లూ ఆడుకొనే పిల్లలు ,అనేక పనులలో నిమగ్నమైన వారు కళలో కనిపించారు నేలమీద కూడా బైజాన్టిక్ మొజాయిక్ ఆర్ట్  దర్శనమిచ్చి ఆశ్చర్య పరచింది .చక్ర వర్తులు మొజాయిక్ ఆర్ట్ ద్వారా బైజాన్టిక్ సంస్కృతిని సామ్రాజ్యమంతటా వ్యాపింప జేయాలని భావించారు .దూర ప్రదేశాలలో చర్చి నిర్మాణానికి టేస్సేరా పంపేవారుకాదు. శిల్పులనే పంపి అక్కడే తయారు చేయించేవారు .డమాస్కస్ లోని గ్రేట్ మాస్క్ లో ఇప్పటికీ బైజాన్టిక్ మొజాయిక్ ఆర్ట్ ,అందులో చెట్లు ,నదులు ,భవనాలు మరింత అందంగా కనిపిస్తాయి .

 బైజాంటిన్ ఆర్ట్ లో పుణ్య పురుషుల విగ్రహాలకు ప్రత్యేకత ఉంది వీటిని చెక్కపై చక్కగా చెక్కారు .చర్చి లలోనే కాక ఇళ్ళల్లోనూ వీటిని ఉంచుకోనేవారు .ఇవి చిన్నవిగా ఎక్కడికైనా తీసుకు పోవటానికి వీలుగా ఉండేవి .బైజాంటిన్ ఆర్ట్ లో చిత్రాలను చూస్తే మొదట్లో మనకు ఆశ్చర్య మేస్తుంది అవి చిన్నపిల్లలా చేస్టల్లాగా ఉంటాయి .వికృతంగా కనిపిస్తాయి .ఏమిట్రా బాబూ ఇది కళా లేక కాకర కాయా అని పిస్తుంది .కాని కళ పరమార్ధం వారికి వేరు గా ఉంటుంది అది మతానికే అరిమితం .ఏదైనా పవిత్రంగా ఉండాలి .అందుకని మానవాక్రుతులలో నిజం కంటే ఆబ్ స్ట్రాక్ట్ ఆర్ట్ ఉంటుంది .దేవతలు చక్రవర్తుల ఖరీదైన దుస్తులతో కిరీటాలతో  ధగ ధగ మెరిసే అలంకారాలతో వ్యక్తుల్గా కాకుండా గొప్పతనానికి చిహ్నాలుగా తయారు చేస్తారు .

 ఆవ శేషాలు లేక రేలిక్స్ లో బైజాంటిన్ కళ మూఢ నమ్మకాలు కనిపిస్తాయి .కలలు,అద్భుతాలు జోస్యాలను బాగా నమ్మేవారు .సన్యాసులను పవిత్ర శీలురుగా భావించేవారు .వారికి దివ్య శక్తులున్నాయని నమ్మేవారు .ఎప్పుడూ ఏదో ప్రమాదం అకస్మాత్తుగా మీద పడుతుందనే భయం వారిలో ఉండేది .నిరంతరం టెన్షన్ లో ఉండి,అతీత శక్తులు కాపాడాలని భావించేవారు ..

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2ఇన్‌లైన్ చిత్రం 3ఇన్‌లైన్ చిత్రం 4ఇన్‌లైన్ చిత్రం 5

 సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బైజాంటిన్ నాగరకత

బైజాంటిన్ నాగరకత

రోమన్ సామ్రాజ్యం రోమ్ నగరం నుండి పాలి౦ప బడింది .అందులో యూరప్ ,ఉత్తర ఆఫ్రికా ,పడమటి ఆసియా లున్నాయి .యూరప్ లో జర్మన్ కొండ జాతులు సరిహద్దులను ఆక్రమించటం ,సిరియా ,ఈజిప్ట్ లు రోమన్ రాజ్యాన్ని వ్యతిరేకించటం తో కల్లోలం సంక్షోభామేర్పడి రోమన్  సామ్రాజ్యం ప్రాభవం కోల్పోయింది .క్రీపూ 28 4 లో దియోక్లిటన్ అనే బలమైన చక్రవర్తి కల్లోల రోమ్ నగరం వదిలి పడమర వైపున్న అనటోలియా నుండి పాలన సాగించాడు .తర్వాత సామ్రాజ్యానికి ఇద్దరు చక్రవర్తుల ఉండాలని ప్రకటించాడు .పడమటిభాగామైన ఇటలి ,పడమటి యూరప్   బ్రిటన్ ఉత్తర ఆఫ్రికాలకు ఒక రాజు  తూర్పు భాగమైన బాల్కన్స్  అనటోతోలియా  సిరియా ,పాలస్తీనా ,ఈజిప్ట్ లకు మరో రాజు ఉండాలని ప్రతిపాదించాడు ..30 5 లో దయోక్లిటాన్ స్వచ్చందంగా  పదవి  నుంచి తప్పుకున్నాడు .పడమటి సామ్రాజ్యం లో బ్రిటన్ చక్రవర్తి 30 6 లో చనిపోగా సైన్యాధికారులుఅతనికొడుకు   యువకుడైన  కాన్ స్టాన్ టిన్ ను ను వారసునిగా ప్రకటించింది .ఆతను ఆతర్వాత 18 ఏళ్ళు ఏక చట్రాదిపత్యంగా రోమన్ సామ్రాజ్యాన్ని పాలించాడు .తూర్పు భాగం లోనే ఉంటానని కొత్త రాజధాని కావాలని భావించి  బైజాంటిం అనే అనువైన చోట మహానగరం నిర్మించి అన్ని సౌకర్యాలు కలిపించాడు  .ఈ నగరం ఎన్నో ఆటు  పోట్లకు గురై నిలబడింది. ఇది ఆగాన్ సముద్రం నల్ల సముద్రం మధ్య  స్ట్రాటేజిక్ పాయింట్ గా ఉన్నది .గొప్ప హార్బర్ ఉండటం అదృష్టం .ఈ నగరానికే తర్వాత తనపేరు కలిసోచ్చేట్లు కాన్ స్టాంటి నోపిల్ అని పే రుమార్చాడు .అతనిని” కాన్ స్టాన్ టిన్ ది గ్రేట్ ”అన్నారు . ” దీన్ని గోల్డెన్ సిటి అనేవారు . అప్పటి నుంచి  నుంచి దీన్ని  బైజాన్టిక్ సామ్రాజ్యం  లేక బైజాంటిం అన్నారు .క్రీ శ 14 53 లో 9 వ కాన్ స్టాంటి న్ తో బైజాన్తిక్  సామ్రాజ్యం  పూర్తిగా నాశనమైంది . కాని అది ఏర్పరచిన కళా సంస్కృతీ నాగరకత తరతరాలుగా నిలిచి దాని ప్రాభవాన్ని చాటింది .

 భూమిపై భగవంతుని రాజ్యమేర్పరచాలన్న ధ్యేయం తో సామ్రాజ్యం ప్రారంభమైంది .క్రైస్తవమతమే రాజుకు ప్రజలకు మతం .వేష భాషలన్నీ గ్రీకు తరహా .మొజాయిక్ కళ దీని ప్రత్యేకత .అనేక చర్చిలు ధ్యానమందిరాలు నిర్మాణమయ్యాయి వివాహం సంతానం  విద్య తో సామ్రాజ్యం వికసించింది .రోమ్ లో కేధలిక్ మతం ఉంటె ఇక్క ఆర్ధడాక్స్ క్రైస్తవ మతం ఉంది .సరైన విశ్వాసం ఉంటె మతం ద్వారా స్వర్గానికి వెళ్ళవచ్చు అని ప్రజలూ నమ్మారు ఆచరించారు .దీనిపై పబ్లిక్ గా  చర్చలూ జరిగేవి మెజారిటీని అనుసరించారు రాజు దైవ ప్రతినిది .తమ పూర్వ వారసత్వ సంపదను తరతరాలుగా కాపాడుకోవటం వీరు చేసిన మంచిపని .సాహిత్య ,తత్వ శాస్త్ర  సైన్స్ ,చరిత్ర లన్నీ ప్రాచీన గ్రీకు ,రోమన్ల లనుండి సంక్రమించాయి  .తమ నాగరకతను చూసి గర్వపడే వారు బైజాన్టిక్ స్కూళ్ళు  యూని వర్సిటీలు క్లాసికల్ రచయితల రచనలతో ఉండేవి విద్యార్ధులు వీటినాదారంగా విజ్ఞానం పొందేవారు .ధనవంతులు ఇంటివద్దే విద్య నేర్చేవారు .425 లో ప్రారంభమైన కాన్ స్టాంటి నోపిల్ యూని వర్సిటి ధర్మ శాస్త్రం  మానవీయ విజ్ఞానం లను బోధించింది .సంఘం లో అన్ని తరగతుల వారూ విద్య కొద్దోగొప్పో నేర్చుకొనేవారు .చదువుకోవటం గొప్ప గౌరవం అని భావించేవారు .దేనిలో నైపుణ్యం ఉంటె వారితోనే ఆపని చేయించేవారు .మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలూ చదువుకునేవారు పై అంతస్తు మహిళ౦దరికి చదవటం రాయటం వచ్చు సాహిత్య పరిజ్ఞానం ఉండేది మగవారితో సమానంగా విషయాలపై చర్చించేవారు .

 వీరి సాహిత్యం ఎక్కువభాగం గ్రీకులోనే ఉంది పెద్ద పెద్ద భవంతులలో ప్రాచీన వ్రాత ప్రతులు అనేక గదులలో ఉండేవి .సాహిత్యం లో ఎక్కువభాగం మతానికి సంబంధించిందే ఉన్నా నిఘంటువులు విజ్ఞాన సర్వస్వాలూ  తేనే టీగల పెంపకం ,మిలిటరీ సైన్స్ పుస్తకాలున్నాయి .కవిత్వమూ ప్రచారం లో బాగానే ఉంది .ప్రేమ గీతాలు కథా గీతాలు  వీరుల గీతాలు ఉన్నాయి స్త్రీ కవులలో కాస్సియా ప్రసిధి చెందింది అంద౦గా ఉండటం వలన రాజు ఆమెను రాణీ ని చేసుకొందామనుకొన్నాడు కాని ఆమెకు అతీంద్రియ శక్తి ఉన్నందున గ్రహించి ఆ ప్రతిపాదనను తిరస్కరించి  కాన్ స్టాంటి నోపిల్ లో ఒక కాన్వెంట్ స్థాపించి అక్కడే చదువుకొంటూ రాసుకొంటూ జీవితం గడిపింది .ఆమె కవితలు చాలా భావ గర్భితంగా మతాతీతంగా ఉండేవి అందంగా ఉండటం లో తప్పూ ఒప్పూ గురించీ రాసింది

 పూర్వం వారి చరిత్రలను భద్ర పరచుకోవటం వారికిష్టం .ఆ వ్రాత ప్రతులను భద్ర పరుస్తారు .ప్రాచీన గ్రీకు రోమన్ చరిత్ర కారులైన హియర్ దోటాస్,తూసి డైడ్స్ తాసిటస్ ల  ప్రభావం ఎక్కువ .అనేక చోట్ల నుండి విషయాలు సేకరించటం ,ఇతర రచయితల రచనలు కాపీ చేసి ఉంచుకోవటం వారికి ఇష్టమైన పని కాని ఎందులో నుండి ఎవరి రచన కాపీ చేశారో రాయరు .బైజాన్ టిన్ విద్యావేత్తలు తమకాలపు విషయాలన్నీ రాసి భద్ర పరచారు .వీరి చరిత్రకారులలో ప్రసిద్ధుడు ప్రోకోపియాస్ మొదటి  జస్టినియన్ చక్రవర్తికాలపు వాడు చక్రవర్తి కట్టించిన భవనాలు రాజప్రాసాదాలు చర్చిలు ,యుద్ధాల గురించి విస్తృతంగా రాశాడు .అతని కలా నికి రెండు వైపులా పదును ఉంది .రాజుగారి చీకటి కోణాన్నీ’’సెక్రెట్ హిస్టరీ గా  వెలుగులోకి తెచ్చాడు .అందమైన  ,స్థిర చిత్తం గల రాణి దియోడ్రాపై ఆశ్చర్యకరమైన అశ్లీల కట్టుకథలూ రాశాడు .11 వ శతాబ్దికి చెందిన విద్యా వేత్త మైకేల్ సెల్ల్స్ తెలివిగాలవాడే కాని విద్యా గర్వం ఉన్నవాడు .యూని వర్సిటి లో పని చేసి చారిత్రిక విషయాలు రాసి పత్రికలూ ప్రచురించాడు .రాజుల వద్ద మెప్పుపొంది రాజకీయం చలా యించేవాడు .చక్రవర్తులలో ఏడవ కాన్ స్టాంటి న్, మాన్యుయల్ కామస్ లు గొప్ప విద్యా వేత్తలు కొందరు రాయటం  చదవటానికే  సమయం ఎక్కువ ఇచ్చి పాలన పక్కన బెట్టేవారు .

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వెంగమాంబ ,మొల్ల ,విశ్వనాధ పోస్టల్ స్టా0ప్ లు విడుదల

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -3 12 4-క్షణ విముక్తి నవల రాసిన -హెచ్ వి .నాగ రాజా రావు (19 42)

గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -3

12 4-క్షణ విముక్తి నవల రాసిన -హెచ్ వి .నాగ రాజా రావు (19 42)

నాగారాజారావు 10-9-19 42నకోలారు జిల్లా సోమేన హళ్లి లో జన్మించాడు .వెంకట నారాయణప్ప  లక్ష్మమ్మ తండ్రీ తల్లి .మైసూర్ సంస్కృత కాలేజి నుంచి వ్యాకరణ ,అలంకార శాస్త్రాలలో విద్వాన్ అయి ,మైసూర్ యూని వర్సిటి ,అమెరికాలోని సియాటిల్ యూని వర్సిటీల నుంచి ఏం ఏ అయి ,మైసూర్ ఓరియెంటల్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ లో సీనియర్ రిసెర్చ్ స్కాలర్ అయ్యాడు .సంస్కృతం లో విదులాపుత్రీయం ,సముద్యతా ,,దాంపత్య కలహం అనే నాటకాలు రాశాడు .బొంబాయ్ భారతీయ విద్యాభవన్ వీటిని ప్రచురించింది .వరన్వేషణం ,మాలవికధ అనే రెండు కధలుకూడా రాశాడు .క్షణ విముక్తి నవల ,శారదా దర్శనం అనే యాత్రిక సాహిత్యం ,ఉపాఖ్యాన యుగ్మకం అనే వచన రచన ,సిద్ధ గంగాయాః సుధా చేతనాఃఅనే సిద్ధ గంగ స్వామీజీ జీవిత చరిత్ర రాశాడు .

 వేంకటాధ్వరి సుభాషిత కౌస్తుభం ,అన్యాపదేశ శతకం  నీలకంఠ దీక్షితుని ఆనంద సాగర స్తవం,లకు సంపాదకత్వం చేశాడు .వేడ వేదాన్గాలపై ఆయన రాసిన పరిశోధనా  పత్రాలను బెంగుళూర్ భారతీయ విద్యాభవన్ ప్రచురించింది .హెచ్ ఏం నాయక కన్నడ రచన ;;నమ్మ మనేయ దీప ‘’ను’’అస్మాకం గృహం దీపః ‘’గా  సంస్క్రుతీకరించాడు .చిన్న కధలు రాసే ప్రసిద్ధ కధకుల చేత కధలురాయించి ‘’విపంచిక ‘’గా ప్రచురించాడు .అలాగే అప్పయ్య దీక్షితుని వరద రాజ స్తవం ,నీల క౦ఠదీక్షితుని రామాయణ సంగ్రహం ,రఘు వంశ స్తుతి ,గౌరీ శంకరస్వామి భావనా లహరి ,శంకరాచార్యుల ‘’శివ పాదాది కేశాంత స్తోత్రం ‘’లను కన్నడీకరించాడు .

 శేఖావతీ సంస్కృత యూని వర్సిటి ‘’వేద వ్యాస ప్రశస్తి పురస్కారం అందజేసింది విజిటింగ్ ప్రొఫెసర్ గా చికాగో ,విస్కాన్సిన్ జెరూసలెం యూని వర్సిటీలకు వెళ్లి బోధించాడు .వరాన్వేషణం లో కట్నాలు ఇవ్వలేక పెళ్లి కొడుకులు దొరక్క తల్లి దండ్రులు పడే బాధలు చూపాడు .ఉద్యోగ పర్వం లోని విదుల అనే ఉత్తమ స్త్రీ కద ‘’విదులా పుత్రీయం ‘’.వార్తాపత్రికలలో వచ్చే సమకాలీన విషయాలపై రాసింది ‘’సముద్యతా ‘’.భార్యా భర్తల ‘’డిషుం  డిషుం’’కథ’’దాంపత్య కలహం ‘’.ఊర్వశి ,శకుంతల ల గురించి ఉపాఖ్యాన యుగ్మకం వచనం లో రాశాడు .ఎవరూ ముట్టుకొని ,ఎవరూ రాయని అరుదైన విషయాలపై రాయటం నాగ రాజారావు పత్యేకత .

ఇన్‌లైన్ చిత్రం 1

125- పంచ భాషా కవితా వల్లభ-ఆర్యార్ శ్రీ రామ శర్మ -(19 43 )

కర్నాటక లోని మెల్కోటే లో ఆర్యార శ్రీరామ శర్మ 19 43 ఆగస్ట్ 28 జన్మించాడు .తండ్రి శ్రీనివాస అయ్యంగార్ .సాహిత్య ,న్యాయ ,విశిస్టాద్వైతాలలో ఏం ఏ .మెల్కోటే సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ పంచ భాషా కవితా వల్లభ ,బిరుదు సంస్కృత ప్రాకృత కన్నడ తమిళ హిందీ భాషలలో రచనలు చేయటం వలన పొందాడు .సంస్కృతం లో అస్మత్ చంపు ,కదా కదంబకం  కథా సాహిత్యం గాలి శతకం ,పాంచ జన్య శతకం ప్రకీర్ణ కల్లోలిని హంస ప్రతి సందేశః ,క్షుద్రకాంత ,క్షుద్ర కాదంబరి శ్రీ విజయ ధ్వని మొదలైనవి రాశాడు .

 సంస్కృత విమర్శన గ్రంధాలుగా సంస్కృత కదా ప్రబంధం ,శాస్త్ర ప్రబంధం ,లఘుకావ్య ప్రబంధం ,సంశోధన ప్రబంధం విమర్శన ప్రబంధం ,ధ్యాని ప్రబంధం ఇతిహాస ప్రబంధం ,సాహిత్య మాత్రిక రాశాడు .ప్రాకృతం లో ప్రాకృత ముక్త వచయః ,ప్రాకృత పుష్పా పచయః రాశాడు ప్రాకృతం లో విశ్లేషణాత్మక విమర్శనాత్మక రచనలూ చేశాడు .రాజ శేఖరుని కావ్య మీమాంసను కన్నడీకరించాడు .కన్నడం లో విస్తృత కవితలు వ్యాసాలూ రాశాడు .పింగళ భారత ,రహస్య రత్నమాల మొదలైన తమిళ రచనలు ,హిందీలో చాలా వ్యాసాలూ రాసి సంపుటులుగా తెచ్చాడు .

 కావ్య కల్లోలిని  స్వయం సంస్కృత కవితలు వాటిని7  కల్లోలాలు అంటే7  అధ్యాయాలు-మంగళ ,వస్తు గీత ,కథ ,సంస్కృత ,,శృతి ,ప్రకీర్ణ కల్లోలాలుగా గా విడగొట్టాడు వీటిని శృంగారం అంగారం దేశభక్తి సమకాలీనత ,ఆధ్యాత్మికత ,హాస్యం అన్నీ రంగరించి రాసినవి .అస్మత్ చంపు లో  సాంప్రదాయత ఆధునికత జోడించాడు .రామానుజా చార్యుల జీవితం ,విశిష్టాద్వైత మత విషయాలున్నాయి .చివరిది ‘’నిద్రా వైభవం ‘’లో విష్ణు మూర్తి దశావతారాలు వివిధ భంగిమలు వర్ణిస్తూ  మానవుని మేల్కొలపటానికి జాగృత పరచటానికి రాశాడు

ఇన్‌లైన్ చిత్రం 2

.

 సశేషం

  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -25-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -3 12 0- భూకైలాస నాటక కర్త -సాంబ దీక్షిత్ (19 34 )

 గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -3

12 0- భూకైలాస నాటక కర్త -సాంబ దీక్షిత్ (19 34 )

 19 34 ఫిబ్రవరి 14 న సాంబ దీక్షితులు కర్నాటక లోని గోకర్ణ క్షేత్రం లో జన్మించాడు .తండ్రి దామోదర దీక్షితులు .ఋగ్వేద ఘనాపాటి ,వ్యాకరణ విద్వాన్ .భాష్య కావ్య తీర్ధ ,హిందీ సాహిత్య విశారద .గోకర్ణ మేధా దక్షిణామూర్తి సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ గా  మహర్షివేద యూని వర్సిటి వైస్ చాన్సలర్ గా ఉద్యోగం .బెంగుళూరు వేద ధర్మ పరిపాలన సభ ‘విద్యా వారిది’’,,గోకర్ణం విద్వత్ సభ ‘’వేద విద్వాన్ ‘’ బెంగుళూరు భారతీయ విద్యాభవన్ ‘’వేద రత్న ‘’పురస్కారాలు ఇచ్చాయి .

 దీక్షితులు సంస్కృతం లో ‘’నిత్యానంద చరితం ‘’లఘు కావ్యం  తోపాటు మూడు నాటకాలు -మహాగణపతి ప్రాదుర్భావం ,భూకైలాస శతకం ,వర దక్షిణనాటకం రాశాడు చివరిది సాంఘిక నాటకం ,అగ్ని సహస్రనామాలు అగ్ని రాజసూయం ,గృహ్యాగ్ని జార ,వాయుజ సహస్ర నామ స్తోత్రాలను తన సంపాదకత్వం లో ప్రచురించాడు .మహారాష్ట్రలోని స్వామి నిత్యానంద ఆశ్రమమహిమలను వివరించినదే ‘’నిత్యానంద చరితం ‘’.గోకర్ణ క్షేత్ర పురాణగాధ ఆధారంగా ‘’భూకైలాసం రాశాడు .సాంబ దీక్షితులు నిత్యాగ్ని హోత్రి .మహా వేద విద్వాంసుడు .

121-బసవ భాస్కరోదయ  మహా కావ్య కర్త –పరాడ్డి మల్లికార్జున (19 40 )

పరాడ్డి మల్లికార్జున 19 40 లో కర్ణాటకలో సావడి లో పుట్టి ,సంస్కృతం లో ఏం ఏ పి హెచ్ డి చేసి దార్వార్  సంస్కృత యూని వర్సిటి ప్రొఫెసర్ అయ్యాడు .బసవ భాస్కరోదయం అనే మహా కావ్యం,గంగాధర ,చెన్న విలసదమొదలైన శతకాలు ,సంస్కృత కావ్యమాలిక ,సంస్కృత కావ్య మందాకినీ కావ్యాలు రాశాడు .కబీర్ కవితల్ని కబీర్ దా శతక గా అనువదించాడు .దీనికి సాహిత్య అకాడెమి అవార్డ్ పొందాడు .అక్కమహాదేవి ,బసవేశ్వర శతకాలు కన్నడం నుంచి సంస్కృతంలోకి మార్చినవి   .మల్హనా స్తోత్రం చిత్రగ్రీవ విజయం ,జగద్గురు సిద్దేశ్వర చంపు లకు సంపాదకత్వం వహించాడు .విశ్వారాధ్య విశ్వ భారతీ పురస్కార గ్రహీత మల్లికార్జున .

 బసవ భాస్కరోదయం 16 కాండల బసవని చరిత్ర కావ్యం.వైవిధ్య ఛందస్సులతో రాసీభూత రసానందం కలిగించాడు .గంగాధర శతక నాయకులు గంగాధర రాజ యోగీంద్రులు . 16 వ జనం దినం నాడు రాశాడు .స్వామీజీ బహుభాషా పాండిత్యాన్ని తెలియ జేశాడు .స్వామి నిర్మించిన సత్రాలు లైబ్రరీలు హాస్పిటల్స్ హాస్టల్స్ వివరాలన్నీ పేర్కొన్నాడు .మతసామరస్యానికి సంస్కృత వ్యాప్తికి స్వామీజీ చేసిన కృషి వివరించాడు .సంస్కృత కావ్య మందాకినీవివిధ అంశాలపై రాసిన  32 శ్లోకాల సమాహారం .’’విరలో మనీషా ‘’అనేది డా సర్వే పల్లి రాదా కృష్ణన్ మహోన్నత వ్యక్తిత్వాన్ని తెలియ బరచే ఘన నివాళి .శైవు డైన మల్లికార్జున పరాడ్డి గొప్ప కవి అనువాదకుడు ,పరిశోధకుడు ..ఆధునిక సంస్కృత మహా విద్వాంసుడు కవి’’ అభి రాజేంద్ర మిశ్ర ‘’మచ్చ రాదేయం సుకవి సుహ్రుదయం చ పి సౌమ్యం పరాడ్డిం’’అని ఘనంగా మల్లికార్జునుని కీర్తించాడు .

12 2 -ధర్మ శాస్త్ర విద్వాన్ -గణపతి పాథక్(19 41)

శంకర గణపతి పాధక్ 19 40 లో కర్ణాటకలో జన్మించాడు సాహిత్యం లో శిరోమణి ,ధర్మ శాస్త్రం లో విద్వాన్ .,సంస్కృతం లో ఏం ఏ .సంస్కృతం లో శ్రీ హరి హరేశ్వర సుప్రభాతం హర నర్తన ,వసంత తిలక ఛందస్సులో 38శ్లోకాలతో పాటు దండకం తో  కావ్యం  రాశాడు .కర్ణాటకలోని కారకాలలో ఉన్న హరిహర నాద  దైవం పై రాసిన కావ్యమిది .మహా రాష్ట్ర నుంచి వచ్చి స్తిరపడిన చిత్పావన బ్రాహ్మాణుల గ్రామం ఇది  వేదాధ్యయనానికి బాగా ప్రసిద్ధి .చిత్పావనుల ముఖ్యఆరాధ్య  దైవం హరిహరనాధుడు .సుప్రభాతం లో స్వామి మహిమ ఈ క్షేత్ర మహిమ  అంతా కళ్ళకు కట్టినట్లు ఉంటుంది .కవి దీనిని కన్నడం లోకి కూడా అనువదించాడు .

12 3 -తేజస్సంక్రమం  కర్త -గురుపాద హెగ్డే (19 41)

గురుపాద హెగ్డే 19 41 లో మే 18 నజన్మించి ,సాగర్ లోని లాల్ బహదూర్ శాస్త్రి కాలేజిలో విద్యాబోధన చేశాడు .-సంస్కృతం లో ‘’తేజస్సంక్రమః ‘’అనే నాటకం ,ఆధ్యాత్మ సోత్ర మంత్రం భావ గీతం రాశాడు సంస్కృత సాహిత్య విమర్శగా ‘’శ్లేష సిద్దాన్తః ;;మరియు కన్నడ వాజ్మయ వికాసే సంస్క్రుతస్య ప్రభావః ‘’రచించాడు .కొన్ని గీతికావ్యాలు రాశాడు .కన్నడ రచనలూ చేశాడు .సంస్కృతం లో ‘’పన్ అండ్ శ్లేష ఇన్ సాంస్క్రిట్ ‘’రాశాడు .కర్నాటకరాస్త్ర పురస్కారం పొందాడు .తేజస్సంక్రమః ఏకాంకిక .రామ పరశురామ సంవాదం రేడియోలో ప్రసారమైంది అనేక చోట్ల ప్రదర్శింప బడింది  భావగీతాలు హెగ్డే రాసిన భక్తీ గీతాలు .

  సశేషం

 మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -25-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

షార్లెట్ లో శ్రీశంకర జయంతి

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2

జగద్గురు శ్రీ శంకరాచార్య జయంతి -ఆహ్వానం

వైశాఖ శుద్ధ పంచమి శ్రీ శంకర జయంతి సందర్భంగా షార్లెట్ లో మా అమ్మాయి ,ఛి సౌ విజయలక్ష్మి అల్లుడు శ్రీ కోమలి సా౦బావధాని స్వగృహం లో 29-4-17 శనివారం నాడు శ్రీ శంకరాచార్య జయంతిని నిర్వహిస్తున్నారు .

                                   కార్య క్రమం

ఉదయం 7 గం లకు -సుప్రభాతం -శ్రీమతి సౌమ్య

                8 గం లకు -గణపతి అధర్వ శీర్షం ,నవగ్రహ నక్షత్రేస్టి

                10 గం లకు -ఉపనిషత్ సూక్త పఠనం -శిక్షా ,ఆన౦ద  భ్రుగు ,మన్యు ,శ్రీ దుర్గా ,పురుష సూక్తాలు

                11-30 లకు -నమక ,చమక  శత రుద్రీయం

మధ్యాహ్నం 1.గం లకు – అరుణం ,ఆదిత్య హృదయం పారాయణ

                     2-30 గం లకు -ఆధ్యాత్మ ప్రసంగం  -శ్రీ ,సిద్ధార్ధ శర్మ

                     3 గం లకు -ప్రార్ధానా గీతాలు -పిన్నలు ,పెద్దలు

సాయంత్రం 4-30 గం లకు -శంకరా చార్య అష్టోత్తర పూజ -శ్రీ శంకర స్తోత్ర పఠనం

                      6గం – లకు -నైవేద్యం హారతి ,మంత్రం పుష్పం

                      6-30 గం లకు -మహా ప్రసాదం

 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 119-సోమలతను గుర్తించిన ఆధునిక వైద్యుడు -వైద్య భైరవ దత్త (19 40 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3

119-సోమలతను గుర్తించిన ఆధునిక వైద్యుడు -వైద్య భైరవ దత్త (19 40 )

వైద్య భైరవ దత్త హిమాలయ మూలికలపై సాధికారత కలవాడు .లివింగ్ అధారిటి .ఒకసారి స్వామి రామాతో తాను సోమలత ను తెస్తానని దాని ఫలితాలు చూపిస్తానని అంటే స్వామి డబ్బు ఇచ్చి పంపాడు సోమలత హిమాలయాలలో 11 వేల అడుగుల ఎత్తుప్రదేశాలలో ఒకటి రెండు చోట్ల మాత్రమేపెరుగుతుంది .యజ్ఞాలలో సోమరసం వాడటం అందరికి తెలిసిన విషయమే .వేదం లో చాలాసార్లు దాని ప్రస్తావన వస్తుంది .అన్నట్లుగా నే దత్త ఒక పౌను  బరువు గల సోమలతను శోధించి సాధించి తెచ్చాడు

  సోమలత నుంచి సోమ తయారు చేసి మార్జువానా ,హషీష్ లకు అలవాటు పడిన సాదువులపై ప్రయోగించారు .అది వారిలో  భయ రాహిత్యాన్ని కలిగించింది .పాశ్చాత్యులు ‘’సైకేడిలిక్ మష్రూమ్స్ ‘’ పై పరిశోధించి చెప్పినట్లే ఈ సాధువులూ ప్రవర్తించారు . అయితే హిర్బాలజిస్ట్ దత్త మాత్రం అనేక రకాల మష్రూమ్స్ ఉన్నాయని అవీ ఇలాంటి ప్రబావాన్నే కలిగిస్తాయని సోమలత ఆ కుటుంబానికి చెందిన్దికాదని ఇది ప్రత్యేకమైనదని తెలియ జేశాడు సోమలత కుంచించుకు పోయే స్వభావం ఉన్న జాతికి చెందినది అన్నాడు . .అనేక ఆయుర్వేద గ్రంధాలలో వివిధ పుట్టగొడుగుల విషయాలన్నీ ఉన్నాయి వాటిని వాడిన వారికి సైకిక్ అనుభవాలు కలుగుతాయి అని చెప్పబడింది .కాని వాటిలో సోమలత పేరు లేదు .మిగతా ముడుచుకుపోయే రకాలు ఈ ప్రభావాన్ని కలిగించవు .అగారికస్ హైషిమస్ .స్ట్రామోనియం అనేవి విష పూరితమైనవి కాని కొద్ది మోతాదులో సేవిస్తే  భ్రాంతి విభ్రమ కలిగిస్తాయి .సరైన మొతాదులోనే వాడాలి లేకపోతె వీటివలన ప్రాణ హ్హాని తప్పదు .

  సోమ ,పాదరసాలను ఎలా వాడాలో అనేక రకాలుగా మనవాళ్ళు వర్ణించి వివరించారు .యోగ విధానం లో ఇలాంటి బయటి ప్రేరకాల వాడుక నిషేధం .కొద్దిమంది కింది స్థాయి సాధువులు వీటిని వాడి మత్తుగా స్తబ్దుగా ఉండిపోతారు తప్ప యోగ సాధనలో వృద్ధి పొందలేరు .అలాగే హోమియోపతి వైద్యం లో ఆర్సెనిక్ 10 ఏం, గరళం అతి తక్కువ డోసు లో  చనిపోయే రోగికిస్తే భయం నుంచి బయట పడతారు ..గ్రీకులు ఈజిప్ట్ వారూ దీన్ని రోగులపై ప్రయోగించారు .అలాగే సోమ రసాన్ని వాడితే మనసు  అంతర్ముఖమఔతున్దని హిమాలయ హీర్బాలజిస్ట్ లు వాడుతూ ఉంటారు .వారి ఉత్సవాలలో కూడా దీన్ని పవిత్రంగా వాడి నట్లు ఆర్యుల చరిత్రలో ఉన్నది .

 పతంజలి మహర్షి కూడా యోగ సూత్రాలలో నాలుగవ అధ్యాయం మొదటి శ్లోకం లో ఔషధీ వనమూలికల నుండి తయారు చేయబడిన మందు మానసిక అనుభావలనిస్తుంది అని చెప్పాడు .అయితే ఇది తాత్కాలికమే కనుక దీనిపై ఆధారపదరాదన్నది ముఖ్య విషయం. సాధనే దారి .ప్రాచీన సాహిత్యం లో సోమరసాన్ని తెలివి తక్కువ విద్యార్ధులకు అంటే  కుదురుగా  ఆసన బద్ధులుగా ఎక్కువ సేపు కూర్చోలేని వారికి  ఇస్తే ,అది వారి నాడీ వ్యవస్తపై ప్రభావం చూపి ,అనేక విధాలుగా పరిగెత్తే మానసిక ఆలోచనలు ఏకీక్రుతమౌతాయని చెప్పబడి ఉంది .అప్పుడు శరీరం స్వాధీనమై చెప్పినట్లు విని బాధ లేకుండా కూర్చోవటానికి వీలవుతుంది .కనుక ఇలా నిష్టగా ఆసన బద్దులు కాలేని వారు సాధనకు ముందే చేసే కొన్ని కార్య క్రమాలలో సోమరసాన్ని తీసుకుంటారు .దీని వాడకం ఇష్టం వచ్చినట్లు చేయరాదు హిర్బాలజిస్ట్ సలహాపైనే వాడాలి

 వైద్య  భైరవ దత్త ఇలాంటి ప్రేరకాలను మంత్రాలతో జోడించి రోగులకు వాడుతాడు .ఈ మంత్రాలను ఒంటరిగా ఉండి ఉపవాసం తో చదువుతాడు .దీనికి తోడూ కొన్ని తంత్ర క్రియలూ చేస్తాడు .కొందరు సాధువులు ఈ ప్రక్రియలో చాలా అనుభవం సాధించిన వారున్నారు .ఈ విధానం అంతా లేకుండా వాటిని వాడితే పరమ ప్రమాదం .నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి .భ్రమలు పెరిగి సైకిక్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ..కొందరికి భావాతీత అనుభవాలు కలగవచ్చు కాని యోగికి అవి సహకరించవు .తరువాత వ్యతిరేక ప్రభావం కలిగిస్తాయి .

 భైరవ దత్త తానూ చాలా సార్లు సోమ రసాన్ని నిర్భయంగా వాడానని మంచి ధనాత్మక ఫలితాలిచ్చాయని ఉన్నత స్తితికలిగిందని చెప్పాడు స్వామి రామ తో .కాని దాన్ని పదే పదే వాడితే వ్యతిరేక ఫలితం కలగటం ఖాయమని చెప్పాడు  మానసిక రోగాలు వస్తాయన్నాడు ..

 ఒక రోజు ఉదయం దత్త’’ అస్టావర్గ’’రసం తయారు చేసి దానిలో సోమరసం కలిపి స్వామితో సహా అందరికీ ఇచ్చాడుతాగమని .స్వామికి అది చేదుగా వగరుగా అనిపించింది .భైరవ దత్త మంత్రాలు చదువుతూ ఊగిపోతూ డాన్స్ చేయటం ప్రారంభించాడు .చివరికి బట్టలన్నీ విప్పి విసిరిపారేసి కరాళ నృత్యం చేశాడు .స్వామి రామ్ కు తలనొప్పి వచ్చింది కాసేపటికి .శిష్యులకు ఎందుకు వీళ్ళు అలా ప్రవర్తిస్తున్నారో తెలియలేదు .హీర్బాలజిస్ట్ భారవ దత్త డాన్స్ చేస్తూ ‘’నేను శివుడిని  ఈ విశ్వానికి అధిపతిని నా పార్వతి ఎక్కడ ఆమెతో శృంగారం చేయాలి ‘’అని అరిచాడు .అయిదుగురు ఆయనను ఆపటానికి ప్రయత్నం చేసినా ఆపలేక పోయారు .వాళ్ళని ఒక్కొక్కరిని తోసిపరేశాడు .ఈ ఉదంతమంతా స్వామి రామా ఉత్తర కాశిలో ఉజాలి  ఆశ్రమం లో జరిగిందని రాశాడు .ఇలాంటి అనేక అనుభావాలవలన స్వామిరాం  ఈ హెర్బల్ మూలికలు కొద్దిగా మంచి చేస్తే చేయవచ్చునేమోకాని ఎక్కువగా కీడు చేస్తాయని తెలియ జేశాడు

 దక్షిణ భారత దేశం లో ఆయుర్వేద  ,సిద్ధ ఔషధాలలో సోమలత వాడకం ఉన్నది దీని బొటానికల్ పేరు ‘’సార్కో స్టెమ్మా అసిడం’’ .ఋగ్వేద హోమాలోనే కాక ఇరాన్ దేశ హోమాలలో కూడా సోమలతను వాడారు .మనవాళ్ళు ‘’దేవతలకోసం దేవుడు ‘’అని సోమలతను అన్నారు .ఋగ్వేదం ‘’దేవుళ్ళను  సృష్టి౦ చేదిసోమలత’’అన్నది .ఇంద్రునికి సోమలతకు అవినా భావ సంబంధం ఉన్నది .రాక్షసులపై యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారీ సోమ రసం పుచ్చుకొని  వెళ్ళేవాడని  మంచి ప్రేరకంగా పని చేస్తుందని ఉన్నది .తపస్సుకు ముఖ్యమని చెప్పబడింది .కాంతికీ సోమలతకు సంబంధం ఉన్నదని అందుకే కాంతి అధిదేవత ఇంద్రునికి అది ఇష్టమైనది అని ఋగ్వేదం లో ఉంది ..ఇక  చలించి  సోమమత్తులో నుంచి బయట పడదాం

ఇన్‌లైన్ చిత్రం 1

  సశేషం

   మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితీ గీర్వాణ౦-3 118-సాయి గాయత్రి మంత్రం రాసిన -శ్రీ ఘండి కోట వెంకట సుబ్బారావు (19 26 -20 03 )

గీర్వాణ కవుల కవితీ గీర్వాణ౦-3

118-సాయి గాయత్రి మంత్రం రాసిన -శ్రీ ఘండి కోట వెంకట సుబ్బారావు (19 26 -20 03 )

బ్రహ్మశ్రీ ఘండికోట వెంకట సుబ్బారావు గారు 7-11-19 26 న రాజమండ్రి లో జన్మించారు .తండ్రి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి తల్లి శ్రీమతి రామ లక్ష్మి .భారద్వాజ గోత్రం కృష్ణ యజు శ్శాఖ .తండ్రి వేద వేదా౦తా లలో  క్రతు నిర్వహణలో నిష్ణాతులు. కొడుకు జన్మించాలని  పుత్ర కామేష్టి చేసిన కర్మిస్టి.విజయనగర మహారాజు తన  ఆస్థాన విద్వాంసుని చేశాడు శాస్త్రి గారిని .విజయనగరం చేరి కొడుకుకు ఆంగ్ల ,భారతీయ విద్యా విధానం లో విద్య నేర్పించారు .తండ్రి గారు మహా రాజాతో పాటు ప్రయాణాలు చేయటం వలన రావు గారు విజయనగరం మద్రాస్ బెంగుళూరు లలో చదివారు .19 40 లో స్వాతంత్ర ఉద్యమకాలం లో భారత దేశ కీర్తి వైభవాలను కీర్తిస్తూ సైన్యాన్ని బ్రిటిష్ వారిని ఎదిరించమని కోరుతూ  పాటలు రాసి అచ్చు వేయించి కంటోన్ మెంట్ ప్రాంతం లో పంచి పెట్టారు .ప్రభుత్వం అరెస్ట్ చేసి౦దికాని కుర్రాడుకదా అని వదిలేసింది .మొదటి నుంచి సంప్రదాయ పద్ధతిలో విద్య నేర్చిన రావు 20 వ ఏట తల్లి మరణం బాధ కల్గించింది .19 42లో శ్రీమతి తంగిరాల లక్ష్మీ దేవిని వివాహమాడారు .62ఏళ్ళు వివాహ జీవితం అవిచ్చిన్నంగా సాగింది అయిదుగురు  మగపిల్లలుకలిగారు .

మద్రాస్ లయోలా కాలేజి నుంచి  ఎకనామిక్స్ లో బి ఏ ఆనర్స్  డిగ్రీ పొంది , విజయనగరం లో ఏం ఏ అయి అక్కడే లెక్చరర్ గా కొంతకాలం పని చేశారు .19 4 9 లో అమెరికా లోన్యూయార్క్ లోని  కొలంబియా యూని వర్సిటిలో ఏం ఏ పి హెచ్ డి చేశారు .ప్రొఫెసర్ సిఫార్స్ తో న్యూయార్క్ లో యునైటెడ్ నేషన్స్ సెక్రెటేరియట్ లో ఎకనామిక్స్ వ్యవహారం చూసే బాధ్యత 19 5 1 లో తీసుకున్నారు ..34ఏళ్ళ సుదీర్ఘకాలం ప్రపంచ వ్యవహార సంస్థలో సేవలందించారు తెలుగు బిడ్డ .భారతీయ విదాననాన్ని ఏమాత్రం మర్చి పోకుండా దంపతులు జీవించారు పిల్లలను అలాగే పెంచారు .భార్య ఇరగవరానికి చెందిన  తంగిరాలవారి ఆడబడుచు .వారిల్లు గురుకులం గా ఉండేది .నాలుగేళ్ళు ఇక్కడ పని చేశాక రావు గారిని బాంగ్ కాక్ లోని  యు యెన్ అకాడెమిక్ కమిషన్ కు బదిలీ చేశారు .డాగ్ హామార్ షెల్ద్ యు దాంట్ లు రావుగారి సహోద్యోగులు .19 5 8 లో మళ్ళీ న్యూయార్క్ లో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్ లో పని చేశారు .యువ ఆర్ధిక వేత్తగా గొప్ప గుర్తింపు పొందారు .

 19 6 ౦ లో ఇండియా వెళ్లి కుటుంబంతో గడుపుతుండగా అప్పటికే తండ్రి శాస్త్రిగారు సత్యసాయిబాబా ముఖ్య శిష్యులై  సలహా దారై సాయి భగవానుని అవతారమని ప్రచారం చేస్తున్నారు .రావు గారి నాలుగుతరాల కుటుంబ సభ్యులు పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నారు .శాస్త్రిగారిని బాబా ప్రశాంతి నిలయ ఆస్థాన విద్వాంసుని చేశారు .ఆయన ఆధ్వర్యం లో దసరాలలో యజ్ఞం నిర్వహించారు కూడా .

 19 6 1 లో రావు గారు ఢిల్లీ లో యునిసెఫ్ లో పని చేశారు .సీనియర్ ప్లానింగ్ ఆఫీసర్ అయ్యారు .దక్షిణ ,  ఆగ్నేయ ఆసియాలో  స్త్రీ శిశు పోషకాహారం కౌమార ,యవ్వన విషయాల సమస్యల పరిష్కార౦ పై పని చేశారు .వేదోపనిషత్ లపై సాధికారత సాధించి బదరీనాద్ కేదార్ నాద వంటి పుణ్య స్థల దర్శనం చేశారు .ఇండియాలో యునిసెఫ్ పని పూర్తవగానే మళ్ళీ న్యూయార్క్ వెళ్లి ఎనర్జీ సెక్షన్ హెడ్ అయ్యారు .ఇరవై ఏళ్ళు దీనిలో పని చేసి ఆయిల్ ఎకనమిస్ట్ గా ప్రపంచ ప్రసిద్ధి పొందారు .ఒపెక్ సంస్థలతో నిరంతర చర్చలు జరుపుతూ 19 73 లో వచ్చిన ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు .అలగప్పన్ అనే అతనితో కలిసి న్యూయార్క్ లో ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ‘’నార్త్ అమెరికా  టెంపుల్ హిందూ సొసైటీ ‘’స్థాపించారు .తిరుమల తిరుపతి దేవస్థానం వారితో సంప్రదించి న్యూయార్క్ లోని ఫ్లాషింగ్ లో గణేష్ దేవాలయం ను సంప్రదాయ హిందూ పద్ధతిలో నిర్మించారు .అప్పటికే సాయి భజన ఇంటివద్ద చేస్తున్నారు దానిని దేవాలయానికి మార్చారు .ఉత్తర అమెరికాలో ఇదే మొట్టమొదటి హిందూ దేవాలయం .ఇదే ఆతర్వాత ఎందరికో ప్రేరణ కలిగించి అనేక దేవాలయాలు ఎర్పడేట్లు చేసింది .ఇది సుబ్బారావు గారి పుణ్యమే .వ్యవస్థాపక అధ్యక్షులుగా నిర్విరామ కృషి చేసి ఎన్నో అభి వృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు .ప్రతివారం తాననే వేద ఉపనిషత్ గీతలపపై ప్రేరణాత్మక ప్రసంగాలు చేసేవారు .అన్ని మత విశ్వాసాల కు ఆలవాలంగా ‘’సత్య సాయి సర్వ ధర్మ ‘చిహ్నం ‘’ఏర్పాటు చేశారు .  మొదటిసారిగా సత్య సాయి స్టడీ సర్కిల్అమెరికాలో ఏర్పరచి .భారతీయ విద్యాభవన్ నిర్మాణానికి కృషి చేశారు స్వామి చిన్మయానంద ప్రభుపాద రామకృష్ణ పరమహంస వివేకానంద  మహేష్ యోగి బోధనలన్నీ క్షుణ్ణంగా చదివి జీర్ణించుకొన్నారు .న్యు యార్క్ లో మొట్టమొదటి ‘’తెలుగు సాహిత్య సాంస్కృతిక సంస్థ ‘’ఏర్పరచారు .ప్రతి ఉగాదినాడు పంచాంగ శ్రవణ౦ చేసేవారు .

  రెండేళ్ళ కోసారి కుటుంబం తో ఇండియా వచ్చి తప్పని సరిగా బాబా దర్శనం  స్పర్శనం సంభాషణం చేసేవారు .19 8 1 రావు గారి నాలుగవ కొడుకు సంజయ్ ఉపనయనం పుట్టపర్తిలో చేసి బాబా యజ్ఞోపవీతం సృష్టించి ఇస్తే వేయించి గాయత్రీ మంత్రోప దేశం చేయించారు అతనికి అక్కడే సత్యసాయి హయ్యర్ ఎడుకేషన్ సెంటర్ లో సీటు ఇచ్చారు .మరొక అబ్బాయి రవి శంకర్  కూడా అక్కడే చదివి బాబా గారి బెంగళూర్ బృందావన్ కాలేజి లెక్చరర్ అయ్యాడు ఇదీ ఆకుటుంబానికి బాబాకు ఉన్న అనుబంధం .

  19 8 4 లో ఇండియాకు వచ్చినప్పుడు 90 ఏళ్ళ తండ్రి శాస్త్రిగారు ‘’ఇండియాకు ఎప్పుడు వచ్చేస్తావు ?అని అడగటం బాబా అనుగ్రహం తో రావుగారిని బాబా ప్రశాంతి నిలయానికి రమ్మని ఆహ్వానించటం జరిగిపోయి  19 8 5 లో యుయెన్  సర్వీస్ నుండి 5 8 వ ఏట రిటైర్ అయి ,మెరిట్ సర్వీస్ అవార్డ్ పొంది ,పుట్టపర్తిలో ఉన్న  తండ్రి గారి  సేవలో బాబా సేవలో 18 సంవత్సరాలు గడిపారు .తండ్రిగారు రావు గారి చేతులమీదుగా చనిపోయారు .స్వామి పుస్తక ప్రచురణ విభాగం లో రావుగారు పని చేశారు పిల్లలకు బాబా కాలేజీలలో ఉద్యోగాలు ఇచ్చారు .ఆశ్ర మ మేగజైన్ ‘’సనాతన సారధి ‘’లో తెలుగు ఇంగ్లీష్ లలో వ్యాసాలూ రాస్తూ  సంపాదకత్వం వహిస్తూ సేవ చేశారు పితృ ఋణం తీర్చుకున్న  రావుగారు మిగిలిన కాలమంతా బాబా సస్న్నిధిలో సేవలోనే గడిపారు .విదేశీ భక్తులకు ఇంగ్లీష్ లో రావుగారు అనర్గళ ఉపన్యాసాలు ఇస్తూసాయి భావాలను సులభంగా అర్ధమయేట్లు చెప్పేవారు .అప్పటికే ముగ్గురు కుమారుల వివాహాలు చేసిన రాగారిని బాబా మిగిలిన ఇద్దరు అబ్బాయిల పెళ్ళిళ్ళు త్వరగా చేయమని చెప్పి ఎర్రమిల్లి సత్యమూర్తి గారి అమ్మాయిలు ఆహ్లాదిని ,సుమన లను కుదిర్చితన నివాసం ‘’త్రయీ బృందావన ‘’లో ఎంగేజ్ మెంట్ జరిపించి బెంగుళూరు బృందావన్ లో అన్ని ఖర్చులు తామే భరించి అత్యంత వైభవం గా తమ చేతులమీదుగా ఏప్రిల్ 20 నవివాహాలు జరిపించారు ఘండికోట కుటుంబీకు లందరూ పాల్గొని ఆశీర్వదించారు .మంగళసూత్రాలను స్వామి సృష్టించి వారికి అందజేశారు .

 భగవాన్ బాబా తనపై కురిపించిన అపూర్వ దయా వర్షానికి పులకితులైన సుబ్బారావు గారు దాన్ని సార్ధకం చేసుకోవాలని భావించి 21 వ శతాబ్ది ప్రారంభం లో భక్తులు సులభంగా అర్చించ టానికి ‘’’’సాయి యంత్రం ‘’తయారు చేశారు .సాయి త్రిచక్రాలు అంటే సత్య సాయి గాయత్రి సత్యసాయి సూర్య గాయత్రి సత్యసాయి హిరణ్య గర్భ గాయత్రి లను 19 7 7 ,19 9 7 ,19 9 9 లలో రచించి అందజేసి తన జీవితం ధన్యమైందని భావించారు .భగవాన్  వీరి కృషిని హృదయపూర్వకంగా మెచ్చి హర్షించారు .వీటినే రావుdగారు -’’త్రి సాయి -మంత్రం యంత్రం తంత్రం ‘’అనిరాశారు సంస్కృతం తెలుగు  స్పానిష్ మొదలైన అనేక భాషలలోకి ఇవి అనువాదమయ్యాయి

 భారతీయ సంప్రదాయం సంస్కృతులను పూర్తిగా అనుసరిస్తున్న రావుగారిని మనసారా అభినందించిన బాబా ఆయన ముగ్గురి మనవళ్ళఉపనయనాలు కూడా తానే దగ్గరుండి జరిపించారు .మూడు యజ్నోపవీతాలను సృష్టించి గాయత్రీ మంత్రోపదేశం తో చేశారు . .29-3-20 03 ఉదయం  ఘండికోట వెంకట సుబ్బారావు గారు 7 4 వ ఏట సత్య సాయి బాబాలో ఐక్యంయ్యారు .కర్మ కాండ లన్నీ యధావిధిగా జరిపించారుబాబా 13 వ రోజు కుటుంబ సభ్యులకు ఏదికావాలో అడిగి వాటితో సంతృప్తిగా భోజనం పెట్టారు .17 00 మందికి ‘’నారాయణ సేవ ‘’గా భోజనాలు పెట్టించారు . ప్రాత్య పాశ్చాత్య సంస్కృతీ మేళనం సుబ్బారావు గారు అనిబాబా మెచ్చుకొనేవారు .20 04 జనవరి 17 న రావుగారి చితా భస్మాన్ని మద్రాస్అడయార్ లో ఉన్న  అష్టలక్ష్మి దేవాలయం వద్ద  బీచ్  లో నిమజ్జనం చేయమని చెప్పి చేయించారు .

 సుబ్బారావు గారు రాసిన పుస్తకాలు -మాన్ విత్ మైటీ మిరకిల్స్ ,మైండ్ బొగ్లింగ్ మిరకిల్స్ ఆఫ్ సత్యసాయి ,ఇంటర్వ్యూస్ ,ఇన్నర్ మోస్ట్ విస్టాస్ అండ్ ఇన్ మోస్ట్ విజన్స్’’

   సుబ్బారాగారు రాసిన సాయి మంత్రాలు –

1-సాయి (ఈశ్వర) గాయత్రి–ఓం సాయీశ్వరాయ విద్మహే -సత్య దేవాయ ధీమహి -తన్నో  సర్వాః ప్రచోదయాత్  (24-12-19 7 7 )

2-సాయి సూర్య గాయత్రి –ఓం భాస్కరాయ విద్మహే -సాయి దేవాయ ధీమహి -తన్నోః సూర్యాః ప్రచోదయాత్ (22-9-19 9 7)

3-సాయి హిరణ్య గర్భ గాయత్రీ-ఓం ప్రేమాత్మనాయ  విద్మహే -హిరణ్య గర్భాయ ధీమహి -తన్నః సత్యాఃప్రచోదయాత్ ‘’(15-2-19 9 9 )

4-సాయి పంచాక్షరి -సాయి శివోహం 15-2-19 9 9 )

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2ఇన్‌లైన్ చిత్రం 3

 సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-17 -కాంప్  -షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమెరికాలో షార్లెట్ లోని మా అమ్మాయి ఇంట్లో తెలుగు క్లాసులు

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -3 -2 (చివరిభాగం )

వీక్లీ అమెరికా -3 -2 (చివరిభాగం )

17-4-17 నుండి 23-4-17 వరకు

భగవాన్ పుట్టపర్తి సాయిబాబా 24-4-20 11 న సమాధి చెందిన సందర్భంగా ఆరవ ఆరాధనోత్సవాన్ని షార్లెట్ లోని సత్యసాయి సెంటర్ వారు రెండు రోజుల ముందే శలవు రోజు 22-4-17 శనివారం హిందూ సెంటర్ లో రాలీ  యాన్దర్సన్ గ్రీన్స్ బరీ సాయి సెంటర్ వారిని కూడా ఆహ్వానించి ఘనంగా నిర్వహించారు .సుమారు రెండు వందల మంది సాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కు ఉదయం టిఫిన్ కాఫీ మధ్యాహ్నం ,రాత్రి భోజనాలు సాయంత్రం స్నాక్స్ టీ ఏర్పాటు చేశారు .మా అమ్మాయి విజయలక్ష్మికి  భోజనం వగైరా ఏర్పాట్లకు కో ఆర్డినేషన్ బాధ్యత ను సమావేశ నిర్వహణ బాధ్యత జయ అనే ఆవిడకు అప్పగించారు .మా అమ్మాయి అందరితో సంప్రదింపులు ఫోన్ ద్వారా జరుపుతూ ఏ లోపం లేకుండా శ్రమించి  నిండు దనం  తెస్తే జయ సభా నిర్వహణ చక్కగా చేసింది అందరూ మంచి సపోర్ట్ గా నిలబడి విజయ వంతం కావటానికి దోహదపడ్డారు .ఇందులో నిర్వాహకులు సుబ్బు సత్య ,పవన్ ,రవి పాత్ర మరువలేనిది .

  ఉదయం 8-30 కి నన్నూ మా మనవాడు పీయూష్ ను ఇంటి వద్ద తయారు చేసిన మైసూర్ పాకులు ,సాంబారు వగైరా ను తీసుకొని కారులో తీసుసుకొని వెళ్ళింది. హిందూ సెంటర్ కు 9-30 కి చేరాం .అక్కడ అప్పటికే ఉన్న డా సర్వేశ్ దంపతులు సత్య సుబ్బు అయిదేళ్ళతర్వాత మళ్ళీ మేము రావటం తో సంతోషంగా పలకరించారు .అప్పటికే ఆ రోజు ముఖ్య అతిధి  వక్త కరణం బాల సుబ్రహ్మణ్యం అనే బ్రదర్ బాలు కూడా వచ్చి ఉన్నారు . మా రెండవ బావగారి అన్నగారి అబ్బాయి వేలూరి పవన్  ఏర్పాట్ల విషయం చూస్తున్నాడు .ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఉప్మా ,కేసరి పొంగల్  ,తిని కాఫే తాగాను .పదింటికి ఉష భర్త రాం ప్రసాద్ అనే రాంకీ మా శ్రీమతిని మనవడు అశుతోష్ ను తీసుకు వచ్చాడు . అందరూ సరదాగా ఉన్నారు కార్యక్రమాలతో నవ్వుతూ పలకరిస్తూ రమ్య ,సుచిత్ర ,పవన్ భార్య రాధ  జయ సందడి చేస్తూ అందర్నీ బ్రేక్ ఫాస్ట్ చేయమని కోరుతూ నా బోటి వాళ్లకు కాఫీ కలుపుకోవటం రాకపోతే సహకరిస్తూ సాయం చేస్స్తున్నారు . దాదాపు ఆడవాళ్ళు చీరలతో సంప్రదాయ బద్ధంగా వచ్చారు .తెలుగు కన్నడం మలయాళం గుజరాతీ మహారాష్ట్ర  అమెరికన్ లు కూడా పాల్గొని ప్రపంచం చిన్నది అనిపించారు .ఆకాశం లో సగం అనుకొనే మహిళలు చాలా ఎక్కువ మందే పాల్గొన్నారు .

  గాంధి భవన్ లో ఉదయం 10 30 కి భజనలతో కార్య క్రమం ప్రారంభమైంది . జయ ,సౌమ్య విజ్జి  సుబ్బు రవి మొదలైనవారు భజనలు పాడారు .వేదికపై పెద్ద సత్య సాయి బాబా ఫోటో దానికి రెండు వైపులా  అట్టలతో నెమలి బొమ్మలు కలర్ ఫుల్ గా చేసి పుష్పాలతో హారాలు వేసి అలంకరించారు .ఎన్ని రోజులనుండి దీన్ని చేశారో ?

 ఉదయం 11 గంటలకు కరణం బాల సుబ్రహ్మణ్యం ప్రసంగం ప్రారంభమైంది .ఆయన పుట్టపర్తి దగ్గర పల్లె టూరి వాడు .పల్లె చదువు పూర్తీ చేసి ,పుట్టపర్తి లో సత్య సాయి విద్యా సంస్థలలో  ఏం ఎసి సి  చదివి పి.హెచ్ డి చేసి కొద్దికాలం అక్కడే పని చేస్సి ఇప్పుడు అమెరికాలో అట్లాంటాలో కేమి స్ట్రి లెక్చరర్ గా ఉన్నాడు .మంచి వక్త ,కవి .బాబాతో చాలా ఏళ్ళ అనుబంధమున్నవాడు .కవితలతో బాబాను మెప్పించినవాడు . ఈ నాటి అన్నికార్యక్రమాలలో ఒక్కటే అంశం ‘’హృదయ పరి వర్తన ‘’అనేది. దీనిపై చాలా స్పాంటేనియస్ గా  స్క్రీన్ పై ప్రదర్శనాత్మకంగా   మాట్లాడాడు . మధ్యాహ్నం పానెల్  డిస్కషన్ తర్వాత కూడా ఆయన  మళ్ళీ మాట్లాడాడు .అందులోని సారాంశం అందరూ తెలుసుకోవాలి .అయన మాటలను ఎప్పటికప్పుడు నోట్ బుక్ లో రాసుకున్నా ఆ సారమే ఈ ప్రసారం –

‘’హృదయం అనే మాటకు బాబా దయ కలిగింది అని అర్ధం చెప్పారు .దైవం అంటే ప్రేమ ..అందరికీ’’ కంపాషన్’’ఉండాలే తప్ప కంపు ఫాషన్ కాదు ..’’అద్వితీయమ౦దంగ ప్రేమకాక వేరొకటి ఏల ?బాబా అనుగ్రహం ఎవరిమీదైనా కలిగితే ‘’తాంబూలం ఇస్తా .తీసుకో ‘’అనేవారు .తాంబూలం అంటే పళ్ళెం లో పళ్ళూ తమలపాకులు వక్కలు  వస్త్రాలు డబ్బు కానుకగా ఇవ్వటం .ఆయన నడిపే స్కూల్ లో ఎప్పుడూ విద్యార్ధులకు పుట్టపర్తిలో దొరకని ఆపిల్స్ ఫలహారాలు  భోజనాలు సమకూర్చేవారు .ఇది తెలిసి ఇక్కడే చదవాలనుకొన్నాడు బాలు .

మొదటిసారి బాబాను చూసి స్పందించి ‘’కంటి నఖిలాండ మూర్తిని గంటి -మదములు పోగొట్టుకొంటి ‘’అని పించింది .ఎవరిన్తికైనా గృహ ప్రవేశం చేయమని  బాబాను ఆహ్వానించేవారు వారికి తాంబూలం ఇచ్చి పాలలో వ్రేలు పెట్టి గృహ ప్రవేశం చేయిన్చేవారట. బాబా .పుట్టపర్తి స్టేట్ బాంక్ ప్రారంభోత్సవాన్ని కూడా ఇలాగే చేసి బ్యాంకులో డబ్బులు ధర్మవరం నుంచి ఇంకా రాకపోతే బంగారు నాణాలు సృష్టించి లాకర్లలో పెట్టించిన మొదటి ఖాతా  దారు బాబా యే..బాబా ఎప్పుడూ ‘’నేను డ్రిల్ మాస్టార్ని జాగ్రఫీ టీచర్నికాదు మీ శరీఅరానికి మనసుకు ఎక్సర్ సైజ్ లు ఇచ్చేవాడిని నేర్పే వాడిని ‘’అనేవారు .విజయం అంటే మన పరిశ్రమ ప్లస్ స్వామి దయ అని నిర్వచి0చేవారు.’’తనను తానూ తెలుసుకోవటం తనువుకు లక్ష్యం ‘’అనేవారు .

 బుక్కపట్నం లో వేంపల్లి జయమ్మ బాబా క్లాస్ మేట్.ఆమె బాలుకు బాబా సాక్షాత్తు పరమాత్మ అని చెప్పి ఆయన్ను నమ్ముకొంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని బోధించింది .ఆమె ప్రతి పుట్టిన రోజు ను జ్ఞాపకముంచుకొని బాబా ఆమె ఇంటికి ఘనంగా కానుకలు పంపేవారు .ఎవరైనా బాబా దగ్గర కొచ్చి ‘’నేను పాడుతాను ‘’అంటే ‘’మంచిది పాడు ‘’అనేవారు అంటే సరే నాయనా పాడు అని ఒకర్ధం మంచి పాటలు పాడు అని వేరోకర్ధం .’’singers who sing with ego are sinners ‘’అనేవారు .’’సాయి దర్శనం సుదర్శనం ‘’అని బాలు రాసి చూపాడు .’చావు లేని చదువు చదువ వలెను ‘’అని చెప్పేవారు .పుట్టపర్తిలో ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే మన గవర్నమేంట్ బడులలో ఉన్న లెస్ ఎడ్యుకేషన్ కాదు బెస్ట్ ఎడ్యుకేషన్ ‘’అన్నాడు బాలు .సాయి చిరుకోపంవస్తే దున్నపోతా బక్కోడా బండోడా  అనేవారు సాధారణంగా అందర్నీ ‘’బంగారూ ‘’అనే సంబోధించేవారు .’’సాయి నీ హృదయ స్థాయి -తెలుసుకొంటే మనసుకు హాయి ‘’అనేవారుబాబా  .మరోసారిబాలు ‘’స్వామితో మాట్లాడితే ఆనంద బాష్పాలు కారు ‘’అని కవిత వినిపిస్తే ‘’కపిత్వం ‘’బాగానే అబ్బిందే అని మేలమాడారు .బాలు ‘’కోదండ పాణి నువ్వైతే కపి(హనుమాన్ )ని నేను ‘’అన్నాడు .పద్యాలన్నీ విని ‘’నీకేం కావాలో తీసుకో ‘’అన్నారట .ఆయనతో గడపటం ‘’లివింగ్ విత్ లవింగ్ గాడ్ ‘’అన్నాడు బాలు .. ఎవరైనా భయమేస్తోందిబాబా అంటే ‘’నువ్వు చేస్తుంటే భయం -బాబాకు వదిలేస్తే అభయం ‘’అనేవారు

             మధ్యాహ్నం 2 కు మళ్ళీ ప్రసంగిస్తూ బాలు ‘’టెక్నాలజీ ఈజ్ ట్రిక్నాలజి ‘’అని బాబా అనేవారని ,బాబా అల్కెమిస్ట్ అని గోల్డ్ స్మిత్ విత్ లవ్ అని వర్ణించాడు .ఒక సారి అసలు పుష్పించని చెట్టునుంచి పూలు పళ్ళు కాయించి ఇచ్చారు .’’ఇన్ని విషయాలు మీకు ఎలా గుర్తు ఉంటాయి ?’’అనియా అడిగితే ‘’నీకు కావాల్సినప్పుడు అవే గుర్తుకు వస్తాయి ‘’అనేవారు .భగవద్గీత మొదటి శ్లోకం చివరి శ్లోకం లలో ధర్మ మన ఉన్నాయి అదే దాని పరమార్ధం నీడ్యూటీ నువ్వు చెయ్యి అని గీత సారం.కురుక్షేత్రం లో గీత బోధించినప్పుడు  అర్జునునివయసు 7 5 ,శ్రీ కృష్ణుని వయసు 8 0అని బాబా చెప్పారు ‘’నిజమైన ఆనందం నీలోనే ఉంది -అది చూపించటానికే వచ్చాడు సాయి ‘’అనేవారు బాబా ..సాయిబాబా సంస్థలలో ‘’స్టెప్పింగ్ డౌన్’’అనేది లేదు స్టెప్పింగ్ అప్ మాత్రమె ఎప్పుడూ .

 ‘’పాపాత్మా పాపసంభావానామ్ పాప కర్మాణానాం’’అనే శ్లోకాన్ని మార్చి బాబా ‘’ప్రాప్తోహం  ప్రాప్త సంపన్నానాం ‘’అని చెప్పించేవారు .ఈ దేహం నాకు వచ్చింది దాన్ని సార్ధకం చేసుకొంటాను అని అర్ధం ..ఎవరో ‘’సాయి కి వేదం తెలుసా ?’’అని అడిగితె ‘’సాయి చెప్పిందేవేదం ‘’అన్నారు ఆయనవద్ద ఉన్న మహా వేదవేదాంత శాస్త్ర విజ్ఞానులు .

 బాబాకు అపత్ సమయం లో ఎలా ఆదుకోవాలో తెలుసు.బాలు అక్క పెద్దగ చదువుకోలేదు పెళ్లి అయి రెండో ప్రసవం లో ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళింది ,ఇంట్లో వాళ్ళందరూ బాబాకు చెప్పమన్నారు ఆలోచించి ఆలోచించి బాబాకు బాలు విషయం చెప్పాడు మర్నాడే ఆమెను అమ్మనూ తీసుకుని రమ్మని జేబులో డబ్బు పెట్టి పంపారు మర్నాడు వాళ్ళు వచ్చ్చారు .బాబా ‘’వచ్చారా ‘’అని అడిగితె అంత మంది జనం లో ఎక్కడున్నారా అని చూస్తుంటే ‘’అదిగో అక్కడ ఉన్నారని చెప్పి ‘’వాళ్ళను లోపలి తెప్పించారు ఒక శివలింగం సృష్టించి దాన్ని  గ్లాసు నీళ్ళలో  వేసి ఏడు రోజులపాటు తీర్ధంగా అక్కకు ఇస్తే తగ్గిపోతుందని చెప్పి తే అలా చేయగానే తగ్గిపోతే కుటుంబం అంతా బాబా దగ్గరకు వచ్చి  కృతజ్ఞతలు  చెబితే అక్క బాలు సంగతి చూడమని అంటే ముందు నీ పిల్లల ఆలనా పాలనా చూసుకో అని చెప్పి బావనూ పిలిచి ఆమె నీకు సేవ చేసినట్లు నువ్వు ఆమెకు సేవ చేయి అని బోధ చేశారని బాలు తన అను భవాన్ని  తెలియ జేశాడు

 బాబా పై తనకు అత్యంత భక్తి అనిబాలు బాబాతో అంటే ‘’ కాన్ష స్ లో కాన్ఫిడెన్స్ ఉండాలి ‘’అని బోధించారు   బస్ బయల్దేరితే డస్ట్ కూడా దాని వెనక వచ్చి బస్సు ఆగితే ఆగి పోతుంది .కనుక సాధన నిరంతరం సాగాలి .అమెరికాలోని  అలబామా రాష్ట్రం లోని మాంట్ గోమరీలో ఉన్న ఒకాయన 35  ఏళ్ళనుంచీ దిగ్విజయం గా ఎక్కువ మంది సాధకులతో సాయి సెంటర్ నడుపుతున్నాడని ఆయన జీవితం లో కనీసం ఒక్క సారికూడా బాబాను సందర్శించలేదని ఇదొక అద్భుత అపూర్వ విషయమని బాబా స్పూర్తి అలాంటిదని  బాలు అన్నాడు .‘’మనసుకొంతయు నిచ్చి -స్వామి కరుణ అందరాని సుఖము నందగలరు ‘’అంటూ తన ట్రాన్స్ ఫర్మేషన్ కు బాబా ఎలా దోహద పడ్డారో సోదాహరణం గా ప్రసంగించి  అందరి ప్రశంశలు అందుకున్నాడు బాలు .

 మధ్యాహ్నం వివేకా హాల్ లోనే లంచ్ .పప్పు రెండు కూరలు పులిహోర ఫ్రైడ్ రైస్ ,ఆవకాయ ,టమేటా చట్నీ ,సాంబారు పెరుగన్నం ,లడ్డూ అరటిపండు  లతో భోజనం .అందరూ సంతృప్తిగా తిన్నారు అన్నీ బాగానే ఉన్నాయి .కావాల్సినవారికి పూరీ చానా మసాలా కూడా పెట్టారు .

      భోజనం తర్వాత మధ్యాహనం 1-30 కి కాసేపు భజనలు .తర్వాత హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ‘’పై పానల్ డిస్కషన్ .ఇందులో నస్రిన్ అనే ఇరానీ పి.హెచ్ డి అమ్మాయి రుద్రం అద్భుతంగా కంటో పాఠ౦ గా వచ్చినమ్మాయి ,అరుణ ,రవి ,రాజారావు శంకర్ లు పాల్గొన్నారు మోడరేటర్ గా బాలు వ్యవహరించాడు .వీరందరి చర్చ సారాంశం -పరివర్తన అంటే కామ క్రోధాదులను దూరం చేసుకోవటం గ్రోయింగ్ టువర్డ్స్ గాడ్ .చేంజ్ ఆఫ్ నో రికగ్నిషన్ . ఫిజికల్ వరల్డ్ నుంచి స్పిరిట్యువల్ వరల్ద్ కు ప్రయాణం   భౌతిక హృదయం ఆధ్యాత్మిక హృద్యంగా మారటం . ఇందులో పాల్గొన్న వారు వారి అనుభవాలు వివరించారు .ఒక సారి సాయిమందిరం లో పెయింటింగ్ వేయాల్సివచ్చింది .నిరంతరం భక్తుల ప్రవాహం వలన  పెయింటర్ లకు   అర్ధ రాత్రికాని వీలు చిక్కేదికాదు .సమయం దగ్గర పడుతోందని బాబా హెచ్చరిక .ఒక రోజు  అందరూ ఒక కుర్రాడిమీద వదిలేసి విసుగొచ్చి వెళ్లి పోయారు. వాడు తెల్లవార్లూ వేస్తూ బాబాకు కనిపించాడు .మర్నాడు వాడిని పిలిపించి తాంబూలం ఇచ్చారు. వాడు ఈ అదృష్టానికి వలవలా ఏడ్చేశాడు ఇది తెలిసిన మిగిలిన వాళ్ళు కూడా అప్పటిదాకా సాయిని చూడని వాళ్ళు అందరూ బాబా పాదాలపై పడ్డారు. వారందరికీ కానుకలు ఇస్తే అక్కడే వదిలి పాద స్పర్శ తప్ప తమకు ఏమీ వద్దన్నారు . వాళ్లకు నచ్చ చెప్పి కానుకలు మళ్ళీ ఇప్పించారు బాబా

           తరవాత టీ బ్రేక్ -మరమరాలు పళ్ళముక్కలు  బిస్కట్లు జ్యూస్లు టీ ఇచ్చారు .

సాయంత్రం 4 గం లకు సాంస్కృతిక కార్యక్రమాలు .ఇందులో కూడా హృదయ పరివర్తనమే సబ్జెక్ట్ .గ్రీన్ బరో వాళ్ళు శ్రీరామ వనవాసం చిత్రాలతో ‘’పప్పెట్ షో’’చేశారు బాగుంది . యాం డర్సన్ వాళ్ళు లఘు చిత్రాలు ‘’డజ్ గాడ్ ఎక్సిస్ట్ ,వాట్ ఈజ్ వర్షిప్ ,ది గెస్ట్ లు ప్రదర్శించారు .

 మొదటి సారిగా షార్లెట్ సెంటర్ వారు మగవాళ్ళందరూ కలిసి నాలుగు చిన్న నాటికలు ప్రదర్శించారు .మొదటి ది- వాల్మీకి -బోయ రత్నాకరుడు వాల్మీకిగా రూపాంతరం చెందటం రెండవది ప్రాఫెట్ మొహమ్మద్ ను ఎవగించుకొనే  వీధులు ఊడ్చే ముసలి వాడిలో ఆయన కరుణ వలన హృదయ పరివర్తన రావటం ,యేసు క్రీస్తు ను ఆరాధించే ధనవంతుడిపై అసూయ చెందినవారు ఆయన అంతరంగాన్ని తెలుసుకోవటం అధనవంతుడు తన సంపద  వీళ్ళకు ఇచ్చి  యేసు భక్తుడుగా మారటం ,నాలుగవది కల్పగిరి అనే ఖైదీ బాబా కు తన గోడు జాబులో తెలియ జేస్తే ఆయన అనుగ్రహం తో శిక్షాకాలం తగ్గి విడుదలవటం ఇందులో మా బంధువు వేలూరి పవన్ ఖైదీగా గొప్ప నటన ప్రదర్శించాడు .మరోనాటిక కేరళకి చెందిన వీర కమ్యూనిస్ట్ హిందూ మత ప్రచారకులు అంటే గిట్టక బాబాను అర్ధ రాత్రి చంపటానికి పుట్టపర్తి చేరి బాబాతో పాటు నిద్రించగా బాబా ‘’ఇంకా సమయం కాలేదా “‘?అని అడగటం తో తప్పు తెలుసుకొని బాబా అనుగ్రహం తో మారి అక్కడే ఉండిపోవటం ‘’లవ్ ఈజ్ గాడ్ ;;అనే సందేశం .

 ఈ నాటికలలో పాల్గొన్నవారంతా బాగా నటించారు పవన్ మాత్రంనటనతో  జీవించాడు అని చెప్పక తప్పదు. ఎక్కడా బోర్ కొట్టకుండా చక చక సాగిపోయాయి. ఉన్నంతలో రంగాలంకరణ అన్నీ బాగా చేశారు అందరూ ఉద్యోగస్తులే పిల్లా పాపా ఉన్నవారే .పిల్లల చదువులతో తీరిక లేనివాళ్ళే అయినా గొప్ప సంకల్ప బలంతో దీన్ని సాధించారు అందరూ అభినందనీయులే .

   బ్రేక్ ఫాస్ట్ లంచ్ చేసిన వివేక్ హాల్ ను మధ్యాహ్నం ఒంటిగంటకు గుజరాతీ సభ జరిపే వారికి అప్పగించాలి .అందుకని భోజనాలు అవగానే ఆడ మగా అందరూ త్వరత్వరగా సామాన్లు తీసుకొని గాంధీ భవన్ కింద అంతస్తు లోకి చేరవేయటం ,క్లీన్ చేయటం చేసేశారు వాలంటరీ వర్క్ అంటే ఎలా ఉంటుందో రుజూవు  చేశారు  . వాళ్ళ ఓర్పుకు సాయానికి హేట్సాఫ్.నేనేదైనా చేద్దామనుకొంటే నన్ను చేయనివ్వలేదు .

   సాంస్కృతిక  కార్యకరమాలు కాగానే డౌన్  స్టేయిర్ లో డిన్నర్ .దూర ప్రదేశాల నుండి వచ్చినవారికి బాక్స్ లలో చపాతీ కూరా పులిహోర ,మైసూర్ పాక్ ,బిర్యానీ సర్ది ఇచ్చారు ఆడవాళ్ళు .తినే సమయం ఉన్నవారు ఇక్కడే తిన్నారు .అంతా అయేసరికి ,ఊడ్చి బాగు చేసేసరికి సామాన్లు సర్దుకొని ఎవరిసామాను వాళ్ళు తీసుకు పోయేసరికి రాత్రి తొమ్మిదయింది .అప్పుడు బయల్దేరి అందరం ఇంటికి చేరేటప్పటికి తొమ్మిదిన్నర .

 సందట్లో సడేమియా -వివేక్ హాల్ లో మధ్యాహ్నం 1 గంటనుండి గుజరాతీ వాళ్ళు ‘’దాదా భగవాన్ ‘’పై సత్సంగం చేశారు ఒకటి రెండు సార్లు వెళ్లి చూశాను .వాళ్ళూ భోజనాలు వగైరాలతో ఉన్నారు యాభై మంది దాటిలేరు ఆడామగా . ఇంతకీ ఎవరి గురించి అని ఒక పెద్దాయననుఇంగ్లీష్ లో అడిగితే చెప్పాడు నెలకోసారి ఇలా సమావేశామౌతారట మాట్లాడుకొంటారు భజనలు పాడతారు అవి సంస్కృతం లోనే ఉన్నాయి .ఫోటోలు తీసుకోవచ్చా అని అడిగి సరేనంటే  ఫోటోలు తీశాను .

 దాదా భగవాన్ అంటే గుజరాత్ లో 7-11-19 09లో బరోడా దగ్గర తరసలి లో జన్మించిన అంబాలాల్ ము౦జీభాయ్ పటేల్ .19 5 8 లో ఆత్మజ్ఞానం పొంది దాదా  భగవాన్ అయ్యాడు .జైనులు చెప్పే క్రమ పద్ధతిలో ఆత్మ జ్ఞానం పొందకుండా తక్షణ ఆత్మజ్ఞానంపొంది మోక్షం సాధించటానికి అంటే – ‘’అక్రం విజ్ఞాన్ ‘’పొందటానికి సాధనాలు చెప్పాడు దీన్నే వ్యాప్తి చేశాడు .తన అనుభవాలను అందరితోపంచుకోనేవాడు .ఒక సారి ఉగాండా నుంచి19 6 2 లో  చంద్ర కాంత పటేల్ అనే ఆయన వచ్చి ఈయన ప్రభావానికి లోనై రెండవ తక్షణ ఆత్మజ్ఞాని అయ్యాడు దాదా తర్వాత .దేశ విదేశాలలో పర్యటించి ‘’అక్రం విజ్ఞాన్ ‘’వ్యాప్తి చేశాడు .1-2-19 8 8 న ఆయన మరణించినప్పుడు 60 వేల మంది భక్తులు అంత్యక్రియలకు హాజరయ్యారు .ఈ విధంగా ఇవాళ మరో మహానుభావుడిని గురించి తెలుసుకొనే అదృష్టం కలిగిందినాకు .

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2

          మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -23-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

 


Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -3 -1

 వీక్లీ అమెరికా -3 -1

                                     17-4-17-నుంచి 23-4-17 వరకు

వీక్లీ అమెరికా -2 సోమవారం రాసి మధ్యాహ్నం 3-15 కు మా పెద్ద మనవాడు శ్రీకేత్ తోకలిసి మేక్లిన్ బర్గ్ లైబ్రరీకి వెళ్లాను ఈ సరస్వతీ ఆలయాన్ని అయిదేళ్ళక్రితం చాలా పుస్తకాలు చదివి సార్ధకం చేసుకొన్నాను మళ్ళీ అక్కిడికి  రావటం గొప్ప అనుభూతి నిచ్చింది .మనవడు 5 గం నుంచి 7 వరకు     వాలంటరి చేశాడు  .అలా చేయాలట దానికి మార్కులు ఉంటాయట . .నేను అక్కడ మూడు పుస్తకాలు చదివాను . 10 పుస్తకాలు ఇంటికి తెచ్చుకున్నాను .అక్కడ చదివినవాటిలో మొదటిది -The art of x ray reading .దీన్ని ‘’రాయ్ పీటర్ క్లార్క్ ‘’రాశాడు .అందులో నాకు నచ్చిన వాక్యాలు మీ కోసం -డాంటే రాసిన’’ ఇంఫెర్నో ‘’లో బతికిఉన్నవారు చనిపోయిన వారూ ఒక ఫెర్రి లో అధోలోకానికి ప్రయాణం చేస్తారని దానినే హేడ్స్లేలేక హెల్ నరకం అంటారని ఫెర్రి నడిపే చరోన్ అనే వాడికి డబ్బు ముట్ట జెబితే బోటులో స్టైక్స్ రివర్ మీదుగా లివింగ్ అండ్ డేడ్ వరల్డ్ లను విభజించే చోటుకు తీసుకు  వెడతాడని ఉందట .గ్రీసు దేశం లో పూర్వం చచ్చిన వాడి నోరు ,కళ్ళ మీద నాణాలు పెట్టేవారని ,ఇది వాడి ఇతరలోక ప్రయాణానికి దారిఖర్చు ఆధునిక భాషలో’’ కాబ్ ఫేర్’ ఫర్ దిజర్నీ ఇంటూది నెక్స్ట్ వరల్డ్ ‘’.ఇంగ్లాండ్ లో కింగ్  ఆర్ధర్ చనిపోతే శవాన్ని బోటు లో పెట్టి ధనకనక వస్తు వాహనాలు అందులో ఉంచి దాన్ని పాతి పెట్టటమో ,సముద్రం లో వదిలేయటమో చేశారట .అది ఆయనకు ఉత్తమ లోకానికి దారి చూపిస్తుందని నమ్మకం .

 ఇందులోనే రచయిత రచయిత రచన ఎలా ఉండాలో మంచి సూచనలు చేశాడు అందరికీ శిరో దార్యమే అవి .-’’Your writing should move -move -move from concrete to abstract ,from specific to general ,from idea to example -from information to anecdote ,from expression to dialogue .A good book is a  perpetual motion machine that drives a story and lets the reader feel the energy ‘’అంటాడు .వ్లాదిమిర్ నేబోకోవ్ రాసిన ‘’లోలిత ‘’నవల లో నేబోకో ‘’సాహిత్యాన్ని ముక్కలు ముక్కలుగా చేసి లాగి పీకి  అరచేతిలో నలిపి పెట్టి పీల్చాలి .నోటిలో వేసి నవలాలి అప్పుడే దాని ప్రయోజనం తెలిసి ,దానిలో చెప్పబడిన అసలు విషయం అవగతమై ,ఇందాక మనం చేసిన ముక్కలు చక్కలూ మన మైండ్ లో    అతుక్కుపోయి  రక్తగాతమై అనుభూతినీ ఆనందాన్ని ఇస్తుంది ‘’అన్నాడు .రాయ్ పీటర్ ‘’Lolita is a kind of love letter to English Literature ‘’అని గొప్ప నిర్వచనమిచ్చాడు .

 రెండవ పుస్తకం ‘’గ్రేటెస్ట్ ఆధర్స్ ఆఫ్ క్లాసిక్ హిట్ ‘’పుస్తకం Jeanne Nagle రాసింది .ఇందులో కొన్ని విషయాలున్నాయి .ఫ్లాబర్ట్ – మేడం బోవరి నవల రాసేటప్పుడు సరైన నిర్దుష్టమైన పదం కోసం రోజులతరబడి ఆలోచిన్చేవాడట .దీనినే అతనిమాటల్లోనే తెలుసుకొంటే బాగుంటుంది -My head reels and throat aches with chasting after ,slogging over ,delving into ,,turning around ,,gropping after and bellowing in a hundredth thousand different ways,a sentence that i have at last finished ‘’అని చెప్పాడు మనవాళ్ళు చెప్పిన కృత్యాద్యవస్థ అంటే ఇదే .

మూడవ పుస్తకం -Flights and wisdom of the ancient -అలేక్సాన్ద్రియా పబ్లిషింగ్ వాళ్ళది చిన్నపుస్తకం లో అనేక అద్భుత విషయాలు చదివాను .

పూర్వం మాయన్ ఖగోళ వేత్తలు సంవత్సరానికి 365.24 20 రోజులు అని చెప్పారు .ఇవాల్టి రోజుల్లో మనం 36 5 .24 25 గా రోజులుగా వాడుతున్నాం .హుండూరస్ శిధిలాలో ఈ కాలెండర్ రాతి మీద చెక్కబడి ఉంది దానిపై 1 day July 26 736 అని ఉందట .

 5 వేల ఏళ్ళ క్రితం సుమేరియాలో ఉన్నత వంశస్తులకే హై స్కూల్స్ ఉండేవట .బాటని జువాలజీ  మినరాలజి  జాగ్రఫీ లెక్కలు వగైరా నేర్పెవారట .రెండు వేల ఏళ్ళక్రితం బాగ్దాద్ లో ఒక మట్టి కుండలో సోల్దరింగ్ కాపర్ షీట్ ట్యూబ్ ఇక అంగుళం వెడల్పు ,నాలుగు అంగుళాల పొడవుతో కనిపించింది .అడుగున కాపర్ డిస్క్ ఇనుప కాడది ఉన్నాయి .దీనిలో యాసిడ్ పోస్తే బాటరీలాగా పని చేసేదట  .కైరో మ్యూజియం లో క్రీ పూ 200 లో  విమానం తయారు చేసిన దాఖలాలున్నాయట .బాబిలోనియాలో 5 వేల ఏళ్ళ క్రితం కాపర్ గ్రాఫైట్ ఎయిరోప్లేన్ భాగాలు కంపించాయట.40 8 బి సి లో గ్రీకు గణిత వేత్త  ఆర్బైటిస్ ఒక కర్ర పావురం తయారు చేసి ఎగిరెట్లు చేశాడట .లోపల ఇంజను రెక్కలు అన్నీ కూర్చాడట .ఇప్పుడు వాడుకం లో ఉన్న జెట్ ప్లేన్ ప్రిన్సిపల్ కూడా అతనే కానీ పెట్టాడని అంటారు .అతనిని ‘’సైంటిస్ట్ హీరో ‘’అని పిలిచేవారట .రొటేటింగ్ బాయిలర్ ను రొటేటింగ్ రిపల్సివ్ ఎఫెక్ట్ కోసం తయారు చేశాడు .ఇదే జెట్ ఫ్లేం కు దారి చూపింది ..చైనా రాజు షాన్ తలిదండ్రులు తనను చంపబోతున్నట్లు తెలుసుకొని ఒక విమానం తయారు చేయించుకొని పారిపోయినట్లు ఉన్నది .దీని తర్వాత 450 ఏళ్ళకు చింగ్ తాంగ్ చక్రవర్తి తన ఇంజనీర్ కి కుంగ్ -షి తో ఫ్లైయింగ్ చారియట్ తయారు చేయించాడు .నాలుగవ శతాబ్దం లో కో హాంగ్  ఫ్లైయింగ్ కార్ ఉన్నట్లు రాశాడు దాన్ని ఎద్దు చర్మం తో తయారు చేశారట .దానికి రొటేటింగ్ బ్లేడ్స్ ఇప్పటి హెలికాప్టర్ కు లాగా ఉన్నాయట .’

‘’సమర సూత్ర ధార’’గ్రంధం లో పక్షిలాగా ఎగిరేదాన్ని విమానం అని అన్నారు .మధ్య ప్రాచ్యం లో కంబోడియాలోని బొగోటా లో  ‘’gold trinket resting in a blank vault ‘’కనిపించిందట .ఇది సుమారు 6-9 శతాబ్దానికి చెందింది .రెండు అంగుళాలు పొడవు రెక్కలు అసాధారణ తోక ఒక పురుగు ఆకారం దాదాపు గబ్బిల౦  లాగా ఉండే ఎగిరే విమానం కనిపించింది ఇదే డెల్టా వి౦గ్ తో ఉన్న స్తీప్ క్లైమ్బింగ్ జెట్  ఫైటర్ నిర్మాణానికి దారి చూపి ఉంటుంది .

                  రాత్రి 7 గంటలకు మా అమ్మాయి డ్యూటీ నుంచి వచ్చి నన్ను మనవడిని ఇంటికి తీసుకు వచ్చింది .మిగిలిన విషయాలు ఇప్పుడు రాస్తాను

 మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి రాత్రి 7-30 వరకు సూర్యుడు కనిపిస్తూనే ఉన్నాడు .పెద్దగా ఆశ్చర్యపడలేదు .కారణం మొదటి సారి అమెరికా టెక్సాస్ రాష్ట్రం హూస్టన్ కు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు రాత్రి 10- 30 కు కూడా సూర్యుడు కనిపించేవాడు జూన్ నెలలో .ఈ సోమవారు డా.ఇన్నయ్యగారు ఫోన్ చేసిమాట్లాడారు ఆత్మీయంగా .

 నేను లైబ్రరి నుంచి తెచ్చుకున్న 10 పుస్తకాలలో మొదటిది ‘’ది ట్రోజన్ వార్ ‘’చదవటం ప్రారంభించా దానిపై ఒక వ్యాసమూ రాశాను .రాత్రి బ్రహ్మానందం కోవై సరళ కామెడీ బిట్స్ చూశాం .సాయంత్రం గంగాధరరావు గారికి ఫోన్ చేసిమాట్లాడా .మంగళవారం ఖాజీ పాలెం లో ఉన్న నా బి ఎడ్ మిత్రుడు వారణాసి సుబ్బయ్యకు ఫోన్ చేసిమాట్లాడితే పరమ సంతోషించాడు వాళ్ళ మనవాడి ఉపనయనం అనీ మా ఇద్దరి ఆశీర్వాదాలు  .కావాలని కోరాడు .తరువాత మన గుడి బడ్డీ బుడ్డి తో ,తూములూరు వారితో ,మనవడు చరణ్ తో ,వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రిగారితో ఫోన్ చేసి మాట్లాడాను శాస్త్రిగారు మహదానందం తెలియబరచారు .రెండవ పుస్తకం ‘’లీడర్స్ ఆఫ్ ది ఎంసేంట్ గ్రీస్ ‘’చదవటం మొదలెట్టా .దీనిపై కూడా మూడు ఆర్టికల్స్ రాశాను .ఈల వీజిల్ పూర్తీ చేసి ,లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్ స్వామి రాం రాసిన పెద్ద పుస్తకం ప్రారంభించి ఈ వారం లో సగం చదివా .మధ్యలోపాల్ జాన్సన్ రాసిన  ‘’హ్యూమరిస్ట్స్ –చదివి విదేశీ హాస్యం పై రాశా . మాస్టర్స్ పుస్తకం ఆధారం గా ఏతి పై నేతి నేతి యేతి ,హిమాలయ గుహాంతర ఆశ్రమ జీవనం రాశా .గ్రీస్ పుస్తకం ఆధారం గా గ్రీకు ప్రజాస్వామ్య పిత సోలోన్ ,నావికా దళపిత  స్టేమో క్లెస్ రాశా . ఇందులో ఇంకో విషయం ఒకటి బాగా నచ్చింది -మాసిడోనియన్లు గొప్ప భవన నిర్మాతలు అని ,వారు కట్టిన సిటడేల్స్-కోట ప్రహరీ గోడలు -10 అడుగుల మందంగా కట్టారని ,రాజ సమాధులను తేనెటీగ గూడు లాగా నిర్మించారని ,వాటి నిర్మాణానికి  12 0 టన్నుల బరువున్న కొండ రాళ్ళను ఉపయోగించారని తెలిసి కొంత ఆశ్చర్య పోయాను కాని మన బృహదీశ్వరాలయ నిర్మాణమూ ఇంత బృహత్తరమైనదే  నని సంతోషించాను .గ్రీకు దేశం లో బ్రాంజ్ ఏజ్ ను ‘’ఏజ్ ఆఫ్ హీరోస్ ‘’అంటారని తెలిసింది .12 00 బి సి లో ట్రాయ్ నగర పతనం తర్వాత ఎజియన్ ప్రాంతం ,తూర్పు భాగాలు అనుకోని సంక్షోభం లో పడిబలమైన  మైసీనియన్ సామ్రాజ్యం నాశానమై ఆర్ధిక రాజకీయ సంస్క్షోభాలలో కూరుకు పోయి ఆటవిక జాతులు సిటీలను ఆక్రమించి మైసీనియన్ నాగరకత  కనుమరుగైంది . .ఈ  11 ౦౦ -8 ౦౦ బి సి సంక్షోభ  కాలాన్ని ‘’డార్క్ ఏజ్ ‘’అన్నారు చరిత్రలో .మళ్ళీ -8 ౦౦-500 బి సి నాటికి గ్రీసు వైభవం మొదలైంది .దీన్ని ఆర్కాయిక్ ఏజ్ అన్నారు .క్రమగా ఈజిప్ట్ తో నౌకా వ్యాపారం సాగించారు .

 ఇక 22-4-17 శనివారం నాడు షార్లెట్ లో హిందూ సెంటర్ లో జరిగిన ‘’శ్రీ సత్యసాయిబాబా ‘’ఆరాధనోత్సవం ‘’పై వివరంగా రెండో భాగం లో రాస్తాను .

 మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -23-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

గ్రీకు నావికాదళ పిత -డెమిస్టో క్లెస్

గ్రీకు నావికాదళ పిత -డెమిస్టో క్లెస్

 

ఏథెన్ ల స్వర్ణయుగం డేమిస్తో క్లెస్ తో ప్రారంభమైంది .గొప్ప రాజకీయ వేత్త మహా నావికుడు దార్శనికుడు ,యుద్ధ తంత్ర నిపుణుడు అయిన ఇతను క్రీ పూ 48 0లో పెర్షియన్ సైన్యాన్ని చిత్తుచిత్తుగా సలామిస్  యుద్ధం లో ఓడించాడు . ఆతర్వాత గ్రీకుల ప్రాభవం పెరిక్లేస్ వలన వచ్చింది .ఇక ఫిలిప్ అలేక్సాందర్ ల సంగతి చెప్పనక్కర్లేదు. విశ్వ విజేత అనిపించాడు అలెక్సాండర్.దీనికంతటికీ ప్రాధమిక శక్తి నిచ్చినవాడు డేమిస్తో క్లెస్ .మహా మేధావిగా ,అకస్మాత్తుగా విరుచుకు పడే ఆపత్సమయం లో బుర్ర పాదరసం లా పనిచేసి ప్రతిక్రియ చేసే పోరాట యోధుడిగా పేరు పొందాడు .ఎమర్జెన్సీ నిఎదుర్కోగల సర్వ సత్టాక ఉన్నవాడు .

 క్రీ .పూ .5 23లో ఎదేన్స్ ఈశాన్య భాగం లో ఆటిక్ జిల్లాలో పుట్టాడు .తండ్రిపేరు నియోక్లాస్ అంటే కొత్త కీర్తి .అరిస్టాక్రాట్ భూస్వామి. తల్లి విదేశీయురాలు .ఉత్తర గ్రీసులో త్రేస్ లో పుట్టింది .ఆమె ఏసియా మైనర్ కు చెందిందని బానిస అని కూడా అంటారు .చిన్నప్పటి నుంచి విజయాలు సాధించి పేరు ప్రఖ్యాతులు పొందాలని భావించాడు .ఆల్కేమేయోనిడ్స్ కు చెందిన ఆర్చిప్ ను పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఆమె అయిదుగురు కొడుకుల్ని ముగ్గురు కూతుళ్ళను కని పెట్టింది ..అప్పటికే సోలోన్ తెచ్చిన సంస్కరణలవలన సామాన్యులు కూడా పార్టీ సభ్యులయ్యారు కింది మధ్య తరగతి వారి చేతుల్లో అధికారం ఉన్నా అరిస్తోక్రాట్ ల ప్రభావం జాస్తీగానే ఉండేది .

 క్రమగా ఎదీనియన్ రాజకీయాలలో ప్రవేశించి సమాజం లో గుర్తింపు పొందాడు .493బి సి లో మొదటిసారిగా ఆర్కాన్ కు  చీఫ్ ఆర్కాన్ గా ఎన్నికై రాజకీయ అరంగేట్రం చేశాడు .ఇక వెనకడుగు వేయలేదు .ముందుకే మును ముందుకే దూకాడు ..ఈ యువ  వయసులోనే తాను   విజన్ ఉన్న నాయకుడిగా అందరికి అభిప్రాయం కలిగించాడు .ఎదేన్స్ కు అయిదు మైళ్ళ దూరం లో శతాబ్దాలకాలం ఫెలేరాన్ బే చాలా బహిరంగం గా ఉండి పోయింది .నైరుతి భాగాన ఉన్న ఇదే ఓడ రేవు .దూర  దృష్టికల డేమిస్తో   ప్రక్రుతి సిద్ధమైన మూడు పైరేయాస్ హార్బర్ లుబాగా వృద్ధి చెందితే  శత్రువులనుంచి రక్షణకు చాలా అనుకూలంగా ఉంటుందని భావించాడు .ఇది అయితే బోర్లించిన కప్పు ఆకారంగా ఉండి శత్రువులను నివారించటం సులభం అన్నాడు .అందుకని హార్బర్ ను అంతటినీ ఒక సన్న గోడ ద్వారా అప్పర్ సిటీకి అనుసంధానం చేస్తే వాల్లెడ్ కారిడార్ ఏర్పడి దేశానికి ప్రమాదం ఉండదని నచ్చ చెప్పాడు  కాని ఇది కొంతకాలానికి కాని సాధ్యపడలేదు .ఆతను ముఖ్య ఆర్కాన్ కాక ముందు ఒక ఏడాది క్రితం పెర్షియన్ నౌకలు గ్రీకు సంయుక్త బలగాలను విపరీతంగా ధ్వంసం చేసి అలీనియా మిలీతియాస్ పట్టణాలను లోబరచుకున్నాయి .దీనితో గ్రీకు ప్రపంచం ఒక్కసారిగా హడలి పోయింది .క్రీ పూ 4 90లో మళ్ళీ పర్షియన్లు గ్రీకు భూభాగం మరాతాన్ పై దాడి చేసి న సందర్భం లో సేనాని మిలిటి యేడ్స్ వెనక ఉన్న పది మంది ఎన్నికైన జనరల్స్ లో ఒక్కడుగానే ఉన్నాడు .ఇంకా రంగ ప్రవేశం చేయలేదు .

 ఎదీనియన్లు తమను మోసం చేసినందుకు శిక్షగా మిల్టాడియాస్ ను తొలగించి చాలా మందిపై ప్రయోగాలు చేశారు కాని చివరికి దెమిస్తో క్లెస్ అందరి దృష్టినీ ఆకర్షించి ఒకరిద్దరు ప్రముఖులలో ఒకడుగా నిలిచాడు .పగ్గాలు అప్పగించారు మరాతాన్ యుద్ధం లో దెబ్బతిన్న పర్షియా మళ్ళీ కాలుదువ్వదని అందరూ నమ్మారు కాని దాని స్వభావం తెలిసిన ఇతను మాత్రం సమయం చూసి మళ్ళీ పర్షియా విరుచుకు పడుతుంది అన్నాడు .చివరికి అందరూ అంగీకరించి తక్షణ కర్తవ్యం ఏమిటో చెప్పమన్నారు .ఎదేన్స్ నౌకా బలగాన్ని బాగా అభి వుద్ది చేసుకోవటం ఒక్కటే మార్గమని చెప్పాడు .కొత్త యుద్ధ నౌకలు నిర్మించటం నావికులకు శిక్షణ నివ్వటం తప్పనిసరి అన్నారు .అతని ది ఎదేన్స్ ది అదృష్టం బాగుండి  వెండి గనులు బంగారు గుడ్లు పెట్టి విపరీతమైన  లాభాలు చేకూర్చాయి .ప్రజలందరూ దాన్ని తలాకాస్తా పంచుకుందాం అన్నారు

.అలా పంచుకొంటే ఒక్కోమనిషికి10 ద్రాక్మాలు వస్తాయి .అందుకని దెమిస్తో క్లెస్ వాళ్లకు నచ్చ చెప్పి ఆ మొత్తం లాభాలను రెండు వందల యుద్ధ నౌకలు నిర్మించటానికి ఉపయోగిద్దామని చెప్పాడు .’’వాకే’’ అన్నారు అంతా .

 అనుక్న్న నౌకానిర్మాణం కోటల పతిస్టీకరణ సైనిక శిక్షణ ,పైరేశియాస్ వద్ద హార్బర్ విస్తరణ జరిగిపోయాయి .చివరికి ఆతను చెప్పినట్లే పర్షియా సైన్యం ఏసియా మైనర్ మీదుగా హీల్స్ పాయింట్ కు 4 8 ౦ లో రెండులక్షల సైనికులు ,80౦ మంది ఆశ్విక దళం  వెయ్యి దాకా యుద్ధ నౌకలతో ఒక లక్షా యాభై వేలమంది నావికులతో దాడికి దిగింది .మొత్తం 3 లక్షలమంది అని చరిత్రకారులు రాశారు . అవాక్కయింది దేశం .డెల్ఫీ వెళ్లి దేవతను సలహా అడగాలని వెళ్ళారు .అక్కడ ప్రీస్ట్ ద్వారా దేవత ‘’ఒక్క కర్ర గోడ మాత్రమె మిమ్మల్ని  మీ సంతానాన్ని రక్షిస్తుంది’’ అని జోశ్యం చెప్పింది .కొయ్య గోడ అంటే ఏమిటో అని అందరూ బుర్రలు బద్దలు కొట్టుకున్నారు .తలోమాటా చెప్పారు అప్పుడు దెమిస్తో క్లెస్ అది తాము నిర్మించిన కొత్త నౌకాదళం అని చెప్పాడు అప్పుడు అందరూ నమ్మారు .అంతేకాదు ‘’స్త్రీ కొడుకులు సలామిస్ లో చనిపోతారు అని చెప్పినదానికి  పర్షియన్లు  ఓడిపోవటం ఖాయం అనీ అర్ధం వివరించి చెప్పాడు .

 పర్షియన్ దాడి ప్రమాదానికి అప్రమత్తమైన దెమిస్తో క్లెస్ చుట్టుప్రక్కలున్న సిటీ స్టేట్ ల నాయకులతో సంభాషణ జరిపి దక్షిణ గ్రీసును ఎలాకాపాడుకోవాలో చర్చించాడు .జేర్జియాస్ నాయకత్వం లోని అతి పెద్ద యుద్ధ సమూహాలను భూసైనికులతో పోరాటం అచ్చి రాదనీ ,పెర్షియన్ యుద్ధ నౌకల ద్వంసమే తక్షణ కర్తవ్యమని తెలియ బర్చాడు ,వారి నౌకాబలగం క్షీణిస్తే ఆహార పదార్ధాల  సరఫరా  రాక  లోన్గిపోవటమో పారిపోవటమో చేస్తారు అని యుద్ధ వ్యూహం వివరించాడు

 క్రీ పూ 48 ౦ సెప్టెంబర్ లో పర్షియా సైన్యం గ్రీసు దక్షిణభాగం పై దాడి చేసి ఎదేన్స్ వైపుకు దూసుకు వస్తోంది .వెంటనే మెరుపులా ఆలోచనవచ్చి ఎదేన్స్ ను తక్షణం ఖాళీ చేయవలసిందిగా ఎమర్జెన్సీ ఆర్డర్ జారీచేశాడు .సిటీ గార్డియన్ ఎతేనా కు అప్పగించి పిల్లలు స్త్రీలను పెలో పోనిసియాన్ తీరానికి ,ముసలి వారు బానిసలను సలామిస్ కు పంపించాడు  .మిలిటరీ లో చేరే వయసున్నవారందరినీ తమ రెండు వందల యుద్ధ నౌకలకు కాపలాగా ఉంచాడు .సెప్టెంబర్ 17 న పర్షియన్ సైన్యం ఎదేన్స్ చేరి అంతా  నిర్మానుష్యఎడారిగా ఉండటం చూసి కేరింతలతో రాజు జేర్జేస్ కు జేజేలు కొట్టి ఇంతసులభంగా ఎదేన్స్ స్వాదీనమయినదుకు తమలో తాము అభినందిన్చుకొన్నారు ..ఇదే సమయం లో గ్రీకు జనరల్స్ యుద్ధ నౌకల పనిలో పడ్డారు .ఇదే దేమిస్తోక్లేస్ కు బంగారు గడియలు అయ్యాయి .మిగిలిన జనరల్స్ అట్టికా ఖాళీ చేసి కోరింత్ వద్ద ఇస్తమస్ లో రక్షణ కవచంగా ఉన్నారు .కాని ఆతను ‘’గ్రీసును రక్షించాలి అంటే సలామిస్ దగ్గరే యుద్ధం చేయాలి కాదని అక్కడ చేస్తే బహిరంగ  సముద్రం లో యుద్దమై మనకు విజయాన్ని ఇవ్వదు మనం నారో వాటర్స్ లో యుద్ధం చేస్తేనే అంత పెద్ద సైన్యాన్ని గెలవగలం అన్నాడు .కొందరు సైన్యాధికారులు గోణుక్కున్నా తీవ్రం గా హెచ్చరించి తానూ చెప్పినట్లే చేయాలని   లేక పొతే ఇటలీ వెళ్లి అక్కడ మన నౌకాదళం లేక  నెత్తిమీద చెంగేసు చెంగేసుకోవాలి’’అని   హుకం జారీ చేశాడు

సెప్టెంబర్ 20 జేర్జేస్ నారో వాటర్ ఉన్న సలామిస్ జలసందిలోనే యుద్ధం చేయమని  ఆజ్న ఇచ్చాడు .దగ్గర ఉన్న ఎత్తైన కొండ ఎక్కి యుద్ధం చూస్తున్నాడు ..తమకున్న 600యుద్ధనౌకలతో మొత్తం35 0కూడా లేని  గ్రీకు యుద్ధనౌకలు  ఏమాత్రం నిలవరించలేవని గర్వపడ్డాడు .పెర్షియన్ సైన్యం ఆ ఇరుకు బొక్కలో యుద్ధం చేయలేక బోనులో పడ్డ ఎలుకల్లా అగ్నిలో పడ్డ మిడతల్లా గ్రీకు యుద్ధ నౌకలకు ఆహుతయ్యారు ..దొరికిన వాళ్ళను దొరికినట్లు ఊచకోత కోసింది గ్రీకు సైన్యం  దీనితో గ్రీకును విజయ తీరాలకు చేర్చి పెర్షియన్ సైన్యం పలాయనం చిత్తగించేట్లు చేశాడు .

 గ్రీకు విజయానికి దేమి క్లెస్ యుద్ధ నీతి మాత్రమె ఫలించింది .ఈ విజయానికి పొంగిపోక స్పార్టా ఎప్పుడూ పక్కలో బల్లెం గానే ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు నమ్మలేదు చాలామంది . స్పార్టా తో చర్చలు జరుపుతున్నట్లు నటించి ఆదేశం వెళ్లి మరింత లోతుగా చర్చలు చేసి తిరిగి వచ్చేసరికి యువకులంతా నడుం బిగించి యుద్ధంలో దెబ్బతిన్న గోడలన్నీ మళ్ళీ కట్టారు .ఈ విధంగా ఎదేన్స్ నావికా దళాన్ని వృద్ధి చేసి ఎదురు లేని నావికా దళం గా నిలబెట్టి నావికా దళ పిత అనిపించుకొన్నాడు దెమిస్తో క్లెస్ .క్రీ పూ 4 7 0 కి ఎదేన్స్ సామ్రాజ్యం బలంగా రూపు దాల్చింది .స్పార్తాకు బద్ధ విరోదిగానే ఉన్నాడు .మిల్తి యేడ్స్ కొడుకు సైమన్ అధికారం పొందాడు .ఇతన్ని దేశ బహిష్కరణ చేశాడు .పర్షియా రాజుతో లోపాయకారీగా ఒప్పందం చేసుకోన్నాడని అభి యోగం మోపారు .అతని దురదృష్టం వలన ఎక్కువమంది ప్రజలు దాన్ని నమ్మారు .ఇక్కడినుంచి అనేక ప్రాంతాలు తిరుగుతూ వలస జీవితం అనుభవించాడు మహా వీరుడు   పర్షియన్ రాజు  జేర్జేస్ ను కలిస్తే ఆయన ఆర్కాన్ చీఫ్ ను చేశాడు .ఏసియా మైనర్ లో ఉన్న మాగ్నేసియా సిటీ గవర్నర్ పదవి ఇచ్చాడు

ఇన్‌లైన్ చిత్రం 1 ఇన్‌లైన్ చిత్రం 2

ఇన్‌లైన్ చిత్రం 3

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నేతి–నేతి-’’ఏతి’’

నేతి–నేతి-’’ఏతి’’

పరబ్రాహ్మం ను తెలుసుకోవటానికి ఇదికాదు అదికాదు అంటే నేతి నేతి -అంటే నా ఇతి ఇదికాదు అంటూ పోయి చివరికి ఆత్మయే పరమాత్మ అని తెలుసుకోమని వేదం ఉపనిషత్తులు బోధించాయి .ఇదే ఎలిమినేషన్ పధ్ధతి . అలాగే సుమారు 25 ఏళ్ళక్రితం హిమాలయాలలో మంచు మనిషి ఉన్నాడని అక్కడ కనిపించాడు ఇక్కడ కనిపించాడని పరిశోధకులకు ప్రోత్సాహం కలిగించి వాళ్ళందరూ వెళ్లి చూసి మంచుమనిషి ఉన్నదని కొందరు లేరని కొందరూ ఎటూ తేల్చలేక పత్రికలకు కావలసినంత మేత పడేశారు . పత్రికలూ పతాక శీర్షికలతో హల చల్ చేసినసంగతి మనకు తెలుసు .యదార్ధం ఏమిటో ఇప్పటికీ బ్రహ్మ పదార్దమే . ఏతి అంటే మంచుమనిషి .దానికే ‘షాంగ్రిల ‘’అనే పేరు .హిమాలయ సానువులలో జన్మించి సుమారు 5 0 ఏళ్ళు హిమాలయ పర్వతాలను ఆ చివర నుంచి ఈ చివర దాకా శోధించి అన్ని ఎత్తులలోను కాలినడకన సంచరించి గుహలలో తపస్సు చేసి హిమాలయాలే తనకు పాశాలలు అని తన అనుభవాలను ‘’లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్ ‘’గా రచించిన స్వామి రామ మంచుమనిషి అనేది లేదని అదొక భ్రమ అని తేల్చి చెప్పారు . ఆ విషయాలే మీకు తెలియ జేస్తున్నాను .

 పాశ్చాత్యులకు హిమాలయాలలో ఏతి -శాంగ్రిల అనే మంచుమనుషులుఉన్నారని భ్రమపడి ఎన్నో పరిశీలనలు చేశారు .వీరికి స్థానిక షెర్పాలు సామాను మోయటానికి దారి చూపటానికి సాయపడే వారు ఏ షేర్పా కూడా తానూ యేతి ని చూసినట్లు ఇంతవరకు చెప్పలేదు వాళ్ళు ఎక్కలేని ఎత్తు లేనేలేదు .

 అయితే ఈ నమ్మకానికి కారణం హిమాలయాలలో చాలా ఎత్తున ఉన్న రెండు పురాతన మొనాస్ట రీస్ అంటే’’గుహా  మఠాలు.’’ ఇవి అనుశ్రూతంగా తపస్సుకు అత్యంత అనుకూలమైన ప్రదేశాలుగా చెప్పబడ్డాయి .ప్రశాంతమైన వాతావరణం ,తపస్సుకు ఎలాంటి భంగమూ కలిగించని పరిస్తితులు ఇక్కడ ఉండటం వలన యోగులు ఇక్కడిదాకా కస్టపడి వచ్చి ధ్యానం తపస్సులతో ఆత్మ జ్ఞానం పొందేవారు .ఇందులో ఒక మఠం లేక ఆరామం కాంచనగంగ శిఖరం పై సుమారు 14 వేల అడుగుల ఎత్తున ఉన్నది ,రెండవది హిమాలయ అంతర్భాగం లో టిబెట్ -గార్వాల్ సరిహద్దులో ఉంది .ఈ గుహాకార ధ్యాన మందిర౦  లేక మఠ౦  చాలా మంది ఉండటానికి అనువుగా ఉంది .ఇది సుమారు 12 వేల అడుగుల ఎత్తులో ఉంది. చాలా కొద్దిమంది మాత్రమే ఇక్కడికి చేరుకోగలరు .ఇది ఇప్పటికీ ఉంది .ఈ గుహా మఠం లో సంస్కృత ,టిబెట్ ,సంధ్యాభాష వ్రాత ప్రతులు లభిస్తాయి .

  సాధారణంగా విదేశీయులు డార్జిలింగ్ వచ్చిషెర్పాల సహాయం తో  హిమాలయాలు చూస్తారు  .వాళ్ళ పరిశోధనలో షా౦గ్రిల లేక ఏతిఅనే మంచుమనిషి ప్రస్తావన వస్తుంది .అందర్నీ అడుగుతుంటారు మీరు చూశారా మీరు చూశారా అని అదొక ఉత్కంఠ వాళ్లకు .అయితే  వీళ్ళకేవ్వరికీ గోచరించని హిమాలయ ప్రాంతాలున్నాయి. వీళ్ళు ఎవరూ అక్కడికి వెళ్లి శోధన చేయలేదు చేయలేరుకూడా ..ఒకసారి ఒక అమెరికా  ధనవంతుడు మంచుమనిషి ని అన్వేషి౦చ టానికి వచ్చి స్వామి రామా ను అడిగాడు .స్వామి తనకు అలాంటి మనిషి ఎక్కడా ఇన్నేళ్ళలో కనిపించలేదని రామా చెప్పారు ..నాలుగునెలలు ఉండి ౩౩ వేల డాలర్లు ఖర్చు చేసి ఎలాంటి ఫలితమూకనిపించక తిరిగి వెళ్ళిపోయాడు .ఢిల్లీ వెడుతూ దారిలో ఒక నేపాలీ సాధువును ఫోటో తీసి ఆయనే మంచుమనిషి అని చెప్పి పేపర్లలో ప్రచురించాడుకూడా .మరో పాశ్చాత్య మహిళా సిక్కిం నుంచి హిమాలయాలకు షేర్పా లసాయం తో వచ్చింది .డార్జిలింగ్ లో ఉంటూ మూడు సార్లు ప్రయత్నించి స్నోమాన్ ను కనుక్కోలేక పోయింది

 తానూ చిన్నతనం నుంచి హిమాలయాలలో సంచరిస్తున్నా తనకు ఎప్పుడూ మంచుమనిషి  షంగ్రిలా అనే ఏతి కనిపించలేదని స్వామి రామా చెప్పారు ..కాని హిమాలయ వాసులు వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మల వలన మంచుమనిషి కధలు గాధలూ ప్తరతరాలుగా వింటున్నారని అన్నారు .మానవుడికి ఫాంటసి అతి ప్రాచీనకాలం నుండే అలవడింది. అప్పటినుంచీ మంచుమనిషి కధ ప్రచారం లో ఉంది ..హిమాలయాలలో మంచు దట్టంగా ఉన్నప్పుడు మన చూపు కు ఆటంకమేర్పడి వస్తువులు అస్పష్టంగా కనిపిస్తాయి .అప్పుడు అతి అరుదుగా కనిపించే ఎలుగు బంట్లు దూరం నుంచి చూస్తే మంచు మనుషులు అనిపిస్తాయి .కంటి దోషమేకాని యదార్ధంగా మంచు మనిషి కాదు .ఈ ఎలుగులు చాలా ఎత్తైన ప్రదేశాలలో మాత్రమే ఉంటాయి .పరిశోధకుల ఆహార పదార్ధాలను ఎత్తుకు పోయి తినేస్తాయి .అప్పుడు వాటి పాదాల గుర్తులు మానవ పాదం గుర్తులులాగా మంచులో దిగి చాలా పెద్దగా కనిపిస్తాయి .కనుక పరిశోధకులు ఈ పెద్దపాదాలను మంచుమనిషి పాదాలుగా భ్రమ పడుతారు .భ్రమ వలన కలిగే పొరబాటు ఇది .అంతేకాదు ఎలుగుబంటి మంచుపై వేగంగా పరుగెత్తినా,ఎత్తుకు ఎక్కుతున్నా  కిందికి దిగుతున్నా  దాని పాద ముద్రలు మామూలుకంటే చాలా పెద్దవిగా కనిపించటం సహజ౦ .తాను పెంచుకున్న ఎలుగు బంటి పాదముద్రలు కూడా ఇలాంటి సందర్భాలలో పెద్దవిగా చూడటం ఆశ్చర్య పోవటం జరిగింది అని స్వామి తెలియ జేశారు .దీనినే స్వామిరామ ‘’హిమాలయ మాయ ‘’అన్నారు .

 అంతా బాగానే ఉందికాని అసలు ఈ ఏతిఅనే మాట ఎక్కడిది ,ఎందుకు వచ్చింది ?ఏతి కాదు అసలు పేరు ‘’యతి ‘’అంటే సన్యాసి ,యోగి అని అర్ధం .అది అపభ్రంశమై ఏతి గా మారింది .శంకరాచార్యస్వామి శిష్యులను యతులు అంటారు .వీరు ఈ  అత్యంత ఎత్తైన  హిమాలయాల గుహలలో తపస్సు చేసుకుంటారు . ఈ యతులు సాధారణం గా గుహలలో ఉంటారు బయటికి రారు ఎప్పుడైనా వీరు బయటికి వచ్చి కనిపిస్తే ఈ యతులను ఏతులు గా అంటే మంచు మనుషులుగా షంగ్రిలాలుగా భ్రమ పడుతారు అదీ అసలు రహస్యం

 19 వ శతాబ్దికి పూర్వం నుంచే యేతిపదం ప్రచారం లో ఉంది .19,20  21 శతాబ్దాలలోకూడా చాలామంది చాలా దేశాలనుంచి వచ్చి మంచుమనిషిపై  హిమాలయాలలో పరిశోదిన్చారుకాని అని ఫలితం శూన్యం .20 04 ,7 ,8 11 .లలో కూడా కష్టపడ్డారు .రష్యాలో 20 11 లో ఒక కాన్ఫరెంస్ జరిగి సైంటిస్ట్ లు తాము సేకరించిన  సాక్ష్యాదారాలలో తొంభై ఐదుశాతం యేతి ఉన్నట్లు రుజువైందని చెప్పారు .కాని అందులో పాల్గొన్న అమెరికన్ ఆన్త్రో పాలజిస్ట్ ,అనాటమిస్ట్ జెఫ్రీ మెల్ డ్రంమాత్రం వారితో ఏకీభవించక అదంతా స్థానికులు ప్రచారం కోసం చేసిన స్టంట్ అని తెల్చిపారేసి వాళ్ళ ఆశలపై నీళ్ళు కుమ్మరించాడు .కనుక ఇప్పటికి’’ ఏతి’’ నేతి నేతి గా నే ఉంది .’’యతి ‘’అనుకొంటే మళ్ళీ సందేహాలు రావు .బ్రహ్మ పదార్ధం సిద్దించినట్లే .

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2

ఇన్‌లైన్ చిత్రం 3ఇన్‌లైన్ చిత్రం 4

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-4-17-కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

హిమాలయ గుహాంతర ఆశ్రమ (మఠ)జీవన విధానం

హిమాలయ గుహాంతర ఆశ్రమ (మఠ)జీవన విధానం

 

హిమాలయాలలో కొన్ని గుహలలో నాలుగైదు మంది ఉండే అవాకాశం ఉంది .అక్కడ పవిత్ర జీవనం హాయిగా నిరాటంకం గా గడపవచ్చు .ఇక్కడ  సంప్రదాయం అవిచ్చిన్నంగా కొనసాగుతూనే ఉంటుంది .కొన్ని పెద్ద గుహాంతర ఆశ్రమాలు మొనాస్టరీ లుఉంటాయి .వీటిలో సంప్రదాయం అయిదు వేల సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది .అందులో చేరిన మొట్టమొదటి గురువు ఎవరో ఆ తర్వాత వచ్చిన వారెవరెవ్వరో ,సంప్రదాయం ఎలా అక్కడ ప్రారంభమైందో రికార్డ్ లున్నాయి .

ఈ మఠాలనబడే గుహాశ్రమాలలో అనేక గదులు ఉంటాయి .శతాబ్దాలుగా అవి ప్రకృతి చేత స్వయం సిద్ధంగా తయారు చేయబడి చాలా మంది విద్యార్ధుల జ్ఞాన సముపార్జనకు తోడ్పడుతున్నాయి .అందులో తరతరాలుగా ఉన్నవారు సౌకర్యం ప్రశాంతత ల  కొరకు వాటిని తీర్చి దిద్దుకున్నారు . అయితే ఆధునిక హ౦గు లేమీ ఉండవు ..స్నానాలగది, వంటగది వంటివి ఉండవు .కాని హాయిగా జీవనం గడపటానికి సరిపోతాయి .గుహ అంటే నే చీకటి గుయ్యారం అని అనుకొంటాం. కాని ఈ గుహలలో దూప్ అనే పేరున్న పొడవైన కర్రలు వనమూలికలతో చేయబడి ఉంటాయి ..దాన్ని వెలిగిస్తే కా౦తినిస్తుంది   ఆర్పితేసువాసన వెదజల్లుతుంది నాలుగు అంగుళాల పొడవు అంగుళం మందం తో దూప్ తయారు చేస్తారు ..దానికాంతిలో కంటికి ఏ మాత్రం శ్రమ లేకుండా వేదం శాస్త్ర గ్రంధాలను అన్నీ హాయిగా చదవ వచ్చు .దాన్ని ఆర్ప్గగానే సుగంధ పరిమళం వ్యాపించి మానసిక హాయి నిస్తుంది .ఇది కాక పొతే పైన్ ,దేవదారు వృక్షాల కొమ్మలను తెచ్చి వెలిగించి కాంతిని పొందుతారు .వీటిలో  ప్రకృతిసిద్ధమైన జిగురు పదార్ధం -రేజిన్ ఉండి మంట నిరనతరం గా మండటానికి దోహదం చేస్తుంది .ఇవే టార్చి లైట్లు గుహలో .గుహ   నిరనతరం  వెచ్చగా ఉండటానికి ‘’ధుని ‘’ఏర్పాటు చేస్తారు .అంటేలావుపాటి దుంగలను మండిస్తారన్నమాట .పెద్ద పెద్ద కొయ్య దుంగలను వేసవికాలం లోనే నరికి పోగు చేసి గుహలో లాట్లు గా పేరుస్తారు కట్టెల అడితీ లోలాగా .

 

కొన్ని రకాల పుట్టగొడుగులు ,లింగోరా ,ఓగల్ అనే అత్యధికంగా దొరికే  కాయ గూరలను  దుంపలను ,వ్రేళ్ళను వండుకొని లేక పచ్చివి తింటారు .ఇందులో తరూర్ ,గెంతి ముఖ్యమైనవి .మిగిలినవి చిలగడ దుంపలు లాగా బాగా తియ్యగా ఉంటాయి .బార్లీ బంగాళాదుంప ,గోధుమ ,పప్పు ధాన్యాలు ,మొక్కజొన్న ,లు హిమాలయాలలో 6 ,500 అడుగుల లోపు ఎత్తుప్రదేశాలలో పండుతాయి .వీటినీ వాడుతారు .ప్రతిగ్రామం లో కుటీర పరిశ్రమ ఉంటుంది .అక్కడ నాణ్యమైన ఉలెన్ దుప్పట్లు జంపఖానాలు  వేడి నిచ్చే దుస్తులు లభిస్తాయి .నీటికి  ఇబ్బంది ఉండదు చిన్న చిన్న నీటి ప్రవాహాలు ప్రతి గుహ దగ్గరా ,గుహలో కూడా ప్రవహిసాయి .నవంబర్ డిసెంబర్ నెలలో నీరు గడ్డ కడితే మంచు కరిగించి నీటిని వాడుతారు .మనాలి లాంటి ప్రదేశాలలో స్వచ్చమైన నీరు దొరకదు .మూడు నాలుగు మైళ్ళు నడిచి మంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తుంది .  ఇప్పటికీ హిమాలయాలలోని కొన్ని గుహా౦తర ఆశ్రమాలలో గురువులు సంప్రదాయ పద్ధతిలో విద్య బోధిస్తూ కనిపిస్తారు .దేశం లోని అనేక ప్రాంతాలనుండి శిష్యులు వచ్చి విద్య నేర్చుకొంటారు .అంతఎత్తు ఎక్కి గురువుల వద్ద విద్య నేర్వటం చాలాకస్టమే. కాని దీక్షా పట్టుదల ఆసక్తి ఉన్నవారికి అది అసాధ్యం అనిపించదు .హిమాలయాలు గురుశిష్యులను జాగ్రత్తగా కనిపెడుతూ ఉంటాయి .విద్యార్ధులు ఇంటినుంచి బయల్దేరి ఉత్తమ గురువును అన్వేషిస్తూ వారిని దర్శించి విద్యను  అభ్యాసం చేస్తారు. అలాంటి శిష్యులకోసం గురువు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు .హిమాలయ అంతర్భాగం లో మహా  మహి మాన్విత ఋషులు తపస్సు ,ధ్యానం చేస్తూ వారికి దర్శన మిస్తారు. వారి జన్మ తరించినట్లు భావితారు .

 గృహాశ్రమాలలో విద్యా బోధనప్రయోగాత్మక పద్ధతిలో -డిమాన్ స్ట్రేషన్ విధానం  లో ఉంటుంది .బోధన నిర్నీతకాలాలలో జరుగుతుంది .కొంత విద్య నేర్చిన తర్వాత గురువు శిష్యులను తమ ప్రావీణ్యం ప్రదర్శించ మని కోరుతాడు .ఒక్కోసారి మౌనంగా నే బోధ ఉంటుంది .మౌన గురువు అని దత్తాత్రేయ స్వామికి పేరున్న సంగతి మనకు తెలుసు .మౌన వ్యాఖ్యానమే ఆయన  ఆయన పధ్ధతి .శిష్యులు విద్య బాగా గడించాక గురువు ‘’మీ జీవిత కాలం అంతా ఇక్కడే గుహలో చదువులో గడిపితే యోగుల వద్ద మిగిలిన వారు ఎప్పుడు నేర్చు కుంటారు ?’’అని అడుగుతారు .కనుక కొన్నేళ్ళ తర్వాత వాళ్ళు గుహాశ్రమం నుండి బయటికి విశాల ప్రపంచం లోకి అడుగు పెట్టి మరింత విజ్ఞానం సాధిస్తారు ..

 వ్యక్తీ సృజనతో ,పరోపకారంగా జీవించాలి .దీనికి అంతర్ దృష్టి ,మనసుపై నియంత్రణ సాధించాలి .వీటిని గుహాశ్రమాలలో క్షుణ్ణంగా నేర్చుకొంటే ,తరువాత వీటిని సాధన చేస్తే జీవిత పుష్పం నిరంతరం వికసించి ఫలితం కలిగిస్తుంది .ఇది సాధిస్తే జీవితం లో   కస్టాలు సమస్యలను అవలీలగా ఎదుర్కొని ముందుకు సాగి అభివృద్ధి చెందవచ్చు .

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విదేశీ హాస్యరసం ప్రవహించిన విదానం బెట్టిదనిన –

విదేశీ హాస్యరసం ప్రవహించిన విదానం బెట్టిదనిన –

నవ్వు హాస్యం  చెణుకు వ్యంగ్యం శ్లేష ,రిపార్టీలకు చలించని మనిషి ఉండకపోవచ్చు ఎవరైనా ఉన్నా ఎక్సేప్శనల్ కేసులుగా భావిస్తాం .అసలు నవ్వటానికి కారణాలు చెప్పచ్చుకాని ఎందుకు నవ్వుతామో చెప్పలేము .నవ్వు ‘’కలలు’’వంటిది అన్నారు  .అయిదు వేల ఏళ్ళక్రితం అంటే క్రీ.పూ 29౦౦ లో ప్రాచీన ఈజిప్ట్ లో నవ్వు కు ఒక  చిత్ర లిపి -ఈరోగ్లిఫ్ కనిపించింది .అందులో ఒక వంకర కర్ర దానిపక్కన పాదం ఆకారం తో కాలు ,తర్వాత  పడుకోబెట్టిన వంకరకర్ర పైన అర్ధ చంద్రాకారం దానిప్రక్కన కూర్చున్న మనిషి చిత్రాలున్నాయి ఇదే నవ్వుకు మొదటిసారిగా కనిపించిన ఆధారం అని చెబుతారు .ఈజిప్ట్ గ్రామర్ ,స్క్విగిల్స్ పై దిట్టయైన సర్ అలాన్ గార్దేనర్ తాను హీరోగ్లిఫ్ గీస్తున్నప్పుడల్లా  వాటిని చూసి నవ్వు ఆపుకోలేక పోయానని రాశాడు .ఓల్డ్ టెస్టమెంట్ లో 26నవ్వు సందర్భాలున్నాయి .అయితే వీటివలన నవ్వు ఎందుకు వస్తుందో తెలియదు .ఇందులో  నాటు హాస్యం ఒకటి ఉంది ముసలివారయిన అబ్రహాం సారా  దంపతులకు సంతానం లేదు .ఒక రోజు  ఒక దేవత దేవునిలా ప్రత్యక్షమై అబ్రహాం గుడారం బయట ఉన్నప్పుడు ,భార్య లోపల అతిధులకు వంట చేస్తున్నప్పుడు అబ్రహాం తో ‘’నీభార్య సారా కు కొడుకు పుడతాడు ‘’అని చెప్పింది ఈ మాట లోపల ఉన్న భార్య సారాకు వినిపించింది .ఆమె పగలబడి నవ్వింది .కాటికి కాళ్ళు చాచుకున్న ముదిమి వయసులో  ఆయనతో శృంగారం ఏమిటి సుఖమేమిటి  పిల్లలు యెట్లా పుడతారరు?..ఈ నవ్వు దేవుడికి తనను అవమానించినట్లు అనిపించింది .’’దేవుడికి అసాధ్యం ఉన్నదా ?’’అడిగాడు ఆమె నవ్వు ఆపి ‘’నవ్వేట్లు చేసింది నువ్వే ‘’  ‘’అంది .ఆమె నవ్వుకు ఆమె కారణం చెప్పలేదు .ఊహించాలి .ఆమె మాటల అంతరార్ధం తెలిస్తే మనమూ నవ్వుతాం .ఇదే మొదట రికార్డ్ అయిన’’ డర్టీజోక్ ‘’గా భావించారు .అంటే అబ్రహాం కు అంగం నిక్కబోడుస్తుందా ,దానితో తానూ సుఖించి సంతానం పొందగలనా అని సారా భావం .కనుక నవ్వుకు ఏ చిన్నవిషయమైనా చాలు .కలిసికట్టుగా నవ్వితే కొందరికి బాధ అసూయ కలగవచ్చు .హోమర్ రాసిన ఇల్లియడ్లో పాగాన్ దేవతలు చాలాసార్లు నవ్వారు ..మనుషుల అనుమానానికి భయానికి నవ్వారు వాళ్ళు .చివరికి అందరు మానవుని ప్రమాదానికి నవ్వారు ..అకస్మాత్తుగా జరిగిన మంచి కాని  చెడుకాని నవ్వుకు కారణం అవుతు౦ది .

ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ నిఘంటువులో ‘’లాఫ్టర్ ‘’కు 36రకాల స్పెల్లింగ్ లున్నాయి .కింగ్ ఆర్ధర్ 8 9 7 ,చాసర్ 13 8 5 రకాలుగా చూపారు.షేక్స్పియర్ కు ‘’లాఫ్ఫే ‘’బాగా నచ్చినమాట .ఇది వార్విక్ షైర్ ఉచ్చారణ .పబ్లిక్ హాస్యం లో రెండు విషయాలున్నాయని మాక్స్ బీర్బోం అన్నాడు .అందులో ఒకటి ఇతర దేశీయులను లేక కొత్తవారు కనిపిస్తే చూసి నవ్వటంఅవతల వాడు బాధలో ఉంటె వికృతంగా కనిపిస్తే నవ్వటం .విశ్లేషిస్తే హాస్యం జోక్ కాదు .కలహారి ఎడారిలోని ఆదిమ బుష్ మెన్ లు  నవ్వు పుట్టించారని ఆర్ధర్ కోస్ట్లర్ అన్నాడు. ఆయన ‘’నవ్వు విలాసవంతమైన అసంకల్పిత ప్రతిక్రియ ‘’అన్నాడు .’’ఇన్ లాఫ్టర్ ‘’రాసిన ఫ్రెంచ్ జ్యూయిష్ ఫిలాసఫర్ హెన్రి బెర్గ్ సన్’’మన పొరుగువాడి తప్పులు సరిచేయటానికి నవ్వుతాం .దీనినే ‘’the collective punishment of society on the un sociable individual ‘’అన్నాడు .జీన్ పాల్ సాత్రే తనకు చూపు తక్కువ కావట వికారంగా చదువు ఆటలలో ముందు ఉండలేక పోవటం తో అందరూ తనను చూసి నవ్వకుండా అందర్నీ తానే నవ్వుల్లో ముంచి మంచి చేసుకోనేవాడినని చెప్పాడు .’’laughter is a respiratory gymnastics ‘’అన్నాడు స్పెన్సర్ .కోస్ట్లర్ ‘’it is trigger releasing ,detonating vast amounts of stored emotions ,derived from various often un conscious sources

  కొందరు మహానుభావులు ఎదుటివారు నవ్వితే భరించలేరు సాహిన్చాలేరుకూడా . .శ్లేష హోమర్ కంటే పూర్వమే ఉన్నా కారల్ మార్క్స్ దాన్ని ‘’ఇంటలేక్త్యువల్ లంపెన్ ప్రోలటేరియట్ ‘’అన్నాడు .ఎంగెల్స్ నవ్వుతుంటే సహిన్చేవాడుకాడు . మిల్టన్ హాస్య  కవి కాకపోయినా సందర్భాను సారం ‘’పన్ బన్’’ బాగానే తయారు చేసేవాడు .ఇక ఫ్రాయిడ్ మహాశయుడు పన్ కు ఫుల్ స్టాప్  పెట్తమని క్రిస్మస్ సీజన్ ను ‘’ది ఆల్క హాలిడేస్ ‘’అన్నాడు .జీవిత మాధుర్యానికి పన్ త్రిపాద స్టాండ్ లో ఒకపాదం అయితే మిగిలినవి పొగ తాగటం జిమ్ తాగటం అన్నాడు   లాంబ్. మాక్స్ ఈస్ట్ మాన్ ‘’అది పన్ కాదు అది ప్యునిటివ్ ఎక్క్స్పేడి షన్ -అంటే దండించే సాహస యాత్ర ‘’అన్నాడు .కొందరు దేన్నీ చూసినా నవ్వలేరు .విలియం హొగార్హ ,,హోరేస్ వాల్ పోల్ నవ్వులు పూయించారు ..లార్డ్ చాటన్ ‘’పెద్దమనుషుల నవ్వు కు అనుమతి లేదు నవ్వు కింది తరగతి వాళ్ళ పని  ‘’అని తేల్చాడు .ప్రైడ్ అండ్ ప్రిజుడిస్  సెన్స్ అండ్ సేన్సిబిలిటిరచనలలో జేన్ ఆస్టిన్ ‘’మనిషి నవ్వే తీరును బట్టి అతడు మర్యాద సొసైటీకి తగినవాడా లేక ఆమె నిజంగా స్త్రీయేనా తేల్చి చెప్పవచ్చు అంటుంది .

 యార్క్ షైర్ లో లాగానే జెర్మని లో కూడా ఒక స్థాయి లేక రాంక్ ఉన్నవారికి నవ్వే అవకాశం లేదు మహాకవి గోదే నవ్వగా ఎవరూ చూడలేదట . అక్కడ స్త్రీలు నవ్వితే మగాళ్ళు పళ్ళు బిగ బెట్టుకొని స్టిఫ్ గా కూచోవాలట 19  వ శతాబ్ది ప్రష్యన్ స్త్రాట జిస్ట్  ఫీల్డ్ మార్షల్ హేల్మత్ జీవితం లో రెండే రెండు సార్లు ఇకిలించాడట .మొదటిసారిగా ఒక ఫ్రెంచ్ కోట ఆక్రమించటం దుర్భేద్యం అని  చెప్పినప్పుడు రెండోసారి అత్తగారు చనిపోయిందని వార్త చెప్పినప్పుడు నవ్వాడట .ఇంతకంటే మరో ఘన పదార్ధం సారీ ఘనుడు 12 వ శతాబ్దానికి చెందినా ఫిలాసఫర్ మార్టిన్ హీ డిగ్గర్ జీవితం లో ఒకే ఒక్కసారి నవ్వాడట .ఒకసారి మొదటి ప్రపంచ యుద్దానికి ముందు ‘’డెత్ హెడ్ ‘’కు ఆఫీసర్ అయిన హస్సార్స్ కెప్టెన్ రాంక్ కన్నా కిందివారిని సమావేశపరచి ‘’కుర్ర ఆఫీసర్లూ  మీరు పదే పడదే పగలబడి నవ్వటం నాకస్సలు ఇష్టం లేదు .ఇకిలి౦పు లు సకిలింపులు నాకు నచ్చవు .కావల్రి ఆఫీసర్లు అందరూ ఒకే విధంగా ‘’హా హా ‘’అని మూడు సార్లు మాత్రమే నవ్వాలి అంతకంటే నవ్వితే ఊర్కోను  దీన్ని బాగా ప్రాక్టీస్ చెయ్యండి ‘’అని బెదిరించాదట .బయటికొచ్చి బహుశా అంతా పగలబడి హహ్హహ్హా అని నవ్వుకొన్నారేమో ?స్టీఫెన్ స్పెండర్ రచయిత’’జర్మన్ జోకులన్నీ స్పాంటేనియస్ గా వచ్చినవే ‘’అని రాశాడు .

 అకస్మాత్తుగా వచ్చిన నవ్వు చాలమంచిది ఆరోగ్యకరమైనది ,ఆహ్వానించదగినది ..గ్రీకు సిటి స్టేట్ లన్నీ ‘’హిత్తీస్’’నుంచి హాస్యాన్ని సరఫరా చేసుకున్నాయి .వారి క్లౌన్లు ,టంబ్లర్లు ,ఆక్రోబాట్స్ రంగస్థలంపై హాస్యం కురిపించారు .డార్క్ ఏజ్ నుంచి క్రిస్టియన్ యూరప్ ఆవిర్భవించింది .ఆంగ్లో సాక్సన్ రాజులకోలువులో కోర్ట్ జస్టర్ర్ లు విదూషకులు ఉండేవారు .ఇంగ్లాండ్ లో ట్యూడర్ రాజ్యపాలన14 8 5 నుంచి 15 47వరకు వృత్తిపరమైన వినోదం వచ్చింది. అది ‘’ఆఫీస్ ఆఫ్ దిరేవేల్స్ ‘’వద్ద ఉండేది .7 వ హెన్రి రాజు చాలాకాలం ప్రవాసం లో ఉండిబాస్వర్త్ లో జరిపిన తీవ్ర యుద్ధం లో గెలిచి సింహాసనం దక్కించుకున్నాడు .ఈయన నవ్వేకాదు చిరునవ్వుకూడా చిలికించిన పాపాన్ని ఎవరూ చూడలేదట .దేశ ఆర్ధిక స్థితిని పటిష్టం చేయటం పైనే ద్రుష్టి పెట్టాడట .రాయల్ అకౌంట్స్ స్వయం గా చూసి ప్రతిపేజీ మీదా సంతకం చేసేవాడట ..కాని వినోదం అవసరమని గ్రహించి 14 90 లో రావేల్స్ ఆఫీస్ ఏర్పరచి రాజాస్థానం లో వినోదానికి అవకాశం కల్పించాడు .దీని పర్మినెంట్ ఆఫీసర్ గా రిచార్డ్ గిబ్సన్ అనే నటుడు ,ప్రొడ్యూసర్ మేనేజర్ ఉండేవాడు .అతని గ్రూప్ ను’’ కింగ్ ప్లేయర్స్ ‘’అనే వారు .ఇతనే హెన్రి 8 కి మొదటి చార్లెస్ కు శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించాడు .15 20 లో జరిగిన ఈ సంఘటనను ‘’ఫీల్డ్ ఆఫ్ దిక్లాత్ ఆఫ్ గోల్డ్ ‘’గా పిలువబడింది మహా ఆడంబరం గా మందుగుండు సామగ్రి తాగినంత తిన్ననత పదార్ధాలు వినోదాలు ,ఒక ఫౌంటెన్ నుంచి వైన్ నిరంతర ధారగా కారేట్లు చేశారు గిల్బర్ట్ జీవితం లో ఒకసారైనా నవ్వటం ఎవరూ చూడలేదని అంటారు కాని అందర్నీ నవ్వించటం అతని నేర్పు .

 షేక్స్పియర్ చాలా జోకులు నవ్వులు పండించాడు .అతని నవ్వు ‘’హా హా హో హో హో ఓహ్ లా ‘’రకం .జాన్ లిస్టన్ త్ట్రాజేడి నటుడు గిట్టక కామెడికి మారి ఎక్కువ డబ్బు సంపాదించాడు .విలియం డాడ్ గొప్ప హాస్యనటుడు ..హిట్లర్ ఆర్కిటెక్చర్ పై అందరికంటే ఎక్కువ ద్దృష్టిపెట్టాడు .కలలో కూడా నవ్వి ఉండడు .కల్లోల పరిస్తుతులనుంచి హాస్యం పుడుతుంది.డికెన్స్  నోయెల్ కవార్డ్ చార్లీ చాప్లిన్ లాత్రేస్ ,షా , చేష్టర్తాన్, వుడ్ హౌస్ మొదలైన వారంతా పుష్కలం గా హాస్యం పండించినవారే .జేమ్స్ దర్బార్  హాస్యం ఉడికిస్తే బెంజమిన్ ఫ్రాన్క్లిన్ అమెరికా హాస్యం సృష్టించి పూయించి పండించి ఫలి౦ప జేశాడు .అతని  ఆల్మ నాక్  లో ఎన్నో ఒకే వాక్య హాస్యగులికలున్నాయి .నేటివ్ హాస్యానికి ఆద్యుడు ఫ్రాన్క్లిన్ .  డికెన్స్ పాత్ర మిసె గామ్ప్ ‘’what a blessed thing it is -living in a wale -to be contented ‘’అంటే కొరడా దెబ్బల మధ్య సంతృప్తి పడటం .ఇలా విదేశే హాస్యం ఈజిప్ట్ లో ప్రారంభమై అన్ని చోట్లా ప్రవహించి ముంచి తేల్చింది .

       ఇన్‌లైన్ చిత్రం 1

 మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -20-4-17- కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ట్రోజన్ హార్స్ -నిజమా కల్పనా ?

ట్రోజన్ హార్స్ -నిజమా కల్పనా ?

‘’ట్రాయ్ పట్టణాన్ని వశపరచుకోవటానికి గ్రీకులు పదేళ్ళపాటు యుద్ధం చేసినా, దక్కించుకోలేక పోయారు .అందుకని ఒక ఐడియా జీవితాన్నే మార్చేసినట్లు ఒక ట్రిక్ పన్నారు .ఊహించలేనంత అతిపెద్ద కొయ్య గుర్రం అంటే ట్రోజన్ హార్స్ ను చక్రాలున్న బల్లపై ఎపియస్ అనే వాడితో మూడు రోజుల్లో నిర్మాణం చేయించి అందులో ముఖ్యులైన గ్రీకు సైనికులను దాచి ,ఓడిస్ససా అనే వాడిని ఒక్కడినే బయట ఉంచి ,తామంతా ఓడలలో బయల్దేరి గ్రీసుకు వెళ్ళినట్లు నటించారు . ఓడిస్సియాస్ ఆ గుర్రం ట్రాయ్ కు కానుకగా వదిలి వెళ్ళారని అందరికి చెప్పాడు  . గుర్రం బయట వైపున ‘’గ్రీకులు ఇంటికి తిరిగి వెడుతున్న సందర్భంగా ఎతీనా దేవతకు  కు కానుక ‘’అని రాయి౦చారుకూడా .గ్రీకులు తమ గుడారాలను అన్నిటినీ తగలబెట్టి టేనేడాస్ కు బయల్దేరారు . సినాన్ అనే వాడిని వేగుగా ఉంచి కొయ్య గుర్రం లోని సైనికులు బయటపడగానే సిగ్నల్  లైట్ వెలిగించమని చెప్పారు .వాడు దొంగ ఏడుపులు ఏడుస్తూ తనను ఒక్కడినే వదిలేసి గ్రీకులు పారిపోయారు అని  కొయ్యగుర్రం గ్రీకు దేవతః ఎతీనాకు కానుకగా వదిలి వెళ్ళారని కల్లబొల్లి మాటలు చెప్పి నమ్మించాడు ట్రోజన్లను . . ఇది కపటం మాయోపాయం అని ట్రోజన్ ప్రీస్ట్ ‘’లోకూన్ ‘’నెత్తీ నోరు పెట్టుకొని వారించాడు మూర్ఖంగా తట్రోజన్లు కేరింతలతో గుర్రాన్ని సిటీలోకి లాక్కు వెళ్ళారు .ఎఖీయన్ లలో 32మంది వీరాధివీరులు గురం కడుపులో ,నోటిలో ఇద్దరు గూడచారులుదాక్కుని ఉన్నారు .ముఖ్యులలో ఓడిస్సియాస్ నాయకుడు అకామాస్ ,ఆగా పెనార్  తయారుచేసిన ఈములాస్ మొదలైన వారున్నారు .ఆ రోజు అర్ధ రాత్రి కొయ్య గురం లో దాక్కున్న వారనతా బయటకు వచ్చి నగరం గేట్లు తెరిచి వెళ్ళిపోతున్న గ్రీకు సైనికులకు బీకన్ లైట్ ద్వారా వర్తమానం పంపారు . సిగ్నల్ అందుకున్న సైనికులు  వెంటనే వెనక్కి తిరిగి ట్రాయ్ నగరం ప్రవేశించి భీకర యుద్ధం చేసి ట్రాయ్ నగరాన్ని సమూలంగా నాశనం చేసి పదేళ్ళ యుద్ధానికి స్వస్తి పలికారు ‘’అని మనం గ్రీకు కవి హోమర్ రాసిన ఒడిస్సే  వర్జిల్ రాసిన ‘’ఎనీడ్’’ఆతర్వాతకాలం లో అగస్తస్ రాసిన ‘’లాటిన్ ఎపిక్ పోయెమ్స్ ‘’లో చదివాం .

   ఆతర్వాత చరిత్రకారులు ,పరిశోధకులు అసలు ట్రాయ్ నగరం ఉందా ,ఎక్కడ ఉంది ట్రోజన్ వార్ జరిగిందా ట్రోజన్ హార్స్ ఉన్నదా అనే విషయాలపై విస్తృత పరిశోధనలు చేశారు త్రవ్వకాలు కూడా చాలా లోతుగా చేశారు .ఇందులో అనేకుల పాత్ర ఉన్నది . వాటి సారాంశాన్ని మాత్రమే తెలుసుకొందాం ..అనేక మంది పరిశోధకులు ట్రోజన్ హార్స్ నిజంగా యుద్ధ పరికరమేనని లేక యుద్ధానికి పనికి వచ్చే ఒక యంత్రం అయి ఉండాలని ఖచ్చితంగా అభిప్రాయ పడ్డారు .కాని జర్మన్ విద్యావేత్త ఫ్రిట్జ్ స్క్రాచర్ మేయర్ ‘’ట్రోజన్ హార్స్ ఒక యుద్ధ యంత్రం కాదు .అది హోమర్ మొదలైన కవులు భూకంపానికి ప్రతీకగా చేసిన కల్పన.ప్రోసిడాన్అనే గ్రీకు దేవత భూకంప దేవత .ఆ దేవతను గ్రీకులు గుర్రం ఆకారంగా చిత్రిస్తారు భావిస్తారు ..ఎలాగంటే ఎతీనా దేవతను గుడ్లగూబగా భావించినట్లు పోసిదాన్ దేవతను రధం మీద ఊరేగిస్తుంటే ,సముద్రకెరటాల ఘోష తోపాటు భీకర భయంకర భూకంప శబ్దాలు ఏర్పడుతాయని గ్రీకుల ప్రబల విశ్వాసం .కనుక హోమర్ కవి పోసిదాన్ దేవత భూకంపాన్ని సృష్టించి ట్రాయ్ పట్టణం గోడలను సరి చేయించి ఉండవచ్చు . .దీనినే మెటాఫరికల్ గా హోమర్ ట్రోజన్ హార్స్ అని కల్పన చేశాడు .ఇది నా ఊహ ,సలహా మాత్రమే.దీనిపై నిగ్గు తేల్చాల్సింది భవిష్యత్ కాలమే ‘’అని రాశాడు .

 ట్రోజన్ వార్స్ ఎన్ని జరిగాయి అనేది కూడా చర్చనీయాంశమే .కనీసం నాలుగు  జరిగాయి .క్రీ పూ 15 వ  శతాబ్దం  లో అస్సువా రెబిలియన్  దానితర్వాత  13 బిసి లో విలూసా రాజు  వాల్ము ను పదవి నుంచి తొలగించటం  జరిగిన యుద్ధాలు ,ఆర్కియాలజీ వాళ్ళ లెక్కప్రకారం ట్రాయ్ లేక హిసారిక్ రెండు సార్లు పూర్తిగా 13౦౦ -1000వరకు యుద్ధాలలో ధ్వంసమైంది .అయితే ఇవన్నీ ఖచ్చితంగా చెప్పబడనివే ..ఇంకా వీటిపై త్రవ్వకాలు పరిశోధనలు జరిపి నిగ్గు తేల్చాలి  అంటున్నారు .

 అసలు ట్రాయ్ అనేది ఒకే ఒక పట్టణం కాదు .ఒకదానిపై ఒకటి ఉన్న మొత్తం 8 పట్టణాలు .మన పాత ఢిల్లీ లాగా .అట్టడుగు ట్రాయ్ దాకా ఇంకా త్రవ్వకాలు జరగలేదు ఇప్పటివరకు .

హిత్తీ ప్రిన్స్  హెలెన్ కోసమే పదేళ్ళు ట్రోజన్ యుద్ధాలు జరిగాయి అన్నది సత్యం కాదు అంతర్ సంఘర్షణలు భూకంపాలు వలన కూడా ట్రాయ్ ధ్వంసమైంది .ట్రాయ్ మైసీనియన్ సామ్రాజ్యం ,హిత్తీ సామ్రాజ్యంలకు అంచున ఉండటం వలన వాటి మధ్య నిరంతర పోరాటాలు ట్రాయ్ వశపరచుకోవటానికి జరిగాయి .రెండు వృషభాల  పోరాటం లో మధ్య నలిగిన తోడేలు లేక జిన్కలాగా ఈ రెండు సామ్రాజ్యాల యుద్ధం లో ట్రోజన్లు నలిగి శలభాలై పోయారుపాపం

20 02ఫిబ్రవరిలో జార్జి వాషింగ్టన్ యూని వర్సిటిలో డైరెక్టర్ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజెస్ అండ్ సివిలిజేషన్స్ మరియు ఆర్మగార్డెన్త్రవ్వకాల కో డైరెక్టర్ ఎరిక్ హెచ్ క్లినే ఆధ్వర్యంలో రోజుకు ఎనిమిది వందలమంది హాజరైన  అరవైకి పైగా జర్నలిస్ట్ లున్న సదస్సులో పూర్వం ట్రాయ్ పరిసరాల్లో త్రవ్వకాలు చేసిన కోర్ఫ్ మాన్  అండ్ కోల్బ్ లు ట్రాయ్ గురించి చెప్పినది అంతా యదార్ధమే నని అంగీకరించారు .బ్రాంజ్ ఏజ్ లో ట్రాయ్ ద్వంసమై౦ది అన్నది సారాంశం .ఇంతకీ కోర్ఫమాన్ యేమని ఉవాచ ?

‘’ట్రాయ్ 6 హెచ్ కు 7 ఏ కు మధ్య సాంస్కృతిక విచ్చిన్నం జరగలేదు అది అలా నిలబడి ఉంది 7 ఏ ట్రాయ్  ఒక శతాబ్దం పాటు సురక్షితంగా ఉన్నది .ట్రాయ్ 7 ఏ13 ౦౦ బి సి లో  ప్రారంభమై 11 8 0 బి సి దాకా వర్ధిల్లింది .తర్వాత తీవ్ర యుద్ధం లో ధ్వంసమైంది .ట్రాయ్ 7 ఏ లోని కింది సిటి యుద్ధం, అగ్నిప్రమాదాలలో నాశనమైంది త్రవ్వకాలలో కాలిన శవాలు తూటాలు అస్తిపంజరాలు ఉన్నాయి .ట్రాయ్ 7 ఏ లోని కోర్ట్ యార్డ్ హౌస్ ట్రాయ్ 6 హెచ్ నుంచి వచ్చిందే .ఇది ఇప్పుడుపూర్తిగా తగలబడి నాశనమైంది 6 హెచ్ ట్రాయ్ భూకంపం వలన నాశనమైంది త్రవ్వకాలలో 16 ఏళ్ళ అమ్మాయి సగం కాలి  శిదిలాలమధ్య కూరుకు పోయి ఉంది .ట్రాయ్ ను ద్వంస౦  కాకుండా పోరాటం జరిగినట్లు ఆనవాల్లున్నాయి కాని విధివశాత్తు ఓడిపోయారు .

 కాని అడుగు సిటీ ఎలా నాశానమైనదో  తెలియటం లేదు .మైసీనియన్లు వాడిన కంచు బల్లెం మొనలు కనిపించాయి .వీటిని ‘’సీపీపుల్ ‘’కూడా వాడి ఉండవచ్చు ..11 8 ౦ బిసి లో ఇది పూర్తిగా ధ్వంసం అయింది .ఇది సీపీపుల్ వారి రెండవ దాడి కావచ్చు లేక మైసీనియన్ రాజు మూడవ రామ్సే కాలం లో కానూ వచ్చు ‘’అని కోర్ఫ్ మాన్ రాశాడు . కనుక మనం కూడా ఈ త్రవ్వకాలలోంచి బయట పడి ఊపిరి పీల్చుకుందాం .

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2

ఇన్‌లైన్ చిత్రం 3

   మీ -గబ్బిట దుర్గా ప్రసాద్  -20-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -౩ 111- రవీంద్రుని భావ ప్రచారకుడు -కే టి.పాండురంగి (1918)

గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -౩

111- రవీంద్రుని భావ ప్రచారకుడు -కే టి.పాండురంగి (1918)

పాండురంగి 1918లో ఫిబ్రవరి 1న జన్మించి వేదా౦తవిద్వాన్ అయ్యాడు .మీమామ్సశిరోమణి , సంస్కృతం లో ఏం ఏ సాధించాడు ..మహామహోపాధ్యాయ కుప్పుస్వామి శాస్త్రి గారి శిష్యుడు .దార్వార్ శంకరాచార్య పాఠశాల ,పూనా శ౦కరేశ్వర మఠ్ లో  మైసూర్ మహారాజాకాలేజి ,అన్నామలై ,బెనారస్ హిందూ యూని వర్సిటీలలో చదివాడు .కర్నాటకకాలేజి  దార్వార  కోలారు ప్రభుత్వ  కాలేజీలలో పని చేసి  బెంగుళూర్  యూనివర్సిటి సంస్కృత ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యాడు .’’విశ్వ మంగళ’’కలం పేరుతొ సంస్కృత రచనలు చేశాడు .దర్శన రత్న ,మీమాంస విభూషణ ,శాస్త్ర నిధి ,పండిత రత్న విద్యామాన్య ప్రశస్తి ,బిరుదులతోపాటు ఉత్తరప్రదేశ్ సంస్కృత సంస్థాన్ నుంచి విశిష్ట పురస్కారం ,తిరుపతి సంస్కృత విద్యా సంస్థాన్ నుంచి  రాష్ట్రపతి నుంచి ప్రతిభా పురస్కారాలు అందుకున్నాడు .

     తన సంస్కృత రేడియోనాటికలను  ‘’నభోవాణి రూపకాని’’గా తెచ్చాడు .రవీంద్రుని నాటికలను సంస్కృతీకరించి ‘’రవీంద్ర రూపకాని ‘’గా వెలువరించాడు .సంస్కృత పత్రికాని ఇతిహాసః ,చంద్రం గతోమానవః ,భారత భాగ్య చక్రం రాశాడు కన్నడం లో కూడా మంచి రచనలే చేశాడు తన రచనలన్నిటిలో ఉపనిషద్ భావాలను ప్రకాశి౦ప జేయటం  పాండురంగి ప్రత్యేకత .రవీంద్ర సందేశాన్ని ఆయన నాలుగు నాటికలు సన్యాసి మాలిని నృప మహిషాచ ,,

కర్నా -కుంతీ చ గా సంస్క్రుతానువాదం  చేసి వ్యాప్తి చేశాడు రంగి . .కుమార సంభవం 5 వ కాండ ను ‘’తపః ఫలః రెడియోనాటి కగా తీర్చిదిద్దాడు .సీతాత్యాగః ఏకాంకిక మూడు దృశ్యాలతో సీత పరిత్యాగ కదగ, తన 35కవితలను ‘’కావ్యాన్జలి’’గా తెచ్చాడు .ప్రాచీన ఆధునిక సంస్కృత సాహిత్య వారధి  పాండురంగి .ఆయనలో శాస్త్రీయ భావన  కవితా వేశం పుష్కలంగా ఉన్నాయి . ,

ఇన్‌లైన్ చిత్రం 1

112-స్తోత్రాల -బాలగణపతి భట్ట(1919)

  బాలగణపతి భట్ట 1919 జ్జనవరి6న శృంగేరిలో పుట్టి ,సాహిత్య విద్వాన్ కన్నడ పండిట్ రాస్త్రభాషా విశారద డిగ్రీలు పొందాడు ..చామరాజ కాలేజి లో బోధించాడు .లెక్కలేనన్ని భక్తీ రచనలు సంస్కృతం లో చేశాడు .ఇందులో గణపతి సుప్రభాతం ప్రసిద్ధి చెందింది .-

‘’దశభుజ యుత దేవం సింహవాహం క్రుతే త్వం -భజతి శిఖి సువాహనం సిద్ధిదం బాహు సత్జ్యం-యుగ కర సహితం త్వం రక్షకాయం  గజాస్యం -యుగయుగం అఖిలో వై హస్తయుగ్మం సితాంగం’’

భావం -కృతయుగం లో జనం నిన్ను 10 భుజాలవానిగా  సింహవాహనునిగా ,త్రేతాయుగం లో ఆరు చేతులు నెమలివాహన౦ ఉన్నవాడిగా ,,ద్వాపరంలో నాలుగుబుజాలు ఏనుగు ముఖం తో ఉన్న నిన్ను పూజించారు .కలియుగం లో ద్విభుజునిగా శ్వేత వర్ణం గలవానినిగా నిన్ను అర్చిస్తున్నారు .

శ్రీ సత్యనారాయణ సుప్రభాతం శ్రీ గంగా ధర సుప్రభాతంకూడా రాశాడు బాలభట్టు -గజారిహరి నాగ జాతిహారి -గజాస్య మోదో.నగజాస్తామదః

ఇన్‌లైన్ చిత్రం 2

113-ఏం జి .నంజు౦డారాధ్య (19 19 )

19 19 ఆగస్ట్ 1 న పుట్టిన నంజుండా రాధ్యతలిదండ్రులు వీరమ్మ గంగాధరయ్య .సిద్ధనగ్ర  బెంగళూర్ జయచామరాజ కాలేజీలలో సంస్కృతం నేర్చి సాహిత్యం లోనూ శక్తి విశిష్టాద్వైతం లోను మాస్టర్ డిగ్రీలు పొందాడు .కన్నడ హిందీ డిగ్రీలు సాధించాడు .సంస్కృతం లో ‘’మేదర చన్నయ్య ‘’నాటకం తో భక్తిగీతాలు చాలా రాశాడు .వీటిని సుప్రభాతాలు స్తోత్రాలుగా పేర్లు పెట్టాడు ..శ్రీకర భాష్యం రెండుభాగాలుగా రాశాడు .ముండక ,కైవల్య ఉపనిషత్తులను సదాశివ భాష్యం రేణుకా గీత భాష్యం లుగా వీర శైవ ప్రయోగ మంత్రం ,శ్రీకరభాష్య౦  చతుశ్లోకీ మొదలైనవి ప్రచురించాడు .మైసూర్ మహారాజా  ఆస్థాన విద్వాంసుని చేసి గౌరవించగా ,,కర్నాటక రాష్ట్రం అవార్డ్ ను ,ఇవ్వగా సాహిత్య రత్న ,శివ  తత్వ చింతామణి  శివాద్వైత భూషణ ,విద్యావారిది బిరుదులూ తన విద్వత్తుకుకు తగినవి గా పొందాడు .సంస్కృత కన్నడ సాహిత్యాలకు తన రచనా పతిభ వలన నంజుండా రాధ్య పరిపుష్టి కలిగించాడు .

114-దేవీ విలాస ఖండకావ్య కవి -కే.ఎస్.భాస్కర భట్ట -(19 20)

1920 లో కర్నాటకసాగర్ తాలూకా భీమన కొనే గ్రామం లో భాస్కర భట్ట జన్మించాడు .అలంకార శాస్త్రం లో విద్వాన్ ,కన్నడం లో పండిట్ అయ్యాడు .చాలా స్కూళ్ళలో పనిచేసి రెండూ బోధించాడు .అయోధ్య సంస్కృత పరిషత్ సాహిత్య భూషణ ,ఇస్తే లింగరాజు సంస్థ ప్రైజ్ మైసూర్ మహారాజు దేవీ విలాస ఖండకావ్యానికి ప్రదానం చేశాడు .దీనితోపాటు గురు క్రుపాతరంగిణి రాశాడు .రామచంద్ర మఠంలోని శ్రీరాముని వర్ణిస్తూ

‘’యన్నామ సంకీర్తన రసప్లవ చిత్త వృత్తీ -నిష్కల్మషః కులపథిహ్ ప్రధమః కవీనాం

రామాయణం నవవరాంబునిదిం వ్యతాన్తీ-తం రామ చంద్ర మనీషంప్రణమామి . శాంతరసానికి ప్రాధాన్యత నిచ్చాడు .అవసరమైన చోట్ల మంచి శుభాషితాలను కూర్చాడు

‘’కర్మాణి స్వతహా ప్రవృత్తిం  అపూర్వ న్త్యకా మానవాః -వీత రాగిణా పరార్ధ సాధకా హిసర్వవదా

వేదాంత భావన అపూర్వ పద సమ్మేళనం తో పరవశం కలిగించేశ్లోకాం –

‘’కేవలం నిరంజనం నిరాకారం నిరీహికం -జన్మ మృత్యు నాశకం భావార్నస్య తారకం -నిత్య శుద్ధ బుద్ధ ముక్తం అనుభావికం పరం -తత్ పదం నిజ స్వరూపం ఆపనుయాం అహం కదం ?కవిపై వాల్మికి కాళిదాస జయదేవుల ప్రభావం ఉన్నది .

115- లజపతి తరంగిణి కర్త -హరిశ్చంద్ర రేన పుర్కార్ (1924)

1924లో మహారాష్ట్రలో రేనాపూర్ గ్రామం లో 19 24 సెప్టెంబర్ 17 న హరిశ్చంద్ర రేన పుర్కార్ జన్మించాడు .సంస్కృతం లో ఏం ఏ డిగ్రీ పొంది కర్నాటక, ఆంధ్రా కాలేజీలలో బోధింఛి ప్రస్తుతం గుల్బర్గా లో ఉంటున్నాడు .ఎన్నో సంస్క్రుతపత్రికలలో రచనలు చేసి పేరు పొందాడు .ప్రస్తుతం సంఘ విలువలు దిగజారి పోతున్నందుకు వ్యధ చెందాడు .జాతీయ నాయకులైన దయానంద గాంధి నెహ్రు సత్వలేకర్ ఇందిరా గాంధీ మొదలైనవారిపై కవితలల్లాడు .భారతీయ స్వాతంత్ర సమరం పై లజపతి తరంగిణి అనే 89శ్లోకాల కావ్యం  రాశాడు . . .శాస్త్రి శ్లోక లహరి, ఇందిరా  హౌతమ్యం కూడా రాశాడు ..దేశం లోని దారుణ కరువుపై ‘’భీషణం దుర్భిక్షం . ‘’కవిత రాశాడు .సమకాలీన విషయాలపై పుంఖాను పుంఖంగా పారిజాతం సంస్కృత భవితవ్యం మొదలైన మేగజైన్ లలో కవితలు రాశాడు

ఇన్‌లైన్ చిత్రం 3

.116-కావ్య తరంగిణి -కర్త -సి జి పురుషోత్తం (19 25)

పురుషోత్తం 19 25లో జన్మించి ,చుంచున కట్టే గురుకులం లో చంద్ర శేఖర భట్ట ,రంగా చార్ లవద్ద సంస్కృతం నేర్చి సంస్కృతం చరిత్రలలో ఏం ఏ అయ్యాడు .మైసూర్ మహారాజా కాలేజిలో సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు .రెండుభాగాలుగా కావ్య తరంగిణి ,ఆది చుంచు గిరి సుప్రభాతం ,సర్వజన వచనాని రాశాడు .కన్నడ మహాకవి ‘’కువెంపు ‘’కవితలతో పాటు అనేక కన్నడ హిందీ  కవితలను సంస్కృతం లోకి అనువదించి కావ్య తరంగిణి రాశాడు .నాలుగవ భాగం లో తన స్వంత కవితలను రాశాడు .ఆది చుంచు సుప్రభాతం లో 27శ్లోకాలున్నాయి .ఇవి 27 నక్షత్రాలకు ప్రతీక. తారావళి అనచ్చు .కర్నాటక స్టేట్ అవార్డ్ ,చుంచుగిరి మఠపురస్కారం పొందాడు .కువెంపు కవి కన్నడ నాటకాలను కూడా గీర్వాణ౦ లోకి అనువదించి సంస్కృత సేవ చేశాడు .

ఇన్‌లైన్ చిత్రం 4

117-మదిరా విలాస ప్రహసనకర్త -నారాయణ మధ్యస్థ (19 30)

19 30 జనవరి 10 న లో కేరళలోనీల్చర్లులో  పుట్టిన నారాయణ మధ్యస్త సంస్కృత సాహిత్య శిరోమణి కన్నడ పండిట్ హిందీ రాష్ట్ర భాషా విశారద .సంస్కృతం లో మదిరావిలాస ప్రహసనం ,అఖండ పురాణం ,కాలే వర్షతు పర్జన్య  .అనే మూడు నాటకాలు రాశాడు .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గ్రీకు ప్రజాస్వామ్య ప్రదాత సొలోన్

గ్రీకు ప్రజాస్వామ్య ప్రదాత సొలోన్

 ఎధేన్స్ కవి రాజకీయ వేత్త సోలోన్ క్రీ .పూ 630 లో  సంపన్న  అరిస్టోక్రాటిక్ కుటుంబం లో పుట్టాడు ..తండ్రి ఎక్సేస్ట్నిస్ రాజవంశీకుడు . అతని చిన్నతనం గురించి తెలియదుకాని వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించాడు . సంచార వ్యాపారవేత్త . ఆనాటి సంఘం లో ప్రముఖుడయ్యాడు .ఎధేన్స్ ,మగరా లు యుద్ధ ప్రయత్నాలలో ఎప్పుడూ ఉంటే వారిని కూర్చోబెట్టి మధ్యవర్తిత్వం చేసి శాంతి కలిగించాడు .దీనిపై కవిత కూడా చెప్పాడు .. ధనవంతులదే రాజకీయ పెత్తనం అయి సామాన్యులకు స్థానం లేకుండా పోయింది  .రాజకీయ సాంఘిక విద్వేషాలకు చెక్ పెట్టమని సొలాన్ ను కోరారు .. అందరికి సమాన న్యాయం కోసం సంస్కరణలు చేయాల్సిన బాధ్యత సోలోన్ పై పెట్టారు .. యెరొపెయాగస్ అనే సంఘ సభ్యుడు డ్రాకో కు వ్రాత రాజ్యా0గేమ్ తయారు చేయమన్నారు . కానీ ఆత ను రాసింది చాలా కఠినంగా ‘’రక్తం తో రాశాడుకాని సిరా తో కాదు ‘’అని పించింది .అప్పుల ఊబినుంచి గట్టెక్కే ఉపాయం ఏదీ అతడు చెప్పక పోవటం తో అంతా  వ్యతిరేకించారు . పేదలు  అప్పుల్లో కూరుకుపోయి చెల్లించలేని స్థితిలో ఎదురు తిరగాల్సి వచ్చింది .ఈ పరిస్థితులలో బాధ్యత సోలోన్ పై పెట్టాల్సి వచ్చింది . కొద్దిమంది చేతుల్లో అధికారం ఉండరాదని ఆత ను నిర్ణయించాడు .తనకున్న మేధస్సును లౌకికజ్ఞానాన్ని అనుభవాన్ని రంగరించి సంస్కరణలకు ఆద్యుడని పించాడు ..

ప్రభుత్వానికి కానీ ప్రయివేట్ వ్యక్తులకు కానీ  అప్పులు చెల్లించవలసిన వారి అప్పులను ముందుగా రద్దు చేశాడు . దీనినే షేకింగ్ ఆఫ్ బర్డెన్స్ అన్నారు ..డ్రోకో  పెట్టిన కఠిన నిబంధనలను సరళీకృతం చేశాడు పగ ,ప్రతీకారం శిక్షలపేరుతో చంపటాలు దౌర్జన్యాలను చేయిక చట్టాన్ని సంప్రదించాలని హితవు చెప్పాడు ..పాత కొత్త మేలుకలయికతో విధానం రూపొందించాడు ..సంవత్సరాదాయం 500 బుషెల్స్ ఉన్నవారు మొదటి తరగతివారుగా 300 నుంచి 500 వరకు ఆదాయం ఉన్నవారికి గుర్రం కొనే సామర్ధ్యం ఉంటుందికనుక నైట్స్ -హిప్పీపస్ అని ,200 ఆదాయం వారు రైతులు అంతకు తక్కువ వార్షికఆదాయం ఉంటె కూలీలు గా విభజన చేశాడు .దీనివలన అంతకు పూర్వం అతి తక్కువగా కానీ అసలు లేక కానీ అవకాశాలు లేనివారికి మంచి అవకాశాలు వచ్చాయి . పైతరగతివాళ్ళు అరిస్టోక్రాట్స్ గా జనం వలన సంపదవలన అయ్యారు ..ఇప్పటిదాకా వీళ్లదే పెత్తనం దీనినే ‘’’’టీమోక్రసి’’అన్నారు అంటే ధనవంతులపాలన . ఈ సంస్కరణాలప్రకారం కింది తరగతి వారు అంటే పొలం పుట్రా  లేనివాళ్లు కూడా ఓటు హక్కు పొందారు .ప్రభుత్వోద్యాగాలలో నియామకం లో వీరి ఓటుకు ప్రాధాన్యత లభించింది అంతకుపూర్వం సంపన్నులు ఎవరి పేరు చెబితే వారే అధికారులు అయ్యేవారు ..ఈ విధంగా సోలోన్ ప్రజాస్వామ్య సంస్కరణలు చేసి బౌల్ అంటే కౌన్సిల్ ను ఏర్పాటు చేశాడు . ఎధేన్స్ లోని నాలుగు ప్రాచీన తె గల నుండి ఒక్కో తెగకు వందమంది చొప్పున లాటరీ పద్ధతిలో దీనిలో సభ్యుల్ని చేశాడు .దీనికి కిందితరగతి వారి వోటుతోపని లేదు .వీరిపదవీకాలం ఒక ఏడాది .ఈ రాజీ ఫార్ములాకు సోలోన్ ఒక ఆర్చ్ టైప్ గా అంటే మోడల్ గా నిలిచాడు .దీనికి ఉన్నతవర్గాలనుండి వ్యతిరేకత వచ్చింది భూమి పంచిఇవ్వలేదని కిందివర్గాలు రుసరుసలాడాయి .అయినా చక్కగా అందరినీ సమాధాన పరచాడు .తరువాత ఎన్నో ఏళ్ళు మధ్యధరా ప్రాంతమైన సైప్రస్ లిడియా అంటే ఏసియా మైనర్ మొదలైన ప్రదేశాలు తిరిగి వచ్చాడు . ఎధేన్స్ కు తిరిగివచ్చేసరికి  శిరసా కు  టి రంట్  గా పిసిస్ట్రాటస్ కీ పూ 561 కి ప్రకటించుకున్నాడు  వృద్ధాప్యం లోనూ సిలోన్ అతనికి సలహాలిచ్చారు  గ్రీసులో మొదటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనతసోలోన్ కి దక్కింది .అతని ‘’టెన్ ఏజెస్ ఇన్ ది లైఫ్ ఆఫ్ మాన్ ‘’కవిత షేక్స్పియర్ రాసిన డది  సెవెన్ ఏజెస్ ఆఫ్ మాన్ ‘’తో సమానంగా ఉందనిపిస్తుంది .సోలోన్ కవితను ఆస్వాదిద్దాం –

‘’బాలుడి  బాల్యం లోనే  పాలపండ్లు పెరిగి ఏడేళ్ళకే  ఊడిపోతాయి

వాడికి పద్నా లు  గేళ్లప్పుడు  పరిణతి పొందుతాడు

మూడవ సప్తకం లో అవయవాలు పెరిగి గడ్డం మీసం తయారై శరీరం మగతనాన్ని చూపిస్తుంది

నాలుగవ సప్తకం లో బలం శక్తితో మగసిరి ఉట్టిపడుతుంది

పంచమ సప్తకం లో యువకుడై పెళ్లి , పిల్లలకై తపన వస్తుంది

ఆరవ సప్తకం లో అతని బుద్ధి వికసించి అన్నిటా మంచి శిక్షణ పొంది ఏదీ అసాధ్యం కాదనిపిస్తుంది

ఏడవ  ఎనిమిదవ సప్తకం లో చక్కగా నిర్దుష్టంగా సంభాషించి మెప్పు పొందుతాడు

తొమ్మిదో సప్తకం లో ఇంకా మంచిపనులు చేస్తాడుకాని అతని ఆలోచనలు మాట తగ్గిపోతాయి

పదవ సప్తకం అంటే డెబ్బై ఏళ్లకు చావు సమీపిస్తోందని పిస్తుందికాని అంతత్వరగా రాదు

ఇన్‌లైన్ చిత్రం 1

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-4-17 – కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 106-ఉన్మత్త కీచకం నాటకం రాసిన -కె .ఎస్ .నాగరాజన్ (1911)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

106-ఉన్మత్త కీచకం నాటకం రాసిన -కె .ఎస్ .నాగరాజన్  (1911)

ఆంద్ర ప్రదేశ్ లో సోఢ0 గ్రామంలో1911 ఏప్రిల్ 11 న నాగాంబికా శేషం అయ్యంగార్ లకు నాగరాజన్  జన్మించాడు .సంస్కృత సాహిత్యం లో కాశ్మీర్ పాత్ర ‘’అనే అంశం పై పరిశోధన చేసి డాక్టరేట్ పొందాడు . రాష్ట్ర అకౌంట్ జనరల్ ఆఫీస్ లో అకౌంటంట్ జెనరల్ గా పనిచేశాడు .ఆధునిక సంస్కృత సాహిత్యాన్ని తన అమోఘ రచనలతో సుసంపన్నం చేశాడు .శ్రీ సీతాభ్యుదయం అనే 16 కాండలకావ్యం రామాయణం ఆధారంగా రాశాడు  శ్రీ శబరీ విలాసం అనే ఖండకావ్యం ,,ఉన్మత్త కీచకం అనే అయిదుఅంకాల నాటకం ,భారత వైభవం అనే దేశభక్తి గీతం ,గాంధీ విజయం అనే అయిదంకాల నాటకం ,లవలీ పరిణయం నాటకం ,6 అంకాల గురుశాపం ,భారత దేశ భక్తలగురించి ‘’భారతీయ దేశ భక్త విజయం ,రాశాడు . కన్నడం లోసాహిత్య విచార ,సుభాషిత మంజరి  భాస్కరాచార్యుని లీలావతి అనువాదం ఃచేశాడు .సుభాషితాలు సుభాషిత వాణిగా  ఇంగిలీషు లోకి అనువదించాడు .సాహిత్యాలంకార ,బిరుదు అయోధ్య సంస్కృత అకాడెమి ,కవిభూషణను శ్రీ ద్వారకా శంకరాచార్య ప్రదానం చేశారు .వ్యాఖ్యాన వాచస్పతి అనేది ఆయన పాండితీ ప్రకర్షకు లభించిన విశేష బిరుదు .

 ఉన్మత్త కీచకం నాటకం -లో కీచకుడు ఉత్తముడు నిజంగానే ద్రౌపదిని ప్రేమిస్తాడు .భీముడు సహించలేక కీచకవద చేస్తాడు .వాడి చావుకు ద్రౌపది కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది .మొదటి అంకం లో కీచక స్తుతి  నాలుగులో విరాట స్తుతి ఉన్నాయి .ఇద్దర్నీ స్తుతిస్తూ చెప్పిన శ్లోకాలు –

‘’జయతు విజయ లక్ష్మీ శీలస్త సర్వాంగ శోభాహ్ -జయతు పశుబలానాం వృద్ధికారా బలి స్టాః – జయతు జయ పతాకాల౦క్రుత స్వీయ మార్గే -జయతు పరబలాంతఃకీచః ఖ్యాత కీర్తిః’’

 జయతు నరవరేణ్యసత్యదామ ప్రతిస్టో-జయతు జన సుఖానాం వ్రుద్ధికర్తా దయాళుః-జయతు గుణగణానాం సన్నిదిర్ దీన బందూ -జయతు చిరమిల్యాం మత్స రాజో విరాటః’’

 ఈనాటకం లో కీచకుడు విషాదాంత నాయకుడు చనిపోయే ముందు కీచకుడు మాట్లాడిన మాటలు హృదయాన్ని తరుక్కు పోయేట్లు చేస్తాయి కన్నీరు తెప్పించి అతనిపై సానుభూతి కలిగిస్తాయి ….

 గురూపదేశం పౌరాణికకద దేవరాజ బహదూర్ ప్రైజ్ పొందింది తనకు ప్రేరణ ఉత్తేజం కలిగించిన కైలాసం కు అంకితమిచ్చాడు నాగరాజన్ ఇందులో హీరో కర్ణుడిని ఉదాత్తంగా చిత్రించాడు  నిమ్న కుల సంజాతుడు అయినందువల్ల అణగాతొక్కబద్దాడని చెప్పాడు భాసుడు చెప్పిన .’’చక్రారాప ణీకీర్తిర్  ఇవ గచ్చతి భాగ్యప౦క్తి ః’’అన్నదాన్ని ‘’భాగ్య పంక్తిర్ఇవ సర్వ నరాణాం చంచలేతి విదితా మనులోకే ‘’ అని చెప్పాడు మనిషికి విలువ గుణం బట్టికాని జన్మ బట్టికాదుఅని బోధిస్తూకవి -గుణతాః పూజ్యతే లోకే మానవో న తు జన్మతః -తదాదీన గుణాః సర్వే జన్మ దైవ వశే భవేత్ ‘’దీనికి స్పూర్తి భవభూతి చెప్పిన .’’గుణాః పూజ స్థానం గుణిషు నచ ణ లింగం న వయః ‘’బాణుని వేణీసంహారం లోని కర్ణుని వచనాలు స్పూర్తిగా తీసుకున్నాడునటరాజన్

 శ్రీ శబరీ విలాసం లో శబ్దార్ధ సౌందర్యంతో కవితాత్మకంగా రాశాడు . గాంధీ మహిమ లో ‘’ఏకో దేవో నేక రామాభిరామః -రామో బుద్దా కృష్ణా అల్లాఇతీహ -నానారిత్యా దృశ్యతే పూజ్యతేచ ‘’అంటూ ఋగ్వేదం లోని ‘’ఏకం విప్రా బహుద వదంతి ‘’నివివరించి చెప్పాడుకవికి సంస్క్రుతంపై వీరాభిమానం .-అందుకే ;;’’ఏతి సంస్కృతం మృతేతి వదంతి తే ఏవ మృతాః’’అని బల్లగుద్ది సంస్కృతం చనిపోయి౦ది అనే వారు నిజమగానే చనిపోయినవాళ్ళు అన్నాడు

‘’జయతు జయతు ధన్యా భారతాంబా పవిత్రా -జయతుజయతు గాంధీ సత్యమార్గాను వర్తీ -జయతు జయతు యుద్ధం  చస్మాద్రియంనవీనం -జయతు జయతు సర్వో భారతీయాః ప్రపంచాః’’అని ఉదాత్తమైన ఉపదేశం చేశాడు సంప్రదాయ పద్ధతిలో సంస్కృతం చదివినవాడుకాకపోయినా ఒక సంస్తా నిర్వాహకుడుగా తీరిక లేకున్నా సంస్కృతం లో సృజనాత్మక రచనలు చేసి విఖ్యాతుదయ్యాడు నాగరాజన్ జాతీయ సమైక్యతా .,సర్వ మానవాభ్యుదయం  ధ్యేయంగా  పౌరాణిక కధలను ఆధునిక విధానం లో వ్యాఖ్యానించాడు .

 ఇన్‌లైన్ చిత్రం 1

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్  -18-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -2 (9-4-17 నుండి 16-4-17 వరకు )

వీక్లీ అమెరికా -2   (9-4-17 నుండి 16-4-17 వరకు )

 

9వ తేదీ సోమవారమ్ వరకు ఒకటవ ఎపిసోడ్ లో రాసేశాను . ఆ సోమవారం సాయంత్రం కేరీ నుంచి డా యల్లాప్రగడ రామ మోహనరావు గారు ఫోన్ చేసి మాట్లాడిన వివరాలూ అందులో రాశాను .ఆ తరవాత మాసా చూసెట్స్ లోని ఆస్టిన్ నుంచి శ్రీ డొక్కా రామ భద్ర ఫోన్ చేశారు .దాదాపు నాలుగేళ్లు అయింది ఆయన ఫోన్ లో మాట్లాడి .  అపర అన్న పూర్ణ నిరతాన్న ప్రదాత శ్రీమతి డొక్కా సీతమ్మగారి ముని మనవాడిగారి అబ్బాయి అంటే ఇని మనవడు ఇక్కడ సాఫ్ట్ వేర్ లో పనిచేస్తున్నారు .ఒకసారి ఇద్దరం ఫ్లాష్ బాక్ కి వెళ్లాం .సుమారు నాలుగేళ్లక్రితం చాగంటి వారి ప్రవచనాలతో డొక్కా సీతమ్మగారి వితరణ గురించి మరోమారు విని సరసభారతి తరఫున విద్యార్థులకు ఆమె జీవితం అన్నదానం పై వ్యాసరచన ఏర్పాటు చేసాం . దీన్ని నెట్ ద్వారా ను మా మిత్రుడు శ్రీ కోసూరి ఆదినారాయణ ద్వారా తెలుసుకున్న రాంగారు నాకు ఫోన్ చేసి అభినందించటం  తాము అమెరికాలో ఆమె పై కార్యక్రమాలు చేస్తున్నామని ,కానీ ఆమె పుట్టిన గడ్డ ఆంధ్రాలో మేము చేయటం సంతోషంగా ఉందని మాకేదైనా ఆర్ధిక సాయం కావాలంటే చేస్తామని చెప్పారు .మాకు ఏ రకమైన సాయం వద్దని ఆమె మీద గౌరవం తో చేస్తున్నామని చెప్పాను ఆయన వదలకుండా అయితే పేద విద్యార్ధులకు సీతమ్మగారి పేరుమీద స్కాలర్షిప్ లు ఇద్దాం డబ్బు పంపిస్తాను అనగానే సరే నని మూడు హై స్కూళ్ళ  హెడ్ మాస్టర్ లకు తెలియజేసి పద వ తరగతి లో బాగా చదువుతూ ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్ధులపేర్లను నిష్పక్ష పాతం గా విమర్శలకు అతీతంగా తయారు చేసి పంపని చెప్పాం అలాగే ముగ్గురు అమ్మాయిలూ ముగ్గురు అబ్బాయిలు లను సెలక్ట్ చేసి రామ్ గారు పంపిన 10 వేల  రూపాయలు అందరికి సమానంగా ఇవ్వాలని నిర్ణయించి మరో కార్యక్రమం ఏర్పాటు చేసాం .దీనికి రామ్ గారి తలిదండ్రులు శ్రీ డొక్కా సూర్యనారాయణగారు శ్రీమతి లలితకుమారి ?గారు హైదరాబాద్ నుంచి వచ్చారు .ఆరోజంతా జోరన వాన .సాయంత్రం కాస్త తెరిపిచ్చింది మా ఇంటికి ముందు ఆ దంపతులు వచ్చి కాఫీ త్రాగి అందరం శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం చేరాం . శ్రీ గుంట క వేణు గోపాల రెడ్డి తో పానుగంటివారి హాస్యం పై ప్రసం గింపజేసి ఆతర్వాత శ్రీ డొక్కా దంపతుల చేతులమీదుగా విద్యార్థినీ విద్యార్ధులకు ఒక్కొక్కరికి 1667 రూపాయలు సమానంగా అందజేశాము . ఆ దంపతులకు  రామభద్రగారికి సరసభారతిపుస్తకాలు రెండు సెట్లు శ్రీ సువర్చలాన్జనేయస్వామి ఫోటోజ్ఞాపిక ఇచ్చి ఆలయ మర్యాదలతో సత్కరించాం వారిద్దరూ పరమానందం పొంది వారిమాటలలో సభా ముఖంగా వ్యక్తం చేశారు . ఆ తర్వాత ఒక సారి రామ్ గారు ఫోన్ చేశారు అని   జ్ఞాపకం సరసభారతి మెయిల్స్ అన్నీ వారికి పంపేవాడిని ఒక్కోసారి రిప్లై ఇచ్చేవారు .ఆ తర్వాత గాప్ వచ్చింది . ‘’మహిళా మాణిక్యాలు ‘’పుస్తకం రాసి ప్రచురించినప్పుడు మొదటివ్యాసంగా డొక్కా సీతమ్మగారిదే వేసాం .దీనికి స్పాన్సర్ శ్రీ మైనేని గోపాల కృష్ణగారని వారి శ్రీమతి శ్రీమతి సత్యవతి గారికి అంకితమిచ్చామని దీని ఆవిష్కరణ విజయ వాడ రేడియో స్టేషన్ డైరెక్టర్ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి గారు చేశారని ఆ రోజు ప్రపంచ ప్రముఖ ఈల విద్వావంసులు  శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ గారు తమ బృందం తో వచ్చి రెండు గంటల సేపు కచేరీ చేసి గాంధర్వ లోకాలకూ తేలించారని ఒక్క సారి జ్ఞాపకానికి వచ్చింది . బహుశా సరసభారతి తప్ప ఆంద్ర దేశం లో ఏ సాహిత్య సంస్ధ సీతమ్మగారిపై ఏ కార్యక్రమం జరపలేదని ఆ అదృష్టం మాకే దక్కిందని చెప్పుకున్నాం .

ఇప్పడు రామభద్ర గారు ఫోన్ చేసి మాట్లాడినదానిలో మన మెయిల్స్ అన్నీ రెగ్యులర్ గా చదువుతున్నామని చెప్పారు వారి తలిదండ్రులు అట్లా0 టలో తమ్ముడు శ్రీ ఫణి గారి దగ్గర ఉంటున్నారని మేనెలలో ఆస్టిన్ వస్తారని అప్పుడు ‘’మా బడి ‘’కార్యక్రమం నిర్వహిస్తామని అట్లా0టా లో తమ్ముడు తెలుగు కార్యక్రమాలు చేస్తూ ఉంటారని చెప్పి మా ప్రోగ్రామ్ సంగతి అడిగారు .ఇంకా ఏమీ ఆలోచించ లేదని కార్తీ కి శ్రీ రామమోహనరావు గారు వచ్చి తీసుకు వెడతామని ఫోన్ చేశారని చెప్పాను ఆస్టిన్ ఆలోచన ఉంటె స్వాగతం అన్నారు అక్కడే మా ఆదినారాయణ గారి అమ్మాయి మా అమ్మాయి పాలిటెక్నీక్ క్లాస్ మేట ఉన్నది .

మైనేనిగారు పంపిన వరద కవనకుతూహలం వరద కాలం చదివేశాను ..దానిపై ‘’వరదలో తేలి (రి )న తేట ఊట రాయటం ప్రారంభించి 7 ఎపిసోడ్లు మహాదాత దహదం ‘’లక్ష్మీనారాయణపై ఒక ఆర్టికల్ రాశాను .   ..మేనల్లుడు శాస్త్రి మంగళవారం కాలిఫోర్నియా నుంచి ఫోన్ చేయి తాము యూరప్ వెళ్లి ముందురోజు రాత్రికే వచ్చామని మా ప్రయాణం లో  పదనిసలు చదివానని చెప్పాడు . బిజెపి అధ్యక్షుడు అమిత్ షా  యెన్ డి  ఏలోని 32 పార్టీల వారిని సంప్రదించి రాష్ట్ర పటి ఉపరాష్ట్ర పతి  పదవికి ప్రధాని మోడీ ప్రకటించేపేరును ఆమోదించేట్లు చేశాడని వార్త చదివాను . అద్దాడలో   శిష్యురాలైన కోడూరి పావనికి ఫోన్ చేసి మాట్లాడా వాళ్ళు ఒక రెండునెలలో ఉన్నచోటి నుండి మారాల్సి రావచ్చునని చెప్పింది పిల్లలతో మాట్లాడించింది చక్కగా తెలుగులో మాట్లాడారు ఆ అమ్మాయి చదువులోనేకాక సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా చాలా ముందు ఉండేది మంచిపిల్ల .

 రమణ ఎమ్యెల్సీ రాజేంద్ర తో తిరుపతి వెళ్లానని అక్కడ శివప్రసాద్ గారు కనిపించి మాట్లాడారని చెప్పాడు ఒంటిమిట్ట కూడా చూసి ఇంటికి వచ్చాడు . మా కొడాక్ కెమెరా ను దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో తీసేసుకొని విడిగా పాక్ చేసి  డెస్టి నేషన్ లో కలెక్ట్ చేసుకోమని చెప్పారు అంటే షార్లెట్ అనుకొన్నాను న్యూయార్క్ లోనే తీసుకోవాలిట మా బాగేజ్ తో పాటు కనిపించలేదు 12 ఏళ్ళనుండి వాడుతున్నాం కదా పొతే పోయిందని కున్నా .కానీ ఎమిరేట్స్ వాళ్ళు ఫోన్ చేసి న్యూయార్క్ లో కెమెరాఉంద ని డెమరేజ్ కట్టి తీసుకోమని విజ్జికి ఫోన్ చేస్తే మా వాళ్ళు 15 గంటలు ఎయిర్ పోర్ట్ లో పడిఉన్నారు ఎవరూ వాళ్లకు ఆ సంగతి చెప్పలేదుకనుక మీరే మీ ఖర్చులతో   షార్లెట్ కు పంపమని చెప్పింది సరే అన్నారట .

 గురువారం మధ్యాహ్నం చరణ్ కు ఫోన్ చేసాం ఫస్టియర్ రిజల్ట్స్ వచ్చాయి 60 శాతం మార్కులు వచ్చాయని చెప్పాడు . మనగుడి’’ బడ్డీ బుడ్డి ‘’పెళ్లి కుదిరిందని మే 17 న ధార్మిక భవనం లో పెళ్లి అని రమణ మెసేజ్ పెట్టాడు  చాలామంచి వాడు కార్తీకమాసం లో దీపాలంకరణకు బొమ్మలు వేయటం దీపాలు అలంకరించటం గుడిని జాగ్రత్తగా కాపాడటం లో అత్యంత విశ్వాసంగా ఉంటున్నాడు .వాడితోపా టు సహకరించినవారికి అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి .ఇక మిగిలింది శ్రీదేవి ,ఇంకో అమ్మాయి చంద్ర శేఖరరావు గారి అబ్బాయి ఉన్నారు .స్వామి అనుగ్రహంతో  వాళ్ళ పెళ్లిళ్లు కూడా త్వరలో జరగాలి ..రాత్రి భాను చంద్ర సుమన్ ల ఇంటర్వ్యూలను యు ట్యూబ్ లో చూశాం బాగున్నాయి దాపరికం లేకుండా మాట్లాడారు . గురువారం సాయంత్రం స్పీడ్ పోస్ట్ లో ఎమిరేట్స్ వాళ్ళు పంపిన కొడాక్ కెమెరా నాకు క్షేమంగా చేరింది బుజ్జిముండ ఇప్పటికి ఎన్ని వేల  ఫోటోలు తీసిందో లెక్క లేదు ..ఈ విషయాన్ని మైనేనిగారికి ‘’విడ్డూరం ‘’అని రాస్తే జవాబుగా ‘’విడ్డూరాతి విడ్డూరం ‘’అని రాశారు . .రాత్రి సుడిగాడు సినిమా చూసాం మొదట్లో బానే ఉన్నది .

 సాయంత్రం వేలూరి పవన్ భార్య రాధ వచ్చారు . కెమెరా సంగతి చెబితే అందులోని మెమరికార్డ్ లాక్ అయిందని చెప్పి తీసి పని చేసేట్లు చేశాడు .శతకత్రయం వాళ్లకు ఇచ్చాను .అవధాని గారి శిష్యులు వచ్చి ఆయనవద్ద వేదం నేర్చుకున్నారు రాత్రి విజ్జి స్నేహితురాలు గోసుకోండ వారమ్మాయి వచ్చి పలకరించింది .మళ్ళీ ఒక సారి 70 ఏళ్ళు ఫ్లాష్ బాక్ కు వెళ్లి మాట్లాడుకున్నాం మా చిన్నప్పుడు శ్రీ గోసుకోండ వాసుదేవ శాస్త్రిగారు గురజాడ నుంచి వచ్చి వంగలవారి ఎత్తరుగుల ఇంట్లో ఉన్నారు ఆయన భార్య సావిత్రమ్మగారు మా అమ్మకు గురువు అంటే సలహా సంప్ర దింపులు  వగైరా లకు వాళ్ళబ్బాయి రామ చంద్రుడు ఫాక్టరీలో స్టోర్స్  లో పని .నత్తి ఎక్కువ మాకు కాఫీపొడి పంచదార తెచ్చిపెట్టేవాడు .భార్య రుక్మిణమ్మ మాకు అక్క లాంటిది .  ఆతర్వాత శాస్త్రిగారు భార్య పోవటం ,రుక్మిణమ్మకూతుళ్ళు  నాదగ్గర ట్యూషన్ చదవటం మామామయ్యా అని అత్తయ్యా అని మమ్మల్ని ఇద్దర్నీ పిలవటం వాళ్ళపేర్లు భ్రమరాంబ సావిత్రి కావటం గుర్తు చేసుకున్నాం రుక్మిణమ్మ కు ఊరంతా పరిచయం ఎవరికి ఏసాయం చేయాలన్నా చేసేది /చిట్కా వైద్యం బాగా తెలుసు మందు వేస్తె తగ్గి పోవాల్సిందే .

 ఆదివారం శ్రీ హేవిళంబి హనుమజ్జయంతి కార్యక్రమం రాసి రమణకు పంపాను . రెండుపూటలా వాకింగ్ చేస్తున్నాను . రాత్రి రాంగోపాల వర్మ ‘’సత్య -2 ‘’సినిమా చూశా శర్వానంద్ హీరో .చాలాబాగుంది ప్లాట్  విషయం ప్రక్కన పెడితే ట్రీట్ మెంట్ అమోఘం . హీరోయిన్ అందాలు బాగా ఆరబోసింది . అందరిలో ‘’నటన రసాన్ని ‘’ వర్మ  పిండేసి ఇక వాళ్ళదగ్గర ఏమీ మిగలకుండా చేశాడేమోనని పించింది .ప్రతిపాత్రనూ సమర్ధవంతంగా తీర్చిదిద్దాడు .కెమెరా వర్క్ సూపర్బ్ ,మంచి అందమైన లొకేషన్లు . ప్రతి షాట్ పెర్ఫెక్ట్ గా ఉన్నది కనులపండువుగా చూపించాడు .ఎన్నో ఏళ్లయింది వర్మ సినిమా చూసి మనీ మనీ  తర్వాత ఇదేనేమో చూడటం .అగ్ర శ్రేణి దర్శకుడని ఎందుకు అంటారో అర్ధమయింది . అతని  సమర్ధతకు హేట్సాప్ .ఇన్నేళ్లకు ఒక పెర్ఫెక్ట్ సినిమా చూశానన్న సంతృప్తి కలిగింది .

 ఉయ్యూరులో బయల్దేరేటప్పుడు రసాలు తినటం ప్రారంభించి హైదరాబాద్ లోనూ వచ్చేదాకా లాగించి ఇక్కడికి వచ్చాక కూడా మా అమ్మాయి తెస్తున్న నీలాలు తోతాపురి బ్లెండ్ చేసి చిన్న రసం ఆకారం లో సృష్టించిన పళ్ళు తింటున్నాం బాగానే ఉన్నాయి చెట్టులేని చోట–అన్నట్లు .

 మొదట్లో నీళ్లు పూలు లేకుండా పూజ చేసినా కిందటి ఆదివారం నుండి నీటితో సంధ్యావందనం పూలతో పూజ దీపారాధన ,అగరువత్తిల తో పూజ చేస్తున్నాను .రామకోటి రాసి భగవద్గీత చదువుతున్నాను . .ఇంకా లైబ్రరీ దర్శనం కాలేదు ఇవాళ సాయంతరం వెళ్ళవచ్చు .కానీ ఇంట్లో ఉన్న బ్రాహ్మణ సంక్షిప్త చరిత్ర  చదివా . అయిదేళ్లక్రితం మైనేనిగారు పంపిన జార్జ్ ఆర్వెల్ రాసిన యానిమల్ ఫారం  . మామనవళ్ల పాఠ్యగ్రంధం Elie Wieselsఅనే నాజీ దురాగతాలపై చిన్నపుస్తకం ఖాళీ ఉన్నప్పుడు చదువుతున్నా .  మా ఇద్దరి ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి . మా శ్రీమతికి మంచి విశ్రాంతి దొరికింది . నా పని అక్కడా ఇక్కడా ఒకటే తేడా ఏమీ లేదు దినపత్రికలు ఆన్ లైన్ లో చదువుతున్నాను . శ్రీ దేవినేని నే హ్రూ  అకస్మాత్తుగా మరణించినట్లు వార్త చూశాను  తెలుగు దేశం లోకి చేరి కొన్ని నెలలే అయింది . ఈ వారానికి  ఇంతే  .

    మీ-గబ్బిట దుర్గా  ప్రసాద్ -17-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

           


Posted in అమెరికా లో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 103-ధ్రువ చరిత్ర కావ్య రచయిత -కానరాది విఠలోపాధ్యాయ (1910

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

103-ధ్రువ చరిత్ర కావ్య రచయిత -కానరాది  విఠలోపాధ్యాయ (1910

కానరాది విఠలోపాధ్యాయ 1910లో కర్ణాటక కానరాది లో సుబ్బలక్ష్మీ అమ్మ సుబ్రహ్మణ్య ఉపాధ్యాయ లకు జన్మించాడు .ఉడిపి సంస్కృతకాలేజిలో శ్రీనివాస భట్టు వద్ద సంప్రదాయ విధానం లో స్సంస్కృతం చదివాడు .ధ్రువ చరిత్రం ,ప్రహ్లాద చంపు ఆయన సంస్కృత రచనలు .కన్నడం లో గోపాల దండకం ,మంగళాష్టకం రాశాడు . ధ్రువ చరిత్రం 15 ఆశ్వాసాల కావ్యం .ధ్రువుడు కుబేరునితో చేసిన వీరోచిత పోరాటాన్ని చక్కగా చిత్రించాడు .ధ్రువుని ప్రజారంజకపాలన అతను నక్షత్రమవ్వటం తో సమాప్తం .కావ్యం ఆధ్యాత్మిక వీర రసకావ్యం .రెండు విషయాలను చక్కగా నిర్వహించాడు .ఋగ్వేదం లోని -ధ్రువాద్యోర్ ధృవ పృధ్వీ  ధ్రువ  శ్చ పర్వతఇమే -ధృవం విశ్వం ఇదం జగద్ ధ్రువో రాజా విశా మయం -ధ్రువ0   తే రాజా వరుణో ధృవం దే వొ బృహస్పతిహ్  -ధృవంతే  ఇంద్రాచా గ్నిశ్చ రాష్ట్రం ధార్యతాం ధృవం ;;అనే మంత్ర భావార్ధాలను కావ్యం లో నిక్షిప్తం చేశాడు .కాళిదాస భవ భూతులలాగానే శ్రీ తో కావ్యారంభం చేశాడు –

‘’శ్రియం త్రయా ప్రతి ప్రజా శాంతికారణం -ధ్రువస్య పదాంబు జయోర్ హృది –

నిధాయ బాఢ0 కరవాని  వందనం-గురుస్త్రై లోకస్య భారతి పతేహ్.’’

చక్కని సుభాషితాలు చెప్పాడు -ప్రాక్తేర్ యువ జనస్యహి    లుబ్ధా ,గుణవతః సకలం  హాయ్ గుణాన్వితం ‘’

భక్తితో ఊగిపోయేట్లు రచన చేశాడు కవి -’’జగన్నిదానం హరిమాదిదేవమ్ -జగన్నివాసం ప్రలయే ప్యనంతం -జగద్గ్రశాన్తం రమయా  లసంతం  -జగన్నివాన్తారం అహం నమామి ‘’

8 వ ఆశ్వాసం లో చిత్రకావ్య విధానాలన్నీ గుప్పించాడు .ధ్రువుని తీవ్ర తపస్సును దాన్ని భగ్నం చేయటానికి జంతువులు  చేసిన విఫలప్రయత్నాలను నిర్జర ఏకాంత  అరణ్య సౌందర్యాన్ని బహు చక్కగా వర్ణించాడు .శాంతరసం తోకావ్యం భాసించి చారిత్రాత్మకంగా నిలిచింది .ప్రహ్లాద చంపు ను భక్తి భావ   బంధురం  గా శార్దూల మాలిని స్రగ్ధర ,వంశస్థ స్వాగత ,వసంతతిలక ,భుజంగ  ప్రయాత   పృథ్వి ,వియోగిని ,ప్రహర్షిణి  శా లిని ,స్రగ్విణి ,హర్షిణి  ,,రదోద్ధత మున్నగు ఛందస్సులతో రసప్లా వితం చేశాడు .నిజమైన భక్తుడుగా ఉపాధ్యాయ తనకవిత్వాన్ని దైవానికి అంకితం  చేసి ధన్యజీవి అయ్యాడు

104- ధ్వన్యను కరణ కవి-కె నంజుండ ఘనపాఠి -(1910)

కార్ణాటక లోని కూడలి లో 5-8-1910 న నంజుండ  జన్మించాడు .లక్ష్మీదేవి కృష్ణ ఘనపాఠి తలిదండ్రులు .సంస్కృత సాహిత్యం అద్వైత వేదాంతం లలో విద్వాన్ అయ్యాడు .వేదాన్ని ఆమూలాగ్రం అధ్యయనం చేశాడు .భద్రావతిలోని భద్ర సంస్కృతకాలేజిలో సంస్కృతం బోధించాడు .శృగేరి ద్వారకా ,కూడలి పీఠాధిపతులచే సన్మానాలు పొందాడు .గౌరీకళ్యాణం భక్త మయూరధ్వజ చరిత్రం అనే రెండుఖండకావ్యాలు సంస్కృతం లో రాశాడు .

గౌరీ కళ్యాణం శతకకావ్యం .దేవతా స్తుతి చేశాక గిరిజా దేవి కళ్యాణ మండపానికి రావటానని గొప్పగా వర్ణించాడు .ధ్వన్యనుకరణ ను అమోఘంగా నిర్వహించాడు –

‘’ఝాన జిహానాత్ కరణ నూపురాద్య -సుమాల్య వస్త్రాభనైర్ ఉపేతా -సుమంగళీ సంస్తుత దివ్య శీ లా – మన్దమ్ శివా ప్రాప వివాహ వేదిం ‘’

నముల్ ప్రత్యయాన్ని అద్భుతంగా ప్రయోగిస్తూ -భోజం భోజం భక్ష్య భోద్యాని నిత్యం  -పాయం పాయం పాయసాదిన్ సుపే యన్-దర్శం దర్శం దైవతా శైవ లీలాః -భారం భారం శైలరాజం సాసాంసుహ్’’

జైమిని భారత అశ్వ మే ద పర్వం లోని మయూరధ్వజ చరిత్రలో వేద వేదాంత సాహిత్యాల త్రివేణీ సంగమంగా రచించాడు  సంప్రదాయాన్ని చక్కగా పాటించి భారతీయ ఆధ్యాత్మిక ఆముష్మిక విలువలకు ఎత్తిన పతాకగా తీర్చి దిద్దాడు

105-కవి శేఖర హెచ్ .వి నారాయణ శాస్త్రి -(1910)

కర్ణాటక హళ్లి మైసూర్ లో వెంకటరామ నవధ్వని ,తిమ్మామ్ బికల కు 19 10 లోఆగస్టు 15 న  నారాయణ శాస్త్రి జన్మించాడు .బెంగళూర్ చామ  రాజేంద్ర కాలేజ్ నుంచి సంస్కృత సాహిత్య రత్న పొంది ,అక్కడే లెక్చరర్ అయ్యాడు శ్రీశైల జగద్గురువులచేత కవిశేఖర బిరుదును కర్ణాటక ప్రభుత్వ పురస్కారాన్ని  పొందాడు .సంస్కృతం లో శ్రీశైల జగద్గురు చరిత ,శ్రీనాచరమ్మా విజయం,శ్రీ కృష్ణ భిక్ష ,గుణ పరీక్షణం ,,సోదర స్నేహ  నాటకాలు ,శ్రీ విద్యారణ్య కదా తరంగిణి కావ్యం ,శ్రీ లక్ష్మీ కేశవ సుప్రభాతం ,కర్ణాటక మహిమ్న స్తోత్రం ,కాశీ విష్వఈశ్వర సుప్రభాతం రాశాడు .

శ్రీ నాచ రమ్మ విజయం -ఇది సాంకేతి బ్రాహ్మణ చరిత్ర .వారి పుట్టుపూర్వత్తరాలు  నివాసం మొదలైనవి చారిత్రిక ఆధారంగా రాశాడు .ఇందులోతమిళనాడుకు చెందిన  నాచారమ్మ అనే సదాచార మహిళా కద ఉన్నది .ఆమె విజయనగర రాజ్యస్థాపకులైన శ్రీ విద్యారణ్య స్వామి సమ కాలికురాలు . నాచారమ్మ సాక్షాత్తు సరస్వతీ దేవి అవతారం .ఆమె విద్వత్తుకు అసూయ చెందిన ఆనాటి బ్రాహ్మణ పండితులను చూసి తమిళనాడునుండి కర్ణాటకకు భర్తతో సహా వెళ్లి స్థిరపడింది .ఆమెను అక్కడివారందరూ దేవీ సమానంగా భావించి ఆరాధించారు  .అనేక సంఘటనలను అత్యంత రమణీయంగా శాస్త్రి వర్ణించి కావ్య గౌరవం కలిగించాడు .

గురు పరీక్షణం -5 అంకాల నాటకం .కట్నాలు కానుకలు ,లంచాలు  నిరుద్యోగం లపై రాశాడు .నాలుగవ అంకం లో ఆత్మహత్య ఉంది .హాస్య  వ్యంగ్యాలను  దట్టించి రాశాడు .చిదంబర అనే జ్యోతిష్యుని వికటంగా చిత్రించాడు .అతని మాటలు – ఘ్రాణం పాతుం నశ్యా దేవ -నశ్యం జాతం ఘ్రాణా దేవ -ఉదరం జాతం కోఫీమ్ -కోఫీ జాతా ఉదరం గన్తుమ్ ‘’సంస్కృతం పై గొప్పనమ్మకం తో నాటకం రాశాడనిపిస్తుంది .విదేశీ సంస్కృతీ వ్యామోహాన్ని బాగా ఎండగట్టిన నాటకం

శ్రీ విద్యారణ్య కథా తరంగిణి 14 తరంగాల కావ్యం .విద్యారణ్యస్వామి బహుముఖీన ప్రతిభకు పట్టం కట్టిన రచన .కధావతరణం కర్ణాటక వర్ణనం మాధవ జననం  విజయనగర నిర్మితి మొదలైన అధ్యయాలు న్నాయి  తాను చెప్పిన ప్రతివిషయాన్ని అదో సూచికలతో సమర్ధించాడు .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

           

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 99–చతుర్భాషా పండితుడు విద్యావిశారద-గోటూర్ వేంకటాచల శర్మ (1894)

గీర్వాణ కవుల కవితా  గీర్వాణం -3

99–చతుర్భాషా పండితుడు విద్యావిశారద-గోటూర్ వేంకటాచల శర్మ (1894)

తమిళనాడు  డంకిని కోటలో జన్మించిన గోటూర్  వేంకటాచల శర్మ చామరాజేంద్ర సంస్కృత కాలేజీ నుండి సాహిత్య విద్వాన్ పొందాడు .పండిత రత్న ,విద్యా విశారద ,సరస కవి రత్న బిరుదులు  అందుకున్నాడు .సంస్కృతం తెలుగు ఇంగిలీషు  కన్నడ  భాషలో రచనలు చేశాడు .సంస్కృతం లో గణేశ గీతమాలాస్తోత్రం ,శ్రీ చౌడేశ్వరీ గీతాకాదంబకం ,స్తోత్రమాల భగవాన్ గీత మాలికవంటి వి రాశాడు .సుబ్రహ్మణ్య శాస్త్రి ఆఫ్ ఆనెకాల్ జీవిత చరిత్ర ఇంగిలీషు లో రచించాడు .మోహ ముద్గరం కు కన్నడ వ్యాఖ్యానం ,తెలుగులో ఆటవెలది గీతమాల రాశాడు .

Inline image 1

100-కాశ్మీర సమస్యపై నాటకం రాసిన -నిరాపజే  భీమదత్త -(1903)

కర్ణాటకలో దక్షిణకన్నర జిల్లా కాన్యన్ గ్రామం లో 1903 లో భీమదత్త నిరాపేజీ జన్మించాడు .తండ్రి శంకర భట్ .కాశ్మీర సంధాన సముద్యమ ,హైదరాబాదా విజయ అనే రెండునాటకాలు సంస్కృతం లో రాశాడు .మొదటిది విద్యార్థి దశలోనే రాసిననాటకం .చారిత్రాత్మక రాజకీయనాటకం .7 ఆంకాలలో కాశ్మీర సమసిపై రాశాడు .సమకాలీన రాజకీయాన్ని ప్రతిబింబించిననాటకం స్త్రీ పాత్రలేని నాటకం కూడా .రెండవదైన హైదరాబాద విజయం నాటకం లో భారత స్వాతంత్ర అనంతర  పరిస్థితులు హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్ లో చేరటంమొదలైన పది దృశ్యాలున్న  కదాఉన్న నాటకం .ఈ రెండు నాటకాలలో నిరాపజే  భారత దేశ  సమగ్రతను గట్టిగా సమర్ధించి దేశభక్తిని చాటాడు

101-హి ట్ఠనహళ్లి గోవింద భట్ట (1905).

హిట్టనహళ్లి గోవిందభట్ట 1905 లో కర్ణాటక లో దక్షిణ కెనరా జిల్లా మారుమూల గ్రామం లో జన్మించాడు .తండ్రి నీలకంఠ భట్ తల్లి భాగీరధి .హోసమానే రామచంద్ర శాస్త్రి గణేశా శాస్త్రీలవద్య కూలంకషంగా శాస్త్రాధ్యయనం చేశాడు .శ్రీ సర్వజ్ఞేన్ద్ర చంపు ను శ్రీ బ్రహ్మానంద గణేశా యోగేశ్వరాణాం జీవన చరితం అనే చారిత్రాత్మక రచన చేశాడు

శ్రీ సర్వజ్ఞేన్ద్ర చంపు అనంత భట్టు చంపూ భారతాన్ని అనుకరించి రాసింది .ఇది చారిత్రిక చంపు .స్వర్ణవాలి మఠ  చరిత్ర ఉన్నది .వేదాంతానికి దీన్ని అంకితమిచ్చాడు -ఇలామొదలౌతుంది –

‘’కవితా సవితానాహం కిమపి లేహ్యం లిఖేచ్చమే హస్తా -తదపిచ విబుధైర్  దయయా పరుగుణ పరమాణుతుస్థిర అభిగ్రాహ్యం

మరో మనోజ్ఞ చంపు –

‘’తహా యతీన్ద్రో వ్యవహార దుర్యహ్-తహా తపస్యయా   వాపి దుర్య దుర్యహ్ -యధా మృగేన్ద్రో మృగరాజా రాజా హ్ -తదా యతీన్ద్రో నటరాజ ఆసీత్ ‘’

శ్రీయ బ్రహ్మానంద గణేశయోగేశ్వరాణాం జీవన చరితం లో 8కాండలు ఉన్నాయి .బ్రహ్మానంద యతీశ్వరులే కథానాయకులు

102-విఘ్నేశ్వర శర్మ (1909)

.తండ్రి వెంకట రమణ పండిట్ .గురువు సుబ్బన్న భట్ .ఇతని రచనలు -సంస్కృతం లో సృజన రచనలు ,కన్నడ రచనలు ,,పాటలు కలగూర అని విభజించారు  .చనిపోయే నాటికి వెలుగు చూడలేదు .

సంస్కృతంలో రాసిన ఉషానిరుద్ధంనాటకం  అచ్చుకాలేదు .రత్నాఙ్గులీయకం హాస్య రచన హస్త కౌస్తుభం ,ధర్మ విప్లవం ,కామినీ కౌరవమ్ .భార్గవి చారిత్రాత్మకనాటకం ప్రచురణకాలేదు .ఇందిరా  వైభవం ఖండకావ్యం -ఇందిరాగాంధీ జీవిత చరిత్ర .ఇందిరాగాంధీ పై చాలాశ్లోకాలు గీతాలు రాశాడు .మూకాంబికాస్తుతి ,శివ గౌరీ స్తుతి ,వానీవందనం మొదలైనవి చాలారాశాడు .రేణుకాఖండకావ్యం రాశాడు విఘ్నేశ్వర శర్మకవిత్వం లో సంగీతం ప్రతిధ్వనించి చెవులకు పరమానందం కలిగిస్తుంది

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-4-17 కాంప్ -షార్లెట్ -అమెరికా .

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 97- యక్ష ప్రశ్న నాటక రచయిత -జగ్గు సింగరార్య(1891-

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 \

97- యక్ష ప్రశ్న నాటక రచయిత -జగ్గు సింగరార్య(1891-

జగ్గు తిరునారాయణ అయ్యంగార్ వెంగడాంబ  కు 20-11-1891 న కర్ణాటకలోని మేల్కొటే లో జగ్గు సింగరార్య జన్మించాడు . .మైసూర్ మహారాజా సంస్కృతకాలేజి  మేల్కొటే  సంస్కృత కాలేజీలలో చదివాడు .సంస్కృతం లో అమోఘ పాండిత్యం సాధించి యదునాధ చంపు కృష్ణ కథారహస్య కావ్యం ,దాశరధి దర్శన కావ్యం ,,వెంకటే శ పాదా వలంబన స్తోత్రం ,కావ్యకల్పకం యక్షప్రశ్న నాటకం,శిబి  వైభవం  శౌరి శౌర్యం నాటకాలు ,ధర్మవ్యాధి దర్శనం ఏకాంకిక ,అతిమానుష స్తవం ,కావ్యకల్పకం మొదలైన  ,  చాలగ్రంధాలు రచించాడు . కన్నడం లో నిధి సర్వావలి బాలినాభాగ్య ,వైరముడి వైభవం  ,రాశాడు . మైసూర్ మహారాజా నలువది కృష్ణ రాజా వడియార్ ,శృంగేరి పీఠాధిపతి శ్రీ చంద్ర శేఖర స్వామి ,ఉడిపి పెజావర్ స్వామి మున్నగు వారి చేత సత్కరింపబడ్డాడు .కర్ణాటక రాష్ట్ర పురస్కారం తో బాటు అనేక సాహిత్య సంస్థల నుండి సన్మానాలు  పొందాడు .అభినవ భవభూతి ,నూతన కాళిదాస ,కులభూషణ బిరుదులూ అందుకున్నాడు .

  ఆయన రాసిన యదు శైల చంపు తన ష్వగ్రామం  మేల్కొటే పై ఆరు అధ్యాయాలలో సత్పురపంచ పేరిట రాస్శాడు .కృష్ణకదా రహస్యాన్ని కన్నడ తెలుగులలో ముద్రించాడు .ఇది ఎస్ ఎస్ ఎల్ సి కి పాఠ్య గ్రంధంగా ఉన్నది  .మూడు ప్రపంచాలతో దాశరధి దర్శనం రాశాడు .మొదటి అధ్యాయానికి పాదుకా పట్టాభి షేక ,రెండవ ప్రపంచకానికి చిత్ర కూటోదంతా ,మూడవడానికి రామ పట్టాభి షేకం అని పేర్లు పెట్టాడు .మహాభారత ధర్మవ్యధ ఉపాఖ్యానాన్ని ధర్మవ్యధ దర్శన నాటకం గా రచించాడు .మొహాన్ని శ్లేషలో వర్ణించాడు -’’పత్నీ మోహ పుత్రమోహార్హమోహః -పృధివీ మోహో దేహగే హాది మోహః -ఏవం మోహైర్నాపి నాపై సౌఖ్యం నాశాంతిహ్ -జ్ఞాని తస్మాన్ నైవ ముహ్యత్త్విహ యేసు ‘’.వీరి శిబి వైభవాన్ని సాహిత్య అకాడెమి ముద్రించింది .శౌరి శౌర్యం భాగవత కృష్ణకధ .

 

98-34 వ శృంగేరి పీఠాధిపతి -శ్రీ శ్రీ చంద్ర శేఖర భారతి స్వామి (1892- 1954)

16-10-1892 న గోపాల శాస్త్రి లక్ష్మమ్మ దంపతులకు నరసింహ గా శ్రీ చంద్ర శేఖర భారతీ తీర్ధ స్వామి జన్మించారు .6–4-19 12 న 20 వ ఏటా శృంగేరిశారదా పీఠ  34 వ పీఠాధిపతిగా అభిషిక్తులయ్యారు . అనుక్షణం ఆత్మ దర్శనం పొందుతూ సమాధి స్థితిలో ఉండేవారు .ఛందస్సు పై అపూర్వ అధికారం ఉండటం వలన అలవోకగా ఎన్నో శ్లోకాలు చెప్పేవారు వాటిని భక్తులకు అందుబాటులోకి తేవటానికి ముద్రించారు .వాటిలో పాదా వలంబన స్తుతి ,నవరత్నమాల ,తోటకాస్టో త్తరం ,శ్రీమదాచార్యే 0ద్ర   స్తవం ,ఆచార్య పాదా వలంబన స్తుతి ,దత్త నవరత్న మాలిక .దక్షిణామూర్తి మంత్రమార్క స్తవం ,సన్ముక్త భుజంగ స్తుతి మొదలైనవి .శంకరాచార్యుల వివేకా చూడామణికి వ్యాఖ్యానం ,భగవద్గీతకు శంకరభాష్యం పై వ్యాఖ్యానం మొదలైన శాస్త్ర గ్రంథ రచన చేశారు .

పాదా వలంబన  స్తుతి లో -’’స్థితే నూపురమకరాండ పూర్ణే -జగద్గురోహ్  పాద సహస్ర  పాత్రే – కిమన్యతో ధా వసి చిత్త  భృంగ -ప్రయాహి తత్రైవ  రామస్వ నిత్యం .’’భావం -ఓ మనస్సనే తుమ్మెదా !అనుగ్రహ గురు పాదపద్మ0 ఉండగా అటూ ఇటూ దేనికోసమో వెతుకుతావేమిటి .ఆపాదపద్మాలపైనే వ్రాలి చిరకాలం ఉండిపో

నవరత్నమాల -’’కామాది  శృంగి పరిచ్చేదన వజ్ర పాణే -నామావధూత నిఖిలా ఘ  చయో మనశ్వీ-సామాది గీర్శు పరిగీత నిజ స్వరూపః -దృగ్గోచరో భవతు దేశికరాన్ మమాసు ‘’  –భావం -గురు దేశికులు తక్షణం ప్రత్యక్షం కావాలి .ఇంద్రుడు పిడుగును సంహరించినట్లు నా ఆరుగురు లోపలి శత్రువులను దునుమాడి ,ఉపనిషత్ సా ర సంగ్రహమైన గురుదేవుడు ప్రత్యక్షం కావాలి .

 స్వామిజీ జీవితకాలం లో అనేక అద్భుతాలు ప్రదర్శించారు .కళ్ళు లేనివారికి నేత్ర జ్ఞానం బాధితులకు వినికిడి వారి స్పర్శవలన లభించేవికనుక వారిని ‘’స్పర్శామాత్ర గురుదేవులు ‘’అని అందరూ చెప్పుకునేవారు .వీరు పీఠాధిపతులుగా ఉన్నకాలం లో శృంగేరి శారదా పీఠం పరమ వైభవాన్ని సాధించింది .ఎంద రెంద రో తత్వ వేత్తలు శాస్త్ర వేత్తలు విద్యాధికులు పండితులు రాజకీయ ప్రముఖులు స్వామీజీ సందర్శనం చేసి ఉపశమనం పొందేవారు .అలాంటివారిలో డా రాజేంద్ర ప్రసాద్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ,కృష్ణరాజ ఒడియార్ వంటి ప్రముఖులున్నారు 26-.-9-19 54 న స్వామీజీ మహా సమాధి చెందారు .

Inline image 1

 సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-4-17-కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 95- సతీష్ చంద్ర విద్యాభూషణ్ (1870-1920)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

95- సతీష్ చంద్ర విద్యాభూషణ్  (1870-1920)

మహామహోపాధ్యాయ డా సతీష్ చంద్ర విద్యాభూషణ్ 30-7-1870 న ఇస్లామిక్ బంగ్లాదేశ్ లో ఫరీద్ పూర్ లోని కాల్కువ గ్రామం లో జన్మించాడు తండ్రి పీతాంబర విద్యా వాగీశుడు ప్రముఖ సంస్కృత పండితుడు .అన్న విశ్వంభర జ్యోతిష్ర్ణవ ఇతనికంటే 12 ఏళ్ళు పెద్ద .మిడ్నపూర్ కాలేజీ మొదటి ప్రిన్సిపాల్ గంగాధర ఆచార్య కుమార్తెను 18 89 లో పెళ్లి చేసుకున్నాడు .అయిదవ ఏటనే విష్యాభ్యాసం ప్రారంభించి తోటి వారిలో తలమానికంగా నిలిచాడు .ప్రవేశ పరీక్షలో ఆ డివిజన్ ఫస్ట్ వచ్చి నవద్వీప్ లో హిందూ స్కూల్ లో చేరాడు . 1888లో కలకత్తా యూనివర్సిటీ ఎంట్రన్స్ పరీక్ష పాసై స్కాలర్షిప్ పొంది సిటీ కాలేజీలో చేరాడు .ఎఫ్ ఏ పాసై కృష్ణానగర్ కాలేజీ కు వలసవెళ్లాడు . 1892 లో సంస్కృతం లో బి ఏ ఆనర్స్ పొందాడు . 1893 లో కలకత్తా యూ ని వర్సిటీనుంచి ఏం ఏ సాంస్క్రిట్ డిగ్రీ సాధించాడు .నవద్వీపం లోని విదగ్ధ జనని సభ నిర్వహించిన సంస్కృత భాషా సాహిత్య పోటీలో విజయం సాధించి ‘’విద్యాభూషణ ‘’పొందాడు . 1893-నుండి రెండేళ్లు సంస్కృతకావ్యాలను మహామహోపాధ్యాయ అజిత్ నాధ న్యాయ రత్న వద్ద అభ్యసించాడు .సంస్కృత న్యాయ శాస్త్రాన్ని మహామహోపాధ్యాయ జరునాధ సార్వ భౌమవద్ద చదివాడు 1897 -1900 వరకు టిబెట్ భాషను ప్రముఖ లామా ఫంగ్ చాంగ్ వా0గ్ డాన్ వద్ద లాసా లో నేర్చాడు . 1901 లో పాళీ భాషను శ్రీలంక బర్మా షర్మాన్ వద్ద చదివి పాళీ లో ఏం ఏ సాధించాడు

 1893 లో కృష్ణానగర్ సంస్కృతకాలేజిప్రొఫెసర్ గా చేరి ,బౌద్ధ సొసైటీ ఆధ్వర్యం లో పాళీ భాషలో పుస్తకాలకు సంపాదకత్వం లో ప్రచురించాడు 1897-90 వరకు డార్జిలింగ్ లో గవర్నమెంట్ ప్రాజెక్ట్ లో టిబెటన్ -ఇంగిలీషు నిఘంటు నిర్మాణం చేశాడు . 1900 లో కలకత్తా వచ్చి కలకత్తా కాలేజీ సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు . 1906 లో గవర్నర్ జనరల్ మహా మహోపాధ్యాయ బిరుదు ప్రదానం చేశాడు 1908లో కలకత్తా యూనివర్సిటీ పి  హెచ్ డి నిచ్చింది . 1910 లో సంస్కృతకాలేజి ప్రిన్సిపాల్ అయ్యాడు

సతీష్ చంద్ర 1897 లో బెంగాల్ భాషలో ఆత్మతత్వ ప్రకాశం రాశాడు .తరువాత వరుసగా భవభూతి అండ్ హిజ్ డ్రామా ,లంకావతారసూత్ర ,,కాత్యాయన్స్ పాళీ గ్రామర్ , టిబెటన్ ప్రీమియర్ రెండుభాగాలు ,రత్న నౌట్ట ,,నోట్స్ ఆన్ రత్నావళి గ్రిమ్స్ ఫోనెటిక్ లా ఆఫ్ ఇండో-యూరోపియన్ లాంగ్వేజెస్ ,బుద్ధ స్తోత్ర సంగ్రహ ,స్రగ్ధర స్తోత్ర ఆఫ్ సర్వజ్ఞ మిత్ర ,హిస్టరీ ఆఫ్ మిడీవల్ స్కూల్ ,ఆఫ్ లాజిక్ ,అమరకోశ సాంస్క్రిట్ విత్ టిబెటన్ వెర్షన్ రెండుభాగాలు ,అమరాఠికా కామధేను ,అవధాన కల్పలత ,న్యాయ సూత్ర ఆఫ్ గౌతమ , బై లింగ్యువల్ ఇండెక్స్ ఆఫ్ న్యాయ బిందు ,హిస్టరీ ఆఫ్ ఇండియన్ లాజిక్ మొదలైన ఉద్గ్రంధ రచయిత సతీష్ చంద్ర .-25-4-1920  న యాభై ఏళ్లకే మహామహోపాధ్యాయ సతీష్ చంద్ర విద్యాభూషణ్ పరమపదించాడు ..

Inline image 1

96-తాంత్రిక బౌద్ధ  గ్రంథ రచయిత-సర్వజ్ఞ మిత్ర (8 వ శతాబ్దం )

స్రగ్ధర సూత్రం రాసిన సర్వజ్ఞ మిత్ర కాశ్మీర్ వాడు .ఇదిటిబెటన్ తాంత్రిక దేవత   తార అనబడే  శ్రోలమ పై  చెప్పిన 37 మంత్రాల సముదాయం .దీనికి జైన రక్షితుడు స్రగ్ధరా స్తోత్ర టీకా అనే వ్యాఖ్యానం రాశాడు .ఆనాటి ప్రభువుకు సహాయకారిగా ఉన్న విక్రమశిల బౌద్ధారామం లో భిక్షువు .రక్షితుడు రాసిన వ్యాఖ్యానాన్ని బట్టి సర్వజ్ఞ మిత్ర కాశ్మీర్ కు చెందిన మహా కవి దాత .తనకున్న సర్వస్వాన్ని త్యాగం చేసి దేశ సంచారం చేస్తూ వజ్రముకుటు ని రాజ్యం లో ప్రవేశించాడు .దారిలో అతిపేదబ్రాహ్మణుడు కూతురి పెళ్ళికి డబ్బు లేక బాధ పడటం చూశాడు .ఆ బ్రాహ్మణుడు మ హా దాత అయినాసర్వజ్ఞ  మిత్ర ను దర్శించి తన గోడు చెప్పుకొందామనుకొని ఆయనే సర్వస్వము దానం చేసి భిక్షాపాత్ర, పైన ఉత్తరీయం తో తిరుగుతున్నాడని తెలిసి హతాశుడయ్యాడు .దయాళువైన సర్వజ్ఞుడు ఓదార్చి తాను తప్పక సాయం చేస్తానని మాట ఇచ్చాడు .అదే సమయం లో రాజు వజ్రముకుతటుడికి ఒకడు ఆయన కోరికలన్నీ తీరాలి అంటే అప్పటికప్పుడు వంద శరీరాలనుండి వేరు చేయబడిన కపాలాలపై కూర్చుని స్నానం చేస్తే తీరుతాయి అని సలహా ఇచ్చాడు .అప్పటికే 99 సంపాదించిన రాజు సర్వజ్ఞమిత్రనుఅతని బరువుతో సమానమైన  బంగారంతో తూకం వేసి కొని   కొని వందా  పూర్తి చేశాడు .ఆ బంగారాన్ని అంతటిని సర్వజ్ఞుడు ఆ పేద బ్రాహణుడికి దానం  చేసేశాడు

 

 సేకరించిన వందమందిని సర్వ్జ్ఞమిత్ర తో సహా వధ్యస్థలానికి రాజభటులు తీసుకు వెళ్లారు .తప్పించుకొనే దారి తోచక సర్వజ్ఞుడు 37  స్రగ్ధరా శ్లోకాలు ఆర్య తారా దేవిపై ఆశువుగా చెప్పాడు  .అకస్మాత్తుగా వందమంది మృత్యువు నుంచి తప్పించుకొని స్వగృహాలకు చేరారు .సర్వజ్ఞుని మహా భక్తికి ఆశ్చర్యపోయిన రాజు క్షమాపణ వేడి శిష్యుడైపోయాడు .ఇలాంటిదే మరొకధ  సర్వజ్ఞమిత్రాపై టిబెటన్ భాషలో ప్రచారం లో ఉంది .దీనిప్రకారం సర్వజ్ఞుడు కాశ్మీర్ లో పుట్టినా నలంద  విశ్వ విద్యాలయ విద్యార్థి ..అక్కడ అనేక శాస్త్రాలలో పాండిత్యం సంపాదించాడు .స్రగ్ధరా స్తోత్ర టీకలో సంస్కృతంలో రాజుపేరు వజ్ర ముకుటుడు పేరుకు బదులు      ‘’శరన ‘అని టిబెటన్ భాషలో ‘’పాగ్ సాం సాన్ జంగ్ ‘’’అంటారని ఉన్నది .సర్వజ్ఞ మిత్ర కాలం ఎనిమిదవ శతాబ్ది పూర్వార్ధంగా నిర్ణయించారు

.Inline image 2

 సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3 94-స్వామి సత్యసంగా నంద సరస్వతి -(1953_

గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3

94-స్వామి సత్యసంగా నంద  సరస్వతి -(1953_

1953 లో పశ్చిమ బెంగాల్ చందర్ నగర్ లో జన్మించిన స్వామి సత్య సంగానంద సరస్వతిని ‘’స్వామి సత్సంగీ ‘’అని గౌరవంగా పిలుస్తారు.చిన్నతనం నుంచి ఆధునిక సంప్రదాయం వేషభాషలలో పెరిగినా ఆమెకు అనేకమైన ఆధ్యాత్మికానుభవాలు దర్శనమవటం తో అన్నీ పరిత్యజించి స్వామి సత్యానంద సరస్వతి గురువు అనుగ్రహం తో దశమి విధానం లో 6-7-19 82 లో సన్యాసిని అయింది  .తరువాత గురువు సత్యానందం తోకలిసి దేశమంతటా విదేశాలలోని విస్తృతంగా పర్యటించింది .గురువు అనుగ్రహం పుష్కలంగా లభించటంవలన మంత్రం తంత్ర వేదం తత్వ శాస్త్రాలలో మహా నిధి అయింది .యోగం తంత్రం లపై అద్భుతమైన గ్రంధాలు రాసి వాటికి అందరికీ కరతలామలకం చేసింది .ఆమె రాసిన ‘’విజ్ఞాన భైరవ తంత్ర ‘’చాలా ప్రసిద్ధమైంది .శ0కరాచార్యుల వారి ఆధ్యాత్మిక గ్రంధ0 సౌందర్య లహరి కి అనుభూతిపరమైన  గొప్ప వ్యాఖ్యాన0  రచించింది .’’తత్వ శుద్ధి ‘’అన్న ఆమె గ్రంధం చాలా వ్యాప్తి చెందింది .’’ది  తాంత్రిక్ సైన్స్ ఆఫ్ ఇన్నర్ ఫీలింగ్ ‘’గ్రంధం లో ఆంతరిక శుద్ధిని చక్కగా వివరించింది .పరంపరాగతం గా వస్తున్న యోగ తంత్రాలను ఆధునికకాలానికి అన్వయిస్తూ ఆమె చెప్పిన తీరు బహుధా ప్రశంశనీయం

 19 89 లో స్వామి సత్యానందం తన అంతర్  దృష్టిలో దర్శించిన జార్ఖండ్ లోని రిఖియా అనే ప్రదేశానికి వెళ్లి అక్కడ నిర్జన ప్రదేశం లో ఒక ఆశ్రమాన్ని నిర్మించి యోగ సాధన  చేయాలని సంకల్పించాడు .అదే సత్యానందం తపోభూమి అయింది .దానికి దారి రోడ్డు ఫోను కరెంట్ కూడా లేని అతి చిన్న ప్రదేశం .  21 వ వ శతాబ్దపు ఆధునీకతకు  కు అత్యంత సుదూరం లో ఉన్నది .1 989 లో రిఖియా గ్రామం దర్శించి గురువుగారి రాకకు అన్ని ఏర్పాట్లు చేసింది .అప్పటినుంచి అక్కడే ఉండిపోయి సమాజం చేత బహిష్కరింపబడిన సమాజం దృష్టిలో లేని అదో జగత్ సహోదరులకు అన్నీ తానె అయి వారి సర్వతోముఖాభి వృద్ధికి తీవ్రంగా కృషి చేసింది .ఆ ఆశ్రమానికి శివానంద మఠం అని పేరుపెట్టింది .ముంగేరులో ఉన్న ఆ ప్రాంతం ఆమె అవిరళ కృషివలన గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లింది .

 2007 లో సత్య సంగానంద సరస్వతి రిఖియా పీఠ్ కు పీఠాధిపతి అయింది .శివానంద సరస్వతి బోధించిన సేవ ,ప్రేమ దానం అనే మూడింటిని త్రికరణ శుద్ధిగా అనుసరించి అక్కడి ప్రజల భౌతిక ఆధ్యాత్మిక అభి వృద్ధికి అంకిత భావం తో కృషి చేస్తోంది .గురు వరేణ్యులైన శివానంద సత్యానంద  సరస్వతుల అడుగు జాడలలో నడుస్తూ దేశ విదేశాలలో వారి భావ ధా రను వ్యాప్తి చెందిస్తూ గురువుకు తగిన శిష్యురాలుగా సేవలందిస్తోంది  .

Inline image 1

 సశేషం

బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలతో –

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3 93-తర్క తీర్ధ పద్మవిభూషణ్ లక్ష్మణ శాస్త్రి జోషి (1901-1994)

గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3

93-తర్క తీర్ధ పద్మవిభూషణ్ లక్ష్మణ శాస్త్రి జోషి  (1901-1994)

బ్రాహ్మణ కుటుంబం లో అర్చకత్వ శాఖలో 1901 లో జన్మించిన లక్ష్మణ శాస్త్రి జోషి 14 వ ఏటకృష్ణానదీ తీరాన ఉన్న  దేవాలయాలకు నిలయమైన’’ వాయి ‘’గ్రామం చేరిసంస్కృతంలో , హిందూ ధర్మ తత్వశాస్త్రాలలో నిధి అయ్యాడు . అక్కడ సంస్కృత పాఠశాల నెలకొల్పాడు దీనిలో సంస్కృతం నేర్పటానికి ఆంద్ర నుంచి సంస్కృత పండితులు వచ్చేవారు . తర్క శాస్త్రం లో ప్రావీణ్యం పొంది తర్క తీర్ధ అయ్యాడు . భారత స్వాతంత్రానంతరం ఏం యెన్ రాయ్ వంటి వారి ప్రభావానికి గురై ,పాశ్చాత్య తత్వ శాస్త్రాన్ని అవలోడనం చేశాడు .ఆనాడు సంస్కృతం లో పేరున్నవారు ,వారిని అనుసరిస్తున్నవారు నిజమైన హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నారా అనే ఆలోచనలతో ‘’వైదిక్ సంస్కృతీ చ వికాస్ ‘’అనే గ్రంధాన్ని 19 51 లో రాశాడు .ఇవి పూనా యూనివర్సిటీలో ఇచ్చిన ఆరు ఉపన్యాసాల సారాంశం .వేద సంస్కృతీ ఆవిర్భావం భారత దేశం పై దాని ప్రభావాలను ఇందులో వివరించాడు . ఆధునిక భారతీయులు భౌతిక ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి మధ్య నలిగి పోతూ దారి తెలియక బలహీనులై పోతున్నారని చెప్పాడు .దీనివల్ల సామరస్యం కోల్పోయి కులమత వర్గాలలో కూరుకు పోయారని వ్యధ చెందాడు . తన మేధో వికాసనాన్ని చూపినందుకు 19 55 లో కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు పొందాడు .సాంప్రదాయ చాందస భావాలను త్యజించాలని పిలుపు నిచ్చాడు జోషీ .

  సంప్రదాయాన్ని ధిక్కరించి గాంధీ మహాత్ముని అనుచరుడై ఉద్యమించాడు .అస్పృశ్యత నివారణకు హరిజనుల దేవాలయ ప్రవేశానికి పూనుకొని సఫలుడయ్యాడు . హిందూ ధర్మం పై ఎవరికి ఏ సందేహం వచ్చినా జోషీ తీర్పు ఫైనల్ గా ఉండేది .  1932 లో ఆయన 29 వ ఏట స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నందుకు  బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలు లో పెట్టింది .  జైలులో ఉండగా హిందూ ధర్మ పండితునిగా దేశవ్యాప్త కీర్తి పొందాడు .వినోబాభావే వాయి గ్రామం వచ్చినప్పుడు ఆయన సలహాతో కేవలానంద సరస్వతి వద్ద ఇంగిలీషు నేర్చాడు .గాంధీ గారు  కోమటి కులానికి చెందిన తనకుమారుడు రామ దాసుకు బ్రాహ్మణ కులానికి చెందిన చక్రవర్తుల రాజగోపాలాచారి గారి కూతురు లక్ష్మి నిచ్చి కులాంతర వివాహం చేస్తే హిందువులందరూ తీవ్రంగా వ్యతిరేకించారు .రెండవ గవర్నర్ జనరల్ గా ఉన్న రాజాజీ యువకుడైన జోషీ పండితుని ఈ వివాహం హిందూ ధర్మసమ్మతమమో  వ్యతిరేకమో  తేల్చి చెప్పమని కోరాడు .సర్వ శాస్త్ర పారంగతుడైన జోషి అది హిందూ ధర్మ సమ్మతమేనని తీర్పు చెప్పటమేకాక దగ్గరుండి వివాహం జరిపించి చరిత్ర కెక్కాడు .

19 60 లో మరాఠీ భాషా బి వృద్ధికోసం జోషీ ‘’మరాఠీ కోశం ‘’తయారు చేశాడు .’’విశ్వ కోశం’’ అనే విజ్ఞాన సర్వస్వాన్ని సంకలనం చేశాడు . .వేదమంత్రాల నాధారంగా మరా ఠీ  భాషలో ‘’ధర్మకోశం ‘’రాశాడు .లక్ష్మణశాస్త్రి జోషీ విద్వత్తును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1976 లో పద్మ భూషణ్ ను ,19 92 లో పద్మ విభూషణ్ పురస్కారాల నిచ్చి గౌరవించింది .బాంబే యూని వర్సిటీ  ఎల్ ఎల్ డి డిగ్రీ ప్రదానం చేసింది .ప్రధమ భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రు ఉన్నత విద్యకు, భారీ పరిశ్రమలకు కేటా యిస్తున్న నిధులపై హర్షం వ్యక్తపరచిన దూర దర్శి జోషి . 94 వ వ ఏట 1994 లో జోషీ పండితుడు మహా ప్రస్థానం చెందాడు .

 జోషీ పండితుడు ప్రప్రధమంగా సంస్కృతం లో ‘’శుద్ధి సర్వస్వము ‘’అనే గ్రంధాన్ని రాసి  కులాంతీ కరణ ఎలా చేయాలో వివరించాడు . 26 భాగాలతో 18 వేల పేజీలతోక్రీ పూ 1500 కాలం నుండి 18 వ శతాబ్దం వరకు ఉన్నా హిందూ ధర్మాన్నిసకల  వేదం శాస్త్రాలు వాటి వివిధ వ్యాఖ్యానాలు కూలం కషంగా   అధ్యయనం చేసి నిగ్గు తేల్చి   ‘’ధర్మ కోశం ‘’అనే ఉద్గ్రంధాన్ని రచించాడు . మరాఠీ భాష లో ‘’ఆనంద- మీమాంస’’ అనే గ్రంధాన్ని రసం సౌందర్యం లను చర్చిస్తూ రాశాడు . 1940 లో సంస్కృతం లో’’ హిందూ ధర్మం ‘’ గ్రంథ రచన చేశాడు .భారత ,పాశ్చా త్య దేశాలలో భౌతిక ప్రవ్రుత్తి  తత్వ శాస్త్ర విధానాలపై తులనాత్మక పరిశోధన చేసి హిందూ యిజం జాద్వాడ్ పుస్తకం 1941 లో రాశాడు . 1958 లో ‘’వైదిక సాంస్కృతిచ వికాస్ ‘’గ్రంధం రాశాడు . .1 8 ఉపనిషత్తులను మరాఠీ లోకి అనువదించైనా సాహితీ మూర్తి జోషీ .

Inline image 1

  సశేషం

బాబాసాహెబ్ అంబే ద్కర్  జయంతి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరద లో తేలి (రి)న తేట ఊట -7(చివరిభాగం )

వరద లో తేలి (రి)న తేట ఊట -7(చివరిభాగం )

34-తర్క తీర్ధ లక్ష్మణ శాస్త్రి జోషి -మహారాష్ట్ర సతారా జిల్లా ‘’వాయి ‘’గ్రామం లో ప్రముఖ సంస్కృత పాఠ శాల ఉన్నది .అక్కడ సంస్కృతం నేర్పటానికి తెలుగు దేశం నుండి పండితులు వెళ్లి నేర్పారు .దాన్ని తీర్చి దిద్దినవాడు తర్కతీర్ధ లక్ష్మణ శాస్త్రి జోషి . అబ్బూరి కి మంచి మిత్రుడు . ఇద్దరూ సంస్కృతం లోనే మాట్లాడుకునేవారు .ఆయనకు పిలక ఉండేది . 1940 లో ఇద్దరూ కలకత్తా వెళ్లి  ఒక రెస్టారెంట్ లో విస్కీ కొడుతున్నారు ..జోషిగారిపిలక ,పండితవేషం విస్కీ తాగటం జనం విడ్డూరంగా చూశారు .. అబ్బూరి వెంటనే రెస్స్టారెంట్ యజమాని నుంచి కత్తెర తెచ్చి జోషీ పిలక కత్తిరించారు .అప్పుడాయన ‘’కామ్రేడ్ రామ కృష్ణారావు ! ఈ దేశం లో ఏదీ బహిరంగం గా చెయ్యరాదు ‘’అన్నాడట .. జోషీ గాంధీకి కూడా సన్నిహితుడు .  ఆయన పాండిత్యం లో బ్రహ్మదేవుడంతటివాడని అంటారు . హరిజన దేవాలయ ప్రవేశం కోసం గాంధీ ఆయన్ను కాశీలో పండితులతో తర్కించమని పంపారు .కాశీ పండితులు వ్యతిరేకించారు .రాయుడు శాస్త్రిగారు జోషీని సమర్ధించగా పండితులు కిమిన్నాస్తి అయ్యారు .. హరిజన దేవాలయ ప్రవేశం యధా విధిగా జరిగిపోయింది

35-దుగ్గిరాల గురించి మరిన్నీ విషయాలు -దుగ్గిరాల వారి ‘’రామదండు ‘’దుష్టసమాసం అన్నాడు రామ సుబ్బయ్య ..వెంటనే ‘’మీ పేరు లో ఏ సమాస0  ఉంది ?అని ఎదురుప్రశ్నించాడు ..రామదండు సభ్యులందరూ కాషాయ వేషం  తలపాగా రుద్రాక్షలు ,నుదుట కుంకుమ ధరించేవారు .బెజవాడ అఖిలభారత కాంగ్రెస్ సభకు రామదందే వాలంటీర్లు .వేల  సంఖ్యలో ఉన్న వీరించి చూసి మహమ్మదాలీ ‘’రెడ్ ఆర్మ్ ‘’అన్నాడు ..దుగ్గిరాలవంటి మహా వక్త నభూతో అంటాడు వరద .చీరాలలో పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేయటానికి ప్రభుత్వ ప్రతినిధులువచ్చారు .సభ పెట్టారు .పోగేసుకొచ్చిన జనం పారిపోకుండా ప్రాంగణం చుట్టూ కంచెవేసి పోలీసు పహారా పెట్టారు ..సంగతి తెలిసిన దుగ్గిరాల ప్రాంగణం ప్రక్కనే ఉన్న తాటి తోపు లోకి వెళ్లి తాటి చెట్లను సంబోధిస్తూ ఉపన్యాసం మొదలు పెట్టారు .ఇంకేముంది చెవిన పడిన జనం క0చె దూకి తాటితోపు కు పరుగులు తీశారు.  అవాక్కయింది బ్రిటిష్ ప్రభుత్వం .’’నర చరిత్రలో జరగని గొప్ప విశేషం ‘’అన్నాడు దీన్ని కట్టమంచి  .

 గాంధీతో అభిప్రాయం భేదాలున్న గోపాల కృష్ణయ్యగారు ‘’మన ఇతిహాసం లో సత్యాగ్రహ సాధనాన్ని మొదట ప్రయోగించినవాడు ప్రహ్లాదుడు .తండ్రి హిరణ్యకశిపుడు ఎంత బాధ హింసా పెట్టినా కొంచెం కూడా చలించలేదు .అహింసాత్మకంగా సత్యాగ్రహం చేసిన ప్రహ్లాదుని లక్ష్యం ఎలా ఫలించింది ?ప్రపంచం లోనే కనీ వినీ ఎరుగని హింసా స్వరూపం తో నృసింహావతారము ప్రత్యక్షమైంది .కనుక అహింసను మనం ఆరాధిస్తే హింస ప్రత్యక్షం కాక మానదు ‘’అన్నారు ..గాంధీ గారికి ఈ వార్త చేరి మైండ్ బ్లాకై ‘’దుగ్గిరాలను ఇలా ఇకనుంచి అహింసా సిద్ధాంతం పై మాట్లాడవద్దు ‘’అని చెప్పమని కొండా వెంకటప్పయ్య గారికి జాబు రాశాడు .

గోపాల కృష్ణయ్యగారు శ్రావ్యమైన కంఠం తో పాడేవారు .ప్రతి బహిరంగ సభలో సాయంత్రం ‘’సాయంకాలే  వనాంతే’’అనే శ్రీ కృష్ణ కర్ణామృతం లోని శ్లోకం పాడేవారు ..ప్రేక్షకులు ముగ్ధులు వశ్యులు అయ్యేవారు .ఆతర్వాత ఆయన ఏది చెప్పినా వేదవాక్యంగా విని అనుసరించేవారు .అంతటి జన వశీకరణ శక్తి ఆయనది . ఆయన పాట పాడే తీరును మహానటులు శ్రీ అద్దంకి  శ్రీరామ మూర్తిగారు అనుకరించారు బాగా ..మంచి హాస్యప్రియులైన దుగ్గిరాల ఛలోక్తులు నిలయం నవ్యకవులను ‘’కొత్తిమేర కవులు ‘’అనేవారు .ఆశువుగా హాస్యంగా పద్యాలు చెప్పేవారు .ఆయన ప్రభావం పడని  నవ్యకవులు లేరు ..ఆయన సన్నిహితులు భట్టిప్రోలు సూర్య ప్రకాశరావు .రావు గారితో పద్యాలు  చెప్పించాలని  ఎందరు ప్రయత్నించినా కుదర్లేదు ..ఒక రోజు అబ్బూరి ని రెచ్చగొడితే గోపాలకృష్ణయ్య గారిపై ఆశువుగా ‘’

ఉపమాపై పెసరట్టు పై ఇడి లిపై  హుమ్మంచు చూపించు నీ-జపసంబద్ధ పరాక్రమ క్రమ కటాక్ష శ్రేణి మన్నించి శు -భ్రపు జిల్లే బీ ,పకోడీ  లడ్వ గయిరాపై కొంత రానిమ్ముశ్రీ -చపలా0గ సితాంగ నా హృదయ పాశా పూజ్య వస్తుప్రియా ‘’అని చెప్పారు ..గిలగిలా లాడిపోయిన రావు గారు . నేనూ చెబుతా కాసుకోండి అని –

‘’కొండ వెంకటప్ప మొండుపన్యాసంబు -సీతారామ శాస్త్రి జ్యోతిషంబు -అడివి బాపిరాజు అడివి కవిత్వంబు -ఎరగనట్టు ఆంద్ర ఎదవ ఎవడు ‘’అని చదివారు . వరదను గోపాల ఎత్తుకొని ఆడించారు చిన్నప్పుడు . అప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్ రూథర్ ఫర్డ్ .ఆయనకు డిప్యూటీ కలెక్టర్ గా అబ్బూరి మేనమామ రావు సాహెబు వడ్లమూడి బ్రహ్మయ్య పంతులు ఉండేవాడు .అందుకని మేనల్లుడు అబ్బూరిని అరెస్ట్ కాకుండా కాపాడేవాడు .అబ్బూరి ఎన్నిప్రయత్నాలు చేసినా అరెస్ట్ కాలేదు .జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని బుర్రకధగా రాసి ప్రచురించారు .అచ్చు వేసిన వాడిని అరెస్ట్ చేసి అబ్బూరి జోలికి రాలేదు .. తనను ఎందుకు అరెస్ట్ చేయటం లేదో అబ్బూ రికి అర్ధమయ్యేదికాదు . 35 ఏళ్లతర్వాత రూథర్ ఫోర్డ్ మద్రాసులో గవర్నర్ సలహాదారుగా ఉండేవాడు ..ఆయన ఈయన్ను గుర్తుపట్టి చీరాల వ్యవహారాలూ చెబుతూ అరెస్ట్ చేయకపోవటానికి కారణం చెప్పేదాకా అబ్బూరి ఆ రహస్యం తెలియదు అన్నాడు వరద .తాను  జైలుకు పోలేక పోతున్నానే అని తెగ మధానపడేవారు అబ్బూరి .

గోపాలకృష్ణయ్య గారి మరణంపై బసవరాజు అప్పారావు చిరస్మరణీయ గీతాలు రాశారు –

‘’కాలక్రమము గతి గడచి తెనుంగు భావి భాగ్యమెల్ల పండిన వెనుక -ఆనాటి కెవరైననడుగగా పోరు -గోపాలకృష్ణుడే గోష్ఠి వాడంచు-భాగ్య వశమ్ము న భావికాలాన అమృత తుల్యమ్ములు నతి   భావ భరిత -ములు నైన నా గీతములు వినినంత గోపాల కృష్ణుని గొప్ప దీపించు ‘’

దటీజ్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య .

దుగ్గిరాలవారి ‘’రామనగరం ‘’లో కులాలు లేవు అందరిదీ ఒకటే కులం ‘’నాన్ బ్రాహ్మిన్ కు అర్ధం లేదు ‘’అన్నారు .జాగర్లమూడి కుప్పుస్వామి జస్టిస్ పార్టీ నాయకుడు దుగ్గిరాల అవసాన దశలో వచ్చి చూశాడు .రామనగరులో పూరిపాకలో చిక్కి శల్యావశిస్టం గా  పడి  ఉన్నారు చౌదరిని పలకరించటానికి లేవ బోయారు .సహాయం చేస్తానన్నాడాయన లేవటానికి .. నవ్వుతూ ‘’నడుం లో నాన్ బ్రాహ్మినోయ్ ‘’అని చమత్కరించారు .ఆయన ఆపుకోలేక పగలబడి నవ్వాడు . అప్పటికి నాలుగు రోజులనుంచి నడుం నెప్పితో బాధ పడుతున్నారు దుగ్గిరాల . వెళ్లిపోతుంటే ‘’రామార్పణం ‘’అన్నారు .వాళ్ళు వెళ్ళాక అవుటపల్లి నారాయణ రావు తో ‘’ఒరే  శ్రీరామ చంద్రుడు చిత్తు  కాగితం పంపించారురా .కానీ ఆ దూతకు తగిన ఆతిధ్యం ఇవ్వలేక పోఇందిరా ఈ ఘటం ‘’అన్నారు గోపాల .ఆ చిత్తుకాగితం వంద రూపాయల నోటు

36- కొండా వెంకటప్పయ్య -అంతః కక్షలకు దూరంగా ఉండేవారు .పెద్దమనిషి తరహా . సాధువుగా మాట్లాడినా కోపం విసుగూ ఎక్కువ .అణ చు కోలేక పోతున్నానని బాధ పడేవారుకూడా  దుగ్గిరాల కొండా పై ‘’కొండెం కటప్పయ్య కొండంత కోపాన -చిర్రు బుర్రు మనుచు చిందులేసే ‘’అని అందరికీ తెలిసేట్లు పద్యం లో శాశ్వతం చేశారు .అతి నిరాడంబర జీవి సుఖాలకు అతి దూరం గాంధీ కి అత్యంత సన్నిహితుడు . అందుకే ఆయనకు ఒక ప్రత్యేక హోదా ఏర్పడేది ..లక్నో కాంగ్రెస్ కు వెళ్లి స్నానం చేద్దామనుకొంటే వేడినీళ్లు పెట్టిస్తాం అంటే ‘’మేమంత నాజూకు వాళ్ళం కాదు .మహాత్ముని అనుచరులం .మాకు వేన్నీళ్ళ భోగం అనవసరం ‘’అని చెప్పినా వినకుండా చన్నీటి స్నానం చేసి స్నానాల గదిలో కొయ్యబారి పోయారు . చాలాసేపటి కానీ ఎవరూ గుర్తించలేదు.  అప్పుడు హాస్పిటలూ ట్రీట్ మెంట్ జరిగింది .దీనితో ‘’గాంధీకి మనోవాక్కాయ కర్మల సన్నిహితుడిని అనే అహంభావం పోయింది ‘’అన్నారు .’’యవ్వనం లో నాటకాలు వేసి ఒప్పించాను మెప్పించాను నమ్మించాను కానీ ఇప్పటి నాటకం లో పాత్ర రక్తి కట్టలేదు ‘’అని వ్యధ చెందారు .

37-చిత్ర నళీయం -యడవల్లి సూర్యనారాయణ నలుని పాత్ర బాగా పోషించేవాడు ఉప్పులూరి సంజీవరావు దమయంతి వేషం కట్టేవాడు అల్లం మస్తాన్ అనే వస్తాదు  బాహుకుడిగా వచ్చి పెద్ద సైజు కట్టెల్ని తొడమీద పెట్టి  తేలికగా  విరిచి పారేసేవాడట .నలుడు బాహుకుడుగా మారితే చిక్కి శల్యం అవ్వాలికాని ఇంతబలం ఎక్కడిది అని ప్రేక్షకులు చెవులు కొరుక్కునేవారట .యడవల్లి నలునిపాత్రపై అబ్బూరి –

‘’యడవల్లి సూర్యనారాయణ -చెడ దొబ్బెను నలుని పార్టు ఛీ !ఏ ముండా -కొడుకిచ్చే వీనికిం ,బలి -చెడుగుడు నాట్యమ్ము కొరకు చీనాంబరరముల్ ‘’అని  చెడ  తిట్టారట –

వరద లో తేలి (రి )న తేట ఊట ఇంతటితో సమాప్తం

 

ఈ 7వ ఎపిసోడ్ కు ఆధారం ‘’వరదకాలం ‘’ మిగిలిన 6 ఎపిసోడ్ లకు ‘’కవన కుతూహలం ‘’ఆధారం అని మరోక్క్కమాఱు వినయంగా తెలియ జేస్తున్నాను .

ఇందులో చాలామంది చాలామందికి తెలిసే ఉంటారు .కానీ లోతులు తెలిసిఉండవు నేను తెలుసుకొని ఆనందించి మీరూ అనుభూతికి లోనవుతారని రాశాను . నేనేదో ఇది చదివానని మీరు చదవలేదని చెప్పటానికి కాదు మహా  మహుల  సంస్మరణం శ్రేయోదాయకం అని నమ్మి రాశాను

 

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -14-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరద లో తేలి (రి)న తేట ఊట -6

వరద లో తేలి (రి)న తేట ఊట -6

 

31-కృష్ణశాస్త్రి -’’నా కఠినపాద శిలల కింద బడి నలిగి -పోయే నెన్నియో మల్లెపూలు మున్ను ‘’

ప్రాణ సఖుడె నాకోసమే పంపినాడు -పల్లకీ అన  హృదయమ్ము జల్లుమనును .’’

ఆకాలం కవులందర్నీ ఇంటిపేరుతో పిలిస్తే శాస్త్రిగారినోక్కరినే కృష్ణ శాస్త్రి అని పిలిచేవారు దీనికి కారణం ఏమిటని ఆయన్నే వరద అడిగితె ‘’వాళ్ళు అంటే వాళ్ళ కవిత్వమే గుర్తుకు వస్తుంది కృష్ణ శాస్త్రి అంటే కవిత్వం తోపాటు నా వేషం కూడా గుర్తుకు వస్తుందని కుంటా ‘’అన్నారు .

అబ్బూరి ,చలం ,కృష్ణ శాస్త్రి ముగ్గురే ప్రతిభావంతులైన హాస్యప్రియులు అన్నాడు వరద ..చలం మాట్లాడుతుంటే నవ్వలేక ఆకలేసి అరటి పళ్ళు ఆరగా ఆరగా తినేవాడట పోలేపెద్ది సుబ్బారావు ..చలం శాస్త్రిగారు కూచుని మాట్లాడితే ఆకాశమే నవ్వేది అన్నాడు వరద .సమయస్ఫూర్తితో హాస్య ప్రసక్తి చేయగల నేర్పు శాస్త్రిగారిది . తెలుగు జాతికి హాస్య స్ఫూర్తి తక్కువ అని అబ్బూరి కృష్ణశాస్త్రి భావించేవారు .  ఈ హాస్య త్రయం ఆంద్ర దేశానికి బయటే మరణించటం యాదృచ్చికం ‘శాస్త్రిగారు పద్యం చదువుతుంటే ఒక విచిత్రానుభూతికి లోనవుతాం .అయన పద్య పఠనం రికార్డ్ కాకపోవటం దురదృష్టం .

 అశ్లీలాల  తోకూడా హాస్యం గా పద్యాలు రాశారు .

 శ్రీ తిరుపతి గారిపై –

‘’ముదియొకడు బాహుమూలల్లో మరోరెండు -దాడి యొకడు ,తమిళనాడొకండు -వెరసి పంచ శిఖలు తిరుపతి యోగికి -విశ్వ దాభిరామ వినుర వేమ’’అని సరదా పద్యం చెప్పారు .

శాస్త్రిగారి ప్రముఖ పద్యం -’’నాకనుల క్రాగు చీకట్లు ప్రాకు చోట -లేదు నెత్తావి ,మధువేని  లేదు ,లేదు -ప్రాణ ,మొక్క లావణ్యమ్ము లేదు -యేను రుజనైతి ,జర నైతి  ,మృత్యువైతి ‘’ఈ పద్యానికి ప్రతిరూపంగా స్టీఫాన్ జ్వీ గ్  రాసిన ‘’ఏ లెటర్ ఫ్రేమ్ ఆన్  నోన్ ఉమన్ ‘’ లో ఉత్తరం రాసిన ఆ స్త్రీ ని తలచుకొంటే శాస్త్రిగారి పై పద్యం గుర్తుకు వస్తుందని వరద తో పాటు శాస్త్రిగారూ అన్నారు .

వరద జైలులో ‘’చెరకాలం ‘’రాస్తూ శాస్త్రిగారిపై -’’ఆశలే చివురించని శైశవాన -మీ కవిత్వాన్ని నేనెంత మెచ్చుకొంటి -ఊర్వశీ ప్రవాసమ్మున పూర్వ గతిని -కంఠ పాఠ మ్మొనర్చిన గాథ కలదు ‘’అని రాశాడు

‘’మీ శిరోజాలు రోజాల రాశివో లె -మ్మారిపోయిన ప్రాయాన మంచి మంచి -పాట లెన్నేని  వ్రాసిరి నేటి దనుక -మరల నా యభిమానమ్ము తిరిగి వచ్చే .’’

‘’నేడు చెరసాల మృత్యు సాన్నిధ్యమందు -నా కొరకు నా విచిత్ర  దైన్యమ్ము జూచి -చెమ్మగిలు నయనమ్మేని చెంత లేదు -ఏ లకో నా యెడంద మీ మ్రోల  వ్రాలి పోవు ‘’వీటిని శాస్త్రిగారికి పంపాడు ఆయన మళ్ళీ పద్యాలు రాసిపంపారు ..అందులో ఒకటి –

‘’కారు మబ్బు వానకారు ,వాగులు పొంగి -నిండినదులు  వరద నింగి కెగసె -వానలోన నీవు ,వాన కావల నేను -అంతే  బతుకు ,చివరికంతె ,అంతే ‘’

32-మాధవ పెద్ది బుచ్చి సుందర రామ శాస్త్రి -పద్యం చదవటం లో చెళ్ళపిళ్ళ ,విశ్వనాధ  వేలూరి ని మించిన ప్రఙ్ఞకలవాడు .ఆయన శైలి అనితర సాధ్యం .హాస్య చతురోక్తులలో అందెవేసిన చెయ్యి ..వెంకట శాస్త్రిగారి శిష్యులలో సంగీత నిష్ణాతులు బుచ్చి .. కవిత్వం వలన తెలుగునాట బతకటం కల్ల అని నమ్మాడు ..తెనాలి అంటే పంచప్రాణాలు  వదిలి ఉండేవాడుకాదు.’’స్వర్గం ఎలా ఉంటుందో తెలియదుకనుక దానికి వెళ్ళను .నరకం ఎలా ఉంటుందో స్వానుభవం వలన తెలుసుకున్నాకానుక నరకానికి పోతా ‘’అనేవాడు .

‘’రసజగన్నాధనటరాజ రంజమాన  -మంజుతారాళి అద్దియే మా తెనాలి ‘’అని చాటువు చెప్పాడు .

ఒకసారి కాలువగట్టు వెంట నడుస్తుంటే మూడు బొమికలు కనిపిస్తే ఆయన ఆకాశం వెనక చూసి ఆశువుగా పద్యం చెప్పాడు –

‘’చూడ0జూడ  మహాశ్మశాన మనిపించున్ -నాకు నీ లోక ,మిం -దేడన్ గాలిడ బోవ నేరపయినో -యే  వేయు చున్నట్టులే -లో డక్క య్యెడి గాని నీ మహిమ -యాలో నే నివారించి ,నీ -క్రీడా రంగమటన్న మాట స్మృతికి0 -గీలించు  మృత్యుమ్ జయా ‘’

అని చెప్పి గట్టిగా నవ్వి వెనక్కి పోదాం పద -జీవితం లో ఎప్పుడూ ముందుకు పోలేం ‘’అని విరక్తిగా అన్నాడు వరదతో   .

33-అబ్బూరి రామ కృష్ణారావు -1919 లో  కలకత్తా వంగ దేశీయాంధ్ర సమితి వార్షికోత్సవం లో అధ్యక్షుడైన సర్ సి వి రామన్  ప్రక్క ఉపాధ్యక్ష స్తానం లో ఒక విద్యార్థిగా రామ కృష్ణారావు ఉండి ముఖ్య అతిధి ,ఏ హిస్టరీ ఆఫ్ ఇండియన్ లాజిక్ ‘’అనే మహా గ్రంధాన్ని రాసిన విఖ్యాత తర్క శాస్త్ర వేత్త సతీష్ చంద్ర విద్యాభూషణ్  సమక్షం లో అరగంట సేపు సంస్కృతం లో అనర్గళం గా ప్రసంగించి అందర్నీ ఆశ్చర్యపడేట్లు చేశారు . రామన్ ,అబ్బూరి భుజంతట్టి ‘’దక్షిణ భారత దేశ గౌ రవాన్ని నిలబెట్టావు ‘’అని అభినందించాడు . ఆసభలో ఉప్పల లక్ష్మణరావు మాగంటి బాపినీడు వంటి ప్రముఖులున్నారు .

రెండేళ్లు మైసూరు సంస్కృత కాలేజీలో చదివి అప్పటికి కలకత్తా వచ్చారు అబ్బూరి .రాళ్లపల్లివారు మైసూర్ లో సహాధ్యాయి .అప్పుడే రాసిన ‘’మల్లికాంబ ‘’ప్రచురితం .ఆంద్ర భారతి లో గురజాడ అబ్బూరి రాయప్రోలు రాసేవారు ..దీని తర్వాత ఆంద్ర గ్ర 0ధాలయ సర్వస్వము వస్తే అందులో ఖండకావ్యాలు రాశి ప్రచురించారు ..అయ్యంకివారు సంపాదకులు . అయ్యంకి ‘’ఆధునిక కవిత్వానికి గురజాడ అబ్బూరి రాయప్రోలు కవిత్రయం ‘’అన్నారు . కలకత్తా లో ఉండగా కొన్ని పద్యాలు రాశారు

‘’నోటి నిండుగ భుజింపఁగనోచుకొ నము-ఉదయ గీతులుపాడ  నో పెదముగాని -కన్నతల్లుల ప్రేమమార్గమ్ము గనము -లలితగతి వీణ వాయింపగలము గాని -తొడిమ లెడ   సేయగా రాలిపడిన పూల -వలపు లేవి ?భిక్షా0 దేహి భవతి భవతి ‘’

కలకత్తా యూ ని వర్సిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయన పద్య సంకలనం’’ఊహాగానం ‘’ మద్రాస్ నుంచి1918 లో  వెలువడింది .ఆధునికాంధ్ర కవిత్వానికి శ్రీకారం చుట్టిన కొద్దిపుస్తకాలలో  ఒకటయ్యిందిఅది .దుష్ట సమాసమే అయినా ఎవరూ ఆక్షేపించలేదు ఆయన సంస్కృత ఆంద్ర విద్వత్తును చూసి ..విప్లవాత్మక పద్ధతిలో పద్యాల పేర్లు తీసేశారు మొట్టమొదటిసారిగా .తరువాత చాలామందికవులు దీన్నే అనుసరించారు .

ప్రముఖ మల్ల యోధుడు కోడి రామ మూర్తిమీద అబ్బూరి పద్యాలు రాశారు .వాటిని ఆయన రుమాళ్ల మీద అచ్చు వేయించి అందరికి పంచిపెట్టాడు ..ఆయన ప్రదర్శనలో ముందువరుస రెండు కుర్చీలు అబ్బూరి దంపతులకు కేటాయించి భక్తి ప్రకటించేవాడు ..కలకత్తా లో డిగ్రీ పొంది కొంతకాలం శాంతి నికేతన్ లో గడిపి ఇంటికి వచ్చారు .

కొడవటి గంటి వెంకట సుబ్బయ్య  రాసిన పద్యాలను వరద ప్రసిద్ధ ఆంగ్లకవి డబ్ల్యు హెచ్ ఆడెన్  కు చదివి వినిపించాడు అమెరికా  లో –

‘’ఈ అతి లోక మోహన మహీతల మందున తోడులేక పా-ధేయము లేక సిగ్గిలి మదీయ మనోహర భావ పల్లవ -చ్చాయలలోన వ్యర్ధపు విచారము తో నవవాప్త కామ్యముల్ -రోయుచు భగ్నమాలికలు ప్రోవులు సేయుచు సంచరించెదన్ ‘’

 దుగ్గిరాల వారి పరిచయం తో అబ్బూరివారి జీవితం మారిపోయింది -రాజకీయ ప్రవేశం జరిగి రచన  వెనకబడింది  దుగ్గిరాలకు యమునా కల్యాణి అంటే మహా ప్రాణం

 

మళ్ళీ పుంజుకొని గజళ్ళను మొదటిసారిగా తెలుగులో రాశారు  భుజంగ ప్రయాతాన్ని రగడ ను మధ్యాక్కరను విభిన్న ధోరణిలో ప్రయోగించారు . ఇన్ని చేసినా అక్కిరాజు ఉమాకాంతం ‘’నేటికాలపు కవిత్వం ‘’లో అబ్బూరిని ముట్టుకోలేదు .అలా ఎందుకు చేశారు అని గంటి సూర్యనారాయణ గారు అడిగితె ‘’చక్కని భాషా అలంకార  జ్ఞానం  కవన ప్రజ్ఞా ఉండటం లోపాలు లేకపోవటం వలన వదిలేశాను ‘’అని ఉమాకాన్తమ్ ఉవాచ .

దుగ్గిరాలవారి చీరాల సత్యాగ్రహానికి అబ్బూరి కుడిభుజంగా నిలిచారు . దీనికి పిత్రార్జితం అంతా ‘’కరారావుడి ‘’చేసేశారు ..చీరాల విఫలమైనతర్వాత మద్రాస్ వెళ్లి చందమామ అనే బాలల పత్రిక కోసం ప్రయత్నించారు .దానికి ప్రమోదకుమార ఛటర్జీ గుర్రం మల్లయ్య రహ్మాన్ చుగ్తాయ్ వంటి ప్రసిద్ధ చిత్రకారులు చిత్రాలు వేసిపంపారు . దానికోసం కొన్న ఖరీదైన పేపరు ఆంద్ర పత్రికా ఫీసు లో చెదలుపెట్టి పనికిరాకుండా పోయింది .ముఖ చిత్రం ఒక్కటే అచ్చయింది తర్వాత చక్రపాణి దాన్ని తెచ్చాడు .ఈ నాడు అనే పేరుతో దినపత్రిక తేవటానికి కర్నూలు మిత్ర బృందం వారికి డిక్లరేషన్ తెప్పించారు అబ్బూరి  . తర్వాత అది రామోజీ రావు కు దక్కింది .

‘’అసలు నేనెందుకు రాయాలి /’’అనే శీర్షిక పెట్టి ఎందరెందరితోనో రాయించారు అబ్బూరి.

  విశాఖలో ఆంద్ర విశ్వ విద్యాలయగ్రంథాలయాన్ని  ఒకే పుస్తకం ఒకే కుర్చీతో అబ్బూరి ప్రారంభించారు . జగన్నాధ పండితరాయలు ఢిల్లీ దర్బారులో లో ‘’లవంగీ దృగంగీ కరోతు ‘’అని చెబితే దుగ్గిరాల ‘’ఫరంగీ ఫరంగీ దృగంగీ కరోతు ‘’అని పేరడీ చేశారు . అబ్బూరి చివరి రోజుల్లో ఢిల్లీలో వరద ఇంట ఉన్నాడు .స్నానాల గదిలో జారిపడికాలు విరిగి మంచానికే అతుక్కుపోయారు .పురాణం సుబ్రహ్మణ్య శర్మ వచ్చి ఆయన చాటువుకులన్నీ చంకనేసుకు పోయాడు .పత్రికలో ప్రచురణకు .,ఎజ్రాపౌండ్ జైలు జీవితం పై పుస్తకాన్ని ,ఆల్డస్ హాక్స్లీ భార్య లోరా రాసిన గ్రంధాన్ని చదివి వినిపించుకొనేవారు ..మంచం లో ఉండగా అబ్బూరి చెప్పిన చివరి పద్యం –

‘’చచ్చి పోయి జీవి ఎచ్చటి కేగునో -ఏమి యగునో ఎవరికెరుకరాదు -ఎరుక లేని వార లేమెమో చెప్పగా -విని తపించువారు వేనవేలు .

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరద ´లో తేలి (రి )న తేట ఊట -5

వరద ´లో తేలి (రి )న తేట ఊట -5

25-ముద్దు కృష్ణ -సామి నేని ముద్దుకృష్ణ స్థిరంగా ఒక్క చోట ఉండేవాడుకాదు .ఎక్కడ కవులు వాలితే అక్కడ వాలిపోయేవాడు ..పెళ్లి చేసుకోలేదు ..ఎక్కువకాలం కాకినాడ రాజమండ్రి లో గడిపాడు ..కవిత్వం రాశాడు కానీ అచ్చేసుకోలేదు ..ఏదో కొత్తదారి తొక్కాలని కాంక్ష ఉండేది . సంచలనం కల్గించాలని తపన . తెలుగు కవిత్వం లో మంచివన్నీ ఏరి సంకలనం గా ”వైతాళికులు ”తెచ్చిన ఘనత ఆయనదే .దీన్ని శ్రీశ్రీ మెచ్చలేదు .ఎంపిక కృష్ణ శాస్త్రి చేశారని ముద్దుకృష్ణకాదని ఆయన అభియోగం .ఇందులో కొంత నిజం లేకపోలేదన్నారు వరద .
  ఆధునిక సాహిత్యానికి కృష్ణ శాస్త్రి చేసి పెట్టినంత ప్రచారం వేరెవ్వరూ చెయ్యలేదు .ఆధునిక కవులపద్యాలు గేయాలు ఊరూరా పాడి వినిపించింది శాస్త్రిగారే . ఆయనపాడిన వాటిలో తొంభై శాతం వైతాళికులు లో చేరాయి ..ఇంగిలీషు లో వచ్చిన ”గోల్డెన్ ట్రెజరీ ”ని మనసులో పెట్టుకొని వైతాళికులు తెచ్చానని ముద్దుకృష్ణ అన్నాడు . ఎన్నో ముద్రణలకు నోచుకున్నది
 ముద్దుకృష్ణ మాత్రాఛందస్సులో ప్రయోగాలు చేశాడు –
”వేయరా మగ్గం -నేయరా -నేయరా గుడ్డా -చేయరా -చేయరా సేద్యం
కాయండి యువకులు -కాయండి భుజములు కష్టంగా ఉంటుంది -కానీ తప్పదు మనకు
 బెజవాడలో ”జ్వాల”పత్రిక నడిపాడు అందులోనే శ్రీశ్రీ ”మరో ప్రపంచం ”మొదటి సారి అచ్చు ముఖం చూసింది .ఆపత్రికలో ”ఎవరైనా అక్రమ సంబంధం వలన చాటుగా పిల్లల్ని కంటే ఆదుకుంటాం ”అనే ప్రకటన ఉండేదని వరద గుర్తు చేశాడు . హరీన్ ఛట్ఠో ప్రభావం తో నాటకాలలో వేలు పెట్టాడు .అనార్కలి అశోకం అనే రెండు నాటికలు రాశాడు ముద్దు .వీటికి పూర్వమే చలం హరిశ్చంద్ర రాశాడు అయితే చలం నాటకం ఎక్కడా ప్రదర్షింపబడలేదన్నాడు వరద .
 గుంటూరులో అశోకం నాటకం ఆడుతుంటే సీత రావణుడికి అతి దగ్గరగా రావటం చూసి ప్రేక్షకులు సహించలేక వారి మద్దరి మధ్యా వెళ్లి కూర్చున్నారని నాటకం ఆగిపోయిందని వరద అన్నాడు ”ఈ నాటకాలను ముందు ప్రజలచేత చదివించి తరువాత ప్రదర్శించాల్సి ఉంది ”అన్నాడు ముద్దు వార తో
  తన సాహిత్య స్మృతులు రాసి పుస్తక రూపం లో తెద్దామనుకొన్నాడు .కానీ రాసింది మాయమై పోయింది .తరువాత వరద అడిగితె ”మంచిపనే జరిగింది వరదా .నాకు తెలిసినకవుల వెధవపనులన్నీ గుర్తున్నాయి వాటిని రాసి ఉంటె మనల్నీ తిడతారు .వాళ్ళ కవిత్వాన్ని మెచ్చుకొందాం లే ”అన్నాడు .
మిత్తులు బెజవాడలో సన్మానం చేద్దామనుకొంటే వారితో ”పెళ్లికాని వాడిని .నాకో మానం ఇప్పించండి సన్మానం వద్దు ”అని చమత్కరించాడు .ముద్దుకృష్ణ తాత ముద్దు నరసింహం గారు ”హిత సూచీని ”గ్రంధాన్ని 1840 లో రాసి వీరేశలింగానినికి పరోక్ష మార్గ దర్శకులయ్యారని వరద ఉవాచ అందులో వితంతు పునర్వివాహాన్ని సమర్ధించారు .శిష్ట వ్యావహారిక రచన .ముద్దు కృష్ణకూ సంఘ సంస్కరణాభిలాష వారసత్వంగా వచ్చింది .
26-తురగా వెంకట రామయ్య -”లోకాలు నాకెలానే -కోకిలా -బాలకృష్ణుడే చాలునే ”వంటి గేయాలు రాశాడు దీన్ని ద్వారం వారు ఫిడెల్ మీద వాయించి చిరస్మరణీయం చేశారు . దరిద్రం అనుభావిస్తున్నా ముఖం లో కొంటె తనం ఉండేది .బసవరాజు అప్పారావు తర్వాత గేయరచనలో తురగా సిద్ధ హస్తులు అన్నాడు వరద .శ్రీశ్రీ మీద ఆయన ప్రభావం ఉన్నది .పొల్లు లేని రచన ఆయనది
”దున్నరా ఈ భారత భూమిని -తొలకరించిన పుణ్య భూమిని -కరువు లేనీ స్వర్గ రాజ్యపు -దొరవు నీ వయ్యెదవురా ”
 తురగా వారిమీద వరద ”తురగ వెంకట రామయ్య -కొరగాని కవిత్వ మేల కొలిచెదవయ్యా ”అని ఆశువుగా చెప్పాడు వరద తలనిమిరి ”పద్యం బాగుండకపోయినా నిజం చెప్పావు నాయనా ”అన్నారట ..పిల్లలకోసం ఒక రాత పత్రిక ”జాబిల్లి ”తెస్తూ వరద ముఖ చిత్రం పై తురగావారి చేత
”ఆడుకొనుము పాడుకొనుము -ఆనందముతో వత్సా !తెలుగుతల్లి దీవెనలం -దించి మెచ్చన్ ”గేయం రాయించి వేశాడు ..ఆయన కావ్య సంకలనానికి ఎవరైనా పూనుకొని పుణ్యం కట్టుకోమని వరద గోల చేశాడు .
27-పురిపండా అప్పలస్వామి -విశాఖలో ఖద్దరు షాపు ఉండేది ఆయనకు .”కలాపహాడు అనే ఒరియా నాటకాన్నితెలుగులో అనువదించి ప్రచురించారు  భావకవిత్వం రాశారు . కృష్ణ శాస్త్రి ప్రభావం ఎక్కువ  ఆ వయసులోనూ ఇంగిలీషు ను సబినవీసు కేశవరావు గారిదగ్గర నేర్చుకునేవారు ఒకరోజు రాత్రి పిడుగులతో పడిన వర్షానికి ఆయన గది గోడమీద పిడుగుపడి ఎదుటి గోడకు కన్నం వేసింది ఈ అనుభవాన్ని ఆయన మర్నాడు కవిత్వీకరించారు .అదే ”సౌదామిని ”ఈ పేర సంకలనం తేవాలనే ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు ..కట్టమంచి తో ముందుమాట రాయించామని వరద నాన్నగారికి చెబితే ఆయనకిస్తే ,రామ కృష్ణారావు రాయలేదుకనుక తానెందుకు రాయాలని వ్రాతప్రతిని కూడా తిరిగి పంపలేదు .తర్వాత శ్రీ శ్రీ అందులో కొన్ని గీ తాలను ఇంగిలీషు లోకి తర్జుమా చేసి చిన్న పుస్తకం గా తెచ్చాడు ..సాహిత్యానికి అంకిఅతమైన జీవి స్వామి .శ్రీశ్రీ లాంటి వారెందరినో ప్రోత్సహించారు ..మాత్రా ఛందస్సులో అపురూప ప్రయోగాలు చేశారు స్వామి .అందులో ”మల్లెమడుగు ”పదికాలాలు నిలిచెరచన అని వరద విశ్వాసం .విశాఖ లో కవుల ఛాయా చిత్ర ప్రదర్శన మొట్టమొదటి సారి నిర్వహించింది అప్పలస్వామిగారే ఇది గ్రంథ రూపం పొందాలని వరద కోరాడు

28-నళినీ కుమార్ -అసలుపేరు ఉండవల్లి సూర్య నారాయణ ..శ్రీ శ్రీ మహా ప్రస్థానాన్ని అచ్చు వేసినవాడు నళినీయే .విశ్వనాధ కూడా తన రస తరంగిణి ప్రెస్ లో అచ్చు వేద్దామని ప్రయత్నించారు . జీవితం వికృతి అని భావించాడు .”పణ  విపణి ”కావ్యం రాశాడు .
”ముండ్లు లేని గులాబీ ల -చెండ్లకు దారమ్ము లేదు -క్రీనీడలు లేని వెలుగు -తానీషాలైన కనరు
శృతి కలియని పాటలతో -బ్రతుకంతయు చితికినది -ఏనాటికి వ్రాసినదో -ఈ నాటికి సుఖాంతమ్ము
యాచకులై ఎంచుకొనగా -నావకాశము కోరు టెట్లు ?జీవులెల్ల యాచకులే -జీవనమొక కబళ మ్ము ”
29- శ్రీరంగం నారాయణ బాబు -బుజం మీద దిగజారిన జుట్టూ ,చెంపలమీద నున్నగా దువ్వుకున్న గిరజాలు ,చిన్న చక్కని మీసం ,కళ్ళజోడు ,చాతీకి ఎడమవైపు ఖాజాలతో లాల్చీ , బెంగాలీ ధోవతి నారాయణబాబు ఆహార్యం ..నటాలిలో ఉద్యోగించాడు ..చెకోవ్ రాసిన చెరీ ఆర్చర్డ్ ను నాటకంగా అనువాదం చేయమని ఇస్తే చేశాడు కానీ అబ్బూరి నచ్చక శ్రీ శ్రీ వరదలకిస్తే ”సంపంగి తోట గా అనువదించి ప్రదర్శించారు .దీనిపై పెద్ద దుమారం లేపాడు దీనికి వేదిక ”నవోదయ వారపత్రిక ”లో నీలంరాజు వెంకట శేషయ్యకల్పించాడని వరద అంటాడు బాబు అమాయకుడేకాక భాష మీద అధికారం సాధించలేదన్నాడు వరద
30-అరసం -అభ్యుదయ రచయితల సంఘం ను అబ్బూరి ”మనం నాద బ్రహ్మను ఆశ్ర యిస్తే వాళ్ళు నినాద బ్రహ్మ ఆరాధిస్తున్నారు మనకి కుదరని వ్యవహారం ”అన్నారు .అరసం కమ్యూనిస్ట్ వాసన వేస్తోందని తెలిసి చాలామంది తప్పుకున్నారు .
విశ్వనాథను వరద ”మీ తోటికవులు అంతా అభ్యుదయ వాదులైతే మీరొక్కరే ఒంటరై పోయారేం /అని అడిగితె ఆయన –
”అరసంఘమే పెద్ద -అక్షయ పాత్ర -అడ్డమైన కవితే -అన్నపూర్ణాదేవి ”అన్నారు అప్పుడే కృష్ణ శాస్త్రి అరసం మీటింగ్ లో అధ్యక్షోపన్యాసం చేస్తున్నారని వరద  చమత్కరించాడు . .
  సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరద ´లో తేలి (రి )న తేట ఊట -4

వరద ´లో తేలి (రి )న తేట ఊట -4

17-అడవి బాపి రాజు -బాపి రాజు గారికి రాయటమే ప్రధానం అనిపిస్తుందని వరద జోక్ చేశాడు .దానికాయన ”ఏదైనా మనసుకు గోచరిస్తే మాటలే ప్రధానం నాకు .అవెలా తట్టితే అలా రాస్తాను .భాషతో నాకు నిమిత్తం లేదు .. నేను సహజకవిని ”అన్నారు .”వాగాడంబరం నాకు సయించదు .నా కవిత్వం నాది .ప్రకృతికి నాకు ప్రత్యక్ష సంబంధం .మొదట్లో కవిత్వం వద్దనుకున్నా తర్వాత ఎందుకు రాయకూడదు అని రాశా .;లలిత కళ ల న్నిటా ప్రావీణ్యం పొందితే కవిత్వం అత్యంత సహజ సుందరమవుతుంది ”అన్నారు .ఆయనది గుప్త మోహనమైన అమాయకత్వం అన్నాడు వరద . అదే అందరినీ ఆకర్షించింది .దుగ్గిరాల వారు ఆశించి నట్లు బాపిబావ విశ్వ విఖ్యాత చిత్ర రచన చేయలేకపోయారు ..

18- బసవరాజు అప్పారావు -”కొల్లాయి గట్టి తేనేమి మా గాంధి కోమటై పుట్టితేనేమి ”పాటతో జగత్ప్రసిద్ది చెందారు ..కవిత్వం కోసం జీవిద్దామని భ్రమలో ఉండేవారు .. దుగ్గిరాల ప్రభావం బసవరాజు పై ఎక్కువ … ”హృదయాన్నే మాటల్లో పెట్టె శక్తి అప్పారావు ఒక్కరే సాధించారు .

దుగ్గిరాల మరణిస్తే -”ఏల పాడనింక యమునా కల్యాణి -నే లీలా మానవుడు గోపాలుడు లేడాయె -బంగారు గనులలో చెంగలించేవేళ -పిడుగు బోలిన వార్త వినిపించే నాకయ్యొ ”అని కన్నీరు మున్నీరుగా విలపించారు … ఆయన ప్లీడర్ వృత్తి సరిగ్గా సాగలేదు బెజవాడ అంటే విరక్తి కలిగింది . భారతి ,పత్రికలలో సబ్ ఎడిటర్ ..

ఢిల్లీ లో కుతుబ్ మినార్ అశోక స్తంభం ,మసీదు ఆర్య దేవాలయం ప్రక్క ప్రక్కనే ఉండటం చూసి చలించి -వెంటనే

”ఇది మొగల్ దివాణమా ? ప్రళయ శివ మహా స్మశానమా ?ఇది విజయ స్థంభమా ?చల విద్యుఛ్చ0ద్ర చూడ దంభమా ?ఇవి జీర్ణ సమాధులా ?ప్రమాద గణ నివాస వీధులా ?ఇది యవన వికాసమా ?నటేశ తాండవ విలాసమా ?”అని గేయం రాశారు ఇదే ఆయన ఆఖరి గీతం …ఢిల్లీలో ఆయనకు మతి తప్పింది అనుకున్నారు మిత్రులు -ఆయన ఆశించినట్లు –

”బతుకు బరువు మోయలేక -చితికి చితికి డస్సి వాడి -ఫికరు పుట్టి పారిపోయి -ఒకడనే యే తోటలోనో -పాట పాడుతుండగనా -ప్రాణి దాటి యేగేనా ?ప్రాణి దాటి యేగు చుండ -పాట నోట మోగేనా ?”అంతిమ క్షణం అలానే జరిగింది ..

19- కవిగారు -మారేపల్లి రామ చంద్ర శాస్త్రిగారు కృష్ణా జిల్లా కనక వల్లి నుండి విశాఖ చేరి అదే కార్య క్షేత్రంగా గడిపారు . కాళ్లకు చెప్పులు ఉండేవికావు.తనను చూసి విష జంతువులూ దూరం పోతాయనేవారు శుద్ధ శ్రోత్రీయ బ్రాహ్మణ వేషం ..విశాఖ లో ఆబాలగోపాలం ఆయన్ను కవిగారు అనేవారు ..ఆయన కవితాసమితికి ఆజీవ అధ్యక్షులు ..” తెలుగు నుడి ”ని సేకరించి ”నుడికదలి ”నిఘంటువు తయారు చేయాలన్నది ఆయన ఆశయం . అచ్చ తెలుగు ను ఆరాధిస్తే అందరికీ దూరమై పోతామేమో నని చాలా మంది సంశయం వెలి బుచ్చారు .అందుకనే పెద్దగా సహాయ సహకారాలు అందలేదు .అమాయకత్వం వినయం ఆయన సొమ్ము .ఘోషా ఆస్పత్రి దగ్గర చిన్న పూరిపాకలో నివాసం .దానిలోనే లైబ్రరీ .సాంబ నిఘంటువు సంపాదించి దానిపై పరిపూర్ణమైన అధికారం సాధించారు . బాలికా విద్య కోసం శ్రమించారు . సంస్కరణలు తెచ్చారు .. యాంత్రిక నాగరికత నచ్చేదికాదు .. మైకుల్లేని రోజుల్లో వేలాది మందిని తన ఉపన్యాస0 తో ఆకట్టుకొనేవారు . జాతీయోద్యమం లో గాంధీ వెంట ఉన్నారు .

కవి గారి షష్టి పూర్తి 19 33-34 లో జరిగింది .ఆయన ఆశ్రమం నుంచి ఊరేగింపుగా సభామండపానికి తెన్నేటి విశ్వనాథంగారు కారులో కూర్చోబెట్టుకొని తీసుకు వచ్చారు .విశాఖ యావత్తూ ఊరేగింపులో పాల్గొన్నది .అంతటి భారీ ఊరేగింపు విశాఖ లోనే కాదు మరే పట్టణం లోను జరగలేదని వరద ఉవాచ .ఆయన సభలో ప్రసంగిస్తుంటే ఆయన చెక్కులమీద ఆనంద బాష్పాలు ధారగా కారిపోయాయి .అంతటి పరవశం కల్గించారు విశాఖ ప్రజలు .అంత చక్కని ఉపన్యాసాన్ని తానెన్నడూ వినలేదన్నాడు వరద

కవి గారికి వ్యాపకాలు ఎక్కువ దానితో నుడికదలి మందగించింది .ఉత్తరాల్లో కూడా అచ్చ తెలుగే రాసేవారు ..శుభం అని రాయటానికి బదులు ”మేల్ ”అని రాసేవారు ..ఆయనకు దేవుడు కు అచ్చ తెలుగు పదం దొరకలేదు .చివరికి కొత్త పదం ”ఎల్లడు ”ను సృష్టించారు . దీన్ని శ్రీ శ్రీకి వినిపిస్తే పగలబడి నవ్వాడు పురిపండా ముక్తసరిగా ”బావుంది ”అన్నాడు .

20-నాయని సుబ్బారావు -అగ్ర శ్రేణి కవి . కానీ తగినంత ప్రాశస్త్యం రాలేదు .. ”మాస్ మీడియా వచ్చి సాహిత్యాన్ని బతకనీయటం లేదు ఒక వేళ బతికినా జీవచ్ఛవంగా ఉంది ”అని ఆయన అభిప్రాయం .

21-బొడ్డు బాపిరాజు -చదునైన ముఖం ,చిన్న మీసాలు ,ఎడం పాపిట ,ధోవతి లాల్చీ వెడల్పాటి అంచు ఉత్తరీయం తో ఉండేవాడు . ప్రచార భాగ్యం శిష్య వర్గం లేని కవి .. బహుమాన సత్కారాలూ లేవు . 1973 లో ఒక చిన్న సభ జరిపి అభినందిస్తే కవిత్వానికి గౌరవం కల్పించారని పొంగిపోయి ,ఆనంద పారవశ్యం తో అక్కడికక్కడే చనిపోయాడు .-అతని కవిత్వానికి మచ్చుకు –

”ఓయి ప్రభూ తపింతునిట -లుర్వి ధరాగ్రము నెక్కి ఎన్ని య -ధ్యాయములేగె లోక కథ -యంతయునుం దిలకించినావె ?యధ్యాయము లయ్యె నేమి భవదీయ -జగద్ధిత మార్గముల్ దయా -తోయధి వౌచు కొండా దిగె -దో యొక గట్టుకు జేర్చువో భువిన్ ”.

22- మాచిరాజు దేవీ ప్రసాద్ -భావ కవుల్ని ఎద్దేవా చేస్తూ పారడీలు రాశాడు ..దీన్ని బాగా పండించాడు జలసూత్రం . 1949 లో కృష్ణ శాస్త్రి పఠాభి ,అబ్బూరి ,దేవిప్రసాద్ పద్ధతులలో రాసి పేరు లేకుండా మల్లవరపు విశ్వేశ్వర రావు సహాయం తో శ్రీశ్రీ ద్వారా భారతిలో అచ్చు వేయించారు . కొన్ని –

”అసలు శ్రావణమాస మధ్యమ్ము నందు -కురిసి తీరాలి వర్షాలు ,కొంచె కొంచె -మేని రాలాలి తుంపరలేని ,కాని -ఉక్కమాత్రమేమాత్రమూ ఉండరాదు .

ఇపుడు నా వొళ్ళు కొంత లావెక్కి సుంత -కదిలితె చెమట వాసనలు కక్కుతుంది -నేనె వర్షపు మేఘమైతేను ,పైని -ఒట్టిపోయింది కొండపై ఉత్తమబ్బు ”

కర్ణ పేయంగా కవిత్వాన్ని మలచిన కీర్తి దేవి ప్రసాద్ కె దక్కుతుంది ఇలాంటి ధోరణి ని పఠాభి ప్రారంభించినా ,పెద్ద అబ్బూరి నిర్దేశించినా ,విశిష్ట రూపాన్ని సంతరించినవాడు దేవీ ప్రసాద్ ..కృష్ణశాస్త్రిగారు దేవీ ప్రసాద్ ను చిరంజీవిని చేశారు భారతి లో ప్రచురించేట్లు చేసి –

”అతడు ప్రియురాలిగా0చు బ్రహ్మా0డ మందు -అచ్చ మామె నె గాంచు ప్రత్యణువులోన- పువ్వులో ,నుర్వులో గాలి పర్వు లోన -రెక్కలో రిక్కలో పందికొక్కులోన .

ఆ కళా0బోధి ఊహా విలోకనాన -లోల లోచనాల్విధు మండలాన కలదు -ఆమె లోలాక్షి వికచతోత్పలాయ తాక్షి -కాని అసలులో ఆమె కో కన్ను మెల్ల ”

23- చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి – కవిత్వానికి ప్రత్యేకంగా ”ధ్వని ”అనే ఒక పత్రిక పెట్టాలని శ్రీశ్రీ భావించి దాని ముఖ చిత్రంగా శాస్త్రిగారి చేతులను ఫోటో పెట్టాలని భావించి శాస్త్రిగారి చేతులు ఫోటో తీయించి ,ఆయన ఎందుకు అని అడిగితె ”మీకవిత్వం చేత్తో రాస్తారుకనుక ”అని చెబితే ఆయన ”నేను కవిత్వం చెప్పా . నిజమే .రాసింది తక్కువ .నాకు న్యాయం చేయాలనుకొంటే నా మేధస్సుని ,హృదయాన్ని గాత్రాన్ని ఫోటో తీసి పెట్టండి ”అన్నారు .అప్పుడు వరద ”అలా కుదరదుకనుక మీ చేతులేశరణ్యం ”అనగానే అందరూ నవ్వారు ‘

శాస్త్రిగారికి బందర్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదని ఆవిడకు చిన్న హోటలువుండేదని శాస్త్రిగారూ శిష్యులు పింగళి కాటూరి వగైరా అక్కడే టిఫిన్ చేసేవారని అక్కడ పెసరట్టు అదుర్స్ అని చెప్పుకొనేవారని ,అది తెలుసుకోవటానికి కోలవెన్ను రామ కోటేశ్వరరావు గారు రహస్యంగా వెళ్లి చూస్తే ,పెసరట్టు వేసేవాడు వేడి అట్లకాడ తన పిక్క మీద కాసేపు పెట్టుకొని దానితో అట్టు తిరగేసి ఆకులో వేసేవాడని ,వాడి కి పిక్క తామర ఉండటం వలన వేడి కాడ పిక్క మీద పెట్టుకొనేవాడని గ్రహించారని మాధవ పెద్ది బుచ్చి సుందరరామయ్యగారు చెప్పారు .ఆ హోటలుకు వీళ్ళు ”సాహిత్య తామర విలాస్ ”అని పేరుపెట్టి సాహిత్య తామర ఉన్నవాళ్లే అందులో పెసరట్టు అదుర్స్ అంటారని ప్రచారం చేశారట . ఈ కథను శాస్త్రిగారి చెవిన వేశాడు వరద .ఆయన ఫక్కుమని నవ్వి ”ఆ రోజుల్లో నా మీద అనేక అబాండాలు వేసేవాళ్ళు అభిమానంతో కొందరు అసూయతో మరికొందరు .ఒకసారి ఒక సంస్థానం లో అవధానానికి వెళ్లాం .అక్కడ చదువుకున్న వేశ్య నాకొక పద్యం రాసి పంపింది తానూ కవిత్వం చెబుతానని నేను వినాలని .తిరుపతి శాస్త్రి మండి పడ్డాడు .ఎక్కడికి పోయినా నీకో పేరుందని తెలిసి పోతుందన్నారు. నిజానికి ఆమె పద్యానికి నేనెలా బాధ్యుడిని /ఇలాంటివి బోలెడు జరిగాయిలే ”అన్నారట .

80 వ పడిలో మంచం మీద ఉండగా వరద వగైరా చూసి ఏవైనా పద్యాలు చెప్పమంటే చెప్పారు అందులో కొన్ని –

”నన్ను వృద్ధుడంచు బన్నెమ్మునకు మీరు -గౌరవింతు ,రేను దారమైన -మీ సపర్య లెలమిఁ మెచ్చి కైకొనియెద -గవిని నేను కాను కాను కాను .

ఇరువురొ ముగురొ కవులుం -దురు కబ్బంబులు నంతె ,దోషజ్ఞులు ధీ -పరమాన్యులు తితక వులై -పరి శీ లించు నెడ బైకి వచ్చెడి సుకృతుల్ .

కవిత వలన బన్నెము గూడ గలిగెనేని -గలుగునిండా వశ్యకము గాదు ,రామ -కోటి వలె నుండు రచనలు కోవిదులకు -నచ్చ నీ రహస్యమ్ము ”విన్నాణి ”యెరుగు . ‘

శాస్త్రి గారి దర్శనమే ఒక మహా విభూతి ,అపురూపమైన అనుభూతి .ఆయనలాంటి సాహిత్య మూర్తి నభూతో నభవిష్యతి ”అని కైమోడ్పు ఘటించాడు వరద .

24-మల్లాది రామ కృష్ణ శాస్త్రి -పెద్ద అబ్బూరి కి ప్రాణ స్నేహితుడు ..అబ్బూరి పిల్లలు బందరులో జబ్బు పడ్డప్పుడు ఆయన ఆశువుగా ఒక నవల చెబితే తెల్లార్లూ రాశారు మల్లాది .అదే మంగళ సూత్రం నవల అదొక్కటే అబ్బూరి నవల ..అబ్బూరి ప్రోత్సాహంతో సాహిత్యం లో దిగారు మల్లాది .శాస్త్రిగారితో తిరగడం ఒక ఎడ్యుకేషన్ అన్నాడు వరద .కధ మల్లాది చేతి లో పరిపక్వమైంది .ఆయన సాహిత్య విమర్శ అత్యంత నిర్దుష్టం ఆమోదయోగ్యం .సునిశిత వ్యంగ్యం ఆయన సొమ్ము . ఖాళీ దొరికితే కీర్తనో జావళీయో రాసేవారు అక్షర రమ్యత ఆయనకు ఇష్టం . సముద్రాల సీనియర్ కు సినిమా పని ఎక్కువైతే ఎవరినైనా సాయం పంపమంటే వరద వగైరా శాస్త్రిగారిని బలవంతం మీద పంపారు ఆయన అక్కడ స్థిరపడ్డారు . వరద రాసిన ”ప్రతిమా సుందరి ”నాటాకాన్ని పంతం మీద ఒక్క రాత్రిలో అచ్చు వేయించి కూర్మా వేణు గోపాల స్వామి గారి పైరవీ నాటకానికి చెక్ పెట్టించారు ..దీనికి ముందుమాట రాస్తూ శాస్త్రిగారు ”తెలుగులో ఔచిత్యం ,విచక్షణ ,జిజ్ఞాస కు హాయి కలిగించేది వరద రాసిన ప్రతిమా సుందరి ”అన్నారు

ఒకసారి బెజవాడలో సినిమా చూడటానికి వెళ్లిన శాస్త్రిగారిని ఒక ప్రౌఢ బుగ్గ పట్టుకొని ”ఏం పంతులూ తేరగా ఉన్నామా మా మీద రాసెయ్యటానికి ”అంది .ఆమె ఒక పేరుమోసిన వేశ్య కూతురు .శాస్త్రిగారు ఫకాలుననవ్వి ”నా కధలు వీళ్లూ చదువుతున్నారన్నమాట ”అన్నారు .శాస్త్రిగారు కృష్ణా పత్రికలో ”నా కవి మిత్రులు ”అనే శీర్షికలో పది వ్యాసాలూ అద్భుతంగా రాశారు .

మరోసారి ఉమాయ్ శాస్త్రిగారు సినిమాకు రాసిన పాట పాడి వినిపిస్తే శాస్త్రిగారికి కోపం నషాళానికి అంటి ”మనం చాలా సరదాగా మాట్లాడుకొంటున్నప్పుడు సినిమాలకి రాసే మల్లాది గురించి మాట్లాడకండి .ఆ మల్లాది ఎవడో నాకు తెలియదు .నేను మీ అందరికీ తెలిసిన వాణ్ని అర్ధమయిందా అన్నారు .అంటే ఆయనకు సినిమాల్లో చేసే వృత్తిమీద అంత అసహ్యం అన్నమాట ..నిజంగా ఆయన అంత బాగా సినిమా పాటలు రాసిన వాళ్ళు లేరు . ఆయనే ఒకసారి ”మెప్పుకోసం ఉప్పుకోసం రాసింది సాహిత్యం కాదు .సాహిత్య ప్రాయోజనం సాహిత్యమే ”అన్నారు .

వరద ను ”ఏమైనా రాస్తున్నావా ?”అని అడిగితె ”రాస్తున్నా -వరద అంత్యక్రియలు ”అన్నాడు . అవాక్కయ్యారు మల్లాది .వివరణ ఇస్తూ వరద ”ప్రతి పాదాంతం లోను క్రియ వచ్చేట్లు రాస్తున్నా .అంచేత అంత్యక్రియలు అయింది ”అన్నాడు .శాస్త్రిగారు ”నీ అంత్య క్రియలను ముందుగా నా చేత చదివించునాయనా ”అన్నారట .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణ రాజాధి రాజు -గౌతమీ పుత్ర శాతకర్ణి -కొన్ని విశేషాలు

బ్రాహ్మణ రాజాధి రాజు -గౌతమీ పుత్ర శాతకర్ణి -కొన్ని విశేషాలు

మౌర్య చక్ర వర్తి అశోకుని మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని పూరిస్తూ మొదటి ఆంద్ర దేశాన్ని స్థాపించి క్రీ పూ 225 నుంచి క్రీ శ 225 వరకు అంటే 450 ఏళ్ళు అప్రతిహతంగా పరిపాలించిన వారు శాతవాహనులు ఆరు వేల  నియోగి బ్రాహ్మణులని అంటారు .ఇందులో ముఖ్యడు గౌతమీపుత్ర శాతకర్ణి క్రీ శ  78 నుండి 102 వరకు పాలించాడు .ఇతనికి  ”నివర్తిత చతుర్వర్ణ సంకరస్య ”అంటే నాలుగు వర్ణాలలో సంకారాన్ని నివారించినవాడు అనే బిరుదు ఉండేది అని అతని తల్లి గౌతమీ బాలశ్రీ మహారాష్ట్రలోని నాశిక్ వద్ద వేయించిన శాసనం లో పేర్కొన్నది .ఆయన ”ఆగమానాం నిలయస్య ”అంటే వేదాలకు నిలయమైనవాడు అని ”ఏక బ్రాహ్మణస్య ”అంటే ఏకైక బ్రాహ్మణుడని  ”ద్విజకుల వర్ధనుడని ,,”వర్ణాశ్రమ ధర్మ  పరిత్రాత”అని బిరుదులు పొందాడు .వీరి వంశం లో పాలించిన రాజులు 30 మంది .వీరినే సాతవాహనులు లేక శాతవాహనులు అంటారు . ఇది వంశనామం .శాతకర్ణి వీరి గోత్రనామం అని ఖండవల్లి లక్ష్మీ రంజనం గారు అన్నారు .అంటే అప్పటికే బ్రాహ్మణ కులం విస్తృతంగా వ్యాపించి ఉందని గ్రహించాలి . ఇదే శాసనం లో బాలశ్రీ తనకొడుకు గౌతమీపుత్ర శాతకర్ణి -నహుషుడు ,నాభాగుడు ,దిలీపుడు ,బలరాముడు ,కేశవుడు ,రాముడు ,అర్జునుడు వంటి పురాణ పురుషులకు దీటైన వాడు అని రాయించింది .అంటే ఆపస్తంబుడికాలం లోనో కొద్దిగా  అటూ ఇటూగానో పురాణాలు రచించటం పూర్తయి బాగా ప్రాచుర్యం పొందాయని భావించవచ్చు .అని ఈశాసనం  వలన అర్థమౌతోంది .
  శ్రీముఖుని కుమారుడే గౌతమీ పుత్ర శాతకర్ణి . మొదటి శాతకర్ణి అంటారు .యితడు ఎన్నెన్నో క్రతువులు చేసినట్లు చారిత్రిక ఆధారాలున్నాయి . అందులో ”అగ్న్యాధేయ ,అ నారంభణీయ ,భగలా దశరాత్ర , గర్గ త్రిరాత్ర ,గవామాయన ,అప్త్యూర్యామ ,అంగిరసాయన ,శత  త్రిరాత్ర  ,చందోమ పవమాన ,త్రిరాత్రి మొదలైన క్రతువులు ,అశ్వ మేధ ,రాజ సూయ మొదలైన యాగాలు ఉన్నాయి .. ఇతని భార్య నాగానిక నానాఘాట్ లో వేయించిన శాసనం లో తాను ”దీక్ష వ్రత యజ్ఞ సుందరయా ”అంటే దీక్ష వ్రతం లో యజ్ఞం చేసిన సౌందర్య వతిని   ”అని ”యజ్ఞ హుత  ధూపన సుగంధాయ ”అంటే యజ్ఞ సమయం లో వెలువడిన ధూపాలు వదిలిన సుగంధాలుకల పరిమళ ”అని  చెప్పుకున్నది .కనుక ఈ జంట బిడ్డ ”వేదశ్రీ ”సార్ధక నమ ధేయుడు అయ్యాడు ..ఈ వంశం లోనే యజ్ఞశ్రీ శాతకర్ణి సుప్రసిద్ధుడు .అనగా ఆకాలానికే వేదాలు సుప్రసిద్ధం ,యజ్ఞాలు బాగా జరిగేవి అని స్పష్టం .
 శాతవాహన రాజ్యపాలన క్రీ పూ 225లోనే ప్రారంభం అయినా ,శాతవాహన శకం గౌతమీపుత్ర శాతకర్ణి విజయరాజ్య పాలన తోనే అంటే క్రీ శ 78 తోనే ప్రారంభమైంది .ప్రాచీన భారత దేశం లో రెండే రెండు శకాలున్నాయి.  మొదటిది క్రీ పూ 58 నుండి ప్రారంభమైన విక్రమాదిత్య శకం కాగా రెండవది క్రీ శ 78 నుంచి ప్రారంభమైన శాలివాహన శకం .శాలివాహన శకం బ్రాహ్మణ పరంగా గుర్తింపు పొందిన శకం .సియాం కాంబోడియాలలో శాలివాహన శకం ప్రాచుర్యం లో ఉందని సుప్రసిద్ధ చారిత్రిక పరిశోధకులు శ్రీ బి యెన్ శాస్త్రి గారు ”ఆంధ్రుల సాంఘిక చరిత్రలో ”రాశారు .
కాళిదాసమహాకవి రఘువంశం లో 13 వ సరిగా 34 వ శ్లోకం లో శాతకర్ణి అనే బ్రాహ్మణ ఋషి ప్రస్తావన ఉన్నది .ఆయన సంతతివారే శాతవాహనులై ఉండవచ్చు నాని డా మారేమండ  రామా రావు గారు ”సాత వాహన సంచిక ”’లో అభిప్రాయం పడ్డారు .
 సరే శాతవాహనులు బ్రాహ్మణులే నో డౌట్ .అయితే ఏ శాఖ ?నియోగులు అన్నది లోకనానుడి .ఐతే అప్పటికి నియోగి వైదీకి భేదాలు ఏర్పడలేదు .ఈ భేదాలు 11-12 శతాబ్దాలలో వచ్చి ఉండచ్చు .
   ఆంద్ర దేశాన్ని పాలించిన ఇక్ష్వాకులు కూడా  బ్రాహ్మణులే .మొదటి ఇక్ష్వాకు మహా రాజు చాంతమూల మహారాజు మాఠరీ గోత్ర సంభవ అయిన ఒక విప్ర కన్య ను పెళ్లి చేసుకోవటం వలన వీరు బ్రాహ్మణులే అని బి.యెన్ శాస్త్రి గారు తేల్చారు.అతడు అగ్నిష్టోమ యాగం చేశాడు  బ్రాహ్మణులే దీన్ని చేస్తారు .క్షత్రియులు చేసేదాన్ని ”జ్యోతిష్టోమయాగం ”అంటారు  . ఆంధ్రాను క్రీ శ 270-285 లో ఏలిన బృహత్పలాయనాలు కూడా బ్రాహ్మణులే . వీరి రాజధాని కృష్ణాజిల్లా ఘంటసాల కు 20 మైళ్ళ దూరం లోని కోడూరు . ఆతర్వాత క్రీ శ 300-440 వరకు పాలించిన ఆనంద గోత్రీయులూ బ్రాహ్మణులే .గోత్రనామమే వీరి వంశనామం .. వీరు విశ్వామిత్రుని సంతతికి చెందిన శాలంకాయన వంశీకులు అనే వాదం ఉంది . బృహత్పలాయనులు ఆనంద గోత్రీకులు పల్లవులలాగానే పేరు చివర ”వర్మ ”పెట్టుకున్నారు . కనుక పల్లవులూ బ్రాహ్మణులేనన్నారు .”సాన్ లన్ క్రోన్ ”అనే ఒక శాలంకాయన రాజు బర్మాలోని ఐరావతీ నదీ ప్రాంతాన్ని పాలించినట్లు తెలుస్తోంది .వీరివలననే బర్మాలో బౌద్ధం వ్యాపించింది అని జర్నల్ ఆన్ ఓరియంటల్ రీసెర్చ్ చెబుతోంది .
  ”భరద్వాజస గోత్రాణాం పల్లవానాం ”అని పల్లవులు చాటుకున్నారు . తాము అశ్వత్ధామ ,మదన అనే అప్సరస కు జన్మించామని ఒక గాథలో తెలిపారు .భరద్వాజుని కుమారుడు ద్రోణుడు ,అతడికొడుకే అశ్వత్ధామ కనుక పల్లవులూ బ్రాహ్మిన్సే .వీరిలో శివ స్కంద వర్మ (క్రీ శ 310-335 )హిరగడ గళ్లి  శాసనం లో అగ్నిష్టోమ ,వాజపేయి ,అశ్వమేధ యాగాలు చేసినట్లు తెలియ జేస్తోంది
పల్లవ వంశ స్థాపకుడైన వీర కూర్చ వర్మ పదవ రాజ్య సంవత్సరం లో మైదవోలు లో వేయించిన శాసనం లో తాము బ్రాహ్మణులమని భరద్వాజ గోత్రీకులమని తెలియ జేశాడు . ఇక్కడా ఎక్కడా నియోగి వైదిక శబ్దాలు కాన రాలేదు .
 మన దేశం లోనే కాక ఇతర దేశాలనూ బ్రాహ్మణులు రాజ్యమేలారు .బర్మాలో పూనన్  రాజ్యాన్ని పాలించిన మొదటి రాజవంశం ”కౌండిన్య సోమ వంశం ‘గోదావరి ప్రాంతం నుంచి వచ్చిన కౌండిన్యుడు అనే బ్రాహ్మణుడు పుమాన్ లోని సోమా అనే యువతిని పెళ్ళాడి ఈ వంశ స్థాపకు డయ్యాడు అని మారేమండ వారు తెలియ జేశారు .క్రీ శ . 657 లో వియత్నాం దేశం లో రుద్రవర్మ ,క్రీ శ 781 లో కంపూచియా అంటే ఒకప్పటి కాంబోడియా లేక కాంభోజ దేశం పాలించిన ఒకటవ జయవర్మ సైతం బ్రాహ్మణుడే .
  ఆచార్య నాగార్జునుడు విదర్భ బ్రాహ్మణుడు. బసవేశ్వరుడు బ్రాహ్మణుడు  బ్రహ్మనాయుడి  పలనాటి సేనాని అనపోతరాజు బ్రాహ్మణుడు .కాకతీయ రుద్రమ దేవి సేనాని  బెండపూడి అన్నయ  బొమ్మన్  .కాళిదాసు ,పాణిని చాణక్యుడు ,బాణభట్టు  నోబెల్ లారీయేట్లు నేటి రవీంద్రనాధ టాగోర్ ,సివి రామన్  ,ఎస్ చంద్ర శేఖర ,నవలా కారుడు శరత్ ,బంకిం ,సత్యజిత్ రే ,స్వాతంత్ర సమరయోధుడు మంగళ్ పాండే ,రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ రాధా కృష్ణన్ ,గిరి ,వెంకట్రామన్ శంకర్ దయాళ్ శర్మ ప్రణబ్ ముఖర్జీ ,ప్రధానులు నెహ్రు ,మొరార్జీ ,వాజపేయి ,పి  వి నరసింహారావు ,ముఖ్యమంత్రులు మమతాబెనర్జీ శీలా దీక్షిత్  మంత్రులు సుష్మాస్వరాజ్ అరుణ్ జైట్లీ  ఇన్ఫోసిస్ నారాయణ  మూర్తి నందన్ నీలేకని , కిరణ్ మజుందార్ , విజయ్ మాల్యా మొదలైన దిగ్గజాలందరు బ్రాహ్మణులే ..
  ఆధారం -అమెరికాలో మా అల్లుడుఅవధాని కొని సేకరించి భద్ర పరచిన డా పాలకోడేటి సత్యనారాయణ రావు గారి రచన – సంక్షిప్త బ్రాహ్మణ చరిత్ర ”
  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

´వరద ´లో తేలి (రి )న తేట ఊట -3

´వరద ´లో తేలి (రి )న తేట ఊట -3

13-విశ్వ నాథ -విశాఖ హై స్కూ ల్ లో వరద కోరిక పై  విశ్వనాధ కొన్ని పద్యాలు చదివారు -అందులో రెండు –
”ఓయి నృపాల!ఈ బుడుత -యొక్కడు నాదు కులంబు తేవ నీ -ఓ అతి ధర్మరాజువయ-యో !ఇది వినుటయా !గతానువై -ఈయను గేగె బో తినుట -కేమిక నున్నది  నాకు నేమి నే-డే యిదె !వీని వెంటబడి -యేగెద కోడలి కేమికా వలెన్ ?అనే పద్యాలను  వయో వృద్ధురాలైన ఒక స్త్రీ స్వరాన్ని అనుకరిస్తూ రుద్ద కంఠం తో చదివితే మేష్టారు విద్యార్థులూ అందరూ కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ ఆయన వంక  అలానే చూస్తుండి పోయారట ..
వర్షం కురుస్తున్న తీరును వర్ణించే -”నట శివ సాయం సంధ్యా -చ్ఛటా  ఘటా నూపురమణి  సంభవ కాంతి -స్ఫట ‘చిట  చిట  చిట ”నినాదో  -ద్భట  కనకము విజయవాటి వర్షము కురిసెన్ ”పద్యం చదువుతుంటే అసలు వర్షం కురుస్తున్నదే మో నన్నంత భావన కలిగిందట ..
బయటికి వస్తూ ”బాగుందా ”అని అడిగితె ”బలే ఏడిపించారండీ ”అన్నాడు వరద .”ఇదా ఆఖరికి ”అన్నారట విశ్వనాథ ..
విశ్వనాధ దాసు శ్రీరాములు కవిని బాగా మెచ్చేవారట ..ఆయన రాసిన ”తెలుగునాడు ”లోని పద్యాలన్నీ విశ్వనాథకు తమ్ముడు వెంకటేశ్వర్లుకు కంఠతా వచ్చు . శ్రీరాములుగారు పాండిత్యాన్ని తమగురువు వెంకట శాస్త్రిగారే తెగ  మెచ్చుకొని వారట . రాములుగారు తెలుగు సంసారాన్ని అతి కూలంకషంగా పరిశీలించి రాసిన కావ్యం అది విభిన్న శాఖలు ,వర్ణాలు పరిశీలించి మన సమాజం ఎలా విచ్చిన్నమైందో వివరించారు

— ”తెలుగు నాట ఈ వైదీకి ,నియోగి గోల ఏమిటో ?అన్నారు మల్లాది రామ కృష్ణ శాస్త్రి .వెంటనే విశ్వనాధ ”ఆదో  చమత్కారం .పోటీ పడి  రాస్తారని ”అని -”తొ లి నియోగులే కవులు తెలుగునాట -నేటికిని వారె సాహితీ నేత లైరి ”అన్నారు ఆశువుగా .,కొప్పరపు సోదరులు బెజవాడలో అవధానం చేయగా మెచ్చి -”తొ లి నియోగులు సిసలైన తెలుగు కవులు -తెలియ పలనాడు చిక్కని తెలుగుగడ్డ -ఆశుకవనంబులో మీ ఇంటి ఆడు బిడ్డ -యే ను దీవన లిత్తు నెన్నే ని  మీకు ”అని ఆశీర్వ దించారు .

ఒక రోజు రైలు ప్రయాణం లో ఇద్దరు విద్యార్థులు విశ్వనాధ కవితా మహత్వాన్ని వారిలో వారు చెప్పుకుంటూ మెచ్చుకోవటం పై బెర్త్ పై పడుకున్న విశ్వనాధ విని వరద జరుక్ లతో ”నాకు దుఃఖం కూడా వచ్చింది .నన్ను మెచ్చుకునే వాళ్ళు ఈ దేశం లో ఉన్నారు -ఒక్క తిట్టే వాళ్ళే కాక ”అన్నారట ఆనందంగా ..
  ఆధునిక కవుల చాటు పద్యాలన్నీ సేకరించి అచ్చు వేయాలని శ్రీ శ్రీ ,వరద కలలు కన్నారు .అప్పటికి వాళ్ళు రాసింది పదే .విశ్వనాధ ను అడిగితె తనవి అయిదారు వందలు ఉంటాయన్నారు .
వరద మేనత్తకు విశ్వనాధ రాసిన దయాంబుధి పద్యాలు నోటికి బాగావచ్చి ఎప్పుడూ చదువుకొంటూ ఉంటుంది .అవి వరాద కూ ఇష్టమే –
1-నా  కనుల యెట్టయెదటన నా జనకుని -నా జనని కుత్తుకలను కోసి నన్నడిగె  న-తండు ”నే దయాంబుధిని కాదా ”యటంచు -ఓ ప్రభూ !యగునంటి నే నొదిగి యుండి ”
2-నా కనుల ఎట్ట యెదుటన నా లతాంగి – ప్రాణములు నిల్వునం దీసి యడిగె నను న -తండు ”నే దయాంబుధిని కాదా ”యటంచు -ఓప్రభూ!యగు నటి నే నొదిగి యుండి ”
3-కన్నుల ఎట్ట ఎదుట నా యనుంగు -తనుజు  కుత్తుక నులిమి తా నను నడిగె ,న -తండు ”నే దయాంబుధి ని కాదా ”యటంచు -ఓ ప్రభూ !నీవ య0టి నే నొదిగి పోయి ”. విశ్వనాథ అతి సామాన్యమైన ,సార్వ జనీనమైన లోక వృత్తాన్ని ,మానవ హృదయం విహ్వ లించేట్టు తన పద్యాలలో దర్శనం చేయించారని వరద విశ్లేషించాడు .. అలాగే ఆయన ”అంధ భిక్షువు ”కూడా .
14-దువ్వూరి రామి రెడ్డి -భాష మీద అధికారం ,భావ శబలత,ఛందస్సుసౌందర్యం లో ప్రావీణ్యం సమపాళ్లలో ఉంటె శ్రవణ యోగ్యమైన హృదయ స్పందన కవిత్వం వస్తుంది అని రెడ్డి గారి నమ్మకం . నిజంగానే ఆయన పద్య నిర్మాణం లో సౌందర్యాన్ని సాధించారు అన్నాడు వరద..ఫిరదౌసి కి ఫిట్జరాల్డ్ చేసిన ఆంగ్ల అనువాదం దోష భూయిష్టంగా ఉందని దానికి కారణం అతనికి పారసీక భాషాజ్ఞానం తక్కువని రెడ్డిగారి నిశ్చితాభిప్రాయం . మరో పారసీక భాషా వేత్తతోను ,ప్రసిద్ధ ఆంగ్లకవి రాబర్ట్ గ్రేవ్స్ చేత అనువాదం చేయించి లండన్ లోని ప్రఖ్యాత ప్రచురణ సంస్థ ఉమర్ ఖయ్యామ్ రుబాయిలను ప్రచురించింది .కానీ ఫిటీజెరాల్డ్ అనువాదమే గీటు రాయిగా నిలిచింది .
15-బలిజే పల్లి లక్ష్మీ కాంతం -సత్య హరిశ్చంద్రీయ నాటక కర్త . సినిమా వేషాలకు మద్రాస్ వెళ్లారు  .తానూ అబ్బూరివారి నటాలి లో వేషాలు వేయాలని ఉబలాటం .అప్పుడు అబ్బూరి సీనియర్ మద్రాస్ లో కన్యా శుల్కం నాటక ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు .బలిజేపల్లికి అగ్ని హోత్రావధాన్లు పాత్ర ఇచ్చారు .మధుర వాణి పాత్రకోసం వెదుకుతున్నారు .రాజమండ్రి లో ఒకమ్మాయి ఉందని ఆమె  పోలీస్  ఇన్స్పెక్టర్” ఇలాకా ”అని ఆయనకు ఆమెను నటిని చేయాలనే ఉబలాటం ఉందని తెలిసి వెళ్లారు .ఆమె లావుగా బొద్దుగా మొహం మీద అద్దకం తో కొంచెం కృత్రిమంగా ఉంది .ప్రశ్న అడిగితె జవాబు ఇన్స్పెక్టర్ చెబుతున్నాడు . ఆమె సమాధానం లేదు .’పాడగలదా  అని అడిగితె ఆమెకు వినిపించకపోతే ఇన్స్పెక్టర్ ఇల్లు దద్దరిల్లేట్లు ఆవిడ చెవి దగ్గర అరచి చెప్పాడు .ఆవిడ నవ్వింది అంతే .ఇక చాలుబాబోయ్ అనుకోని నెత్తిన గుడ్డ వేసుకొని చెన్నై చెక్కేశారు
దీనిపై కాంతంగారు ఆశువుగా -”మధురవాణి కాదు మంచి బధిరవాణి -కామ కృతికి తగ్గ కాంత యిద్ది -రంగతల మనంగ రంగ స్థలము కాదు -మరి తిరోగమనమె మనకు దిక్కు ”
15-రాయప్రోలు సుబ్బారావు -”వేగాతి  వేగోక్తి దుర్వ్యసనం ”లో నుంచి బయట పడ్డారు ..ఆశుకవిత్వం అవధానాలు స్వస్తి చెప్పారు . జన్మ స్థానం వెదుళ్లపల్లి .ఆయనతో వంశీగానం తెలుగు కవిత్వం లో ప్రారంభమైందని పెద్ద అబ్బూరి అన్నారు -దానికి దీటుగా తెలుగు గొప్పదనాన్ని రాయప్రోలు –
”వంశీన్  వంచి ,మృణాలమున్ మెలిచి ,పక్వ ద్రాక్ష నెండించి ,వా -గ0శల్ మార్దవ మాధురీ ,సుభగ విన్యాసంబు జిల్కన్ ,దశ -త్రి0శ ల్లక్ష జన ప్రసన్న రసనా దేవాలయా భ్యంతర  -ప్రాంశు ప్రార్ధన గీతమైన తెలుగు బల్కున్ ప్రసంశించెదన్ ”అన్నారు జోరు చప్పట్ల మధ్య ..
శివ శంకర శాస్త్రి రాయప్రోలు వారి తృణకంకణం ఆధునిక కవిత్వానికి ఆది గ్రంధం అన్నారు . కాదు వెంకట పార్వతీశ్వరకవుల ”ఏకాంత సేవ ”అన్నారు కొందరు .
వెంకట శాస్త్రిగారు ”అందమైన పద్యమ్ము నల్లు నతడు-నునుపు బోగుల  పట్టు నేసిన విధాన ”అని రాయప్రోలుకవిత్వాన్ని మెచ్చారు ..
వరదతో రాయప్రోలు ”ఆధునిక ఆంద్ర కవిత్వానికి నేను ఆద్యుడిని అని నేను ఎప్పుడూ చెప్పుకోలేదు .ఒకే ముహూర్తాన కొంచెం అటూ ఇటూగా గురజాడ నేనూ ,మీనాన్న రామ కృష్ణారావు తెలుగు కవిత్వం లో రాచబాట వేసాం .ఆధునిక కవిత్వ శకారంభానికి ఎందరో మహానుభావులు రాచబాట వేశారు .అందరూ చిరస్మరణీయులు . పూజ్యులే సభాపతి తృణకంకణం ఆధునిక కవిత్వానికి ఆది గ్రంధమన్నాడు . భావకవిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని అతడు అలా అని ఉంటాడు అదీ కొంతవరకే నిజం .కవిత్వం గురించే మాట్లాడుకోవాలికాని ఎవరాద్యులు అనేది అనవసరం ”అని వినయంగా చెప్పారు .
  సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

´వరద ´లో తేలి (రి )న తేట ఊట -2

´వరద ´లో తేలి (రి )న తేట ఊట -2

8-బైరాగి -తెనాలి రత్నా టాకీసులో బైరాగి ఒకసారి కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారిని విమర్శిస్తూ ´మనమంతా వర్ణాశ్రమ వ్యవస్థను విచ్చేదించాలని చూస్తుంటే త్రిపురనేని ప్రతికూలం లోనూ మరో వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రవేశ పెట్టె ప్రయత్నం చేస్తున్నాడు ´అన్నాడు .బైరాగి మొదటికవిత-´నగరమ్ము న పన్నగమ్ము -నదీ నదమ్ముల విపద్రవమ్ము -చిర పరిచిత పాంధులారా-పతిత జీవ బంధులారా ´ఇది అచ్చు కాలేదు .అతని ´నూతిలో గొంతుకలు ´మంచి పేరు పొందింది .ఎందులోనూ స్థిరంగా ఉండలేక పోయాడు దరిద్రం బాగా పీడించింది .ఢిల్లీలో వరద ను రైలు ఎక్కించమని కోరి ఎక్కుతూ ´రైలు నించి దిగటం సులభం -ఎలా దిగామో తెలియదు -మళ్ళీ ఎక్కడమే బాధ ´అన్నాడు నవ్వుతూ .అదే ఆఖరి  నువ్వేమో .
  శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ´ప్రబుద్ధాంధ్ర ´పత్రిక నడిపారు .దాని సాలు సరి చందా ఒక్క రూపాయ .కనీసం 10 మందినైనా రోజూ చందా దారులుగా చేర్పించేవారు .దొరక్కపోతే భోజనం మానేసేవారు .
9-కొంపెల్ల జనార్దనరావు -తూ  గో జి .గంగలకుర్రు  స్వగ్రామం .స్వయం గా ఇంగిలీషు నేర్చాడు ఆంగ్లేయ కాల్పనిక కవులంటే ఇష్టం భారతి లో సబ్ ఎడిటర్ .ఆదర్శ పత్రిక పెట్టాలని ఉబలాటం .తో ´ఉదయిని ´పెట్టి మొదటి సంచిక తెచ్చాడు . గూడవల్లి రామ  బ్రహ్మం గారి ´ప్రజామిత్ర ´లో  వేలూరి శివరామ శాస్త్రిగారు దాన్ని చెణుకులు పేరుతో తూర్పారబట్టారు . నిరుత్సాహపడ్డాడు కొంచెం కొంపెల్ల ..ఆర్ధిక బాధలేకాక  క్షయ రోగం బాధించింది .ఎందరికో ఎన్నో ఉత్తరాలు రాసేవాడు .అదులో కవిత్వమూ చిలికేవాడు –
´సతత నూతన మృదువిలాస ప్రభాత -తావక మనోజ్ఞ లాస్య సందర్శనమున -నాడు భావాలు మధుర గానమ్ము సలిపె -ప్రక్రుతి ఆనంద తన్మ యత్వమున మునిగి ´-ఏది చూసిన యెద గుబాలించు వలపు ´అన్నాడు ..´నేనొక మహాత్ముడిని అవుతున్నాను .ఆ మహత్వానికి నిలిచే రాత రాయలేక పోతున్నాను ´అని బాధ పడ్డాడు .అతని ఆయుష్షు అల్పం ఆశయాలు అనంతం అన్నాడు వరద ..
10- గిరాం మూర్తి -విజయనగరం లో బుర్రా శేషగిరిరావు ´ఆంధ్ర భారతీ తీర్ధ ´సంస్థ స్థాపించారు ఇంగిలీషు లో దీనికి ´ఆంధ్రా రీసెర్చ్ యూని  వర్సిటీ ´అని పేరుపెట్టారు ..రాజా విక్రమ దేవా వర్మ ఛాన్సలర్  బుర్రా వైస్ ఛాన్సలర్ .స్నాతకోత్సవం విశాఖ ఏ వి యెన్ కాలేజీ లో జరిపారు . పండితులంతా వచ్చారు .రెండవ రోజు బిరుదు ప్రదానం చేశారు .జాషువాకు ´కవితా  విశారద ´ఇచ్చారు .
 గిడుగువారు ´చెవికి సీనా రేకు తో చేసిన గొట్టాన్నీ పెట్ట్టు కొని విన్నారు .వరద ´తపో భంగం ´నాటిక రాసి చదివాడు .గిడుగు మెచ్చి ´నేను తలపెట్టిన ఉద్యమం సఫలమైంది .ఈ చిరంజీవి రచన విన్నారుకదా .ఎంత సహజంగా వ్యావహారిక భాషని వాడి చూపించాడు !మీరు చేస్తున్న సన్మానం నా పాండిత్య కృషికి కాక నా ఉద్యమాన్నీ గుర్తించడం వలన చేస్తున్నారు ..గౌరవాన్ని తిరస్కరించటానికే వచ్చాను .కానీ ఈ చిరంజీవి నాటకం చదివాక స్వీ కరించటానికి నిర్ణయించుకున్నాను ´అన్నారు కరతాళ ధ్వనుల మధ్య ..గిడుగుకు ´మహోపాధ్యాయ ´బిరుదు ప్రదానం చేశారు .
అప్పుడు ఇంటర్ లో స్వర్ణ పతకం ఉండేది .దివాకర్ల వెంకటావధానిగారు వరద దాన్ని సాధించాలని ప్రోత్సహించేవారు .కానీ గిడుగుమాట విని వరద వ్యాకరణం రాయనని చెప్పి గిడుగు గారిపై భక్తిని ప్రదర్శించాడు .. పంతులు గారి వాక్పటిమ అమోఘం వెయ్యి మంది జనానికి కూడా వినబడేట్లు అనర్గళంగా ఉపన్య సించేవారు.
 ఒక సారివరద గిడుగును ´విశ్వనాధ ,రాయప్రోలు లను వ్యావహారిక భాషలో రాయమని మీరు ఎందుకు చెప్పరు?´అని అడిగితె ఆయన -´వ్యవహారికం అంటే ముందుగా మనం విజ్ఞాన వ్యాప్తికోసం కృషి చేయాలి .కవిత్వం కాదు .ఎందులోనన్నా రాసుకో .నాకు అభ్యంతరం లేదు .చదివేవాళ్ళు చదువుతారు లేకపోతె లేదు .ఇతర సాధనాలకు మాత్రం వ్యావహారికం తప్పదు .సాహిత్యం లో కధలకి నాటకాలకి వ్యావహారికమే ఉండాలి అని నా ఆశయం ´అన్నారు ..
11-సెట్టి లక్ష్మీ నరసింహం – సెట్టి మేస్టారుగా ప్రసిద్ధులు .హైస్కూల్   హెడ్ మాస్టర్ చేసి రిటైరయ్యారు . ఉద్యోగం లో ఉండగానే ´శృంగార పంచకం ´అనే బూతు పద్య సంకలనం తెచ్చారు .కమిటీ వాళ్ళు ఉద్యోగం లోంచి తీసేసే ప్రయత్నం చేస్తుంటే తానె రాజీనామా ఇచ్చారు .లా చదివి లాయర్ అయ్యారు
ఆయన మృచ్ఛకటిక నాటకాన్ని వసంత సేన నవలగా రాశారు . విక్రమ దేవ వర్మకు ముఖ్య స్నేహితులు . శెట్టి మాస్టారు వందలాది చాటువులు శృంగార పద్యాలు రాశారు -అందులో ఒకటి –
´ముప్పది యేండ్లు నాకు ఐదు -మూడవ ఏడుది మాదు  చెల్లి -మీ మిప్పుడు పూటకూళ్ళ నుతి -కెక్కినారము దబ్బ కాయాయో -చెప్పుడు నిమ్మ కాయో తమ -చిత్తము వచ్చిన నుండు ,రాత్రికి0 -దప్పక రండ నున్ నవ వితంతు  వొకర్తుక బాటసారులన్ ´
12- జాషువా -శ్రీ శ్రీకి జాషువా అంటే పడేదికాదు . ఆయన ఫిరదౌసి గాథా పద్యం తెలుగులో అరుదైనకావ్యం .
 సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరద ´లో తేలి (రి )న తేట ఊట

´వరద ´లో తేలి (రి )న తేట ఊట -1

1-బెల్లం కొండ రామ దాసు ´త్రిపుట ´కవితలో
´నాడు శాంతి వివస్త్రగా వీధి వెంట నడిచింది లేదు -మనసు చెట్టుకు ఉరితాడుకట్టి మనిషిని ఉరితీసింది లేదు -అమ్మని మారు పేరు పెట్టి తనివి తీర తిట్టుకుంది లేదు -నిప్పు మండుతూ ఉండేది -నీతి నిండుగా ఉండేది
నేడు-పాపం పట్టు పరుపులా పరుచుకుంది -ఇప్పుడు నిన్ను చూస్తూ నన్ను చూడవు -నేను నిన్ను గుర్తించను . కళ్ళలో గుడ్డి  ముళ్ళు మొలిచాయి -మన మధ్య మెయిలు రాళ్లకు అందని దూరం ఉంది-నదిలో రెండు శవాలు -అలా కలిసాం .-నీ గొంతు గుడ్లగూబ వినిపిస్తూనే ఉంది ´
2-దేవర కొండ బాల గంగాధరతిలక్ -స్వయం కృషితో ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు .దీనికి కారకుడు పాలగుమ్మి పద్మ రాజు …ఒకసారి వరద ´వచనకవిత్వం మిల్లు ఖద్దరు లాంటిది ´అని తిలక్ కు జాబు రాస్తే ´ఇంత చక్కని పదం నాకు తట్టలేదు ´అని జవాబు రాశాడు . ఈడిపస్ నాటకాన్ని తెలుగులోకి అనువదించే ప్రయత్నం చేశాడు తిలక్ .కానీ చేయలేదు చేస్తే అబ్బూరి రామకృష్ణా రావు ప్రదర్శించి ఉండేవారు .
3-పాలగుమ్మి పద్మ రాజు -పద్మ రాజు చిన్నతనం లో రాసిన కవిత్వం విని చెళ్లపిళ్లవారు ´నువ్వుకవిత్వం రాయగలవు .నీకు సామర్ధ్యం ఉంది పో ´అని ఆశీర్వదించారు . అతనిమీద కవిత్వం చెప్పమని జలసూత్రం అడిగితె -´వీడెవడి పా .ప. రా -ఊయేల ఊపరా -చనుబాలు చేపరా ´అని చెప్పాడు వరద .
4-బైరాగిని కవిత్వం లోకి దించిన పాపం నాదే అన్నాడు వరద .కవిత్వాన్ని నమ్మకుండా ఆరాధించినవాడు బైరాగి
5-శిష్ట్లా ఉమామహేశ్వరరావు -´ప్రాహ్లాద కవిత్వ ´వ్యాప్తి కోసం తంటాలు పడ్డాడు .శ్రీ శ్రీ ఇష్టపడేవాడుకాదు ´శాంతిని ´అనే పత్రిక నడిపాడు ఉమాయ్ .సైన్యం లో కూడా చేరాడు .ఎప్పుడూ ఫుల్ గ మందు కొట్టి ఊగిపోతూ ఉండేవాడట .నవయుగాని కి తాను  ద్రష్ట అని భ్రమించేవాడు .ఒక రోజు ఉమాయ్ ,శ్రీ శ్రీ లు మద్రాస్ డేవిడ్ కపే  లో మాటమాటావచ్చి చొక్కాలు పట్టుకున్నారట . ఆ కోపం లో శ్రీ శ్రేణి చంపేదాకా నిద్రపోను అన్నాడట
  ´వెర్స్ లిబర్ ´అనేది శిష్ట్లా తోనే ప్రారంభం .కానీ అందులో పరిపూర్ణ ప్రావీణ్యం సంపాదించకుండా ప్రయోగాలు చేశాడు అంటాడు వరద .ఆంగ్ల సాహిత్యాన్ని అవపోసన పట్టాడుకాని తెలుగు సాహిత్యం లో ప్రవేశం తక్కువ ఉమాయ్ కి ..తెలుగు సాహిత్యం లో నిర్దేశిస్తున్న నవీన మార్గానికి మార్గదర్శి అనే అహంభావం ఉన్నవాడు .మార్గ దర్శిగా ఉన్నాడుకాని అందులో ప్రయాణించలేకపోయాడని వరద బాధ .,శివ శంకర శాస్త్రి,విశ్వనాధ కితాబిచ్చారు .ఆతను రాసిన కొద్దికవితలు కలకాలం నిలిచిపోయేవే ;´జ్ఞాపకాలు ´అనే గీతం  వెర్స్  లిబ్ర్  ´లో తలమానికం ఎజ్రా పౌండ్ గుర్తుకొస్తాడు . శతాబ్ది చైనా కవి ´రిహాకు ´రాసిన పాటల్ని ఉమాయ్ ఇంగిలీషు లో అనువదించాడు .అందులో ´నదీ వ్యాపారి భార్య ,ఉత్తరం ´అద్భుతం .ఆతను చదివే తీరు చాలా గొప్పగా ఉండేది .ఆతను తాదాత్మ్యం చెంది పాడుతుంటే గుండె కదిలి కరిగిపోయేది అన్నాడు వరద
´జ్ఞాపకాలు ´లో కొన్ని చరణాలు -నా పేరు లీల -ఆ ఊరి గోల పడలేక నేను పొరుగూరొ  -చ్చాను -అందాలావాడే అడవిలో  ముంచాడు -అందర్నీ తలచుకొని అల్లాడుతున్నాను —´ఉయ్యాలలో పిల్ల ఉబుసులేలేవు -నా చన్నులో పాలు జున్ను లెత్తాయే -హాయమ్మ కెవ్వరూ హాయన్న వారూ -నీలాల సంద్రములో నిప్పచ్చరం నేలపై -రాయినై అహల్యనయ్యాను -శ్రీరామ చంద్ర మూర్తీ రామ రామ నా పేరు లీల ´
6- కుందుర్తి ఆంజనేయులు -విశ్వనాధ శిష్యుడు ఆన్జనేయులు మా ర్క్సిస్టు అయ్యాడు .అనిసెట్టి బెల్లం కొండా లతో కలిసి కొత్తరకం గా రాసేవాడు శ్రీశ్రీ సంప్రదాయ మాత్రాఛందసునే వాడాడు . కుందుర్తి అభ్యుదయ కవిత్వం లోకి దిగాడు .గురువుగారి చాదస్త0 పట్టుకున్నది.  తనది ´వచన కవిత్వం ´అన్నాడు
´మీరందరూ రాయటం మానేశారు .మొత్తం నా మీదే పడింది భారం ´అన్నాడు వరద తో .సాధించి తీరుతానన్నాడు .వరద ´నీకు ప్రతిభ ఉంది భాష మీద అధికారం ఉంది .వ్యర్థం చేసుకోకు .నీ సంగతి నువ్వు చూసుకొనిరాణించు ´అని వరద సలహా ఇచ్చాడు .వచనకవితలో భారత ,భాగవతాలు రాస్తే అది నిలబడుతుందని ఊహించాడు .వచనకవిత రాసిన ప్రతివాడి నీ బుజం తట్టి ప్రోత్సహించాడు .భావకవిత్వం పై ఎలర్జీ పెంచుకున్నాడు .యెంత వచనకవితా రాసినా విశ్వనాధపై ఆరాధనా భావం ఇసుమంతకూడా తగ్గలేదు .ఆయన కవిత్వాన్ని ఆరాధిస్తూ చిరస్మరణీయ పద్యం చెప్పాడు కుందుర్తి –
´నీ వాంధ్రాఖిల నీవృతా దృతుడవై నీలో కవిత్వాపగల్ -ప్రోవుల్ పడ్డ రసాత్మవై మృదులంతా ముగ్ధంబులున్ -భావ ప్రౌఢములైన నీ పలుకులాస్వాదించి ,నీ
ఈ వైదగ్ధ్యము లోన  నొక్కను వుగా  నీ కావ్య ముప్పొంగితిన్ ´అని కీర్తి శిఖరం ఎక్కించాడు . ఈ పద్యాన్ని నేను నిరుడు ఫిబ్రవరి లో బెజవాడలో జరిగిన విశ్వనాధ సాహితీ వైభవం ´సదస్సులో నా పరిశోధన పత్రం ´విశ్వనాధ -యువతపై ప్రభావం ´లో ఉదాహరించాను ..
   కుందుర్తి ´హంస యెగిరి పోయింది ´ఖండిక అతని ప్రతిభా సంపదకు గీటు రాయి అన్నాడు వరద .దీనిలో  మనిషికి కవిత్వానికి కావాల్సింది మానవత్వం కానీ మార్క్సిజం కాదు అని రుజువు చేశాడు కుందుర్తి .మరో సారి గురుపాదుల అడుగు జాడలలో నడిచాడు  . 

7- జల సూత్రం రుక్మిణీనాథ శాస్త్రి -ఒక సారి ద్రౌపదీ మాన సంరక్షణ నాటకం చూస్తున్నారు జరుక్ శాస్త్రి , వరద వగైరా ,ద్రౌపది ´సహించరా సహింతురా ´అని పాడుతోంది.  జరుక్ వెంటనే పేరడీగా ´రమింతురా రమింతురా రాజాధిరాజుల్ ´అని గట్టిగా పాడాడు .ప్రక్కవాళ్ళు కేకలేసినా ఆగలేదు . పాండవ పక్షపాతి నోర్ముయ్ అన్నాడు శాస్త్రి .వరద ´నువ్వే నోర్మూసుకో ´అన్నాడు అందరూ గోల చేశారు .పోదాం పద అని బయటికి దారి తీశాడువరద ఆగలేక శాస్త్రి ´ద్రౌపది వీ ళ్ల పెళ్ళాం గాఉల్ను  ´అన్నాడు .అంతే అందరూ కలిసి బలవంతాన ఇద్దర్నీ  హాలుబయటికి నెట్టేశారు ´ఈ వెధవలకి సాహిత్యం మజా ఏం తెలుసు ?;´అన్నాడు శాస్త్రి -ఇంటికి వెళ్లి ఈ విషయం అంతా  చలం గారికి చెప్పారు .ఆయన నవ్వుతూ చింతా దీక్షితులుగారికి చెప్పి శాస్త్రితో ´ఈ దేశం లో పబ్లిక్ గా యెగతాళి చేయరాదని ఇప్పటికైనా తెలుసుకున్నావా ´అన్నారు .
  స్వామి శివ శంకర శాస్త్రి ఒక పద్యం లో ´నీవు స్త్రీ జాతి యందు జనించు కతన ´అని రాస్తే జరుక్ ´అదేం జాతి అయ్యా ఎక్కడైనా విన్నావా ´అని నవ్వి అబ్బూరి రామకృష్ణారావు బందరులో చెప్పిన పద్యం చదివాడు –
´చాలా సామ్యంబు కలదట సాహితీ స -భాపతికిని ,మన ´రాసభా´పతికిని -అర్ధ మెరుగని శబ్దమ్ము లతడు మోయు -తావి ఎరుగని గంధ మీతడు వహించు ´అన్న పద్యం చదివితే చలం గారు పకపకా నవ్వారు .
  జరుక్ రాసినవి చాలా కాలగర్భం లో కలిసిపోయాయి .రాసినవి అచ్చు వేయాలనే తపన ఉండేదికాదు .శాస్త్రీమీద వరద ´రుక్కుటేశ్వర శతకం ´రాశాడు -శతక  మంజరి లోని వివిధ శతకాలలో పంక్తులు తీసుకొని శాస్త్రికి అన్వయించి ´రుక్కుటేశ్వరా ´అని తగిలించి రాసిన శతకమిది  .ఇందులో ఒక్కటే వరద   సొంత పద్యం.  ఇదొక కొత్త ప్రయోగం . అందరూ మెచ్చారు .దీన్ని శ్రీ శ్రీ స్తే ఎక్కడో పారేశాడు .
´వైదికులు పరిభాష ´అనే విషయం పై పెద్ద పుస్తకం రాసే ప్రయత్నం చేశాడు జరుక్ .శాస్త్రిపై వరద చెప్పిన పద్యం బాగుంది –
´దూకుడు దూకుడై నడక దుందుడు కొప్పగ చూపు ,నోట,వై
 దికుల పల్కు వేట ,కర దీపముగా సిగరెట్టు  దాల్చి ,మా
ఈ కవి మూక జేరితివి ఇంతటితో సరిపెట్టి మమ్ము ,కా
ఫీ  కయి కొంప పీకకు ,శపింపకు ,చంపకు రుక్కుటేశ్వరా ´
  తర్వాత ఎప్పుడో శ్రీశ్రీ ,ఆరుద్ర కలిసి రుక్కుటేశ్వర శతకం ప్రారంభించి కొన్ని పద్యాలు  అచ్చేశారు .అందులో మొదటిది –
´వచియించె´వరద ´లోగడ -రచియింతునని ఋక్కుటేశ్వర  శతక మును ,మే
 మచలిత ధైర్యమ్మున నా -మ చౌర్య మొనరించినాము మన్నించు జరూ ´
  శాస్త్రి అన్నిట్లోనూ వేలు పెట్టాడు అభ్యుదయకవులతో తిరిగాడు అతి వాస్తవిక ధోరణి అనుసరించాడు .ఇంగిలీషు రాలేదని బాధ గా ఉండేది .ఎన్నికలలో శ్రీ శ్రీ కి మతి పోయినప్పుడు శాస్త్రి చాలా బాధ పడ్డాడు . ´దారి తప్పిన పిల్ల ´అనే సుదీర్ఘ కావ్య ఖండాన్ని  రాస్తున్నట్లు వరదకు జాబు రాశాడు .రాశాడో లేదో తెలియదు .´మైల నిఘంటువు ´అనే పల్లె .పట్టణాల పేర్లు అశ్లీల పదాలకు పర్యాయ పదంగా సమకూర్చాడు శాస్త్రి . అదెక్కడాఅంతర్ధానం అయిందో తెలీదు. అతి వాస్తవిక ధోరణిలో ´లింగ తాండవం ´లఘుకావ్యం రాశాడు .దీన్ని శ్రీరంగం నారాయణ బాబు కు అంకిత మిచ్చాడు .ఇది చెప్పుకోదగ్గ కావ్యమన్నాడు వరద . ఇందులోని కవిత్వం అంతా  శ్రీ శ్రీకి కంఠతా వచ్చట.  రుక్మిణీనాథ శాస్త్రికి సాహిత్యం ముఖ్యంగా కవిత్వం పై ఉన్న అభిరుచి వైనం ఆ రోజుల్లో మారెవ్వ రికీ  లేదు అని వరద తీర్మానం చేశాడు .చెళ్ళపిళ్ళ వారి భాషలో ´జలసూత్రం అంత ´విన్నాణి ´ని మనం చూడం .
ఆధారం -వరద రాసిన ´కవన కుతూహలం ´
  సశేషం
 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లి అమెరికా -1

 వీక్లి అమెరికా -1
అమెరికా లో నార్త్ కరోలినా లో ఉన్న షార్లెట్ కు 6 రాత్రికి రావలసినవారం 7 మధ్యాహ్నానికి చేరాం .ఆ ప్రహసనం అంతా ముందే రాశా . ఇక నుంచి ప్రతి సోమవారం ఆ వారం లో జరిగిన విషయాలను ” వీక్లీ  అమెరికా ”శీర్షిక లో రాయాలనుకొని మొదటి వారం విషయాలు సంక్షిప్తంగా రాస్తున్నా .
  న్యూ యార్క్ లో వాషింగ్టన్ కు వెళ్లే జెట్ బ్లూ ఫ్లయిట్ 4 గంటలు లే ట్ అయినందున ప్రయాణీకులకు ఒక్కో టికెట్ కు 16 డాలర్ల ఫుడ్ ఐటమ్స్ ఫ్రీ గా కొనుక్కోమని కూపన్లు ఇచ్చారు .మాకిచ్చిన 32 డాలర్లకు మంచినీళ్లు  స్ఫ్రీ ట్ , కోలా, లే   మింట్ వగైరా కొన్నా . ఎమిరేట్ ఫ్లయిట్స్ లో ఫుడ్ బాగానే పెట్టారు జైన్ వెజిటేరియన్ అడిగాం .నానబెట్టినవి ఉడకబెట్టినవి సెనగలు బఠాణీలు పెట్టారు . బ్రేడ్ బటర్ మామూలే .కాఫీ పైనాపిల్ బాగానే ఇచ్చారు . న్యూయార్క్ నుంచి డి సి విమానం లో వాటర్ బాటిల్ ,చిప్స్ పాకెట్ ఇచ్చారు . కస్టమ్స్ క్లియరెన్స్ కూడా వేగంగానే జరిగింది . 6 నెలలు ఉండటానికి వీసా ఇచ్చారు . తోపుడు బండి -వీల్ చైర్ వలన చకచకా పనులు జరిగాయి .లేకపోతె ఎటు బయల్దేరి ఎటు వెళ్ళాలో తెలుసుకోవటం అగమ్యంగా ఉంటుంది . వాళ్ళూ మంచి వాళ్ళే దొరికారు . అయితే కొంతచేయి తడపాల్సి వచ్చింది అంతే తప్పదు . డిసి లో కారులో బయల్దేరి ఒక చోట కాఫీ తెచ్చుకొని తాగాం ఆ తర్వాత నాన్ స్టాప్ ప్రయాణం .
  షార్లెట్ రాగానే మా అమ్మాయి కాఫీ కాచి ఇచ్చింది . తాగి కొంత సామాను సర్దామ్ . దారిలో మైనేనిగారికి రెండు సార్లు ఫోన్ చేసాం లిఫ్ట్ చేయలేదు . భోజనం చేసి విశ్రాంతి తర్వాత మిగిలిన బాగేజ్ విప్పి సర్దేశామ్ . వరద పుస్తకం చదివా  5 పేజీలు . రాత్రి నిద్రపోదామని ప్రయత్నిస్తే కాళ్ళు కొంకర్లు పోయాయి భయమేసింది .నెమ్మదిగా మంచం దిగి కాసేపు నడిచి ,హాలులో సోఫాలో పడుకుంటే కొంత త గ్గి నిద్ర బాగా పట్టింది తరువాతనిద్రకు ఇబ్బందికలగ లేదు పిలిస్తే పలుకుతోంది .
  శనివారం  మైనేని గారు ఫోన్ చేశారు . సంధ్య పూజ డ్రైగా అంటే నీళ్లు లేకుండా పూలు లేకుండా చేశా . విజ్జి ద్యూటీకి వెళ్ళింది సాయంత్రం అల్లుడు అవధాని నన్నూ మా మనవళ్ళు ఆశుతోష్ పీయూష్ లను లక్ష్మి రవి ఇంటికి అరగంట డ్రైవ్ చేసి తీసుకు వెళ్ళాడు .అక్కడ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభి షేకం జరుగుతోంది .లక్ష్మి ద్సపతులను అయిదేళ్ల తర్వాత ఇదే మళ్ళీ చూడటం చాలా మర్యాదగా ఆహ్వానించారు . ఇక్కడ  హిందూ  సెంటర్ లో 16 ఏళ్ళు చీఫ్ ప్రీస్ట్ గా ఉన్న ఆరవాయన గ్రీన్ కార్డు రాగానే మానేసి వైదికం చేస్తున్నాడు ఆయన ఆధ్వర్యం లో అభిషేకం జరుగుతోంది .ఉత్సాహ వంతులైన యువకులు మా అల్లుడూ స్వరం కలిపారు . 8 వ రుద్రంనుంచి నేనూ జత కలిశాను .అయేసరికి రాత్రి 8 అయింది .భోజనాలు ఏర్పాటు చేశారు 30 మందిదాకా వచ్చారు అమెరికన్ లేడీస్ కూడా  ఉన్నారు . లక్ష్మి దంపతులకు సరసభారతి ప్రచురణలు -సువర్చలాన్జనేయ శతక త్రయంకొ లచల సీతారామయ్య ,దైవ చిత్తం ,సిద్ధ యోగ పుంగవులు కానుకగా ఇచ్చాను .మా అమ్మాయి సాయంత్రం ఆరున్నరకు ద్యూటీఅయ్యాక యూని వర్సిటీ నుంచి మా పెద్దమనవాడు సంకల్ప్ ను పికప్ చేసుకొని వాళ్ళ అమ్మను  పెద్దకొడుకు శ్రీకేత్ ను తీసుకొని వచ్చింది .అందరం భోజనం చేసి ఇంటికి రాత్రి 9 30 కు చేరాం  రాత్రి కాసేపు వరద ను చదివా
  ఆదివారం  విజ్జికి సెలవు యధా ప్రకారం పట్టుబట్టకట్టి సంధ్య పూజాదులు చేశా . వీలున్నప్పుడల్లా వరద చదివా .ఇండియాకు ఫోన్ చేసి పిల్లలతో మాట్లాడాం . సాయంత్రం మనవడిని రైల్వే స్టేషన్ దగ్గర దింపి మా అమ్మాయి నేను  సామ్స్ కు  వెళ్లి కావలసిన పాలు వగైరా కొని ఇంటికి వచ్చాము .
  ఇవాళ సోమవారం యధా ప్రకారం పూజ చేసి నాకు ఇచ్చిన లాప్ టాప్ సహాయం తో రాయటం మొదలు పెట్టా .ముందుగా అమెరికా ప్రయాణం లో పదనిసలు రాశా . మధ్యాహ్నానికి వరద చదవటం పూర్తి చేసేశా .సాయంత్రం దహగం లక్ష్మీ నారాయణ పై ఆర్టికల్ రాశా .
  కారీ నుంచి డా యల్లాప్రగడ సుబ్బారావు గారి మనవడు డా రామ మోహన రావు గారు ఫోన్ చేసి మాట్లాడారు .అయన బావ గారు డా. బండారు వారికి  హార్ట్ ఎటాక్ వచ్చి 3 స్టెంట్ లు వేయాల్సి వచ్చిందని ,ఇంటికి వచ్చారని కులాసా అని అందుకని మేము రాగానే ఫోన్ చేయలేక పోయానని అన్నారు .వారిది రేపల్లె .మా బాబాయి రాయప్రోలు శివరామ దీక్షితులు గారింటి ప్రక్కనే వారిల్లుట .బాబాయి పిన్నీ కొడుకు సుబ్బులు కూతురు పిచ్చాలు అందరూ బాగా తెలుసాయనకు . మా బాబాయి గొప్పతనం గురించి మురిసి పోతూ చెప్పారు ,
  మమ్మల్ని తాము వచ్చి వారింటికి కారీకి స్వయం గా తీసుకు వెడతామని ,మైనేని దంపతులనూ ఆహ్వానించానని అందరం అక్కడ కలుద్దామని అన్నారు చాలా సంతోషం అన్నారు . మన పుస్తకాలన్నీ మైనేని గారు పంపగా చదివానని గొప్ప కృషి అని అన్నారు .వారి బావగారు బండారు వారికే గీర్వాణ కవుల కవితా గీర్వాణం -మూడవ భాగం అంకితం చేయాలని మైనేని గారికి చెప్పటం నేను ఓకే అనటం ,దాని ముద్రణకు రామమోహన్ రావు గారే స్పాన్సర్ అని మైనేని గారు ముందే చెప్పారు .ఈ విషయం శ్రీ హేవిళంబి ఉగాది  వేడుకలలో ప్రకటించామని మీకు గుర్తు ఉండేఉంటుంది . అలాగే ”ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు ”పుస్తకాన్ని మైనేనిగారి బావమరిది గారు డా పరుచూరి రామ కృష్ణయ్యగారికి అంకితం చేస్తున్నట్లు దాని ముద్రణ ఖర్చు రామ క్రిష్నయ్య ఫౌండేషన్ ట్రస్ట్ స్పాన్సర్ గా ఉంటుందని ట్రస్ట్  నిర్వాహకులు శ్రీ పరుచూరి శ్రీనాధ్ గారు ఉగాది వేడుకలలో తెలియ జేసిన సంగతి మీకు తెలుసు .మంచి పనికి ఎందరు ఎన్ని విధాలుగా సాయం చేస్తారో మనకు తెలియదు వారి సౌజన్యం అలాంటింది .పుస్తకాలు ముద్రించాలని నేను రాయలేదు విషయాలు అందరికి తెలియాలని నెట్ లో రాశాను . అవి పుస్తక రూపం దాల్చటం యాదృచ్చికం దైవ నిర్ణయం ,సహృదయ  స్పందనం .నేను నిమిత్త మాత్రుడిని .  మేము షార్లెట్ వచ్చి అప్పుడే నాలుగు రోజులయింది .
 మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -10-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

నాగపూర్ మైకా గనుల యజమాని అయిన ఆంధ్ర వితరణ శీలి శ్రీ దహగం లక్ష్మీ నారాయణ

నాగపూర్ మైకా గనుల యజమాని అయిన ఆంధ్ర వితరణ శీలి శ్రీ దహగం లక్ష్మీ నారాయణ
తెలంగాణలో  కరీమ్ నగర్ జిల్లా  మంధెన గ్రామం లో సుమారు 200 ఏళ్ళక్రితమ్ ఒక బ్రాహ్మణ పురోహితుడు ఆ నాటి మధ్య రాష్ట్రాలు అని పిలువబడిన సెంట్రల్ ప్రావిన్స్ కు పొట్ట పోషించుకోవటానికి వలస వెళ్ళాడు . ఆయన ఇంటిపేరు దహనం . పే రు పుల్లయ్య .
కాంప్టి పట్టణం చేరి పౌరోహిత్యం చేశాడు . అక్కడ అప్పటికే ఉన్న తెలుగు వారితో సౌమనస్యంగా గడిపి పేరు తెచ్చుకున్నాడుపుల్లయ్య . .విధి వక్రించి అకస్మాత్తుగా చనిపోయాడు . పుల్లయ్య భార్య అహరహం కష్టించి  ఒక తెలుగు వారింట వంటపని చేస్తూ పిల్లల్ని పెంచి పోషించింది .యజమాని చిరువ్యాపారి  మంచివాడు కావటం తో పుల్లయ్య పిల్లలకు చదువు చెప్పించాడు .ఆ పిల్లల్లో పెద్దవాడు లక్ష్మీ నారాయణ . చురుకుదనం కల కుశాగ్ర బుద్ధి . బాగా చదివి నాగపూర్ వెళ్లి అక్కడ హిస్టాఫ్ కళాశాల లో ఇంటర్ చదివి ,అక్కడి మైకా గనుల వ్యాపారం పై ఆకర్షితుడయ్యాడు . తన కుటుంబానికి సాయం చేసిన ఆయన కు మైకా వ్యాపారం లో సాయం చేశాడు . గృహస్తు వ్యాపారం లో  సాయం చేయటానికి  చదువు మానేశాడు . మైకాను దూర ప్రాంతాలకు రవాణా చేస్తే లాభాలు బాగా వస్తాయని గ్రహించి  గృహస్తుకు నచ్చ జెప్పాడు .ఆయన అలాగే చేసి సంపన్నుడయ్యాడు . లక్ష్మీ నారాయణ మీద ఉన్న నమ్మకం తో వ్యాపార పురోగతి బాధ్యతను అతనికే అప్పగించాడు .
   క్రమంగా నారాయణ మైకా గనులను లీజు కు తీసుకొని వ్యాపారం లో స్థిరపడి బాగా సంపాదించాడు . ఇంతలో యజమాని మరణించటం ,అయన యావదాస్టి లక్ష్మీ నారాయణకు దక్కటం జరిగాయి .అప్పటిదాకా మనదేశం లో ఖనిజాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయటం అనేది ఇంగిలీషు వారి చేతుల్లోనే ఉండేది .ప్రతి చిన్న సాంకేతిక సమస్యకూ వాళ్ళ మీదే ఆధార పడాల్సి వచ్చేది .దీనిపై ఆలోచించిన నారాయణ సాంకేతిక నైపుణ్యం గల ఇంగిలీషు వారిని తన కింద ఉద్యోగులుగా నియమించుకొని విదేశీ వ్యాపారం సాగించి కూడు గుడ్డ లేనివాడు కోట్లకు పడగ లెత్తాడు .
  క్రమంగా ప్రజాహిత కార్య క్రమాలలో ప్రవేశించి జిల్లా బోర్డు సభ్యుడై ,మధ్య రాష్ట్రాల ఇండస్ట్రియల్ బోర్డు మెంబర్ అయి ,నాగ పూర్ పయోనీర్ ఇన్సూరెన్స్ అధ్యక్షుడుగా ఎదిగాడు . 1920 లో మధ్యరాష్ట్రాల శాసన సభ్యుడు కూడా అయ్యాడు . 1930 లో లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు బ్రిటిష్ ప్రభుత్వం ”రాయబహదూర్ ”బిరుదు నిచ్చింది .ఇంతకాలం మధ్య ప్రదేశ్ లో ఉన్నా లక్ష్మీ నారాయణకు ఆంద్ర దేశం పై విపరీతమైన అభిమానం ఉండేది
  19 27 లో ఆంద్ర విశ్వ విద్యాలయం ఏర్పడుతోందని చాలా సంతోషించాడు .తనకున్న యావదాస్తిని దానికి రాసివ్వాలని నిశ్చయించాడు .ఈ విషయాన్ని ఆనాటి గవర్నర్,విశ్వవిద్యాలయ వైస్ చాన్సెలర్ కట్టమంచి రామ లింగా రెడ్డిగార్లకు లిఖిత పూర్వకంగా తెలియ జేశాడు కూడా .తానిచ్చే నిధిని ఎలా సద్వినియోగం చేయాలో కూడా సూచించాడు . అయితే  లింగా రెడ్డి దీనిపై తగినంత శ్రద్ధ తీసుకోలేదు .తనకున్న విద్యా గర్వం తో నారాయణ ను చాలా చిన్న చూపు చూశాడు .కానీ ఉండబట్టలేని నారాయణ  రెడ్డికి ముందే తెలియజేసి బెజవాడ వచ్చాడు .ఆయన్ను  స్టేషన్ లో రిసీవ్ చేసుకోవటానికి విశ్వ విద్యాలయ అధికారులెవరూ రాలేదు .అయినా ఓపికగా వెయిటింగ్ రూమ్ లో నిరీక్షించాడు చాలా సేపు .తర్వాత ఎప్పుడో ఒక చిన్న ఉద్యోగి వచ్చి రెడ్డిగారికి తీరిక లేదని ,విశ్వ విద్యాలయం ఇంకా బెజవాడలో రూపు దిద్దుకోలేదని అందుకని రెడ్డి ,నారాయణ ను చూడటానికి అవసరరం లేదని భావించాడని చావు కబురు చల్లగా చెప్పాడు .ఎంతో ఆశతో వచ్చిన వితరణ శీలి లక్ష్మీ నారాయణ హతాశుడై తిరిగి నాగ పూరు వెళ్లి పోయాడు .
  తనదగ్గర ఉన్న సంపదను 35 లక్షల రూపాయలను  నాగ పూర్ విశ్వ విద్యాలయానికి దానం చేశాడు నారాయణ .”లక్ష్మీ నారాయణ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్  టెక్నాలజీ ”అనే సంస్థను స్థాపించాడు ..నాగపూర్ లా కాలేజీకి ,విశ్వ విద్యాలయానికి ఉచితం గా నివేశన స్థలాలను దానం చేశాడు .అక్కడ ఏర్పడే ప్రతి విద్యాలయం లో తెలుగు విద్యార్థులకు ప్రత్యేకం గా హాస్టల్ ఉండాలని నిబంధన పెట్టి తన ఆంధ్రాభిమానాన్ని చాటుకున్నాడు
.   ఆంధ్రులు ,కట్టమంచి తలపొగరుగా వ్యవహరించినా లక్ష్మీ నారాయణకు  తెలుగు దేశం పై అభిమానం వీసమంతా కూడా తగ్గలేదు .అందుకే ఆంధ్రా యూని వర్సిటీకి తనవద్ద ఉన్న అమూల్య పుస్తకాలన్నీ ధారా దత్తం చేశాడు .  ఆ నాటి ఆంద్ర యూని వర్సిటీ లైబ్రేరియన్ శ్రీ అబ్బూరి రామ కృష్ణా రావు నాగపూర్ వెళ్లి  లక్ష్మీనారాయణ ఇంట్లో అతిధిగా ఉండి స్వయం గా ఆ పుస్తకాలను బెజవాడ తీసుకొని వచ్చి యూ ని వర్సిటీ లైబ్రరీకి అందజేశారు .ఆ పుస్తకాల జాబితాయే ఆంద్ర విశ్వ విద్యాలయ ప్రధమ ప్రచురణ . 
  వితరణ శీలి  దహగం లక్ష్మీ నారాయణ 19 30లో మరణించాడు . లక్ష్మీ నారాయణ విషయం  శ్రీ అబ్బూరి వరద రాజేశ్వర రావు తన ”వరద కాలం ”లో రాసే దాకా ఆంధ్రులెవరికీ పెద్దగా తెలియదు .అందుకే దీన్ని అందరికి తెలియాలని నేను మీకు అందజేస్తున్నాను 
  నేను అమెరికా వచ్చేటప్పటికి నాకు వరద రాసిన కవన కుతూహలం ,వరద కాలం అందేట్లు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి పంపేట్లు చేయమని నా ఆర్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణగారికి కోరటం వారాపని చేయటం 7 మధ్యాహ్నం మేము చేరేటప్పటికి పుస్తకం ఉండటం జరిగింది .ఆ రోజు రాత్రి 5 పేజీలు మాత్రమే చదివి నిన్నా ఇవాళ ఉదయం మొత్తం 370 పేజీలు పూర్తి చేశాను అందులో దహగం వారి ఆర్టికల్ బాగా  ఆకర్షించి  ఋణం తీర్చుకున్నాను .శ్రీ మైనేని వారికి కృతజ్ఞతలు .మిగిలిన విశేషాలు  వీలు వెంట తెలియ జేస్తాను 
 ఆధారం -కవన కుతూహలం మరియు వరద కాలం -అబ్బూరి వరద రాజేశ్వర రావు  
 
Inline image 1Inline image 2
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -కాంప్ -షార్లెట్ -అమెరికా -10-4-17 –
Posted in మహానుభావులు | Tagged | Leave a comment