శ్రీ ఆంజనేయ శ్లోకానికి డా రామడుగు వారి తెలుగు అనువాదం

ramdugu1 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాజ దాని విషయం లో ”స్వార్ధం అనర్ధ దాయకం ”అని జగన్ పవన్ లకు హితవు చెప్పిన రామ్ ప్రసాద్

rampra2 001 rampra1 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 336-ఉత్పల దేవుడు (930)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

336-ఉత్పల దేవుడు (930)

అభినవ గుప్తుని గురువు లక్ష్మణ గుప్తుని గురువే ఉత్పల దేవుడు .ఉదయకారుని కొడుకు .930వాడు .ఇతని గురించి క్షేమేంద్రుడు చెప్పాడు .’’ఈశ్వర ప్రత్యాభిజ్న సూత్రం ‘’రాశాడు .దీనికి అభినవ గుప్తుడు వ్రుత్తి 1015లో రాశాడు .ఉత్పలుని గురువు సోమానందుడు ప్రత్యభిజ్న మార్గ స్థాపకుడు .ఉత్పలుని సంగీత పారమ్యాన్ని  అభినవ భారతి ప్రస్తుతించాడు .’’శివ తత్వ నాటకం ‘’లో బసవ రాజు ‘’ఉత్పలాఘం పరిమళం కృతి శాంజ్న ధరస్యచ ‘’అని అన్నాడు .

337-కావ్య కౌతుక కర్త -భట్ట తౌతుడు’

భట్ట తౌతుడు రాసిన ‘’కావ్య కౌతుకం ‘’కనపడటం లేదు .కాని అతను కవి గురించి ,కావ్యం గురించి చెప్పిన శ్లోకాలను మాణిక్య చంద్రుడు ఉదాహరించాడు .’’ప్రజ్ఞా నవ నవొన్మేషశాలినీ ప్రతిభా మత –తదను ప్రాపణా జీవ ద్వర్ణణా నిపుణః-తస్య కర్మ స్తుతం కావ్యం ‘’.ఈ గ్రంధం నకలు   రాజ చూడామణి దీక్షితుల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది .అతడు తౌతుని నిర్వచనాలనే పాటించాడు  .కవిని గూర్చి తౌతుడు చెప్పిన భావాలు అమోఘం ఆదర్శం అనుసరణీయం

‘’నానృషిః కవిరిత్యుక్తః రుషి శ్చ కిల దర్శనాత్ –విచిత్ర భాషా ధర్మం స్తత్వ్వ ప్రఖ్యా చ దర్శనం

స తత్వ దర్శనాదేవ రుషేషుపటితః కవిః-దర్శనాద్వర్ణరూయ రూడ్హా లోకే కవిశ్రుతిః

తయాహి దర్శనే సంచే నిత్యోభ్యాయాది కవెర్మునేః-నోదితా కవితా లోకే యావ జ్ఞాతా ణ కర్మణా (కావ్యాను శాసనం )

దీనిపై అభినవ గుప్తుడు గొప్ప వ్యాఖ్య రాసి ‘’వివరణ ‘’అని పేరుపెట్టాడు .తన లోచన వ్యాఖ్యలోనూ దీన్ని ఉటంకించాడు  .రస భావం పై లోల్లట ,శంకుక లకు ఉన్న అభిప్రాయాలను భట్ట తౌతుడు మెరుగు పరచాడు .

338-రాజానక రత్న కాంతుడు (1640

దౌమ్యాయన గోత్రీకుడైన శంకర కాంతుని కొడుకు రత్నకాన్తుడు ..కాశ్మీర దేశస్తుడు .అతని ‘’శారద ‘’కావ్యపు రాత ప్రతులు శ్రీనగర్ లో భద్ర పరచ బడినాయి .కవి ,సాహిత్య శాస్త్ర వేత్త .రత్న శతకం అనబడే చిత్ర భాను శాతకం లో .సూర్య వర్ణన పరమాద్భుతం గా చేశాడని పేరు వచ్చింది .1680లో దీన్ని కూర్చాడు .రత్నాకరుని ‘’హరవిజయం’’ పైన ,వాసు దేవుని ‘’యుదిష్టిర విజయం ‘’పైనా విపుల వ్యాఖ్యానాలు రాశాడు .అలాగే జగద్దారుని ‘’స్తుతి కుసుమాంజలి ‘’యశస్కరుని ‘’దేవీ స్తోత్రం ‘’లపైన కూడా వ్యాఖ్యలు రాశాడు .’’కావ్య ప్రకాశం ‘’పై ‘’సార సముచ్చయం ‘’,మంచి పేరుపొందింది .ఇతని వంశం వారు ఇప్పటికీ శ్రీనగర్ లో ఉన్నారు .’’కారి కున’’ కుటుంబం గా వీరికి సంఘం లో గౌరవ స్థానం ఉంది .

339-భావ ప్రకాశన కర్త-శారదాతనయుడు  (1100-1200

కాశ్యప గోత్రీకుడైన భట్ట గోపాలుని కొడుకే శారదాతనయుడు  .మేరుత్తర జన పదం లో మాతార పూజ్య నివాసి .విష్ణువు గురించి ముప్ఫై యజ్ఞాలు చేసి ‘’వేద భూషణం ‘’అనే వ్యాఖ్యానాన్ని వేదాలపై రచించాడు .ఇతని కొడుకు కృష్ణుడు, తాత శారదా తనయుడు వేదం లోను శాస్త్రాలలోను గొప్ప పండితులు .కాశీలో విశ్వేశ్వర భక్తుడు.‘శివానుగ్రహం తో జన్మించిన వాడే భట్ట గోపాలుడు .గోపాలుడు పద్దెనిమిది విద్యలలో అపార పాండిత్యం ఉన్నవాడు .శారదా దేవి ని ప్రసన్నం చేసుకొని కుమారునికి జన్మనిచ్చి శారదా తనయుడు అని నామకరణం చేసుకొన్నాడు క్రుతజ్ఞతగా .దివాకరుని వద్ద విద్య నేర్చాడు .నాట్య శాల స్థాపించి కల సేవ చేశాడు .ప్రత్యభిజ్న సిద్ధాంత అవలంబకుడు .దీని మూలం కాశ్మీరం .అభినవ గుప్తుడు వ్యాప్తి చేశాడు . శారదా తనయుడు సంగీత మూలాలను గుర్తించి 36తత్వాలను ప్రత్యభిజ్న సిద్ధాంతానికి అన్వయించాడు .పరమాత్మ ,జీవాత్మ ప్రక్రుతి లపై విపులమైన చర్చ చేశాడు .దీని ఆధారం గా తన నాటకాలలో నాటక రసాన్ని ప్రేక్షకులు అనుభ విన్చేట్లు చూశాడు .ప్రేక్షకానందం జీవుడు ప్రపంచ సుఖాలను అనుభవిస్తూ పొందే ఆనందంగా చెప్పాడు .ప్రత్యభిజ్న వేదాంతం లో కూడా రాగం, విద్య, కళ ఉన్నాయన్నాడు.భోజుని శృంగార ప్రకాశను అనుసరించాడు .పదమూడవ శతాబ్దపు కవులు ఇతన్ని ఎక్కువగా ఉదాహరించారు కనుక కాలం పన్నెండు పదమూడు శతాబ్దాల మధ్య అని తేల్చారు .

సంగీతం పై ‘’శారదీయం ‘’రాశాడు కావ్య ప్రకాశకు వ్యాఖ్య రాశాడు .అతని ‘’భావ ప్రకాశానం ‘’ఉద్గ్రంధం .పది అధికారికలపై విస్తృత చర్చ చేశాడు .

340-రసకల్పద్రుమ కర్త-చతుర్భుజుడు

‘’రస కల్పద్రుమం ‘’రాసిన చతుర్భుజ కవి సహిస్టఖాన్ ను మెప్పించాడు .ఆశక ఖాన్ కొడుకు. ఇతాముద్దౌలాకు మనవడు  చతుర్భుజుడు అని అంటారు .రసకల్ప ద్రుమం లో వెయ్యి శ్లోకాలు ,అరవై అయిదు ప్రస్తావాలున్నాయి .సహిస్తాఖాన్ గొప్పసంస్క్రతకవి కవి .1689లో అతను రాసిన శ్లోకాలున్నాయి .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -27-8-15 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరలక్ష్మీ మాత – 28-8-15 శ్రావణ శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు

సాహితీ బంధువులకు 28-8-15శ్రావణ  శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్

 

Inline image 1    Inline image 2  Inline image 3

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపూ మార్గం లో బామ్మ ,మరియు సుభాష్ శుభాషిణి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంగడి రొదలో తెలుగు సొద

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గుజరాత్ లో పటేళ్ళ పోరుబాట

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా గురుదేవులు — శ్రీ ఎ.బి. ఆనంద్, ప్రముఖ రేడియో ఆర్టిస్టు,జర్నలిస్టు

మా గురుదేవులు — మొదటిభాగం, శ్రీ ఎ.బి. ఆనంద్, పుముఖ రేడియో ఆర్టిస్టు,జర్నలిస్టు

 

img190 img191 img189 img193 img194 img192

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 326-శతావధాని,అవధాన విధాన కర్త – వేమూరి శ్రీ రామ శాస్త్రి (1870

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

326-శతావధాని,అవధాన విధాన కర్త – వేమూరి శ్రీ రామ శాస్త్రి (1870

వేమూరి శ్రీ రామ శాస్త్రి నెల్లూరు జిల్లా కందుకూరు తాలూకా జువ్వి గుంట  అగ్రహారం లో 1870లో పుట్టాడు .వెలనాటి వైదిక కుటుంబం హరితస గోత్రం.వేదం, శ్రౌత ,జ్యోతిశాలను పితృపాదుల వద్దనే నేర్చాడు .తర్వాత సాహిత్య వ్యాకరణాలు అభ్యసించాడు .చిన్న నాటినుంచే కవిత్వం అబ్బి ‘’శతావధానం ‘’పై మోజు ఏర్పడి కన్యా కుమారి నుండి కాశ్మీర్ దాకా 24వ ఏట నుండి అనేక ముఖ్య పట్టణాలలో  తన శతావధాన  విద్యా ప్రదర్శన చేసి గౌరవింప బడ్డాడు .పూనా లో చేసిన అవధానానికి డా.భండార్కర్ అబ్బుర పడ్డాడు .అసాదారణ ధారణాసామర్ధ్యం   ఉన్నవాడు .బరోడా లో మహా రాజు సమక్షం లో శతావధానం చేసి గాయక్వాడ్ చేత విశేష సన్మానం అందుకొన్నాడు .1903లో కాశ్మీర్ వెళ్లి ‘’గ్రైవేయక బంధం ‘’అనే కావ్యాన్ని సంస్కృతం లో రచించాడు .1911లో ధిల్లీ లో తానూ రాసిన ‘’ధిల్లీ ప్రభ ‘’లేక దర్బార్ ‘’ఖానేద’’రచనకు ధిల్లేఎ దర్బార్ లో బహు ప్రశంసలు సన్మానం పొందాడు .సంస్కృత సాహిత్యపు లోతులు తరచిన వాడు కనుక 14 భాషలలో  అనర్గళం గా మాట్లాడ గలిగే నేర్పు అలవడింది .ఆనాడు ఇంతటి బహు భాషా పాండిత్యం ఉన్న వారు లేరు .తెలుగు సంస్కృత హిందీ భాషలలో రచనలు చేశాడు .సంస్కృతం లో ‘’అవధాన విధానం ‘’’’గురు కల్పం ‘’,నూతనోదయనం ‘’రచించాడు బెజవాడలో స్థిరపడ్డాడు ..

327-వింజమూరి వీర రాఘవా చార్య (1855-1920)

కౌశిక గోత్రానికి చెందిన వైష్ణవుడు వీర రాఘవాచార్య .పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా దొంతవరం గ్రామస్తుడు .బెజవాడలో ఉంటూ సంస్కృత పండితుడుగా ఉద్యోగించాడు .బహు ముఖీన ప్రతిభా సంపన్నుడు .సంస్కృతం లో ‘’రామానుజ స్తోత్రత్రయి’’,మానససందేశం ,హనుమత్ సందేశం ,పానక నరసింహ స్తోత్రం ,రఘువీరగాద్య వ్యాఖ్య చతుశ్లోకీ వ్యాఖ్య ‘’రాశాడు .

328-తిరుపతి కవులు

దివాకర్ల తిరుపతి శాస్త్రి ,చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి కవి ద్వయాన్ని తిరుపతి కవులు అంటారు .అఆషు కవిత్వం తో అవధాన విద్యనూ ప్రదర్శించి ఆంద్ర దేశం అంతటా బహు సన్మానాలు అందుకొన్నారు .వీరి సంస్కృత రచన ‘’కలి సహస్రం ‘’

దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి (1853)తమ్మన శాస్త్రి(1862) సోదరులు  గొప్ప శతావధానులు .పిఠాపురం రాజాస్థాన కవులు .సుబ్బరాయ శాస్త్రి సంస్కృతం లో ‘’రావు వంశ ముక్తావళి ‘’రాశాడు .

329-దూతాంగద నాటక కర్త -సుభట (1200)

సోమదేవుడు ,నామి సాదు సుభట కవి ని బాగా కీర్తించారు .  ఇతని ‘’దూతాంగద’’నాటకాన్ని అన్హిల్ విద్ రాజు త్రిభువన పాల దేవుని కాలం లో  1242లోగుజరాతు లోని సోమనాధ జ్యోతిర్లింగ దేవాలయ పునః ప్రతిష్టాకార్యక్రమం లో  ప్రదర్శించారు .

330-చాయా నాటక కర్త -వ్యాస రామ దేవుడు (1380

రామాభ్యుదయం ,పాండవాభ్యుదయం ,సుభాద్రాపరిణయం అనే మూడు నాటకాలను వ్యాస రామ దేవుడు1402-15 మధ్య రచించాడు .రాయపూర్ కాలకూరి   రాజులఆస్థానకవి .ఈ నాటకాలను చాయా నాటకాలు అంటారు .బీజాపూర్ సుల్తాన్ ఆదిల్షా వంశం పై విఠలకవి చాయా నాటకం రాశాడు .సావిత్రీ చరిత్ర ,శంకర లాల కూడా చాయా నాటకాలే .’’హరి దూతం ‘’అనే చాయా నాటకం శ్రీ కృష్ణ రాయ బార కద.

331- అద్భుత దర్పణ ‘రచయిత -మహా దేవుడు (1700)

మద్రాస్ రాష్ట్రం లో పలమనేరు నివాసి కౌండిన్య గోత్రీకుడు కృష్ణ సూరి కుమారుడు మహా దేవుడు .నీలకంఠుని సహవాసి .పదిహేడవ శతాబ్ది వాడు .’’అద్భుత దర్పణం ‘’అనే కావ్యం లో రామ రావణ యుద్ధ పురోగతిని  హనుమ లంక నుండి తిరిగి వచ్చిన దగ్గర నుండి అద్భుతంగా వర్ణించాడు .

332-అభిదా వ్రుత్తి మాత్రుక రాసిన -ముకుళ(855-894)

భట్ట కల్లటుని కొడుకు ముకుళ.కాశ్మీర్ రాజు అవంతీ వర్మ ఆస్థానం లో 855-884కాలం లో ఉన్నాడు .’’అభిదా వ్రుత్తి మాతృక ‘’రాసి అక్షరాల ఉత్పత్తినిగూర్చి వివరించాడు .ఇతని కొడుకు హర్శతుడు  ‘’జయ దేవ ఛందస్సు ‘’పై వ్యాఖ్యానం రాశాడని అభినవ గుప్తుడు నాట్య శాస్త్ర వ్యాఖ్యానం లో తెలియ జేశాడు .

333హృదయ దర్పణం రాసిన –భట్టనాయకుడు (855-884

భట్టనాయకుడు భారతం పై ‘’హృదయ దర్పణం ‘’రాశాడు .అభినవ గుప్తుడు ,జయ రధుడు ఈ కవి శ్లోకాలను ఉదాహరించారు .ఇది అలంకార గ్రంధం ఇందులో భట్టు రసమే మంచి కవిత్వానికి సారం ,గుర్తింపు అన్నాడు .ధ్వనికి దీనికి సంబంధం లేదు అన్నాడు అందుకే అభినవ గుప్తుడు రుయ్యకుడు దీన్ని వ్యతిరేకించారు . 855-884కాలపు అవంతి వర్మ రాజు ఆస్థానం లో ,కాశ్మీర్ రాజు శంకర వర్మ ఆస్థానం లో భట్టు ఉండి ఉంటాడు ..’’భామహాలంకారం ‘’పై విస్తృత వ్యాఖ్యానం రచించాడు .న్యాయ శాస్త్రం పై భట్టు కున్న పట్టు ను అభినవ గుప్తుడు పేర్కొన్నాడు .

334-మహా సాధ్యాయ పాల -ధనికుడు

ధనికుడు ధనుంజయుని సోదరుడు గా భావిస్తారు .కొందరు ధనిక ధనున్జయులు ఒక్కరే అంటారు .అతని రాత ప్రతులైన ‘’అవలోక ‘’లో తానుముంజ రాజు ఉత్పలుని  ‘’మహా సాధ్యాయ పాల ‘’అనే అధికారి నని చెప్పుకొన్నాడు .వసంతా చార్యుని తండ్రి అయి ఉండవచ్చు .యితడు వాక్పతిరాజు (974)కాలం వాడు .కవిత్వం రాశాడు తన స్వంత కవిత్వాన్ని ధనుంజయుని అలంకార శాస్త్రానికి ఉదాహరణలుగా ఇచ్చాడు

335-రూప దీపిక కర్త -బహురూప మిశ్ర (1100

మహా మహోపాధ్యాయుడని పించుకొన్న మిశ్రా పన్నెండవ శతాబ్ది మొదటి వాడు .ధనుంజయ ,ధనికుల రచనలకు వ్యాఖ్య రాశాడు .వాటిని దశ రూపాలు అన్నాడు .అతని వ్యాఖ్యానం పేరు ‘’రూప దీపిక ‘’.దీనికి మించిన వ్యాఖ్యానం లేదని అభిజ్నులన్నారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-8-15 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నాగార్జున యూని వర్సిటి మాజీ లైబ్రేరియన్ ,గండిగుంట గ్రామస్తులు ప్రస్తుత హైదరాబాద్ నివాసి శ్రీ సుంకర కోటేశ్వర రావు గారి సహృదయ స్పందన ,

సాహితీ బంధువులకు వరలక్ష్మీ వ్రత  శుభా కాంక్షలు  –శ్రీ సుంకర కోటేశ్వర రావు గారు ఉయ్యూరుకు దగ్గరలో ఉన్న గండి గుంట   గ్రామస్తులు . ఆ చార్య నాగార్జున విశ్వ విద్యాలయం లో సీనియర్ లైబ్రేరియన్ గా పని చేసి రిటైరయ్యారు .సరసభారతికి ఆప్తులు . తమ అభిప్రాయాలను ఎప్పటి కప్పుడు తెలియ జేసే వ్యక్తీ . సరస భారతి చేస్తున్న సాహిత్య సేవకు సంతోషిస్తూ ప్రోత్సాహంగా ఈ జనవరి లో 2,000 రూపాయలు ,నిన్న 5 ,000రూపాయలు చెక్కుల రూపం లో పంపిన విశాల హృదయులు . వారికి సదా సరస భారతి కృతజ్ఞత కలిగి ఉంటుంది . మరిన్ని విశేషాలతో సరసభారతిని  అందరికీ ఆనందం కలుగ జేస్తుందని సవినయం గా మనవి చేస్తున్నాను -దుర్గా ప్రసాద్ sunkara1 001 sunkara2 001

Posted in సరసభారతి | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 316- జంబూద్వీప చిత్రపటం తయారు చేసిన -మూల శంకర మాణిక్ లాల్ యాజ్ఞిక్ –(1886

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

316- జంబూద్వీప చిత్రపటం తయారు చేసిన -మూల శంకర మాణిక్ లాల్ యాజ్ఞిక్ –(1886

31-1-1886 జన్మించిన మూల శంకర మాణిక్ లాల్ యాజ్ఞిక్ గుజరాతీ  వాదనగరం లోని నాదియాడ్ గ్రామ బ్రాహ్మణుడు .ఈ కుటుంబం లో లబ్ధ ప్రతిష్టులైన  కవులెందరో జన్మించారు .వీరిలో కొందరు గుజరాతు ,కదియవ వాడ సంస్థానాలలోదివాన్ గిరీ చేశారు. యాజ్ఞిక్ బరోడా కాలేజి లో చదివి గ్రాడ్యుయేట్ అయ్యాడు .ఇండియన్ స్పెసీ బాంక్ లో కొంతకాలం పని చేసి బరోడాలోని రాజకీయ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ అయ్యాడు . .1916శివ గంగ పీతాదిపతి శ్రీ సచ్చిదానంద స్వామి ఇతనికి దీక్ష నిచ్చారు .సంస్కృత నాటకాలు గేయాలు రాసి సంగీతం కూర్చాడు .’’విజయ లహరి ‘’అనే చిన్న కావ్యం రాశాడు .సూర్య ,చంద్ర రాజుల వంశం లోని రాజులపాలనా కాలాలను నిర్దుష్టంగా గుణించి చెప్పాడు .’’జంబూద్వీపం మాప్’’ తయారు చేశాడు .విష్ణు పురాణాన్ని చక్కని సరళ సంస్కృత వచనం లో రాశాడు .’’చత్రపతి సామ్రాజ్యం ‘’అనే పది అంకాల నాటకం రాసి శివాజీ పరిపాలనపై వెలుగులు ప్రసరింప జేశాడు .తొమ్మిది అ౦కా లలో ‘’ప్రతాప విజయం ‘’నాటకం రాసి మేవార్ రాజు మహా రాణా ప్రతాప్ సింగ్ వీర విక్రమ గంభీరధీరోదాత్త   చరిత్రను వివరించాడు .పృధ్వీరాజ్ చౌహాన్ –రాణి సంయుక్త వివాహాన్ని ‘’సంయోగిత స్వయం వరం ‘’గా రాశాడు .కావ్య నాటక గేయ పదాలలో మృదు మధుర మంజుల నాదం చేస్తుంది యాజ్ఞిక్ కవిత్వం .

317-తర్క వాగీశ –పంచానన (1273

1273లో బెంగాల్ లోని ఇరవై నాలుగు పరగణాలలో జన్మించిన పంచానన కవి గౌతమ గోత్రీకుడైన నందాలత విద్యారదుల  కుమారుడు .బెంగాల్ సంస్క్రుత పండితులలో మహోత్క్రుస్టూడు అని పేరొందిన వాడు బెనారస్ లో నివసించాడు .’’పార్దాశ్వ మేధ’’కావ్యం రాశాడు .రాణా అమర సి౦హు ని పై ‘’అమర మంగళ నాటకం ‘’రాశాడు .కన్యా కుబ్జానికి చెందిన అల్లా భట్టు అనే గొప్ప విద్వాంసుడు యీతని పూర్వీకుడు .ఇతనికి ‘’తర్క వాగీశ’’బిరుదం ఉంది .

 

318-సిద్ధాంత వాగీశ –హరిదాసు(1876

విద్యాముఖి ,గంగాధర విద్యాలంకారుల కుమారుడు హరిదాసు .1876 జననం .పశ్చిమ బెంగాల్ లోని ఫరీద్ పూర్ జిల్లా కొత్వాలిపారాలోని ఉనాశియా నివాసి .కాశ్యప గోత్రం .ఈ గ్రామం లో ఒకప్పుడుబ్రాహ్మణులు  లక్ష శివలింగాలను అర్చించారని చారిత్రిక కధనం .అందుకే దీనికి రెండవ కాశి అనే పేరొచ్చింది .గంగాధరుని తండ్రి కాశీ చంద్ర వాచస్పతి’’ యాదవానంద నయా చారం ‘’లో తొమ్మిదవ పీఠాది పతి .వీరి పూర్వీకులలో ముఖ్యుడు మధు సూదన సరస్వతి అనే మహా విద్వా౦శు డున్నాడు .

హరనాధుడు చిన్నప్పటి నుంచి చాలా నిష్టగా జీవించాడు .పదమూడవ ఏటనే సంస్కృత సాహిత్యం లో అమోఘ పండితుడని పించుకొన్నాడు .పద్నాలుగవ ఏట ‘’కంస వధ ‘’అనే నాటకాన్ని ,కంసవధ చంపు ను రాశాడు .పదహారవ ఏట ‘’శంకర సంభవం ‘’అనే అయిదు కాండలకావ్యం రాసేశాడు .వయసు పద్దెనిమిది లో ‘’జానకీ విక్రమం ‘’ఇరవై వ ఏట ‘’వియోగ వైభవం ;;కావ్యం సంత రించాడు .

హరిదాసు జీవానంద విద్యా సాగరుని శిష్యుడు .’’విరాజ సరోజిని‘’,’’వంగీయ ప్రతాపం ‘’కావ్య రచన చేశాడు ‘’రుక్మిణీ హరణం ‘’తో బాటు శృంగార కావ్యంగా ‘’సరళ ‘’రాశాడు .నైషధం ,మాఘం కాదంబరి ,దశ కుమార చరిత్ర ,సాహిత్య దర్పణాలకు విలువైన ఉపోద్ఘాతాలు రాశాడు .నాకీపూర్ జమీందార్ గారి టోల్ కాలేజిలో సంస్కృత ప్రొఫెసర్ గా ఉన్నాడు .మహా భారతాన్ని బెంగాలీ భాషలోకి అనువదించే కార్యక్రమం లో ఎడిటర్ గా పని చేశాడు .ఇందులో ఈయన కృషి చిరస్మరణీయం అని బెంగాలీ ప్రజల ప్రగాఢ విశ్వాసం .ఆదిపర్వం వనపర్వం లో కొంతభాగం ముద్రింప బడ్డాయి .ఇతనికి ఉన్న సిద్ధాంత వాగీశ బిరుదు సర్వదా సమర్ధనీయం .

319-హైకోర్ట్ ఆడ్వోకేట్ –మకలింగ శాస్త్రి (!897

మద్రాస్ హై కోర్ట్ లో అడ్వొకేట్ అయిన మక లింగ శాస్త్రి యజ్న స్వామి కుమారుడు ,.రాజు శాస్త్రి అని పిలువ బడే త్యాగ రాజు ఈతని ముత్తాత .అప్పయ్య దీక్షితులకు పన్నెండవ తరం వాడు .1897లో పుట్టుక .చిన్నప్పటి నుండి గీర్వాణం వంట బట్టి కవిత లో గీర్వాణం చూపాడు .’’వనలత ,నదీపూరం ,వ్యాజోక్తి రత్నావళి  ,అర్దాన్తరన్యాస  పంచాశత్ ,భారతి విషాదం ,భ్రమర సందేశం ,దుర్జన హృదయం మొదలైన లఘుకావ్యాలు రాశాడు .’’కలి ప్రభావం ‘’అనే కదా సంపుటి ,వెలువరించాడు .భాస నాటకాలను ‘’భాస కదా సారం ‘’గా వచనం లో రాశాడు .ఉద్గాత్రిదశానన ‘’’’ప్రతి రాజ సూయం ‘’అనే నాటకాలు రచించాడు .దేశం లోని విశ్వ విద్యాలయాలు ఈయన ప్రతిభా విశేషాలకు ముచ్చటపడి ఆహ్వానించి సన్మా నించాయి .

320-ప్రబోధ చంద్రోదయ కర్త -కృష్ణ మిశ్ర (1072

పరమహంస కృష్ణ మిశ్రుడు శంకరాద్వైత  వేదాంత వ్యాప్తి చేశాడు శిష్యులనేకులు .  .అందులో ఒకడికి వేదాంతం చదవటం బోర్ అని పించింది .అతని దారి మరల్చటానికి కృష్ణ మిశ్రుడు ‘’ప్రబోధ చంద్రోదయం ‘’నాటకం రాశాడు .అందులో పరమ సత్యాన్ని ఆవిష్కరించాడు .గుణాలను పాత్రలుగా మలచాడు.వివేచన విముక్తికి దారి చూపుతుంది అని సారాంశం గా చెప్పాడు . వివేకం రాజు గా ఉపనిషత్ దేవిగా భావన చేసి గూఢంగా సత్యజ్ఞానం కలిగించిన నాటకం .మంచి రాజు వివేకుడు దుస్టరాజు మహా మాయ  ముఖ్య పాత్రలు .భ్రాంతికి సత్యానికి జరిగే పోరాటమే ఇందులో కద. చివరికి వివేకం చంద్రోదయం లాగా   ప్రకాశించటం తో సమాప్తం .

ఆనాడు వ్యాప్తిలో ఉన్న బుద్ధ ,జైన పశుపతి మతాల వలన ధర్మ గ్లాని కలుగుతోందని కృష్ణ మిశ్రుడు భావించి శంకరాద్వైత ప్రచారం చేసి వేదసంస్క్రుతికి పునర్వైభవం సంత రించాడు.సరిదిద్దాల్సిన ఆనాటి బ్రాహ్మణులు చిలక పలుకుల్లా వేదాలను వల్లే వేయటం తోనే సరి పుచ్చారు . అందులోని అర్ధ భావాలను తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు .తెలియ జెప్పే ప్రయత్నం జరగ లేదు .పై పెచ్చు వేదోపనిషత్ లను తమ ఇష్టం వచ్చినట్లు వక్ర భాష్యం చెప్పి దారి తప్పారు, తప్పించారు .ఇవన్నీ గమనించిన కృష్ణ మిశ్రుడు సమాజాన్ని వేదాంత మార్గం లోకి  మళ్ళించ టానికే ఈ నాటకం రాశాడు .

1092లో దీన్ని రాశాడు. ఆనాటి రాజు గోపాలుడు ఎప్పుడూ యుద్ధాలు అంటూ కాలక్షేపం చేస్తూ ప్రజల గోడు పట్టించుకోలేదు .ఆ రాజ్యం లో మునిగా ఉన్న కృష్ణ మిశ్రుడు రాజుకు వివేకం కలిగించటానికే యుద్ధాన్ని నేపధ్యం గా తీసుకొని ప్రబోధ చంద్రోదయ నాటకం రాసి కను విప్పు కలిగించాడు .కృష్ణ మిశ్రుడు తాను గౌడ దేశానికి చెందిన వాడినని చెప్పుకొన్నాడు. కనుక ఈయన బీహార్ ప్రాంతం వాడుగా భావించారు .ఈ నాటకాన్ని రాజు గోపాలుడు అతని మిత్ర రాజు కీర్తి వర్మతో  కర్ణ రాజు అనే శత్రువును జయించి రాజధానికి తిరిగి వచ్చి ‘’ప్రబోధ చంద్రోదయం ‘’నాటకాన్ని ప్రదర్శింప జేసి చూశాడు .’’వివేకం అనే చంద్రుని యొక్క ఉదయం ‘’అని ఈ నాటక శీర్షికకు అర్ధం. చక్కని శైలి ,సంభాషణలు అంతరంగాల ప్రదర్శన లతో నాటకం రక్తి కట్టి౦ది . వేదాంత ధోరణి నాటకాలకు కృష్ణ మిశ్రుడు తెర తీశాడు .ఆ తర్వాత ఇలాంటివి చాలా వచ్చాయి .

సశేషం

మీ  –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-8-15- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 308-గీతా దిగంబర నాటక కర్త -వంశమణి (1655)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

308-గీతా దిగంబర నాటక కర్త -వంశమణి (1655)

మైధిలీ బ్రాహ్మణ వంశం లో విల్వపంచ శాఖకు చెందిన వంశమణి రామచంద్రుని కొడుకు .నేపాల్ దేశ వాసి .ఖాట్మండు రాజు  ప్రతాప మల్ల దేవుడు  చేసిన తులాపురుష దాన సందర్భం గా ‘’గీతా దిగంబర ‘’నాటకం 1655లో  రాశాడు .తులాపురుష దానం జరిగే సందర్భం లో ఆహూతులైన రాణుల రాజుల పండితుల సమక్షం లో వారందరికీ వినోదం కలిగించటానికి చేసిన రచన ఇది .తులాపురుష దానం అంటే రాజు తన బరువుతో సమానమైన విలువైన ఆభరణాలు బ్రాహ్మణులకు దానం చేయటమే .ప్రతాపమల్ల రాజు స్వయంగా కవి, కవిపోషకుడు .ఆయన దేవతలమీద  రాసిన ‘’అష్టకాలు ‘’నేపాల్ అంతటా లభిస్తాయి అంత ప్రాచుర్యం పొందాయన్నమాట .ఇలాంటి పవిత్ర కార్యక్రమం లో సంస్కృత నాటకం ఆడించటం రాజుకు అలవాటు .

309-కమలా విజయ నాటక కర్త-వేంకటాచార్య

బెంగుళూరు సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ అయిన వేంకటాచార్య అనేక గ్రంధ రచయిత .టెన్నిసన్ రెండు అ౦కాలలో రాసిన ‘’టీ కప్ ‘’నాటిక ఆధారం గా ‘’కమలావిజయం ‘’నాటకం రాశాడు .ప్రాకృతం వాడలేదు .చెడుపై మంచి విజయం సాధిస్తుంది అని సారాంశం .’’నవ గీతా కుసుమాంజలి ‘కావ్యం లో ’ ఉన్నది ఒకడే దైవం .ఆయనననే అనేక రూపాలలో ఆరాధిస్తున్నారు అని చెప్పాడు. పురాణ కధలను ఆధారంగా దీన్ని వివరించాడు .ఇందులో తొమ్మిది భాగాలు ,నూట ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి .రామాయణ సారాన్ని ‘’రామ గీత ‘’లో,భాగవత కధను ‘’కృష్ణ గీత ‘’లో ,విష్ణు వివరాలను ‘’దశావతార గీత ‘’లో ,గణపతి సృష్టికి మూలం అని ఆయన వైభవం వర్ణనాతీతం అని ‘’గణేశ గీత ‘’లో ,అసలైన దివ్య జ్ఞానం కుదురైన బుద్ధి వలన సాధ్యం అని ‘’సద్గురు గీత ‘’లో ,త్రిమూర్తులకు భేదమే లేదని ‘’శివ గీత ‘’లో ,చెప్పాడుకవి .ఇతని’’ వాణీ గీత ‘’లక్ష్మీ గీత ‘’.’’గౌరీగీత ‘’స్త్రీ శక్తికి ఉన్న విలువను తెలియ జేస్తాయి .

310-భావ శతక కర్త -నాగరాజకవి

కార్పాటి గోత్రానికి చెందిన జల్లపుని కుమారుడు నాగరాజు.విద్యాధరుడు తాత .’’భావ శతకం ‘’లో తానూ రాజునని ‘’తాక వ౦శ మణి దీపాన్నని చెప్పుకొన్నాడు .వీరి వంశపు రాజులు చిన్న చిన్న రాజ్యాధిపతులు ధిల్లీకి ఉత్తరాన ‘’ యమునా నది ఒడ్డున ‘’కాష్ట’’దేశ పాలకులయి ఉండచ్చు .ఇతని భావ శతకం లో నూటొక్క శ్లోకాలున్నాయి .కొన్ని ప్రాకృతికం లోనూ రాశాడు . ఇందులో అనేక భావాలను వెదజల్లాడు .కవికర్ణ పూరుని ’’చమత్కార చంద్రిక ,నరోత్త్తమ దాస విశ్వేశ్వర ‘’,రచనలు త్రివిక్రముని వ్యాజోక్తి   శతకం ‘అన్నీ ఒకటిగానే కనిపిస్తాయి .

311-ఆశే చనక రామాయణ కర్త-సుబ్రహ్మణ్య సూరి (1850-1913)

శంకరనారాయణ కుమారుడైన సుబ్రహ్మణ్య సూరి 1850లో పుదుక్కొట దగ్గర కదయక్కూడి లో జన్మించాడు .ప్రసిద్ధ చొక్కనాద దీక్షితులకు ఏడవ తరం వాడు .పుదుక్కొట రాజా కాలేజిలో సంస్కృత ప్రొఫెసర్ చేశాడు .1913లో చనిపోయాడు .సకల కళా వల్లభుడు .ఏడు అంకాల ‘’వల్లీ బాహులేయం ‘’నాటకాన్ని రాశాడు .ఇది వల్లీ కుమారస్వాముల వివాహ కధ.’’మన్మధ మంధనం’’అనే భాణాన్ని,’’శంతను చరిత్ర ‘’వచనాన్ని రచించాడు .’’బుద్ధి సందేశం ,పద్య పంచ రత్నం ,హర తీర్దేశ్వర స్తుతి ,శుక సూక్తి సుధా రసాయనం ,కూడా రాశాడు రామాయణ కధలను సంగీతానికి అనుగుణంగా మలచాడు .అవే ‘’రామావతారం ,విశ్వామిత్ర యాగం సీతాకల్యాణం రుక్మిణీ కల్యాణం ‘’,విభూతి మహాత్మ్యం మొదలైనవి .’’డోలాగీతలు హల్లీశ మంజరిలు వివిధ దేవతలపై రాసిన పాటలు ‘’.అతని   మాణిక్య భాసమాన రచన ‘’ఆశేచనక  రామాయణం ‘’.నూట తొంభై తొమ్మిది ఆర్యా వృత్తాలలో రాశాడు .ప్రతి శ్లోకం లో మొదటి మూడు పాదాలలో కద ఉంటే ,నాల్గవ పాదం లో నీతి ఉండటం దీని ప్రత్యేకత .ప్రతి శ్లోకం మధురమే సూక్తి సుదారసమే .వాల్మీకి రామాయణ కధకు కొత్త సొగసులు కూర్చాడు కవి .

312-‘’శీఘ్ర కవి ‘’-శంకర్ లాల్ మహేశ్వర శాస్త్రి(1844-1916)

మహామహోపాధ్యాయ శంకర్ లాల్ మహేశ్వర శాస్త్రి ప్రాశ్నోర నగరం కు చెందిన వాడు .1844-1916కాలం వాడు .జాం నగరం  లో ఉండేవాడు .పదిహేనవ ఏట నుండే కవిత్వం అల్లాడు .జాం నగర్ మహారాజు ఇతని కవితా ప్రతిభకు మెచ్చి ‘’శీఘ్రకవి ‘’బిరుదు ప్రదానం చేసి సత్కరించాడు .కదియవాడలోని మొర్బి రావోజీ రాజా పాఠశాలలో పని చేశాడు ‘సావిత్రీ చరిత్ర ‘’,చంద్ర ప్రభ చరిత్ర ‘’,ద్రువాభ్యుదయ శతకం ‘’,గోపాల చింతామణి ‘’,అనసూయాభ్యుదయం ‘’మొదలైన రచనలు చేశాడు .

313-సూర్య గ్రహణం పై ‘’చిత్సూర్య లోకం ‘’రాసిన -ముడుంబై వెంకట రామ నరసింహ ఆచార్య (1842-1928)

1842-1928లో ఉన్న ముడుంబై నరసింహా చార్య వీర రాఘవ రంగాంబ ల కుమారుడు .శ్రీ వత్స గోత్రం .ఈ వంశం లో ఒకాయన సంగీత సాహిత్యాలలో మహా విద్వాంసుడు .అందుకని వీరికి ‘’సంగీతముడుంబై ‘’అనే పేరు ఏర్పడింది .వీరి మూల పురుషుడు ముడుమ్బైఆచన్ .ఈయన రామానుజుల వారి శ్రీ వైష్ణవ సంప్రదాయం లో 72వ ఆచార్యుడు ..మన నరసింహా చార్యనువిజయనగరం రాజు  విజయ రామ  గజపతి ఆహ్వానించి సత్కరించాడు ‘సాహిత్య విభాగాలన్నిటిలో 114 రచనలు చేశాడు .’’గజేంద్ర వ్యాయోగం ,రాజహంసీయ నాటకం ,వాసవీ పాశ న్యప్రకరణం ,మొదలైన నాటకాలు ,సూర్య గ్రహణం పై ‘’చిత్సూర్య లోకం ‘’రాశాడు .కావ్యాలలో ‘’రామ చంద్ర కదామృతం , భాగవతం ముఖ్యమైనవి .’’ఖాలావ హేళన ‘’,నీతి రహశ్యం ‘లఘుకావ్యాలు .’’ఉజ్వలానంద చంపు ‘’వచన రచన .’’కావ్యాలంకార సంగ్రహం ‘’’అనే అలంకార గ్రంధమూ రచించాడు .

314’’గీర్వాణ శఠగోప సహస్ర’’ కవి మేడేపల్లి వెంకట రామణాచార్య (1862

విజయనగరం జిల్లా అనకాపల్లిలో రమణాచార్య 1862లో జన్మించాడు .సమర్ధులైన గురువుల వద్ద శాస్త్రాభ్యాసం చేసి సమర్ధుడని పించుకొని విజయనగరం రాజావారి కళాశాలలో సంస్కృత ఆచార్యుడయ్యాడు .’’గీర్వాణ శఠ గోప సహస్రం ‘’తమిళ ప్రబంధాల కు సంస్కృత రచన .భక్తీ భావ లహరి .పదిహేనవ శతాబ్ది తర్వాతా సంస్కృతం లో ఇంత ప్రౌఢ రచన రాలేదని అంటారు .షేక్స్పియర్ .లాంబ్ కధలను సంస్క్రుతీకరించాడు .తెలుగులో అలంకార శాస్త్ర గ్రంధం రాశాడు .

315-సంస్కృత సర్వస్వం రాసిన -మధురానాధుడు (1890-

మంజునాధుడు అని పిలువ బడిన మధురా నాధుడు ద్వారా కంఠకుమారుడు జైపూర్ రాజాస్థాన పండిట్ .సుందరలాలా పెంచుకొన్నాడు .గౌతమ గోత్రం.1890లో పుట్టాడు .ఇతాని పూర్వీకుడు బావి దీక్షితులు తెలుగు బ్రాహ్మణుడే .కాశీలో నివాసం ఉన్నాడు మరో ఆయన మణుల దీక్షితులు ప్రయాగలో స్టిరపడ్డాడు .ఈ కుటుంబాన్ని ‘’దేవర్ష వాతంక ‘’గా పిలుస్తారు .వీరికి ఒక శిష్యుడు  దేవర్షి అనే గ్రామాన్ని కానుకగా  బహూకరించటం చేత ఈ పేరు వచ్చింది  .మధురానాధ పాండిత్యానికి రాజులు మెచ్చి బహు బహుమతులిచ్చి సత్కరించారు .జయపూర్ రాజ్య పండితుని చేశారు .’’ఈశ్వర విలాసం ‘’,పద్య ముక్తావళి ‘’త్రిపుర సుందరీ స్తవ రాజం అలంకార కళానిధి ‘’ఇతని రచనలు .జైపూర్ సంస్థాన సంస్కృత విద్యకు సూప రిం టెండెంట్ గా  ఉన్నాడు.’’మంజు కవితా నికుంజం ‘’,అనే సంకలనం తెచ్చాడు .’’సాహిత్య వల్లభ ‘’,సంస్కృత గాదా సప్త శతి ,సంస్కృత సర్వస్వం,  కావ్యాలంకార రహస్యం ‘’అతని ప్రతిభకు గీటు రాళ్ళు.

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-8-15-ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఐరాసా కు అతివ సారధ్యం ఎప్పుడు?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

డాక్టర్ ఈజ్ మై ఫ్రెండ్ అన్ననటి గౌతమి ఆరు పదుల కన్యా శుల్కం




గబ్బిట దుర్గా ప్రసాద్


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చైనా తయారీ సంక్షోభం మరియు పరీక్షలు లేని చదువులు

 



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాట మరువం అన్న మోడీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వణ కవుల కవితా గీర్వాణం-2 ౩౦౩-సామంత భద్ర (క్రీ శ100)

గీర్వణ కవుల కవితా గీర్వాణం-2

౩౦౩-సామంత భద్ర (క్రీ శ100)

క్రీ శకం మొదటి శతాబ్దపు  జైనకవి సామంత భద్ర .’’వీర వంశా వలి ‘’శ్వేతాంబరుల కావ్యం లో పదహారవ ఆచార్యుడిగా గుర్తింప బడ్డాడు .’’ఆరాధన కదా కోశం ‘’అనేప్రభ చంద్రుని  కదల గ్రంధం లో భద్రుని  గురించి ఉంది .కంచిలో ఆచార్యుడుగా ఉండి ఉండాలి .గర్భకోశవ్యాధి పీడితుడు .అయినా కంచి నుండి పౌన్ద్రపురం గుండా బెనారస్ నడిచి వెళ్ళాడు .కాశీలో శివుని విగ్రహాన్ని పార్శ్వ నాదుడిగా మార్చి తన మాయా జాలం చూపాడు .’’దేవాగమ స్తోత్రం ‘’,’’స్వయంభు స్తోత్రం ‘రాశాడు .ఆది పురాణం లో అతనిపై ప్రశంస ఉంది .’’నమస్తమ్మాంత భద్రాయ మహాతే కవి వేధసే –యద చీవజ్న పాతేన నిర్భిన్నః కుమతా ద్రయః

కవీనాం గమకానాం చ వాదీనాం వాగ్మిమానపి –యశాస్సమంత భద్రీయం మూర్ధ్ని చూడా మణీయతే ‘’.

304-సిద్ధ సేన దివాకర (100)

‘’న్యాయ వార్త ‘’రాసిన సిద్ధ సేన దివాకరుడు సమంత భద్ర తో పాటు ఉటంకింప బడ్డాడు .ఇద్దరు  రెండురకాల జైన సంప్రదాయాలకు చెందినవారు. ఎవరి సంప్రదాయం లో వారు ఘనులని కీర్తింప బడ్డారు .సిద్ధ సేనుడుకూడా శివ విగ్రహాన్ని తీర్ధంకరుడిగా మార్చాడని ఉంది .కొన్ని సందర్భాలలో ఇద్దరు వేరు కాదు ఒకరేనేమోనని పిస్తుంది .కాని హరి భద్ర సూరి, జిన సేనులు వీరిద్దరిని వేరు వేరు వ్యక్తులుగా పేర్కొన్నారు దివాకరుని తల్లి దేవాశికా.తండ్రి ఉజ్జయిని రాజ పురోహితుడు .వృద్ధ వాదిగురువుకు శిష్యుడై కుముద చంద్ర గా గుర్తింపు పొందాడు .సూరి బిరుదు పొందాడు .తర్వాతపేరు సిద్ధ సేన దివాకర అయింది .ప్రాకృత సాహిత్యాన్ని అంతటినీ సంస్కృతం లోకి మార్చేస్తానని ఒక సారి గురువు తో అన్నాడు .ఈ తప్పుకు గురువు ‘’పరాహ్నిక ప్రాయశ్చిత్తం ‘’చేయించాడు .పన్నెండేళ్ళు మూగగా ఉండి పవిత్ర క్షేత్ర  సందర్శనం  చేస్తూ గడపమన్నాడు .అలా తిరుగుతూ ఉజ్జయిని చేరాడు .మహా కాళ దేవాలయం లో బస చేశాడు .శివుని యడల భక్తీ చూపక పోవటం తో పూజారులు అసహ్యిన్చుకొన్నారు .విక్రమాదిత్యునికి చెప్పారు ఆయన వచ్చి సిద్ధ సేనుడిని శివుడికి మొక్కమన్నాడు .’’కళ్యాణ మందిర ‘’మంత్రాలను చదువుతూ శివ లింగాన్ని జైన తీర్ధన్కరుడిగా మార్చాడు .అతని ప్రతిభకు మెచ్చి విక్రమాదిత్యాదులు జైన తీర్ధం పుచ్చుకోన్నారట .దీన్ని జ్ఞాన సెందు ఆది పురాణం లో రాశాడు .

305-ఏకనాధుడు (1528-1609)

దేవగిరికి చెందిన జనార్దన పంత్ కొడుకు ఏకనాధుడు .తీర్ధ యాత్రలు చేస్తూ అద్భుతాలు ప్రదర్శించాడు .మహారాష్ట్ర భక్తకవి శేఖరులలో నామదేవ ,తుకారాం ల మధ్య ఏకనాదుడిని నిలిపారు .భక్తిమార్గ ప్రబోధకుడు .1528-1609ల మధ్య జీవించాడు .మరాఠీ గీతాలేకాక ‘’హస్తామలకం ‘’,స్వాత్మ సుఖం ‘’అనే వేదాంత గ్రంధాలు రాశాడు .భగవద్గీత పదకొండవ అధ్యాయానికి విస్తృత వ్యాఖ్యానం రాశాడు .

306-మహా రాజ మూడవ కృష్ణ రాజ ఒడియార్ (1785

1785లో జన్మించిన కృష్ణ రాజ ఒడియార్ మైసూరు రాజు విద్వత్ కవి ,కవి జనాభిరాముడు .ఈ రాజు రాసిన ‘’దేవతా ధ్యాన మాలిక ‘’అనేక దేవీ దేవతా స్తోత్రకదంబం .చిత్రాలతో సహా ఉన్నాయి .’’సూర్య చంద్రాది వంశావతరణం ‘’1857లో రాయబడిన రామాయణ మహా భారత౦ కు చెందినవి, యదురాజ, కృష్ణ రాజ పరాక్రమాలకు సమంధించిన వంద కధలు .’’కృష్ణ కదా పుష్ప మంజరి ‘’చాముండీ మంగళ మాలిక ,మృత్యుంజయ స్తోత్రం, రామాయణ కదా పుష్ప మంజరి కూడా రాజావారి రచనలే .మైసూరులో ముద్రింప బడినాయి .

307-కస్తూరి శివ శంకర శాస్త్రి (1833-1917)

అమలాపురం తాలూకా కూచి మంచి వారి అగ్రహారం లో 1833లో జన్మించాడు .ఎనభై మూడవ ఏట 1917లో మరణించాడు .వాదూలస గోత్రానికి చెందిన నియోగి బ్రాహ్మణుడు .ఇతని వంశం వారు స్థానిక రాజుల నవాబుల ఆస్థాన మంత్రులు.వేదం తో బాటు రాజకీయ వ్యవహారాలలోనూ చురుకుగా ఉండేవారు .వీరికి ‘’దేశ పాండ్య ‘’అనే గౌరవ స్థానం ఉండేది ఈ గౌరవం మనకవి చిన్నతనం లో తండ్రివరకు ఉండేది .వీరేశ లింగం గారు ఇతని తండ్రికి పెద్దన్నగారు .ఆయన వరకు రాజ భ్రుతి వచ్చేది .శాస్త్రి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజి లో కళావిభాగం లో పాతికేళ్ళు పని చేశాడు .శివానంద లహరి ‘’స్తోత్రకదంబం ,ద్వాదశ మంజరి ,సముద్రాస్టకం,శూలపాణి శతకం నృసింహ స్తోత్రంమొదలైన వి రాశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-8-15- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సమశ్యల పరిష్కారానికి – సామ,దాన ,బేధ, దండోపాయాలన్నది – భగవద్గీత

IMG_20150825_190959

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 292-కనక లత కావ్య నిర్మాత -కళ్యాణ రామ శాస్త్రి –(1862-)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

292-కనక లత కావ్య నిర్మాత -కళ్యాణ రామ  శాస్త్రి –(1862-)

శుభ లక్ష్మి ,పార్దియూర్ కృష్ణ శాస్త్రి ల కుమారుడు కళ్యాణ రామ శాస్త్రి  . .తంజావూర్ రాజాస్థానం లో తండ్రి తాత పెద్ద ఉద్యోగాలో ఉండేవారు .మద్రాస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఆఫీసర్ గా పని చేసి రిటైరై తంజావూర్ లో ఉన్నాడు .సుసంపన్నమైన పాండిత్యం సంస్కృతభాషలో ఉన్నవాడు .’’కనక లత’’అనే శృంగార కావ్యాన్ని రాశాడు .దీనికి మాతృక షేక్స్ పియర్ రచన లూక్రేసి .

ఈతని తండ్రి కృష్ణ శాస్త్రి 1842-1911కాలం వాడు .తంజావూర్ జిల్లా కాడంబాడిలో జన్మించాడు .సేన్గాలి పురం లో విద్యానాధ దీక్షితుల వద్ద విద్య నేర్చాడు .రామాయణాది పురాణాలను విశ్లేషించి ఉపన్యాసాలివ్వటం లో మహా నేర్పున్న వాడు .ఆయన రాసిన ‘’రస నిష్యందిని ‘’రామాయణం లోని కొన్ని కాండలకు బ్రహ్మాండమైన భాష్యం .’’కౌముది సోమం ‘’లో ప్రేమ పై నాటకం .ఇందులోనూ రామాయణం ను అంతర్గతం గా  ఆవిష్కరించాడు .’’మీనాక్షి శతకం ‘’,’’మాలినీ శతకం ‘’,హనుమత్ శతకం ‘’లక్ష్మీ నృసింహ శతకం ‘’చాలా పేరు పొందాయి. భక్తికి పరాకాష్టగా నిలిచాయి .’’కలి విలాస మదిరాపానం ‘’వ్యంగ్యాత్మక రచన .

293-మందారవతి రాసిన -కపిస్థలం కృష్ణ మాచార్య 91883-1933)

తిరుపతికి చెందిన కౌశిక గోత్రీకుడు రంగా చార్య కుమారుడు కృష్ణమాచార్య .1883లో జన్మించాడు –చిన్ననాటినుంచే కవిత్వం అల్లేవాడు .ఈయన చినతాత దేశికాచార్య వేదాంత ,భాషా శాస్త్రాలలో ఉద్దండ పండితుడు .సంస్కృతం లో వివిధ విషయాలపై వ్యాసాలూ చాలా రాశాడు .’’విలాప తరంగిణి ‘’’’భాణ రసార్నవ తరంగిణి ‘’కావ్య కర్తకూడా .’’మందారవతి ‘’అనేది శృంగార రచన .ఇందు సభ్య శృంగారం విరగ బూసింది .మహాకావ్య లక్షణాలను ఆధునిక భావాలతో రంగరించి రాసిన కావ్యం ఇది .1933లో మరణించాడు .

ఈయన తండ్రి రంగాచార్య గొప్ప పండితుడు .’’అలంకార సార సంగ్రహం ‘’రాశాడు .సుభాషిత శతకం ,’’శృంగార నాయికా తిలకం ‘’’’పాదుకా సహస్రారావతార కదా సంగ్రహం ‘’కూడా రాశాడు  .గోదా దేవిపై ‘’చూర్నిక ‘’రచించాడు .’’రహస్యత్రయ సారా రత్నావళి .సన్మతి కల్ప లత లు వేదాంతా ధోరణిలో రాసిన రస గుళికలు .

294-కాదంబరిలాటి జయంతిక కర్త-జగ్గూ ఆల్వార్ అయ్యంగార్( 1800)

ఈయననే కవివర జగ్గు శ్రీ వకుళ భూషణ అంటారు .మైసూర్ లోని మెల్కోటేకు చెందిన ‘’బాల ధన్వి ‘’ కుటుంబానికి చెందినవాడు .తండ్రి తిరుమార రాయ .జగ్గు గొప్పకవిగా పేరు పొందాడు .కాదంబరి లాంటి ‘’జయంతిక ‘’కావ్యాన్ని నవ రసభరితం గా ఇరవై వ ఏటనే రాసిన పరిణత బుద్ధి ఆయనది .’’శ్యమంతక ‘’,అద్భుతాంశుక ‘’నాటకాలను రచించాడు ఇందులో రెండవది వేణీ సంహారానికి ఉపోద్ఘాతమే .’’కరుణారస సత్సరంగిణి ‘’,హయగ్రీవ స్తోత్రం ‘’కూడా రాశాడు .i

ఇతని సోదరుడు సింగార అయ్యర్ ‘’శ్రీ కృష్ణ రాజ చంపు ‘’,యదుశైల చంపు ,చిత్రకదా రహస్యం అనే యమకం రాశాడు. బాబాయి వేంకటాచార్య ‘’గ్రాన్దీ వర చరిత్ర ‘’,రామానుజ మతభాష విలాసం ,’’కావేరి మహిమాదర్షం ‘’లేక శ్రీకృష్ణ రాజ సేతు బంధనం ‘’,(కన్నంబాడి డాం పై )’’యాదవ గిరి మహాత్మ్యా సంగ్రహం ‘’,వ్యాఘ్ర తాక భూ వివర వారుణం ,(హల్కేరి సొరంగం పనులపై )’’కాకన్యోక్తిమాల ‘’’’చంపకాన్యోక్తిమాల ‘’,కస్తూరికాన్యోక్తి మాల తో బాటు అనేక స్తోత్రాలు రాశాడు .వచన రచన గా ‘’దివ్య సూరి వైభవం ‘’రచించాడు .ఇతని తాత ‘’సంపత్కుమార స్తోత్రం ‘’కళ్యాణ పంచిక ‘’,వ్రుత్తి ముక్త సారావళి రాసిన ఘనుడు .కనుక వీరి వంశం లో గీర్వాణం బహు కావ్య మాలలతో శోభించింది .

295-చంద్ర మౌళి నవలా రచయిత -రాజమ్మ (1877

1877 రాజమ్మ కవయిత్రి బెంగుళూరు లో జన్మించింది .మైసూర్ ను పాలించిన టిప్పు సుల్తాన్ ఆస్థాన మంత్రి ప్రధాని గోపాలయ్య వంశానికి చెందినది .గంగాధరయ్య రామ లక్ష్మి జననీ జనకులు .మైసూర్ న్యాయవాది సాంబశివ అయ్యర్ ను పెళ్ళాడింది .మద్రాస్ విల్లింగ్టన్ కాలేజిలో సంస్కృత పండితురాలు .సాంఘిక దురన్యాయాలపై ‘’చంద్ర మౌళి ‘’నవల రాసింది .

296-‘’విద్వత్ చరిత పంచకం ‘’కర్త -కిస్టే నారాయణ శాస్త్రి (1900

సాహిత్యాచార్య కిస్టే నారాయణ శాస్త్రి కాశి లోని సరస్వతి భవన్ గ్రందాలయాదికారి .’’విద్వత్ చరిత పంచకం ‘’అనే పేరిట అనేక మంది గొప్ప గొప్ప విద్యా వేత్తల జీవిత చరిత్రలను రాశాడు .సులభ శైలీ చక్కని వివరణ తో పుస్తకం రక్తి కట్టింది .

297-కాశీలో సంస్కృత శతావధానం చేసిన -మానవల్లి గంగాధర శాస్త్రి (1834-1914)

నృసింహ శాస్త్రి కుమారుడైన గంగాధర శాస్త్రి తెలుగు బ్రాహ్మణుడు .బెంగుళూరు దగ్గర వాసర గట్ట లో1834 లో జన్మించాడు .తండ్రి కాశీలో స్థిరపడి ‘’కావ్యాత్మ సంశోధన ‘’రాశాడు .గంగాధరుడు రాజారామ శాస్త్రి, బాల శాస్త్రి వంటి గొప్ప పండితుల వద్ద విద్య నేర్చాడు. వారి జీవితాలపై చక్కని వ్యాసాలూ రాశాడు .1879లో కాశీలోనే సంస్క్రుతాచార్యుడయ్యాడు .వేలాది విద్వజ్జన సమక్షం లో సంస్కృత శతావధానం చేసి అందరి మెప్పూ పొందాడు .పృచ్చక ప్రశ్నలకు అలవోకగా సమాధానాలు చెప్పి ఆశ్చర్య పరచాడు శాస్త్రి .వ్యాకరణం పై అనేక వ్యాసాలూ ,రస గంగాధరం పైమంచి వ్యాఖ్య రాసిన మహా పండితుడు మానవల్లి .1887లో విక్టోరియా రాణి రజతోత్సవ ,ఎడ్వర్డ్ రాజు పట్టాభి షేకోత్సవ సంరంభం లో ‘’మహా మహోపాధ్యాయ’’ ‘’బిరుదునందుకొన్నాడు . 1914లో మరణించాడు .

298-విద్యా మార్తాండ -శివకుమారశాస్త్రి (1848-1919)

1848-1919కాలానికి చెందిన శివకుమార శాస్త్రి రామ సేవక మిశ్ర ,మిత్రాంగి దంపతులకు కాశి లో ఉండి లో జన్మించాడు .ద్వార వంగ ముఖ్యుడైన లక్ష్మీశ వర దేవ ఈతని ప్రాపు .యవ్వనం లో తలిదండ్రులను కోల్పోతే పిన తండ్రి నాగేశ్వర భట్టు కాశీ లో పెంచాడు .లక్ష్మీశ్వర దేవప్రతాపం ‘’అనే కావ్యం రాసి ,అందులో లక్ష్మీశ్వరుని దగ్గర నుండి మహేశ తక్కూర్ వరకు వంశ చరిత్ర వర్ణించాడు .’’యతీన్ద్రజీవన చరిత్ర ‘’కావ్యం లో భాస్కరానంద యోగి జీవిత చరిత్ర చెప్పాడు . విద్యామార్తాండ ,పండిత రాజ మొదలైన బిరుదులూ పొందిన శివకుమార శాస్త్రి1919లో మరణించాడు .

299-దుర్గేశ నందిని సంస్కృత నవల రాసిన -శ్రీ శైల తాతా చార్య లేక తిరుమల తాతాచార్య (–1862-1925)

వెంకట వరదుని పుత్రుడైన తాతాచార్య 1862లో కంచి లో జన్మించి అరవై మూడేళ్ళు జీవించి 1925లో చనిపోయాడు .ఆయన అసాధారణ ప్రజ్ఞా వంతుడు .’’యుగలాన్గుహ్య ‘’,వేదాంత దేశిక చరిత్ర ‘’అనే నాటకాలతో బాటు ‘’దుర్గేశ నందిని ‘’,క్షత్రియ రమణి ‘’అనే నవలలను సంస్కృతం లో బెంగాలీ  నవలల అనువాదంగా  రాశాడు .

300-కావ్య వ్యాకరణ తీర్ధ –హరిచరణ భట్టా చార్య (1879

హరిచరణ భట్టా చార్య 1879లో తూర్పు బెంగాల్లోని విక్రంపూర్ జిల్లా కనుర్గావ్ లో 1879లో బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు .కలకత్తా మెట్రోపాలిటన్ కాలేజీలో సంస్కృత ఆచార్యుడు .’’కపాల కుండల ‘’సంస్కృత నవలను బంకిం చంద్రుని బెంగాలీ నవల ఆధారంగా రాశాడు .’’కర్ణ ధార ‘’, రూప సునిర్ఝర ‘’కావ్య రచన చేశాడు . జాన్ ఫిట్జరాల్డ్  ఇంగ్లీష్ లో రాసిన ‘’ఉమర్ ఖయ్యాం ‘’ను 75సంస్కృత శార్దూల  శ్లోకాలలో రచించి మంచి కీర్తి పొందాడు .మెట్రోపాలిటన్ కళాశాలను ఈశ్వర చంద్ర విద్యా సాగరుడు స్థాపించాడు .కావ్య వ్యాకరణ తీర్ధ ,విద్యా రత్న బిరుదులూ భట్టాచార్య ప్రతిభకు అలంకారాలు .

301-సౌదామిని నవలాకర్త – నరసింహా చార్య (1902)

కర్నాటక దక్షిణ ప్రాంతం కొటీశ్వరలోద్వైత  మహా బాల కుచెందిన  బ్రాహ్మణుడు మహాబాలకు   నరసింహా చార్య .కుమారుడు.1902లో జన్మించాడు .చిన్నతనం లోనే తండ్రిని కోల్పోతే పిన తండ్రులు పెంచి పెద్ద వాడిని చేశారు .మద్రాస్ విశ్వ విద్యాలయం నుంచి సాహిత్య శిరోమణి అందుకొని బెంగుళూర్లోని  శ్రీ చామరాజేంద్ర కాలేజిలో సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు .ఇతని ‘’సౌదామిని ‘’నవల ఎనిమిది అధ్యాయాలు .మగధ రాజు సూరసేనుడు విదర్భ రాజు కాన పాలుని  కుమార్తె సౌదామినిని రహస్యం గా వివాహమాడిన కద ఇది .దీనితో ఆమెను పెళ్ళాడాలనుకొన్నవిజయ వర్మ చేతిలో పరాజయం పొంది రాజ్యాన్ని కోల్పోయి అడవులలో కొత్త జంట తిరుగుతున్నారు ..ఆమెకు అతనిపై ఉన్న వల్లమాలిన ప్రేమ వారిద్దరి దాంపత్య గరిమ ఫలించి చివరికి విజయం సాధించి రాజ్యాన్ని సంపదను తిరిగి పొందటం తో సమాప్తం ..’’భారత కద’’,వ్యాయోగం ‘’,ప్రతిజ్ఞా భార్గవం ‘’కావ్యాలు గొప్ప పేరు పొందాయి భారవి రచన కిరాతార్జునీయం ‘’ను సంగ్రహం గా చెప్పిన తీరునవ్యంగా ఉంటుంది .

302- విశేషణాల ‘’అర్ధ సంగ్రహ’’కర్త -సార్వ భౌమ

సార్వ భౌమకవి ‘’అర్ధ సంగ్రహం ‘’అనే రచన సంక్షిప్త రామాయణమే అయినా విశేషణాలతో అలంకారాలతో వింత సొగసులు దిద్దాడు .’’మహా భారత కదానకం ‘’వచన రచన .’’విరించి నాద చరిత్ర ‘’,’’ డిండిమ వంశానికి చెందిన విరించి నాధుడు .విరించిపురం లోని దైవం గూర్చి చరిత్ర .ఈ కదా సంగ్రహాన్నే సార్వ భౌమ కవి ‘’విరించినాద చరిత్ర ‘’గా రాశాడు .’’రవి వర్మస్తుతి ‘’అనేది కేరళలోని మలబార్ రాజు రవివర్మ పై రాసిన వచన స్తుతి .’’దమయంతి పరిణయం’’కూడా రాశాడు .

‘’సంయోగిత స్వయం వరం ‘’ఆరు అధ్యాయాలుగా రచించాడు .వైద్య అనే పేరున్న పరశురాముడు రాష్ట్ర కూట రాజుజయచంద్రుని కుమార్తె సంయోగిత వివాహ కద .’’పరిహాసాచార’’అనే చిన్న హాస్య వచన రచనా చేశాడు .వరద కాంత విద్యా రత్న కవి ‘’గద్యాదర్శం’’రచించాడు .బిజాపూర్ సుల్తానులచరిత్రను ‘’విజయ పురకద ‘’గా ,’’వేల్లపురీశ గద్య ‘’లో వెల్లూరు రాజు కేశవ రాజు చరిత్రను రాశాడు .మహేశ ఠాకూర్ ‘’సర్వ దేశ వృత్తాంత సంగ్రహం ‘’లో అక్బర్ చక్రవర్తి పరిపాలన వర్ణించాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-8-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వెండితెర కన్యా శుల్కానికి షష్టి పూర్తీ- వగైరా

kanyasulkam1 001 kanyasulkam2 001 punadi 001 svara 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మనమే బాస్

boss1 001 boss2 001 boss3 001 boss4 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పెద్దనగారి ఉత్పల మాలిక అర్థ తాత్పర్య విశేషాలు 25-08-2015

 

tadepallit@yahoo.in

utpala maalika

నమస్తే పతన్జలిగారు -పెద్ద నగారి పెద్ద పద్యానికి  హృద్యమైన అర్ధ తాత్పర్యాలు మీ లేఖిని నుండి వెలువడి ఈ తరానికి కూడా ఆహ్లాదాన్ని కలిగి౦చిన్ది  .ఈ  పద్యం చూసినప్పుడు నాకు రెండు  విషయాలు  స్పురణకు వస్తున్నాయి  మేము  తొమ్మిదో తరగతి లో(1954) లో ఉండగా ”ప్రవారాఖ్యుడు ”పేరు తో పద్య భాగం ఉండేది అందులోని పద్యాలన్నీ బట్టీ పట్టేశా    . అర్ధ తాత్పర్యాలతో ఉన్న మను చరిత్రను  లైబ్రరీ నుండి ఇంటికి తెచ్చుకొని ,నా సహాధ్యాయులకు చదివి వినిపిస్తూ అందులోని అన్నివిశేషాలను  వివరించి  చెప్పేవాడిని అదొక మధురాను భూతి .

రెండవ అనుభూతి నేను 1963-లో మోపిదేవి హైస్కూల్ లో సైన్స్ మాస్టారు గా ఉద్యోగ జీవితం ప్రారంభించినపుడు అక్కడ కూచి భొట్ల సత్యనారాయణ అనే జూనియర్ తెలుగు పండిట్ తో గాఢ స్నేహమేర్పడింది ఆయన మహా అందంగా పద్యం చదవ గలడు ,అంత అందంగా భావమూ విడమర్చి చెప్పగలడు . ఖాళీ కనిపిస్తే మా ఇద్దారికీ సాహిత్య వ్యాసంగమే .ఒకసారి ఈ పద్యం విషయం వచ్చింది .నాకు ఆ పద్యం నోటికి వచ్చా అని అడిగాడు రాదు అని చెప్పాను నీకు వచ్చా అని అడిగా వచ్చు కాని మర్చి పోయానన్నాడు .ఇద్దరమ్ పందెం వేసుకొని వారం రోజుల్లో ఆ సుదీర్ఘ ఉత్పలమాలను కంఠత పట్టి తప్పులు లేకుండా ఎవరు చెప్పగలరో పందెం కాద్దాం అన్నాడు సరదాగా సరేనన్నాఆయన తెలుగు పండితుడు నేను తెలుగులో ఔత్సాహికుడిని .. ఇద్దరం వారం కుస్తీ పట్టి సాధించాం ఒకరి తర్వాత ఒకరం అప్పగించుకోన్నాం ఆయన దానిలో రెండో మూడో తప్పులు దొర్లాయి. నా దానిలో ఒక్క పోరబాటూ రాలేదు  ఆయన నన్ను అభి నందించి .”ప్రసాదూ భలేవాడివయ్యా పండిట్ నే ఓడించావు అభినందనలు .”అన్నాడు నిండు మనసుతో మా స్నేహం దానితోమరింత పెరిగింది ఒకసారి ఉయ్యూరులో మా ఇంటికి ఆయనతో బాటు  మా మిగిలిన మిత్రులు జమ్మలమడక రమణారావు ..అనే లెక్కల మేష్టారు ,కృత్తివెంటి నరసింహా రావు అనే సెకండరీ గ్రేడ్ మేష్టారు వచ్చి మా ఆతిధ్యం స్వీకరించి స్నేహానికి ఉదాహరణ గా నిలిచారు ఇందులో ఆ ముగ్గురూ స్వర్గస్తులయ్యారు .. మీ పద్య విహారం ఇంత ఫ్లాష్ బాక్ కు కారణమైంది ధన్యవాదాలు -దుర్గాప్రసాద్  0001 0002 0003 0004 0005 0006 0007
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సమరం కాదు.. సయోధ్య కావాలి! (23-Aug-2015)

సమరం కాదు.. సయోధ్య కావాలి! (23-Aug-2015)
రాష్ట్ర విభజన జరిగి 15 మాసాలు అవుతున్నా రాజకీయాలలోనే కాకుండా కింది స్థాయిలో కూడా విద్వేషాలు కొనసాగుతున్నాయా? క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంజు కోకపోవడానికి అక్కడ పెట్టుబడులు పెట్టడానికి సీమాంధ్రులు సుముఖత చూపకపోవడమే కారణమని ఈ మధ్యనే ఒక ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ప్రతినిధి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు పూర్వం సెంట్రల్‌ ఆంధ్ర నుంచి ప్రతి నెలా 30 నుంచి 40 కోట్ల రూపాయలను హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడిగా పెట్టేవారనీ, ఇప్పుడు ఒక్క పైసా కూడా రావడం లేదని ఆయన వాపోయారు. అదే సమయంలో తెలంగాణకు చెందిన ఒక ఉత్పత్తుల సంస్థ అధిపతి మాట్లాడుతూ, మా ఉత్పత్తులకు ఏపీలో కూడా పంపిణీదారులు ఉన్నారు. అయితే విభజన తర్వాత వారు వాణిజ్య పన్ను రిటర్న్స్‌ దాఖలు చేయడానికి సంబంధిత కార్యాలయాలకు వెళ్లినప్పుడు ‘‘మీరు తెలంగాణలో ఉత్పత్తి అయ్యే వస్తువులకు డీలర్‌షిప్‌ ఎందుకు తీసుకున్నారు? ఇతర రాష్ర్టాలలో అవే ఉత్పత్తులు ఉంటాయి కదా! వాటి డీలర్‌షిప్పులు తీసుకోవచ్చు కదా! తెలంగాణ ఉత్పత్తులకు డీలర్స్‌గా ఉంటే ఏదో ఒక మిషతో మీకు ఇబ్బందులు కలిగిస్తాం’’ అని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ట్రాన్స్‌పోర్ట్‌ రంగంలో కూడా ఇటువంటి సమస్యే ఎదురవుతోంది. తెలంగాణలో రిజిస్టర్‌ అయిన వాహనాలు ఏపీకి వెళ్లినప్పుడు అక్కడి రవాణా శాఖ అధికారులు కేసులు పెట్టి చలాన్లు వేస్తున్నారు. ఏపీలో రిజిస్టర్‌ అయిన వాహనాలకు తెలంగాణలో ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఈ విద్వేష ధోరణి ప్రజలలో కంటే ఉద్యోగులలో ఎక్కువగా కనిపిస్తోంది.

హైదరాబాద్‌లో ఏపీ- తెలంగాణ ఉద్యోగుల మధ్య నిత్యం ఏదో ఒక వివాదం తలెత్తడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ ధోరణి వల్ల వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి దృష్ట్యా వారు ఇవన్నీ బయటకు చెప్పుకోలేకపోతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని తీసుకుందాం. ఈ రంగంలో ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెట్టే స్థోమత తెలంగాణవారికి అంతగా లేదు. హైదరాబాద్‌లో ఉంటున్న ఉత్తరాదివారికి సొంత ఇల్లు అనేది చివరి ప్రాధాన్యం. డబ్బుంటే వారు వ్యాపారాలలోనే పెట్టుబడి పెడతారు. తమ పిల్లల పేరిటే కాకుండా వారికి పుట్టబోయే వారి కోసం కూడా ఇళ్ల స్థలాలు, ఫ్లాట్‌లు కొని పెట్టుకునే సంస్కృతి సీమాంధ్ర ప్రజలకే సొంతం. దీంతో ఇప్పటివరకు వారు తమ ఆదాయాన్ని హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడి పెడుతూ వచ్చారు. విభజన తర్వాత పరిస్థితి మారిపోయింది. రాజకీయ నాయకుల ప్రకటనలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఫలితంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉన్నవారు అనేక ఇబ్బం దులు పడుతున్నారు. ఇదివరకే చేపట్టిన ప్రాజెక్టులు అమ్ముడు కాకపోవడం వల్ల వాటిని పూర్తిచేయడం కోసం అప్పులు చేస్తూ పోతున్నారు. ఈ రంగంలోని పెద్ద కంపెనీలు పరిస్థితిని తట్టుకోగలుగుతున్నాయి గానీ, చిన్న చిన్న కంపెనీలకు చెందినవారు మాత్రం చిక్కుల్లో పడుతున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగడం అవసరమా? ఇండియా-పాకిస్థాన్‌ తరహాలో ఏపీ-తెలంగాణ ప్రజలు పరస్పర ద్వేషం పెంచుకోవడం అవసరమా? అందరం తెలుగువారమే అని నోటి చివరి నుంచి వస్తున్న మాటలు మనస్సులోంచి ఎందుకు రావడం లేదు? తమిళులు, కన్నడిగులను, చివరకు ఉత్తరాదివారిని కూడా సహిస్తున్న మనం సాటి తెలుగువారిని ఎందుకు సహించలేకపోతున్నాం? ఎవరికి ఇష్టమైనా, కాకపోయినా 58 సంవత్సరాల పాటు కలిసి జీవించిన వాళ్లమే కదా! విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉందామని చెప్పినవారైనా ముందుకు రావచ్చు కదా! విద్వేషాల వల్ల రాజకీయ నాయకులకు పబ్బం గడుస్తుండవచ్చు గానీ, వ్యాపారాలు చేసుకునేవారు నలిగిపోతున్నారు.
 
 సీఎంలతో ఆరంభం..

ఈ పరిస్థితి మారాలంటే, రెండు తెలుగు రాష్ర్టాల మధ్య, ప్రజల మధ్య సఖ్యత ఏర్పడాలంటే ఉభయ రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య తొలుత సయోధ్య ఏర్పడాలి. అయితే పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అక్కరకు రాని సెంటిమెంట్ల వల్ల అధికారంలో ఉన్నవారికి లాభం కలుగుతూ ఉండవచ్చు గానీ, అది తెలుగు రాష్ర్టాల అభివృద్ధికి ఉపయోగపడదు. తెలుగు రాష్ర్టాల మధ్య చోటుచేసుకుంటున్న వివాదాల వల్ల మనం ఇతరుల దృష్టిలో చులకన అవుతున్నాం. పెట్టుబడులు పెట్టేవారు కూడా ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తు న్నారు. తెలుగు రాష్ర్టాలైన తెలంగాణ-ఏపీల్లో పెట్టుబడుల కోసం జరుగుతున్న పోరాటం, ఆరాటం హాస్యాస్పదంగా ఉందని ఒక పారిశ్రామికవేత్త వ్యాఖ్యానించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య పోటీ పెట్టి లాభపడటానికి మా వాళ్లు ప్రయత్నిస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. పోటీ అనేది ఆరోగ్యకరంగా ఉండాలి. కానీ ప్రస్తుతం అలా లేదు. తెలంగాణలో పెట్టుబడులు రాకుండా ఉంటే మంచిదని ఆంధ్రా వాళ్లు, ఏపీలో పెట్టుబడులు రాకుండా ఉంటే బాగుండునని తెలంగాణ వాళ్లు భావించే దుస్థితి ఏమిటి? ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, చంద్రశేఖర్‌రావు మధ్య మొదలైన ఓటుకు నోటు, టెలిఫోన్‌ ట్యాపింగ్‌ యుద్ధం వల్ల జాతీయ స్థాయిలో మనం నవ్వుల పాలవుతున్నాం. ఈ రెండు కేసులలో డ్రైవర్లు, గన్‌మన్లకు సంబంధిత దర్యాప్తు సంస్థల అధికారులు నోటీసులు జారీ చేయడం హాస్యాస్పదంగా మారింది. ఈ ప్రహసనంవల్ల ఇరువురు ముఖ్యమంత్రులూ పలుచన అవుతున్నారు. ఈ రెండు కేసులనూ కొనసాగించదలచుకుంటే వాటి మంచి చెడులను దర్యాప్తు సంస్థలకు వదిలివేయాలి. అలాకాకుండా ‘తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా’ అన్నట్టుగా ఇరు ప్రభుత్వాలూ వ్యవహరిస్తున్నాయి. మూడు నెలలుగా ఇదే గొడవ. దీంతో అసలు సమస్యలు మరుగునపడిపోతున్నాయి.

రెండు రాష్ర్టాలూ కరువు కోరల్లో చిక్కుకున్నాయి. ఇప్పటివరకు రెండు రాష్ర్టాల తాగు, సాగు నీటి అవసరాలను తీరుస్తూ వచ్చిన శ్రీశైలం, నాగార్జున సాగర్‌, జూరాల, శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టులు నీళ్లు లేక బావురు మంటున్నాయి. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులలో నీటి లభ్యత ఇకపై ప్రశ్నార్థకం కాబోతోంది. లేని, రాని నీటి కోసం కొట్లాడుకుంటున్న తెలుగు రాష్ర్టాల ప్రభుత్వాలు ఈ దుస్థితికి కారణాలపై మాత్రం దృష్టిపెట్టడం లేదు. కృష్ణా నదిపై ఇటు కర్ణాటకలో, గోదావరి నదిపై అటు మహారాష్ట్రలో అడ్డగోలుగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. విచిత్రమేమిటంటే ఈ ప్రాజెక్టుల నిర్మాణం కాంట్రాక్టులను పొందింది కూడా మన తెలుగు వారే! ఆ రాష్ర్టాలలో ఏమి జరుగుతున్నదో మన కాంట్రాక్టర్లను అడిగితే పూసగుచ్చినట్టు చెబుతారు. తెలుగు జాతికి తీవ్ర నష్టం కలిగిం చబోతున్న ఈ అంశాన్ని పట్టించుకోకుండా గిల్లి కజ్జాలతో కాలక్షేపం చేయడం వల్ల తెలుగు జాతికి అపకారం చేసినట్టు కాదా! లేని నీళ్ల కోసం మనం కొట్లాడుకోవడం ఏమిటి? రావ లసిన నీళ్లను రాకుండా అడ్డుకుంటున్న వారిని నిలువ రించకపోవడం ఏమిటి? మీడియా పుణ్యమా అని కర్ణాటకలో జరుగుతున్న ప్రాజెక్టుల నిర్మాణం గురించి తెలిసివచ్చింది. ఆలమట్టి డ్యామ్‌ నిర్మాణాన్ని అయిదు మీటర్ల ఎత్తు పెంచాలని కర్ణాటక ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. అదే జరిగితే కృష్ణా జలాలపై మనం ఆశలు వదులుకోవలసిందే! గతంలో ఇలాంటి ప్రయత్నం జరిగినప్పుడు ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు కేంద్రంలో తన పలుకుబడిని ఉపయోగించి నిలువరించగలిగారు. అప్పుడు కర్ణాటకకు చెందిన దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా ఉన్న జ్యోతిబసు నేతృత్వంలో ముఖ్య మంత్రుల కమిటీని వేయించి, కర్ణాటక ప్రయత్నాలను ఆపగలి గారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే జరగాలి. అయితే ఇప్పుడు చంద్రబాబు ఒక్కరే కాకుండా తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా ఈ విషయంలో కలిసి రావాలి. ఇరువురు ముఖ్య మంత్రులు ముందుగా ఒకచోట కూర్చుని పరిస్థితిని సమీ క్షించాలి. కృష్ణా, గోదావరి జలాల్లో మనకు రావలసిన వాటా పొందడంపై సంయుక్త కార్యాచరణకు వ్యూహ రచన చేయాలి. గోదావరి జలాల్లో తెలంగాణ వాటాగా లభించే 900 పైచిలుకు టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి ప్రాజెక్టులకు రూప కల్పన చేయాలని కేసీఆర్‌ తరచుగా అధికారులను ఆదేశిసు ్తన్నారు. నీరు ఉంటే కదా ప్రాజెక్టుల రూపకల్పన చేయడానికి! శ్రీశైలం నుంచి 300 టీఎంసీల నీటిని వాడుకోవడానికి వీలుగా ప్రతిపాదించిన పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇప్పటికే శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేనాటికి అక్కడ నీళ్లు ఉండొద్దా? కర్ణాటకలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి అయితే పుష్కరానికి ఒక్కసారి కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నిండే అవకాశం లేదేమో! వర్షాభావ పరిస్థితులలో కూడా ఏపీని అదుకోవడానికి గోదావరి జలాలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఏపీకి సాగు, తాగు నీటి సమస్య దాదాపుగా తీరినట్టే! తెలంగాణ పరిస్థితి అందుకు విరుద్ధం. ఎగువన ఉన్నప్పటికీ గోదావరి జలాలను ఒక పరిమితికి మించి వినియోగించుకోలేని భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో కురిసే వర్షాల వల్ల వచ్చే నీరంతా భద్రాచలం దిగువన గోదావరిలో కలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఆశయం మంచిదే కానీ నీళ్లు ఉండాలి కదా! పుష్కర స్నానం చేయడానికే గోదావరిలో నీళ్లు లేక కడెం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలాల్సిన పరిస్థితి చూశాం. శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు జలాశయం అడుగంటడంతో ఇప్పుడు అక్కడ పశువులు మేత కోసం తిరుగుతున్నాయి. ఈ కఠోర సత్యాలను విస్మరించి రాజకీయ గారడీలు చేసుకుంటూ పోవడం వల్ల తెలంగాణకే ఎక్కువ నష్టం జరుగుతుంది.
సీన్‌ మారుతోంది!

ఈ పరిస్థితులలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఏర్పడటం అత్యంత అవసరం. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు భాగస్వామిగా ఉన్నారు. కృష్ణా నదిపై కర్ణాటక చేపడుతున్న నిర్మాణాలను అదుపు చేయడానికి ఆయన పలుకుబడిని మరోమారు ఉపయోగించుకోవాలి. ఇరువురు ముఖ్యమంత్రులూ రాజకీయాలు పక్కనపెట్టి ఒక్కతాటి పైకి వచ్చి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలి. భారీ వరదలు వస్తేనే శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు నీరు వచ్చే దుస్థితిని పోగొట్టడానికి పాటుపడాలి. ఎగువన ఉన్నవాళ్లు తమకు కేటాయించిన నీటిని పూర్తిగా వినియోగించుకున్నాకే దిగువకు వదిలే విధానం పోవాలి. అందుబాటులో ఉన్న నీటిని దామాషా పద్ధతిలో పంచుకునే విధానం రావాలి. నాగార్జున సాగర్‌ ఎండిపోయి కనిపిస్తుండగా, ఆలమట్టి రిజర్వాయర్‌ నిండు కుండలా ఉంది. ఈ పరిస్థితులలో అందుబాటులో ఉన్న నీటిని కూడా పంచుకునే విధానం అమలులోకి రావాలి. కృష్ణా జలాలపై ఆలస్యంగా మేలుకొన్న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. ఇది తెలంగాణ సమస్య మాత్రమే కాదు కనుక ఏపీ ప్రభుత్వం కూడా జత కలవాలి. ఉభయ రాష్ర్టాల ప్రభుత్వాలూ సుప్రీంకోర్టులో ఒకటే వాదన వినిపించేలా కృషి జరగాలి. ముందుగా మనకు రావలసిన వాటాను ఎంతో కొంత సాధించుకోగలిగితే, ఆ తర్వాత ఆ నీళ్లను పంచుకోవడం ఎలా అన్న దానిపై రెండు తెలుగు రాష్ర్టాలూ కొట్టుకున్నా అర్థం ఉంటుంది గానీ లేని, రాని నీళ్ల కోసం గొడవ పడుతూ మైదానాన్ని ఎగువ రాష్ర్టాలకు అప్పగించడం అవివేకం అవుతుంది. ఉభయ రాష్ర్టాలూ ఇలాగే చీటికి మాటికి సిల్లీ విషయాలలో గొడవ పడుతూ ఉంటే పిట్టపోరు పిట్ట పోరు పిల్లి తీర్చిన చందంగా మన పరిస్థితి మారుతుంది. ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు ఆలోచననలో మార్పు వచ్చినట్టుగా కనిపి స్తోంది. హైదరాబాద్‌లో ఉంటూ రోజు గొడవపడే బదులు విజయవాడ నుంచి పరిపాలన సాగించాలని ఆయన నిర్ణయిం చుకున్నారు. ఒక్క ఆదివారం మాత్రమే కుటుంబ సభ్యులతో గడపడానికి హైదరాబాద్‌ వచ్చి మిగతా ఆరు రోజులు విజయవాడకే పరిమితం కావాలన్న నిర్ణయాన్ని ఆయన రెండు వారాలుగా అమలు చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా ఇరిటేషన్‌ తగ్గవచ్చు. ‘‘మా గడ్డ మీద ఉంటూ, మా నీళ్లు తాగుతూ మీ పంచాయితీ ఏమిటి?’’ అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ వంటి వారి వ్యాఖ్యలు చంద్రబాబుపై పనిచేసినట్టు కనిపిస్తున్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను కూడా ఆ రాష్ట్ర తెలుగుదేశం నాయకులకే వదిలివేయాలన్న ఆలోచనకు చంద్రబాబు వచ్చా రని చెబుతున్నారు. పాలనాప రమైన విషయాలలో తెలంగాణ ప్రభుత్వంతో వివాదపడే బదులు సామరస్యంగా వ్యవహరిం చాలన్న అభిప్రాయానికి కూడా చంద్రబాబు వచ్చా రని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే శుభ పరిణామమే. అవును.. ప్రభుత్వాలు వేరు- రాజకీయ పార్టీలు వేరు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, తెలుగుదేశం పార్టీలు రాజకీయంగా తలపడవచ్చు గానీ ఏపీ- తెలంగాణ ప్రభుత్వాలు తలపడటం ఎందుకు? అయితే ఇద్దరు చంద్రులూ ఒక దగ్గర కూర్చుని మాట్లాడు కోవడానికి ఇరువురిలో అహం అడ్డువస్తున్నట్టుగా కనిపిస్తోంది. నిజానికి ఇరువురూ ముఖ్య మంత్రులే కనుక ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే మధ్యవర్తులు కావాలి. మామూ లుగా అయితే ఇటువంటి పరిస్థితులలో గవర్నర్‌ నరసింహన్‌ చొరవ తీసుకోవాలి. కానీ ఆయనపై ఇరువురు ముఖ్య మంత్రులకు నమ్మకం ఉన్నట్టు లేదు. అంతేకాకుండా గవర్నర్‌ నరసింహన్‌ను త్వరలో తొలగించ వచ్చునని కేంద్రం నుంచి సమాచారం అందుతోంది. తెలుగుదేశం, శివసేన, అకాలీదళ్‌ పార్టీలకు చెందిన వారికి తలా ఒక గవర్నర్‌ పదవి ఇవ్వాలన్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. తెలుగుదేశం కోటా కింద మోత్కుపల్లి నరసింహులు పేరును తెలుగుదేశం పార్టీ సిఫారసు చేయబోతోంది. బహుశా మరో నెల రోజుల్లో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చవచ్చు. నరసింహన్‌ స్థానంలో కొత్తగా వచ్చే గవర్నర్‌ ఎవరో తెలియదు కనుక ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య మధ్యవర్తిత్వం నెరిపే బాధ్యతను తీసుకోవడానికి కొంతమంది పారిశ్రామిక, వ్యాపారవేత్తలు ముం దుకు వస్తున్నారు. ఈ విషయమై ఇరువురు ముఖ్యమంత్రుల వద్ద ప్రతిపాదనలు ఉంచారు. ప్రస్తుతానికి ఇరువురూ ఇందుకు సుముఖంగానే ఉన్నట్టు చెబుతున్నారు. సమరం కంటే సయోధ్య ఎప్పటికైనా మేలు అన్న సంగతి మన ముఖ్య మంత్రులు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా సెంటిమెంట్‌ ప్రయోగానికి స్వస్తి చెప్పడం మంచిది. ఏదైనా అతిగా ప్రయో గిస్తే వికటిస్తుంది. తెలంగాణలో కూడా పరిస్థితులు మారుతు న్నాయి. ప్రజల్లో అసహనం మొదలవుతోంది. ప్రతిదానికీ ఏపీని బూచిగా చూపించి ఎంతో కాలం తప్పించుకోలేమన్న నిజాన్ని కేసీఆర్‌ అండ్‌ కో గ్రహించాలి. ముఖ్యమంత్రి మాటలకే పరిమితం అవుతున్నారనీ, ఆచరణలో ఏమీ జరగడం లేదనీ ప్రజలు అభిప్రాయపడే పరిస్థితి నెలకొంది. ఎక్కడకు వెళితే అక్కడ బంగారం చేస్తాననడం కేసీఆర్‌కు అలవాటుగా మారింది. ఆయన అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. తెలంగాణ రాష్ట్రం బలం- బలహీనతలు ఆయనకు ఇప్పటికే అవగతమై ఉండాలి. ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా ఇంత వరకు అమలు కాలేదు. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సుప్రీంకోర్టు కూడా రైతుల ఆత్మహత్యల నివారణకు గట్టి చర్యలు తీసుకోవాలనీ, ఆత్మహత్యలు ఉండకూడదనీ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బంగారు తెలంగాణ- వజ్రాల తెలంగాణ వంటి మాటలు ప్రజలకు త్వరలోనే బోరు కొట్టిస్తాయి. ఏపీలో కూడా పరిస్థితులు మారే సూచనలు కనిపిస్తున్నాయి. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై ఆ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చంద్ర బాబుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సింగపూర్‌, ఇస్తాంబుల్‌ వంటి నగరాలను నిర్మించకపోయినా సౌకర్య వంతమైన రాజధానిని నిర్మిస్తే చాలునని ఆంధ్రా ప్రజలు కోరుకుంటున్నారు.
విభజన సందర్భంగా ఏపీకి అన్యాయం చేశారని చంద్రబాబు ఇంకెంతో కాలం చెప్పుకోలేరు. అన్యాయం జరిగింది కనుకే చంద్రబాబుకు అధికారం అప్పగిస్తే రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారు. 15 నెలల తర్వాత కూడా పాత పాటే పాడటం వల్ల ప్రయోజనం ఉండదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో చంద్రబాబు వైఖరి మారిందని చెబుతున్నారు కనుక, కేసీఆర్‌తో సయోధ్య కుదుర్చుకునే విషయంలో కూడా ఆయన చొరవ తీసుకుంటే ఇరు రాష్ర్టాల ప్రజలూ హర్షిస్తారు. కేసీఆర్‌తో పోల్చితే చంద్రబాబుకు అనుభవం ఎక్కువ. జాతీయ స్థాయిలో కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు స్నేహ హస్తం చాస్తే ఆయన గౌరవం మరింత ఇనుమడిస్తుంది. ఉభయ రాష్ర్టాల మధ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అవసరాల ప్రాతిపదికన నీళ్ల వంటి విషయాల్లో పరిష్కా రాలు వెతుక్కోవచ్చు. ఇరు రాష్ర్టాల మధ్య నెలకొన్న వివాదాలు దాయాదుల పోరుగా ముదరక ముందే పరస్పరం స్నేహ హస్తాన్ని అందించుకోవడం ద్వారా తెలుగు జాతి మరింత నష్టపోకుండా విజ్ఞత ప్రదర్శించాలని ఇరువురు చంద్రులనూ కోరుకుందాం. సంధి కుదర్చడానికి ఎవరు ప్రయత్నాలు చేసినా స్వాగతించవలసిందిగా విజ్ఞప్తి చేద్దాం. ఉభయ రాష్ర్టాలూ పరస్పరం సహకరించుకుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. లేని పక్షంలో ప్రారంభంలో చెప్పినట్టుగా మన వ్యాపారవేత్తలు, మన పారిశ్రామికవేత్తలు, మన ప్రజలే నష్టపోతారు!

యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం: http://www.youtube.com/abntelugutv


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

Click here to Reply or Forward
12.88 GB (85%) of 15 GB used
Last account activity: 14 hours ago

Details

People (2)
gabbita prasad's profile photo
gabbita prasad

4 circles

https://plus.google.com/u/0/_/streamwidgets/canvas

Show details

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దాశరథి నిర్దేశించిన కర్తవ్యం (23-Aug-2015)

దాశరథి నిర్దేశించిన కర్తవ్యం (23-Aug-2015)
డాక్టర్‌ దాశరథి రంగాచార్య ఒక మహా రచయిత. సామాజిక చరిత్రను నవలలుగా మలచిన దాశరథి బహు గ్రంథకర్త. నవలలతోపాటు రామాయణం, మహాభారతాలను, నాలుగు వేదాలను, ఉపనిషత్తులను తెలుగులో అందించారు. 1928 ఆగస్టు 24న జన్మించిన దాశరథి 2015 జూన్‌ 8న పరమపదించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో స్వయంగా పాల్గొని ఆ చరిత్రను అనేక నవలల్లో చిత్రించారు. 1964లో రాసిన ‘చిల్లర దేవుళ్ళు’ నవల మొదలుకొని ‘మోదుగుపూలు’, ‘జనపదం’, ‘మాయజలతారూ’ ‘శరతల్పం’, ‘నల్లనాగు’ ‘అమృతంగమయ’ ‘రానున్నది ఏది నిజం’ దాకా కాలు, చేయి ఆడినంత కాలం రాస్తూనే వచ్చారు. సోషలిజాన్ని స్వప్నించిన రంగాచార్య సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలిపోవడంతో ఆవేదన చెందారు. అయినా సోషలిజం పట్ల ఒక సుమధుర స్వప్నం దాశరథి రంగాచార్య జీవితాన్ని ముందుకు నడిపించింది.
దాశరథి రంగాచార్య మనిషిని, మానవత్వాన్ని మానవీయ విలువలను, సంస్కృతిని గౌరవించి ఆచరించిన మహనీయుడు. దాశరథి గారి రచనలతో 1970 నుంచి నాకు అనుబంధం ఉంది. మా మధ్య వాత్సల్యపూరిత గురుశిష్య, స్నేహ, ప్రేమానుబంధాలు ఉన్నాయి. 1993 ఆగస్టు 24న జరిగిన దాశరథి పురస్కార సభ, వారి జన్మదిన ఆత్మీయ కలయిక నేను మర్చిపోలేని సుమధుర జ్ఞాపకం. సాహిత్యంలో అనేక ప్రశంసలు, విమర్శలు ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న నాకు, ఒక కొత్త కర్తవ్యం గుర్తు చేసింది దాశరథి పురస్కారం. మనం యువతరం రచయితలను ప్రోత్సహించాలి. పురస్కారాలు అందజేయాలి. తద్వారా వారిలో నూతన ఉత్తేజం కలుగుతుంది. ఉత్సాహంగా మరిన్ని రచనలు చేస్తారు. మరింత ఎదుగుతారు. అని అనిపించింది. అలా ఆలోచిస్తూ 1998లో నా 50వ జన్మదిన స్వర్ణోత్స సందర్భంగా మా అమ్మ బీడీ కార్మికురాలు, మిట్టపల్లి లక్ష్మిరాజు పేరిట విశాల సాహిత్య అకాడెమీ ద్వారా పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించాను. వందలాదిమందికి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు అందజేయడం జరిగింది. ఎంతోమంది ఉత్సాహంగా ఎదుగుతూ వచ్చారు. ఈ ఆలోచన, ఆచరణకు నాంది దాశరథి నాకు అందజేసిన పురస్కారం, ఇచ్చిన ఉత్తేజం.
1995 నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మళ్లీ ఉద్యమం ఎక్కడికక్కడ రగులుకుంటున్న కాలంలో అనేక సభల్లో సదస్సుల్లో కలుసుకున్నాము, మాట్లాడుకున్నాము. కాళోజీ, దాశరథి రంగాచార్య, డాక్టర్‌ జయంశంకర్‌, బియ్యాల జనార్దనరావు, నాళం కృష్ణారావు, వి. ప్రకాష్‌, గాదె ఇన్నయ్య మొదలైనవారు ఆనాటి తెలంగాణ స్వరాష్ట్ర భావనలో ఎంతో కృషి చేశారు. రాపోలు ఆనందభాస్కర్‌ తెలంగాణ ప్రగతి వేదిక పేరిట రెండు రోజులపాటు జరిపిన సదస్సులో అనేక ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. సిపిఐ ఎంఎల్‌ జనశక్తి నుంచి విడివడి ప్రత్యేకంగా ఉద్యమం నడుపుతున్న మారోజు వీరన్న తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో సదస్సులు నిర్వహించారు. వీలైన చోటికల్లా దాశరథి రంగాచార్య వచ్చి ప్రసంగించేవారు. భూస్వామ్య వ్యతిరేక నైజాం వ్యతిరేక తెలంగాణ రైతాగ సాయుధ పోరాటాన్ని గొప్పగా ప్రశంసించేవారు. మనం ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ ఎలా మోసపోయామో చెప్పేవారు. తెలంగాణది పోరాట సంప్రదాయమే తప్ప, అధికారం అందుకోవడం కాదని అనేవారు. పోరాటం ఎలా సాగితే బావుంటుందో అనేక సూచనలు చేశారు. దాశరథి చేసిన సూచనలు సాహిత్య సాంస్కృతిక, సామాదశాబ్దాలుగా కలలుగన్న ప్రత్యేక తెలంగాణ రాషా్ట్రన్ని చూడగలిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాక ఎంతో ఆవేదనతో ఎదురుచూస్తూ వచ్చారు. తాననుకున్న విధంగా కాకుండా, అనేక మలుపులు తిరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తీరు పట్ల చాలా అసంతృప్తిగా ఉండేవారు.
ముందు తరాలకు మార్గదర్శిగా నిలిచిన దాశరథి వంటి చారిత్రక వ్యక్తులు అరుదుగా జన్మిస్తుంటారు. దాశరథి రంగాచార్య కేవలం ఒక వ్యక్తి కాదు. ఎనిమిది దశాబ్దాల సామాజిక, సాంస్కృతిక చరిత్రను నిక్షిప్తం చేసుకున్న మహాశక్తి. మహా రచయిత. తెలంగాణ భాష, తెలంగాణ ప్రజలు ఉన్నంతకాలం దాశరథి రంగాచార్య జీవితం, రచనలు నిరంతరం స్ఫూర్తిని, ఉత్తేజాన్ని ఇస్తూనే ఉంటాయి. అనేక కోణాలలో నా జీవితాన్ని పరిశీలించిన దాశరథి స్వీయచరిత్ర రాయమని నిరంతరం కోరేవారు. మన స్వీయ చరిత్ర మనకోసం కాదని, మనం జీవించిన సమాజాన్ని చిత్రించడానికి మనం ఒక సందర్భమని అందువల్ల సమకాలిక సమాజం, దాని పరిణామాలు చిత్రించడానికి మన స్వీయ చరిత్ర ఒక సాకుగా సాధనంగా చిత్రించాలని కోరేవారు. నా స్వీయ చరిత్రను చూసి ఇలా రాయకూడదని హెచ్చరించారు. తాను రాసిన జీవనయానం ఒక కాలానికి సంబంధించినదని, నీవు నీ కాలానికి సంబంధించిన చరిత్రను మీ చేనేత కులాల జీవన పరిణామాలనుంచి చిత్రిస్తూ రాయాలని చెప్పారు. దాశరథి ఓ మూడు వందల పేజీల పెద్ద బౌండ్‌ గీతల పుస్తకం తీసుకుని అందులో రాయడం మొదలుపెడితే, అది పూర్తయ్యేది. కొట్టివేతలు, దిద్దుబాట్లు ఏవీ లేవు. రాయడం పూర్తి కాగానే ప్రచురణ కర్తకు అందించేవారు. ఆ రాతప్రతి చూస్తే ఆశ్చర్యమేసేది. అంత నిష్టగా ఆ రచనల్లో లీనమై ఆయా దృశ్యాలను కళ్లలోకి తెచ్చుకుని, కలం ద్వారా దృశ్యీకరించడం అనేది రచనలో ఉండే సాధికారితను తెలుపుతుంది. ఒక ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా రాయడం సాధ్యం. దాశరథి రంగాచార్య అనేక ప్రదేశాలను సందర్శించారు. నిరంతరం ధ్యానంలో జీవించేవారు.

ఇలా భావాన్ని, వాక్యాన్ని, దృశ్యాన్ని మనుసులోనే రూపొందించుకుని చేతిలోని కలం ద్వారా కాగితం మీదికి ఎక్కించడం ఏకకాలంలో సాగడం వల్లనే డాక్టర్‌ దాశరథి రంగాచార్య వేదాలను, ఉపనిషత్తులను, రామాయణ మహాభారాతాలను అనువదించగలిగారు. అనేక నవలలను రాయగలిగారు. దాశరథి రంగాచార్య జీవితం సార్థకమైనది. కారణజన్ముడు డాక్టర్‌ దాశరథి రంగాచార్య ఎందరో రచయితలకు స్ఫూర్తిని ఇస్తూనే ఉంటారు. దాశరథి రాసిన నవలలు మా వంటి వారికి ఇప్పటికీ కర్తవ్యాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. రాయని మా పలాయనవాదాన్ని నిరంతరం హెచ్చరిస్తూనే ఉంటాయి. నాతో సహా తెలంగాణ రచయితలు ఒక్కొక్క ప్రేమ్‌చంద్‌లా, దాశరథిలా, టాగోర్‌లా శరత్‌బాబులా విస్తారంగా తెలంగాణ ప్రజల జీవితాలను, సంస్కృతిని, పరిణామాలను, ఉద్యమాలను కథలు, నవలలుగా రాసినపుడే అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్యకు నిజమైన నివాళి. అప్పుడే మనం దాశరథికి నిజమైన వారసులుగా నిలుస్తాం.

బి.ఎస్‌.రాములు
(రేపు దాశరథి రంగాచార్య జయంతి) 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంగీత సాహిత్య కళానిథి (23-Aug-2015)

సంగీత సాహిత్య కళానిథి (23-Aug-2015)
లలిత కళలలో పరమోత్కృష్టమైన సంగీత సాహిత్యాలలో అత్యున్నత శ్రేణి ప్రతిభాపాటవాలు ‘నువ్వా? నేనా?’ అన్నట్లు సమస్థాయిలో పోటీపడుతూ ఉన్నవారు మిక్కిలి అరుదు. అరుదైన అటువంటి వారిలో తెలుగునాట బహు అరుదైన వ్యక్తి ‘సంగీత సాహిత్య కళానిధి’, ‘గానకళా ప్రపూర్ణ’, ‘హరి కథా చూడామణి’ ‘సంగీత కళాసాగర్‌’, ‘సంగీత సాహిత్య చతురానన’ ఇత్యాది బిరుదాంచితులు శ్రీమాన్‌ నల్లాన్‌ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారు. ‘సంగీత సాహిత్యాలలో విడివిడిగా విశేష ప్రజ్ఞ కలిగి ఉండడం చూస్తాం. కానీ ఈ రెండిటా అసమాన ప్రజ్ఞ సమపాళ్లలో కలిగి ఉండడం ఆచార్యుల వారికే చెల్లింది’ అని సంగీత సాహిత్య సరస్వతీ స్వరూపులు శ్రీమాన్‌ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు కృష్ణమాచార్యుల వారి గ్రంథ సమీక్ష సందర్భంగా కొనియాడారు.
కృష్ణమాచార్యుల స్వస్థలం జగ్గయ్యపేట. జనన సంవత్సరం 1923. జననీజనకులు శ్రీమతి వేంకట రమణమ్మ, శ్రీమాన్‌ జగన్నాథ తిరువేంకటాచార్యులు. తిరువేంకటాచార్యులు శతాధిక గ్రంథకర్త. సంస్కృతాంధ్ర ద్రావిడ భాషలలో అగ్రేసరులు. విశిష్టాద్వైతంలో అపారశక్తి సంపన్నులు. అటువంటి మహనీయులైన తండ్రిగారివద్ద సంస్కృతాంధ్ర ద్రవిడ కావ్య సేవనం చేసారు. కృష్ణమాచార్యులు. తర్క మీమాంసాది శాస్త్రాలు అధిగమించారు. బాల్యంలోనే తమ మేనమామ శ్రీమాన్‌ చిలకమర్రి కేశవాచార్యులు వద్ద సంగీత శిక్షణ ప్రారంభించి, అనంతరం ‘గాయక సార్వభౌమ’ పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి సంగీత వృక్షంలో ఒక ప్రధాన శాఖగా ఎదిగారు. జగద్విఖ్యాతులు ద్వారం వేంకటస్వామినాయుడు వాయులీన వాద్యాన్ని ఆదర్శంగా భావించే కృష్ణమాచార్యులు గారి ఆసక్తిని గుర్తించి మేనమామ కేశవాచార్యులు ఆ కాలంలో అపురూపంగా జరిగే ఒకటి రెండు కచేరీలకు తీసుకెళ్లి ద్వారం వారి వాదనాన్ని వినిపింపచేసారు. పదిపన్నేండేళ్ల ప్రాయంలోనే నాటి సుప్రసిద్ధ హరికథకులు శ్రీమాన్‌ దీక్షితదాసు గారికి వాద్య సహకారం అందించే అవకాశం కలిగింది ఆచార్యులు గారికి. ప్రథమ ప్రయత్నానికే ముగ్ధులైన దీక్షితదాసుగారు అప్పటినుంచీ తమ కథలకు ఆచార్యుల వారి వాయులీన సహకారాన్నే స్వీకరించారు. లబ్ధప్రతిష్ఠులూ సంగీతకోవిదులూ జీఎన్‌బీ, మహారాజపురం సంతానం, బాల మురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం, ఓలేటి వెంకటేశ్వర్లు, నేదునూరి కృష్ణమూర్తి వంటివారి కచేరీలకు కృష్ణమాచార్యుల వారు వాద్య సహకారం అందించి ప్రశంసలందుకున్నారు. ఆయన ఆకాశవాణి టాప్‌ గ్రేడ్‌ ఆర్టిస్ట్‌. ఒకే కుటుంబానికి చెందిన తన శిష్యపరంపర ఆరుగురితో (నల్లాన్‌ చక్రవర్తుల వారి వాయు లీన షట్కం) నరసరావుపేటలోనూ, విజయవాడలోనూ వాయులీన సంగీత సభలు చేసారు. ఇది చాలా విశేష ప్రయోగం.
సంగీతలోకంలో ప్రసిద్ధులకూ సాహిత్యపరిశోధకులకూ ఒక పరామర్శ గ్రంథాలయంగా ఉండేవారు ఆచార్యులుగారు. సంస్కృత ప్రసంగాలకై ఆకాశవాణికి వచ్చే పండితులను ఆచార్యులగారి వద్ద శుద్ధి చేసుకుని రమ్మని చెప్పేవారు. ప్రయోక్త ఉషశ్రీ గారు. ఆ విధంగా కొందరు ఆకాశవాణి నిలయంలోనే ఆ పని పూర్తిచేసుకోగా కొందరు పండితులూ కవులూ ఆచార్యుల గారి ఇంటికి వచ్చి పరిష్కారాలు చేసుకొంటూ ఉండేవారు. హరికథకులూ అంతే! పెద్దా చిన్నా అనే తారతమ్యం చూపక ప్రోత్సహించే సుగుణం-స్వయంగా ఉన్నది- రామకృష్ణయ్య పంతులు గారి శిక్షణాశాలలో మరింత వృద్ధి అయింది. ఆచార్యులవారి రూపం చూడగానే సంప్రదాయం విలసిల్లుతూ దివ్యంగా తోచేది.
ఒక విషయాన్ని నిక్కచ్చిగా హేతుబద్ధంగా తార్కికంగా చెప్పడంలో వారు అందెవేసిన చెయ్యి. చాలా మంది పెద్దలు ఆచార్యుల గారి వద్ద గోష్ఠులలో ఆచార్యుల గారు తెలిపిన మర్మాలు అంతకుముందు తమకు ఎవ్వరూ చెప్పలేదని అబ్బురంగా చెప్పడం జరుగుతూండేది. పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మగారు కొన్నిరోజులపాటు ఆచార్యుల వారి ఇంటికి అతిథిగా వస్తూ ‘విప్రనారాయణ’ నృత్యనాటకాన్ని రాయించుకున్నారు. ఈ విప్రనారాయణ వేదాంతం వారి ద్వారా జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది.
కర్ణాటక సంగీతంలో సంగీత సాహిత్య పరంగా వస్తున్న కొన్ని అపమార్గాలనూ అపపాఠాలనూ సవరిస్తూ సాగిన ఆచార్యుల వారి వ్యాసపరంపర అధ్యాపకులకూ అభ్యాసకులకూ కరదీపికలు. ఆరుద్ర గారితో సంగీత కచేరీ బాణీ గురిం, త్రిపురనేని వేంకటేశ్వరరావు గారితో సాగిన రామాయణ సంబంధ విషయ ప్రతివాదాలూ సిద్ధాంతావిష్కరణలు. ‘కొంచెం వైష్ణవం పాలు తగ్గిస్తే ఆచార్యుల వారి మనుచరిత్ర విశ్లేషణ వ్యాసాన్ని నాగార్జున యూనివర్శిటీలో పరామర్శ వ్యాసంగా ఉంచుతామని’ అప్పటి తెలుగుశాఖాధిపతి ఒక పెద్ద మనిషితో వర్తమానం వంటిది పంపగా ‘అందులో ఉన్నదే వైష్ణవం. యూనిర్శిటీ గురించి కావ్య విషయాలను మార్చలేను’ అని నిర్ద్వ్దంద్వంగా త్రోసిపుచ్చిన సంప్రదాయాభిజ్ఞులు ఆచార్యులుగారు.
‘శ్రీ గోదా గ్రంథమాల’ ఆచార్యుల వారింట పురుడుపోసుకుంది. వ్యవస్థాపకులైన శ్రీమాన్‌ కేటీఎల్‌ నరసింహాచార్యులు గారి గ్రంథమాల’ కావ్య ప్రచురణ అంతా ఆచార్యుల వారి ఇల్లు కేంద్రంగా సాగింది. ఆ గ్రంథమాల సాహిత్య సేవ అమూల్యం. గుంటూరు ధనకుధరం వారు స్థాపించిన ‘శ్రీరామానుజ కీర్తి కౌముది’ విశిష్టాద్వైత గ్రంథపరంపరతో సంపాదకవర్గంలోనూ రచనల పరంగానూ ఆచార్యుల వారి పాత్ర గణనీయమైనది. పెద్ద ముక్తేవి ఆస్థాన విద్వాంసులుగా సుప్రభాతం రచించి, ప్రసిద్ధ గాయకులతో పాడించి, దేవస్థానానికి సమర్పించారు. ‘ముకుందమాల’ శ్లోకాలను భక్తిగీతాలుగా మలచి స్వరపరచి ఆకాశవాణిద్వారా ప్రసారంచేసారు. హరికథలు స్వయంగా రచించుకుని గానంచేసేవారు. వారి హరికథలో నవ్యత్వం ఉండేది.

కృష్ణమాచార్యులు గారు కొందరు వరిష్ఠ విద్వాంసుల కోరికపై కృతులు రచించారు. సంగీతకృతులు 20 వరకూ ఉన్నాయి. వీరి కీర్తనలను వాయులీన దిగ్గజం లాల్గుడి వారు పాఠంచేసి దక్షిణాదిన పరివ్యాప్తం చేసారు. అందుకే వీరిని మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడమీ ‘ఉత్తమ వాగ్గేయకార’ పురస్కారంతో సత్కరించింది. తెలుగునాట మరి ఎవరికీ ఈ గర్తింపు లేదు. ఉజ్జయనిలో సంస్కృతంలో హరికథాగానమూ సత్కార స్వీకారమూ విజయవాడ నగరంలో వాగ్గేయకారుల రచనల గురించి పరంపరగా సాగిన సంస్కృత ప్రసంగాలూ ప్రశస్థం. ఆచార్యులవారి ‘త్యాగరాజ గేయార్థకుంచిక’ అన్యన్యసామాన్య రచన. ‘అరుగుచున్నాడు శ్రీనాథుడమరపురికి’ అన్నట్లుగా మొక్కవోని వ్యక్తిత్వంతో కృష్ణమాచార్యుల వారు 2006 ఆగస్టు 24న తమ 84 వ ఏట పరమపదానికి చేరుకున్నారు.

-ఎన్‌.సిహెచ్‌.చక్రవర్తి 
(రేపు కృష్ణమాచార్యుల వర్ధంతి)
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆయన మంచిపేరు మాకు ఇబ్బందే! (23-Aug-2015)

ఆయన మంచిపేరు మాకు ఇబ్బందే! (23-Aug-2015)
నేడు ‘ఆంధ్రకేసరి’ 143వ జయంతి
ఆంధ్రకేసరి.. ఈ పదం వింటే గుండె ధైర్యంతో బ్రిటిష్‌ పాలకులను ఎదిరించి నిలిచిన స్వాతంత్య్ర సమరయోధుడు గుర్తుకొస్తాడు. ఒకప్పుడు మద్రాస్‌ హైకోర్టులో అతి ఖరీదైన లాయర్‌గా పేరుగాంచిన టంగుటూరి తన సంపాదనంతా ఉద్యమానికే ధార పోశారు. మద్రాస్‌ ప్రెసిడెన్సీకి, ఆ తర్వాత ఆంధ్ర రాషా్ట్రనికి తొలి ముఖ్యమంత్రిగా పని చేసిన ప్రకాశం పంతులు కుటుంబీకులు మధ్యతరగతి జీవితాలను వెళ్లదీస్తున్నారు. ఒక సారి ఎమ్మెల్యే అయితే తరతరాలకు సరిపడెంత సంపాదించుకొనే ఈ రోజుల్లో.. టంగుటూరి మనమలు ఆయన గురించి ఏమనుకుంటున్నారు? అనే విషయాన్ని తెలుసుకోవటానికి నవ్య ప్రయత్నించింది. టంగుటూరి 143వ జయంతి సందర్భంగా వారిని పలకరించింది.. 

‘‘నేను పుట్టింది 1938లో.. మా తాతగారికి ఇద్దరు కుమారులు- నరసింహారావు, హనుమంతరావు. నేను నరసింహరావుగారి కుమార్తెను. మేం మద్రాసులో.. మా బాబాయి (హనుమంతరావు) ఒంగోలులో ఉండేవారు. తాతగారు ఎక్కువగా బాబాయి దగ్గరే ఉండేవారు. ఇక్కడో మాట చెప్పాలి. తాతగారు దేశం కోసం కుటుంబాన్ని వదిలేశారు. ఎప్పుడూ కుటుంబాన్ని పట్టించుకోలేదు. నాయనమ్మ మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదుట. అందువల్ల ఆమె కూడా పిల్లలను సరిగ్గా చూడలేదు. దీంతో.. నాన్న, బాబాయి చాలా కష్టపడ్డారు. ఆర్థికంగా ఏమిలేకపోవటంతో ఎవరూ చేరదీసేవారు కారు. మా నాన్నకు పెళ్లికావటం కూడా చాలా కష్టమయిందిట. తాతగారు లాయర్‌గా చాలా సంపాదించారు. బంగ్లాలు, తోటలు, స్థలాలు.. ఇలా చాలా కొన్నారు. కానీ అవేమి నిలవలేదు. మా బాబాయే తాతగారికి కార్యదర్శిగా ఉండేవారు. ఆయనకు కూడా ఆర్థికపరమైన అంశాలలో సరైన శిక్షణ, అవగాహన లేవు. దీంతో చాలా ఇబ్బందులు పడేవారు. తాతగారు బాబాయి దగ్గరే ఉన్నా అప్పుడపుడు మద్రాసు వస్తూ ఉండేవారు. ఆయన వస్తే సందడే. అమ్మ రకరకాల పిండివంటలు చేసేది. ఆయన ఎప్పుడూ గోధుమన్నమే తినేవారు. వీటన్నింటినీ వెండి పళ్లెంలో పెట్టి వండించేవాళ్లం. ఆయన భోజనప్రియుడు. అడిగి మరి వేయించుకొని తినేవారు. ఆయన రోజుకు 50 బత్తాయిలు తినటం ఇప్పటికీ నాకు గుర్తుంది. అలాంటి వ్యక్తి.. చివరి దశలో భోజనం కూడా లేని పరిస్థితులకు చేరుకున్నారంటే బాధ కలుగుతుంది. 1955లో నా పెళ్లి అయింది. నా పెళ్లిని తాతే దగ్గరుండి జరిపించారు. తాతగారికి తగినంత గౌరవం దక్కలేదు. ఆ బాధ ఆయనకు కూడా ఉండేది. అయితే ఒక ఆనందకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటికీ మన దేశంలో అనేక మందికి ఆయన పేరు తెలుసు. మన రాష్ట్రంలో అయితే మనవలం అని చెబితే చాలు ఎంతో ఆదరిస్తారు. టంగుటూరి కుటుంబానికి ప్రభుత్వం పెద్దగా చేసిందేమి లేదు. తాతగారి అడుగుజాడల్లో ఐదుగురు నేతలు నడిచినా చాలు.. దేశం ఎంతో బాగుపడుతుంది. అయినా దేశం కోసం సర్వాన్ని త్యాగం చేసే వారు ఇప్పుడెవరున్నారు?

– శ్యామల

శ్యామల ప్రస్తుతం బెంగుళూరులో స్థిరపడ్డారు. ఆమె బెంగళూరులో ‘నృత్యప్రకాశ వర్షిణి’ పేరుతో భరతనాట్య పాఠశాలను స్థాపించి విద్యార్థులకు నృత్యం నేర్పిస్తున్నాను. ఆమె సేవలకు కర్నాటక ప్రభుత్వం ‘కళాశ్రీ’, ఏపీ ప్రభుత్వం ‘నర్తకి’ బిరుదులు ప్రదానం చేశాయి. 

టంగుటూరి వారి వంశంలో జన్మించటమే మా పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది.ఎక్కడికెళ్లినా మమ్మల్ని అందరూ ఎంతో గౌరవిస్తుంటారు. ముత్తాతగారి జయంతిని ప్రభుత్వం జరపటం ఆనందంగా ఉంది. మే 20వ తేదీన వర్ధంతిని కూడా నిర్వహించాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశాం. దీనిపై కూడా పాలకులు ఆలోచిస్తే బావుంటుంది.

– సంతో్‌షకుమార్‌

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మూడు పుష్కరాల సామగాన సౌరభం – శంకరాభరణం – గబ్బిట క్రిష్ణ మోహన్

0001 0002 0003

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 286-‘’లావణ్య మావి’’ నవలా రచయిత -అప్పా శాస్త్రి (1873-1913)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

286-‘’లావణ్య మావి’’ నవలా రచయిత -అప్పా శాస్త్రి (1873-1913)

పండిత వంశంలో కొల్హాపూర్ లో రసవాదునికి కుమారుడుగా అప్పా శాస్త్రి పుట్టాడు .చిన్నప్పుడు విద్య లన్నీ ఔపోసన పట్టాడు .’’సంస్కృత చంద్రిక ‘’అనే పత్రికకు వ్యాసాలూ రాసేవాడు .తర్వాత సంపాదకుడయ్యాడు .సాధారణ అంశాలపై ‘’సంస్కృత వాదిని ‘’అనే శీర్షిక నిర్వహించి సంస్కృత భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పాడు .’’విద్యా వాచస్పతి ‘’,’’విద్యాలంకార ‘’బిరుదులు  పొందాడు .నలభై ఏళ్ళకే 1913లో తనువు చాలించాడు .కొన్ని నాటకాలపై విమర్శలు రాశాడు .ఆయన సంస్కృతం లో రాసిన ‘’లావణ్య మావి ‘’అనే నవల కు  బంకిం చంద్ర చటర్జీ బెంగాలీలో అదేపేరుతో రాసిన  నవల ఆధారం.

287-కృష్ణమాచార్య (1869-1924)

పరవస్తు రంగా చార్య కుమారుడైన కృష్ణమాచార్య 1869లో జన్మించి 1924లో మరణించాడు మద్రాస్ లో సంస్కృత విద్యకు సూపరింటెండెంట్  గా ఉండేవాడు .కాళిదాసు రచనలపై గొప్ప వ్యాస పరంపర రాశాడు .’’సహృదయ’’ అనే సంస్కృత పత్రిక నిర్వహించాడు .’’పతివ్రత’’ ,పాణిగ్రహణం ,వరరుచి ‘’అనే వచన గ్రందాలు రాశాడు .సాంఘిక నీతి నియమాలను ప్రతి బి౦బి౦ చే  ‘’సుశీల ‘’నవల రాశాడు .

288-అనంతా చార్య (1874

రామానుజా చార్య అనుయాయులైన ‘’ముడుంబై నంబి ‘’వంశం లో చివరివాడు అనంతా చార్య .1874లో కంచిలోని ప్రతివాది భయంకర కుటుంబం లో జన్మించాడు .అన్ని శాస్త్రాలు నేర్చాడు ఆయన శిష్యులంతా దేశమంతా ఉన్నారు .వైష్ణవ మత వ్యాప్తి కోసం విస్తృతంగా పర్యటించాడు .దీనికోసం అనేక శాస్త్ర గ్రంధాలు రాసి ప్రచురించాడు .న్యాయ వేదాంత జర్నల్స్ కు ‘’మంజుభాషిణి ‘’అనే సాహిత్య పత్రిక కు   ఎడిటర్ గా ఉన్నాడు  ‘’.ఆయన రాసిన ‘’వాల్మీకి భావ దీపిక ‘’రామాయణం లోని వేదాంత సారాన్నిసంపూర్ణంగా ఆవిష్కరించే గ్రంధం .జగన్నాధ ప్రసాద్ హిందీలో రాసిన నవలను సంస్కృతం లో ‘’సంసార చక్ర ‘’గా రాశాడు .

289- పండిత రాజ -కృష్ణమాచార్య (1874

సుమారు 1874లో జన్మించిన కృష్ణమాచార్య శ్రీ వత్స గోత్రుడైన వేంకటేశుని కుమారుడు .చిన్నప్పుడే శాస్త్రాలన్నీ అధ్యయనం చేశాడు .వ్యాకరణం అభిమాన విషయం .సంస్కృత, తమిళ, మళయాళ భాషలలో అనర్గళంగా ప్రసంగించే నేర్పున్నవాడు .కొచ్చిన్ లో మహారాజ పతాకాన్ని,’’ పండిత రాజ ‘’బిరుదాన్ని అందుకొన్నాడు .తనకు సంస్కృతవచనం  లో ఉన్న ప్రావీణ్యాన్ని క్లిష్టమైన చారిత్రిక అంశాలను సులభం గా చెప్పే విధానం కోసం ఉపయోగించాడు .సునిసిత మేధ శక్తి ఉన్నవాడు .నిత్య పరిశీలనా శీలి .’’పార్వతీ పరిణయం ,ప్రియ దర్షిక ,వామనుడి కావ్యాలంకార సూత్ర వృత్తి ,వాసవ దత్త మేఘ సందేశ’’ రచనల కర్తృత్వం ఎవరిదో  నిగ్గు తేల్చి చెప్పాడు .’’సంక్షిప్త కాదంబరి ,హర చరిత్ర ,వేమా భూపాల చరిత్ర’’ లను యువతకు అందుబాటులో తెచ్చాడు. వ్యాకరణ తర్క శాస్త్రాలపై పలు రచనలు చేశాడు .’’మహా కవి సుభాషిత ‘’,’’సుభాషిత శతకం ‘’,భర్తృహరి సుభాషిత శతకసంగ్రహం  ‘’,ఆయన కృషియే .’’ప్రస్తుతాంకూర విమర్శ ‘’,త్రిలుప్త కౌతుక ,వ్రుత్తి వార్తిక లపై గొప్ప విమర్శలు రాశాడు .’’వాసవ దత్త’’ పై రాసిన వ్యాఖ్య బహుదా ప్రశంసనీయం గా ఉన్నది .’’సుబందు’’ కవి మనసులోని  ఆంతర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు .’’సాహిత్య రత్న మంజూష ‘’ ఎన్నో విషయాలపై సేకరి౦పబడిన అసామాన్య శ్లోక సముచ్చయం .

290-రాజ గోపాల చక్ర వర్తి (1882

తండ్రి గీతాచార్యుడు మైసూర్ సంస్కృత కళాశాలలో మీమాంస ప్రొఫెసర్ .చక్రవర్తి 1882లో జన్మించాడు .వంశానుగతంగా కవిత్వం, పాండిత్యం అబ్బి అనేక రాజాస్థానాలు సందర్శించి బిరుదులూ సన్మానాలు అందుకొన్నాడు .1922లో బెంగుళూరు సెంట్రల్ కాలేజి సంస్కృత విభాగ అధిపతి అయ్యాడు .’’శైవలిని ‘’’’కుముదిని ‘’అనే శృంగార కావ్యాలను రాసి మంచి పేరు సంపాదించుకొన్నాడు .’’విలాసకుమారి ‘’’’సంగర ‘’వచన రచనలూ చేశాడు .డెల్ఫీ లోని ఆరకిల్ ఆధారంగా ‘’త్రిపోద్’కావ్యం ’రాశాడు .’’పద్య హర్ష చరిత్ర ‘’,గంగా తరంగం ‘’,’’మధుకర దూత ‘’,వియోగి విలాపం ‘’రాశాడు .భారత దేశ యాత్రా సాహిత్యం గా ‘’తీర్దాటనం ‘కావ్యాన్ని ’నాలుగు అధ్యాయాలలో రచించాడు .అతని ‘’కవి కావ్య విచారం ‘’సాహిత్య చరిత్ర తో బాటు ,విమర్శన చరిత్రకూడా ఉన్న సృజనాత్మక గ్రంధం .అత్యాధునిక చారిత్రిక విషయాలనూ పొందుపరచాడు .1934లో మరణించాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-8-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మాన్య శ్రీఆదిత్య ప్రసాద్ గారి ఆశీరభినందనలు

మాన్య శ్రీఆదిత్య ప్రసాద్ గారి ఆశీరభినందనలు

adityaprasad 001

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 283-శ్రీశైల దీక్షితులు అనే తిరుమలాచార్య (1809-1877)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

283-శ్రీశైల దీక్షితులు అనే తిరుమలాచార్య (1809-1877)

భాస్కరాచార్య ,తిరు వెంగదాంబ ల కుమారుడే తిరుమలాచార్య .తమిళనాడు లోని చెంగల్పట్టు జిల్లా చిన్నం పట్టు లో 1809మే లో జన్మించాడు .శ్రీ వైష్ణవ సంప్రదాయం లో సప్తగోత్ర శాఖకు చెందిన వాడు .వీరి పూర్వీకులు తంజావూర్ జిల్లా తిరుకండియార్ కు చెందినవారు గా గుర్తింప బడ్డారు .నెలల పిల్లాడుగా ఉండగానే తండ్రి చనిపోతే మాతామహుడు స్వంత కొడుకులా పెంచాడు .ట్రిప్లికేన్ లో చదివి సాహిత్యం ,వేదాంతాలలో నిష్ణాతుడయ్యాడు .రామానుజుల శ్రీభాష్యం పై తిరుమలాచార్య విశ్లేషణం అనితర సాధ్యం గా ఉండేది .అందుకనే ఆయనను ‘’శ్రీ భాష్యం తిరుమలాచార్య ‘’అని గౌరవం గా పేర్కొనేవారు .ఇరవై నాలుగవ ఏట ఒక్క గానొక్క కొడుకు భాష్యకాచార్య పుట్టాడు .మద్రాస్ లోని కోలా సోదరులైన కృష్ణ నాయుడు ,విజయ రంగం నాయుడు లకు  చదువు చెప్పాడు .వారితో బాటు బెంగుళూర్ లో స్తిరపడ్డాడు .అక్కడే కన్నడ పత్రిక ‘’కర్నాటకా ప్రకాశిక ‘’ను మైసూరు మహారాజు కృష్ణ రాజ ఒడియార్ ఆధ్వర్యం లో నిర్వహించాడు .23-2-1877మరణించాడు .

తిరుమలాచార్య గొప్ప సంగీత విద్వాంసుడు .’’అమర శతకానికి’’ స్వరాలు సమకూర్చాడు .బాణుని కాదంబరిపై వీరాభిమానం ఉండటం వలన ‘’కాదంబరీ తిరుమలాచార్య ‘’అనే గౌరవ బిరుదం వచ్చింది .కవిత్వం లోనూ దిట్ట .’’హనుమన్నక్షత్రమాల ‘’,వీరాంజనేయ శతకం ‘’,గోపాలార్య ‘’మున్నగు సంస్కృత రచనలు చేశాడు .’’భారతి విలాసం ‘’,అనే వచన రచన ను షేక్స్పియర్ ‘’కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ‘’ఆధారంగా రాశాడు .కూర్గు జిల్లాలో ఉన్న తలకావేరి యాత్రను ‘’కావేరి గద్య ‘’గా రాశాడు .ఆయన రచనలలో మాణిక్యం ‘’శ్రీ క్రిష్ణాభ్యుదయం ‘’అనే వచన కావ్యం .అందులోని వచనం పలు భంగులలో కదను తొక్కుతుంది .ఆయన కృష్ణ భక్తికి చిరస్థాయి గా నిలిచింది .కదా ,కధనం అనితర సాధ్యమని పిస్తాయి  .దానికి మించిన సంస్కృత వచన రచన లేదేమో నని పిస్తుంది .కృష్ణ భక్తికి పరాకాష్ట గా నిలిచిన సద్గ్రంధం ఇది .దీనికి సాటి లేదు అంటారు .

284-తిమ్మకవి

కూచిమంచి వంశానికి చెందిన తిమ్మకవి కౌండిన్య గోత్రీకుడు ఆంద్ర ప్రదేశ్ లో పిఠాపురం దగ్గర చంద్రం పాలెం నివాసి కుక్కుటేశ్వర స్వామి అనుగ్రహం తో గొప్ప కవిత్వం,సకల శాస్త్ర పరిచయం  అబ్బింది .అతని ‘’సుజన మనమనస్కుముద చంద్రిక ‘’ముత్తాత తిమ్మకవి రాసిన ‘’రసిక జన మనోభిరామం ‘’కు సంస్క్రుతీకరణం .ఇందులో కధను ఇంద్రుడు కేరళకు చెందిన మహా భాగుడికి చెబుతాడు .కరాళ వక్త్రుడు అనే కేరళ రాజు వేటకు వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని చూసి మనసు పారేసుకొని  వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకొంటాడు .ఆమె పెంపుడు చిలుకను వెంబడిస్తూ ఒక శివాలయం లోకి ప్రవేశిస్తాడు .అక్కడ కిందపడి శివనామం జపిస్తూ మరణించి కైలాసంచేరుకొంటాడు .

285-అభినవ కాదంబరి కర్త-అహోబిల నృసింహ కవి(1700)

రామ కృష్ణాధ్వరి కుమారుడు ,నారాయణ సూరి మనవడు అయిన నృసింహకవి తెలుగు వేగినాటి కాశ్యప గోత్రీకుడు .కవి వంశమే వీరిది. మైసూరు రాజుల ప్రాపకం లోని కవులే వీరు .1795వాడిన మూడవ కృష్ణ రాజ ఒడియార్ రాజు కాలం లో నారాయణ పండితునితో స్పర్ధ వచ్చి కాదంబరి తో సరిసమాన మైన కావ్యం రాస్తానని ప్రతిజ్ఞా చేసి ‘’అభినవ కాదంబరి ‘’రాసి అందరినీ ఆశ్చర్య పరచాడు .దీనికే ‘’త్రిమూర్తి కల్యాణం ‘’అనే పేరు కూడా ఉంది .ఇది రెండుభాగాలు .కృష్ణ రాజు వంశ చరిత్ర, సాహసాలు వగైరాలుంటాయి .అభినవ కాదంబరి అనే మాటకు కావ్యం లో అర్ధమే కనిపించదు .బాణకవిని మించిపోదామనే అత్యాశ కనిపిస్తుంది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-8-15- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అధిక్షేపణ పై ప్రామాణిక పరిశోధన -ద్వా.నా. శాస్త్రి



 
 

 


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోకరిల్లటం మానండి



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రమ, ఆలోచన పాట -వంగపండు



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బీహార్ కు తాయిలం ,కాశ్మీరీల అవిశ్వాసం ,చలసాని


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తగ్గిన మోడీ మోజు



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఈ రోజు రేడియో టాక్ లో సూక్తి సుధ నాల్గవ భాగం ప్రసరమైనది.ది

ఈ రోజు రేడియో టాక్ లో సూక్తి సుధ నాల్గవ భాగం ప్రసరమైనది.ది

SUKTHI SUDHA PART 4

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఈ రోజు రేడియో టాక్ లో సూక్తి సుధ ముడవభాగం ప్రసరమైనది.ది

ఈ రోజు రేడియో టాక్ లో సూక్తి సుధ ముడవభాగం ప్రసరమైనది.ది SUKTHI SUDHA Part 3

Posted in రేడియో లో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 281-ఉదయ సుందరి కదా రచయిత -సోద్దాలకవి (1100)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 281-ఉదయ సుందరి కదా రచయిత -సోద్దాలకవి (1100)

 

281-ఉదయ సుందరి కదా రచయిత -సోద్దాలకవి (1100)

శూరుని కుమారుడు ,సోల్లాపేయ మనవడు ,చంద్రాపతి మునిమనవాడు సోద్దాలకవి .కాయస్థ క్షత్రియ కులం లో వల్లభ శాఖ కు చెందినవాడు .దీనికి శిలాదిత్యుని సోదరుడు కాలాదిత్యుడు సంస్థాపకుడు .చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి మేనమామ గంగాధరుని వద్ద పెరిగాడు .చంద్రాచార్యుని వద్ద కొంత విద్య నేర్చి కొంకణ రాజధాని  లోని స్తానా లేక థానాకు చేరాడు .చిత్త రాజు నాగార్జున ,ముమ్ముని రాజుల ఆశ్రయం పొందాడు .చిత్త రాజు ,సోదరుడు పదకొండవ శతాబ్ది వారు .చాళుక్యలాట  రాజు వత్స రాజాస్థానం లోను సోద్దాలుడు ఉండి గౌరవ పురస్కారాలు అందుకొన్నాడు .

సోద్దాలుడు రాసిన ‘’ఉదయ సుందరి కద’’1026-1080మధ్య వత్స రాజు పాలన లో కాలం లో రచింప బడింది .ఈ కవి రాసిన కొన్ని శ్లోకాలకు ముచ్చటపడి రాజు గోప్పమంచి కావ్యం రాస్తే విలువైన ముత్యాలహారం బహూకరిస్తానని చెప్పాడు .వెంటనే కవిత్వ రచన ప్రారంభించి ‘’ఉదయ సుందరి కద’’రాశాడు .తన క్షత్రియ వంశ సంజాతాన్ని ఆకాశానికి ఎత్తుతూ తానూ బాణుడు ,వాల్మీకి అంతటి వాడిని అని రాసుకొన్నాడు సోద్దాలకుడు .అతని కవిత్వం ఆనాటి ప్రసిద్ధ శృంగార కవుల కవిత్వానికి ఏ మాత్రమూ తీసి పోదు .ఎనిమిది ఉచ్వాసాలలోని ఈ కద నాగ లోక ప్రభువైన శిఖండ తిల కుమార్తె ఉదయ సుందరికి ,ప్రతిష్టాన రాజు మలయ వాహనుడికి జరిగిన వివాహ వృత్తాంతమే .మొదటి ఉచ్చ్వాసం లో తన వంశ చరిత్ర సవివరంగా రాసుకొన్నాడు కవి .తన కవిత్వం గొప్పదనాన్ని వంశ పౌరుషాన్ని ,రచనా పాటవాలను ఏకరువు పెట్టాడు .రెండవ ఉచ్చ్వాసం నుండి అసలు కద మొదలు అవుతుంది .

282-‘’వాదిభ సింహ’’ కవి -(1200)

దిగంబర జైన ముని వాదిభ సింహుడు పుష్పసేన ముని శిష్యుడు .అసలు పేరు ఒడియ దేవుడు .సింహం ఏనుగు పై ఎలా లంఘించి పీచం అణస్తుందో తానూ కూడా వాదం లో అలాగే ప్రతివాదిని ఓడిస్తానుకనుక తనకు ‘’వాదిభ సింహ ‘’బిరుదు వచ్చింది అని చెప్పుకొన్నాడు .ఈకవికి గురువే సర్వస్వం .తన గురువు మూర్ఖులను కూడా విద్యా వంతుల్ని చేసే శక్తికలవాడని చెప్పాడు .తమిళనాడు ప్రాంతపు కవిగా ఈయనను భావిస్తారు .ఈతని వంశం వారు ఇంకా అక్కడ ఉన్నారట .

పదకొండు లంభాలలో’’ గద్య చింతామణి ‘’కావ్యం రాసి అందులో సత్య ధర రాజు అతనికుమారుడు జీవన ధర రాజు క్రమంగా వివేకులై జైనాన్ని ఎలా అనుసరించారో తెలియ జేశాడు . దీనికి ఆధారం గుణ భద్రుని ‘’ఉత్తర పురాణం ‘’.రచన అంతా భట్ట బాణుని కాదంబరి నిఅనుసరించి రాసినట్లే కనిపిస్తుంది .దుర్గుణం పతనానికి హేతువు అనే నీతి ఇందులో ప్రాధాన్యం గా చెప్పాడు .ఇతని ‘’క్షత్ర చూడామణి’’కావ్యం  పదకొండు అధ్యాయాలు కలది .ఇది జీవన ధర రాజు చరిత్ర .ఇది తమిళం లోని’’ జీవక చింతామణి ‘’కి పూర్తీ సంస్క్రుతానువాదం అని పిస్తుంది .భోజ మహారాజు మరణ వార్త విన్న కాళిదాసమహా కవి విలపించినట్లే సత్యన్ధర రాజు దుస్టమంత్రి కాస్టాంగర మాయోపాయానికి బలై మరణించి నప్పుడు ప్రజలు కాళిదాసులాగా విలపించారని రాశాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-8-15 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

50 ఏళ్ళనాటి కన్యా శుల్కం సినిమా వగైరా


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధ్యాత్మిక వ్యాసాలు


 
 
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

డిటె న్స్హన్ ,వర్షించని విజ్ఞత ,అమెరికాలోను విచక్షణ


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చినుకు ఆగస్ట్ సంచికలో నాలేఖ

chinuku 001

Posted in రచనలు | Tagged | Leave a comment

భావ తరంగిణి వార్షికోత్సవాలలో శ్రీ గుత్తి కొండకు పుస్తకం అంకితమిస్తున్న ద్వా.నా శాస్త్రి

భావ తరంగిణి వార్షికోత్సవాలలో శ్రీ గుత్తి కొండకు పుస్తకం అంకితమిస్తున్న ద్వా.నా శాస్త్రిbhava1 001 bhava2 001 bhava3 001 bhava4 001

 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జపాన్ నాటక రచయిత్రి దర్శకురాలు- ఆయ్ నాగై -గబ్బిటదుర్గాప్రసాద్

జపాన్ నాటక రచయిత్రి దర్శకురాలు- ఆయ్ నాగై -గబ్బిటదుర్గాప్రసాద్

జపాన్ నాటక రచయిత్రి దర్శకురాలు- ఆయ్ నాగై

యదార్ధ వాదాన్ని మాధ్యమంగా జపాన్ నాటక రచన చేసి ,దర్శకత్వం వహించిన మహిళ ఆయ్ నాగై .స్వత దియేటర్ ను నెలకొల్పి నాటక రంగానికి అమూల్య సేవలందించింది .ఆయ్ నాగై 16-10-1951నజపాన్ రాజధాని టోక్యో లో పెయింటర్ ,కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడైన తండ్రికి జన్మించింది.బాల్యం లో నే ఆమె తలిదండ్రులు విడాకులు పొందితే తండ్రే సర్వస్వం అయి పెంచాడు . తండ్రికున్న నాటక రంగ అనుభవానికి ప్రేరణ చెంది కూతురు నాగై కూడా అందులో తన ప్రతిభను చూపించాలనుకోన్నది .ఆమె అమ్మమ్మా తాతయ్యలు కూడా ప్రోత్సహించారు .అమ్మమ్మకున్న నాటక రంగానుభావాలను నాగై తరువాత రాసింది .

హైస్కూల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసి హైయూజా దియేటర్ కంపెనీ లో సభ్యురాలైంది .అక్కడ ప్రదర్శించే నాటకాలన్నిటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది .తోహో గాకేన్ కాలేజి లో దియేటర్ డిపార్ట్ మెంట్ లో చేరి నాలుగేళ్ళు చదివి డ్రామా ప్రోగ్రాం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది .ఇక్కడే ఎందరో నటులు శిక్షణ ఒంది రాటు దేలేవారు .ఈ దియేటర్ అంటే ఆమెకు విపరీతమైన అభిమానం ఆరాధనా ఏర్పడటానికి కారణం ప్రముఖ నటి హేత్సుకో హేచిహార అందులో మెంబర్ గా ఉండటమే .ఆమె ప్రభావం నాగై పై బాగా పడింది .ఆ రోజుల్లో ‘’అంగూరా’’అనే అండర్ గ్రౌండ్ దియేటర్లు ఉండేవి నాగై అందులో కూడా పని చేసింది .1974లో గ్రాడ్యుయేషన్ అయినతర్వాత దియేటర్ కంపెనీ యాజమాన్యం ఆహ్వానం తో అందులో చేరింది .
అందులో పనిచేస్తుండగా శిజుకా ఒషిమ తో పరిచయమేర్పడింది .దురద్రుస్టవశాత్తు రెండేళ్ళ తర్వాతా కంపెనీ మూసేశారు .ఒషీ తో కలిసి నాటకాలు రాసి ప్రదర్శించాలనుకోన్నది .

1981లో’’నితోషా ‘’అనే నాటక కంపెనీని ఇద్దరు ఏర్పాటు చేశారు .కంపెనీ కి ఆ పేరు పెట్టటానికి కారణం ఆ ఇద్దరు రాబిట్ నామ సంవత్సరం లోనే పుట్టారు ‘’నితోషా ‘’అంటే రెండు రాబిట్లు (కుందేళ్ళు ).నితోషా లో పనిచేస్తూ నాటకాలు రాశారిద్దరూ .త్వరలోనే వారి నాటకాలకు విశేషమైన ఆదరణ లభించింది .ఓషి నాగై నివదిలేసి టి వి కంపెనీలో చేరింది .తప్పని సరి పరిస్తితులలో నాగై స్వంత నాటకాలకు దర్శకత్వం చేసి మెప్పించింది .నితోషా దియేటర్ టోక్యో లో నేరిమా అనే చోట ఇంకా నడుస్తోంది .ప్రేక్షకుల కు కూడా నాటకం లో చోటుకల్పిస్తూ ప్రయోగాలు చ్సింది .

ఇప్పటికీ నాగై నితోషా తరఫున నాటకాలు రాస్తూ ,ప్రదర్శిస్తూ దర్శకత్వం వహిస్తూ ప్రజాభిమానాలను పొందుతోంది .న్యు నేషనల్ దియేటర్ వంటి సంస్థలకు కూడా నాగై నాటకాలు రాసింది .ఆమె కీర్తి బాగా వ్యాపించి ‘’జపాన్ నాటక రచయితల సంఘం ‘’కు అధ్యక్షురాలుగా ఎన్నుకోబడి గొప్ప గౌరవం పొందింది .జాపాన్ లో మాత్రమే కాక అమెరికా కెనడా ,దక్షిణ కొరియా మొదలైన దేశాలలో కూడా ప్రదర్శనలిచ్చి విశ్వవ్యాప్త కీర్తి నార్జించింది నాగై .2010ఫిబ్రవరిఇరవై రెండు న న్యూయార్క్ లోని జపాన్ సొసైటీ వారు నాగై రాసిన ’’వుమెన్ ఇన్ హోలీ మెస్ మొదలైన నాటకాలకు ఆంగ్లాను వాదాలను ‘’, ‘’స్టేజి రీడింగ్ ‘’ఏర్పాటు చేసి అరుదైన గౌరవం కలిపించారు.

‘’జపాన్ యుద్ధానంతర జీవితం ‘’పై ట్రయాలజి ‘’రాసి అందులో జపనీయులు అనుభవించిన కస్టాలు నవీన జపాన్ నిర్మాణం లో పోషించిన చిరస్మరణీయమైన పాత్రను తెలియ జేసింది .ఈ ట్రయలజీ లో లో మూడు నాటకాలు ‘’టైమ్స్ స్టోర్ స్టార్మ్’’’’టోకినో మోనో ఒకి ‘’ డాడీస్ డెమోక్రసీ ‘’ఉన్నాయి .వీఎతిలో రెండవ ప్రపంచ యుద్ధ భీభత్సం ,ఆ తర్వాతా జపాన్ పునర్వైభవం సాధించిన విదానం ఉంటాయి .లీగల్ ప్రాష్టి ట్యూ షన్ ‘’కు వ్యతిరేకం గా చట్టం తేవాలని ఉద్యమించింది నాగై .

చెకోవ్ రాసిన త్రీ సిస్టర్స్ ఆధారంగా నాగై దిత్రీ హాగి సిస్టర్స్ ‘’రాసింది ఏది చేసినా రాసినా దేశభక్తి ప్రబోధకంగా ఉండేది.ముందే చెప్పుకోన్నట్లు ఆమె రచనలలో వాస్తవికత ప్రతిఫలిస్తుంది .దాదాపు ఎనిమిది జాతీయ అవార్డులను అందుకొన్నది నాగై .ఆమె సంస్థ ‘’నితోషా ‘’కు మరిన్ని బహుమతులు వచ్చాయి .దాదాపు ఇరవై నాటకాలు రాసి ,ప్రదర్శించి దర్శకత్వం వహించి జపాన్ నాటకరంగానికి విశిష్ట సేవలు అంద జేస్తోంది ఆయ్ నాగై .

-గబ్బిటదుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

ఒకప్పటి చంబల్ రాణి నేడు ఆపద్బాందవి బాంకాక్ లో బ్రహ్మ దేవాలయం



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment