మళ్ళీ ఓడిన రాజ పక్షే

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కలాం కు శ్రద్దాంజలి -మూసీ

kalam 2 001 kalam1 001 kalam3 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉల్లి పోటు

ఉల్లి పోటు

  • 16/08/2015
  • -భారతి

ఉల్లిపాయ తరిగితే కన్నీళ్లు వస్తాయి…కానీ కొన్నా, కొనాలనుకున్నా ఇప్పుడు అదే పరిస్థితి. దాదాపు నెలరోజులుగా సగటు భారతీయుడిని ఉల్లి రేటు.. ఘాటెక్కి ఊపిరాడనివ్వడం లేదు. ఈ పరిస్థితి వంటింటి వాతావరణాన్ని వేడెక్కించి సంసారాల్లో చిచ్చుపెడుతోంది. పరిమిత బడ్జెట్ బతుకులను భయపెడుతోంది. మరో మూడునెలలపాటు ఇదే పరిస్థితి ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఉల్లిపై మమకారాన్ని తగ్గించుకోక తప్పని స్థితి ఏర్పడింది. *** మన గడ్డపై పేదవాడికి ఉల్లిగడ్డ లేనిదే గడవదు. చౌకగా, రుచిగా, ఆరోగ్యప్రదాయినిగా ఇది వారికి చేరువైంది. తెల్లారగట్లే లేచి చద్దిమూట పట్టుకెళ్లే కూలీలు అన్నంతోపాటు ఓ మిరపముక్క, ఉల్లిపాయ చెక్క కసుక్కున కొరికి ఆ ఘాటైన కారాన్ని మమకారంగా తినడంలో ఆనందం పంచభక్ష్యపరమాన్నాలు ఇచ్చినా వారికి రాదు. వారికి కావలసింది తల్లిలాంటి ఉల్లే. కూరగాయలు, పప్పుబెల్లాలు లేకపోయినా, వాటిని కొనలేకపోయినా ఉల్లి ఉంటే చాలని, వాటితోనే సరిపుచ్చుకునే పేదలకు ఇప్పుడు పెద్దకష్టమే వచ్చిపడింది. ఇప్పుడు వారికి నోట్లో ముద్ద దిగడమే కష్టమవుతోంది. *** వేడివేడి పెసరట్టు, దానిపై అల్లం, మిర్చిముక్కలు, తోడుగా ఉల్లి చెక్కు వేస్తే లొట్టలేసుకు తినే మగరాయుళ్లు ఇప్పుడు నొసలు చిట్లిస్తున్నారు. ఇల్లాలి ప్రేమలో ఏ మాత్రం మార్పు రాకపోయినా.. పెసరట్టులో ఉల్లి పల్చబడి పోవడంతో వారికి ఎక్కడ లేని విసుగూ వచ్చేస్తోంది. రుచీపచీలేని తిండి ఎందుకంటూ మగడు విసుక్కుంటే, అందులో తన తప్పేంటో తెలీక ఇల్లాలు కూడా ఒంటికాలిపై లేస్తోంది. ఏతావతా.. ఉల్లి ఇప్పుడు అన్నిచోట్లా లొల్లికి కారణమైంది. ఎందుకిలా అంటే చాలా కారణాలు చెప్పుకోవాలి. వేల ఏళ్లనుంచి ఉల్లి వంటింట్లో ప్రధాన వస్తువైపోయింది. పప్పులు, కూరగాయలు లేకపోయినా ఒక్క ఉల్లిపాయ ఉంటే చాలు, ఇల్లాళ్లు వంటలు ఘుమఘుమలాడేలా చక్రం తిప్పేస్తారు. ఎంత ఖరీదైన, అరుదైన వంటకానికైనా పక్కన చెక్కుగానో, ముక్కగానో ఉల్లిపాయ కనపడాల్సిందే. అత్యంత పేదల నుంచి, పెద్దల వరకు ఉల్లికి అలవాటుపడిపోయారు. సాధారణంగా ఏడాదిలో 8 నెలలపాటు అతి తక్కువ ధరకు అందుబాటులో ఉండే ఈ పంట వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు, పంటల దిగుబడి తగ్గినపుడు, కరవు ఏర్పడినప్పుడు ఘాటెక్కిపోతుంది. అందుబాటులో ఉండాల్సిన ధరలు రెట్టింపైనా, అంతకంటే ఎక్కువగా పెరిగినా ఇక పేదలు, మధ్యతరగతి జనాలు గగ్గోలు పెట్టేస్తారు. ఇప్పుడదే జరుగుతోంది. రేట్ల పెరుగుదల ఇలా… దాదాపు నాలుగు నెలలనుంచి క్రమంగా ఉల్లిపాయల రేట్లు పెరుగుతున్నాయి. రెండువారాల నుంచి అది రెట్టింపైంది. బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లిపాయలు 20 రూపాయలుంటే ఇప్పుడు అది 45కు పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 50పైనే ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇది 40నుంచి 60 రూపాయల మేరకు తచ్చాడుతోంది. దేశం మొత్తమీద సగటు కిలో ఉల్లిపాయలు 50 రూపాయలు పలుకుతున్నాయని నిర్ధారించవచ్చు. దేశంలో పేరెన్నికగన్న ఉల్లి మార్కెట్లలోనూ ఊహించని రీతిలో టోకు, రిటైల్ ధరలు తారలను తాకుతున్నాయి. ఈ పరిణామం సగటు భారతీయుడికి భారంగా పరిణమించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెమ్మదిగా మేల్కొని ధరల నియంత్రణకు చర్యలు చేపడుతున్నా ఇంకా పరిస్థితి దారికి రాలేదు. సీజన్‌ల ప్రభావం ఇలా… మనదేశంలో ఉల్లిసాగు మిగతా దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. పైగా కొన్ని దశాబ్దాలుగా ఒకటే విస్తీర్ణంలో ఉల్లిని సాగుచేస్తున్నారు. అంటే ఉల్లిసాగును విస్తృతం చేసేందుకు రైతులు సుముఖంగా లేరన్నమాట. దీనిని వ్యవసాయపంటగా గుర్తించకపోవడంవల్ల అనేక రాయితీలను రైతులు కోల్పోతున్నారు. ఫలితంగా సాగు పెరగడం లేదు. ప్రస్తుతం దీనిని వాణిజ్య పంటగా గుర్తిస్తున్నారు. ఉల్లి సాగుచేసే ‘వ్యవసాయ సంవత్సరాన్ని’ జూన్ నుంచి జులైవరకు పరిగణిస్తారు. రబీ, లేట్ ఖరీఫ్, ఖరీఫ్ సీజన్‌లుగా విభజించి దీనిని సాగుచేస్తారు. ప్రధానంగా రబీలోనే, అంటే ఏప్రిల్, మే నెలల్లో ఉల్లి సాగు ఎక్కువగా ఉంటుంది. అదే కీలకం కూడా. దేశానికి అవసరమయ్యే ఉల్లిలో 60శాతం ఈ రబీలోనే పండిస్తారు. లేట్ ఖరీఫ్ అంటే జనవరి, మార్చిలో ఉల్లిసాగు జరిగినా దేశం డిమాండ్‌లో 25శాతం మాత్రమే ఉత్పత్తి చేస్తారు. ఇక ఖరీఫ్‌లో (సెప్టెంబర్, నవంబర్) నామమాత్రంగా సేద్యం చేస్తారు. అప్పుడు 15శాతం ఉల్లి అందుబాటులోకి వస్తుంది. మొత్తం మీద రబీలో సాగయ్యే ఉల్లికి డిమాండ్ ఎక్కువ. అది కాస్త ఎక్కువకాలం నిల్వ ఉండటం, రుచికరంగా ఉండటం వల్ల దీనికి విలువ ఎక్కువ. ఈసారి రబీలో పంటసాగు దెబ్బతింది. వర్షాలు లేకపోవడం, లేట్‌ఖరీఫ్, ఖరీఫ్‌లో సాగు అనుకున్న విధంగా జరగకపోవడంతో దిగుబడి తగ్గి డిమాండ్ పెరిగింది. డిమాండ్ ఇదీ… మనదేశంలో ఏటా దాదాపు 200 లక్షల టన్నుల ఉల్లి అవసరమవుతుంది. గత ఏడాది 185 లక్షల టన్నుల మాత్రమే దిగుబడి అయ్యింది. అంతకుముందు సంవత్సరం కన్నా 5 లక్షల టన్నుల దిగుబడి తగ్గినట్లయిందన్నమాట. ఇక డిమాండ్‌కు తగ్గట్లు ఉల్లి ఉత్పత్తి సాగవుతోందా అంటే ఔననే చెప్పాలి. కాకపోతే వచ్చిన దిగుబడిని నిల్వ చేసుకునే వ్యవస్థలు ఎక్కడికక్కడ లేకపోవడం, దేశం అంతటా కాకుండా కొన్ని ప్రాంతాల్లోనే ఉల్లి సేద్యం చేయడం, ఉత్పత్తి అయిన ఉల్లిని ఇతర ప్రాంతాలకు సకాలంలో చేరవేయగలిగే సమర్థ రవాణా వ్యవస్థ లేకపోవడంవంటి కారణాలతో సమస్య ఏర్పడుతోంది. దీనికి తోడు రుతుపవనాల ఆలస్యం, దళారుల కృత్రిమకొరత ఉల్లి ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి. నిజానికి మనం ఉత్పత్తి చేస్తున్న ఉల్లి దాదాపుగా మన అవసరాలకు సరిపోతుంది. అయితే వ్యాపారులు అత్యధిక ధర లభ్యమయ్యే కొన్ని దేశాలకు మన ఉల్లిని ఎగుమతి చేస్తూండటంతో ఇక్కడా రేట్లు పెరుగుతున్నాయి. మరికొన్ని దేశాలనుంచి ఉల్లిని దిగుమతి చేసుకుని ధరలు ఎక్కువగా లభించే దేశాలకు మన వ్యాపారులు ఎగుమతి చేస్తూండటంతో దేశీయంగా ప్రజలకు లాభం లేకపోతోంది. మనవాళ్లు మలేషియా, శ్రీలంక, బంగ్లా, ఇండోనేసియా, నేపాల్, ఒమన్, కువైట్, కతార్‌లనుంచి ఉల్లిని తక్కువ ధరలకే దిగుమతి చేసుకుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, సింగపూర్, వియత్నాంలకు ఎగుమతి చేస్తున్నారు. ఇలా చేయడంవల్ల దేశంలో ఉల్లికి డిమాండ్ పెరిగి రేట్లు పెరుగుతున్నాయి. గత సంవత్సరం కనీసం 10 లక్షల టన్నుల ఉల్లిని ఇలా ఎగుమతి చేశారు. ఇలా ఇష్టారీతిని ఉల్లి ఎగుమతులు జరగకుండా కేంద్రప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. కనీస ఎగుమతి ధరను (ఎంఇపి) బాగా పెంచేసింది. ఒకప్పుడు టన్ను ఉల్లిపాయలు ఎగుమతికి 15,900 రూపాయలు ఎంఇపి ఉంటే ఇప్పుడు 29 వేల రూపాయలకు పెంచారు. దీన్ని గత జూన్ నుంచి వర్తింపచేశారు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. ధరలు దిగిరాకపోగా రెట్టింపయ్యాయి. నిజానికి గతేడాది, అంటే 2014-15లో దేశం మొత్తంమీద 11,92,000 హెక్టార్లలో ఉల్లి సాగు చేశారు. 193.57 లక్షల టన్నుల ఉల్లిగడ్డలు ఉత్పత్తి అయ్యాయి. దాదాపు అది మన దేశ అవసరాలకు సరిపోతుంది. కానీ ఎగుమతులు, అక్రమ నిల్వలు, ఉల్లిని దాదాపు ఆరు మాసాలపాటు నిల్వచేయగల వ్యవస్థలు లేకపోవడంతో ఇప్పుడు ఉల్లికి కొరత ఏర్పడింది. రేట్లు పెరగడానికి కారణమైంది. మహారాష్ట్ర పాత్ర దేశంలో ఉల్లి సాగులో మహారాష్టద్రే అగ్రస్థానం. కర్నాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలుగురాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలది ఆ తరువాతి స్థానాలు. దేశం మొత్తంమీద జరిగే ఉల్లిగడ్డల ఉత్పత్తిలో ఒక్క మహారాష్టన్రుంచి 30నుంచి 40 శాతం మేరకు లభిస్తుంది. హోల్‌సేల్ మార్కెట్లు, ఉల్లి నిల్వచేయగల వ్యవస్థలు మహారాష్టల్రో ఉన్నంత పకడ్బందీగా మరే రాష్ట్రంలోనూ లేవు. ఈ రాష్ట్రంలోని పేరెన్నికగన్న హోల్‌సేల్ ఉల్లిమార్కెట్ లాసెల్గావ్. ఇక్కడ ప్రతిరోజు 15వేల క్వింటాళ్ల ఉల్లి క్రయవిక్రయాలు జరుగుతాయి. కానీ ఇప్పుడు కేవలం 5వేల క్వింటాళ్ల వ్యాపారమే జరుగుతోంది. ఇక్కడి మార్కెట్‌లో రేటును బట్టి ఆసియాలో ఉల్లి ధరలు ప్రభావితమవుతూంటాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి క్రయవిక్రయాలు జరిగే మార్కెట్ అన్నమాట. రబీలో ఉత్పత్తి అయ్యే ఉల్లికి డిమాండ్ ఎక్కువ అని అందరికీ తెలుసు. పొడి వాతావరణంలో తయారయ్యే ఈ ఉల్లి కాస్త ఎక్కువ వారాలపాటు నిల్వ ఉంటుంది. తడి లేకుండా, గాలి తగిలేలా వాటిని నిల్వచేయడానికి తగిన సౌకర్యాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఈ సౌకర్యాలే అక్రమార్కులకు ఆయుధాలయ్యాయి. ఎగుమతులపై కేంద్రం దృష్టిపెట్టి నియంత్రణ చర్యలు చేపట్టడంతో వ్యాపారులు జాగ్రత్తపడ్డారు. ఉల్లిని పెద్దమొత్తంలో అక్రమంగా నిల్వ ఉంచారు. మార్కెట్‌లోకి విడుదల చేయకుండా తాత్సారం చేస్తున్నారు. దీంతో కృత్రిమ కొరత ఏర్పడింది. దేశీయ అవసరాల్లో 30శాతం మహారాష్ట్ర తీరుస్తుంది. అదీ రబీ పంటనుంచి లభ్యమయ్యే ఉల్లిలో 40శాతం దేశంలోని ఇతర ప్రాంతాలకు అందిస్తుంది. ఇప్పుడంతా అది అక్రమ నిల్వల్లో ఉండిపోవడంతో కటకట ఏర్పడి రేట్లు పెరుగుతున్నాయి. ఇక ఉల్లి ఉత్పత్తిలో కర్నాటకది రెండోస్థానం. ఎంపీ, గుజరాత్‌లలోనూ ఉల్లి ఉత్పత్తి చేస్తున్నారు. కర్నాటక, ఎంపీలకు రుతుపవనాలు ఆలస్యమవడంతో ఉత్పత్తి దెబ్బతింది. ఇక గుజరాత్, బీహార్‌లలో అతివృష్టివల్ల ఉల్లిసాగు దెబ్బతింది. పైగా ఉల్లి నిల్వలకు ఈ తడి వాతావరణం పెద్దసమస్యగా మారింది. మొత్తమీద ఉల్లికొరత ఏర్పడింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పదివేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ఉత్పత్తి జరుగుతున్నా ఎగుమతి చేసే స్థాయిలో లేదు. కడప-కర్నూలు ఉల్లికి మంచి డిమాండ్ ఉంది. ఉల్లిపాయ చిన్నగా, ఘాటు ఎక్కువగా ఉండే ఈ రకం ఉల్లికి మార్కెట్ ఎక్కువే. అయితే ఇక్కడా రుతుపవనాలు సరిగ్గా లేవు. బీహార్‌లో 21 జిల్లాల్లో ఉల్లిసాగు ప్రధానంగా సాగుతున్నా అననుకూల పరిస్థితుల్లో అది ఉపయోగకరంగా లేదు. ఒడిశాలో ఉల్లిసాగు జరుగుతున్నా అక్కడి అవసరాలకు సరిపోతోంది. దీంతో దేశం మొత్తంమీద ఉల్లికి డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మహారాష్టత్రోసహా వివిధ ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉన్న ఉల్లిని మార్కెట్‌కు తరలించడం, దిగుమతులు పెంచడం, ఎగుమతులు నియంత్రించడం, కొత్త పంట చేతికి అందిరావడం జరిగేవరకు ఈ ధరాఘాతం తప్పదు. అయితే నిత్యావసర పంట అయిన ఉల్లిని దీర్ఘకాలం, అంటే నెలలకు నెలలు దాచిపెట్టే సౌలభ్యం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రెండు లేదా మూడు నెలలకు మించి నిల్వ ఉంచడం సాధ్యం కాదు. మహా అయితే నాలుగు నెలలు. ఆ తరువాతైనా మార్కెట్‌లోకి రావలసిందే. అయితే ఉల్లి రేటు పెరిగిన వెంటనే విడతల వారీగా అక్రమ నిల్వలను పంపిణీలోకి తీసుకువస్తున్నారు. అలా చేయకపోతే అసలుకే మోసం వస్తుందని వారికి తెలుసు. కొత్త పంట చేతికొచ్చేవరకు ఈ ధరల తాకిడి ఉంటుంది. అంటే నవంబర్ వరకూ అన్నమాట. ఈలోగా వర్షాలు పడితే కొంత మార్పు వస్తుంది. ఇలాగే పరిస్థితులు కొనసాగి కరవు ఏర్పడితే మరిన్ని కష్టాలు తప్పవు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే ఉల్లి వాడకం తెలుగురాష్ట్రాల్లో కాస్త తక్కువే. ఏపీతో పోలిస్తే తెలంగాణలో కాస్త ఎక్కువ. తెలంగాణలో 2వేల హెక్టార్లలో స్థిరంగా ఉల్లిసాగు చేస్తూంటే ఏపీలో 15వేల హెక్టార్లలో ఉల్లి సాగు చేస్తున్నారు. ఏపీ ఉల్లిలో సగానికి సగం ఎగుమతి అవుతోంది. సాధారణంగా ఈ రాష్ట్రాల్లో ఉల్లికి కొరత ఉండదు. ఏపీకి ఒడిశా నుంచి, తెలంగాణకు మహారాష్ట్ర నుంచి ఉల్లి సరఫరా అవుతోంది. ఇప్పుడు కొరత ఏర్పడిన నేపథ్యంలో ఇక్కడి మార్కెట్లలోనూ ఉల్లి కిలో 40 రూపాయలు పలుకుతోంది. ఇది ఇంకాస్త పెరగవచ్చు. నెలరోజులుగా ధర పెరగడమేకాని తగ్గుముఖం పట్టలేదు. హైదరాబాద్ బిర్యానీకి ఎంత గిరాకీ ఉందో, దాంతోపాటు ఉల్లిపాయలకూ అంతే గిరాకీ ఉంది. బిర్యానీ, చపాతీలకు ఉల్లిముక్కలు లేకుండా తినడం ఇక్కడివారికి అలవాటు లేదు. ఇప్పటి పరిస్థితిలో ఉల్లిపాయలు ఇవ్వలేక హోటల్ యజమానులు అవస్థలు పడుతున్నారు. ‘నో ఆనియన్స్ ప్లీజ్’ అన్న బోర్డులు పెట్టి వినియోగదారులను దూరం చేసుకోకుండా జాగ్రత్తపడుతున్నారు. ఉల్లిసాగును ఉద్యానవనశాఖ పరిధిలో ఉంచడం, దీనిని వాణిజ్య పంటగా గుర్తించడంవల్ల రైతులు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. మిగతా పంటలను నిల్వ చేసే వ్యవస్థలు ఉండగా అటు ఏపి, ఇటు తెలంగాణలో ఉల్లిని నిల్వచేసే గిడ్డంగులు లేవు. అటు ప్రభుత్వ మార్కెటింగ్ సంస్థలూ ఈ విషయంపై చర్యలు తీసుకోలేదు. వ్యవసాయ క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో ఎనిమిది నెలలు మాత్రమే ఉల్లి సాగవుతుంది. అందులో రబీలో మాత్రమే సగానికిపైగా విస్తీర్ణంలో సేద్యం చేస్తారు. మిగతా నెలల్లో ఉల్లి దిగుబడి తక్కువగా ఉంటుంది. కనుక అప్పుడు రేటు పెరుగుతుంది. ఆ సమయానికి ఉల్లి అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు ముందే నిల్వలు చేసి జాగ్రత్తపడటం కనీస కర్తవ్యం. కానీ అది జరగడం లేదు. ముందుచూపు లేని ప్రభుత్వ వైఖరిని ఆసరా చేసుకుని దళారులు, వ్యాపారులు రెండు చేతులా సంపాదిస్తున్నారు. అటు రైతు, ఇటు వినియోగదారుడు ఎప్పటిలా మోసపోతూనే ఉన్నారు. రాజకీయాలు ఉల్లి ధరలు పెరిగినప్పుడల్లా రాజకీయ పార్టీలు గగ్గోలు పెడతాయి. నిజానికి ఎన్నికల వేళ ఉల్లి ధరలు పెరిగితే రాజకీయ పార్టీలకు గుండెదడ పెరుగుతుంది. జనతా ప్రభుత్వం ఉల్లిఘాటుకే దెబ్బతింది. 2010లో మళ్లీ ఉల్లిధరలు అమాంతం పెరిగి అందర్నీ భయపెట్టాయి. గతంలో దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఉల్లిధరల పెరుగుదల ఓ అంశమైపోయింది. ఇప్పుడు అధికారంలో ఉన్న ఆప్ సర్కార్‌ను తాజా పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దిల్లీలో ఉల్లిధరలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఉల్లి వాడకం కూడా ఎక్కువ. అందువల్ల డిమాండ్ ఎక్కువే. కేంద్రంపై విమర్శలు చేసి పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నాల్లో ఆప్ సర్కార్ ఉన్నా సగటు పౌరుడు అది వినే పరిస్థితి లేదు. ఇప్పుడిప్పుడే రాజకీయ పార్టీలు వీధికెక్కుతున్నాయి. వారితో సామాన్యులూ గొంతు కలుపుతున్నారు. మొత్తానికి ఉల్లి లొల్లి పెరుగుతోంది. ఇది మనదేశంలోనే కాదు. అటు ఇరుగుపొరుగు దేశాల్లోనూ ఇదే పరిస్థితి. పాకిస్తాన్, బంగ్లా, నేపాల్, భూటాన్‌లలోనూ ఇప్పుడు ఉల్లిఘాటు అందర్నీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భారత్‌లో ఉల్లిధరలు పెరగడం, ఎగుమతులపై నియంత్రణ ఉండటంతో తమకు ధరలభారం మరింత పెరుగుతుందని బంగ్లాదేశ్ భయపడుతోంది. అటు ఖాట్మండూలోనే ఉల్లి మంటపుట్టిస్తోంది. మనదేశంలో ప్రతి వంటిల్లు ఉల్లిలేక తల్లడిల్లుతూంటే పొరుగుదేశాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి కనీసం నవంబర్ వరకు ఇలాగే ఉంటుందని అంచనా. ఉల్లి చేసే మేలు తల్లి చేయదంటారు. అందుకే మనవాళ్లు ఉల్లిని తల్లికంటే ఎక్కువగా చూసుకుంటారు. అది లేక ఇప్పుడు తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వాలు ఏం చేయాలి… ఉల్లి ధరలు పెరిగి విమర్శలు వెల్లువెత్తుతూండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఇవి తాత్కాలిక ఉపశమనమే ఇస్తాయి. ఏటా ఎదురయ్యే ఈ సమస్యకు శాశ్వత ప్రాతిపదికన, నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉల్లి ధరలు అమాంతం పెరగడం, ఒక్కోసారి నేలను తాకడం జరుగుతుంది. వాతావరణ, మార్కెట్ పరిస్థితులను గమనించి రైతుకు, వినియోగదారుడికి మేలు జరిగేలా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా కదలాల్సి ఉంటుంది. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా ఉల్లిసాగు చేసే భూమి విస్తీర్ణం పెరగాలి. కొన్ని దశాబ్దాలుగా ఈ విస్తీర్ణంలో మార్పు లేదు. ఉల్లి సాగుకోసం రైతులను ప్రోత్సహించాలి. మార్కెటింగ్, నిల్వలకోసం ఆధునిక సౌకర్యాలతో కూడిన గిడ్డంగులు, ఇతర వ్యవస్థలను సంఘటితం చేయాలి. ఉల్లిని వ్యవసాయ పంటగా గుర్తించి సబ్సిడీలు, విత్తనాల సరఫరా చేసి రైతులను ఆదుకోవాలి. యాజమాన్య పద్ధతులను, మెలకువలను వివరించి అధిగ దిగుబడి సాధించేలా రైతులకు శిక్షణ ఇవ్వాలి. ఇప్పుడివేవీ జరగడం లేదు. అమెరికాలో ఎకరాకు 30 టన్నుల ఉల్లి దిగుబడి అవుతూంటే, గుజరాత్‌లో ఎకరాకు 27 టన్నులు దిగుబడి వస్తోంది. మహారాష్టల్రో 20 టన్నులు, ఏపీ-తెలంగాణల్లో 15 టన్నులకు మించి దిగుబడి రావడం లేదు. రైతులకు రుణసౌకర్యం, వారే సరుకును మార్కెట్‌కు తరలించుకునే వెసులుబాటు కల్పించాలి. దళారుల పాత్ర పరిమితం చేయాలి. ధరలు పెరిగినప్పుడల్లా పౌరసరఫరాలశాఖ, ప్రత్యేక కేంద్రాల ద్వారా వినియోగదారులకు తక్కువ ధరతో ఉల్లిని సరఫరా చేస్తున్నారు. కానీ ఇది కొంతమందికే, కొంతమేరకే ఉపయోగపడ్తుంది. ఇది ఉపశమన చర్యగానే మిగిలిపోతుంది. దళారులను నిలువరించి, రైతును ప్రోత్సహించి, ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తే తప్ప ఇలాంటి పరిణామాలు తరచూ ఎదురవుతూంటాయి. * బ్యాక్టీరియాను నాశనం చేసే గుణం ఉల్లికి ఉంది. కోసి వదిలేసిన ఉల్లిలో నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఉల్లి పాడైందనడానికి అది సంకేతం కాదు. అక్కడి గాలిలో ఉన్న బ్యాక్టీరియా ఉల్లిలో చేరిందన్నమాట. అయితే, అందులో ఉండే రసాయనాల ధాటికి అవి మరణించి అలా మసిగా ఏర్పడతాయి. ఉల్లివాసన ఇష్టపడే బ్యాక్టీరియా అక్కడకు చేరి ఆ ఘాటుకు మరణిస్తుందన్నమాట. దీనినిబట్టి కోసి వదిలేసిన ఉల్లిని వాడకపోవడమే మంచిది. ఫ్లూవంటి జ్వరాల బారిన పడిన వారి పక్కన ఉల్లి ముక్కలను ఉంచితే మంచిదని చెబుతారు. * దేశంలో మహారాష్ట్ర ఏటా 4660 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డల ఉత్పత్తితో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానాల్లో ఎంపి 2691, కర్నాటక 2395, ఏపీ, తెలంగాణ కలిపి 1565, బీహార్ 1107, గుజరాత్ 704, హర్యానా 604, రాజస్థాన్ 476, యు.పి. 474, తమిళనాడు 429 మెట్రిక్ టన్నులతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. * ఉల్లిపాయలు నాలుగు రంగుల్లో లభ్యమవుతాయి. మనం నిత్యం చూసే నీరుల్లి ఎరుపు, గులాబీ, పసుపు, తెలుపు (వెల్లుల్లి కాదు)లో అవి ఉంటాయి. ప్రపంచం మొత్తమీద 70శాతం మేరకు పసుపువర్ణంలో ఉండే ఉల్లిపాయలనే వాడతారు. * ప్రపంచం మొత్తమీద 9,000,000 ఎకరాల్లో ఉల్లిని సాగు చేస్తున్నారు. దాదాపు 170 దేశాల్లో ఉల్లి సాగు జరుగుతోంది. ప్రపంచం మొత్తంమీద ఉత్పత్తి అయ్యే ఉల్లిలో 8 శాతం అంతర్జాతీయ ట్రేడింగ్ జరుగుతోంది. మిగతాది ఎక్కడికక్కడ సొంతానికి వాడుకుంటున్నారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హంతకులతో చర్చలు -విఫల ప్రయోగాలు

సమాజహితుడు దభోల్కర్‌
‘నేను అందరికోసం పోరాడుతున్నాను, ఏ కొందరి మీదో కాదు, అదీ భారత రాజ్యాంగ చట్టాలతోనే. నా దేశంలో, నా ప్రజల మధ్య పోలీసుల భద్రత తీసుకుంటే, నాలోనే ఏదో దోషం ఉన్నట్లు కాగలదు’ అని అనేక హత్యాబెదిరింపులను ఎదుర్కొన్న నరేంద్ర దభోల్కర్‌ పోలీసుల భద్రతను తిరస్కరించారు. 2013 ఆగస్టు 20న హత్యకు గురైనారు. మూఢ నమ్మకాలు, అతీంద్రియ శక్తులపై నమ్మకం, కపట స్వామీజీలు, నకిలీబాబాల వలన సామాన్య ప్రజలు తీవ్ర కష్టనష్టాలకు గురౌతున్నారని, వాటిని నిర్మూలించాలనే లక్ష్యంతో ‘మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలనా సమితి’ని దభోల్కర్‌ స్థాపించారు. దాని ద్వారా జీవితాంతం అలుపెరుగని పోరాటం చేసారు.

1945 నవంబర్‌ 1న అచ్యుత్‌, తారాబాయి దంపతులకు పదవ సంతానంగా నరేంద్ర పుట్టారు. సతారా, సాంగ్లి పట్టణాలలో చదివారు. మిరాజ్‌ మెడికల్‌ కళాశాలలో వైద్యవిద్య పూర్తి చేసారు. పూణేలో వైద్య వృత్తి ప్రారంభించారు. మహారాష్ట్ర సింధుదుర్గ్‌ జిల్లాలోని దభోలి గ్రామం జన్మస్థలం కావటం వల్ల దభోల్కర్‌ అయ్యారు. నరేంద్ర భార్య శైల కూడా డాక్టర్‌. వారి మొదటి సంతానం హమిద్‌. ప్రగతిశీల ముస్లిం, ప్రముఖ హేతువాది ‘హమిద్‌ దల్వాయి’పై ఉన్న అభిమానంతో ఆ పేరు పెట్టుకున్నారు. ముక్తా రెండవ సంతానం.

మహారాష్ట్ర అంటేనే ఎందరో సంఘ సంస్కర్తలు గుర్తుకొస్తారు. 19వ శతాబ్ది, మహారాష్ట్రలో సంస్కర్తల శతాబ్ది. మహా గోవిందరనడే, గోపాల్‌ హరి దేశ్‌ముఖ్‌(లోక్‌ హితవాది), గోపాల్‌ గణేష్‌ అగార్కర్‌, జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, పండిత రమాబాయి, సాహు మహారాజ్‌, డాక్టర్‌ అంబేద్కర్‌… ఇలా ఎందరో మహానుభావులు ఆ శతాబ్దిలో పుట్టి, తమ శక్తి మేరకు సంస్కరణ మార్గంలో సాగినవారే. వారి కృషి ఫలితంగానే మహారాష్ట్ర ప్రజల జీవితాన అంతో ఇంతో సామాజిక ప్రగతి సాధ్యమయ్యింది. పీష్వాలు, దేశ్‌ముఖ్‌ల వంటి అగ్రవర్ణ భూస్వాముల సాంస్కృతిక పీడనల నుంచి వారికి విముక్తి లభించినట్లయ్యింది. భారత స్వాతంత్ర పోరాట కాలంలో కూడా సాంఘిక సంస్కర్తలు తమ పని తాము చేస్తూపోయారు. స్వాతంత్య్రం సిద్ధించాక కూడా సానేగురూజీ, బాబా అధవ్‌ లాంటివారు ఆ మార్గంలో వున్నారు. వారి ప్రభావం కూడా దభోల్కర్‌ను తట్టిలేపింది.

డాక్టర్‌ నరేంద్ర 1980 వరకు దాదాపు 10 సంవత్సరాలు వైద్య వృత్తిలో ఉంటూ ప్రజా వైద్యుడుగా పేరుపొందారు. దానితో సంతృప్తి చెందక సమాజంలో చేయవలసినది చాలా ఉందని భావించి, గ్రామాల్లో తిష్ట వేసిన కులతత్వాన్ని, దళితులపై కొనసాగుతున్న ఆకృత్యాలను తొలగించటానికి పూనుకున్నారు. ‘ఒక ఊరు – ఒక బావి’ ఉద్యమంలో ప్రవేశించారు. అగ్రకుల ఆధిపత్యం హక్కులను హరిస్తుందని గుర్తించారు.
విద్యార్ధులలో శాసీ్త్రయ అవగాహన పెంపొందించటానికై ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించారు. అలాగే ‘విజ్ఞాన బోధ వాహిని’ పేరుతో ఒక సంచార పరిశోధనాశాలను మహారాష్ట్రమంతా తిప్పి సైన్సు ప్రయోగాలు చేసి చూపించారు. వీరు స్థాపించిన ‘మహారాష్ట్ర అంధశ్రద్ద నిర్మూలనా సమితి (కఅూఖి)’ అన్ని మతాలలో వున్న మూఢ ఆచారాలకు, అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా కృషి చేసింది, చేస్తూనే ఉంది. నకిలీ బాబాలు, దొంగ స్వాములు తాంత్రికుల మోసాలను బయటపెడుతూ చేతబడి, జ్యోతిష్యం, వాస్తు వంటి వాటికి వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా, ‘‘చేతబడి, మూఢ విశ్వాసాల వ్యతిరేక చట్టం’’ ఒక దానిని రూపొందించి దాన్ని 2008లో అసెంబ్లీలో ప్రవేశ పెట్టించారు. కానీ మతవాద శక్తుల ప్రాబల్యంతో ఆ బిల్లు మూలన పడింది. ఈ బిల్లు కేవలం మోసపూరిత, దోపిడీ చర్యల నిరోధానికి మాత్రమే అని వివరించినా ఆ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. దభోల్కర్‌ హత్యానంతరం, 2013, ఆగస్టు 26న మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ బిల్లులో కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఆర్డినెన్సు రూపంలో విడుదల చేసింది.
ఆనాటి బ్రూనో, కోపర్నికస్‌ల దగ్గర నుంచి ఈనాటి ప్రేమానంద్‌, నరేంద్ర దభోల్కర్‌ వరకు గమనిస్తే…. శాస్త్ర విజ్ఞానం, జనంలో చైతన్యం పెరుగుదలను జీర్ణించుకోలేని మతవాద శక్తుల కుట్ర కనిపిస్తుంది. మతవాదుల చర్యలు రాజ్యాంగ లక్ష్యమైన లౌకిక వాదానికి పెను ప్రమాదంగా మారుతున్నాయి.
నరేంద్ర ఏ విలువల సాధన కోసం, ఏ కలల సాకారం కోసం ప్రాణత్యాగం చేసారో వాటిని సమాజంలో నెలకొల్పటం చాలా అవసరం. ఆ పనిని రాజకీయ పార్టీలు, చట్ట సభలు చేస్తాయని ప్రస్తుత పరిస్థితులలో ఆశించలేము. ఆయన ఉద్యమ ఆచరణ, కార్య దీక్ష దేశంలోని అభ్యుదయ వాదులకు, ప్రగతిశీలురందరికీ ప్రేరణ కావాలి.
– వి.వి. ప్రసాద రావు
జన విజ్ఞాన వేదిక
(రేపు నరేంద్ర దభోల్కర్‌ ద్వితీయ వర్ధంతి)

 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జవాన్ల ఆగ్రహం ,మరియు చారిత్రికామ్శాలు



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఓ ఆత్మీయ అంకురం – బందా

ఓటరు అనబడే అశ్వికునికి తనను మోసే(ఎన్నుకుని ఆధికారాన్ని అందించిన)జవనాశ్వమంటే ఎంతో ఇష్టం — కానీ తనకు కావల్సిన మార్గంలో ఆ అశ్వం వెళ్ళేందుకు అప్పుడప్పుడూ అదిలిస్తూ వుండాలి — 

అలాగే ఓటరు అనబడే మావటికి తన మదగజమంటే ఎంతో ఇష్టం , కానీ తన లక్ష్యసాధనలో అంకుశాన్ని వినియోగించి ఆ  మదగజాన్ని నియంత్రించాలి — అదే ప్రజాస్వామ్యం —
             ఇక చదవండి  ఓ ఆప్త వాక్యాన్ని  కవితగా  రాజధాని – ఓ అంకురం – బందా

img177

Posted in కవితలు | Tagged | Leave a comment

కాలానికి పట్టు గొమ్మ ”మళ్ళీ చిగురించనీ


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లవణం మరణం


 

 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాష్ట్రపతి ఆవేదన మరియు అరబిందో జయంతి

యుద్ధభూమిగా పార్లమెంటు..రాష్ట్రపతి ప్రణబ్ ఆవేదన
పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు
  • వేళ్లు బలంగా ఉన్నా ఆకులు వాడిపోతున్నాయి
  • ఈ విషయాన్ని అంబేడ్కర్‌ ఎప్పుడో చెప్పారు
  • పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలి
  • మానవత్వంపై నమ్మకాన్ని సడలనివ్వొద్దు
  • గురుశిష్యుల బంధానికి అర్థం మారిపోతోంది
  • రాష్ట్రపతి ప్రణబ్‌పంద్రాగస్టు సందేశం

న్యూఢిల్లీ, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు చర్చలకు వేదిక కాకుండా యుద్ధభూమిగా మారిందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ఒత్తిడికి లోనవుతోందని, రాజకీయ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం రాత్రి ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘భారత సమాజం విలువలతో కూడుకున్నది. మనం పాటించే విలువల ద్వారా దేశాభివృద్ధిని చూపించవచ్చు. భారతదేశానికి పటిష్ఠమైన రాజ్యాంగం ఉంది. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అత్యంత విలువైనది. ప్రజాస్వామ్యమనే అతి పెద్ద వృక్షానికి వేళ్లు బలంగా ఉన్నాయి. కానీ, ఆకులు మాత్రం వాడిపోతున్నాయి. మనం పునఃపరిశీలన చేసుకోవాల్సిన తరుణమిదే’’ అని స్పష్టం చేశారు. ‘‘ప్రజాస్వామ్య సంస్థలు ఒత్తిడిలో ఉంటే.. ప్రజలు, వారి పార్టీలు తీవ్రంగా లోతుగా ఆలోచించాల్సిన తరుణం ఇదే. మనం కనక ఇప్పుడు స్పందించకపోతే, సరైన చర్యలు తీసుకోకపోతే, 1947లో భారత కలను సాకారం చేసిన యోధులకు మనం ఇస్తున్న గౌరవం, మర్యాదలను మన ముందు తరాలు మనకు ఇస్తాయా? దీనికి జవాబు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. కానీ, ఈ ప్రశ్నను మాత్రం వేసుకుని తీరాల్సిందే’’ అని ప్రణబ్‌ వ్యాఖ్యానించారు. భారత జాతి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ఎన్నో దుష్ట శక్తులు కుట్రలు చేస్తున్నాయని, వాటిని సహనంతో, చాకచక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పదేళ్ల దేశ ఆర్థిక ప్రగతి ప్రశంసనీయంగా ఉందన్నారు. విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులపై రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. గురుశిష్యుల బంధానికి అర్థం మారిపోతోందని ఆందోళన చెందారు. ఉగ్రవాదులకు సిద్ధాంతం, మతం లేదని, భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉగ్రవాదులు తమ భూభాగాన్ని అడ్డాగా మార్చుకోవడానికి పొరుగు దేశాలు సహకరించకూడదని గట్టిగా హెచ్చరించారు.

అరబిందో… ఒక నిశ్శబ్ద చైతన్యం ! (14-Aug-2015)
ఆగస్టు 15న అరబిందో జయంతి
మానవ పరిణామ ప్రక్రియను పురోగమన దిశలో నడిపించే క్రమంలో శ్రీ అరవిందులు మానవ జాతికి చేసిన సేవ అపూర్వమైనది. శ్రీ అరవిందుల జీవితాన్ని రెండు అంకాలుగా విభజిస్తే.. మొదటిది భారతమాతను దాస్యశృంఖలాల నుంచి విడిపించడానికి విప్లవాత్మక భావాలతో, అనర్గళ ఉపన్యాసాలతో, ‘ఆర్య’ పత్రిక స్థాపనతో జాతిని ఉత్తేజితం చేసిన స్వాతంత్య్ర సమరయోధులు అరబింద్‌ఘో్‌షగా కనిపిస్తారు. రెండో అంకంలో భౌతికాధ్యాత్మికతల సమన్వయంతో మానవజాతిని భవబంధశృంఖలాల నుంచి విముక్తం చేసి, అతిమానస సాధన వైపు తీసుకుపోయే మహాయోగిగా అనిపిస్తారు.
1872 ఆగస్టు 15న తేదీన జన్మించిన అరబిందో చిన్న వయసు నుంచే ఇంగ్లండ్‌లో విద్యనభ్యసించారు.
ఆ సమయంలో మన దేశంలో ఐపీఎస్‌ పరీక్ష అతి కష్టమైనది. అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యమైనది. అలాంటి పరీక్షలో 21 ఏళ్లకే ఉత్తీర్ణుడైన అరబిందోకు ఉద్యోగం నచ్చలేదు. ఇంగ్లాండ్‌ నుంచి భారత్‌కు రాగానే ఒక విస్తృతమైన ప్రశాంతత, నిశ్శబ్దాలు ఆయనను ఆవరించాయి. జనచైతన్యం కోసం ఉద్యమాన్ని విస్తృతం చేయాలనే భావన బలపడింది. అదే సమయంలో ఆయన మహారాష్ట్రకు చెందిన విష్ణుభాస్కర్‌ లేలే అనే యోగిని కలిశారు. మూడు రోజుల ధ్యానం ఆయన జీవితాన్ని మార్చేసింది. బ్రహ్మచైతన్య అనుభవాన్ని పొందగలిగారు. ఒక వైపు ఆధ్యాత్మిక మార్గం, మరోవైపు దాస్యశృంఖలాలను తెంపటానికి చేసే స్వాతంత్య్ర ఉద్యమం. ఈ రెండింటిలోను అరబిందో తనదైన ముద్రను వేయగలిగారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఒక ఏడాదిపాటు ఆయన జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అతివాద రాజకీయవాదిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అరబిందో ఆ తర్వాతి కాలంలో మహాయోగి అరవిందులుగా మార్పు చెందారు. యోగకార్య నిమిత్తం పాండిచ్చేరిలో ఆశ్రమాన్ని స్థాపించారు. శక్తిస్వరూపుణి శ్రీమాత మిర్ర ఆగమనంతో పాండిచ్చేరి ఆచరణాత్మక పూర్ణయోగ సాధనకు నిలయమైంది.
జ్ఞాన సారంశమిది..
ప్రస్తుతం మానవజాతి ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దీనిని ఆధ్యాత్మికత కానీ, హేతువాద భావనలు కానీ, విజ్ఞాన శాస్త్ర ప్రగతి కాని వేర్వేరుగా అడ్డుకోలేవు. ఈ మూడు సమన్వయంతో పనిచేసినప్పుడే- ఈ సంక్షోభం తొలగిపోతుంది. జీవితాన్ని శత్రువుగా భావించే ఏ ఆదర్శమూ మానవునికి వెలుగుబాట చూపలేదు. అదేవిధంగా అంతరాత్మను కాదనే ఆధునిక దృక్పథం కూడా పరిష్కారం కాదు. జీవితానికి, ఆధ్యాత్మికతకు జరుగుతున్న సంఘర్షణ పూర్తి అవగాహనతో తొలిగిపోవాలి. అప్పుడు జీవితమంతా యోగమే (all life is yoga) అవుతుంది. పదార్థం నుంచి జరిగిన పరిణామంలో మానవుడు ఇంకా మధ్యంతరస్థిలోనే ఉన్నాడు. దివ్యచైతన్య ఆవిర్భావంతో ఈ స్థితి నుంచి దైవం వైపుగా పయనించగలడు. అసమగ్రంగా ఉన్న భౌతిక, ప్రాణిక, మానసిక స్వభావాలలో పరివర్తన జరగాలి. అప్పుడే దివ్యచైతన్యం భూమి మీద అవతరించి భూమి మానవ జీవితాన్ని స్వర్గతుల్యం చేస్తుంది. అరవిందుల పూర్ణయోగ, హఠయోగ, రాజయోగ, కర్మ, జ్ఞాన, భక్తి యోగాలన్నీ మనుషులను ఈ మార్గంలో ప్రయాణించేలా చేస్తాయి. తన జీవితాన్ని మానవహితానికి త్యాగం చేసిన మహర్షి అరవిందులు 1950 డిసెంబర్‌ 5న దేహపరిత్యాగం చేశారు. ‘సింథసిస్‌ ఆఫ్‌ యోగ’, ‘లైఫ్‌ డివైన్‌’, ‘గీతావ్యాసాలు’, ‘వేదోపనిషత్తుల వివరణలు’, ‘యోగలేఖలు’, ‘భారతీయ సంస్కృతి పునాదులు’ వంటి ఎన్నో అద్భుత రచనలు దివ్య చైతన్య ప్రవాహంలా ఆయన కలం నుంచి జాలువారాయి.ఆయన రచించిన ‘సావిత్రి’ మహాకావ్యంలో ప్రతి పద్రమూ మంత్రాక్షరంగా పనిచేసి, చైతన్య విస్తారం జరిగి నిశ్శబ్దస్థితిని ప్రసాదిస్తుంది.
సునీత శేఖర్‌,
934623546741
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బిహార్‌పై ఉత్కంఠ!

బిహార్‌పై ఉత్కంఠ!

  • 13/08/2015
TAGS:

మరి కొన్ని వారాల వ్యవధిలో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా అత్యంత సంక్లిష్ట రాజకీయ వాతావరణంలో అసెంబ్లీ పోరాటం జరుగబోతోంది. వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన అధికార జెడియూ నేత నితీష్ కుమార్ మూడోసారి కూడా పగ్గాలు చేపట్టేందుకు దూకుడుగానే వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్రానికి సంబంధించినంత వరకూ బలమైన ప్రాంతీయ పార్టీలైన ఆర్‌జెడి, జెడియూలకు తీవ్ర విఘాతానే్న కలిగించాయి. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే మోదీ సారథ్యంలో బిజెపి దూసుకుపోయింది. మెజార్టీ లోక్‌సభ సీట్లను కైవసం చేసుకోవడంతో లాలూ, నితీష్‌లకు కంగుతినే పరిస్థితే ఎదురైంది. అనంతరం మాజీ జనతాదళ్ పార్టీలన్నింటినీ కలుపుకుని జనతాపరివార్‌గా ఏర్పాటుచేసేందుకూ గట్టి ప్రయత్నమే జరిగినా అది ఫలించలేదు. ఈ పరివార్ ఏర్పాటుకు కొన్ని పార్టీలు ముందుకు వచ్చినా అనంతర పరిణామాల నేపథ్యంలో వెనక్కి తగ్గాయి. ఈ కూటమిలో చేరితే తమ వ్యక్తిగత ఉనికిని కోల్పోతామని భావించిన మాజీ జనతాదళ్ నేతలు ఎవరిదారి వారు చూసుకున్నారు. దానితో రాష్ట్రానికే చెందిన జెడియూ, ఆర్‌జెడిలు చేతులు కలిపి పోటీ చేయక తప్పని అనివార్య పరిస్థితే ఏర్పడింది. దాణా కేసులో జైలు శిక్ష అనుభవించి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఆర్‌జెడి నేత లాలూ ప్రసాద్‌కు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేకపోవడంతో మరోమార్గం లేక జెడియూతో చేతులు కలపడమే కాక మనసు అంగీకరించక పోయినా ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ పేరు నే బలపరిచారు. ఆ విధంగా చేతులు కలిపిన ఈ రెండు పార్టీలకు కాంగ్రెస్, ఎన్‌సీపీలు తోడుకావడంతో బలమైన ప్రాంతీయ కూటమి ఏర్పడినట్టయింది. ఈ కూటమి ఎంత మేరకు రాణిస్తుంది? గెలుపే ధ్యేయంగా చేతులు కలిపిన ఈ నాలుగు పార్టీలు చివరి వరకూ ఎలాంటి విభేదాలకు ఆస్కారం లేకుండా ముందుకు సాగుతాయా అన్నది అనేక సానుకూల, ప్రతికూల అంశాలపైన ఆధారపడి ఉంటుంది.
ఇప్పటికిప్పుడు అలాంటి సమస్యేమీ లేకపోయినా రానున్న కొద్ది రోజుల్లో ఈ కూటమి భాగస్వామ్య పక్షాల ధోరణి విస్మయాన్ని కలిగించేదిగా మారినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.నరేంద్ర మోదీ సారథ్యంలో బిజెపికి ఏ విధంగా చూసినా కూడా బిహార్ అసెంబ్లీ ఎన్నికలు కత్తిమీద సాము చందం. పదహారో లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రధాని మోదీ ప్రభంజనం పనిచేసినా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిల ఫలితాలు మాత్రం కమలనాథులకు చేదు అనుభవానే్న మిగిల్చాయి. మోదీ సహా మొత్తం కేంద్ర కేబినెట్ మం త్రులందరూ ప్రచారానికి దిగడంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం నల్లేరుపై బండి నడక చందమేనని భావించారు. కానీ కథ అడ్డం తిరిగింది. మొత్తం 70అసెంబ్లీ సీట్లలో 67సీట్లు కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ వశమయ్యాయి. చివరి క్షణం వరకూ పోరాడి మోదీ జనాకర్షణ శక్తితో రాణిస్తామని భావించిన బిజెపికి ఆశాభంగం కలగడంతో ఇతర ప్రతిపక్ష పార్టీలకు కొంత ఊపిరి లభించినట్టయింది. ఏడాది లోనే మోదీ జనాకర్షణ వనె్న తగ్గుతోందని భావించిన కాంగ్రెస్ సహా అనేక విపక్షాలు ఎదురుదాడికి దిగడం మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలు బిజెపికి అత్యంత ప్రతిష్ఠాత్మకంగానే మారాయి. ప్రధాని మోదీ విషయంలో విపక్షాల అంచనాలు తారుమారు చేయాలంటే..అత్యంత వ్యూహాత్మక రీతిలో పావులు కదిపి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తీరాల్సిందే. అయితే అది ఎంత వరకూ సాధ్యమవుతుంది? ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా రాజకీయ పాచికలు అనుకున్న స్థాయిలో ఫలితాలను ఇస్తాయా అన్నది ఆసక్తి కలిగించే అంశం. పదహారో లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఘన విజయానికి సూత్రధారిగా పనిచేసిన అమిత్ షా వ్యూహం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పని చేయని నేపథ్యంలో ఇప్పుడు బిహార్ పరిస్థితి ఆయనకు అగ్నిపరీక్షగానే మారింది. సామాజిక అనుసంధానమే విజయ సూత్రంగా భావిస్తున్న అమిత్ షా తన ఎన్నికల విజయ వ్యూహానికి ప్రధాని మోదీ జనాకర్షక శక్తిని రంగరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడమన్నది మోదీ రాజకీయ ప్రాభవానికి మరింత వనె్న తేవడమే కాకుండా అనంతరం జరిగే అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బిజెపి విజయానికి బలమైన పునాదిగా పనిచేస్తుంది.
ప్రస్తుతం లోక్‌సభలోనే మెజార్టీ కలిగిన బిజెపికి రాజ్యసభలోనూ పైచేయి కావాలంటే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాల్సిందే. ఆ విధంగానే జాతీయ స్థాయిలో చేపట్టిన అనేక పథకాలు, కార్యక్రమాలను రానున్న నాలుగేళ్ల కాలంలో ముందుకు తీసుకెళ్ల గలుతుంది. సునాయాసంగానే పార్లమెంట్ ఉభయ సభల ఆమోదాన్నీ పొందగలుగుతుంది. ఈ నేపథ్యంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నువ్వానేనా అన్న రీతిలోనే ఉంటాయన్నది స్పష్టం. ఇంతకీ బరిలోకి దిగిన పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలేమిటి? అధికారం సునాయాసంగా చేతికందే విధంగా ప్రజల్ని ఆకట్టుకునేందుకు ఇవి అనుసరిస్తున్న మార్గాలేవిటన్నవి కూడా ఆసక్తిని కలిగించేవే. మిగతా రాష్ట్రా ల్లో మాదిరిగా కాకుండా బిహార్ ఎన్నికల్లో కులాల ప్రాధాన్యత ఎక్కువే. ఆక్కడ బలంగా ఉన్న పార్టీ ల బలం కూడా వీటిపైనే ఆధారపడి ఉందన్నదీ ఎంతైనా వాస్తవం. ఇప్పటికే రాష్ట్రాన్ని పలుమార్లు పాలించిన ఆర్‌జెడి ముస్లిం, యాదవ ఓట్లపైనే ఆశలు పెట్టుకుంది. పదిహేడు శాతం ముస్లింలు, 13శాతం యాదవ ఓట్లు గంపగుత్తగానే తనకు పడతాయన్న ధీమా నిన్న మొన్నటి వరకూ ఆర్‌జెడికి ఉండేది. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో లాలూ ఓటు బాంకు తలకిందులయ్యే పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా జెడియూతో కాంగ్రెస్ చేతులు కలుపడంతో ముస్లిం ఓట్లు ఇంకెంత మాత్రం తనకు పడవని భావించిన లాలూ అనివార్యంగానే తన రాజకీయ భవితను పణంగా పెట్టి జెడియూకు మద్దతు ప్రకటించాల్సి వచ్చింది.‘నితీష్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించడానికి నేను విషానే్న మింగాల్సి వచ్చింద’న్న లాలూ మాటలే ఇందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి నితీష్‌కు సంబంధించినంత వరకూ కులపరమైన బలమేదీ ఆయనకు లేదు. మంచి పాలనాదక్షుడిగానే ఆయన ఓటర్లను ఆకర్షించాల్సి ఉంటుంది. ఆ దిశగా ఆయన గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. సీట్ల పంపిణీ విషయంలో నితీష్-యాదవ్‌ల మధ్య ఇప్పుడున్నంతగా పొత్తు ఉండక పోవచ్చునన్న ఆశతోనే బిజెపి అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకూ తమ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించక పోయినప్పటికీ అందుకు సంబంధించి బలమైన సంకేతాలనే అందించింది. మాజీ ముఖ్యమంత్రి జతిన్‌రామ్‌ను చేరదీయడం ద్వారా ఓ బలమైన సామాజిక వర్గం ఓట్లకు గాలం వేయాలన్నది బిజెపి ఆలోచన. ఎవరి ఎత్తులు ఫలిస్తాయి..ఎవరిది అంతిమ విజయం అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితే. కానీ, బిహార్ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయిలో స్పష్టమైన రాజకీయ మార్పులకు దారితీస్తాయన్నది వాస్తవం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సుందర గూగుల్ మరియు దొందూ దొందే

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరసభారతి -81 వ సమావేశం ”గురు పూజోత్సవం ”5-9-15 శనివారం-ఉదయం 10 గం -ఆహ్వానం

సరసభారతి -81 వ సమావేశం ”గురు పూజోత్సవం ”5-9-15 శనివారం-ఉదయం 10 గం -ఆహ్వానం

81 sarasaabharati 001 prsm 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్, ఆస్టిన్ లో తెలుగు విభాగం పెంపుదలకి శాశ్వత నిధి ఏర్పాటు

యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్, ఆస్టిన్ లో తెలుగు విభాగం పెంపుదలకి శాశ్వత నిధి ఏర్పాటు

మీ సహకారానికి విన్నపం

ఉత్తర అమెరికాలో కొత్త తరాలు తమ పిల్లలకి తెలుగు భాషా, సంస్కృతుల పైన మక్కువ కలిగించే ప్రయత్నాలు ప్రతీ చోటా తెలుగు పాఠశాలలు, నాట్య శిక్షణాలయాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అధిక భాగం ఔత్సాహిక స్థాయిలో నిర్వహించడంలో కృతకృత్యులవుతున్నారు. కానీ తీరా ఆ పిల్లలు హైస్కూల్ దాటి ఉన్నత విశ్వ విద్యాలయాలలో అడుగు పెట్టగానే కేవలం “బాలీవుడ్” సంస్కృతికి తప్ప ఆ  తల్లిదండ్రులు కష్టపడి వేసిన ఆ భాషా పరమైన మౌలికమైన పునాదులని పటిష్టం చేసుకునే అవకాశాలు కల్పించడంలో అమెరికా తెలుగు సమాజం, జాతీయ స్థాయి తెలుగు సంఘాలు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయి. ఇదేమీ కొత్త విషయం కాదు కానీ అటు తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలకీ, ప్రజలకీ భాషా, సాహిత్యం, సాంస్కృతిక పెంపుదలపై ఉన్న నిర్లిప్తత  ఎంతో బాధాకరం. అందు వలన వారి నుంచి కూడా ఏమీ ఆశించకుండా అమెరికాలో మన ప్రయత్నాలు మనమే చేసుకోవాలి.

ఈ నేపధ్యంలో అమెరికాలో యువతరానికి కేవలం తెలుగు భాష, సాహిత్య, సంస్కృతులపై అవగాహన, మునుపెరగని అభిలాష  ఉన్నత విశ్వ విద్యాలయ స్థాయిలో కూడా కలిగించడం ద్వారానూ, మన ప్రాచీన, ఆధునిక సాహిత్యాలని, భాషా శాస్త్రాన్ని  ఇతర భాషా కోవిదులతో సరి సమానంగా, సగర్వంగా చాటుకోగల సంస్థాగత నిర్మాణాల ద్వారానూ  తెలుగు భాష మహోజ్జ్వలంగా మనుగడ సాగిస్తుంది అని విజ్ఞుల అభిప్రాయం.  అప్పుడే తెలుగు భాష అంతర్జాతీయ భాషలలో సముచిత స్థానాన్ని పొందడమే కాకుండా మన తెలుగు యువ తరం వారి సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, వ్యక్తిగత  అవసరాలు ఈ పరాయి దేశంలో సముచితమైన స్థాయిలో నెరవేరుతాయి. ఈ దిశలో,  తెలుగు రాజకీయ, సామాజిక, వర్గ విభేదాలకి అతీతంగా అత్యున్నత స్థాయి అమెరికా విశ్వవిద్యాలయ పర్యవేక్షణలో తక్షణ మరియు దీర్ఘకాలిక ప్రణాళిక తో మేము తలపెట్టిన ఒక చిన్న ప్రయత్నానికి మీ నైతిక ప్రోద్బలం, ఆర్ధిక సహాయం అర్థించడమే ఈ ఉత్తరం సారాంశం.

గత ఇరవై ఏళ్ళకి పైగా తెలుగు భాషా, సాహిత్యాల పెంపుదల పై దృష్టి కేంద్రీకరించి, మాకు  ఉన్న పరిమితులకి లోబడి, కేవలం మీ బోటి తెలుగు భాషా, సాహిత్యాభిమానుల ప్రోద్బలమే ఇంధనంగా చెప్పుకోదగ్గ విజయాలు సాధించడమే “వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” కి ఉన్న ఏకైక అర్హత.  దానికి కొనసాగింపుగా ఆస్టిన్ లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్, ఆస్టిన్వారి తెలుగు విభాగం అభివృద్దికి ఒక “శాశ్వత నిధి” (Program Endowment in Telugu Studies)  సమకూర్చడానికి ఆ విశ్వవిద్యాలయ అధికారులతో సూత్రప్రాయంగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ శాశ్వత నిధుల నిర్వహణ పూర్తిగా ఆ విశ్వ విద్యాలయం అధికారుల చేతులలోనే ఉంటుంది, దాని పై ఏటా వచ్చిన ఆదాయం మొత్తం అక్కడి తెలుగు విభాగం ఖర్చులకి, పెంపుదలకి మాత్రమే శాశ్వత ప్రాతిపదిక మీద వినియోగించబడుతుంది.

ఇటీవల హ్యూస్టన్ లో జరిగిన “పాడుతా తీయగా” కార్యక్రమ వేదిక పై గాన గంధర్వులు డా. ఎస్.పి. బాల సుబ్రమణ్యం ఈ శాశ్వత నిధి ఏర్పాటు గురించి తొలి సారిగా ప్రకటించి ప్రశంసించారు.

యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ (ఆస్టిన్) లాంటి అత్యత్తమ స్థాయి విశ్వవిద్యాలయం లో గత యాభై ఏళ్ల కి పైగా నడుస్తున్న తెలుగు విభాగం అభివృద్దికి మీ వంతు కర్తవ్యంగా ఈ శాశ్వత నిధి కి మీ ఆర్ధిక సహకారం అందించి, యువతరానికి మన తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతులపై అవగాహన, అభిరుచి ఒక విశ్వ విద్యాలయ స్థాయిలో, తగిన ఎకడమిక్ క్రెడిట్స్ పొందే అవకాశం కల్పించమని కోరుతున్నాం.

మీ అండదండలతో పౌర నిధుల సేకరణ ద్వారా తగిన ఆర్ధిక వనరులు సమకూర్చగలిగితే అమెరికా  విశ్వవిద్యాలయాలలో ఉన్న తెలుగు ఆచార్యులు కలిసి, మెలిసి ఇతర ప్రపంచ, భారతీయ భాషా శాస్త్రవేత్తలు, ఆచార్యులు, పండితుల సహవాసంతో మన భాషా శాస్త్రం, ప్రాచీన & ఆధునిక సాహిత్య విషయాలపై పరిశోధనలు జరిపి, ఉన్నత స్థాయి అనువాదాలని ప్రచురించి, నిజమైన అంతర్జాతీయ భాషా సదస్సుల  ద్వారా తెలుగు భాషకి ప్రపంచ భాషలలో తగిన గుర్తింపు లభించే  దీర్ఘకాలిక  ప్రయోజనాలు  కూడా సమకూరుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

Brief History & Background of University of Texas Telugu Studies Department

University of Texas, Austin which was established in 1883 and is one of the highest rated Universtites in USA with over 50000 students from around the world.

The first Telugu course was taught in 1960 and Hindi-Telugu Center at UT was established in 1961. Later on, It was changed to South Asia Center which is one of earliest such Institutes in North America. The person who made all this happen and ran this Insitute until 1990 is Ms. Andre’e F. Sjoberg. She is now 91 years old and lives in West campus of UT. And beleive it not, she procured 7859 Telugu books which are now available in UT, Austin Library making it one of the world’s largest Telugu Libraries out side of India.

At the present time, UT Telugu Studies Department is one of the largest and most active in USA, under the able leadership of Prof. Afsar Mohammed, a well known Telugu poet & literary critic. Per our information, over 450 students graduated from the Telugu Department in the last few years with an average enrollment of 50 students in several credit courses. It is unfortunate that  enrollment was denied last year for many more enthusiastic students for lack of supporting funds.

UT, Austin offers eight credit courses to learn Telugu reading, writing and spoken language,  modern Telugu literature including short story & poetry.  UT also teaches Annamayya devotional music and classical music of Tyagaraja and other great  composers. All these prorgams attract not only Telugu heritage students but also non-Telugu students from main stream other ethnic groups.   The Telugu Students formed a separate student body for themselves called Telugu Students  Association which is very active with about 50 members.

యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ వారి సహకారంతో ఈ శాశ్వత నిధి వలన చేకూరే కొన్ని సత్ఫలితాలు

  •                 ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్న యువత సంఖ్యని 50 నుంచి పెంచి అందరికీ అవకాశం కలిగించడం.
  • ప్రాచీన, ఆధునిక సాహిత్యం, తెలుగు కథ, కవిత్వం మొదలైన ప్రక్రియలపై పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడం.
  • తెలుగు భాషా శాస్త్రం, సాహిత్యాలపై మాస్టర్స్ మరియు డాక్టరేట్ స్థాయి కి విస్తరణ.
  • ఉన్నత స్థాయి పరిశోధనలకి, ప్రచురణలకి అవకాశాలు కల్పించడం.
  • విశ్వ విద్యాలయ స్థాయిలో అన్నమయ్య సంకీర్తనలు, శాస్త్రీయ సంగీతంలో శిక్షణ, అవగాహన పెంపొందదించడం.
  • తెలుగు సంస్కృతి, శాస్త్రీయ నృత్యాలపై విశ్వ విద్యాలయ స్థాయి పాఠ్యాంశాలు నెలకొల్పడం.
  • ఉత్తమ తెలుగు సాహిత్యాన్ని ఆంగ్ల, తదితర భాషలోకి అనువదించి అంతర్జాతీయ సాహిత్యంలో తగిన గుర్తింపు కి కృషి చెయ్యడం.
  • పై అంశాలలో విషయాలలోనూ నిష్ణాతుల ప్రత్యేక ప్రసంగాలని (Endowment Lectures) ఏర్పాటు చెయ్యడం.
  • వివిధ దేశాల విశ్వ విద్యాలయాల తెలుగు ఆచార్యులు, విద్యార్థులు ఇతర భాషా, సాహిత్యవేత్తల తో అంతర్జాతీయ స్థాయిలో వార్షిక సమావేశాలు నిర్వహిస్తూ తెలుగు భాషా, సాహిత్యాల పురోగతికి తోడ్పడడం.

Request for Tax-deductible Support for Permanent Endowment Fund

Telugu Studies, Department at Univeristy of Texas, Austin

The main purpose of creating the Endowment Fund is to support Telugu Studies Department on a permanent basis. Vanguri Foundation of America, Inc has made an initial committment of $25,000 to be donated directly to UT, Austin. Further endowment funds may be donated as needed to meet the permanent and specific needs such as Annual Endowment Lectures, Academic Conferences and to meet some of the above lsited objectives.   We plan to sign the Endowment Contract in a few days. This is the first time a permanent Endowment is being established where the funds will be invested by UT Endowment Management, and use the returns exclusively for Telugu Studies. The donated funds for Endowment can never be spent, only invested by UT.

We request your generous tax-deductible financial support as follows: Please help us raise $25000 bySeptember 15, 2015. All donations are tax-deductible in USA.

Grand Benefactor (సార్వభౌమ పోషకులు): $5000

Grand Patron (చక్రవర్తి పోషకులు): $2500

Chief Benefactor (మహారాజ పోషకులు): $1000 ­

Chief Patron (రాజ పోషకులు): $500

Benefactor (యువరాజ పోషకులు):  $250

Patron (పోషకులు):  $100

Any other donations are gratefully accepted.

(All donors may be recognized per UT policies and by VFA in its Media Releases)

 

Special Note on Matching Donations from Major Corporate Employers

Please note that Vanguri Foundation of America, Inc. has been approved to receive matching donations from many major companies in USA such as Google, Microsoft, Bank of America, Union Bank, Chevron, Microsoft, Dell, Intel, BP, Baker-Hughes, General Electric and others. We appreciate your contacting your empolyer for matching procedures and help double the impact of your own generous donations. Please contact us for details.

 

CONVENIENT OPTIONS ON HOW TO DONATE

On-Line with any credit card

Please log in or copy or paste the following in your URL and follow prompt.

 

https://www.paypal.com/cgi-bin/webscr?cmd=_s-xclick&hosted_button_id=VDB9HSSK7P8HE

 

or visit www.vangurifoundation.blogspot.com, click on DONATE button on right and follow prompt.

By Check

  • CHECK Payable to VFA, write “UT, Austin Fund” in Memo section and mail to

Vanguri Foundation of America, Inc. P.O. Box 1948, Stafford, TX 77497

For More Information, Please contact

వంగూరి చిట్టెన్ రాజు

​                                           ​

vangurifoundation@gmail.com :

Phone: 832 594 9054


You received this message because you are subscribed to the Google Groups “vangurifoundation” group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to vangurifoundation+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to vangurifoundation@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 273-భూవరాహ విజయం రాసిన శ్రీనివాస కవి (17 వ శతాబ్దం)

— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

273-భూవరాహ విజయం రాసిన శ్రీనివాస కవి (17 వ శతాబ్దం)

కౌండిన్య గోత్రీకుడు శ్రీ ముస్నం గ్రామ కాపురస్తుడు వీరవల్లి కుటుంబానికి చెందినవాడు 17 వ శతాబ్దికి చెందిన వాడు. వరద అని పిలవబడే శ్రీనివాస కవి 8 కాండలలో ‘’భూవరాహ విజయం’’ కావ్యం రాసాడు. వరాహ అవతారం దాల్చిన  ప విష్ణువు శ్రీ ముస్నంలో దండకుని తండ్రిని సంహరించి భూవరాహ రూప విష్ణువు లక్ష్మిని వివాహమాడటం కథ. చాలా రచనలు చేసినట్లు ఉన్నప్పటికీ అ౦బు జవల్లి దండకం, శ్రీ వరాహ చూర్నిక, ధ్యాన చూర్నిక శ్రీ రంగ దండకం వచనాలలో రాసాడు. అ౦బుజవల్లీ పరిణయం, వరాహ విజయం  వరాహ చంపు  ,వకుళ మాలినీ గీతా పరిణయం, సీతా దివ్య చరిత్ర మొదలైన కావ్యాలు రాసాడు. మాఘ కావ్యాల మీద రఘువంశ నైషద  అమరుకాల మీద మంచి వ్యాఖ్యానాలు రచించాడు.

ఇతని కుమారుడు వరద దేశికుడు కూడా గొప్ప కవి. ‘’లక్ష్మీ నారాయణ చరిత్ర ,రఘువర విజయం ,రామాయణ సంగ్రహం, అ౦బుజవల్లీ శతకం, శ్రీ వరాహ శతకం’’ తో పాటు’’ గద్య రామాయణము’’ రచించాడు. ఇతని కొడుకు, మనమడు గొప్ప కవులే.

  1. అభినవ రామానుజాచార్య (19 వ శతాబ్దం)

‘’మాయావాది మదగజ కంఠీరవ ఆచార్య’’ అనే బిరుదు పొందిన అభినవ రామానుజాచార్య వేంకటాచార్య కుమారుడు. నైద్రువ కాస్యపస గోత్రం. వాదిభ కేసరి కుటుంబం వాడు. 19 వ శతాబ్దికి చెందిన తిమ్మ గజపతికి సమకాలికుడు. ఈయన రాసిన ఏడు కాండల ‘’శ్రీనివాస గుణాకరం ‘’   తిరపతి వెంకటేశ్వర స్వామి గురించిన కథ. దీనిపై తాను వ్యాఖ్యానం రాసుకున్నాడు. మిగిలిన వ్యాఖ్యానాన్ని కొడుకు వరదరాజు పూర్తీ చేసాడు.

  1. క్రాణ రామ కవి (19 వ శతాబ్దం)

19 వ శతాబ్దికి చెందిన జైపూర్ సంస్థాన ఆయుర్వేదాచార్యుడు క్రాణ రామ కవి. ఆయన రాసిన “కచ్చ వంశ ‘’జయాపుర విలాస కావ్యాలలో” జైపూర్  ను పాలించిన రాజుల ఘన చరిత్ర ఉంది. చాలా కావ్యాలు రాసాడు. అందులో ‘’ఆర్యాలంకార శతకం, పలాండు శతకం ముక్తకం ముక్తావల్లి’’ ముఖ్యమైనవి.’’ పోలంబోత్సవం, సారస టీక, సంస్కృత సాహిత్యంలో గొప్ప పేరు పొందాయి. ‘’చందాశ్చతమర్దన’’ కావ్యానికి మంచి ప్రశస్తి ఉంది.

276.’’ ధిల్లీ సామ్రాజ్యం’’ నాటక కర్త–  లక్ష్మణ సూరి (1859- 1919)

తమిళనాడు రామ్నాడు జిల్లలో శ్రీవిల్లి పుత్తూరు దగ్గర పూనల్వేలిలో ఉన్న ముత్తు సుబ్బ అయ్యర్ కుమారుడు లక్ష్మణ సూరి. కాలం 1859- 1919.    అన్ని శాస్త్రాలలో మహాపండితుడైనందున “మహా మహోపాధ్యాయ” బిరుదు పొందాడు.  మద్రాస్ పచ్చయప్ప కళాశాలలో సంస్కృతాతాచార్యునిగా పని చేసాడు. ఆయన రాసిన’’ క్రుష్ణలీలామృతం ‘’బృహద్గ్రంధం. లఘు కావ్యాలుగా ‘’విప్ర సందేశం, మానస సందేశం, వేంకటేశ స్తవం ముఖ్యమైనవి. “ధిల్లీ సామ్రాజ్యం “ అనే నాటకం రాసాడు.  ఈ నాటకంలో ఐదవ జార్జి చక్రవర్తి ధిల్లీ లో రాజదర్బార్ నిర్వహించిన కథ ఉన్నది. రామాయణం ఆధారంగా ‘’పౌలస్త్య వధ’’ రాసాడు.’’ అనర్ఘ రాఘవం, ఉత్తర రామ చరిత్ర మహావీర చరిత్ర  వేణీ సంహారం, బాల రామాయణం రాత్నావళి’’లపై ఈయన రాసిన వ్యాఖ్యానాలు బహు ప్రశస్తమైనవి. ‘’మదన పారిజాత మంజరి’’ లో శేష భాగాలను పూరించాడు. సరళమైన సంస్కృత రచనలను రాయటం ఆయన ప్రతేకత. భీష్మ పితామహుని జీవితంపై’’ భీష్మ విజయం’’ రాసి భీష్ముని న్నత్యాన్ని శతధా ,సహస్రధా శ్లాఘించాడు. ఈయన రాసిన ‘’ సంగ్రహం, రామాయణ సంగ్రహం’’ చాలా ప్రచారం పొందినవి.

  1. భాస నాటకాలను వెలికి తీసిన–  గణపతి శాస్త్రి (1860)

రామ సుబ్బ అయ్యర్ కుమారుడైన గణపతి శాస్త్రి  కేరళ లోని తిన్నేవెల్లి జిల్లాలో తరువలిలో 1860 లో జన్మించాడు.  సంస్కృతంలో మహా నిష్ణాతుడై 17 వ “ఏటనే “మాధవీ వసంతం” నాటకం రాసాడు.  త్రిరువనంతపురంలోని సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గానూ, సంస్కృత ప్రచురణలకు క్యురేటర్ గానూ, త్రివాన్కూర్ మహారాజ సంస్తానంలోనూ పనిచేసాడు. ‘’మహామహోపాధ్యాయ’’ బిరుదాంకితుదు. కాల గర్భంలో కలసిపోయిన భాస నాటకాలను వెలికి తీసి ప్రచురించిన మహానుభావుడు గణపతి శాస్త్రి. దీనికి ప్రపంచ ప్రఖ్యాత కీర్తిని పొందాడు. సంస్కృత సాహిత్యంలో లోతైన అధ్యయనం ,పరిశోధన శాస్త్రి చేసాడు. మహా గ్రంథాలు  ఎన్నో రాసాడు. భాస నాటకాలను సంకలనం చేసి విపులమైన వ్యాఖ్యానాలు రాసి ప్రచురించాడు.

గణపతి శాస్త్రి’’ శ్రీమూల చరిత్ర ‘’అనే చారిత్రక గ్రంధాన్ని తిరువాన్కూర్ మహారాజుల వంశ చరిత్రగా రాసాడు. ‘’భారత వర్ణన’’ అనే గ్రంథంలో భారతదేశాన్ని వర్ణించాడు. ‘’తులా పురుష దండ ‘’కావ్యంలో తులాభార ఉత్సవాన్ని గురించి వర్ణించాడు. పార్వతీ దేవిపై అపర్ణాస్తవం, విక్టోరియా మహారాణిపై ‘’చక్రవర్తిని గుణమణిమాల ‘’రచించాడు. తిరువాన్కూర్ మహారాజు రాజా విశాఖ రామునిపై’’ అర్థ చిత్ర మణి మాల ‘’అనే సాహిత్య శాస్త్రాన్ని రచించాడు. ఆయన రచనలలో అతి ప్రశస్తి పొందింది “సేతు యాత్రాను వర్ణనం”. దీనిలో సరళ సుందరమైన సంస్కృత రచనం అందరినీ ఆకర్షిస్తుంది. ఇది రామేశ్వర యాత్రకు సంబధించిన యాత్రా సాహిత్యం. హిందూ దేవతల పవిత్రత, గొప్పతనమంతా వర్ణించాడు.

  1.  సంస్కృత కళాశాల స్థాపకుడు నీలకంఠ శర్మ (1858)

పున్నసేరి నంబి నారాయణ శర్మ కుమారుడైన నీలకంఠ వర్మ 1858 లో జన్మించాడు. కేరళలోని సంస్కృత విద్వాంసులలో, సంస్కృత గ్రంథ కర్తలలో ప్రముఖ మైనవాడు. పట్టంబిలలో సంస్కృత కళాశాల స్థాపించాడు. సంస్కృత పత్రిక ‘’విజ్ఞాన చి౦తా మణి’’ని నిర్వహించాడు. ఖగోళశాస్త్రంపై అనేక విలువైన గ్రంధాలు రాసాడు. ‘’పట్టాభిషేక ప్రబంధం, శైలాబ్ది శతకం, ఆర్యా శతకం’’ మొదలైన గొప్ప రచనలు సంస్కృతంలో చేసాడు.

  1. పాళీ భాషలో గ్రంధాలు రాసిన ఆధునిక కవి– విదుశేఖర

బెంగాల్లోని శాంతినికేతన్ కు చెందిన విధుశేఖర భట్టాచార్య బెంగాలీ సంస్కృత భాషాలలో గొప్ప పండితుడు. పాళీ భాషలో కూడా గొప్ప గ్రంథాలు రాసాడు. సంస్కృతంలో’’ యవ్వన విలాసం, ఉమా పరిణయం హరిశ్చంద్ర చరిత్ర, చిత్త  విలాసం’’ లతో పాటు’’ చంద్ర ప్రభ’’ అనే శృంగార కావ్యం కూడా రాసాడు. బనారస్ లో “మిత్ర గోష్టి” అనే సంస్కృత పత్రికను నిర్వహిస్తున్నాడు.

280-లిపి శాస్త్రజ్ఞుడు విజయ రాఘవాచార్య (1884)

కౌండిన్య గోత్రానికి చెందిన వరద రాయ కుమారుడు విజయ రాఘవాచార్య తమిళనాడులోని కంచి దగ్గర మయూర్ గ్రామంలో 1884 లో జన్మించాడు. కంచిలో చదివి అలంకార, సాహిత్య శాస్త్రాలలో ఉన్నత శ్రేణి విద్వాంసుడయ్యాడు. లిపి శాస్త్రం(ఎపిగ్రఫీ)లో ప్రత్యేక శిక్షణ పొంది తిరుపతి వెంకటేశ్వర దేవస్థానంలో ఎపిగ్రఫిస్ట్ గా  పనిచేసాడు. అనేక సంస్కృత గ్రంధాలు రాసాడు. అందులో’’ చిత్రకూటం’’ అనే నాటకం’’ శ్రీనివాస బాలాజీపై’’ వైభవ విలాసం’’ వేదాంత దేశికులపై ‘’ఘంటావతారం’’ గురుపరంపర ప్రభావం నీతి నవరత్న మాల, అభినవ హితోపదేశం, కవనేందు మండలి, వాసంతవ సార, దాన ప్రశంశ దివ్యక్షేత్ర యాత్రా మాహాత్మ్యం, ఆత్మ సమర్పణం, నవగ్రహ స్తోత్రం, దశావతార స్తవం, లక్ష్మీ స్తుతి మొదలైనవి చాలా ప్రసిద్ధమైనవి. ధనలక్ష్మి  ధాన్య లక్ష్మి, జయలక్ష్మి, గృహ లక్ష్మి అనే పంచ లక్ష్మీ దేవీలపై ఒక్కొక్కరిపై రెండు  వందల శ్లోకాల వంతున ఐదు రాసాడు. వీటికే ‘’పంచలక్ష్మీ విలాసం’’ అని పేరు. ‘’సురభి సందేశం’’లో ఆధునిక మాహా నగరాల వర్ణన చేసాడు. ‘’గాంధీ మహాత్మ్యం తిలక వైదుర్యం , నెహ్రూ విజయం ‘’మొదలయినవి ఆధునిక భారత జాతీయ నాయకులపై రాసిన గొప్ప గ్రంథాలు. అలాగే , బాల గంగాధర తిలక్, మోతీలాల్ నెహ్రూలపై కూడా రాసాడు.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-8-15 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 ద్వైతమత స్థాపకులు మధ్వాచార్య (1198 – 1278 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

  1. ద్వైతమత స్థాపకులు మధ్వాచార్య (1198 – 1278 )

ఆనందతీర్దులు అనే మధ్వాచార్య కర్ణాటకలోని ఉడిపి దగ్గర బెల్లె అనే గ్రామంలో 1198లో జన్మించాడు. నవరాత్రి చివరి రోజు నవమి నాడు జన్మించటం వలన అది మాధవ నవమి అయ్యింది. తల్లి వేదవల్లి. అసలు పేరు వాసుదేవుడు. చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక శక్తి ఏర్పడింది. ఇరవై ఐదేళ్లకు సర్వశాస్త్ర పారంగతుదయ్యాడు. కనుక ‘’పూర్వప్రజ్ఞావంతుడు’’అని  పేరు. కుటుంబాన్ని త్యజించి సన్యాసం స్వీకరించి అచ్యుత ప్రకాశ గురువు వద్ద దీక్ష పొంది ఆనంద వర్తనుడయ్యాడు. ద్వైతమతాన్ని స్థాపించి భారతదేశామతటా పర్యటిస్తూ ద్వైత మతాన్ని ప్రచారం చేశాడు . వ్యాస సూత్రాలకు గీతకు ద్వైత భాష్యం రాసాడు. చివరి రోజులు సూరి దంతారంలో నేత్రావతి కుమారా ధారనదుల  మధ్య ద్వీపంలో గడిపారు. 79 ఏళ్ల ఆరు నెలల ఇరవై రోజులు జీవించి 1278 లో వైకుంఠం చేరారు.  ఉడిపి లో శ్రీ కృష్ణ దేవాలయం నిర్మించాడు .దాన్ని ఎనిమిదిమంది శిష్యులకు బాధ్యత అప్పగించాడు .నడిచి బదరీ క్షేత్రం చేరి ఎన్నో ఏళ్ళుగా కళలు గన్న బదరీ నారాయణ దర్శనం చేసుకొన్నాడు అక్కడ నిత్యం గంగాస్నానం చేస్తూ48  రోజులు మౌన దీక్షలో ఉన్నాడు. అక్కడి నుండి వ్యాస బడరికి వెళ్లి చిరకాల కోర్కెను తీర్చుకొన్నాడు.రెండవ సారి బదరీ వెళ్లి గంగానది దాటుతుంటే అది ముస్లిం రాజ్యం కనుక దాటరాదని చెప్పి రాజు వద్దకు తీసుకొని వెళ్ళారు ‘’అందరికీ తండ్రి అయిన పరమాత్మ దర్శనానికి వెడుతున్నాను ‘’అనగానే ముస్లిం రాజు ఆశ్చర్యపడి ధర్యానికి మెచ్చుకొని అక్కడే ఉండిపొమ్మని ఎన్నో జాగీర్లు రాసిస్తానని అర్ధించాడు వాటికి ఆశపడని ఆచార్య బదరి వెళ్ళిపోయాడు . ఉత్తరాది మఠంతోసహా 22మఠాలను మధ్వా చార్య స్థాపించారు .మొత్తం పదహారు మహా గ్రంధాలు రాశారు .

మధ్వాచార్య 37 గ్రంథాలు రాసారు. ఇందులో వేదాంతపరమైనవే ఎక్కువ. ఆయన రాసిన’’ యమక భారతం’’లో మహాభారత కథను యమకంలో మహా గమకంగా చెప్పారు. ఆయన రాసిన ముఖ్య స్తోత్రాలు ‘’ఆర్యా స్తోత్రం, గురు స్తోత్రం కృష్ణ స్తుతి ద్వాదశ స్తోత్రాలు ముఖ్యమైనవి.’’ భాగవత తాత్పర్య నిర్ణయం’’ మరియు’’ భారత తాత్పర్య నిర్ణయం ‘’గ్రంథాలు భాగవత మహాభారతాలపై మహా వ్యాఖ్యానాలు.’’ కృష్ణ కర్ణామృత మహార్నవం, శంకర విజయం శంకరాచార్య అవతార కథ ‘’మధ్వాచార్య రాసారని అంటారు.

Inline image 1

  1. వాయుస్తుతి రాసిన– త్రివిక్రమ

మధ్వాచార్య అనుంగు శిష్యులలో త్రివిక్రముడు ముఖ్యుడు. ఈయన’’ ఉషాహరణ కావ్యం’’, ‘’వాయుస్తుతి ‘’రాసాడు. త్రివిక్రముని కొడుకు నారాయణ ‘’మధవ విజయ కావ్యం’’ రాసాడు. అలాగే ‘’అనుభవ విజయం, మణి మంజరి, పారిజాత హరణం’’ అనే యమకం రాసాడు. ‘’శివ స్తుతి ,విష్ణు స్తుతి నృసింహ స్తోత్రం సంగ్రహ రామాయణ ‘’కర్త కూడా.

  1. 732 ఆంజనేయ విగ్రహాలు స్థాపించిన వ్యాస రాయలు 1447 -1539

వ్యాస రాయలు మధ్వాచార్య శిష్యులు 1447 -1539  కాలంలో జీవించారు. విజయనగర సామ్రాజ్య ఆస్థాన గురువు సాల్వ నరసింహ అచ్యుత దేవరాయ శ్రీకృష్ణ దేవరయలకు ముఖ్య సలహాదారు. భారతదేశమంతటా పర్యటించి 732 ఆంజనేయ విగ్రహాలను స్థాపించి దేవాలయాలను నిర్మించాడు. . న్యాయామృతం ,తర్క తాండవం ,తాత్పర్య చంద్రిక ,మాయావాద ఖండన మండనం ఉపాధి ఖండనమండన మంజరి ,తత్వ వివేకమందర మంజరి సత్తార్క విలాసం మొదలైన ఎన్నో గ్రంధాలు వ్యాస రాయ క్రుతాలు .

 

‘’వ్యాస యోగి చరిత’’ చంపూలో సోమనాధుడు వ్యాసరాయ జీవిత చరితను రాసాడు. శ్రీ విద్యారత్నాకర స్వామి’’ వ్యాసవిజయం’’లో ఆయన గురించి వివరించారు. సోమనాధుని రచనం భట్టబాణుని కాదంబరి నీ గుర్తు చేస్తుంది. ఈయన అనంతభట్టు సోదరి కుమారుడు. సోమనాదుడిని వ్యాసరయలకు అచ్యుత దేవరాయల ఆస్థానంలో పరిచయమయ్యాడు. ఇతని తాత భట్ట గాయముక్తి భాస్కరుడు ‘’కాల మాఘాధ్వరి’’గా ప్రసిద్ధుడైన కవి.

Inline image 2

  1. – సరసభారతి విజయ కర్త -వాది రాజు

కన్నడ సంకీర్తనలు రాసిన పురందర దాసు వ్యాసరాయల శిష్యుడు. వాదిరాజు కూడా శిష్యుడే. వాది రాజు అచ్యుతదేవరాయల కాలంలో ఆర్ధిక సంక్షోభం ఏర్పడినప్పుడు గుప్తనిధిని బయటకు తీసి సాయపడ్డాడు. ఉడిపి క్రష్ణదేవాలయాన్ని నిర్మాణానికి సహకరించాడు . దాని బంగారు శిఖరాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంలో విజయనగర సామ్రాజ్యం తళ్ళికోట యుద్ధంలో ఓడిపోయింది. వాదిరాజు గొప్పకవి. ‘’రుక్మిణీశ విజయం ‘’సరసభారతి విలాసం’’ తీర్థ ప్రభంధం ‘’ఏకీభావ స్తోత్రం దశావతార స్తుతి ‘’రాసారు. వాదిరాజ వృత్త రత్న సంగ్రహం కావ్యంలో రఘునాధుడు ఈయన గురించి వర్ణించారు.

  1.  పద్మపురాణం రాసిన రవిసేన ఆచార్య (650)

క్రీ.స. 678లో పద్మపురాణాన్ని రవిసేనాచార్యుడు రాసాడు. జినసేనుడు తన హరివంశ పురాణంలో రవిసేనుని గురించి వివరించాడు. పద్మపురాణం ప్రాచీన జైన విధానంలో రాయబడిన రామాయణ కథ అని చెప్పాడు.  పద్మపురాణంలో జరిగిన సంఘటనలు 16 వ జైన తీర్తంకరుడైన సామ్తినాధుని కాలంలో జరిగాయని భావిస్తారు. ఇందులోని రామకథకు వాల్మీకి రామకథకు చాలా తేడాలున్నాయి. ఇందులో రామ రావణులు ఇద్దరూ జైనమతాన్ని అనుసరించారని లక్ష్మణుడు శత్రుఘ్నునికి పూర్తిగా తమ్ముడు కాదని దశరధుని నాల్గవ భార్య’’ సుప్రభ’’కు జన్మించాడని రాయబడింది. సీత సాధారణ స్త్రీగానే విదేహ రాణికి జన్మించిందని దశరధుడు రాముడిని అరణ్యవాసానికి పంపగా ఏర్పడిన శోకంతో చనిపోలేదని ప్రపంచంలోని పరిస్థితికి విసిగి వేసారి అరణ్యాలకు చేరి తపస్సు చేసుకున్నాడని చెప్పబడింది. వాలి సుగ్రీవ హనుమంతులు వానర జాతివారు కాదని అరణ్య దేశాల పరిపాలకులని ఉంది. రాముడు వాలిని చంపలేదు. వాలి తమ్ముడు సుగ్రీవుని కోసం రాజ్య త్యాగం చేసి సన్యాసిగా మారాడు. రావణుడు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు. రాముని చేతిలో మరణించలేదు. లక్ష్మణుని చేతిలో చనిపోయాడు. లక్ష్మణుడు ప్రయోగించిన శక్తి ఆయుధానికి మూర్చ పోయి హనుమంతుడు తెచ్చిన సంజీవని వలన కాక’’ వైశాల్య ‘’ అనే స్త్రీ వలన మూర్చ నుండి తేరుకున్నాడు. ఆ తర్వాత ఈమె లక్ష్మణుని భార్య అయ్యింది.

Inline image 3

  1. అక్బరుచే సన్మా నితుడైన- పద్మసుందరుడు (1541 )

తాప గచ్చకు చెందిన పద్మమేరుని శిష్యుడు పద్మ సుందరుడు. అక్బర్ ఆస్థానంలో సాహిత్య వివాదాలలో అందరినీ ఓడించి అక్బరు చక్రవర్తిచే సన్మానం పొంది అనేక అగ్రహారాలను దానంగా పొందాడు.’’ రాయమల్లాభ్యుదయం’’ అనే కావ్యాన్ని 1559 లో రచించాడు. ఇది 24 మంది జైన తీర్థంకరుల చరిత్ర. అగ్రితాక రోయమల్లుడితో పూర్తవుతుంది. తర్వాత’’ పార్శ్వనాధ కావ్యం’’ కూడా రాసాడు.

  1. సుదర్శన చరిత్ర రాసిన- సకల కీర్తి

జైన భాట్టారకుడు సకల కీర్తి. ఏడు అధికారాలలో ‘’ధన్య కుమార చరిత్ర కావ్యం’’ రాసాడు. ధన్య కుమారుడు ఉజ్జయినిలో వైశ్యుడైన ధనపాలుని కొడుకు. గొప్ప జైన మునిగా పేరుపొందాడు. ‘’సుదర్శన చరిత్ర’’ శ్రీపాల చరిత్ర, వృషభాను చరిత్ర మహా వీర పురాణం’’ ఇతర రచనలు.

  1. హరిచరిత కావ్య నిర్మాత చతుర్భుజుడు (14 70 )

చతుర్భుజుడు 1493 లో 13 కాండల హరిచరిత కావ్యాన్ని శ్రీకృష్ణునిపై రాసాడు. బెంగాల్ లోని గౌడ పట్టణం రామకేలి నివాసి. ఆనాటి రాజులు ఖోజులు, హబ్సీలు. కొడుకు పుట్టగానే తండ్రి నాలుకపై బీజాక్షరాలను బంగారు కలంతో తేనెలో ముంచి రాసాడు. దానితో కవిత్వం అబ్బింది.   ఇతని కొడుకు కమలాకరుడు. లోలా౦బరాజు రాసిన హరివిలాస కావ్యానికి ఘటకర్పరానికి వ్యాఖ్యానాలు రాసాడు.

  1. కవిచంద్ర రాయ బిరుదున్న దివాకరుడు (1509 )

వైదీశ్వర ,ముక్తాంబల  కుమారుడైన దివాకరుడు భరద్వాజ గోత్రీకుడు. కృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉండే వాడు. తాను రుద్ర భూపతి నుండి “కవి చంద్ర రాయ” బిరుదు పొందినట్లు చెప్పుకున్నాడు. ఇతని సోదరుడు మధుసూదనుడు’’ ‘’ధూర్త చరిత్ర భాణం’’ తో బాటు ‘’పారిజాత హరణం’’ అనే నాటకం, ‘’రస మంజరి ,దేవీ స్తుతి’’ రాసాడు. నలభై కాండలలో మహా భారత కథను’’ భారతామృతం’’గా రచించాడు.

27౦. వీరభద్ర విజయ కర్త ఏకామ్ర నాధుడు. (16౦౦- 17౦౦)

కొండవీడులో జన్మించిన ఏకామ్ర నాధుడు  16౦౦- 17౦౦ కాలపు రాజైన ఇమ్మడి అంకుశ మహారాజు ఆస్తానా నికి వచ్చాడు. తాను రాసిన ‘’జాంబవతీ పరిణయం, సత్యా పరిణయం’’ కావ్యాలలో అంకుశ రాజుల చరిత్రను తెలియ చేసాడు. ‘’వీరభద్ర విజయం ‘’రాసాడు. ప్రతి కావ్యంలోనూ మొదట తమ రాజుల చరిత్రను సుదీర్ఘంగా వర్ణించాడు. అంకుశ రాజ వంశం రాణ వంశం- శూద్ర వంశం.

  1. భిక్షాటన కావ్యం రాసిన ఉత్ప్రేక్ష వల్లభుడు (16౦౦)

అసలు పేరు గోకులుడైన ఉత్ప్రేక్ష వల్లభుడు  మహా శివభక్తుడవటం చేత “శివభక్త దాసుని”గా ప్రసిద్ధుడు. 16 వ శతాబ్దపు మలబారు కవి. నలభై పద్ధతులలో’’ భిక్షాటన కావ్యం’’ అనే గొప్ప రచన చేసాడు. శివుడు రాజ రాజ చోళ మహారాజు దాన శీలాన్ని భక్తిని ఉదారతను పరీక్షించటానికి ఒక భిక్షకునిగా రావటం ఆ నగర మహిళలను ప్రభావితం చేయటం ఇందులోని కథ. ఇందులోని వర్ణనలు ఆకర్షణతో  నిండి  సందేశాత్మకంగా ఉన్న కావ్యం. రాజు మదనుడి కోరికపై ఈ కవి’’ సుందరీశ శతకం’’ రాసాడు.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-8-15 –ఉయ్యూరు


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రేడియోలో సూక్తి సుధ రెండవ భాగం

రేడియోలో సూక్తి సుధ రెండవ భాగంSukthi Sudha – 2 08-8-2015

Posted in రేడియో లో | Tagged | Leave a comment

మసకేస్తున్న మోడీ మాజిక్ -బజాజ్ -మరియు యోగా పై విశ్వ యోగం గు.సు0 దీ



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చలసానిపై కాట్ర గడ్డ మురారిమరియు మూషిక చింత -మేనకా గాంధి

 
 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భవిష్యనిధి మరియు మోడీ అదృష్టం రాహుల్



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 పంచస్తవి రాసిన కురత్తైవార్( కూరేశకవి – (10 39)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

  1. పంచస్తవి రాసిన కురత్తైవార్( కూరేశకవి  – (10 39)

రామసోమయాజికి సువత్సామ్క మిశ్ర  కంచిలో 10 39 లో జన్మించాడు. రామానుజుని శిష్యుడు. సంపన్న కుటుంబం వాడు. ఐశ్వర్యాన్ని త్యజించి శ్రీరంగం చేరి రామానుజాచార్య శిష్యుడయ్యాడు. సన్యాసిగా ఉంటూ భిక్షాటనతో జీవించాడు. ఆయన జ్ఞాపక శక్తి అసాదారణమైంది. ఒక సారి రామానుజుడు బోధాయన వృత్తిని బ్రహ్మ సూత్రాలపై రాసి కాశ్మీరు వెళ్ళాడు. పురుకేశ అనబడే కురత్తైవార్ ఏకసందాగ్రాహి కనుక అప్పటికప్పుడు దానిని అప్పగించాడు. ఈ విధంగా రామానుజులకు శ్రీభాష్యం రాయడానికి తోడ్పడ్డాడు. అది ఆయన అపూర్వ రచన. కులోత్తుంగ మహారాజు రామానుజుని ఆహ్వానించి శైవ మతాన్ని స్వీకరించమని కోరితే కూరేశ రామానుజుని యొక్క వైష్ణవ సంప్రదాయం యొక్క విశిష్టతను చాల సూటిగా, ఘాటుగా వివరించాడు. కోపించిన రాజు అతని గుడ్లు పీకేయించమని ఆజ్న జారీ చేసాడు. కూరేశుడు శ్రీరంగంలో భట్టార్ కుటుంబ వ్యవస్థాపకుడు.

కూరేశుడు మధుర కవి. ఇతనిది పవిత్ర జీవితం. ఆయన రాసిన’’ వైకుంఠ స్తవం’’ వైకుంఠంలో   విష్ణుమూర్తి వైభవాన్ని వర్ణించాడు. ‘’ఆత్మానుస్తవం ‘’ లో విష్ణుమూర్తి అవతార మహిమలను వర్ణించాడు. సుందర బాహుస్త్వంలో విష్ణు మూర్తి మహిమలను వర్ణించాడు. వరదరాజ స్తవంలో కంచి వరదరాజ స్వామిని కీర్తించాడు. లక్ష్మీ దేవి వైభవాన్ని శ్రీ స్తవం లో వివరించాడు. ఈ అయిదింటినీ కలిపి ‘’పంచ స్తవి ‘’ అంటారు. కూరేశుని జీవితంపై కూర్మనారాయణుడు ‘’కూరేశ విజయం’’ రాసాడు.

శ్రీవత్సామ్కుని కుమారుడు పరాశరభట్టు 1061 లో జన్మించి విష్ణు సహస్రనామ భాష్యం, శ్రీరంగ రాజ స్తవం శ్రీ గురురత్న కోశం, క్షామ శోడశి తనిస్ష్లోకి  హస్తశ్లోకి రాసారు. దొడ్డయాచార్యుడు పరాశర విజయంలో యీతని జీవిత చరిత్ర వర్ణించారు.

  1.  వీరశైవాన్ని ప్రబోధించిన బసవ నమంత్రి  1156

లింగాయతులకు వీరశైవ వ మతాన్ని స్థాపించిన బసవడు కాలచూరి రాజు బిజ్జలుని ప్రధాన మంత్రి. 1156 లొ రాజయ్యాడు. వీరశైవాన్ని వ్యాప్తి చేసిన ఏకోరాముడు పండితారాధ్యుడు రేవన్న మరుల ,విశ్వారాధ్యుడు శివుని పంచ ముఖాలుగా భావిస్తారు. వీరంతా శివుని అవతారాలే. బసవడు వీరాశైవ  విశ్వాసాన్ని పునః స్థాపించాడు. చరిత్ర ప్రకారం పై ఐదుగురు బసవని సమకాలికులే. కొందరు ఆయనకంటే పెద్దవారు కొందరు చిన్నవారు. బసవ విజయంలో శంకరారాధ్యుడు బసవని జీవితం వివరించాడు. పాల్కునికి సోమన బసవ పురాణంలోనూ బసవన గద్యలోనూ ఆయనగురించి చెప్పాడు. సోమనాధుడు పండితారాధ్యుని జీవితంపై పండితారాధ్య చరిత్ర రాసాడు. సోమనాధుడు భ్రుంగీ రిత గోత్రుడు. గురు లింగని కుమారుడు. ప్రతాప రుద్రుని కాలంలో 1140 -149 6 లో జీవించాడు. సాంఘిక సంస్కరణలను రచనలలో బసవడు ప్రతిబింబింప జేశాడు .కుల లింగ వివక్షతలను దూరం చేశాడు .షట్ స్థవ వచనం ,కాలజ్ఞాన వచనం ,మంత్రం గోప్యం ,ఘటచక్ర వచనం ,రాజయోగా వచన రచన లు చేసినట్లు తెలుస్తోంది .భక్తిమార్గమే ముక్తికి సోపానం అన్నాడు బసవ లింగాయతులకు  లింగ ధారణ.తప్పని సరి చేశాడు .

  1. చైతన్యప్రభు అనే గౌరా౦గు డు- 1486

నిమాయ్ అన్న పేరు ఉన్న గౌరాన్గుడు జగన్నాధ ,శచీ దంపతులకు బెంగాల్ లోని నాడియా జిల్లాలో 1486 లొ జన్మించాడు. ఈ గ్రామం   భాగీరధి నదీ తీరంలో ఉంది. చిన్నతనంలోనే తాను గొప్పవాడు అవుతానని తెలుసుకున్నాడు. సనాతన మిశ్ర కుమార్తె విష్ణు ప్రియను వివాహం చేసుకున్నాడు. గౌర వర్ణంలో అందంగా ఉండటం వలన గౌరాన్గుడు అనే పేరు వచ్చంది. సర్వ సంగ పరిత్యాగం చేసి శ్రీకృష్ణ చైతన్య అనే పేరు పొందాడు. శ్రీకృష్ణుని దివ్యలీలల్ను కీర్తనలుగా రాసి గానం చేసేవాడు. భక్తీ మార్గాన్ని ప్రబోధించాడు. 12౦  ఏళ్ళు జీవించి 15 27 లో మరణించాడు. గోపాల చరిత్ర ప్రేమామృతం సంక్షేప భాగవతామ్రుతం ,హరినామ కవచం, దాన  కేళి చింతామణి రచించాడు. భారతదేశమంతా పర్యటన చేస్తూ శ్రీకృష్ణ భక్తితత్వాన్ని వ్యాప్తి చేసాడు. వేదాంతం లో ‘’అచింత్య భేదా భేద ‘’సిద్ధాంతం ప్రచారం చేశాడు .శ్రీకృష్ణుని అవతారంగాచైతన్య మహాప్రభువు ను భావిస్తారు .

  1. కృష్ణ ప్రేమను రాసిన కవి కర్ణ పూరుడు-( 1524)

బెంగాల్లో నాడియా జిల్లలో కాంచనపల్లె లో శివానందసేనుని కుమారునిగా కవి కర్నపూరుడు 1524 లో జన్మించాడు. చైతన్యుని బెంగాలీ భక్తులతో పూరీ వరకు యాత్ర చేసి చైతన్యుని జీవితాంతం వరకు వాసుదేవభట్టు అనే  లక్షాధికారి ప్రాపకంలో ఉన్నాడు. కుమార హట్ట అనే గురువు వద్ద ఈనాటి కలకత్తాకు ఉత్తరాన ఉన్న హైలసారులో విద్య నేర్చాడు. జీవ గోస్వామి శిష్యుడు కూడా. ఈయన రాసిన “గౌరామ్గనోద్దేశ  దీపికను” 1577 లో రాసి చైతన్యుడు జీవితాన్ని ఆయన అనుచరుల గత జీవితాలను ముఖ్యంగా చైతన్య తండ్రి జగన్నాధ జీవితాన్ని శ్రీకృష్ణుని తండ్రి నందుని చరిత్రను, దశరధ చరిత్రను రాసాడు. ఆయన శ్రీకృష్ణుని గోపికలలో ఒకదడిగానూ రామాయణంలో కపిసేనలో ఒకనిగానూ భావిస్తారు. 1543 లో రాసిన చైతన్య చంద్రోదయంలో చైతన్య జీవిత సర్వస్వాన్ని వివరించాడు. అలంకార కౌస్తుభమూ రాసాడు. చమత్కార చంద్రిక, ఆనంద బృందావన చంపూ లలో  శ్రీకృష్ణ ప్రేమను వర్ణించాడు.

Inline image 1

  1. బ్రహ్మ సూత్రం భాష్యం రాసిన వల్లభాచార్య

లక్ష్మీభట్ట కుమారుడైన వల్లభాచార్యుడు గొప్ప శ్రీకృష్ణ మత బోధకుడు. 1478 నుండి 1550 వరకూ జీవించాడు. వ్యాసుని బ్రహ్మ సూత్రాలకు’’అను భాష్యం’’ రాసాడు. వల్లభ మతం అనయాయులలో చైతన్యుడు ప్రధానుడు. వీరికి శ్రీకృష్ణుడే సర్వము. వల్లభాచార్య ప్రేమామృతం మధుర మహాత్మ్యం మధురాష్టకం యమునాస్తవం రచించాడు. భాగవతంపై అనేక ఉపాన్యాసాలు చేసాడు. ఈయన చరిత్రను గోపాలదాసు వల్లభాఖ్యానకం లో వర్ణించాడు. బాబూ సీతారామ శాస్త్రి వల్లభ దిగ్విజయం రాసాడు. కాశి లోనిమనికర్నికా ఘాట్ లో గంగానది లో మునిగి జీవితం చాలించాడు .పుష్టిమార్గ ప్రబోధకుడు వల్లభా చార్య .పదహారు గ్రంధాలు రాశాడు .

వల్లభుని కుమారుడు గోపీనాధుడు, విఠలుడు. విఠలుడు తండ్రి లాగా గొప్ప కవి. క్కృష్ణప్రేమామ్రుతం, యమునా స్తపది రాస సర్వస్వం తో బాటు గీత గోవిన్డంపై వ్యాఖ్య రాసాడు. ఈయన కుమారులు కూడా గొప్ప కవులే. వల్లభుని సోదరుడు రామచంద్రులు కృష్ణ కుతూహలం, గోపాల లీల, రసిక రంజని  రోమావళి శతకం రాసాడు.

Inline image 2  Image result for vallabhacharya

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-8-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘ మేము సైతం ”వికలాంగ కధల సంకలనం -నా ముందు మాటలు

‘ మేము సైతం ”వికలాంగ కధల సంకలనం -నా ముందు మాటలు

 

vikalang2 001 vikalang3 001 vikalanga1 001 vikalanga4 001 vikalanga5 001 vikalanga6 001

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2- 250- అష్టాధ్యాయి- రాసిన పాణిని –క్రీ.పూ.350

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

250- అష్టాధ్యాయి- రాసిన పాణిని –క్రీ.పూ.350

దాక్షి కుమారుడైన పాణిని సాలతురాలో ఉన్నాడు. కథాసరిత్సాగరం ప్రకారం పాణిని ,వ్యాడి కాత్యాయన ఇంద్రదత్తులు ఉపాధ్యాయ ఉప వర్ష వద్ద విద్యనభ్యసించారు. చదువులో బాగా వెనుకబడి ఉండటం చేత పాణిని శివుని గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో’’ ప్రత్యాహార సూత్రాలు’’ పొందాడు. దీని ఆధారంగా అష్టాధ్యాయి అనే వ్యాకరణాన్ని రచించాడు. ఇది ప్రపంచంలోనే తొలి వ్యాకరణం. నిర్డుష్టమైనది, అన్నన్య సాధారణమైనది. దీనికి మించిన వ్యాకరణం లేదని అంటారు. వేద, వేదాంగాల అధ్యయనానికి ఇది  ముఖ్యమైనది. ఎనిమిదిభాగాలుగా  కనక అష్టాధ్యాయి అనే పేరు వచ్చింది. పంచతంత్ర కథనం ప్రకారం పాణిని ఒక సింహానికి బలయ్యాడు. అతని కాలం క్రీ. పూ 350 గా అందరూ ఒప్పుకున్నారు. కానీ హుయాన్ సాంగ్  బుద్ధ నిర్యాణం తర్వాత 50౦ ఏళ్లకు జన్మించినట్లుగా రాశాడు . కనిష్కుని సమకాలికుడు అని అన్నాడు. కానీ బుద్ధుని మరణం తర్వాత  5౦౦ ఏళ్లకు కాశ్మీరు నుండి సాలతూరకు ఒక కాశ్మీర్ దేశస్థుడు వచ్చినట్లు ఒక బ్రాహ్మణ గురువు వద్ద విద్యనభ్యసిన్చినట్లు తెలుస్తోంది. ఆ విద్యార్థియే  పాణినిగా మరల జన్మించాడని అంటారు. పాణిని ప్రముఖ వ్యాకరణకర్త, కవి. ‘’జాంబవతీ విజయం’’ రాసాడు. తన “సదూక్తి కర్ణామృతం”లో శ్రీధర దాసుడు పాణిని దాక్షి పుత్రుడు అని చెప్పాడు. క్షేమేంద్రుడు సువ్రుత్తి తిలకంలో పాణిని ఉపజాతి వృత్తాలలో అందరినీ మించిపోయాడని రాసాడు. రుద్రటుడి కావ్యాలంకారంపై వ్యాఖ్య రాసిన నమిసాదు కవి పాణిని రాసిన “పాతాళ విజయం”లోని కొన్ని శ్లోకాలను ఉదాహరించాడు.     ఈ కావ్యం మలబారు తీరంలో లభించింది. పాతాళ భల్లూక  రాజు అయిన జాంబవంతుని కూతురు జాంబవతి కృష్ణుడు అతడిని జయించి శమంతకమనణితో పాటు జాంబవతిని పాణిగ్రహణం చేసిన కథ. ఈ కథ భారత, భాగవత, విష్ణు పురాణాలలో ఉంది. దీనినే విజయనగర రాజు కృష్ణదేవరాయలు జాంబవతీ కల్యాణం నాటకంగా రాసాడు. పాణిని కవిత్వం సహజ సుందరంగా ఉంటుంది. క్రిష్ణలీల సుకుడు  భోజ రాజు రాసిన సరాస్వతీ కంఠా భరణం  వ్యాఖ్య రాస్తూ పాణిని శ్లోకాలను ఉదాహరించాడు. అమరకోశంపై వ్యాఖ్య రాసిన రాయ ముక్కుట కవి పాణిని శ్లోకాలను పేర్కొన్నాడు.

Inline image 1

  1. పాణినిపై వార్తికం రాసిన వరరుచి –(క్రీ.పూ 16౦౦-17౦౦)

కాత్యాయ నుడు అనే పేరున్న వరరుచి సంకృతి గోత్రీకుడైన సోమదత్తుని కుమారుడు. యమునా నది తీరాన ఉన్న కౌశాంబి లో  జన్మించాడు. పాణిని వ్యాడిలతో కలసి పాటలీపుత్రం లోని ఉపవర్షుని వద్ద విద్య నేర్చారు. అతని కుమార్తె ఉపకోశను వివాహం చేసుకున్నాడు. పాణినిపై వార్తికమ్   రాసాడు. పతంజలి మహాభష్యం లో వరరుచి శ్లోకాలను పేర్కొన్నాడు. అవంతీ సుందరి కధాసారం ప్రకారం వరరుచి మహానంది కుమారుడైన మహా పద్మరాజు పాలనలో జన్మించాడు. ఇతను విశాల దేశపు రాజు. పురాణాలప్రకారం మహానంది రాజు క్రీ.పూ 16 7 8 -1635 లో పరిపాలించిన నంది వర్ధనుడి   కుమారుడు. మహా పద్ముని కుమారుడు నందుడు మగధ సామ్రాజ్యాన్ని క్రీ. పూ. 1635 – 1547 వరకూ 8 8 ఏళ్ళు పరిపాలించారు. కనుక వరరుచి క్రీ.పూ. 16-17 శతాబ్దపు వాడు అయి  ఉంటాడు. పాణిని సూత్రాలకు కాత్యాయనుడు వార్తికాలు రాసాడు. ఇందులో నిర్వాణ గురించి వివరించాడు. నిర్వాణం అంటే పేల్చివేయటం అని చెప్పాడు. దీనినే పతంజలి అనేక ఉదాహరణల ద్వారా వివరించాడు. నిర్వాణం అనే బౌద్ధ పారిభాషిక పదం. ముక్తి అనే అర్థం. ఇవన్నీ గమనిస్తే కాత్యాయన పతంజలులు బుద్ధునికి  ముందే జీవించి ఉన్నట్లు తెలుస్తోంది.

విక్రమాదిత్య మహారాజు ఆస్థాన నవరత్న కవులలో వరరుచి ఒకడుగా భావిస్తారు. కాత్యాయనుకి యుద్ధాలు, దేవుళ్ళు, రాక్షసులు మొదలైన వాటిపై అవగాహన ఉన్నట్లు తెలుస్తోంది. పతంజలి’’ వారరుచం’’ అనే కావ్యాన్ని గురించి చెప్పాడు. అందులో వరరుచి శ్లోకాలు ఉన్నాయి. రాజశేఖర, జల్హణలకు వరరుచి గురించి పూర్తి అవగాహన ఉంది. వరరుచి రాసిన “ఉభాయాభిసారిక భాణం   ” లో అందమైన కవిత్వం కన్పిస్తోంది. అతడొక మునిగా దర్శనమిస్తాడు. వరరుచి శ్లోకాన్ని ఒక దానిని తన వల్లభదేవుడు తన సుభాషితావళిలో ఉదహరించాడు.

‘’ఆలోహిత మాకలయన్కంద లమితీ కంపితం మధుకరేణ – సంస్మరతి పాయీ స పాక్షికే దాతు క్షుల్తర్జనం లలితం ‘’

భోజదేవుడు శృంగార ప్రకాశికలో వరరుచి శ్లోకాన్ని వివరించాడు. ఇవి చారుమతిలోనివి. ఎనిమిది శ్లోకాల మార్యాష్టకం దుర్గా దేవి గురించిన శ్లోకం. అద్భుతమైన రచన. మలబారులో ప్రచారం ఉన్న కథనం ప్రకారం వరరుచి అన్ని కులాలకు చెందిన స్త్రీలను18మందిని  వివాహమాడినట్లు ఉన్నది. అందుకని అతనిని చండాలునిగా  భావించి దూరం చేసారు. ఈ విషయాన్నే భోజుడు కూడా ఒక శ్లోకంలో వివరించాడు.

వరరుచి ప్రాకృత భాషకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ‘’ప్రాకృత ప్రకాశ ‘’అనే వ్యాకరణం రాశాడు .నాలుగు ప్రాక్రుతభాశాలను గుర్తించాడు అవి మహారాష్ట్రి, సౌరసేని,మాగధి ,పైశాచి పైశాచి భాష అంతరించింది  .ఈ గ్రంధం లో పన్నెండు అధ్యాయాలున్నాయి మొదటి దానిలో మహారాష్ట్రి ప్రాకృతానికి కేటాయించి .424 సూత్రాలు చెప్పాడు . చివరిమూడు అధ్యాయాలు పైశాచి భాషకు కేటాయించి పద్నాలుగు సూత్రాలు  మాగాదికి పదిహేడు ,సౌరసేని కిముప్ఫై రెండు రాశాడు .వరరుచి ది కాత్యాయన గోత్రం కనుక కాత్యాయనుడు అనే పేరు వచ్చి ఉండ వచ్చు .వేదం గానితాభ్యాసానికి వరరుచి ‘’సులభ సూత్రాలు ‘’రాశాడు .

చతుర్భాణి అనే ‘’ఉభాయాభిసారిక ‘’రాశాడు .వరరుచి ‘’సింహాసన ద్వాత్రి౦సిక ‘’రాశాడు .ఇందులోని కధలు పరమాద్భుతంగా ఉల్లాసభరితంగా ఉంటాయి .విక్రమ చరిత్ర కూడా వర రుచి రాశాడని అంటారు .ఇతర కావ్యాలుగా కంఠాభరణం, చారుమతి లను పేర్కొన్నారు .ఎన్నో చాటువులు అతనిపై ఉన్నాయి .నీతి రత్నం  యాస్కుని నిరుక్తం పై భాష్యం నిరుక్త సముచ్చయం ఆయన రచనలే అంటారు . సామవేదానికి ప్రతీశాఖ్య రాశాడు .ఒక నిఘంటువు అలంకార గ్రంధమూ రాశాడని అంటారు .

  1. యోగ సూత్రాలను రాసిన- పతంజలి (క్రీ . పూ.  16౦౦-17౦౦)

కాత్యాయనుని తర్వాత పతంజలి వచ్చాడు. అతను రాసిన మహాకావ్యం ఏదీ లేదు. ఆయన రాసిన మహా భాష్యం లో మాత్ర౦ అనేక  శ్లోకాలను, శృంగారాన్ని నాటకాలను పేర్కొన్నాడు.  టి ఎల్. హార్న్ అనే పరిశోధకుడు వీటిని సేకరించి కృత్రిమ కవిత్వంగా అందులోని వృత్తాలు మాలతీ ప్రమితాక్షర ప్రహర్శినీ వసంత తిలకకు చెందినవిగా తెలియచేసాడు. ఇవన్నీ రాజాస్థాన కావ్యాలుగా కన్పిస్తాయి. మహా కావ్యాలు కావు. పతంజలిని గోనార్డ మనిషి అంటారు.ఉత్తర ప్రదేశ్ లో అయోధ్యకు యాభై కిలోమీటర్ల దూరం లో ఉన్న జిల్లాయే గోనార్డ .గ్రీకు సాహిత్యం లో పతంజలిని పేర్కొన్నారు  .పతంజలి అంటే ముకుళిత హస్తాలలో పడిన వాడు అని భాష్యం చెప్పారు .ఎవరిని ప్రజలు ముకిలిత హస్తాలలో దర్శిస్తారు ఆయనే పతంజలి అనే మరో అర్ధమూ చెప్పారు .వ్యాకరణ వైద్య యోగ శాస్త్రాలలో పతంజలి సిద్ధ హస్తుడు .తమిళనాడు తిరుచికి ముప్ఫై కిలో మీటర్ల దూరం లో ఉన్న బ్రహ్మ పురీశ్వర దేవాలయం లో పతంజలి విగ్రహం ఉన్నది .పతంజలి ‘’స్పోట వాదాన్ని’’చెప్పాడు  .ఇదే ఆధునిక ఫోనేమిక్స్ గా రూపొందింది .మార్ఫాలజీ లేక ప్రక్రియ గురించి కూడా వివరించాడు .ఫ్రాంజ్ కీల్హాన్ మొదటి సారిగా పందొమ్మిదవ శతాబ్ది లో పతంజలి మహా భాష్యాన్ని ప్రచురించాడు .ఆస్తిక నాస్తిక విభేదాలను పాము ముంగిస పోరాటం అన్నాడు .

Inline image 2  Inline image 3

కేరళలో వరరుచి కొడుకు విగ్రహం

  1. మధురవాణి (క్రీ.శ 1614-1662)

తంజావూరు రఘునాధనాయక  రాజు ఆస్థానంలో మధురవాణి ఉండేది. ఆమె అసలు పేరు తెలియదు. 14 కాండలలో రామాయణం రచించింది. మధురమంజుల కవిత్వం అందులో ఉంటుంది. చివరి కాండలో తాను ఎందుకు రామాయణం రచించ వలసి వచ్చిందో రాసింది. ఒక సారి యువరాజు రఘునాధ నాయకుడు సింహాసనం మీద అంతఃపుర  మహిళల మధ్య   కూర్చుని తాను రాసిన  ఆంద్ర రామాయణాన్ని పాడుతుండగా వింటున్నాడు. ఆయనకు శ్రీరామునిపై ఉన్న అనన్య దైవభక్తిని పొగుడుతున్నారు. అప్పుడు యువరాజు తనలో తాను విష్ణు కథలు చాలా ఉన్నా రామ కథ అమృత తుల్యమని వేలాది సార్లు విన్నా ఎప్పటికప్పుడు కొత్తదిగా మానసికాహ్లాదాని కల్గిస్తుందని అన్నాడు. అక్కడున్న వందలాది మహిళలు సంస్కృత, తెలుగు కవిత్వంలో నిష్ణాతులు. ఇందులో ఎవరు రామాయణాన్ని సంస్కృతంలో రాయగలరు అనిప్రశ్నించాడు. ఆ రోజు రాత్రి శ్రీరాముడు కలలో ప్రత్యక్షమై ఆ విషయంపై ఆందోళన చెందవద్దని తాను మధురవాణి అనే బిరుదు ఇచ్చిన కవయిత్రి అతని కోర్కెను తీర్చగలదని ఆమె అందరిలో మహోన్నత శ్రేణికి చెందిన కవయిత్రి అని తెలియచేసాడు. మర్నాడు  సభలో మధురవాణిని దగ్గర కూర్చోబెట్టుకుని తన కలను వివరించాడు. ఆమెను సంస్కృత రామాయణం రాయమని కోరాడు. అందులో అందమైన అలంకారాలు రసమాదుర్యం, పదాల సృష్టి ఉండాలి అని చెప్పాడు. “మీ దయవలన శ్రీరాముని అనుగ్రహం వలన నేను రామకథను సంస్కృతం లో రాయగలను, మీ కోరిక నేరవేర్చగలను” అని చెప్పింది. రామ కథ మొదటి కాండలో తన రాజు గుణ శీలాలను గొప్పగా వర్ణించింది. మధురవాణి కుమార సంభవం ,నైషద కావ్యాలను కూడా సంస్కృతం లో రాసింది .అస్టావదానలలో గొప్ప ప్రతిభ చూపింది .

Inline image 4

  1. ఆళ్వా  దివ్య ప్రబంధాలు

తమిళ దేశంలో 12 మంది ప్రసిద్ధులైన మునులను ఆల్వారులు అంటారు. గరుడ వాహన పండితుడు తన దివ్య సుచరిత్రలో అనంతాచార్య తన ప్రపన్నామ్రుతం లో ఆల్వారుల దివ్య చరిత్రను రాసారు. వీరి జీవిత కాలాలను ఆధునికులు అంగీకరించటం లేదు. వారి కథనం ప్రకారం కొందరు ఆళ్వారులు ద్వాపర యుగంలో కొందరు కలి యుగం లో జన్మించారు. కులశేఖర ఆల్వార్ మొదటి వాడు. కీ.పూ. 3075కు  చెందినా వాడు. ద్రుదావర్తుని కుమారుడు. అతని ముకుందమాల గొప్ప ఆధ్యాత్మిక స్తోత్రం.

వీరిలో నమ్మాళ్వార్ లేక శఠ గోప యతీన్ద్రుడు పరాశర లేక వకుళాభరణుగా ప్రసిద్ధుడు. తిరుక్కుల్ లో క్ర్ర్.పూ. 3059 లో జన్మించాడు. అసలు పేరు మారన్. కొద్ది కాలం తపస్సు చేసాక ఆత్మ జ్ఞానం కలిగి ‘’నాలాయిరం’’ అనే తమిళ ప్రబంధం రాసాడు. దీనిణి  సంస్కృతంలో ‘’పురుకేశ గాధానుకరణ’’గా రామానుజాచార్య అనువదించాడు. యమునాచార్య్డు అని పిలవబడే ఆలవందార్ శ్రీరంగంలో మహా పండితుడు. ఈశ్వర భట్ట రంగనాయకి ల కుమారుడు. మహా భక్తుడైన నాదముని మనమడు. చతుస్శ్లోకి, స్తోత్ర రత్న శ్రీ స్తుతి అనే గొప్ప మాదుర్యవంతమైన కావ్యాలు రాసాడు. ఈయన కాలం క్రీ.శ. 950 -1040

  1. విశిష్టాద్వైత మత స్థాపకులు- భగవద్రామానుజాచార్యులు క్రీ.శ. 1017-1137

తమిళనాడులోని శ్రీ పెరంబ దూరులో క్రీ శ 1017 లో ఆలవందార్ కుమారుడి కుమార్తె  కొడుకు రామానుజాచార్య. తండ్రి హరితస గోత్రానికి చెందిన ఆశూరి కేశవ భట్టార్. చిన్నప్పటి పేరు లక్ష్మణ ఇప్పుడు లక్ష్మణ  ముని అంటారు. ఆదిశేషుని అవతారంగా భావిస్తారు. వేద యాదవ ప్రకాశ అనే గురువు వద్ద కానేరి లో విద్యనభ్యసించాడు. గురువుగారి అసూయను భరించలేక బయటకు వచ్చేసాడు. తనను హత్య చేసే ప్రయత్నం నుండి బయటపడి కాంచీపురం చేరాడు. తర్వాత శ్రీరంగానికి ఆహ్వాని౦చ బడి ఆలవందార్ స్థానాన్ని పొందాడు. శ్రీరంగానికి ఆలవందార్ అంతిమ దర్శనం చేయడానికి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. మధురాంతకం లో పెరియనంబి వద్ద వేదాంతం నేర్చాడు. తర్వాత మహర్షి అయ్యాడు.

వ్యాస సూత్రాలకు భాష్యానికి వేదాంతానికి వ్యాఖ్యానాలు రాసాడు. కాశ్మీరు వెళ్ళినప్పుడు ఆయన వ్యాఖ్యానాలను సరస్వతి దేవి మెచ్చినందువలన వాటికి’’ శ్రీ భాష్యం ‘’అనే పేరు వచ్చింది. 1098 లో మెల్కోటే లో విష్ణు విగ్రహాన్ని స్థాపించి దేవాలయాన్ని నిర్మించాడు. తిరపతి చేరి అక్కడ తగాదాలను పరిష్కరించి అనేక  విష్ణ్వాలయాల్లో పూజలు, ఉత్సవాలు నిర్వహించాడు. 128 సంవత్సరాలు సార్ధక  జీవితం గడిపి 1137 లో పరమపదం పొందాడు. వేదాన్తంపై అనేక గ్రంథాలు రాసాడు. రామానుజుని’’ వైకుంఠ గద్య, రఘువీర గద్య, శరణాగతి గద్య’’ చాలా సుప్రసిద్ధమైనవి. విశిష్టాద్వైత మత సంష్టాపకుడు రామానుజాచార్యుడు. కులమత రహితంగా వేదాలను మంత్రాలను బోధించిన మహాత్ముడు రామానుజాచార్య్డు. రామానుజులపై రామానుజ చరిత్ర, చూలికను రామనుజదాసుడు రాసాడు. యతీంద్ర చంపూను వెంకటా భరనణుడు రామానుజ దివ్య చరిత్ర రామానుజ విజయం మొదలైనవి రచి౦పబడినాయి . ఆయన ముఖ్య శిష్యుడు ఆంద్ర పూర్ణుడు లేక వదూహ నంబి ‘’యతిరాజ వైభవం’’ రాసాడు.

Inline image 5

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-8-15 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కలాం కు సలాం చేస్తూ—–బందా

img165

Posted in కవితలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -72

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -72

30— నోబెల్ బహుమతి, అకాడెమీ అవార్డ్ పొందిన  -జార్జి బెర్నార్డ్ షా -4(చివరి భాగం )

మాన్ అండ్ సూపర్ మాన్ లో ఒక భాగం ప్రదర్శన యోగ్యం కాదు ,అర్ధ శతాబ్ది కాలం అది ప్రదర్శింప బడలేదు .నాటక రంగ చరిత్రలో డాన్ జువాన్ నరకం లో ఉన్న మూడవ అంకం చాలా సుదీర్ఘం గా ఉండటం వలన పక్కన పెట్టేశారు .షా మరణం తర్వాతా పాతిక మంది నటులు అమెరికా వెళ్లి ఒక మిలియన్ జనాలకు రెండు గంటలు సైన్స్ ,సెక్స్ యుద్ధం ,మతం ,సంగీతం ,రాజకీయం ,విముక్తి మున్నగు అంశాలపై అవగాహన కల్పించారు .డాన్ జువాన్ అనేపాత్ర పలికిన అనేక విషయాలు షా మాత్రమె రాయగలడు అవి ‘’they are not dignified ,they are only fashionably dressed ,.They are not moral ,they are only conventional .They are not virtuous ,they are only cowardly .They are not prosperous ,they are only rich ..They are not loyal ,they are only servile ,,not dutiful ,only sheepish ,not public spirited ,only patriotic ,not courageous ,only quarrelsome ,not determined ,only obstinate not masterful ,only domineering ‘’అని రాక్షసుల స్నేహితులగురించి అనిపిస్తాడు .వీరంతా ఆనాటి ఆయన సమకాలీనులే

‘’మేజర్ బార్బర మరియు డాక్టర్స్ డైలమా నాటకాలు షాలో ఉన్న అమిత శక్తిని ఆవిష్కరించాయి .మొదటిది సాల్వేషన్ ఆర్మీ కి   సంబంధించింది .మతానికి వ్యతిరేకం గా రాసిన కామెడి .మానవులకు ఉండాల్సిన మంచితనం గురించి బోధించింది .రెండవది ఫార్స్ తో ఉన్న ట్రాజేడి.సుదీర్ఘ సంభాషణలు ఇబ్బంది పెడతాయి .ఆర్టిస్ట్ ను చంపి అస్తిత్వ రాహిత్యాన్ని  బతికిస్తాడు (Shaw allowed the non entity to live and the artist to die ).యాభై ఏళ్ళనాటికి షా 18నాటకాలు రాశాడు .ఇందులో ‘’Misalliance’’’’అనే కామెడీ కూడా ఉంది .కుటుంబం లో తలిదండ్రులకు సంతానానికి మధ్య ఉన్న సంతోష రహిత సంబంధాలను వివరించాడు .షా రాసిన ‘’పిగ్మాలియన్ ‘’నాటకం అనూహ్యం విజయం సాధించింది .షా అంటే ‘’పిగ్మాలియన్ ‘’అనే పేరొచ్చింది .దీన్ని సినిమాగా తీశారు .బాగా మాట్లాడటానికి ఫోనేటిక్స్ ను దట్టించాడు .ఇంగ్లీష్ లోని 42అక్షరాలకు దేనికి దానికి ఒక నిర్దుష్ట నాదం ఉంది అని తీవ్రంగా వాదించేవాడు .కాని మాటలు అడ్డు గోడలుగా స్థాయి లమధ్య (క్లాస్ )  నిలిచి మంచి కామెడీని దేశం లో పండించాయి

వయసు పెరిగిన కొద్దీ షా మరింత ఆలోచనా పరుడయ్యాడు మరింత విచారణ చేశాడు .సహనం పెరిగింది .సువ్యవస్థితమైన ప్రతి దానిపై తిరుగుబాటు బావుటా ఎగరేశాడు .అరవై ఏళ్ళ వయసులో చాలా సంపన్న జీవితం అనుభవించాడు .’’హార్ట్ బ్రేక్ హౌస్ ‘’నాటకం రాశాడు .ఇది షా నాటకాలలో అత్యుత్తమమైనదని విమర్శకాభిప్రాయం .ఇది యుద్ధం ముందు స్తితిగతులకు దర్పణం అన్నారు .ఐరోపా నావ అంతూ  దరీ లేని సముద్రం లో చుక్కాని  లేని నావగా కొట్టు మిట్టాడుతున్నట్లు చిత్రించాడు . దీనిని సెంటిమెంటల్ డ్రామా అనాలి. నాటక కర్త సాంకేతిక నైపుణ్యానికి పరాకాష్ట. చెకోవ్ ఆవహించిన షా లాగా రాశాడన్నారు. ఆ తర్వాత ఐదేళ్ళు రెండు నాటకాలపై దృష్టి పెట్టాడు. అందులో ఒకటి’’ back to Methuselah’’- ఒక గొప్ప నీతి కథ- రెండవ సృష్టి పరిణామం గురించిన కథ. మనుషులు కలకాలం జీవించే కథ. ఇది ఒక ఫాంటసీ. మార్మికతను జోడించి రాసాడు. షా దృష్టిలో లైఫ్ ఫోర్స్ లేక దేవుడు మనిషి లాంటి వాడే. అనంపూర్ణ మనిషి సంపూర్ణత కోసం ప్రయతినించే వాడే. ఈ నాటకం బృహత్తరమై షా కన్న కలలన్నీ నెరవేర్చిందని భావిస్తారు. అరవై ఏడవ ఏట “సెయింట్ జోన్” అనే కదలించే కవితాత్మకమైన నాటకం రాసాడు. మనిషి ఆధ్యాత్మికతను జయించటం ఇందులో కథ. ఇంతకు ముందు చెప్పిన నాటకం వేదాంత సౌందర్యంగా ఉంటే ఈ నాటకం సాధారణంగా సహజంగా మానవ ఆత్మకు చాంపియన్ గా నిలిచింది. రెండేళ్ళ తర్వాత షాకు సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది.

సెయింట్ జోన్ రాసిన తర్వాత నాటక కర్త షా లోని జీనియస్ క్రమంగా తగ్గింది. కానీ కరపత్ర రచయితగా విజ్రుమ్భిస్తున్నాడు. కొంతమంది దృష్టిలో పుస్తకాలకు షా రాసిన ఉపోద్ఘాతాలు ఆయన నాటకాల కంటే గొప్పవి. ఆ నాటకాలు థియేటర్ మోజు ఉన్నవాళ్లకే పరిమితం అంటారు. ఈ విమర్శలను లెక్క చేయకుండా అతి ముఖ్యమైన “ది యాపిల్ కార్ట్” నాటకాన్ని డెబ్భై మూడవ ఏట రాసాడు. ఆ తర్వాత డజను నాటకాలు రాసినా తళుకు, బెళుకు తక్కువ. అయితే వైవిధ్యం మాత్ర కనిపిస్తుంది. 1952 లో సినీ నటి కాతరిన్ హెప్ బర్న్ షా ఎనబై ఏళ్ల వయసులో రాసిన “The Millionairess”లో నటించి గొప్ప విజయాన్ని చేకూర్చింది.

రెండు ప్రపంచ యుద్ధాలు షాలో పాత భావాల స్థానంలో కొత్త భావాలకు ఆస్కారం కలిగించాయి. ఆయనలోని పాసిఫిజం గట్టిబడింది. పాట్రిక్ కాంప్ బెల్ అనే ఆమె తన ఒకానొక కొడుకు నటనలో చనిపోయాడని మత ప్రచారకుడు అభినందిస్తూ పెద్ద ఉత్తరం రాసాడని షాకు ఉత్తరం రాసింది. దీనికి కోపం సాను భూతికలగలిపి  షా “It is no use. I cant be sympathetic. These things simply make me furious. I want to swear. I do swear. Killed just because people blasted fools. A Chaplain too to say nice things about it. It is not his business to say nice things about it but to shout that ‘the voice of thy son’s blood crieth unto God from the ground” అని జవాబు రాసాడు. 75 వ ఏట సోషలిస్టు కాని సోషలిస్టు అయిన షా రష్యా సందర్శించాడు. రెండేళ్ళ తర్వాత ప్రపంచ పర్యటన చేసాడు. ఎప్పుడు అమెరికాకు  ఆహ్వానించినా  తిరస్కరించే షా రెండు సార్లు అక్కడ ఆగాడు. మొదటి సారి పసిఫిక్ తీరంలో సాన్ సిమ్యాన్ రాంచ్ అఫ్ విలియన్ రండాల్ఫ్ హర్స్స్ట్ ను చూసినప్పుడు. ఈయన షాకు రచనలను కొన్ని సిండికేట్ చేసాడు. రెండవ సారి న్యూయార్క్ లో ఒక రోజు ఉండి మెట్రోపాలిటన్ ఒపేరా హౌస్ లో ఉపన్యసించాడు. అప్పుడు మాట్లాడుతూఅమెరికా  బ్యాంకులను జాతీయం చేయాలని పెట్టుబడిదారులను దూరం చేయాలని యుద్ధపు అప్పులన్నీ రద్దు చేయాలని కోరాడు. అక్కడి నుండి తన స్వగ్రామం హయాత్ సెయింట్ లారెన్స్కు తిరిగి వచ్చాడు. ప్రజాస్వామ్య విధానాలపై తనకున్న నమ్మకాలను ప్రకటించాడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో షా తనను “General consultant to man kind “గా చెప్పుకున్నాడు.

నాన్ స్టాప్  గా రాస్తూనే 8 2 వ ఏట 50 వ నాటకం’’ జెనీవా’’ రాసాడు. 91 లో “Beoyanat Billions “నాటకాన్ని పూర్తిచేసి మరొక కామెడీని ప్రారంభించాడు. ఆయన రచనా వర్క్ షాప్  పేరు’’ ది షెల్టర్’’. 93 వ ఏట “Rhyming picture guide to Ayot Saint Lawrence “తయారు చేసాడు. షా గొప్ప ఫోటోగ్రాఫర్. ఇందులో ఫోటోలన్నీ తానే తీసిపెట్టాడు. ఇందులోని ప్రాసలు ‘’స్కైలార్కింగ్ రైమ్స్’’ గా పేరు తెచ్చుకున్నాయి. వందేళ్ళకు  పైగా బతుకుతానని అనుకున్నాడు. కానీ ఒక పండ్ల చెట్టుకు  కుదురు చేస్తూ 1950 సెప్టెంబరు 10 న పడిపోయాడు. తుంటి ఎముక విరగటం కారణంగా మరణం రాలేదు కానీ 94 ఏళ్ల ముసలి తనంలో ఎముకలు చక్కగా అతుక్కున్నాయి. ఆ షాక్ కు  మాత్రం ఆయనకు కిడ్నీ ఇన్ఫెక్షన్ తెచ్చింది. రెండు ఆపరేషన్స్ జరిగినా ఫలితం లేకపోయింది. 2-11- 50 న మహా నాటక రచయిత బెర్నార్డ్ షా మరణించాడు. చనిపోయే నాటికి చాలా గొప్ప సంపన్నుడుగా ఉన్నాడు. అయన ఎస్టేట్ విలువ మిలియన్ డాలర్ల పైనే ఉంటుందని అంచానా వేసారు.

 

షా చనిపోయిన తర్వాత కూడా ఆయన ప్రేతాత్మ మాట్లాడుతూనే ఉంది. తనను వెస్ట్ మినిస్టర్ అబే లో ఖననం చేయొద్దని కోరుకున్నాడు. తనది ,తన భార్య చితాభస్మాన్ని తమ గార్డెన్ లో వెదజల్లమని కోరాడు. తన బ్రతుకు ఎంత సత్యమో తన మరణం కూడా అంతే అన్నాడు. షా’’ క్రియేటివ్ ఇవల్యూషన్’’ –సృజనాత్మక పరిణామం ను నమ్మాడు. తనకు ఏ స్మృతి చిహ్నం నెలకొల్పవద్దని కోరాడు. తనపై రక్తతర్పణానికి చిహ్నమైన క్రాస్-శిలువను  ఉంచవద్దని చెప్పాడు. కానీ నాటి  ప్రధాని అట్లీ మాట్లాడుతూ “shaw was not only our greatest entertrainer but our greatest teacher”అని శ్రద్ధాంజలి ఘటించాడు. షాను’’ ఫైటింగ్ ఐడియలిస్ట్’’అంటారు. షా నాటకాలు ‘’అధిక ప్రాసంగిక సంభాషణలు’’.. ఇందులో ‘’ వెంట్రి లోక్విజం ‘’ఎక్కువ. సంప్రదాయాన్ని అస్తిరపరచిన దార్శనికుడు షా. ప్రతి దానిని లోతుగా తరచి అభిప్రాయం చెప్పేవాడు. ప్రశ్నలకొంటే ఆయన సమాధానాలు ఇబ్బందికరంగా ఉండేవి. ఆయన భావనలు అరిస్స్తో ఫేనస్ కు దగ్గరలో ఉంటాయి. “ది అకార్నియాస్ “ నాటకం లోని కోరస్ ఇరవై శతాబ్దపు ప్రేక్షకులనుద్దేసించి చెప్పబడింది.అదే “As for you never loose him. We will always fight for the cause of justice in his comedies. He promises you that his precepts will lead you to happiness though he uses neither flattery not intrigue nor bribery nor deceit. Instead of loading you with praise he will point you to the better way”.

జీవితకాలం లో షా అరవైమూడు  నాటకాలు రాశాడు కదా,నవలా  రచయిత .వ్యాసాలూ కరపత్రాలు పుంఖాను పుంఖంగా రాశాడు గొప్ప విమర్శకుడు .సాంఘిక సమస్యలకు కామెడీజోడించి రాశాడు .పనివారల శ్రమ దోపిడీని వ్యతిరేకించాడు .స్త్రీపురుషులకు సమాన హక్కులకు ఉద్యమించాడు .ప్రైవేట్ ఓనర్ షిప్ కు వ్యతిరేకి .అందరికి ఆరోగ్యవంతమైన సుఖ జీవనం అందించటం ప్రభుత్వ లక్ష్యం గా ఉండాలని చెప్పాడు .కొంతకాలం స్థానిక రాజకీయాలలో పాల్గొన్నాడు .మానవ జాతి అభి వృద్ధికి తనదైన యుజేనిక్స్ రాశాడు .నియంతృత్వ వ్యవస్థను వ్యతిరేకించి ప్రజాస్వామ్య విలువలను ఆరాదించాడు .1925లో సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ ను ,1938అకాడెమి అవార్డ్ ను  పొందినఏకైక సాహిత్య కారుడు షా .నోబెల్ అందజేస్తూ ఆయన్ను ‘’marked by both idealism ,humanity .its stimulating satire often being infused with a singular poetic beauty .’’ అని శ్లాఘించారు .నైట్ హుడ్ఇస్తానంటే వద్దన్నాడు షా .ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇస్తానంటే తిరస్కరించాడు.1938పిగ్మాలియన్ కు  ఆస్కార్ అవార్డ్ లభించింది

షేక్స్ పియర్ నాటక నిర్మాణ లోపాలను ఎలుగెత్తి చాటాడు షా వాటిలో ఎడిటింగ్ ఉండకూదదన్నాడు ‘లండన్ లోని రాయల్ కోర్ట్ దియేటర్ లో షా రాసిన ‘’జాన్ బుల్స్ అదర్ ఐలాండ్ ‘’నాటకం 1904లో ప్రదర్శించినపుడు ఏడవ ఎడ్వర్ రాజు చూసి పగల బడి నవ్వుతూ కుర్చీ విరగ్గోట్టాడట .అంతగా ఆయన ఎంజాయ్ చేశాడన్నమాట .పిగ్మాలియన్ నాటకం వేలాది ప్రదర్శనలతో విజయం పొందింది .1998 మొదటిసారి షా కేమేరాకొని అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకొన్నాడు .ఫోటోగ్రఫీ ని’’ సీరియస్ ఆర్ట్ ఫారం ‘’గా ప్రచారం చేశాడు .ఎన్నో ఫొటోగ్రాఫిక్ ప్రదర్శనలపై రివ్యూలు రాశాడు .

రష్యావెళ్లినప్పుడు స్టాలిన్ ను చూసి ఆయన విధానాలకు జేజేలు పలికాడు షా .’’ఆన్ దిరాక్స్ ‘’నాటకం లో స్టాలిన్ భావాలను పోదిగాడు .యూజేనిక్(సుజన విజ్ఞాన శాస్త్రం )  సిద్ధాంతకర్త అయిన షా దాన్నిఉద్యమంగా బాగా ప్రచారం చేశాడు .మాన్ అండ్ సూపర్ మాన్ నాటకం లో యుజేనిక్స్ సిద్ధాంతాన్నే ఆవిష్కరించాడు .సోషలిజం తో యుజేనిక్స్ ను మిశ్రితం చేసి వ్యాప్తి చెందించాడు షా .షా కీర్తి ఖండాంతర వ్యాప్తి చెందింది ఆయన వ్యంగ్యానికి ‘’షావియన్ ‘’అనే పేరు సార్ధకమైంది .ఇంగ్లీష్ స్పెల్లింగ్ లలోని విరుద్ధతలపై జనానికి అవగాహన కల్పించాడు .తన సంపాదన లో కొంత భాగాన్ని ఆంగ్ల సాహిత్యం లో కొత్త ఫోనేమిక్ ఆల్ఫబేట్ తయారు చేయటానికి కేటాయించాడు ఆ ధనంచాలలేదు .కొంతకాలం దానిపై ఉపేక్ష వహించారు .పిగ్మాలియన్ మొదలైన వాటివలన రాయల్టీ బాగా పెరిగింది .కోర్టు లో దావా జరిగి చివరికి షా తలబెట్టిన కార్యానికి కోర్టు 860పౌండ్ల ధనాన్ని ఇవ్వాలని తీర్పు నిచ్చింది .దీనితోషా కన్న కల  ‘’షావియన్ ఆల్ఫబెట్’’తయారు చేశారు .

షా నివసించిన గృహం ‘’షా కార్నర్ ‘’గా ప్రసిద్ధి చెందింది .కెనడాలోని ఒంటారియో లో నయాగర సరస్సు పై’’ షా ఫెస్టివల్ ‘’ నిర్వహిస్తున్నారు .లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కు వ్యవస్తాపకులలొ షా ఒకడు.  షా అయిదునవలలు రెండు కదా సంపుటాలు ,అరవైమూడు నాటకాలు రాశాడు .ఇక కరపత్రాలు ,విమర్శలు ,వ్యాసాలూ లెక్క లేనన్ని .సంగీతవిమర్శపై పది ఉద్గ్రంధాలు రాశాడు జార్జి బెర్నార్డ్ షా .

Image result for bernard shaw   Image result for bernard shawImage result for bernard shaw

మరో ప్రముఖునితోకలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-8-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అర్ధరాత్రి స్వతంత్రం మొదలైనవి


 
 

 
 

గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తీరు మారని తోడేలు -మరియు 50 ఏళ్ళ” మనోహర” సినిమా


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -71 30— నోబెల్ బహుమతి, అకాడెమీ అవార్డ్ పొందిన -జార్జి బెర్నార్డ్ షా -3

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -71

30— నోబెల్ బహుమతి, అకాడెమీ అవార్డ్ పొందిన  -జార్జి బెర్నార్డ్ షా -3

స్వయం వ్యక్తిత్వంతో షా లెజెండ్ తో పాటు అల్లరి, ఆగం కూడా పెరిగాయి. సంప్రదాయంపైనా వ్యతిరేకంగా ఉన్న భావాల వలన షా కుంభ కోణాలకూ  కేంద్రమయ్యాడు. ఆయన నిజంగా ఉన్నత నైతికతో జీవించాడు. ఆయన ప్లేటానిక్ ప్రేమలు, భావోద్రేకాలు. అన్ని కాగితం  మీదనే నిజ జీవితంలో కాదు. అతనిది  ‘’సెక్స్ లెస్ వాకింగ్ బ్రెయిన్’’ అన్నాడు ఫ్రాంక్ వారిస్. ఈ మాట ముప్పై యేడు వచ్చే వరకు నిజమే . విలియం మారిస్ అనే కవి కూతురు మే మారిస్ పై మోజు పడ్డాడు. ఆధ్యాత్మికంగా ‘’అనీబ్ సెంట్ ‘’కు  దగ్గరగా ఉండేవాడు. ధియాసఫీకు భాష్యకారుడు. ఇరవై తొమ్మిదవ ఏట జెన్ని పీటర్సన్ షాను ముగ్గు లోకి దించింది. షాకు ‘’రతి కార్యం’’ విసుగు అవాస్తకమైనది అని అనిపించేది. ఆమెకు ఆ కోరిక ఎక్కువ. నటీమణులు ముగ్గురికి సుదీర్ఘమైన ప్రేమ లేఖలు రాసేవాడు. అందులో ఫ్లారెన్స్ ఫార్ అనే ఆమె సాధారణ అమెచ్యూర్ రచయిత్రి, గాయకురాలు మరియు ఈజిప్టా లజిస్ట్ తూర్పు దేశపు మార్మిక భావాలకు ఆమె ఆకర్షితమైంది. ఆమె ఇంగ్లండ్ వదలి ఇండియా వచ్చి చనిపోయింది. ఎలాన్ కెర్రీ తో కూడా తొమ్మిదేళ్ళు లేఖాయణం సాగించాడు. ఆమెను కలవటానికి భయపడేవాడు. “షా టేర్రీల లేఖలు”కు ముందుమాట రాసాడు. అందగత్తె మిసెస్ పాట్రిక్ కాంప్ బెల్ తో కూడా చనువుగా ఉత్తరాలు రాసేవాడు.ఇరవై ఎనిమిదేళ్ళు ఈ లేఖా స్రవంతి సాగింది. తన ప్రేమంతా పోస్టు ద్వారా పొంగి పోరలినదని చెప్పుకునేవాడు.’’ పిగ్మాలియన్’’ నాటకం రిహార్సల్స్ జరిగే రోజుల్లో  “one of these days Shaw will eat a breakfast and God help all women”అని గుసగుసలాదేవారు. నలభై ఏడు వచ్చే సరికి పెళ్లి చేసుకోవాలనే తలపు పెరిగింది. అప్పుడు కూడా ప్రేమాయణం సాగించాడు .కానీ తటపటాయించాడు. ఐర్లాండ్ కు చెందిన గొప్ప సంపదకు వారసురాలైన షార్లెట్ పెన్ టౌన్ సెండ్  అనే తెలివి గల అమ్మాయితో గడిపి ఆమె డబ్బు ఈయన అనుమానాలతో అది బెడిసిగోట్టింది.  షార్లెట్ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆమెకు టైప్ వచ్చు కనక షా రాసిన షార్ట్ హాండ్ ను టైప్ కొట్టేది. ఇద్దరి మధ్య గొడవలు, పోట్లాటలు జరుగుతూ ఉండేవి. ఎంగేజ్మెంటు రద్దు చేసుకున్నారు. వెబ్స్ తో పాటు షార్లెట్ ప్రపంచ యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకుంది. అధిక శ్రమ వలన షా ఆరోగ్యం దెబ్బ తింది. ఆమె తిరిగి వచ్చి అతను ఉన్న చీకటి ఫ్లాటు నుండి మార్చి ఆరోగ్యం కుదుటపడే దాకా సేవ చేసింది. 1897 లో’’ The Devil’s disciple’’ అమెరికాలో గొప్ప విజయం సాధించి డబ్బు చేతికొచ్చి షార్లెట్ సంపద కంటే ఎక్కువ సాధించాడు. ఇప్పుడు ఈ జంట 1898 జూన్ ఒకటిన పెళ్లి చేసుకున్నారు. నలభై  ఐదేళ్ళు కాపురం చేసారు. హనీమూన్ లో ఉండగా షా ఏంటి రొమాంటిక్ నాటకం’’ సీజర్ అండ్ క్లియోపాత్రా ‘’రాసాడు.

 

మానవ సంబంధాలు ఆనందాన్ని వాయిదా వేసుకోవడం వలన వృద్ధి చెందుతాయని షా భావన. ‘’ది ఆపిల్ కార్ట్’’ అనే నాటకంలో అనైతిక సెక్స్ దట్టించారు. ఏభై ఏళ్ళు వచ్చేసరికి 17 నాటకాల కర్త అయ్యాడు. లెక్కలేనన్ని కరపత్రాలు  వివాదాస్పద వ్యాసాలూ అనేక విమర్శనా వ్యాసాలూ రాసాడు. ఒకసారి దూషణ, మరోసారి భూషణలకు గురయ్యే వాడు. షా అంటే “A dialectician who was a dynamo a storm center   in the theatre and rudely energizing force in all contemporary culture “ అనిపించుకున్నాడు. నలభై మూడవ ఏట’’ సీజర్ అండ్ క్లియోపాత్రా’’ నాటకం రాసి అందులో  భావావేశాన్ని హేతువు మందలిన్చినట్లుగా రాసాడు. ఇది షేక్స్పియర్ యొక్క ‘’ఆంటోని  అండ్ క్లియోపాత్రా’’కు జవాబుగా కన్పిస్తుంది. నలభై నాలుగేళ్ల వయసులో “Captain Brassbound’s conversion”పూర్తీ చేసి బ్రిటిష్ ఇమ్పీరియలిజం ను కళ్ళకు కట్టినట్లు చూపించాడు. నలభై ఐదు లో’’ మాన్ అండ్ సూపర్ మాన్ ‘’అనే  శక్తివంతమైన నాటకం  చేసాడు. ఈ నాటకం చాలా సీరియస్ నాటకం. “Masterpiece of intellectual dramaturgy which broke not only with the English drama but English thinking” అని రుజువు చేసింది. పురుషుడిని “retreating quarry” గా స్త్రీని “Disguised but remorseless pursuer crying to the universe” గా అభివర్ణించాడు. ‘’సూపర్ మాన్ కి పిత’’ అయిన షా ఎంతో మంచి చెప్పినా సంతృప్తి చెందలేదు. నాటకంలో అంతర్నాటకం అతని ప్రత్యేకత. ఆయన పోప్ కవి  చాటుపద్యాలను వాడాడు. అందులో కొన్ని ముఖ్యమైనవి “He who can does. He who can not teaches. Don’t do unto others as you would that they should do unto you”వంటివి చాలా ఉన్నాయి. ‘’స్వేచ్చ అంటే బాధ్యత’’ అంటాడు  షా. అందుకనే ఎక్కువ మంది భయపడతారు అన్నాడు. “Marriage is popular because it combines the maximum of temptation with the maximum of opportunity” అన్నాడు. సంపద అంటే దొంగతనం అనే అర్థం చెప్పాడు. జీవితం అందరి మనుషులను సమానం చేస్తుంది. చావు  ప్రతిభను బయటపెడుతుంది లాంటి  సామెతలను ఎన్నో ప్రయోగించాడు. చెడును అర్హ్తం చేసుకున్నావారు దానిని క్షమిస్తారని దాన్ని కాదన్నవారు నాశనం చేస్తారని చెప్పాడు.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-8-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -70

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -70

30— నోబెల్ బహుమతి, అకాడెమీ అవార్డ్ పొందిన  -జార్జి బెర్నార్డ్ షా -2

షా లోని నాటక కర్త 1892 వరకు బయటపడలేదు .కానీ 18 8 5 లో 29 ఏళ్ల వయసులో విలియం ఆర్చర్ అనే తోటి విమర్శకుడు, స్నేహితునితో కలసి పారిషియన్ విధానంలో ఒక మంచి నాటకం రాసాడు. అది వినోద ప్రధానమైనదిగా ఉంది. అది సాంఘిక ప్రచారంగా సాంఘిక సంస్కరణగా భావించాడు. ఆర్చర్ తప్పుకున్నాడు. షా తనలోని భావాన్ని ఆపుకోలేదు. ఏడేళ్ళ తర్వాత అదే “Widows Houses”గా వచ్చింది. ‘’Plays  Unpleasant ‘’అనే శీర్షికలో వచ్చిన మొదటి నాటకం ఇది. ఇందులో హాస్యం, వివాదం ఉన్నాయి. ఒక కొత్త రకపు విదూషకుని  జీతానికి కుదుర్చుకుని అతనితో సాంఘిక విషయాలపై చర్చించేవాడు. ‘’విడోస్ హౌసెస్ ‘’నాటకం మధ్య తరగతి గౌరవాన్ని మురికివాడల వారి బీదతనాన్ని బహిర్గతం చేసింది. తెర దించేసిన తర్వాత నాటకంలోని పాత్రలు ప్రేక్షకులకు గుర్తుఉండిపోవాలని షా భావించాడు. ఒకే రకపు ప్రేక్షకులు౦ టారని అనుకోలేదు. ప్రతి మనిషి అతడు వెధవ అయినా మహర్షి అయినా ఒక దృక్పథం కలిగి ఉంటాడని అదే అతని తీరును సమర్తిస్తుందని  ఇతరులకు కూడా  అలాంటి అభిప్రాయలు ఉంటాయని నమ్మాడు. పుండాకోర్ కూడా అతని దృష్టిలో కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. సంఘం ఈ పుండాకోర్ తనాన్ని అతను తనను తాను తెలుసుకునేదాకా   పెకలిచలేదు. ఈ పనే సంఘానికి షా చేయాలనుకున్నాడు. ఈ పు౦డాకోర్లను అభిశంసించటం కాని పుండాకోర్లు  కానివారిని  పోగట టం వల్ల కాని మార్పు రాదు. వాళ్ళు అలాగే బతుకుతూ ఉంటారు, చరిస్తూ ఉంటారు, తమను తాము గొప్పవారుగా చాటుకుంటారు.

విడోస్ హౌసెస్ నాటకం రాసిన మూడేళ్ళకు ఆరు విభిన్నమైన నాటకాలు షా రాసాడు. అందులో రెండు అసహ్యకరమైన నాటకాలు. ది ఫైలాండరర్స్ గొప్ప సటైర్ తో కూడిన నాటకం. “మిసెస్ వారెన్స్  ప్రొఫెషన్” నాటకం వ్యభిచారాన్ని వాణిజ్యపరం చేసింది. అది బూర్జువా సొసైటీ వాణిగా సాంఘిక నేరంగా దానికి సంఘం మొత్తం భాగస్వామ్యం అయ్యిందని  నిరూపించాడు. ఇందులోని విషయం విక్టోరియన్ ఇంగ్లాండ్ భావాలకు విరుద్ధమైనవి. దీనికి పరిణామాలు తీవ్రం. ప్యూరిటన్ ధర్మంపై వ్యతిరేకమైనదని దీనిని ప్రదర్శన ఆపేయించారు . తర్వాత  నిషేధించారు.  అమెరికాలో కూడా నిషేధించబడింది. తర్వాత వచ్చిన నాలుగు నాటకాలు Arms and the Man, Candida, The man of destiny, You never can tell లు షా రాసిన గొప్ప ఆహ్లాదకరమైన ప్రసిద్ధి చెందిన కామెడీలు. ‘’మాన్ అండ్ సూపర్ మాన్ ‘’ లో స్త్రీ పురుషుల సెక్స్ విషయాన్ని చాలా మేదావంతంగా చిత్రీకరించాడు. ఈ ఏడు నాటకాలు ఒక సంపుటిగా వెలువడిన తర్వాత వీటిని అసంబద్ధమైన  బాధ్యతా రాహిత్యంతోకూడిన  విరక్త ఆడంబరంగా భావించారు. అమెరికా సమీక్షకులు అభ్యన్తకరమైనా భాషా నాటకాలుగా ముద్ర వేసారు. 1898 జూన్ 18 నాటి న్యూయార్క్ టైమ్స్ పత్రిక షా యొక్క పనికిమాలిన ఫిలాసఫీ సొంత డబ్బా లపై విరుచుకుపడింది. ఈ సోషలిస్టును ‘’జాక్ ఆఫ్ ఆల్  ట్రేడ్స్ ‘’అని ముద్ర వేసింది. తన దృష్టి కోణాన్ని ఎవరూ అర్థం చేసుకోలేకపోయారని షా బాధపడ్డాడు. షాకు ఉన్న ఒకే లోపం కవిత్వ భాష తెలియకపోవటం. టైమ్స్ పత్రిక అతని అభిప్రాయాలను రచనలను చీదరించుకుని ఫోటో వేయటానికి కూడా నిరాకరించింది. ఈ రకమైన విమర్శలు అడపా దడపా వస్తూనే ఉన్నాయి. మరొక ఇరవై ఏళ్ల దాకా ఈ దాడి కొనసాగింది. విరుద్ధభావాల వ్యక్తిగా అతన్ని భావించారు. విన్ స్టన్ చర్చిల్ ‘’చాటర్ బాక్స్ ఆఫ్ సోషలిజం ‘’అన్నాడు. మైకేల్ ఆండర్సన్  “Shah is a ready philosopher but no dramatist. His characters are exaggerations his situations farcical  “అన్నాడు. రెండేళ్ళ తర్వాత షా రాసిన’’ బ్యాక్ టు మేతుసేల్లా’’ నాటకంపై గిల్బర్ట్ సేల్డర్స్ సమీక్షిస్తూ షా ఒక కళాకారుడు కాదు కనక అతని సృజన బతకదు అని తేల్చి చెప్పాడు. వీటన్నిటికీ కారణం షా కు ఉన్న తీవ్ర స్వభావం, తన గురించి విరుద్ధ నిర్ణయాలు. తన రచనలకు తాను సిగ్గుపడటం లేదని ,రాసిన విధానం గురించి కూడా చింతించటం లేదని షా చెప్పేవాడు. తన రచనల బాగోగులను మెజారిటీ ప్రజలు చెప్పాలి కాని ఒకరిద్దరు విమర్శకులు కాదని అనే వాడు. తాను  డ్రైడేన్ లాగా ఉపోద్ఘాతాలు రాసేవాడినని వాగ్నర్ లాగా గ్రంథాలు రాసానని ఇవన్నీ  చేయగలసమర్దుడినని చెబుతూ “I would give half a dozen of Shakespeare’s plays for one of the preface he ought to have written” అని రాసుకున్నాడు. ‘’ఏన్శేంట్ మారినర్’’  లాగా తాను గుర్తుండి పోతానని తన కథను తాను వినోదాత్మకంగా చెప్పుకుంటూ పోతానని ఇతరులు తప్పు చేస్తుంటే తాను సరైన పద్ధతిలో నడవడం తన ప్రత్యేకత అని చెప్పుకున్నాడు. “Nobody likes me. Capable persons are never liked. I am not likeable but I am indispensible”అని గర్వంగా ప్రకటించుకున్నాడు. స్వంత డబ్బా కొట్టుకోడంపై షా స్పందిస్తూ “The spontaneous recognition of really original work begins with a mere handful of people and propagates itself so slowly that it has become a common place to say that genius demanding bread is a given a stone until after its possessor’s death. The remedy for this is sedulous advertisement. “అందుకనే తను గురించి తాను గొప్పలు చెప్పుకోవలసి వస్తుందని తానింకా మధ్య వయసులోనే ఉన్నానని తాను’’ ఫ్లయింగ్ డచ్ మాన్’’ లాగా ఒక లెజెండ్ నని దర్పంగా తెలియపరచాడు. తన నాటకాలలోని విదూషకునిలాగా అప్పుడప్పుడు బయటపడేవాడు. తాను సత్యాన్ని తెలియపరచటానికే  ‘జోకుతూ’ ఉంటానని అన్నాడు. “The truth is the one thing that nobody will believe “అని ఘాటుగా చెప్పాడు. కనక తనను జనం వినాలంటే కొన్ని పిచ్చి ప్రవర్తనలు తప్పవని అన్నాడు. ఈ ఇబ్బందులన్నీ సరైన విషయాన్ని తెలియచేయటం దానిని అత్యంత ఉన్నత స్థాయిలో చెప్పటం తన లక్ష్యం అన్నాడు.

Inline image 1  Inline image 2  Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-15 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రచన పత్రిక బాపు 9వ ప్రత్యెక సంచిక -బాపు చిత్రించిన మైనేని గోపాల కృష్ణ గారి చిత్రం-బాపు గారికి మైనేని వారి ఉత్తరం ,బాపు గారు గోపాలక్రిష్ణగారికి రాసిన జాబు

bapuspecial1 001 bapuspecial2 001

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

బాపు చిత్రించిన మైనేని గోపాల కృష్ణ గారి చిత్రం

bapu3 001

 

 

 

బాపు గారికి మైనేని వారి ఉత్తరం ,బాపు గారు గోపాలక్రిష్ణగారికి రాసిన జాబు

bapu4 001 bapu5 001 bapu6 001

 

 

 

 

 

 

బాపు గారు నాకు రాసిన ఉత్తరం ,నేను రచన సాయి గారికి రాసిన జాబు

bapu8 001

 

 

 

 

 

0001 0002 0003 0004 0005 0006 0007 0008 0009 0010 0011 0012 0013 0014

 

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -69

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -69

30— నోబెల్ బహుమతి అకాడెమీ అవార్డ్ పొందిన  -జార్జి బెర్నార్డ్ షా -1

94 ఏళ్ళు జీవించి ఎదురులేని నాటక రచయతగా పేరుపొంది ఆ శతాబ్దపు యువ మేధావిగా ప్రసిద్ధి చెందిన ఐరిష్ నాటక రచయిత జార్జ్ బెర్నార్డ్ షా 2-11- 19 50 లో మరణించాడు. మహోన్నతులలో చివరి వాడు నిజమైన మొదటి సంస్కారవంతుడైన వ్యక్తీ బెర్నార్డ్ షా అని నాటక నవలా రచయిత అయిన జె .బి. ప్రీస్ట్లీ అభివర్ణించాడు. షా నాటకాలతో  ప్రసిద్ధి చెందటమే కాక మహా గొప్ప విమర్శకుడు కూడా. ఒక్క మాటలో అతనిని “మూవర్ అండ్ షేకర్” అని అనాలి. అన్ని రకాల భేషజాలకు బద్ధ వ్యతిరేకి. ఆయన వ్యంగ్య రచయత మాత్రమే కాదు సంస్కరణవాది కూడా. అయితే దేనికీ నిబద్దుడైన వ్యక్తీ కాదు. అతనివి అనేక పార్స్య్వాలు. ఉపాధ్యాయుడు, ప్రతి దానినీ ఖండిస్తూ దేనిని అంగీకరించేవాడు కాదు. అతనిది యుద్ధ క్షేత్రం. అతనిలో విశ్వ భావనలు ఉన్నాయి. డాన్ క్విక్సోట్ కు ఉన్న పోరాట పటిమ కలవాడు. డాన్ జువాన్ లాగా ప్రభావితం చేయగల వ్యక్తీ. పశ్చిమ ప్రపంచ నైతికతను చాలెంజ్ చేసినవాడు.

జార్జి బెర్నార్డ్ షా ఐర్లాండ్ లోని డబ్లిన్ లో 26 -7- 1856 న తండ్రి జార్జి కార్ షా  కు ముగ్గురి సంతానంలో ఒకే ఒక మగ పిల్లవానిగా జన్మించాడు. తండ్రి అసమర్దపు సివిల్ ఉద్యోగి. తల్లి లుసిండా ఎలిజబెత్ గర్లీ షా ఒక భూస్వామి కుమార్తె. తండ్రి నుండి షా కు ఐరిష్ తెలివి, విలాస౦  సంక్రమించాయి. మద్యపానం మాత్రం అబ్బలేదు.  తండ్రిని తాగుబోతుగా చెప్పుకున్నాడు షా. అంతే కాక భరించరాని వాడుగా తయారయ్యాడని చెప్పుకున్నాడు. తల్లి గాయకురాలు, కళలపై అభిమానం కలది. కొడుకుకు సంస్కృతిపై అభిమానం కల్గించింది. ముఖ్యంగా సంగీతం, చిత్రలేఖనం. డ్రామాలపై గొప్ప అభిరుచిని కల్గించింది. షా సాధారణ విద్య పరిమితమైనది. 13 వ ఏట వేస్లియన్ కన్ వెంషనల్ స్కూల్లో చేరాడు. తర్వాత డబ్లిన్లోని సెంట్రల్ మోడల్ బాయ్స్ స్కూల్లో చదివాడు. ఈ స్కూల్ అంటే అతనికి పరమ యావగింపు. 80 ఏళ్ల కాలం వరకు ఎక్కడా ఆస్కూల్ ఊసు ఎత్తలేదు. భార్యకు కూడా చెప్పలేదు. దానిని గురించి తర్వాత చెబుతూ షా “It was to me what the blacking warehouse was to Dickens “అన్నాడు. ఈ స్కూల్లో ఏడాదే చదివి 18 71 లో కమర్షియల్ డే స్కూల్లో చేరాడు. తండ్రి దమ్మిడీ కూడా సంపాదించలేక కుటుంబ పోషణను వదిలేశాడు.తల్లి మ్యూజిక్ టీచరుగా పని చేస్తూ చదివించింది. 15 వ ఏట డబ్లిన్ లోని ఒక లా౦డ్ ఏజెంట్ కు  సహాయకునిగా పని చేసాడు. ఇష్టం లేకపోయినా ఇబ్బంది పడుతున్నా అక్కడే 27 ఏడూ వచ్చే దాక కాషియర్ గా  పని చేసాడు. తల్లి తాగుబోతు భర్తను వదిలేసి౦ది . ఆమె ప్రోత్సాహంతో రచయతగా మారాలని అనుకున్నాడు. తల్లి ఆసరాతో తాను ఒక మనిషిగా నిలబడాలని భావించానని చెప్పుకున్నాడు. పెన్నును నమ్ముకున్న ఈ మేధావి అడ్డం వచ్చిన ప్రతిదాన్ని పెన్నుతో పొడిచి చీల్చి చెండాడాడు. 5 నవలలు రాసినా ఎవరూ ప్రచురించే సాహసం చేయలేదు. షా ప్రముఖ వ్యక్తీ అయిన తర్వాత అమెరికా పబ్లిషర్లు వీటిని దొంగతనంగా ముద్రించారు. 9 కఠిన సంవత్సరాలు గడిపి మొదటిసారిగా 35 డాలర్ల రాబడి సాధించాడు. అందులో 25 డాలర్లు ఒక పేటెంట్ మందుకు ప్రకటన  రాయటం వలన వచ్చిందే.

దరిద్రంతో బాధపడుతున్న షా చాలా అవమానకర పరిస్థితుల్లో జీవించాడు. బూట్లు అరిగి చినిగిపోయి ఉండేవి. దుస్తులు అసహ్యంగా మురికితో ఉండేవి. చేతి కఫ్ఫ్ లు చీలికలు పేలికలుగా ఉండి ఎప్పుడూ కత్తెర దెబ్బలు తింటూ ఉండేవి. మార్ఫోక్ జాకెట్టు వేసుకుని నికర్స్ బ్రోకర్స్ లాగ  బ్రిటిష్ మ్యూజియం లో గడిపేవాడు. అక్కడ మార్క్స్ రాసిన దాస్ కాపిటల్ జర్మనీ సంగీతజ్ఞుడు వాగ్నర్  రాసిన “Tristan Und Isolde” చదివాడు. ఇబ్సన్ నాటకాల విమర్శకుడు, అనువాదకుడు విలియం ఆర్చర్ తోనూ, సిడ్నీ వెబ్ అనే యువ సివిల్ సర్వెంట్ తోనూ పరిచయం కల్గింది. వాళ్ళతో షా’’ ఆదర్శ ధామ  భావాలను ‘’(Utopian Ideas)  సిగ్గుపడుతూ పంచుకునే వాడు. హెన్రీ జార్జ్ గురించి విని సోషలిస్టు భావాలను పెంచుకున్నాడు. షెల్లీ ని చదివి శాకాహారి అయ్యాడు. ఆయనకు మశూచికం సోకి గడ్డం గీసుకోలేక గడ్డం పెంచి షా అంటే గడ్డం మనిషి అన్పించాడు. ఇరవై ఏట ఆ గడ్డమే శోభనిచ్చింది. 30 వ ఏట గడ్డం బిరిసెక్కింది. దానిని ఎప్పుడూ దువ్వుకుంటూ మాకీవిల్లీ లాగా దుస్తులు ధరించేవాడు. కీర్తి ప్రతిష్టలు వ్యాపించిన తర్వాత తన నకిలీ మేఫిష్ట్ఫీలియన్ రూపాన్ని చూసి గర్వ పడేవాడు. గడ్డం పూర్తిగా తెల్లబడితర్వాత  బక్కపలచని శాంతాక్లాజ్ లాగా కన్పించేవాడు లేదా’’ దైవరూప  సైతాను’’లాగా కన్పించేవాడు.

ఆర్చర్ దయ వల్ల షాకు ఒక పత్రికలో  పుస్తకాల సమీక్ష చేయటం మరొక దాన్లో కళాప్రదర్శనలు సమీక్ష చేయటం ఉద్యోగం దొరికింది. 29 వ ఏట సంగీత విమర్శకుడు అయ్యాడు. “కోర్నో ది బెసేటో” అనే మారు పేరుతో ఈ సమీక్షలు రాసేవాడు. ఆరేళ్ళు సంగీత కచేరీలు, ఒపెరాలపై రచనలు చేసాడు. అందులో హాస్యం, వ్యంగ్యం బాగా పండేవి. ఆయనకు సంగీతం జన్మతహా వచ్చిందని చెప్పుకునేవాడు. 15 వ ఏతే మొజార్ట్, హాన్దేల్. బీతొవెన్, మెండేల్సన్, రోసినీ ,వేర్దిల  సంగీత స్వరాలపై అవగాహన కల్గిందని చెప్పాడు. షా రాసిన’’ ద పెర్ఫెక్ట్ వాగ్నరైట్’’ ఆ సంగీతజ్నుని సంగీత విధానాన్ని ఆవిష్కరించిన గొప్ప పుస్తకం. “Ring of the Nibelings” అనే పుస్తకంలో గ్లాక్,వెర్దీల విస్మృత రచనలన్నింటి గురించి రాసాడు. ఇన్నేళ్ళుగా రాస్తున్నప్పటికీ బీదరికం మాట్లాడుతూనే ఉంది. కానీ అతనిలోని హాస్యం మాత్రం తగ్గలేదు. ఒకసారి బజారులో వెడుతూ ఉండగా ఒక గాయకుడు డబ్బు కోసం తన టోపీని చేత్తో పట్టుకోగా దానిని “నొక్కు” అని చెప్పి షా వెళ్ళిపోయాడు. 1894లో సంగీత విమర్శకునిగా రాజీనామా చేసి ఫ్రాంక్ హారీష్ పత్రిక సాటర్ డే రివ్యూ లో డ్రామా క్రిటిక్ గా చేరాడు. ఇబ్సన్ నాటకాలతో అధిక ప్రేరణ పొందిన షా సొంతంగా సమస్యలపై నాటకాలు రాయటం ప్రారంభించాడు. నాలుగేళ్ళు నాటకాలు ఎలా  రాయాలి అన్నదానిపై అనేక వ్యాసాలూ రాసాడు. అసంబద్ధమైన ముగింపులు ప్రొఫెషనల్ హీరోలను అసహ్యించుకున్నాడు. సార్డో రాసిన యాంత్రిక విధానపు నాటకాలను విమర్శించాడు. “It is the capacity for making good or bad art a personal matter makes a man a critic. The plain working truth is that it is not only good for the people to be shocked occasionally but absolutely necessary to the progress of the society that they should be shocked pretty often” అని నాటకాలపై తన అభిప్రాయం చెప్పాడు. ఇబ్సన్ నాటకాలు ప్రమాదకరం అని భావించినప్పుడు షా నాటక రచయితగా ముందుకు వచ్చాడు. ఇబ్సన్ సమకాలలీన నాటకాన్ని చాలా గొప్పగా ప్రభావితం చేసి నాటక రంగా చరిత్రలో సువర్ణాధ్యయాన్ని నెలకొల్పాడని “The Quintessence of Ibsenism “ అన్నదాంట్లో వివరించాడు.

 

1884 లో చివరి ఐదవ నవల రాస్తూ తన రచనలు 50 లేదా 60 తిరస్కరి౦ప బడినాయని దేనిని అంగీకరించలేదని ఇక నవలలు చాలు అన్పించిందని చెప్పుకున్నాడు. అప్పటికే సోషలిస్టు అయిన షా కొత్తగా ఏర్పడిన రోమన్ జనరల్ ఫెబియాస్ పేరు మీద ఏర్పడిన’’ఫేబియన్ సొసైటీ ‘’లో చేరాడు. ఈ సంస్థ క్రమగా ఊహా స్వర్గ విధానాన్ని వదలి శాస్త్రీయ సోషలిజం వైపు అడుగులు వేసింది. వారి నినాదం “Educate Agitate Organise”. ఈ సంస్థకు నియమ నిబంధనలను షా రాసాడు. బాధ పడటం కంటే ఇంకొక అంతర్యుద్ధాన్ని ఎదుర్కుంటాం అని ఆ సంస్థ చెప్పేది. స్వేచ్చ, సర్వ జనోపయోగం కోసం ఈ సంస్థ పని చేసింది. షా గొప్ప పాంఫ్లెటీర్ మాత్రమే కాని వక్తగా తడబడే వాడు. నెమ్మది నెమ్మదిగా తనను తాను తీర్చి దిద్దుకుని మాహా వక్త అయ్యాడు. వారానికి మూడు సార్లు పార్కుల్లో, వీదులమూలల్లో ఖాళీ హాళ్ళలో లెక్చర్లు ఇస్తూ 12 ఏళ్ళు గడిపాడు. ప్రతి స్థాయి లోని శ్రోతలను అలరించటానికి కావలసిన మసాలా అంతా సమకూర్చుకునేవాడు. ఈయనపై పోలీస్ నిఘా కూడా ఉండేది. ఒక సారి ఉపన్యాసం ఆపటానికి ప్రభుత్వం అరడజన్ మంది పోలీసులను పంపించింది. చట్టాన్ని కాపాడే వారు మాత్రం షాను అభినందించేవారు. రెండు సార్లు స్వచ్చందంగా జైలుకు వెళ్ళాడు.  ఫ్రీ స్పీచ్ కోసం పట్టు బట్టేవాడు. ప్రభుత్వ అనుమతి లభించేది కాదు. తాను సోషలిస్టు ప్రాపగాండా చేసేవాడినే కాని సంయమనం కోల్పయేవాడిని కాను అని చెప్పుకున్నాడు.

 

George Bernard Shaw 1936.jpgImage result for bernard shaw

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి – గురు పూజోత్సవ ఆహ్వానం

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః –గురు స్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః
శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా)దంపతుల సౌజన్యం తో
గురు పూజోత్సవ ఆహ్వానం
సుమారు 70 సంవత్సరాల క్రితం ప్రాధమిక విద్య నేర్పిన మా గురు వరేన్యులు కీ .శే.కోట సూర్య నారాయణ శాస్త్రి గారి చిత్ర పట ఆవిష్కరణ కార్య క్రమం వారి కుటుంబ సభ్యుల సమక్షం లో గురుపూజోత్సవం నాడు 5-9-2015శనివారం ఉదయం 10 గం లకు సరసభారతి ,మరియు పి. ఆర్. ఎస్. ఏం. జూనియర్ కళాశాల సంయుక్త ఆధ్వర్యం జరుగుతుంది ..ముఖ్య అతిధిగా శాసనమండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ విచ్చేస్తారు .చిత్రకారుడు శ్రీ టి. వి .ఎస్. బి .శాస్త్రి (ఆనంద్),దంపతులు ,మా గురుపుత్రులు తమ కుటుంబాల తో పాల్గొని కార్యక్రమానికి వన్నె తెస్తారు .ప్రముఖ సంగీత విద్వాంసురాలు శ్రీమతి సింగరాజు కల్యాణి గారు సంగీత కచేరి తో వీనుల విందు చేస్తారు . . శ్రీ రాజేంద్ర ప్రసాద్ కు ,గురు పుత్రుల కుటుంబాలవారికి , ,ఆర్టిస్ట్ శ్రీ ఆనంద్ దంపతులకు , కళాశాల అధ్యాపకులకు ,సంగీత విద్వాంసురాలు శ్రీమతి కల్యాణి గారలకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది . ప్రతిభ గల ఒక పేద విద్యార్దినికి, ఒక విద్యార్ధికి శ్రీ మైనేని గోపాల కృష్ణ దంపతులు ఏర్పాటు చేసిన శ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి స్మారక నగదు బహుమతిని సరసభారతి ద్వారా అందజేయ బడుతుంది ..invitation (1)

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సుత్తి కొట్టకండి మహా ప్రభో ……

D25834322

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఖరీఫ్ కు వరుణ గండం ,మరో ఉగ్ర దాడి ,ఉద్యమాలు -ఉస్మానియా


 


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అవనిగడ్డలో నాటక పోటీలు


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అణ్వ అస్త్రాలు కాదు -అన్న వస్త్రాలు కావాలి ,మధ్య ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం


 

 

రైళ్లను కూల్చిన వర్షం…

  • 06/08/2015
TAGS:

ఉగ్రవాదుల హత్యాకాండకు అలవాటు పడినట్టుగానే మన దేశ ప్రజలు రైలు ప్రమాదాలకు సైతం అలవాటు పడిపోయారు. గాయాలు మొద్దుబారిపోతున్నాయి. ప్రకృతి బీభత్సం ప్రాణాలను తీస్తోంది, మానవ నిర్లక్ష్యం ప్రాణలను బలిగొంటోంది. ప్రకృతి బీభత్సం మానవ నిర్లక్ష్యం పెనవేసుకున్నప్పుడు సంభవించే భయంకర పరిణామం మధ్యప్రదేశ్‌లో మంగళవారం రాత్రి పునరావృత్తమైంది. రెండు రైళ్లు ఒకేసారి ఒకేచోట కూలిపోవడం ఊహించని దుష్పరిణామం. ముంబయినుండి వారణాసికి వెడుతుండిన కామాయనీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి పడిపోయిన కొద్ది నిముషాలలోనే జబల్‌పూర్‌నుండి ముంబయికి వెడుతుండిన జనతా ఎక్స్‌ప్రెస్ కూడా అదే ప్రదేశంలో ఇనుప దారి తప్పిపోవడం అధికార యంత్రాంగం వారి నిర్లక్ష్య ఫలితం! వర్ష బీభత్సం గురించి మేఘాలు బద్దలు కావడం గురించి మాట్లాడిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం వారి నిర్లక్ష్యం గురించి నోరెత్తలేదు! ఎందుకని? ఆ రాష్ట్రంలోని హర్దా జిల్లాలో మంగళవారం రాత్రి అకాల మృత్యువు పైశాచిక నృత్య విన్యాసాలను ప్రదర్శించింది. అనుకోని చోట ఊహించని సమయంలో విరుచుకుని పడిన వర్ష బీభత్సం కారణంగా రెండు రైళ్లు పట్టాలు తప్పడం ఘోరమైన జాతీయ వైపరీత్యం! అకాలంలో అకస్మాత్తుగా బద్దలైన మేఘాలు అపూర్వ రీతిలో సృష్టించిన జల బీభత్సం స్థానిక ప్రజలను విస్మయంతో ముంచెత్తింది. ఈ విస్మయ విషాదం కొనసాగుతుండిన సమయంలో ఇనుపదారులు కుంగిపోవడం మరో దిగ్భ్రాంతికర పరిణామం! ఇనుపదారులు కుంగిపోయిన కారణంగా రెండు రైళ్లు దాదాపు ఒకే సమయంలో పక్కకు వంగిపోయాయట, పట్టాలనుంచి పక్కకు ఎగిరి పడ్డాయట! కుండపోత వర్షం వరదలను సృష్టించి ప్రాణాలను బలిగొనడం నిరంతరం పునరావృత్తవౌతున్న ప్రాకృతిక విషాదం. అయితే వర్ష బీభత్సం రైళ్లను పట్టాలు తప్పించి ప్రయాణీకుల ప్రాణాలను బలిగొనడం మరింత భయంకర పరిణామం. పదుల సంఖ్యలో మృతులు…వందల సంఖ్యలో క్షతగాత్రులు!
వరదల కారణంగా పట్టాలు కొట్టుకొనిపోయాయి! కనీవినీ ఎరుగని రీతిలో హర్దాజిల్లాలో వర్షం కురిసిందట! ఇలాకురవడం మానవులు ఊహించని సంగతి కావచ్చు! కానీ ఇంత భారీ వర్ష బీభత్సం వల్ల ఎక్కడైనా ఒకచోట కాని అనేక చోట్ల కాని రైలు పట్టాలు కొట్టుకుని పోవచ్చునన్న అనుమానం రైల్వే యంత్రాంగం వారికి అంకురించకపోవడమే క్రూరమైన నిర్లక్ష్యానికి నిదర్శనం. రైళ్ల రాకపోకలకు ముందుగా స్టేషన్‌ల మధ్య ఇనుప దారులను తనిఖీ చేసే సిబ్బందికి కూడ మాచెక్ నదిపై వంతెన కుంగిపోయిందని కాని, పట్టాలు పక్కకు తొలగిపోవడం కాని కనిపించకపోవడం విడ్డూరం. వంతెన ఎప్పుడు కుంగిపోయింది? పట్టాలు ఎప్పుడు తొలగిపోయాయి? సిబ్బంది తనిఖీ చేయడం మానుకుని వర్షంలో తడవకుండా స్టేషన్లలోనే కూర్చుండిపోయారా? లేక సిబ్బంది తనిఖీ చేసిన సమయంలో మంచిగా కనిపించి వంతెన, సమీపంలోని ఇనుపదారి రైళ్లు రావడానికి నిముషాల ముందు అకస్మాత్తుగా కుంగిపోయాయా? కొట్టుకుని పోయాయా? లేక రైలు బరువును వేగాన్ని తట్టుకోలేక వంతెన ఒరిగిపోయిందా? ఇవన్నీ ప్రశ్నలు! పట్టాలను తనిఖీ చేసే సిబ్బంది విధులను నిర్వర్తించకుండా నిర్లక్ష్యం వహించి ఉండినప్పటికీ అది తాత్కాలిక వైపరీత్యం. వంతెన, దాని సమీపంలోని రైలు పట్టాలు భారీ వర్షాల వల్ల కుంగిపోయే ప్రమాదం ఉందన్న వాస్తవాన్ని గ్రహించి, గ్రహించినప్పటికీ సకాలంలో మరమ్మతులు చేయించని ఉన్నత అధికారులది దీర్ఘకాల నిర్లక్ష్యం! ఈ దీర్ఘకాల నిర్లక్ష్యమే రెండు రైళ్లను పడగొట్టింది, అనేకమంది ప్రయాణీకులను మాచక్ నదీ జలాల పాలుచేసింది.
రైళ్లు పట్టాల తప్పడానికి అనేక కారణాలు ఉండవచ్చు. మితిమీరిన వేగం కూడ ఒక కారణం. గంటల తరబడి ఆలస్యంగా నడిచిన తరువాత విలంబనాన్ని తగ్గించడానికై మితిమిరిన వేగంతో రైళ్లను పరిగెత్తించడం పరిపాటి అయింది. పట్టాలు మార్గం నుండి తొలగిపోవడం, వదులు కావడం కూడ ప్రమాదాలకు కారణం. ఇలా తొలగిపోవడానికి విద్రోహ కాండ అనేక సందర్భాలో దోహదం చేసింది సిగ్నల్స్ ఇవ్వడంలో జరిగిన పొరపాట్లు కూడ రైళ్లు పట్టాలు తప్పడానికి దారి తీసాయి. రెండురైళ్లు ఢీకొనకుండా నిరోధించే వ్యవస్థ-ఆటోమాటిక్ జామింగ్ గురించి ప్రచారవౌతోంది. ఇలా నిరోధక చర్యలు ఒకవైపు వ్యవస్థితవుతున్న కొద్దీ సమాంతరంగా ఊహించని విలయాలు విరచుకుని పడుతున్నాయి. రైలు వంతెన మీద పయనిస్తుండిన సమయంలో ఆ వంతెన కూలిపోవడం ఇలాంటి ఊహించని విలయం.. 2006 డిసెంబర్ రెండవ తేదీన బిహార్‌లోని భగల్‌పూర్ స్టేషన్ సమీపంలో ఇలా వంతెనలు కూలిపోయి పరిగెత్తుతుండిన రైలుబోగీలపై పడి ప్రయాణీకులను నుజ్జు నుజ్జు చేసింది. ఆ వంతెన అలా అకస్మాత్తుగా పడడం వల్ల ముప్పయి ఏడు మంది బలైపోయారు. ఆ వంతెనను కూల్చివేస్తుండిన కార్యక్రమంలో నిర్లక్ష్యం వల్ల ఆ ఘోరం జరిగిపోయింది. అది ఊహించని దుష్పరిణామం! ఎవరికీ అనుమానం కూడ రాలేదు. 2012 జులై 30వ తేదీన నెల్లూరు సమీపంలో వెడుతుండిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి ముప్పయి మందికి పైగా మాడిమసైపోయారు. ఈ దగ్ధకాండ ప్రమాదవశాత్తు జరిగి ఉండినప్పటికీ, విద్రో హ చర్య అయినప్పటికీ అది పట్టాల పటిష్టతతో కాని, రైలు వేగంతో కాని ముడివడిన ప్రమాదం కాదు! అందువల్ల అలాంటి ప్రమాదాలు కూడ నిర్వహణ సిబ్బంది నిర్లక్ష్యం పరిధిలోకి రావు…మావోయిస్టులు తదితర నక్సలైట్ల వర్గాలు బీభత్స కృత్యాల కారణంగా కూడ రైళ్లు పడిపోయిన దుర్ఘటనలు జరిగాయి.గుజరాత్‌లోని గోద్రా స్టేషన్‌లో జిహాదీ బీభత్సకారులు రైలు పెట్టెలకు నిప్పు పెట్టి అనేకమందిని సజీవ దహనం చేసిన దుర్ఘటన, అలాంటి ఘటనలుకూడ పట్టాలతోను, వేగంతోను ముడివడిన ప్రమాదాలుకాదు! ఇలాంటివన్నీ రైల్వే సిబ్బంది ఊహించలేని విస్తృత నిఘా వైఫల్యానికి చెందిన ఘోరాలు! మధ్యప్రదేశ్‌లో మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదాలు సైతం ఇలా సిబ్బంది నిర్లక్ష్యంతో సంబంధంలేని, ఊహకు అతీతమైన ప్రమాదాలన్న ప్రచారం జరుగుతోంది! కనీవినీ ఎరుగని కుండపోత వర్షం ముంచెత్తుతుందని రైలు సిబ్బంది ఊహించలేదు మరి! కానీ వర్ష బీభత్సానికి పట్టాలు కొట్టుకుని పోవడం ఎవరి నిర్లక్ష్యం? అంత భయంకరమైన జల విలయం సంభవించినపుడు రైళ్ల ప్రయాణాన్ని తాత్కాలికంగా ఎందుకని రద్దు చేయలేదు?
జాతీయ రహదారుల విస్తరణ జరిగిన తరువాత అధునాతన హంగులు అమరిన తరువాత బస్సులు ఇతర రహదారి వాహనాల ప్రమాదాలు పెరిగిపోయాయి. ఓల్వో బస్సులు విదేశాలనుంచి వచ్చి పడిన తరువాత ప్రమాదాల సంఖ్య మరింతగా పెరిగింది. ప్రజల ప్రాణాలంటే లెక్కలేని ప్రభుత్వేతర సంస్థల మితిమీరిన వేగం భయంకర దృశ్యాలను ఆవిష్కరించింది. ప్రపంచీకరణ శక్తులకు అక్రమ లాభాలు ప్రధానం ప్రజల ప్రాణాలు కాదు…రైలు పట్టాలను రైలు ఇంజన్లను ఈ ప్రపంచీకరణ శక్తులకు అప్పగించాలన్న కుతూహలగ్రస్తులు ఈ నేపధ్యాన్ని గుర్తించవలసిన అనివార్యం ఏర్పడింది! రైళ్ల భద్రత విదేశీయ సంస్థల అక్రమ ఆకాంక్షలు పరస్పరం విరుద్ధాంశాలు. పోయిన ప్రాణాలు తిరిగి రావు…

ఆంద్ర భూమి

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
  8520805566
Land Line : 08676-232797

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -68

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -68

29 మానసిక విశ్లేషణ పిత -సిగ్మండ్ ఫ్రాయిడ్-2-(చివరి భాగం )

ఫ్రాయడ్ సాధించిన విజయాలను కొందరు తక్కువగా అంచనా వేసినప్పటికీ వియన్నా యూనివర్సిటీ పదవీ గౌరవం కల్పించ్నప్పటికీ ఫ్రాయడ్ రాసిన పుస్తకాలు వేలాదిమందినీ స్పెషలిస్టులను ఆకర్షించి ఉత్తేజం కలిగించాయి. నలఫై ఏళ్ల నడి వయస్సులో ఫ్రాయడ్ ఒక తుఫాన్ కేంద్రమయ్యాడు. ఆయన దగ్గర చదువుకోటానికి కార్ల్ జంగ్, ఆల్ఫ్రెడ్ ఆడ్లర్, ఆటో రాంక్, థియోడార్ రీగ్, ఎ. ఎ. బ్రిల్, ఎర్నెస్ట్ జోన్స్, విల్హే౦  స్టేకేన్, ఆన్నస్ స్టాచ్ మొదలగు ప్రసిద్ధులు వచ్చ్చారు. వీరిలో అందరూ ఎవరి స్థాయిలో వారు గొప్పవారే. ఇందులో చాలామంది ఆయనతో విభేదించి వాదానికి దిగినా ఆయనను తండ్రిగా, దేవునిగా భావించి ఆరాధించారు. ఫ్రాయడ్ సిద్ధాంతాలను మెరుగుపరచడానికి తోడ్పడ్డారు. ముఖ్యంగా జంగ్ ఫ్రాయడ్ చెప్పిన సెక్షవల్ సైకలాజికల్ ఇన్స్పి రేషన్ ను అంగీకరించలేదు. ఇతను సామూహిక అంతరంగాన్ని గురించి కొత్తగా చెప్పారు. ఇవి మనిషి ప్రాథమిక దశ లోని జ్ఞాపకాలు, వ్యక్తిత్వంలోని భాగాలు. ఎడ్లర్ సెన్స్ అఫ్ ఇనాడిక్వసీ  డెవలప్ మెంట్  ప్రమాదంగా భావించాడు. రాంక్ పుట్టుకలోని గాయాలపై దృష్టి పెట్టాడు. దీని వలన జరిగే షాక్ జీవితంలో తర్వాత ఆందోళనలు గా మారతాయని రక్షణ నుండి విడిపోతారని పోరాటానికి దూరమైపోతారని అన్నాడు. ఎవరు ఏరకంగా చెప్పినా ఫ్రాయడ్ మూల సిద్ధాంతాన్ని కాదనలేదు.

 

50 వ ఏట ఫ్రాయడ్ సంప్రదాయ అసూయగల టీచరు లాగా కన్పించేవాడు. బలహీనమైన శరీరం, చిన్న గడ్డం, తీక్షణమైన కళ్ళు ఇందులో ధ్యాన మగ్నత కన్పించేవి. అతని భార్య పిల్లలు ఇంటిని చక్కగా దిద్దుకునేవారు. పిల్లరు జ్యూస్ లాగా పెరిగారు. యాంటి  సేమిటిజం కాలంలో ఇలా పెంచటం కష్టంగా ఉండేది. దీనిపై స్పందిస్తూ ఫ్రాయడ్ ” life is a problem for everybody. Besides you can’t expect to be a Jew for nothing” అన్నాడు. అరవై పడిలో ఈ జ్యూయిష్ సైంటిస్ట్ శారీరక, మానసిక క్షోభను అనుభవించాడు. మొదటి ప్రపంచ యుద్ధం మానసికంగా ఎదురు దెబ్బ తగిలించింది . హేతువుపై పిచ్చితనం  విజయం సాధించి నాశనం చేసింది. దానితో పాటు స్వయంగా కూడా నష్టపోయాడు. ఇద్దరు కొడుకులు జర్మనీ తరపున యుద్ధం చేసారు. స్నేహితులు, శిష్యులు ఎవరి నమ్మకం ప్రకారం వాళ్ళు పోరాడారు. చలి, ఆకలి పరిస్థితులను మరింత కష్టతరం చేసి విషాద వేదాంతిగా మారి పోయాడు. మోసగించక, మోసగి౦పబడక జీవితానికి ఎదురీదాడు. అరవై ఏడావ ఏట మరింత లోతుగా అధ్యయనం చేసాడు. మొదటి ఆపరేషన్ దవడ ఎముక కాన్సర్ కు చేయించుకోవలసి వచ్చింది. ఆ తర్వాత అనేక ఆపరేషన్స్ జరిగాయి. మనిషి మానసిక స్థితిని గురించి  అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. సాంస్కృతిక పరాక్రమానికి అతని సృజనాత్మకతలపి దృష్టి సారించాడు. తన జీవిత ధ్యేయం “Making life long detour through the natural sciences medicines and psycho therapy” అని చెప్పాడు. 19 25 లో స్వీయ జీవిత చరిత్ర రాస్తూ తనను యవ్వనంలో ఆకర్షించిన  సాంస్కృతిక సమస్యలపై దృష్టి పెట్టాను అన్నాడు. ముసలి సైంటిస్ట్ యువ దార్శినికుడు కలిసి పోయారు.

 

కొంతకాలం తర్వాత ఆటో బయోగ్రఫీ రాస్తూ అజ్ఞాత మానసిక స్థితి (id), అహంపై అధ్యయనం చేస్తూ అస్వాధీనమైన శక్తులు యదార్థాన్ని సాధించడం అహం పెరిగి విపరీత అహం ఏర్పడి హింసాత్మక చర్యకు పాల్పడుతుందని చెప్పాడు. ఇక తాను సైకో అనాలసిస్ పై నిర్ణయాత్మక విదానాలేమీ చెప్పకర్లేదు అని చెప్పాడు. ఇప్పటిదాకా చెప్పినదానిపై అనవసరమైనది కూడా ఉండి ఉండవచ్చని దీనిపై ఎవరో ఒకరు కొత్త విషయాలు చేర్చవచ్చని అన్నాడు. ఇది కొంచెం తనను తాను తక్కువ చేసి చెప్పుకున్నట్లు ఉన్నప్పటికీ 71 వ ఏట ‘’The Future of an illusion ‘’ను రాసి ప్రచురించాడు. 74 వ ఏట ‘’సివిలైజేషన్ అండ్ ఇట్స్  డిస కన్టేన్త్స్(నాగరికత- అసంతృప్తి) పై విచారించాడు. తనకు తెలిసిన ప్రపంచం కూలిపోతో౦దదేమో అని భయపడ్డాడు. జంగ్ మొదలైన సైంటిస్టులు మానవతకు పూర్తీ వ్యతిరేకులయ్యారు. కానీ నిజానికి ఫ్రాయడ్ వియన్నాలో అతి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాడు. మొదటి సారిగా జనం మధ్య అనార్యులకు చెందిన పుస్తకాలను తగలపెడుతూ ఫ్రాయడ్ పుస్తకాలను 1933 లో అగ్నికి ఆహుతి చేసారు. దీనిపై “Atleast I have been burnt in good company. “అని స్పందించాడు. 77 వ ఏట ఆకస్మిక ఆపద మీదపడింది. అయినా తట్టుకుని ఉన్నాడు. 81 వ ఏళ్ళు వచ్చాక హిట్లర్ ఆస్త్రియాను ఆక్రమించాడు. జర్మన్ సామ్రాజ్యంలో కలిపాడు. ఫ్రాయడ్  పాస పోర్ట్ ను నాజీలు లాగేసుకున్నారు. డబ్బును దోచుకుని అతని ప్రచురణ సంస్థను నాశనం చేసారు. స్నేహితులు ఫ్రాయడ్ లండన్ పారిపోవటానికి సహకరించారు. 82 వ ఏట తన సైకో అనాలసిస్ పై రాస్తూ దాని ఉద్దేశ్యం “Naturally not compel belief or to establish conviction”అని వివరణ ఇచ్చాడు. 83 వ ఏట ప్రవాసంలోనూ బాధలు ఎక్కువయ్యాయి. క్రమం గా బలహీనుడై 83 వ పుట్టినరోజు జరిగిన నాలుగు నెలల తర్వాత హామ్ స్స్టెడ్ లోని సొంత ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. 23-9-19 39న మానసిక విశ్లేషణ పితామహుడు మరణించాడు.

 

ఫ్రాయడ్ మరణం తర్వాత అతని సిద్దాంతాలు ప్రతి మానవ ఆలోచనను ప్రభావితం చేశాయని భావించారు. ఫ్రాయడ్ తర్వాత  మానవాళిని ప్రభావితం చేసిన ఇద్దరు మహా వ్యక్తులు  కార్ల్ మార్క్స్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ మాత్రమే అని చెప్పవచ్చును. వీరు ముగ్గురు తమ జీవితకాలంలోనే మరియు తర్వాత ప్రభావం చూపగలిగారు. 1950 నాటికి ఫ్రాయడ్ సైకో అనాలసిస్ మీద నాలుగు వేల ఏడూ వందల ముప్పై తొమ్మిది రచనలు చేసినట్లుగా గుర్తించారు. 1950 కి ఈ సంఖ్య రెట్టింపైంది. ఇంగ్లాండ్ అమెరికా మొదలగు దేశాలలో సైకో అనలటికల్ జర్నల్స్ వచ్చాయి. మానవ ప్రయత్నంపై అనేక రంగాలలో ఫ్రాయడ్ ప్రభావం ఉందని కను గోన్నారు న. మొదట వ్యతిరేకించినా అందరూ అంగీకరించారు. ఫ్రాయడ్ రాసిన ‘’Totem and Taboo’’ గ్రంథం కొత్త సైకో అనలటికల్ ఆన్త్రోపాలజీలో ఏర్పరచింది. అతని ‘’Civilisation and discontent”లో మనిషి నైతిక శిక్షణకు లోపలి అనైతికతకు మధ్య పోరాటాన్ని తెలియచేసింది. ఆయన రాసిన ‘’The future of an illusion ‘’మరియు ‘’Moses and Monothisms  లు “Opened one of the most passionate and revealing and instructive debates on the problem of religious faith “ అని విశ్లేషించారు. మనిషిని అతని ప్రేరణను వేరుచేసి శక్తివంతుడిని చేసి అతని బాధ్యతలను పరిపూర్ణంగా గుర్తించప జేసి  పనిచేయించటమే ఫ్రాయిడ్  చేసిన ఆలోచన. ఈ విషయాలపై అనేక నాటకాలు, గ్రంథాలు వచ్చాయి. ఫ్రాయడ్ ప్రభావం జేమ్స్ జాయిస్ పై పడి అతని’’ స్త్రీం అఫ్ కాన్షస్ నెస్’’ (చైతన్య స్రవంతి)కు కారణమైంది. అలాగే డి .హెచ్ .లారెన్స్  పై కూడా ప్రభావం చూపింది. ప్రముఖ నాటక కర్త యూజీన్ ఓ నీల్ పై ప్రభావం కల్గించి అతని “ఇంటీరియర్ మోనోలోగ్” నాటకాల సృష్టికి కారణమయ్యాడు. థామస్ మాన్ కూడా ‘’పవర్ ఆఫ్  అన్  కాన్షస్ ‘’ పై అనేక రచనలు చేసాడు. సైకాలజీని అవాస్తవికతను కవిత్వాన్ని, విశ్లేషణను కలిపి రాసానని మాన్ చెప్పాడు. “We shall one day recognize in Freud’s life work the corner stone for the building of new anthropology.” అని ఘంటాపధంగా చెప్పాడు మాన్. స్వేచ్చ గల అంతరాత్మతో మానవాళి  జీవించాలని ఫ్రాయడ్ ఉద్దేశ్యం. ఆధునిక శాస్త్ర జ్ఞానం మనిషి తనపై ఉన్న విశ్వసాన్ని పెంచింది. డార్విన్ సిద్ధాంతానికి ఫ్రాయడ్ సిద్ధాంతం అదనపు ఆకర్షణ అయ్యింది. “It was Freud who replaced Locke’s essentially blank aesthetically and emotionally empty soul and Darwin’s merely biological behavioristic man with an emotional being a being of whom passion is the essence. This is the kind of scientifically conceived person with whom the arts and their emotional and vivid esthetic material can best function”.

 

ఇంత గొప్ప పని చేసినా ఫ్రాయడ్ పై పొగడ్తల కంటే తెగడ్తలే ఎక్కువ. అతని సైకో అనాలసిస్ ను  కమ్యూనిస్ట్ లు  బూర్జువా తత్వంగా భావించి రష్యాలో అనుమతించలేదు. కాథలిక్ చర్చ్ విషపు బోధనలగా భావించి ఫ్రాయడ్ సిద్ధాంతం నమ్మిన వారు పాపాల పాలౌతారని హెచ్చరించింది. మానసిక శాస్త్రవేత్తలు ఏకమై ఆయన పూర్వ శిష్యులతో కలిసి ఫ్రాయడ్ నిర్ణయాలపై దాడి చేసారు. “The case against psycho analysis”అనే పుస్తకంలో అండ్రూ  సాల్టర్ర్ ‘’ఫ్రాయడ్ మానసిక పాఠం తప్పుల తడక అని చిత్రమైనదని అవి కొల౦బస్ ముందున్న న్యూ వరల్డ్ మేపుల వంటివి ‘’ అన్నాడు. ఫ్రాయడ్ స్థితిని హాస్యాస్పదమైనదని పూర్తీ అశాస్త్రీయమైనదని అవివేకమైనదని అన్నాడు. ఎమిల్ లుడ్విగ్ తీవ్రంగా స్పందిస్తూ “Humanity has been robbed of all decency by the sexual pre-occupations of a man who ‘groping in unknown regions has set himself as dictator’”అని ఘాటైన విమర్శలు చేసాడు. ఇవన్నీ ఫ్రాయడ్ ముందు ఊహించినవే. ఆయనది శాస్త్రీయ దార్శనికత ప్రయోగం పరీక్ష పునరాలోచన. ఫ్రాయడ్ “  The trouble with psycho analysis is the psycho analyst” అని ముందే ఊహించి చెప్పాడు. ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు, ఆక్షేపణలు ఉన్నా ఫ్రాయడ్ సిద్ధాంతం అనేక రంగాలలో పరిశోధనలను చేయించింది. మేదోచర్యలను ప్రేరేపించింది . విజ్ఞానాన్ని బంధించకుండా స్వేచ్చగా ఎదగాలని భావి౦చినవాడు ఫ్రాయడ్. అతని కృషి అనితర సాధ్యమైనది. ‘’Freud’s contribution the extension of the imaginative recognition of a human being of himself and his sympathetic understanding of the another”అని రచయిత లూయి అంటర్ మేయర్ అంటాడు.

 

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -68

29 మానసిక విశ్లేషణ పిత -సిగ్మండ్ ఫ్రాయిడ్-2-(చివరి భాగం )

ఫ్రాయడ్ సాధించిన విజయాలను కొందరు తక్కువగా అంచనా వేసినప్పటికీ వియన్నా యూనివర్సిటీ పదవీ గౌరవం కల్పించ్నప్పటికీ ఫ్రాయడ్ రాసిన పుస్తకాలు వేలాదిమందినీ స్పెషలిస్టులను ఆకర్షించి ఉత్తేజం కలిగించాయి. నలఫై ఏళ్ల నడి వయస్సులో ఫ్రాయడ్ ఒక తుఫాన్ కేంద్రమయ్యాడు. ఆయన దగ్గర చదువుకోటానికి కార్ల్ జంగ్, ఆల్ఫ్రెడ్ ఆడ్లర్, ఆటో రాంక్, థియోడార్ రీగ్, ఎ. ఎ. బ్రిల్, ఎర్నెస్ట్ జోన్స్, విల్హే౦  స్టేకేన్, ఆన్నస్ స్టాచ్ మొదలగు ప్రసిద్ధులు వచ్చ్చారు. వీరిలో అందరూ ఎవరి స్థాయిలో వారు గొప్పవారే. ఇందులో చాలామంది ఆయనతో విభేదించి వాదానికి దిగినా ఆయనను తండ్రిగా, దేవునిగా భావించి ఆరాధించారు. ఫ్రాయడ్ సిద్ధాంతాలను మెరుగుపరచడానికి తోడ్పడ్డారు. ముఖ్యంగా జంగ్ ఫ్రాయడ్ చెప్పిన సెక్షవల్ సైకలాజికల్ ఇన్స్పి రేషన్ ను అంగీకరించలేదు. ఇతను సామూహిక అంతరంగాన్ని గురించి కొత్తగా చెప్పారు. ఇవి మనిషి ప్రాథమిక దశ లోని జ్ఞాపకాలు, వ్యక్తిత్వంలోని భాగాలు. ఎడ్లర్ సెన్స్ అఫ్ ఇనాడిక్వసీ  డెవలప్ మెంట్  ప్రమాదంగా భావించాడు. రాంక్ పుట్టుకలోని గాయాలపై దృష్టి పెట్టాడు. దీని వలన జరిగే షాక్ జీవితంలో తర్వాత ఆందోళనలు గా మారతాయని రక్షణ నుండి విడిపోతారని పోరాటానికి దూరమైపోతారని అన్నాడు. ఎవరు ఏరకంగా చెప్పినా ఫ్రాయడ్ మూల సిద్ధాంతాన్ని కాదనలేదు.

 

50 వ ఏట ఫ్రాయడ్ సంప్రదాయ అసూయగల టీచరు లాగా కన్పించేవాడు. బలహీనమైన శరీరం, చిన్న గడ్డం, తీక్షణమైన కళ్ళు ఇందులో ధ్యాన మగ్నత కన్పించేవి. అతని భార్య పిల్లలు ఇంటిని చక్కగా దిద్దుకునేవారు. పిల్లరు జ్యూస్ లాగా పెరిగారు. యాంటి  సేమిటిజం కాలంలో ఇలా పెంచటం కష్టంగా ఉండేది. దీనిపై స్పందిస్తూ ఫ్రాయడ్ ” life is a problem for everybody. Besides you can’t expect to be a Jew for nothing” అన్నాడు. అరవై పడిలో ఈ జ్యూయిష్ సైంటిస్ట్ శారీరక, మానసిక క్షోభను అనుభవించాడు. మొదటి ప్రపంచ యుద్ధం మానసికంగా ఎదురు దెబ్బ తగిలించింది . హేతువుపై పిచ్చితనం  విజయం సాధించి నాశనం చేసింది. దానితో పాటు స్వయంగా కూడా నష్టపోయాడు. ఇద్దరు కొడుకులు జర్మనీ తరపున యుద్ధం చేసారు. స్నేహితులు, శిష్యులు ఎవరి నమ్మకం ప్రకారం వాళ్ళు పోరాడారు. చలి, ఆకలి పరిస్థితులను మరింత కష్టతరం చేసి విషాద వేదాంతిగా మారి పోయాడు. మోసగించక, మోసగి౦పబడక జీవితానికి ఎదురీదాడు. అరవై ఏడావ ఏట మరింత లోతుగా అధ్యయనం చేసాడు. మొదటి ఆపరేషన్ దవడ ఎముక కాన్సర్ కు చేయించుకోవలసి వచ్చింది. ఆ తర్వాత అనేక ఆపరేషన్స్ జరిగాయి. మనిషి మానసిక స్థితిని గురించి  అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. సాంస్కృతిక పరాక్రమానికి అతని సృజనాత్మకతలపి దృష్టి సారించాడు. తన జీవిత ధ్యేయం “Making life long detour through the natural sciences medicines and psycho therapy” అని చెప్పాడు. 19 25 లో స్వీయ జీవిత చరిత్ర రాస్తూ తనను యవ్వనంలో ఆకర్షించిన  సాంస్కృతిక సమస్యలపై దృష్టి పెట్టాను అన్నాడు. ముసలి సైంటిస్ట్ యువ దార్శినికుడు కలిసి పోయారు.

 

కొంతకాలం తర్వాత ఆటో బయోగ్రఫీ రాస్తూ అజ్ఞాత మానసిక స్థితి (id), అహంపై అధ్యయనం చేస్తూ అస్వాధీనమైన శక్తులు యదార్థాన్ని సాధించడం అహం పెరిగి విపరీత అహం ఏర్పడి హింసాత్మక చర్యకు పాల్పడుతుందని చెప్పాడు. ఇక తాను సైకో అనాలసిస్ పై నిర్ణయాత్మక విదానాలేమీ చెప్పకర్లేదు అని చెప్పాడు. ఇప్పటిదాకా చెప్పినదానిపై అనవసరమైనది కూడా ఉండి ఉండవచ్చని దీనిపై ఎవరో ఒకరు కొత్త విషయాలు చేర్చవచ్చని అన్నాడు. ఇది కొంచెం తనను తాను తక్కువ చేసి చెప్పుకున్నట్లు ఉన్నప్పటికీ 71 వ ఏట ‘’The Future of an illusion ‘’ను రాసి ప్రచురించాడు. 74 వ ఏట ‘’సివిలైజేషన్ అండ్ ఇట్స్  డిస కన్టేన్త్స్(నాగరికత- అసంతృప్తి) పై విచారించాడు. తనకు తెలిసిన ప్రపంచం కూలిపోతో౦దదేమో అని భయపడ్డాడు. జంగ్ మొదలైన సైంటిస్టులు మానవతకు పూర్తీ వ్యతిరేకులయ్యారు. కానీ నిజానికి ఫ్రాయడ్ వియన్నాలో అతి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాడు. మొదటి సారిగా జనం మధ్య అనార్యులకు చెందిన పుస్తకాలను తగలపెడుతూ ఫ్రాయడ్ పుస్తకాలను 1933 లో అగ్నికి ఆహుతి చేసారు. దీనిపై “Atleast I have been burnt in good company. “అని స్పందించాడు. 77 వ ఏట ఆకస్మిక ఆపద మీదపడింది. అయినా తట్టుకుని ఉన్నాడు. 81 వ ఏళ్ళు వచ్చాక హిట్లర్ ఆస్త్రియాను ఆక్రమించాడు. జర్మన్ సామ్రాజ్యంలో కలిపాడు. ఫ్రాయడ్  పాస పోర్ట్ ను నాజీలు లాగేసుకున్నారు. డబ్బును దోచుకుని అతని ప్రచురణ సంస్థను నాశనం చేసారు. స్నేహితులు ఫ్రాయడ్ లండన్ పారిపోవటానికి సహకరించారు. 82 వ ఏట తన సైకో అనాలసిస్ పై రాస్తూ దాని ఉద్దేశ్యం “Naturally not compel belief or to establish conviction”అని వివరణ ఇచ్చాడు. 83 వ ఏట ప్రవాసంలోనూ బాధలు ఎక్కువయ్యాయి. క్రమం గా బలహీనుడై 83 వ పుట్టినరోజు జరిగిన నాలుగు నెలల తర్వాత హామ్ స్స్టెడ్ లోని సొంత ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. 23-9-19 39న మానసిక విశ్లేషణ పితామహుడు మరణించాడు.

 

ఫ్రాయడ్ మరణం తర్వాత అతని సిద్దాంతాలు ప్రతి మానవ ఆలోచనను ప్రభావితం చేశాయని భావించారు. ఫ్రాయడ్ తర్వాత  మానవాళిని ప్రభావితం చేసిన ఇద్దరు మహా వ్యక్తులు  కార్ల్ మార్క్స్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ మాత్రమే అని చెప్పవచ్చును. వీరు ముగ్గురు తమ జీవితకాలంలోనే మరియు తర్వాత ప్రభావం చూపగలిగారు. 1950 నాటికి ఫ్రాయడ్ సైకో అనాలసిస్ మీద నాలుగు వేల ఏడూ వందల ముప్పై తొమ్మిది రచనలు చేసినట్లుగా గుర్తించారు. 1950 కి ఈ సంఖ్య రెట్టింపైంది. ఇంగ్లాండ్ అమెరికా మొదలగు దేశాలలో సైకో అనలటికల్ జర్నల్స్ వచ్చాయి. మానవ ప్రయత్నంపై అనేక రంగాలలో ఫ్రాయడ్ ప్రభావం ఉందని కను గోన్నారు న. మొదట వ్యతిరేకించినా అందరూ అంగీకరించారు. ఫ్రాయడ్ రాసిన ‘’Totem and Taboo’’ గ్రంథం కొత్త సైకో అనలటికల్ ఆన్త్రోపాలజీలో ఏర్పరచింది. అతని ‘’Civilisation and discontent”లో మనిషి నైతిక శిక్షణకు లోపలి అనైతికతకు మధ్య పోరాటాన్ని తెలియచేసింది. ఆయన రాసిన ‘’The future of an illusion ‘’మరియు ‘’Moses and Monothisms  లు “Opened one of the most passionate and revealing and instructive debates on the problem of religious faith “ అని విశ్లేషించారు. మనిషిని అతని ప్రేరణను వేరుచేసి శక్తివంతుడిని చేసి అతని బాధ్యతలను పరిపూర్ణంగా గుర్తించప జేసి  పనిచేయించటమే ఫ్రాయిడ్  చేసిన ఆలోచన. ఈ విషయాలపై అనేక నాటకాలు, గ్రంథాలు వచ్చాయి. ఫ్రాయడ్ ప్రభావం జేమ్స్ జాయిస్ పై పడి అతని’’ స్త్రీం అఫ్ కాన్షస్ నెస్’’ (చైతన్య స్రవంతి)కు కారణమైంది. అలాగే డి .హెచ్ .లారెన్స్  పై కూడా ప్రభావం చూపింది. ప్రముఖ నాటక కర్త యూజీన్ ఓ నీల్ పై ప్రభావం కల్గించి అతని “ఇంటీరియర్ మోనోలోగ్” నాటకాల సృష్టికి కారణమయ్యాడు. థామస్ మాన్ కూడా ‘’పవర్ ఆఫ్  అన్  కాన్షస్ ‘’ పై అనేక రచనలు చేసాడు. సైకాలజీని అవాస్తవికతను కవిత్వాన్ని, విశ్లేషణను కలిపి రాసానని మాన్ చెప్పాడు. “We shall one day recognize in Freud’s life work the corner stone for the building of new anthropology.” అని ఘంటాపధంగా చెప్పాడు మాన్. స్వేచ్చ గల అంతరాత్మతో మానవాళి  జీవించాలని ఫ్రాయడ్ ఉద్దేశ్యం. ఆధునిక శాస్త్ర జ్ఞానం మనిషి తనపై ఉన్న విశ్వసాన్ని పెంచింది. డార్విన్ సిద్ధాంతానికి ఫ్రాయడ్ సిద్ధాంతం అదనపు ఆకర్షణ అయ్యింది. “It was Freud who replaced Locke’s essentially blank aesthetically and emotionally empty soul and Darwin’s merely biological behavioristic man with an emotional being a being of whom passion is the essence. This is the kind of scientifically conceived person with whom the arts and their emotional and vivid esthetic material can best function”.

 

ఇంత గొప్ప పని చేసినా ఫ్రాయడ్ పై పొగడ్తల కంటే తెగడ్తలే ఎక్కువ. అతని సైకో అనాలసిస్ ను  కమ్యూనిస్ట్ లు  బూర్జువా తత్వంగా భావించి రష్యాలో అనుమతించలేదు. కాథలిక్ చర్చ్ విషపు బోధనలగా భావించి ఫ్రాయడ్ సిద్ధాంతం నమ్మిన వారు పాపాల పాలౌతారని హెచ్చరించింది. మానసిక శాస్త్రవేత్తలు ఏకమై ఆయన పూర్వ శిష్యులతో కలిసి ఫ్రాయడ్ నిర్ణయాలపై దాడి చేసారు. “The case against psycho analysis”అనే పుస్తకంలో అండ్రూ  సాల్టర్ర్ ‘’ఫ్రాయడ్ మానసిక పాఠం తప్పుల తడక అని చిత్రమైనదని అవి కొల౦బస్ ముందున్న న్యూ వరల్డ్ మేపుల వంటివి ‘’ అన్నాడు. ఫ్రాయడ్ స్థితిని హాస్యాస్పదమైనదని పూర్తీ అశాస్త్రీయమైనదని అవివేకమైనదని అన్నాడు. ఎమిల్ లుడ్విగ్ తీవ్రంగా స్పందిస్తూ “Humanity has been robbed of all decency by the sexual pre-occupations of a man who ‘groping in unknown regions has set himself as dictator’”అని ఘాటైన విమర్శలు చేసాడు. ఇవన్నీ ఫ్రాయడ్ ముందు ఊహించినవే. ఆయనది శాస్త్రీయ దార్శనికత ప్రయోగం పరీక్ష పునరాలోచన. ఫ్రాయడ్ “  The trouble with psycho analysis is the psycho analyst” అని ముందే ఊహించి చెప్పాడు. ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు, ఆక్షేపణలు ఉన్నా ఫ్రాయడ్ సిద్ధాంతం అనేక రంగాలలో పరిశోధనలను చేయించింది. మేదోచర్యలను ప్రేరేపించింది . విజ్ఞానాన్ని బంధించకుండా స్వేచ్చగా ఎదగాలని భావి౦చినవాడు ఫ్రాయడ్. అతని కృషి అనితర సాధ్యమైనది. ‘’Freud’s contribution the extension of the imaginative recognition of a human being of himself and his sympathetic understanding of the another”అని రచయిత లూయి అంటర్ మేయర్ అంటాడు.

Inline image 1   Inline image 2Inline image 3Inline image 4Inline image 5

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-8-15-ఉయ్యూరు

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-8-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శంకరాభరణానికి చాగంటి ప్రవచన గౌరవమ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వేటూరి ఆనంద మూర్తిగారు

వేటూరి ప్రభాకర శాస్త్రి గారి శాసన పరిశోధన

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -67

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -67

29 మానసిక విశ్లేషణ పిత -సిగ్మండ్ ఫ్రాయిడ్-1

వియన్నా దేశపు సిగ్మండ్ ఫ్రాయిడ్ మనిషి భావోద్రేకాలకు ప్రతిదిన పరిసరాలకు సంబంధముందని పరిశోధనాత్మకంగా రుజువు చేసాడు. దీనితో సృజనాత్మకమైన ప్రతి రంగంపై ప్రభావం చూపాడు. ఒక తరాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తీ ఫ్రాయడ్. కొందరు శిష్యులు, కొందరు వ్యతిరేకులు ఉన్నా మానవత్వపు అంచనాలను సాహిత్యపు విలువలను భాషా వైశాల్యాన్ని విపరీతంగా విస్తరి౦పచేసాడు. నరాల జబ్బుపై పరిశోధన చేసినా అతని అధ్యయనం సాధారణ పనివారిపై, వ్యాపార రంగం వారిపై విశేషంగా ఉండేది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ (న్యూనతా భావం), ఇన్హిబిషన్ మొదలైన శబ్దాల సృష్టికర్త అయినాడు. అంతకు ముందు ఎవరూ వినని’’ సైకాలజీ అఫ్ ఎవరీ డే లైఫ్’’ ఆవిష్కర్త. మాల్ అడ్జస్ట్ మెంట్ , రిప్రేషన్, ఫిక్సేషన్, ట్రాన్స్ఫెరేన్స్, డిఫెన్స్ మెకానిజం, ఓవర్ కాన్ఫి డేన్స్ ,, సప్ప్రేస్ద్ డిజైర్, లిబిడో అనే కొత్త పదాలను ఆవిష్కరించాడు. దీనితో వైద్య పరిభాష మారిపోయింది.

సైకో అనాలసిస్ పిత అని పిలవబడే సిగ్మండ్ ఫ్రాయడ్ 6-5-1856 పూర్వపు ఆస్ట్రియా ప్రస్తుత జెకోస్లోవేకియా మొరావియా లోని ఫ్రీబెర్గ్ లో జన్మించాడు. తండ్రి జూయిష్  వర్తకుడు. ఫ్రాయడ్ 4 ఏళ్ల వయసులో కుటుంబం వియన్నకు చేరింది. తండ్రి రెండవ భార్యకు జన్మించిన 8 సంతానంలో ఫ్రాయడ్ పెద్దవాడు. అతన్ని చూసి అందరూ గర్వపడేవారు. కేమిస్ట్రీ, బాటనీలో అసాధారణ నైపుణ్యం చూపేవాడు. డార్విన్ అనువంశిక సిద్దాంతానికి ఆకర్షితుడయ్యాడు. దీనితో ప్రతి విషయాన్ని సూక్ష్మగా విచారించే అలవాటు పెరిగింది. కానీ జర్మన్ ఫిలాసఫర్ మహా రచయిత గోతే “నేచర్” పై రాసిన వ్యాసం చదివి ప్రభావితుడయ్యాడు. దాని వలన మానవ విజ్ఞానం సాధించడానికి కృత నిశ్చయడయ్యాడు. ఇంగ్లీష్ భాష నేర్చి ఆసాహిత్యపు ఆనందాన్ని అనుభవించాడు. పదేళ్ళు ఇంగ్లీషు సాహిత్యానికే అంకితమయ్యాడు. షేక్స్పియర్ సాహిత్య శాస్త్రాన్ని మిల్టన్ ప్యూరిటన్ శక్తిని ఆసాంతం అర్థం చేసుకోగలిగాడు.

17 ఏళ్ల వయసులో మెడికల్ స్కూల్లో చేరి యాంటీ సేమిటిజం మీద వ్యతిరేకత పొందాడు. తన జాతిపై  ఎందుకు అవమానమొ అర్హ్హం కాలేదు. “సెల్ఫ్ పోర్త్రయిట్” అనే దానిలో తన ఆలోచన ఫలితాలను పొందుపరచాడు. తన గమ్యమ్  ఏమిటో తెలుసుకున్నాడు. మెజారిటీ జనం ముందు మైనారిటీ వాళ్ళు ఓడిపోరాదు అని అనుకున్నాడు. కనుక స్వతంత్ర నిర్ణాయక శక్తి, తీర్పు అవసరమని భావించాడు. యూనివర్సిటీలో చేరి నాడీ  వ్యవస్థ శాస్త్రమ్ పై పరిశోధనలు చేసాడు. 20 వ ఏట నుండి 29వ యేట వరకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెరిబ్రల్ అనాటమీ లో పనిచేసాడు. తాను ఒక సాధారణ వైద్యునిగా ఉండాలని అనిపించలేదు. కానీ వియన్నా లోని ప్రసిద్ధ అల్జిమిఏన్ క్రాన్కే హాస్ (జనరల్ హాస్పటల్) క్లినికల్ న్యూరాలజైస్ట్ గా పనిచేసాడు. అప్పటికే రోగుల నిజమైన తత్వానికి,ఊహలకు(ఫాంటసీ ) వ్యత్యాసం గమనించాడు. రోగుల రోగలక్షణాలను గమనించాడు. అతని సహచరులు ఫ్రాయడ్ చేసిన నాడీ వ్యవస్థ వలన కలిగే జబ్బుల గురించి విని సంతోషించారు. రోగి మెదడు లోకి లోతుగా చొచ్చుకుని పోయే విధానం గురించి ఆలోచించాడు. 29 వ ఏట ఒక పరిష్కారం లభించింది. ఒక వియన్నా డాక్టరు హిస్టీరియా రోగులకు హిప్నటైజ్ చేసి నయం చేసానని ప్రకటించాడు. మానసిక అసమతుల్యాలను బయటపెత్త టానికి ఇది ఒక మార్గం అనిపించింది. పారిస్ వెళ్లి జీన్ మెరీ చార్కాట్ దగ్గర చదివాడు. అప్పటికే ఆయన న్యూరలాజికల్ క్లినిక్ లను ఏర్పాటు చేసి హిప్నాటిజం రోగాలను కుదిర్చి ప్రపంచ ప్రసిద్ధి పొందాడు. ఫ్రాయడ్ ఈయన దగ్గర ఒక ఏడాది విద్యార్థిగా, అనువాదకునిగా ఉన్నాడు.

30వ ఏట వియన్నా చేరి మార్తా బెర్న్స్ ను పెళ్ళాడి ప్రైవేట్ ప్రాక్టీస్ ను మొదలుపెట్టాడు ఫ్రాయడ్. మొదట్లో గురువు చార్కాట్ బోధించినట్లే ప్రాక్టీస్ చేసాడు. చాలా తీవ్రంగా ఆ పద్ధతిలో రోగ నిదానం చేసాడు. అతన్ని సమతుల్యత లేని వెర్రివాడిగా బీరాలు పలికే వాడిగా ముద్ర వేసారు. ఎంత జాగ్రత్తగా వైద్యం చేస్తున్నా తన పరిశోధనలను ఎప్పటికప్పుడు సమీక్షుస్తున్నా ఈ మాటలు జీవితాంతం వెంటాడాయి.  అది ఫిజికల్ థెరపీ కాలం అని ఆనాటి డాక్టర్లకు రోగి మానసిక విషయాలు పట్టేవికావని ఫార్ములా ప్రకారమే ప్రతిదానిని నిర్ణ యించే వారని రోగ లక్షణాలను సజీవ సిద్ధాంతంగా భావించేవారని కాని రోగి మానసిక ఆందోళనలు ఎవరికీ పట్టేవి కావని చికిత్స లోపభూయిష్టమైన అవగాహనతో మందులతో హైడ్రో దెరపీతో ఎలక్ట్రో తదెరపీతో మాత్రమే ఆనాటి డాక్టర్లు చేసేవారని ఫ్రాయడ్ జీవిత చరిత్ర “ది బేసిక్ రైటింగ్స్ అఫ్ సిగ్మండ్ ఫ్రాయడ్” రాసిన డాక్టర్  ఎ .ఎ .బ్రిల్ రాసాడు.  సంప్రదాయ చికిత్సా విధానం నుంచి వైద్య విధానాన్ని  మార్చాలని ఫ్రాయడ్ అభిప్రాయం. హిప్నోటి క్ థెరపీ పై ప్రయోగాలు చేసాడు. స్మృతి లోపం (ఆమ్నేసియ), మూగతనం- (అఫెసియ) లపై పనిచేస్తున్నా హిప్నాటిజం తో, సలహాలతోనే నయం చేయవచ్చని భావించాడు. ఈ కొత్త కష్టతరమైన విధానంలో పని చేస్తూ రోగి గత జీవితాన్ని గుర్తు చేసుకునే పద్ధతిని ప్రవేశపెట్టాడు. రోగి మనసులో దాగి ఉన్న జ్ఞాపకాలను బయట పడేట్టు చేసేవాడు. ఈ విధానానికి మానసిక విశ్లేషణ (సైకో అనాలసిస్ ) అని పేరు పెట్టాడు. దీనిని నమ్మని ఇతర డాక్టర్లు, మనుషులు ఫ్రాయడ్ ను క్రూర హింసా వాదిగా భావించారు. దీని వల్ల బాగుపడ్డ వారు ఫ్రాయడ్ ఒక కొత్త శాస్త్రీయ విధానాన్ని ఆవిష్కరించాడని సంబరపడ్డారు.

 

ఫ్రాయడ్ చేసిన సైకో అనాలసిస్ లో హిస్టీరియా మొదలైన రోగాలకు మూల కారణాలు రోగి మరచిపోయిన, లేక అణచుకున్న సంతోష రహిత విషయాలే కారణమని అన్నాడు. తనను బాధించిన ఈ విషయాలు రోగి మరచి పోయుంటాడు . అందుకని ఫ్రాయడ్ సమాధి చేయబడిన ఆకారణాలను అతని అపస్మారక స్థితిలోంచి బయట పడేట్లు చేసేవాడు. ఈ అణచివేత రోగికి చాలా నష్టం కలిగించేది. ఇది సాధారణ మానసిక ప్రతిచర్యను అడ్డగించేది లేక నిషేధించేది. దీనితో భౌతికమైన రోగం వస్తుందని భావించాడు. ఈ అణచివేత అసలు బాధను గుర్తించేది అవుతుంది. దీనిని విడుదల చేస్తే రోగం నయమవుతుంది అనేది ఫ్రాయడ్ సైకో అనాలసిస్ సిద్ధాంతం.

 

ఎక్కువ భాగం భౌతిక ఆందోళనలు వ్యక్తీ కల్పితాలే. ఫ్రాయడ్ తన కాలాన్ని మైండును ఒక ఆర్గానిక్ సిస్టం గా భావించి దాని ద్వారా శరీరానికి వైద్యం చేసేవాడు. ఇందులో అనేక కష్టాలను ఎదుర్కోవలసి వచ్చేది. రోగి సహకరించేవాడు కాదు. బాధాతప్త గత జీవితాన్ని గుర్తుచేసుకోవటం ఇష్టం ఉండేది కాదు. సాధ్యమైనంత వరకు దీని నుండి తప్పించుకుపోవటానికి, పారిపోవటానికి ప్రయత్నం చేసేవాడు. అందుకని ఫ్రాయడ్ రోగికి నేస్తంగా సన్నిహితునిగా మెలుగుతూ విషయాన్ని రాబట్టేవాడు. అణచబడిన అంతరాత్మకు బహిర్గతం కాని అంతరాత్మకు తీవ్ర సంఘర్షణ జరిగేది. అంటే ఇచ్చ లేదా సంకల్పానికి సహజ జ్ఞానానికి (విల్/ఇన్స్టింక్ట్ ) మధ్య సంఘర్షణ అన్నమాట. ఈ సంఘర్షణ నుండి రోగిని ఫ్రాయడ్ తన విశ్లేషణ ద్వారా బయటపదేటట్లు చేసేవాడు. రోగి కలలను చిహ్నాలుగా  వికారాలను తీరని కోరికలను తీరాలనే కోరికలను ఫ్రాయడ్ బయటపెట్టేవాడు. కలలకు అర్థాలను వెతికి చెప్పేవాడు. వాటిలో రోగి దాచుకున్న ఆందోళనలను  వెతికి వెలికి తీసేవాడు. దీనిపై ఫ్రాయడ్ “A dream frequently has the profoundest meaning in the very places where it seems most absurd. Dreams behave in real life like the prince who in the play pretends to be a mad man. Hence we may say of dreams what Hamlet said of himself- substituting an unintelligible jest for the actual truth.’’ I am but mad North North West when the wind is southerly. I know a hawk from a handsaw”.పదేళ్ళు దీనిపై ఒంటరిగా శ్రమించి ఫ్రాయడ్ ‘’ఇంటర్ ప్రిటేషన్స్ అఫ్ డ్రీమ్స్’’ అనే కలలపై  తొలి గ్రంథాన్ని రాసాడు. ఇది మానసిక శాస్త్రంపై వచ్చిన తోలి  అపూర్వ అద్భుత గ్రంథంగా పేర్కొంటారు.     దీనిపై ఫ్రాంజ్ అలక్జాండర్ సమీక్ష చేస్తూ ఈ గ్రంథ ప్రచురణ మానవ విజ్ఞాన అభ్యుదయంలో ఒక మైలు రాయి అన్నాడు. ప్రతి వ్యక్తీ కలలు  కంటాడు. వాటికి అర్దాలుంటాయి . వాటిని గుర్తించి వైద్యంలో చేరిస్తే రోగి సుఖపడతాడు.

 

ఫ్రాయడ్ కొత్తగా పొడిచేసి కొత్త సిద్ధాంతం కనిపెట్టలేడని అన్నవారు కూడా అతని విధానాన్ని  మెచ్చకుండా ఉండలేకపోయారు.   మానసిక ఉద్రేకం వలన కలిగిన గాయం ఎదో ఒక వ్యాధికి కారణభూతం అవుతుంది. దానికి సెక్స్ కూడా కారణం కావచ్చు. చిన్నతనంలో సెక్స్ వలన కూడా కొన్ని రోగాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. దీనిపై ఎమిల్ లుడ్విగ్ తీవ్రంగా విమర్శిస్తూ “Freud’s opium endangers our generation”అన్నారు. ప్రతిబాలుడికి చిన్నతనంలో తల్లితో అనుబంధం ఎక్కువగా ఉంటుందనీ తండ్రికి దూరంగా ఉంటాడని దీనినే’’ ఈడిపస్ కాంప్లెక్స్’’ అంటారని, ప్రతి బాలికకు తండ్రిని ఆరాధించే ‘’ఎలక్ట్రా కాంప్లెక్స్ ‘’ఉంటుందని ఫ్రాయడ్ చెప్పాడు. ఇవి యవ్వన దశలో వారికి ఇబ్బందికరంగా మారతాయి. కనుక యవ్వన దశలో నిరుత్సాహం ఆవహించి కలల లో లేక భయంకర భ్రమల్లో పడిప్తారు. భయం పెరిగిపోయి సామాన్య బాధ్యతలనుండి తప్పుకోడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి అసాధారణ విషయలపైనే కాకుండా సెక్స్ కోరికపైన కూడ పైన  పరిశోధించాడు. దానికి ఉన్న ప్రాముఖ్యతను, సంపూర్ణ మానవ వ్యక్తిత్వానికి ,సెక్స్ కూ  గల సంబంధంపై అధ్యయనం చేసాడు.  “Three contributions to the theory” అనే ఫ్రాయిడ్ ఆంగ్ల అనువాద గ్రంథానికి ముందుమాట రాస్తూ జేమ్స్ పుట్నం “మానవ జీవితం లోని ప్రతి దశను లోతుగా చొచ్చుకుపోయాడని మానవ శీలాభివ్రుద్ధికి కృషి చేసాడని సైకో న్యురాటిక్ వ్యాధులకు కారణాలను ఆవిష్కరించాడని మెచ్చుకున్నాడు.

Image result for sigmund freud  Image result for sigmund freud

‘’Image result for sigmund freud

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-8-15 ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మోడీ ”నాగ” స్వరం ,యుద్ధం లో గెలుపు దౌత్యం లో ఓటమి



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

Click here to Reply or Forward
12.74 GB (84%) of 15 GB used
Last account activity: 10 hours ago

Details

People (2)
gabbita prasad's profile photo
gabbita prasad

4 circles

Recent photos
View photo in message
View photo in message
View photo in message
Show details

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సోనియాకు బలం కూర్చిన మోడీ విధానాలు –


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాగాలాండ్ లో శాంతి మొదలైనవి



గబ్బిట దుర్గా ప్రసాద్
 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -66

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -66

28-మానవత్వాన్ని మాత్రమే  చిత్రించిన మహోన్నత చిత్రకారుడు -విన్సెంట్ వాన్ గో(Vincent Van Gogh-3(చివరి భాగం )

పారిస్ లో తను ఊహించిన దాని కంటే కొత్త ప్రపంచాన్ని చూసాడు. ఫ్రెంచ్ ఇంప్రెష నిస్టూల స్వర్గం లాగా కనిపించింది. పిసారో, హ్యురేట్, సిగ్న్స్, గగాల్న్, లేట్రేస్ మొదలయిన వారి కాన్వాసుల ముందు నిలబడి గమనించాడు. అంతా కొత్త పోకడలు కన్పించాయి. సంప్రదాయానికి భిన్నంగా వారు చిత్రాలు గీస్తున్నట్టుగా గమనించాడు. సరిహద్దులను చెరిపేసి రంగులను విడదీసి కాంతితో ఆడుకున్నట్టుగా ఉన్నాయి వారి చిత్రాలు. జపనీస్ ప్రింట్ల షో చూసి వాళ్ళ ధైర్యానికి ఆకర్షితుడయ్యాడు. అందులో అవాస్తవికత ,వర్ణ సమ్మేళనం  కన్పించాయి. సమతలంగా ఉండే రంగు విస్తరించి వాటిని కాపీ చేయకుండానే తన ఆవిష్కరణలతో వాటిని మించి చిత్రించాడు. భారమైన రిథం ను ఉత్తరపు ధృడత్వాన్ని వదిలిపెట్టలేదు. దీనితో అతని చిత్రాలకు శక్తి, ప్రభావం పెరిగాయి. డచ్ సాలిడి కి ఇది వ్యతిరేకం. అతని పాలెట్ చాల తేలిక. రంగుల కలయిక మరీ సున్నితం. బ్రష్ స్ట్రోక్ లు విశాలం, విచ్చేదకరం. డాట్ లు, డాష్ లు , డాన్సింగ్ పాయింట్లతో అంతా సంమిశ్రం చేసాడు. కాంతివంతమైన చిన్న డిజైన్లను అసలు వస్తువులో ఒదిగేటట్లు చేయగలిగాడు. అతని చిత్రాలు జీవంతో కళకళలాడుతాయని అన్నారు. ఒకదాని తరువాత ఒకటి విభిన్న ప్రయోగాలతో రూపొందించాడు. మామూలువే అయినా టేబులు, కుర్చీ, బెడ్రూము, యువతీ జపనీస్ బొమ్మలలాగా ఉన్న అను భూతిని కలిగించాయి. కూర్చున్న పోస్ట్ మెన్, అపస్మారక శక్తితో ఊగిపోతున్నట్లుగా కన్పిస్తాయి.

 

ఎంత చేసినా విన్సెంట్ పనితనానికి ఎక్కడా ఆదరణ రాలేదు. కాని తోటి ఆర్టిస్టులు ముఖ్యంగా గాగిన్ విన్సెంట్ అంటే అభిమానం చూపాడు. వాళ్ళ ప్రోత్సాహం, పోషకత్వం విన్సెంట్ ఆశించలేదు.  థియో కొన్ని బొమ్మల్ని అమ్మే ప్రయత్నం చేసాడు కానీ ఎవరూ ఏ డీలరూ కొనటానికి ముందుకు రాలేదు. ఒక్క సారిగా పారిస్ అంటే అసహ్యం పుట్టింది. శైలి, టెక్నిక్కుల గురించి విని విని విసిగిపోయాడు. తాను మొదలు పెట్టిన పనిని పూర్తీ చేయటానికి చాలాసమయం ఉంది అనుకున్నాడు. అంత కొత్తగా ప్రారంభించాలి అన్పించింది. తాను చాలా కిందికి దిగి భూమి పుత్రుడుగా నగ్నంగా పని చేయాలనిపించింది. తనకింకా 3,4 ఏళ్ళు  మాత్రమే ఉందనుకున్నాడు. మళ్ళీ ఒక గొప్ప ప్రయత్నం చేయాలని అనిపించింది. ఎక్కడో ఆకాశం కింద తాను వెతుకుతున్నది కన్పిస్తుంది అనుకున్నాడు. అక్కడి గాలిని అనుభవించాలని అన్పించింది. అది తన శరీరానికి తాకాలని పారిస్ లో తన వస్తు జ్ఞానం అంతా నశించిందని తన చర్మం కొద్దికొద్దిగా క్షయమై  పోతోందని అనిపించింది. తను కోరుకున్న కళా స్వర్గం దక్షిణ దేశం వైపు ఉన్నట్లుగా భావించాడు. తన చిత్రాలను గోడలకు తమ్ముడు థియో కోసం తగిలించి వదిలి, అపార్ట్మెంట్ ఖాళీ చేసి ఎరీస్ కు వెళ్ళాడు.

 

దక్షిణ దేశంలో తన కాన్వాసులతో  సహా నదీస్నానం చేసాడు. పూర్వం కంటే శక్తి, ఉత్సాహం వచ్చాయి. కనిపించిన ప్రతి దానినీ చిత్రించాడు. నదిలో బట్టలు ఉతికే చాకలిని, నదిపై బ్రిడ్జిని నీటి ఊటలను,  సన్ ఫ్లవర్ లను , తన చిత్రాలను ,అన్ని రకాల మనుషుల చిత్రాలను వేశాడు. పది రోజులు ఏక దీక్షగా పుష్ప ఉద్యానవనాలను చిత్రీకరించాడు. మొదట్లో ఇవన్నీ కళాభివ్రుద్ధిగా కనపడేవి. అతని రూపాలకు మరింత జీవకళ అబ్బింది. అతని జీవిత చరిత రాసిన మీర్ గ్రేస్వీ అతనొక రోమాన్౦టి స్టని అతని వికసనంలో తుఫాన్లు ఉన్నాయని రాశాడు. అతని చూపు ప్రతి దానిలోకి చొచ్చుకు పోతుందని చెట్టు, మట్టి ,గొడ్డలి కూడా అతనికి ప్రత్యేకంగా కన్పిస్తాయని గాలిని కూడా ఒక ఘనపదార్తంగా మార్చే శక్తి కలవాడని అన్నారు. పసుపు రంగుతో కనిపించేదంతా అదే రంగుతో చిత్రీకరించాడు. వాటిని చూస్తే రంగు, రుచి వాసన స్పర్శ కన్పిస్తాయి. రాళ్ళను చిత్రిస్తే అవి  మనతో మాట్లాడుతున్నంత గొప్పగా ఉంటాయి. క్రమంగా చెట్లను వదిలేసి వాటి ఎదుగుదలను అస్తిత్వాన్ని చిత్రించాడు. అవి విచ్చుకున్నట్లు కాదు వికసిస్తున్నట్లుగా కన్పిస్తాయి. అతని బ్రష్ స్ట్రోక్ లో నిర్ణయాత్మక శక్తి కనిపిస్తుంది. ఒక సజీవ తాదాత్మ్యం గోచరిస్తుంది. అతని పాలెట్ నుండి అగ్ని శిఖలు సృష్టించాడు. అతని పెయింటింగ్ లలో  గుడ్డి వెలుగు గొప్పగా ఉంటుంది. అవి అతని గత కాలపు జీవితానికి గుర్తులు.

 

విన్సెంట్ కలర్ సింబాలిజం ను అభివృద్ధి చేసాడు. “ది నైట్స్ కేఫ్” అనే చిత్రం గురించి చెబుతూ అతను దానిని “To express the terrible passions of humanity by means of red and green. I have tried to express the ideas that the café is a place where one can ruin one’s self, run mad or commit a crime. So I have attempted as it were to show the powers of darkness in a low drink –shop by a soft Louis XV green and malachite, contrasting with a yellow green and hard blue greens- all this in an atmosphere like a devil’s furnace of pale sulphur” అని వివరించాడు. ఎరిస్ లో గాగిన్ వచ్చి తనతో చేరతాడని తెలిసి సంతోషించాడు. అతని ఆర్ట్ కాలనీ లో వీరిద్దరే ఉన్నప్పటికీ మిగిలినవారకు చోటు ఉన్నదని చెప్పేవారు. వాన్ గో గాగిన్ యొక్క నమ్మకాన్ని సహకారాన్ని అనుభవించాడు. తానకంటే  అతనను కంటే తక్కువ స్థాయి  ఆరిస్ట్ తెలుసుకోలేదు. గాగిన్ శిష్యుడినే అని అనుకునేవాడు. కొద్ది కాలం తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చి కలసి ఉండలేక పోయారు.

 

గాగిన్ డబ్బు పెట్టుబడి పెట్టె మనిషి. గొప్ప స్టాక్ బ్రోకర్. పెయింటింగ్ ను హాబీగా చేసుకున్నాడు. వాన్ గో బీదరికంలో జీవిస్తూ గాగిన్ ప్రవర్తనకు అభిరుచులకు విసిగి పోయాడు. గాగిన్ బోహీమియన్ లాగా ఉంటే వాన్ గో భయపడుతున్నట్లుగా ఉండేవాడు. గాగిన్ సాటి కళాకారులను చులకనగా చూసేవాడు. వాటిని బహిర్గితము చేసే వాడు. వాన్ గో సెంటిమెంటల్ ఫెలో . తరచు పోట్లాడుకునే వారు ఇద్దరూ. గాగిన్ తీవ్ర స్వభావానికి వాన్ గో అల్లల్లాడి పోయేవాడు. రోజు రోజుకూ నిరుత్సాహం పెరిగే పోయేది. అతని విపరీత చేష్టలకు విసిగి ఒకరోజు ఒక గ్లాసు అతనిపై విసిరివేసాడు. దాన్ని  చేత్తో పట్టుకున్న గాగిన్ కఫే లోంచి ఇతన్ని బయటకు లాక్కొచ్చాడు. తననెవరో  వెంబ డిస్తున్నారని  గాగిన్ అనుకునే వాడు. ఒక రోజు వాన్ గో కత్తితో తన వెంట ఉండటం గాగిన్ చూసాడు. భయపడిన వాన్గో పరిగెత్తి తన రూముకు చేరి అపస్మారకంగా పడిపోయాడు. అతని తలకు రక్తపు మరకలున్న టవల్ చుట్టబడింది. తన చెవిని ఒకదాని కోసి అతనికి పరిచయమున్న వేశ్యకు పంపాడు. అది క్రిస్టమస్ కానుక అని చెప్పాడు. ఈ విధంగా వాన్గో  విపరీత ప్రవర్తనలో ఉండిపోయాడు.     తమ్ముడు థియో వచ్చి అన్న విన్సెంట్ ను  హాస్పటల్ లో చేర్చాడు. అప్పుడప్పుడు అపస్మారకంలో పడుతూ కొద్ది కాలానికి ఆరోగ్యం చేకూర్చుకున్నాడు. మళ్ళీ తన ఎల్లో హౌస్ కు చేరి దానినే సింబల్ హోమ్ గా భావించాడు. అతన్ని చూసి జనం కూడా భయపడుతున్నారు. నిఘా ఉంచారు. పిల్లలు గేలి చేసే వారు. పెద్దలు కిటికీ లోనుంచి  తొంగి చూసేవారు. ఒకరోజు ఇంటి ముందు చాల మంది చేరితే కిటికీ లోంచి వాళ్లకు ఉపదేశం చేసాడు. తర్వాత అరుపులు, కేకలు పెడుతూ ఉండగా తాళం వేసిన గదిలో గొలుసులతో  ఇనప మంచంమీద బంధించారు. ఒంటరి గదిలోకి తర్వాత మార్చారు. తనను ఒక ప్రశాంత ప్రదేశానికి తీసుకు వెళ్ళమని అర్థించాడు. ఒక శరణాలయంలో తన భ్రమలకు నివారణ లభిస్తుందని చెప్పాడు. 1889 మే లో అతను పిచ్చివాడని సెయంట్ రెమీ హాస్పటల్ వాళ్ళు సర్టిఫికేటు ఇచ్చారు. ఈ హాస్పటల్ లోనే మూర్చతో బాధపడ్డాడు. స్కిజోఫ్రేనియా వచ్చి ఇబ్బంది పడ్డాడు. గొప్ప పెయింటర్ గా ఉన్న వాన్ గో కు ఈ స్థితి కలిగింది. ఈ స్థితి లోనూ పెయింటింగ్ లు వేస్తూనే ఉన్నాడు. అవి బాగా కదిలించేవిగా ఉండేవి. ఒంటరి గదిలో చెక్క బొమ్మలు, లితోగ్రాఫ్లు చేస్తూ ఉండేవాడు. ఇదివరకంటే ఇప్పటి పెయింటింగ్ లలో మరింత శక్తి కన్పించేది. అతని అపూర్వ సృష్టికి ఇవి గొప్ప ఉదాహరణ. అతని’’ది  స్టార్రి నైట్’’ చిత్రం పెయింటింగ్ గా చెప్పుకోలేనప్పటికి గొప్ప వైభవంగా కన్పిస్తుంది. దీనిలో అతనికి స్వర్గాలు కనిపించాయి. నక్షత్రాలు స్థిరంగా ఉండవు, ప్రకాశించవు, మినుకు మనవు, కానీ అవి మండుతూ భ్రమణం చెందుతూ అంతరిక్షంలో కన్పిస్తాయి. ఆకాశమంతా వాటి కోసం పరిగెత్తుతున్నట్లు అనిపిస్తాయి. మేఘాలు సుళ్ళు తిరిగే జల ప్రవాహాలుగా కాంతి వంతమైన పదార్థంగా గోచరిస్తాయి   ఆందోళనన తో కూడిన గాలి నుంచి ఆకుపచ్చని ఫౌంటెన్లు ఎగ జిమ్ముతున్నట్లు కన్పిస్తాయి. రాత్రివేళ కనిపించని శక్తులన్నీ బహిర్గమవుతాయి. అవన్నీ  విపరీతమైన వేగం తో చరిస్తున్నట్లు అన్పిస్తాయి.

 

అతని మూర్చలు పెరుగుతూనే  ఉన్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుందని అన్నదమ్ములు భావించారు. ప్రదేశం మారిస్తే మంచిదని అయిస్ నది ఒడ్డున ఆవేర్స్ కు  మకాం మార్చారు. కొంత నయం. పారిస్ లో ఉన్న థియో కు ఇరవయ మైళ్ళ దూరంలో మాత్రమే ఇది ఉన్నది. విన్సెంట్ డాక్టర్’’ గాచచేట్ ‘’గొప్ప కళాభిమాని. అతనిపై సానుభూతి బాగా చూపించేవాడు. అతని ప్రతి సృజనను మెచ్చుకున్నాడు. వాన్ గో తన డాక్టరును విచార వివర్ణ వదనంతో చిత్రించాడు. అతనిది కాని అతని చూపును అందులో ఒదిగాడు. అందులో “The heart broken expression of our time” ఉందని అందరూ భావించారు. చివరి చివరికి వేసిన చిత్రాలన్నీ ఒంటరి తనాన్ని, చీకటిని, విషాదాన్ని చూపాయి. అతనిలో విషాదం పెరిగి పోయింది. తాను ఇక ఏమాత్రం తమ్ముడికి భారంగా ఉండకూడదని భావించి తన బాధను తనలోనే అణచుకున్నాడు. కాకుల్ని చంపటానికి ఒక రివాల్వర్ తీసుకుని పొట్టలో కాల్చుకున్నాడు. విషయం తెల్సిన తమ్ముడు పరిగెత్తుకు వచ్చాడు. అతనితో “మనందరి మంఛి కోసం ఈ పని చేసాను” అని చెప్పి 29 -7-189౦ న 37 వ ఏట వినేంట్ వాన్ గో మరణించాడు. ఈ విషాదాన్ని తమ్ముడు భరించలేక పోయాడు. 6 నెలల తర్వాత థియో కూడా మతి స్థిమితం లేక హాలండ్ లో చనిపోయాడు. అన్న దమ్ములిద్దరినీ అయిస్ అవేర్స్ చర్చిలో ఖననం చేసారు.

 

వాన్ గో జీవిత కాలంలో ఒకే ఒక సానుకూలమయిన వ్యాసం చూడగాల్గాడు. రెండే రెండు పెయింటింగులను అమ్మడు. వాటికి కొన్ని వందల ఫ్రాంకులు మాత్రమే వచ్చాయి. అతని మరణాంనంతరం అరవై ఏళ్ల తర్వాత పదేళ్ళలో అతను వేసిన డ్రాయింగులు, చిత్రాల విలువ 30 మిలియన్ డాలర్ల విలువ ఉంటుందని నిర్ణయించారు. సంప్రదాయానికి భిన్నంగా అతను చిత్రించిన చిత్రాలు పిగ్మెంట్స్ ద్వారా ఎంత  బలంగా శక్తివంతంగా భావాలు తెలియచేయవచ్చో తెలియచేస్తాయి. అవి “Those terrible things, men;s passions “కు దృష్టాంతాలు . చూసేవాని చూపే కాక అతని భాగస్వామ్యం కూడా చిత్రాలలో కన్పిస్తుంది. “He lifts emotions to a pitch of almost unbearable excitement and communicates the intensity which brought him to the breaking point” అని అతని చిత్రాలకు భాష్యం చెప్పారు. “Instead of driving to reproduce exactly what I have before my eyes, I use color more arbitrarily so as to express myself more forcibly” అని విన్సెంట్ తన చిత్రాలగురించి చెప్పుకున్నాడు. అతని చిత్రాలు  అబద్దాలుగా కన్పించినా అందులో యదార్థ ఉందనిపిస్తాయి. అంతకు ముందు ఏ చిత్రకారుడూ చేయని ప్రయోగాలు చేసాడు విన్సెంట్. సామాన్య వస్తువులలో కాంతి పుంజాలను ,రేడియేషన్  ను చూపగల్గిన అత్యంత  ప్రతిభావంతుడు విన్సెంట్. ఇది ఎవరికీ లభించని అసాధారణ శక్తి. మనిషి టెన్షన్ ల  మధ్య అవాస్తవాల మధ్య జీవిస్తున్నాడుఅనటానికి  సజీవ ఉదాహరణలు అతని చిత్రాలు. దాస్తోవిస్కీ, కాఫ్కా ప్రాఫెట్ల తర్వాత కళను ఆదిశలో నడిపించినవాడు “To a confused world his vital images have what he desired above all else the power to reveal and to console “

 

రేమ్బాంట్, అల్గ్రికో లను వదిలేస్తే వాన్గో గొప్ప డ్రమాటిక్ పెయంటర్. అంతటివాడు పుట్టలేదు, పుట్టబోడు. రేమ్బాంట్ సాధారణ  వెలుగుతో డ్రామాను నిరంతరంగా నాటకంగా మారిస్తే అల్గ్రికో దాన్ని అణచబడిన హింసతో సాధించాడు. కానీ వాన్గాన్ ప్రతి స్పర్శలో డ్రామా కన్పిస్తుంది. అందులో గీతలు నిండి సుళ్ళు తిరిగే రంగుల ప్రవాహంగా ఉన్నతోన్నతంగా దర్శనమిస్తాయి. “Van Gogh seized to be concerned with the troubled human comedy, even in his paroxysms he responded to its moral force. Every thing he did was another attempt to add moral passion and pity to the immortal humanity of Art.”

.

Image result for vincent van gogh Image result for vincent van gogh

Image result for vincent van goghImage result for vincent van gogh

Image result for vincent van goghImage result for vincent van gogh

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ-గబ్బిటదుర్గాప్రసాద్-4-8-15 ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కలాం కు వెల్చాల కొండలరావు”కవితా సలాం ”మరియు కలాం కు ఊరు నేర్పిన పాఠం


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 238-సంతాన గోపాల శతక కర్త- లక్ష్మి రజని

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

238-సంతాన గోపాల శతక కర్త- లక్ష్మి రజని

మలబారులోని కదాతనాడు రాకుమారి లక్ష్మీ రజని 1890 కాలం నాటిది. ఆమె రాసిన సంతాన గోపాల కావ్యం 3 కాండలలో ఒక బ్రాహ్మణుడు తన 10 మంది సంతానాన్ని వరుసగా కోల్పోవటం, అర్జునుడు చివరివాడిని బతికిస్తానని శపథం చేసి నెరవేర్చుకున్న కథఉన్నది .. దీనికి మెచ్చిన శ్రీకృష్ణుడు వైకుంఠం లో ఉన్న మిగిలిన పిల్లల్ని కూడా తీసుకు వచ్చి అప్పగిస్తాడు. చివరి కాండలో యమకాన్ని బాగా దట్టించింది.

239- కవిరత్న- జ్ఞాన సుందరి

కుంభకోణానికి చెందిన జ్ఞాన సుందరి  నాట్యకళాకారిణి. అక్కడే పెరిగి 19 10 లో చనిపోయింది. శ్రీవత్స గోత్రానికి చెందిన కుప్పుస్వామి శాస్త్రి అనే బహు గ్రంథకర్త శిష్యురాలు. తాను అనేక కావ్యాలు రచించినట్టు చెప్పినా ఆరు స్థభాకాలలో రాసిన “హాలాస్య చంపూ” మాత్రమే లభ్యమైంది. దక్షిణ జిల్లాలలో ఆమె చేసిన ఉపన్యాసాలు, నాట్యాలు సంగీత కచేరీల గురించి చాలా మంది ఇప్పటికీ చెప్పుకుంటారు. బార్ ఎట్ లా చేసిన మదురైకి చెందిన ఆర్ ఫిషర్ ఆమె పోషకుడు. మైసూర్ సంస్థానానికి వెళ్లి రాజును మెప్పించి “కవిరత్న” బిరుదు పొందింది.  మదుర మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణాన్ని మృదుమధురంగా వర్ణించింది.

240 –సంస్కృత ఉపాధ్యాయిని – కామాక్షి

కౌండిన్య గోత్రీకుడైన ముత్తు క్రుష్ణన్ అయ్యర్ ను వివాహమాడిన కామాక్షి 19 02 లో తంజావూరు జిల్లా గణపతి ఆగ్రహారానికి చెందిన పంచాపకేశయ్య కుమార్తె. ఉత్తర తమిళనాడులోని బాలికల పాఠశాలలో సంస్కృత ఉపాధ్యాయినిగా పనిచేసింది. కాళిదాస కవిత్వాన్ని ఔపోసిన పట్టిన కామాక్షి ‘’రామ చరిత’’ అనే చిన్న కావ్యం రాసింది.

సోదరి బాలా౦బాళ్ మద్రాసు  నివాసి. దక్షిణ భారతంలో గొప్ప జాతీయ నాయకురాలు. సంస్కృతం నేర్చుకునే వారి కోసం’’ ఆర్య రామాయణం’’ రాసింది.

241-భారత భౌగోళిక చరిత్ర రాసిన- రామకవి

18 వ శతాబ్దానికి చెందిన  శేఖర బాదామి రాజు ఆస్థానంలో రామకవి ఉండేవాడు. “పాండవ దిగ్విజయం” రాసాడు. ఇందులో పాండవులు భారతదేశాన్ని జయంచటం ఉంది. ఇది మహాభారతం కంటే ఉద్గ్రంధం. భారతదేశంలోని ప్రదేశాలన్నింటినీ వర్ణించాడు. పౌరాణిక గాధలను జోడించి కథ చెప్పాడు. ఆనాటి  సంఘ ఆచారాలు, పద్ధతులు, మతాలు, చట్టాలు సంస్థలు మొదలైనవాటినన్నింటినీ వర్ణించాడు. మహమ్మదీయ దండయాత్ర ముందు తర్వాత కథ నడుస్తుంది.    విక్రమాదిత్య, శాలివాహన, భర్తృహరి, శంకరాచార్య, ప్రభాకర భట్ట, జూమార్ నంది కాంభోజరాజు జయచంద్రుడు ఒరిస్సా రాజు ప్రతాప రుద్రుడు, శూర భట్ట మొదలగు వారి చరిత్రలన్నింటినీ ఇందులో రాసాడు. దీనికి ఆధార౦  భవిష్య, స్కంద పురాణాలు రుద్ర విజయం, విశ్వ గుణాదర్శం గా తెలియ చేసాడు.

242- ప్రపంచ దర్పణ కర్త- వెంకట కవి సార్వభౌముడు

జోగి భుక్త, పార్వతిల కుమారుడు 18 వ శతాబ్దిలో గోదావరి జిల్లాలో ఉండే వాడు. తాను సైన్స్ తో సహా అన్ని శాస్త్రాలలో ప్రవీణుడని చెప్పుకున్నాడు. “ప్రపంచ దర్పణ” రాయటానికి సిద్ధం చేసుకున్నాడు. అది బృహత్  విజ్ఞాన సర్వస్వం. ధర్మ కాండ, అర్థ కాండ, కామ కాండ అనే  మూడు భాగాలలో ఉన్నది.   ఇందులో మంత్ర శాస్త్రం, కవిత్వం, అలంకార శాస్త్రం మొదలయినవన్నీ ఉన్నాయి. అనేక కావ్యాలనుండి ఉదాహరణలు ఇచ్చాడు .

243-భువన ప్రదీపిక కర్త- రామకృష్ణ శాస్త్రి

మైసూరుకు చెందిన మూడవ కృష్ణ రాయ ఒడయార్ రాజు ఆస్థానంలో హసన్ లో ఉంటూ రామకృష్ణ శాస్త్రి కవి “భువన ప్రదీపిక” రాశాడు. ఇది ఓకే విజ్ఞాన సర్వస్వం. ఇందులో సృష్టి ఆవిర్భావం, మన్వాదుల చరిత్ర , భోగోళిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, దక్షిణ భారత చరిత్ర, ఓడవార్ రాజ వంశ చరిత్ర, పురాణాలు చాతుర్వర్ణాల వారి ధర్మాలు, యోగ ,వేదాంతం, అన్ని రాశి పోశాడు. ఈ వంశంలో ధర్మ రధుని కుమారుడు చాముండ రాయలు శ్రావణ  బెల్గోలాలో గోమఠేశ్వరుని స్థాపించాడు. వినయాదిత్య భల్లలుడు యాదవ పురి నిర్మించాడు.

244-రసప్రపంచ కర్త-వెంకట శాస్త్రి

పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్తికి చెందిన ఆన్విల్ల యజ్న నారాయణ కుమారుడు వెంకట శాస్త్రి సర్వ శాస్త్ర పారంగతుడు. పెద్దాపురం ,దార్లపూడి మహా రాజుల చేత గొప్ప సన్మానాలు పొందాడు. “మహేశ్వర మహాకావ్యం”, “ సతీ శతకం”, “భాస్కర ప్రశస్తి” కావ్యాలు- “అలంకార సుధా సింధు”, “రస ప్రపంచం” అనే అల౦కారగ్రందాలు రాసాడు. నూజివీడు జమీందారులు మేక వెంకట నరసింగ అప్పారావుపై ‘’అప్పారాయ యశశ్చంద్రో దయ కావ్యాలు రాసాడు. మెచ్చిన రాజు వల్లూరుమల్లి అగ్రహారాన్ని ప్రదానం చేసాడు. అక్కడ సోమయాగం చేసాడు. “శ్రౌత సూత్రాలు” పై భాష్యమ్  రాసాడు.  కుమారుడు నారాయణ కవి “సాహిత్య కల్ప ద్రుమం” రాసి నూజివీడు  జమిందారుజగన్నాధ అప్పారావుకు అంకితమిచ్చాడు. నారాయణ కవి కొడుకు వెంకట కవి ‘’బాల కాళిదాసు’’గా ప్రసిద్ధుడు. ఇతడు “చిత్ర చమత్కార మంజరి” రాసి పెద్దాపురానికి చెందిన వత్సవాయి తిమ్మ జగపతి మహారాజుకు అంకితమిచ్చాడు. చిత్ర కవిత్వముగా ‘’సూర్య శతకం ‘’రాసాడు.

245-నేపాల్ రాకుమార కవి-జగజ్జోతిర్మల్ల

నేపాల్ కు చెందిన త్రిభువన్ మల్ల రాజకుమారుడు జగజ్జోతిర్మల భాక్తపురానికి రాజు. గొప్ప సంగీత విద్వాంసుడు, శాస్త్రజ్ఞుడు. ఉత్తర దేశంలో సంగీతంపై సారిన గ్రంథం లేదని అభిలాషుడు రాసిన సంగీత చంద్రను  నేపాలీ భాషలో రాసాడు. దీనికి’’ సంగీత భాస్కర’’ అనే వ్యాఖ్యానాన్ని మిధిలకు చెందిన వంగమణి రచించాడు. ‘’సంగీత సార సంగ్రహం ‘’అనే గ్రంధాన్ని రచించాడు. 16 17- 1633    కాలంలో పరిపాలన చేసాడు. పద్మశ్రీ రాసిన ‘’నాగ రస సర్వస్వం’’ కు  విపుల వ్యాఖ్యానం రాసాడు.      నేపాలీ భాషలో’’ హర గౌరీ వివాహం’’ అనే సంగీత రూపకం రచించాడు. ఈ రాజు ఇతర రచనలు’’ స్వరోదయ దీపిక,’’ ‘’గీత పంచాసిక,’’ సంగీత భాస్కరం’’.. ముప్పై మూడు అంశాలపై శ్లోకాలను సమీకరించి శ్లోక సంగ్రహంగా రూపొందించాడు.

ఇతని కుమారుడు ప్రతాప మల్లుడు కూడా కవి. ఇతని కుమారుడు జగత్ప్రకాశ మల్ల ‘’పద్య సముచ్చయం’’ అనే నీతి కావ్యం రాసాడు. ఇతని కుమార్తె, కొడుకు అనంతుని ప్రీరణ చే ఘనశ్యాముడు నాట్య శాస్త్రంపై ఉన్న “హస్త ముక్తావళి” కి వ్యాఖ్యానం రాసాడు.

246-వైణిక శిఖామణి– వెంకట వైద్యనాథ దీక్షితులు

తిరువాడ మరుదూర్ లో నివసించిన దీక్షితులు వెంకట మఖి మనవడు. తాత గారి నుండి సంగీత జ్ఞాన్నాన్ని వారసత్వంగా పొందాడు. గొప్ప వైణిక విద్వాంసుడు. వెంకటమఖి రాసిన చతుర్దండి ప్రకాశికను  విపులీకరిచాడు.’’ వైణిక శిఖామణి’’బిరుదాంకితుడు.   ఎతియాపురం రాజులు సంగీతాన్ని బాగా ప్రోత్సహించారు.

247- ఆంధ్ర జాన్సన్- కొక్కొండ వెంకట రత్నం పంతులు

1842- 1916 కాలపు వాడైన  కొక్కొండ వెంకట రత్నం పంతులు అఖండ ప్రజ్ఞావంతుడైన ఆంధ్ర దేశపు పండితుడు. ‘’మహా మహోపాధ్యాయ’’ బిరుదాంకితుడు. మద్రాస్ ప్రేసిడేన్సీ  కాలేజీలో, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో తెలుగు పండిట్ గా పనిచేసాడు. మహా సంస్కృత విద్వాంసుడు, కవి. సంస్కృతములో ‘’బిల్వ నాద శతకం,’’, తను మధ్య ఆర్యా శతకం ‘’, ‘’తను మధ్య గీతా శతకం’’తో బాటు  ‘’వరదారాజ స్తుతి’’,’’ తారావళి స్తుతి ‘’,, బ్రహ్మ విద్యా స్తుతి, ‘’కాళహస్తీశ్వర స్తుతి ‘’మొదలైన 50 స్థవాలు రాసారు. ‘’ఆంధ్ర భాషా సంజీవని ‘’అనే పత్రిక నడిపారు. ఆయన రాసిన’’ గీత మహంత’’ కావ్యం జయదేవుని గీత గోవి౦దానికి అనుసరణ. ఫిలాసఫీ లో కూడా ఆయన దిట్ట. వేదాంతంలో ’’అక్షర సాంఖ్య ‘’ పద్ధతిని కనుగొన్నాడు. ‘’మార్గ దాయని ‘’అనే గ్రంథంలో ఈ సిద్ధాంతాలను వర్ణించాడు. ఆయనకు తమిళ, కన్నడ భాషలలో గొప్ప ప్రావీణ్యం ఉంది. తెలుగులో’’బిల్వేశ్వరీయం ‘’మొదలయిన 25 గ్రంథాలను రాశాడు. సమకాలీనులలో మహోన్నత శిఖరం కొక్కొండ. మద్రాస్ లాయర్ విద్యా వినోద పానపాకం ఆనందాచారి ఈయన శ్రేయోభిలాషి. ఈయనకు ఆంద్ర జాన్సన్ బిరుదు ఇచ్చారు. పంతులు గారిని ‘’సాహిత్య నిరంకుశుడు’’ అంటారు.

248- వీణాగాన కళానిధి- దూర్వాసుల సూర్యనారాయణ శాస్త్రి

1843- 1896 కాలానికి చెందినా వాడిన దూర్వాసుల సూర్య నారాయణ శాస్త్రి ‘’వీణా గాన కళానిధి ‘’బిరుదాంకితుడు. విజయ నగర మహా రాజు ఆనంద గజపతి రాజు ఆస్థానంలో  ప్రధాన సంగీత విద్వాంసుడు. సంస్కృతంలో తెలుగులో అనేక కృతులు రచించాడు. కాంభోజి రాగంలో ‘’పరమానంద సముద్ర వీచికయం ‘’అనే కృతిని పెరెన్నిక  కన్నది. కల్యాణి రాగంలో రాసిన ‘’దేవి దేహి సతతం’’ కీర్తనకు మంచి ప్రాచుర్యం ఉంది. ప్రఖ్యాత వైణిక విద్వాంసుడు వీణ వెంకట రమణ దాసు ఈయన శిష్యుడు. శాస్త్రి గారు దాస మహానుభావుని తండ్రి పెద  గురువాచార్యుల శిష్యుడు.

249- అభినవ శంకరాచార్య- మార్తాండ మాణిక్ ప్రభు మహారాజ్

1860 – 1936 కాలపు మాణిక్ ప్రభు మహా రాజ్ నిజాం రాష్ట్రంలో మాణిక్ నగరంలో ‘’సకల మత సంప్రదాయాన్ని’’ స్థాపించాడు. సంగీతంతో సహా అనేక శాస్త్రాలలో ప్రావీణ్యం ఉండేది. పలు భాషలలో పాటలు రాశాడు. సంస్కృతంలో రాసిన ‘’జ్ఞాన మార్తాండ’’ గీతం మణిపూస. ‘’అభినవ శంకరాచార్య’’ బిరుదాంకితుడు.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-4-8-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment