అధికారంలో నేరం

అధికారంలో నేరం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పీ వీ కాంస్య విగ్రహం – మచిలీపట్నంలో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రజాస్వామ్య భారతాన —– బందా

ప్రజాస్వామ్య భారతాన —– బందా

img161

Posted in కవితలు | Tagged | Leave a comment

యాకుబ్ కు ఉరి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అసలైన ఆట ఇప్పుడే ప్రారంభం -రేవంత్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దేవేంద్ర భోగ అమరావతి


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సమాజ అభివృధ్దిలో కళలు — బందా

సమాజ అభివృధ్దిలో కళలు — బందాimg160

Posted in కవితలు | Tagged | Leave a comment

గోదారికి నీరా”జనం ‘


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రేవంత్ కు ఖైదీలే ధైర్యం చెప్పారు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జనతరంగ గోదారి ఘోష

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వ్యాపం’.. అవినీతి కూపం

వ్యాపం’.. అవినీతి కూపం

  • 19/07/2015
  • -వాధూలస

తెలుగునాట ఆ మధ్య వచ్చిన ‘శంకర్‌దాదా ఎంబిబిఎస్’ చిత్రం చూసిన వారికి ఓ సన్నివేశంలో డైలాగ్ బాగానే గుర్తుండిపోయింది… డాక్టర్ పాత్రలో ఉన్న చిరంజీవి ఓ రోగిని పరిశీలించాక.. అతడికి వచ్చిన రోగాన్ని గూర్చి వివరిస్తూ… ‘సర్క్‌మ్ లోకో ఆఫ్ ది ఇంటెన్‌స్టైన్’ వ్యాధితో బాధపడుతున్నావని చెబుతాడు. దానికి అర్థం ఏమిటని రోగి ఎదురు ప్రశ్నిస్తే…తనని కన్ఫ్యూజ్ చేయవద్దని హీరో అంటాడు. నకిలీ డాక్టర్‌గా నటిస్తున్న చిరంజీవి రోగి ప్రశ్నకు గందరగోళంలో పడిపోతాడు. ఆ సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. అది సినిమా కనుక అందరూ ఎంజాయ్ చేశారు. తేలికగా తీసుకున్నారు. తల్లిదండ్రులను మోసగించి, నకిలీ ఆస్పత్రిని సృష్టించి, దొంగ సిబ్బందిని పెట్టి, డాక్టర్‌గా నమ్మించిన ఆ నటుడు ఆ సినిమాలో అదుర్స్ అనిపించాడు. ఇప్పుడు అలాంటి వందలమంది నిజమైన ‘శంకర్‌దాదాలు’ మధ్యప్రదేశ్‌లో పట్టుబడుతున్నారు. ఇది సినిమా కాదు… పచ్చినిజం. ఆ సినిమాలో శంకర్‌దాదా వల్ల ఎవరికీ నష్టం లేదు. కానీ మధ్యప్రదేశ్‌లో పట్టుబడుతున్న ఈ నకిలీ డాక్టర్ల బాగోతం చూస్తే వ్యవస్థకు పట్టిన రోగమేంటో, అది ఎంత ప్రమాదకరంగా మారిందో తెలిసి దేశం అవాక్కవుతోంది. రాజకీయ నాయకులు, దళారులు, అధికారులు, చివరకు సాధారణ పౌరులు కూడా ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న రీతిలో అవీనితికి పాల్పడ్డారు. అదికాస్తా బయటపడ్డాక నేరాన్ని మసిపూసి మారేడుకాయ చేసేందుకు, కేసుల నుంచి తప్పించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. నిందితులు, సాక్షులు, ఈ బాగోతాన్ని వెలికి తెచ్చినవారు, దర్యాప్తు చేస్తున్నవారు, చివరకు ఈ వ్యవహారంపై వార్తలు రాస్తున్నవారు కూడా అసహజంగా మరణిస్తున్నారు. వేలకోట్ల రూపాయల ఈ కుంభకోణం వెనుక మధ్యప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ‘వ్యాపం’ వేదికగా నిలిచింది. మెడికల్ సీట్లు, ఉద్యోగ నియామకాలకు నిర్వహించే పరీక్షల్లో అవకతవకలకు పాల్పడి, అనర్హులకు అవకాశం కల్పించి డబ్బులు దండుకునే వ్యవహారం ఎంత విచ్చలవిడిగా, విశృంఖలంగా సాగిపోయిందో తెలుసుకుని దేశ ప్రజలు నివ్వెరపోతున్నారు. అధికారంలో ఉన్న నేతలు, వారి ఛత్రఛాయలో పనిచేస్తున్న అధికారులు, దళారులు కలిసి ఆడిన అవినీతి నాటకంలో ఆశావహులు, సంపన్నులు పాలుపంచుకున్నారు. దీనివల్ల అన్ని అర్హతులు ఉండి, నిజాయితీగా పరీక్షలు రాసిన తెలివైన ఉద్యోగార్థులు, విద్యార్థులు నష్టపోయారు. విచ్చలవిడిగా, నిస్సిగ్గుగా, నిర్భయంగా దోపిడీ జరిగిపోయింది. కానీ, పాపం పండినట్లు ‘వ్యాపం’ బాగోతం ఎట్టకేలకు బయటకు పొక్కింది. భారతీయ సమాజంలో ఇంకా నిజాయితీపరులు, అందుకోసం పోరాడేవారు ఉన్నారని తేలింది. ప్రాణాలకు తెగించి కొందరు చేసిన పోరాటం వల్ల ఇప్పుడు ‘వ్యాపం’ అవినీతి కూపం అంతు చూసే పని మొదలైంది. వివాదం ఏమిటి? 1990 నుంచి పిఎంటి, ఇతర పరీక్షల నిర్వహణ ద్వారా వైద్య, ఇతర వృత్తివిద్యాకోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. అప్పుడుకూడా అవినీతి జరిగేది. కాకపోతే ఒకటీ అరా ఫిర్యాదులే అందేవి. అనర్హులకు అవకాశం కల్పించారంటూ 1995లో తొలిసారిగా ఫిర్యాదు అందింది. 2004లో మరో ఏడు కేసులు నమోదయ్యాయి. అప్పట్లో కేవలం విద్యాసంబంధ పరీక్షలను మాత్రమే వ్యాపం నిర్వహించేది. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు కొన్ని మార్పులు జరిగాయి. గ్రూప్-1 మినహా మిగతా అన్ని ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించే బాధ్యతను వ్యాపంకు కట్టబెట్టారు. అంతకు ముందు ఏ శాఖకు సంబంధించిన ఖాళీల భర్తీ ఆ శాఖే నిర్వహించేది. అవినీతికి అవకాశం తక్కువగా ఉండేది. ఎప్పుడైతే అన్ని శాఖల్లో ఖాళీల భర్తీ బాధ్యత వ్యాపంకు దక్కిందో దళారుల పాత్ర ఎక్కువైంది. అంతకుముందు అక్కడక్కడ ప్రత్యక్షమయ్యే దళారులు ఆ తరువాత ఒక పటిష్ట వ్యవస్థగా రూపొందారు. ఉన్నత పదవుల్లో ఉన్న నాయకులకు, వారికింద పనిచేసే కీలక వ్యక్తులకు ఎరవేసి, అనర్హులైన అభ్యర్థులకు అటు వైద్యవిద్యలో ప్రవేశం, ఆశావహులకు ఉద్యోగాల అందేలా చక్రం తిప్పా రు. ఇక్కడ కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలన్న తేడాలేకుండా దళారులు పనులు చక్కబెట్టారు. ఈ దందాలో పది లక్షల రూపాయల నుండి 85 లక్షల రూపాయల మేరకు ఒక్కొక్క లబ్దిదారునుండి రాబట్టిన దళారులు తమకు సహకరించిన అందరికీ సొమ్ము పంచారు. అసలు వివాదం… వైద్యవిద్యలో ప్రవేశానికి 2009లో నిర్వహించిన పిఎంటి పరీక్షల్లో అవకతవకలు జరిగాయి. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సమాచారహక్కు కోసం ఉద్యమిస్తున్న కొందరు కోర్టుకెక్కారు. దీంతో వివాదం వెలుగులోకి వచ్చింది. ఎస్‌టిఎఫ్, సిట్ ఏర్పాటయ్యాయి. దర్యాప్తు ముమ్మరమయింది. ఈ విచారణలో వెలుగుచూసిన వాస్తవాలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. దీనికి రాజకీయాలు తోడయ్యాయి. వాతావరణం వేడెక్కింది. ఈలోగా కేసులో కీలక వ్యక్తులు వరుసగా, అనుమానాస్పద స్థితిలో మరణిస్తూండటంతో దేశం దృష్టి ఈ కేసుపై పడింది. నేతలపై ఒత్తిడి పెరిగింది. ఈలోగా సుప్రీంకోర్టు ఆదేశంతో సిబిఐ రంగంలోకి దిగింది. అక్రమాలు ఇలా… ఇప్పుడు వివాదం అంతా పిఎంటి పరీక్షల్లో అక్రమాల గురించి రేగింది. నిజానికి మరెన్నో పరీక్షల్లోకూడా ఈ తరహా అవినీతే జరిగింది. వైద్యవిద్యలో అక్రమంగా సీట్లుపొందినవారి సంఖ్య దాదాపు 318. ఇది ఒక్కఏడాదిలో జరిగినది. ఇలా అనర్హులై, వైద్యవిద్యలో అవకాశాలు పొందినవారి సంఖ్య 800వరకు ఉంటుందని అం చనా. అనుమానితుల జాబితాలో దాదాపు వెయ్యి పేర్లున్నాయి. వారిలో కొందరిని వైద్యకళాశాలల నుండి బహిష్కరించారుకూడా. మరికొందరిని, వారి తల్లిదండ్రులను అరెస్టు చేశారు. సరే, వీరంతా ఎలా అవకాశాలు చేజిక్కించుకున్నారో తెలిస్తే-దళారుల రాజ్యం ఎంత విస్తరించిందో, వారికి ఎవరెవరి అండదండలున్నాయో ఇట్టే తెలిసిపోతుంది. అనర్హులకు మెడికల్ సీటు దక్కేందుకు నాలుగు మార్గాలను ఎంచుకున్నారు. వైద్యసీటు కోరుకుని, దళారులకు డబ్బిచ్చిన విద్యార్థి అసలు పరీక్షకు హాజరుకాకుండా, వారి బదులు తెలివైన మరో అభ్యర్థి హాజరై రాస్తాడు. అలా అవకాశం కల్పించడం, అతడు పరీక్ష రాసినపుడు ఎవరూ అభ్యంతరం పెట్టకుండా చూడటం దళారుల వంతు. అంతా డబ్బు పంపకంతో జరిగిపోతుంది. ఒక్కోసారి గతం లో ఈ పరీక్షరాసి వైద్యవిద్య అభ్యసిస్తున్న విద్యార్థులే బినామీలుగా వచ్చి పరీక్షలు రూస్తూంటారు. ఇలాంటి 15మంది (టాపర్స్) విద్యార్థులను దర్యాప్తు సంస్థలు అరెస్టుచేశాయి కూడా. ఇక రెండో మార్గం మరీ గమ్మత్తుగా ఉంటుంది. దీనిని ఇంజన్-బోగీ వ్యవస్థగా చెబుతారు. అంటే వైద్యవిద్యలో సీటు ఆశించే విద్యార్థి పరీక్షకు హాజరైనపుడు అతడికి అందుబాటులో ఓ తెలివైన విద్యార్థి ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేస్తారు. అతడికి సహకరించేందుకు మరికొందరు విద్యార్థులు చుట్టూ ఉండేలా సీటింగ్ ఉంటుంది. వారంతా కూడబలుక్కుని, బాగా పరీక్ష రాస్తారన్నమాట. ఇక మూడోమార్గం మరీ ఖరీదైన వ్యవహారం. ఇది ఓఎంఆర్ షీటుతో చేసే మోసం. కాస్త తైలం ఖర్చు ఎక్కువన్నమాట. తమకు కావలసిన అభ్యర్థి పరీక్షకు హాజరై ఖాళీ ఓఎంఆర్ షీట్ ఇచ్చేస్తాడు. జవాబు పత్రాలు దిద్దేటప్పుడు తమకు కావలసిన అభ్యర్థికి ఎన్నిమార్కులు వేస్తే సీటొస్తుందో చూసి నిర్ణయిస్తారు. అన్ని ప్రశ్నల జవాబులు ఓఎంఆర్ షీటులో గుర్తించి వాల్యుయేషన్ సమయానికి సిద్ధం చేస్తారు. స్ట్రాంగ్‌రూమ్ నుండి ఓఎంఆర్ షీట్లు బయటకు రావడం, మళ్లీ లోపలికి వెళ్లడం అంతా సాఫీగా సాగిపోతుంది. ఇదికాకుండా, జవాబుల ‘కీ’ని ముందుగానే అభ్యర్థికి ఇచ్చి పని సులభం అయ్యేలా సహకరించడం నాలుగో పద్ధతి. ఇలా 2009 పిఎంటిలో జరగడంతో దాదాపు 300మంది అనర్హులకు వైద్యవిద్యలో ప్రవేశం దక్కింది. ఈ తతంగానికి మూలబిందువు ఒకప్పటి బిజెపి నేత జగదీష్ సాగర్. మధ్యప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన లక్ష్మీకాంత్ శర్మకు అనుంగు శిష్యుడైన జగదీష్ ఇలాంటి అక్రమాలను ఓ వృత్తిగా చేసుకుని నిపుణుడిగా ఎదిగాడు. చివరకు అధికారులను కూడా శాసించే స్థితికి వచ్చాడు. ఈ బురదలో గవర్నర్, ముఖ్యమంత్రికూడా అడుగేశారన్నది ఆరోపణ. ఎస్‌టిఎఫ్ ఆధ్వర్యంలో దర్యాప్తు అధికారులు జగదీష్ శర్మను 2013లో అరెస్టుచేసి అన్ని విషయాలను రాబట్టారు. ఇదొక్కటే కాదు… వ్యాపం పాపంలో ఇదొక అంకం మాత్రమే. ఖరీదైన వ్యవహారం, బాగా డబ్బు పంపకాలు ఉన్నాయి కనుక ఇది వెలుగులోకి వచ్చింది. వ్యాపం సారథ్యంలో జరిగిన మరికొన్ని పరీక్షల్లోకూడా అక్రమాలు జరిగాయని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. 2009 పిఎంటితోపాటు అంతకుముందు, ఆ తరువాత జరిగిన ఐదు సంస్థల ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయని దర్యాప్తులో తేలింది. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సెలక్షన్ టెస్ట్, మిల్క్ ఫెడరేషన్ సెలక్షన్ టెస్ట్, సుబేదార్ ఎస్‌ఐ సెలక్షన్ టెస్ట్, ప్లటూన్ కమాండర్ సెలక్షన్ టెస్ట్‌తోపాటి మరికొన్ని పరీక్షల్లోకూడా పిఎంటి మాదిరిగానే అక్రమాలు జరిగాయి. మొత్తమీద 153మందిపై ఎఫ్‌ఐర్ నమోదైంది. 127మందిని అరెస్టు చేశారు. పిఎంటి ద్వారా అక్రమంగా సీటుపొందినవారిని గుర్తించారు. 2014లో ఇలా వందిమంది ఎంపికైనారు. 2011లో 286మంది ఇలా జొరబడ్డారు. ప్రఖ్యాత ఎంజిఎం మెడికల్ కళాశాలలో ఇలా చేరిన 27మందిని కళాశాల నుండి సస్పెండ్ చేశారు. ఇలా అక్రమంగా వైద్యవిద్యలో అవకాశం పొంది, చదువు పూర్తి చేసి ఉద్యోగాలు చేస్తున్నవారు, ప్రాక్టీస్ చేస్తున్నవారు ఉన్నారు. ఎక్కువగా ఉత్తర్‌ప్రదేశ్, బీహార్‌కు చెందిన సంపన్నులు ఇలా అక్రమాలకు పాల్పడినవారిలో ఉన్నారని తేలింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఎంపి గవర్నర్ పాత్ర ఇందులో ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ విషయానికి ప్రాధాన్యత చోటుచేసుకుంది. ప్రముఖుల అరెస్టు.. కాంట్రాక్టు లెక్చరర్ల నియామకం విషయంలో కూడా ఇలా అక్రమాలు జరిగాయని, ఇందులో అప్పటి విద్యాశాఖ మంత్రి లక్ష్మీకాంత్ శర్మ హస్తముందని ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత కేసు నమోదవడం, అరెస్టు చేయడం మామూలే. తానేమీ తప్పుచేయలేదని, తన పేరుతో తన ఒఎస్‌డి ఒ.పి.శుక్లా అంతా చేశారని ఆయన అంటారు. కాగా, ఒపిశర్మను కూడా ఎస్‌టిఎఫ్ అరెస్టు చేసింది. ఒక్కొక్కరి నుంచి ఆయన 85 లక్షలు వసూలు చేశారన్నది ఆరోపణ. 2012 ఉద్యోగాలు, 2013 పిఎంటి పరీక్షల్లో అక్రమాలకు తెరతీసిన సుధీర్‌వర్మ అనే వ్యాపారవేత్తనుకూడా అరెస్టు చేశారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు చెందిన అనేకమంది నాయకులు, అధికారులు, దళారులకు ఆయన భారీగా ముడుపులు ముట్టచెప్పారన్నది అభియో గం. ఐపీఎస్ అధికారి ఆర్.కె.శివ్హరె, రెవిన్యూ ఉద్యోగి రవికాంత్ ద్వివేది కూడా ఇందులో కీలకపాత్ర వహించారు. ఎసిబి దాడుల్లో ఇతడికి 60కోట్ల అక్రమ ఆస్తి ఉందని తేలింది. ఇక ఈ బాగోతానికి నాయకత్వం వహించిన దళారులు డాక్టర్లు జగదీష్ సాగర్, సంజీవ్ శిల్పాకర్ దాదాపు 400మంది విద్యార్థులకు అవకాశం కట్టబెట్టారు. మొత్తమీద నాలుగైదు బృందాలు విడివిడిగా ఈ బాగోతాన్ని నడుపుతున్నాయి. రాయ్‌గుప్తా బృందం కూడా ఇందులో పాలుపంచుకుంది. ఇక కీలకమైన వ్యవహారం నడిపిందిమాత్రం వ్యాపం అధికారి, ఎగ్జామ్స్ కంట్రోలర్ పంకజ్ త్రివేది. ఈయన ము ఖ్యంగా జగదీష్‌సాగర్‌కు సహకరించారు. వీరిద్దరూ కలసి దాదాపు 300 పైచిలుకు విద్యార్థులకు సహకరించారు. జగదీష్ శర్మ బాగోతం బయటపడిన తరువాత కూడా అతడు సిఫారసు చేసినవారికి మెడకిల్ సీట్లు దక్కేలా పంకజ్ సహకరించారన్నది ఆరోపణ. వ్యాపం అధికారి సికె మిశ్రా కూడా వీరికి చేదోడువాదోడుగా నిలిచారు. ఇదే సంస్థలో కీలకమైన పదవిలో ఉన్న సిస్టమ్స్ ఎనలిస్ట్ నితిన్ మహేంద్ర, అజయ్‌సేన్, ప్రోగ్రామర్ యశ్వత్ పర్నేకర్ వీరికి సహకరించారు. ఇక బయటివారి పాత్ర తక్కువేమీ కాదు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ బంధువులు, గవర్నర్ రామ్‌నరేష్ యాదవ్ సహా పలువురు ప్రముఖులు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు రాష్టస్థ్రాయిలో జరిగిన దర్యాప్తులో వాస్తవాలు బయటికొచ్చాయి. కానీ, దానిని కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో భాగంగా కీలక వ్యక్తులు అసహజంగా మరణిస్తున్నారని, ఇవి హత్యలని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఇప్పుడు ఈ కేసులన్నీ సిబిఐ చేతిలోకి వెళ్లాయి. ము న్ముందు ఏం జరుగుతుందో చూడాలి. కానీ, ఇప్పటివరకు జరిగినవన్నీ చూస్తే వ్యవస్థ ఎంత పాడైందో, అర్హులకు ఎంత అన్యాయం జరుగుతోందో తేటతెల్లమవుతోంది. ‘వ్యాపం’ అంటే… మధ్యప్రదేశ్‌లో 1970లో ఈ సంస్థ ఏర్పడింది. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (ఎంపిపిఇబి) అని ఇంగ్లీషులో పిలిచే ఈ సంస్థను హిందీలో ‘వ్యావసాయక్ పరీక్షామండల్’ అని పిలుస్తారు. దీనిని సంక్షిప్తంగా ‘వ్యాపం’ అని సంబోధిస్తున్నారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అవినీతి బాగోతంతో దీని అందరి నోళ్లలో నానుతోంది. దీనికి సాంకేతిక విద్యాశాఖ మంత్రి సారథ్యం వహిస్తారు. పరీక్షల నిర్వహణకు ఓ అధికారి కంట్రోలర్‌గా వ్యవహరిస్తారు. తొలి మరణం.. నమ్రత మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న నమ్రత ఆకస్మిక మరణం- వ్యాపం కుంభకోణంలో తొలి అనుమానాస్పద మరణంగా చెబుతారు. మూడేళ్లక్రితం ఆమె- తాను చదువుతున్న కళాశాలకు దూరంగా ఉజ్జయినిలో రైల్వేట్రాక్‌పై శవమై కన్పించింది. అప్పట్లో కేసు దర్యాప్తు చేశారు. ఆ తరువాత కేసు మూసేశారు. కాగా, ఈ మధ్య వ్యాపం కేసులో కీలకవ్యక్తుల మరణాలు ఎక్కువకావడంతో మళ్లీ నమ్రత వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ కేసును మళ్లీ తెరిచి దర్యాప్తు మొదలెట్టారు. ఆమె తల్లిదండ్రులతో ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన జర్నలిస్టు కూడా మరణించడం అనుమానాలను మరింతగా పెంచింది. ‘ప్రాణాంతక’ కుంభకోణం..! భారీగా ప్రభుత్వ నిధుల్ని స్వాహా చేయడం, అంచనాలకు అందని అవినీతి వ్యవహారాలు.. అధికార దుర్వినియోగం, అక్రమ పద్ధతులు, ఆశ్రీత పక్షపాతం.. ఇలాంటి మాటలన్నీ ఏదైనా ‘కుంభకోణం’ జరిగినపుడు వాడే సాదాసీదా మాటలు.. అయితే- మన దేశ చరిత్రలోనే ఇది ‘ప్రాణాలు తీసే’ భయంకర కుంభకోణం.. వృత్తి విద్య కోర్సులకు ఎంట్రన్స్‌లను, ఉద్యోగ నియామక పరీక్షలను నిర్వహించే సంస్థలో నడిచిన అక్రమాలు ప్రాణాలను బలితీసుకోవడం యావత్ దేశానే్న హడలెత్తిస్తోంది. మధ్యప్రదేశ్‌లో ఉన్నత చదువుల్లో ప్రవేశాలకు, ఉద్యోగ నియామకాలకు పరీక్షలను నిర్వహించే ‘వ్యాపం’ (వ్యావసాయిక్ పరీక్ష మండల్) సంస్థలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలోనే అసహజ మరణాల సంఖ్య నానాటికీ పెరగడం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మృతుల్లో దళారులు, పరీక్షలు రాసిన నకిలీ విద్యార్థులు, అక్రమ పద్ధతుల్లో కశాశాలల్లో సీట్లు పొందినవారు, అక్రమంగా ఉద్యోగుల్లో చేరినవారూ ఉన్నారు. అసహజ మరణాలతో పాటు ‘వ్యాపం’ కుంభకోణంలో వాస్తవాలను వెలికితీసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్), ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయగా, ఇప్పటివరకూ ఈ కేసుకు సంబంధించిన మరణాలపై దర్యాప్తును సిబిఐకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ‘వ్యాపం’ నేర చరిత్ర… 1982: డిమాండ్ ఉన్న వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్‌లను నిర్వహించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘వ్యాపం’ను ఏర్పాటు చేసింది. 1995: ఎంట్రన్స్‌ల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలకు బీజం పడింది. 2008: ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలకు రాత పరీక్షలు నిర్వహించే బాధ్యత ఈ సంస్థకే అప్పగించారు. 2009: ఉద్యోగ నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు పలు ఉదంతాలు వెలుగు చూశాయి. 2009: మెడికల్ ఎంట్రన్స్ ప్రశ్నపత్రం ‘లీక్’ కావడంతో తొలి కేసు నమోదు. డిసెంబర్, 2009: మెడికల్ ఎంట్రన్స్ పేపర్ లీక్‌పై విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం. జూలై 7, 2013: పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి 20 మంది నిందితులను అరెస్టు చేశారు. జూలై 16, 2013: అక్రమాల్లో కీలక పాత్ర పోషించిన మధ్యవర్తి జగదీష్ సాగర్ అరెస్టు. ఆగస్టు 26, 2013: ప్రత్యేక టాస్క్ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) విచారణ బాధ్యతలు చేపట్టి 55 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. అక్టోబర్ 9, 2013: వృత్తి విద్య కోర్సుల్లో చేరిన 345 మంది విద్యార్థుల ప్రవేశంపై అనర్హత. డిసెంబర్ 18, 2013: మాజీ సాంకేతిక విద్యాశాఖ మంత్రి లక్ష్మీకాంత్ శర్మపై కేసు నమోదు. నవంబర్ 5, 2014: ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందం (ఎస్‌టిఎఫ్) పనితీరుపై పర్యవేక్షణకు మాజీ న్యాయమూర్తి చంద్రేశ్ భూషణ్‌లో నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు. జూన్ 29, 2015: ‘వ్యాపం’ కుంభకోణానికి సంబంధించి 23 అసహజ మరణాలు చోటుచేసుకున్నట్లు ‘సిట్’ ప్రకటించింది. అయితే, మృతుల సంఖ్య 46 దాటిందని అనధికార వర్గాల ఆరోపణ. జూలై 7, 2015: కుంభకోణంపై సిబిఐ విచారణకు సిద్ధమేనని ముఖ్యమంత్రి ప్రకటన. జూలై 9, 2015: సిబిఐ విచారణకు ఆదేశిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు. మరణాల ‘మిస్టరీ’..! ‘వ్యాపం’ కుంభకోణంతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉన్నవారిలో కొందరు అనూహ్య పరిస్థితుల్లో మరణించడం అంతుచిక్కని చిక్కుముడిగా మా రింది. మధ్యవర్తులు, పరీక్షలు రాసిన నకిలీ విద్యార్థులు, అక్రమంగా సీటు సంపాదించిన విద్యార్థులు, నియామకాలు పొందిన ఉద్యోగులు, కీలక బాధ్యతల్లో ఉన్న ప్రభుత్వోద్యోగులు, కొందరు అధ్యాపకులు సైతం మృతుల జాబితాలో ఉన్నారు. గవర్నర్ రామ్‌నరేష్ యాదవ్ తనయుడు శైలేష్‌యాదవ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈయన కనీసం పదిమందికి సిఫార్సు చేశారన్నది అభియోగం. ‘టాస్క్ ఫోర్స్’కు సహకరిస్తున్న ఓ వైద్య కళాశాల డీన్ అరుణ్ శర్మ, పాత్రికేయుడు అక్షయ్ సింగ్, శిక్షణ పొందుతున్న సబ్ ఇన్స్‌పెక్టర్ అనామిక, కానిస్టేబుల్ రమాకాంత్ పాండే, వైద్య విద్యార్థిని నమ్రత.. ఇలా మృతుల సంఖ్య 46కు పైమాటేనని అనధికార అంచనా. కాగా, విపక్ష కాంగ్రెస్ నాయకులు మాత్రం ‘వ్యాపం’ కుంభకోణంలో 150కి పైగా అసహజ మరణాలు చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. ఎక్సెల్ షీట్లలో రహస్యం వ్యాపం కుంభకోణంలో లబ్ధిదారులు, అందులో పాలుపంచుకున్న వారి వివరాలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని అక్రమార్కులు తమ తమ కంప్యూటర్లలో నిక్షిప్తం చేశారు. వారిలో కొందరు ఎక్సెల్ షీట్లలో వారి వివరాలు పొందుపరిచారు. ఆ షీట్ల ఫైల్‌నేమ్స్ మాత్రం ఆసక్తిరేపేవిగా ఉన్నాయి. ఒక నిందితుడు మంత్రిణి అని ఎక్సెల్ ఫైల్‌కు పేరు పెట్టారు. అందులో చాలామంది లబ్ధిదారుల పేర్లున్నాయి. మంత్రిణి అన్న పదానికి అర్థాన్ని ఇప్పుడు దర్యాప్తు సంస్థలు శోధిస్తున్నాయి. ఈ బాగోతంలో ఓ మహిళ కీలకపాత్ర వహించి ఉండవచ్చని లేదా మంత్రులు, గవర్నర్, సిఎంలకు చెందిన వర్గాల్లో మహిళలు ఎవరైనా అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇక ఈ కేసులో దర్యాపు చేస్తున్న సిబ్బందివద్ద ఉన్న ఎక్స్‌ఎల్‌లో అన్ని వివరాలు ఉన్నాయని, వాటిని దాచిపుచ్చుతున్నారని, ఆ దర్యాప్తు సంస్థతో పనిచేసి, ఆ తరువాత దూరమైన ఐటీ నిపుణుడు పాండే ఆరోపించారు. మొత్మమీద ఎక్సెల్ షీట్లలో రహస్యాలు బయటికొస్తే ఈ కేసు త్వరగా పరిష్కారమవుతుందని భావించవచ్చు. చీకటి కోణాన్ని ఛేదించినది వీరే.. ఎన్ని బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదురైనా ముగ్గురు వ్యక్తులు సాహసోపేతంగా వ్యవహరించడంతో ‘వ్యాపం’ కుంభకోణం గుట్టురట్టయ్యింది. ఇండోర్‌కు చెందిన సమాచారహక్కు చట్టం కార్యకర్త ఆనంద్ రాయ్ ‘వ్యాపం’ బాగోతంపై న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వాజ్యం (పిల్) దాఖలు చేయడంతో డొంకంతా కదిలింది. ఆయన కేసు వేశాకే ఈ కుంభకోణంపై మొదట దర్యాప్తు మొదలైంది. తనను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయంటూ ఆనంద్ రాయ్ 2013లో కోర్టును ఆశ్రయించడంతో ఆయనకు భద్రత కల్పించారు. గ్వాలియర్‌కు చెందిన 26 ఏళ్ల సామాజిక కార్యకర్త ఆశిష్ చతుర్వేది ‘వ్యాపం’ వ్యవహారంలో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ బంధువుతో పాటు మొత్తం ఎనిమిది మంది ప్రమేయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై మూడు సార్లు హత్యాయత్నం, ఒకసారి కిడ్నాప్‌కు ప్రయత్నాలు జరిగాయి. 2003-2013 మధ్య వైద్యవిద్యలో సుమారు 5వేల మంది అక్రమంగా ప్రవేశాలు పొందారని ఆయన ఆరోపిస్తూ కోర్టుకెక్కారు. అక్రమార్కుల నుంచి బెదిరింపులు రావడంతో ఆశిష్‌కు ప్రాణహాని కలగకుండా భద్రతను ఏర్పాటు చేస్తూ న్యాయస్థానం గన్‌మెన్లను నియమించింది. గ్వాలియర్ వీధుల్లో ఆశిష్ సైకిల్‌పై తిరుగుతుంటాడని, ఎకె-47 రైఫిల్స్‌ను పట్టుకుని ఆయన వెంట పరుగెత్తడం తమకు ఇబ్బందికరంగా మారిందని ఆ గన్‌మెన్లు కోర్టుకు తెలియజేశారు. ఈ కేసు దర్యాప్తులో టాస్క్ఫోర్స్ నియమించిన ఐటి నిపుణుడు ప్రశాంత్ పాండే ‘వ్యాపం’లో సాక్షాత్తూ ముఖ్యమంత్రి చౌహాన్ హస్తం ఉందని పేర్కొన్నారు. తొలుత- టాస్క్ఫోర్స్ సేకరించిన ఆధారాలను చూపెడుతూ కొంతమంది నిందితులను బెదిరించాడన్న ఆరోపణలపై పాండేను గత ఏడాది అరెస్టు చేశారు. విచారణాధికారులు సాక్ష్యాలను తారుమారు చేసి, ముఖ్యమంత్రి చౌహాన్‌ను కాపాడేందుకు యత్నిస్తున్నారని ఆ తర్వాత పాండే ఆరోపించం సంచలనం సృష్టించింది. ‘ఎక్సెల్ షీట్’కు సంబంధించి సమాచారాన్ని బహిర్గతం చేశాడన్న అభియోగంపై ఆయనపై పోలీసులు కేసు పెట్టారు. తనను పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలన్న ఆయన అభ్యర్థనను దిల్లీ హైకోర్టు మన్నించి అందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేసింది. కాగా, ‘వ్యాపం’ కుంభకోణంలో ఇంతవరకూ అయిదు శాతం దర్యాప్తు మాత్రమే జరిగిందని పాండే చెబుతుండడం గమనార్హం. ఈత వచ్చిన మహిళా ఎస్‌ఐ ఎలా మునిగింది? సబ్ ఇన్స్‌పెక్టర్‌గా శిక్షణ పొందుతున్న అనామిక సికర్వార్ మృతదేహం సాగర్ జిల్లాలోని ఓ చెరువులో లభించడం అనేక అనుమానాలకు దారితీసింది. ‘వ్యాపం’ ద్వారా గత ఏడాది ఎస్‌ఐ పోస్టుకు ఎంపికైన అనామిక జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి అని, ఈత బాగా తెలుసునని, ఆమె చెరువులో పడి ఎలా మరణిస్తుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంలో అర్థం లేదని వారు వాదిస్తున్నారు. ఈ నెల 20న తొలి వివాహ వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవాలని చెప్పిన అనామిక అర్ధంతరంగా ఎందుకు ప్రాణాలు తీసుకుంటుందని ఆమె భర్త రవి ప్రశ్నిస్తున్నారు. పైగా ఈమె ఎంపికలో ఎలాంటి అవకతవకలకు లేకుండా మెరిట్ ప్రకారమే జరిగింది. అలాగే, పోలీసు క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ రమాకాంత్ పండా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు ప్రకటించడాన్ని కూడా ఆయన కుటుంబీకులు విశ్వసించడం లేదు. ‘వ్యాపం’ కుంభకోణానికి సంబంధించి టాస్క్ఫోర్స్ బృందం ప్రశ్నించిన తర్వాత పండా మరణం చోటుచేసుకోవడంతో అనుమానాల సెగలు చెలరేగాయి. *

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సుమదురగాయకుడు రామకృష్ణ

rk 001201507170717023837124

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కొత్త రాజధాని అమరావతి మోడల్

 


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మానవీయ కోణం లో భావోద్వేగాల ఆవిష్కరణ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోదావరి పుష్కర యాత్ర : రావులపాలెం , కోటిపల్లి , ద్రాక్షారామం ల దర్సనం

మేమిద్దరం ,మా అన్నయ్యగారి  అబ్బాయి రాంబాబు ,మా మూడవ కోడలు రాణి,మనవడు చరణ్,మనవరాలు రమ్య ఆరుగురం ఉదయం అయిదున్నరకు కారులో బయల్దేరి తేలప్రోలు దాకా వెళ్లి అక్కడ హైవే ఎక్కి ,సరాసరి రావులపాలెం వెళ్ళాము అక్కడ ”వశిష్ట ” గోదావరి  లో పుష్కర స్నాలు చేశాము  మంత్రం  చెప్పే బ్రాహ్మణులు ఒకరిద్దరే ఉండటం తో నేనుఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ఉచితంగా అందజేసిన   పుష్కర స్నాన మంత్రాల పుస్తకాన్ని ఉయ్యూరు నుంచి నా వెంట తీసుకొని వెళ్ళిన పుస్తకం ప్రకారం మావాల్లందరి స్నాన విధి చేయించి గోదావరినదికి ,పుష్కరునికి ,బృహస్పతి మొదలైన వారందరికీ అర్ఘ్యాలు ఇప్పింఛిపుష్కర గోదావరీ మహా స్నానం చేయించాను మాతో పాటు   గోదావరి పుష్కర యాత్ర : రావులపాలెం , కోటిపల్లి , ద్రాక్షారామం ల దర్సనం

స్నానం చేసినవారికీ అలాగే చేయించాను ఽతర్వాథ ఆపుస్తకం ఆధారంగా మా రాంబాబు మా దంపతులిద్దరి చేత పుష్కర స్నానం అర్ఘ్యాలు చేయించాడు .ఆడవారు  గోదారితల్లికి హారతులిచ్చారు .కారు ఆపిన ప్రదేశానికి ,స్నాన ఘట్టానికి పెద్దాగా నడవాల్సిన దూరం లేదు హాయిగా ఉంది నీటి ప్రవాహమూ బాగా ఉంది .సంతృప్తిగా పుష్కర స్నానాలు చేశాము అందరం ఏంతో సంతోషించాము రద్దీ లేదు ప్రశాంతంగాఉంది  నదినుండి కారు దగ్గరకు చేరి కారెక్కిఆలమూరు ” గౌతమి” గోదావరి బ్రిడ్జి దాటి దారిలోచెట్టునీడన  ఆగి  ఉయ్యూరు నుంచి తెచ్చుకొన్న ఇడ్లీలు డ్రైవర్ తో సహా అందరం హాయిగా తిన్నాం .ఉయ్యూరులో బయల్దేరేతప్పటికే నాకు ఎందుకో విపరీతమైన నీరసం గాఉంది అయినా బయల్దేరాను . టిఫిన్ తర్వాత ఆలమూరు మండపేట లమీదుగా కోటిపల్లి చేరాము అసలు  పేరు”కోటి ఫలి”అదే కోటిపల్లి అయింది ఆంటే  ఇక్కడ” గౌతమీ  ”గోదావరి లో స్నానం చేసినా దానం ఇచ్చినా ,పిండప్రదానం చేసినా మామూలు పుణ్యం కంటే కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది అని విశ్వాసం .ఇదివరకు రెండు సార్లు వచ్చాం ,ఇక్కడ నది ఒడ్డున చంద్రుడు ప్రతిష్టించిన సోమేశ్వర మహాలింగం చిన్నదేకాని మహా మహిమాన్వితమైనది .కొటిపల్లి రేవు చాలా ప్రసిద్ధం. రవాణాకు ముఖ్యమైన రేవు .ఇక్కడి నుంచిలాంచీలో వెళ్లి ”ముక్తేశ్వర0 ”వెళ్లి అక్కడ ”క్షణ ముక్తేశ్వర స్వామిని”దర్శిస్తే మోక్షం లభిస్తుందని నమ్మక0 అక్కడ ”ఒక్క క్షణం ”ఉంది శివుని దర్శిస్తే క్షణం లోనే మోక్షం ఖాయం అందుకే క్షణ ముక్తేశ్వరం అనే పేరొచ్చింది .ఇప్పుదు వెళ్ళలేదు ఇదివరకో సారి వెళ్లాం

— కోటి పల్లి సినిమా షూటింగ్ లకు ప్రత్యేకం అక్కడున్న చెట్టు చూస్తె ఇదే కోటిపల్లి అని గుర్తించవచ్చు బాపు అందాలరాముడు ,ముత్యాలముగ్గుసినిమాలకు అందాన్ని పెంచింది ఈ కోటిపల్లి రేవే వంశీ మొదలైన దర్శకులందరూ ఈప్రా౦తపు అందాన్ని సేల్యులాయిడ్ పైకి ఎక్కించి సార్ధకం చేశారు  .ఇక్కదా గౌతమీ నది అఖండంగా నిండుగా ఒదాలు పులకరింత గా ఉంది గొప్ప వాహిని

  కోటి పల్లిలో రేవుదగ్గర ఒక బ్రాహ్మణుడు కనిపిస్తా ఆయనతో పుష్కర స్నాన విధి చెప్పించుకొని అందరం మహా ఆనందంగా  మహా సంతృప్తిగా మహా పుణ్యం లభించేట్లు భక్తీ శ్రద్ధలతో స్నానాలు చేసి అర్ఘ్యాలు విడిచి జన్మ సార్ధకం చేసుకోన్నాం . పుష్కరుడు మిట్టమధ్యాహ్నం పన్నెండు నుంచి రెండుగంటలవరకు పుష్కరనది లో ఉంటాడని మూడుకోట్ల మంది దేవతలు అదేసమయం లో పుష్కరగోదావరి లో  స్నాలాలు ఆచరిస్తారని పురాణాలు చెబుతున్నాయి మేము  సరిగ్గా పన్నెండున్నరకు  పుష్కర స్నానం చేసి పుష్కర సన్నిధిలో  దేవతలతో కలిసి స్నానం చేసి ధన్యులమైనాము  నిన్న అమావాశ్య ఘడియలు వెళ్లి నిజ ఆషాఢంవచ్చింది.ఉత్తరాయణ పుణ్యకాలమూ ఉంది .ఇవాల్టినుంచి సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటాడు .అంటే దక్షిణాయణ పుణ్యకాలం వచ్చిది అన్నమాట . ఇక్కడ ఏర్పాట్లు కూడా పకడ్బందీగా ఉన్నాయి .పి౦డ ప్రరాదనం చేసే ఘట్టాలు వేరుగా స్నాన ఘట్టాలు వేరుగా ఉన్నాయి .నాకు బాగా నీరసంగా ఉండటం నా ఒళ్ళు నా స్వాధీనం లో ఉండక పోవటం  పైపెచ్చు నీరసానికి విరుగుడుగా ఇడ్లీలు తినటం తో పిండ ప్రదానం చేయలేదు అదొక్కటే లోపం .ఇంకా చాలా రోజులున్నాయి కనుక ఎప్పుడో అప్పుడు లేక అంత్య పుష్కరాలలో చేయచ్చు అనుకొన్నాము’.పన్నెండేళ్ళ క్రితం గోదారి పుష్కరానికి తెలంగాణాలోని కాళేశ్వరం ,ధర్మపురి కి  మేమిద్దరం మా వియ్యపురాలు ఆదిలక్ష్మిగారువెళ్లి స్నానాలు చేశాం అప్పుడూ పిండప్రదానం చేయలేదని గుర్తు .
  కోటి పల్లిలో   మా కార్లు ఆపేసి పార్కింగ్ చేసిన చోటు నుండి సుమో వాహనాలలో రేవుకు ఒక అరకిలో మీటర్ దూరం వరకూ ఉచితప్రయాణం  ప్రభుత్వం చేసింది దాన్ని బాగా నిర్వహిస్తున్నరు.ఆడవాళ్ళు కోటిపల్లి రేవు దగ్గరా ఉన్న చెట్టుకింద ఉయ్యూరునుంచి తెచ్చుకోన్నఅరటి దోప్పలలో   ఆవునెయ్యిదీపాలు వెలిగించి నమస్కారాలు చేశారు . దారిలో ఉన్న సోమేశ్వరస్వామి ని దర్శిద్దామనుకొంటే ,గుడి మూసేశారని ఒక గంటకు కాని తెరువారని చెబితే దర్శనం చేయకుండానే నడిచి ఉచిత సుమో ఉపయోగించకొని ,మళ్లీ మా కారు దగ్గరకు చేరాం  ,రమ్య దమ్ములేక మాతో కోటిపల్లి రాకుండా కారులో పడుకోంది.
  కారెక్కి కొంతదూరం ప్రయాణం చేసి దారిప్రక్కన ఒక ఇంటి వసారాలో ఇంటివారి సహకారం తో అందరం డ్రైవర్ తోసహా  పులిహోర ,వెజిటబుల్ బిర్యాని(మసాలా లేకుండా)పెరుగన్నమ నే దధ్యోజనం కడుపు నిండా మెక్కాం  నేనేమీ తినలేకపోయాను మళ్ళీ  కారెక్కి  ”దాక్షారామ’చేరాం రెండుగంటలకు. మా ఇద్దరికీ ఒపికలు లేక నేను కాలు తీసి కాలు పెట్టె శక్తిలేక కారులో కూచుని మిగిలిన వారిని శ్రీభీమేశ్వరస్వామిదర్శనానికి పంపాము మేమిద్దరం రెండుమూడు సార్లు దర్శించాం లేటెస్ట్ గా మే ఇరవై ఏడు న కూడా సందర్శించం మా రమణతో సహా  .జనమ్ విపరీతంగా ఉండటం వలన దాదాపు రెండున్నర  గంటలకు దర్శనం చేసుకొని వాళ్ళు వచ్చారు .
సాయంత్రం అయిదున్నరకు కారెక్కి రాజమండ్రి వెళ్లి పుష్కర శోభ చూద్దాం అనుకొన్నాం .కాని ఎక్కడ రాజమండ్రిలో దిగనా కనీసం రెండుకిలోమీటర్లు నడవాలని చెప్పారు . సరే అని రాజమండ్రి అయినా చూడచ్చు బ్రిడ్జి పైన అయినా గోదావరీమాత దర్శనం రాత్రి దీపశోభ ,నదీమ తల్లికిఇచ్చే మహా హారతి చూడచ్చు అనుకొన్నాం…బ్రిద్డ్జి మీదకు కూడా కార్లను అనుమతి0చ నందువల్ల రాజమంద్రినుంచి సరాసరి బైపాస్ రోడ్డు ద్వారా  జంక్షన్ ,గన్నవరం కంకిపాడు ద్వారా రాత్రి పదిన్నరకు ఉయ్యూరు చేరుకొన్నాం . దాదాపు అయిదు గంటలు నాన్ స్టాప్ గా  డ్రైవ్ చేశాడు .డ్రైవర్ సతీష్ .యెసి కారుకావటం కారుకూడా కండిషన్ లో ఉండటం వలన ప్రయాణపు అలసట లేదు .సమర్ధం గా  వేగంగా  చాకచక్యం గా  నడిపాడు మేము తిన్నదే అతనికీ పెట్టటం దానికే ఎంతో సంతోషించి ”నా కడుపు నిండా భోజనం పెట్టారు అమ్మగారు   ‘అని చెప్పాడట రమణ తో  ‘
  ఇంటికి వచ్చి కొద్దిగా మజ్జిగ తాగిపడుకొన్నా నిద్రబాగానే పట్టింది .ఉదయమే లేచి దంతదావనంతర్వాత  మళ్ళీ  పడక  సీను  .యెలాగొఅలాగా వేడినీళ్ళ స్నానం చేసి    దేవుడికి దణ్ణం మాత్రమె పెట్టుకొని సంధ్యవార్చకుండా ఒకటిన్నర ఇడ్లీ నంజి   మంచం పైకి చేరాను ఇవాల్టి పూజను మా శ్రీమతినే కానిమ్మన్నాడు మా  మనవడు వాళ్ళ ”డాక్టర్ బాబు ”నడిగి నా విషయం చెప్పి టాబ్లెట్లు తెచ్చి మింగించాడు .ఒకటి  వేసుకోగానే ,గొప్ప రిలీఫ్ ఇచ్చ్సింది మళ్ళీ  మంచం శరణం గచ్చామి. మాంచి నిద్రపట్టింది పావుతక్కువ రెండింటికి కంచం ముందు కూచుని ఏదీ సహించక ఏదో ఇంతకతికాను .మళ్ళీ పాన్పు సీను అయిదింటికి  లేచి మెయిల్స్ చూసి మా ”పుష్కర యాత్ర ”రాయటం మొదలు పెట్టాను .ఇంతసేపు  కూర్చుని ఎలా రాశానో నాకే ఆశ్చర్యంగా ఉంది .ఇది ముమ్మాటికీ” గోదావరి మహా పుష్కర ప్రభావమే ‘ఆ  పుష్కరజలాలో పవిత్రత తో బాటు ఆ నీటిలో ఉన్న కరెంట్ మనల్ని అమిత ఆరోగ్య వంతుల్ని చేస్తుంది .దీనికి నేనే సాక్ష్యం మా కుటుంబమే సాక్ష్యం మా శ్రీమతికి ఇలా ప్రవాహ జలస్నానం చాలా ఇష్టం తన ఆరోగ్యం వెయ్యి రెట్లు పెరుగుతుందని భావిస్తుంది .మీ శ్రీమతి సత్యవతి గారికి గోదావరిమాత సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకొంటున్నాం సీసాలలొ పుష్కరజలాలు సమృద్ధిగా తెచ్చుకోన్నాం మా గుడిలోని భక్తులకు మా పిల్లలకు మిగిలిన వారికీ..దాదాపు నిన్న రాను పోను    ఆరు వందల కిలో మీటర్లుప్రయాణం చేశాం ”జై మహా పుష్కర గొదావరి  మాతాకూ జై ”

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -17-7-15-ఉయ్యూరు
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వైభవ జనపుష్కర గోదారి


 
 
 
 


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శభాష్ భారత్ మరి కొన్ని ఆధ్యాత్మిక విషయాలు


 
 
 
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పుష్కరాలు – బందా

img159

Posted in కవితలు | Tagged | Leave a comment

గోదావరి పుష్కర యాత్ర : రావులపాలెం , కోటిపల్లి , ద్రాక్షారామం ల దర్సనం

గోదావరి పుష్కర యాత్ర : రావులపాలెం , కోటిపల్లి , ద్రాక్షారామం ల దర్సనం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -65

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -65

28-మానవత్వాన్ని మాత్రమే  చిత్రించిన మహోన్నత చిత్రకారుడు -విన్సెంట్ వాన్ గో(Vincent Van Gogh-2

ఇరవై అయిదేళ్ళ వయసు లో విన్సెంట్ జీవితం లో తాను విఫలమయ్యానని అనుకొన్నాడు .ఆర్ట్ డీలర్ గా ,టీచర్ గా ,మత బోధకుడుగా ఫైల్యూర్ .దేనిలో చెయ్యి పెట్ట్టినా మసే .ఉద్యోగం లేకుండా ఉండటమే అలవాటు చేసుకొన్నాడు .చివరికి ఆర్టిస్ట్ అవాలనే భావం నిశ్చయమైంది .తన ధైర్యాన్ని ఒక మీడియం లో అందునా  చిత్ర లేఖనం లో చూపించాలనుకొన్నాడు .తన జీవితానికి కృతజ్ఞత కూడా చూపించాలనుకొన్నాడు .వెంటనే పెయింటింగ్ ప్రారంభించలేదు .సంగీతం ఇచ్చే మానసికోల్లాసం లాగా పెయింటింగ్ కూడాఇవ్వాలి అనుకొన్నాడు  .అసలే శూన్యం ఆవహించిన ప్రపంచం లో ఏదో దైవ విభూతిని దర్శింప జేయాలనుకొన్నాడు .చివరికి ఏదో ఒకటి గీసేవాడు అవి ఆకర్షణగా ఉండేవికావు .చిన్నపిల్లల పిచ్చి గీతల్లా అనిపించాయి .’’మాన్యూల్ ఆఫ్ డిజైన్ ‘’అనే గ్రంధం చదివాడు .’’సైన్స్ ఆఫ్ అనాటమీ’’చదివి వ్యాపార దృష్టిని వదిలి చిత్రాలు వేశాడు .మిల్లెట్ చిత్రాలను చాలా కాపీలు చేశాడు .అతని సోఎర్ ,మాన్ విత్ ది హో ,గ్లీనర్స్ మొదలైన రైతు కుటుంబ సంబంధ చిత్రాలను కాపీ చేశాడు .

విన్సెంట్ తాను గొప్ప చిత్రకారుడు అనిపించు కోవాలనే ఆలోచనలో లేడు.కష్టజీవుల ముఖ కవళికలు చిత్రించాలన్న ఆరాటమే ఆయనది .వారిలో తానూ ఒకడినే అనే భావనలో ఎప్పుడూ ఉండేవాడు .చాలాకాలం తర్వాత చలికాలం లో తలిదండ్రుల్ని చూడటానికి వెళ్ళాడు.అప్పుడే ఒక బంధువులమ్మాయి వారింటికి వచ్చింది విన్సెంట్ కంటే పెద్ద పిల్ల .ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పేశాడు .ఆమె నిరుత్సాహ పరచింది .ఆమెను అనుసరించి ఆమ్ స్టర్ డాం కు వెళ్ళాడు .ఆమె తలిదండ్రులు మరీ మొండిగా ఇతన్ని ఆమెతోమట్లాడటానికే ఒప్పుకోలేదు  ఆయిల్ లాంప్ మీద చెయ్యిపెట్టి విన్సెంట్ కనీసం ఒక్కసారైనా ఆమెను చూడాలని కోరాడు .చెయ్యి కాలిపోయింది కాని ప్రయత్నం ఫలించలేదు .ఈ రకం గా రెండవ సారికూడా ప్రేమ విఫలమైంది .తనకుటుంబం వారి సానుభూతి కూడా పొందలేక పోయాడు .తమ్ముడు థియో మాత్రమే అన్నకు విశ్వాసం గా ఉన్నాడు .

హేగ్ కు వెళ్లి మావే అనే బంధువు దగ్గర పెయింటింగ్ నేర్చుకొన్నాడు .అతడు లాండ్ స్కేప్ పెయింటింగ్ లో సిద్ధ హస్తుడు .మావే విన్సెంట్ తో బ్రష్ పట్టించి ఆయిల్ పెయింటింగ్ నేర్పించాడు .స్టిల్ లైఫ్ చిత్రాలు గీయటం నేర్పాడు .ఇంటిలోని వస్తువులను చిత్రించటం అలవాటు చేశాడు .తమ్ముడు డబ్బు పంపి సాయం చేస్తున్నాడు .ఒక మోడల్ ను డబ్బుతో కుదుర్చుకొని పెయింటింగ్ సాగించాడు .అడుక్కునే వాళ్ళను వేశ్యల్ని  కూలీలను మోడల్స్ గా చేసి చిత్రాలు వేశాడు .

ఒక వేశ్యను మోడల్  గా చేసుకొని చిత్రాలు గీస్తూ ప్రేమలో పడ్డాడు మూడోసారి .ఆమె కాదన లేదు .ఆమెకు అప్పటికే ఒకకొడుకు ,మళ్ళీ గర్భిణీ .ఆమె చాలా ముతక ,రోగిష్టి ,వికారి చుట్టలు తాగేది .ముప్ఫై ఏళ్ళ మనవాడు ఆమెను పెళ్లి చేసుకొంటానని చెప్పి మురికి కూపం లాంటి ఆవాసం లోంచి మార్పించి తెచ్చుకొన్నాడు. కొన్నిరోజులు సంతోషంగానే గడిపారు .నెమ్మదిగా ఆమెతో మాట్లాడటం మానేశాడు .వారిద్దరికీ విషాదకర జేవితం తప్ప ఏమీ పోలికలు లేవు .నిరక్షర కుక్షి ఆమె .విన్సెంట్ స్నేహితులు అతనితో గడపటానికి వస్తే తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని అనుకొనేది .ఆమె తల్లి పరిస్తితిని మరీ దారుణంగా మార్చింది .ఈ ఒంటరి జీవితం కంటే మురికి వాడలో బ్రోతేల్ హౌస్ జీవితమే మేలు అని నూరిపోసేది తల్లి .క్రమంగా మనవాడి నుంచి జారుకొని పాత జీవితం లో ప్రవేశించింది .మళ్ళీ విన్సెంట్ వాన్  గో ఒంటరివాడయ్యాడు .

షేక్స్పియర్ ‘’రైపెంస్ ఈజ్ ఆల్ ‘’అనే కవితకు ‘’ఎమోషన్ ఈజ్ ఎవిరి థింగ్ ‘’అన్నది కలిపాడు .ప్రతి వస్తువులోను ఎమోషన్ నే చూశాడు .తారసపడిన ప్రతివాడిలోనూ ,ముట్టుకున్న ప్రతిదాంట్లోను ఎమోషన్ నే దర్శించాడు .పైకికనిపించేదికాకుండా అంతరాన్తరాల్లోకి చొచ్చుకుపోయి ,జీవి.త పరమార్ధాన్ని గ్రహించాడు .గురువు మావే చూడని దాన్ని శిష్యుడు విన్సెంట్ చూసి గురువుకే కళ్ళు తిరిగేట్లు చేశాడు .కాని ఇంకా రంగులలోని మిస్టరీని చేదించలేక పోయాడు .వాటిలోని రహస్యాలను గ్రహించాడు .ఆకురాలుకాలం లోని సూర్యాస్తమయాన్ని చిత్రించి తమ్ముడికి విషయం తెలియ జేస్తూ ‘’the main thing is to get the depth of color,the enormous source and solidly of the ground .,I did not realize until I came to paint how much light even in the dark parts .I had to catch the light  yet convey the depths of solid ;;అని తెలియ జేశాడు .చెట్లను వాటి వ్రేళ్ళను ట్యూబ్ లద్వారా సారాన్ని లాగి ,బ్రష్ తో మోడల్స్ గా చిత్రించాడు  .అతని చిన్నారి చెట్లు నిటారుగా వ్రేళ్ళవలన  స్తిరంగా నిలబడి ఉండేవి .

విన్సెంట్ తలిదండ్రులు న్యునేన్ లోని బాబంట్ గ్రామానికి మారారు .ఆ ఇంట్లో వాషింగ్ రూమ్ లోనైనా తనకు చోటు కలిపిస్తే ,చిత్రాలు వేసి బతుకుతానని బతిమాలాడు .మట్టిమనిషిగా ఉందామనుకొన్నాడు .చోటిచ్చారు .దున్నిన పొలాలను ,మట్టికోట్టుకొని పోయిన పూరి గుడిసేలని ,మగా ఆడ చేసే త్రావ్వకాన్ని ,నేత నేస్తున్న కార్మికుడిని ,సాయంకాలం అన్నం తింటున్న శ్రామిక జనాలను చిత్రించాడు ఈ మట్టిమనుషులు మట్టి రంగులో ,సంసార పక్షంగా ,తాము తినే మట్టిలోని బంగాళాదుంప ల్లాగా ఉన్నట్లు చిత్రించాడు .వాళ్ళ దుస్తులలో హావ భావాలలో ఒరిజినాలిటి తెచ్చాడు .ఇదంతా శ్రామిక జన కళ్యాణ దీక్ష .తనలాగే తిరస్కృత అయిన తన కన్నా పెద్దదైన ఒకావిడ తో స్నేహం చేసి తన బాగోగులు చూడటానికి ఏర్పాటు చేసుకొన్నాడు .సోమరి అని భావించి దమ్మిడీసంపాదన లేని వాన్ తో ఉండటం ఇష్టం లేక ఒకసారి చంపే ప్రయత్నమూ చేసింది .మళ్ళీ స్త్రీ చేత దగాపడినవాడై చీకట్లో కూరుకు పోయాడు ;తమ్ముడు కూడా ఏమీ  సహాయం చేయలేక పోయాడు .సాయం చేయటానికి తనదగ్గర ఏమీ లేదన్నాడు .కాని థియో నే గతి .అనిపించింది .పారిస్ లోఉన్న తమ్ముడిదగ్గరకు విన్సెంట్ 1886ఫిబ్రవరి లో చేరాడు

Image result for VINCENT VAN GOGH  Image result for VINCENT VAN GOGHImage result for VINCENT VAN GOGHImage result for VINCENT VAN GOGH

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-7-15 –ఉయ్యూరు ‘

 

 

.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విప్లవాన్నీవేదాన్నీ సమాదరించిన అక్షర వాచస్పతి -దాశరధి రంగా చార్య -గబ్బిట దుర్గాప్రసాద్ -రమ్యభారతి

విప్లవాన్నీవేదాన్నీ సమాదరించిన అక్షర వాచస్పతి -దాశరధి రంగా చార్య -గబ్బిట దుర్గాప్రసాద్ -రమ్యభారతిsome 001

 

 

 

r acharya1 001 ra2 001 ra3 001 ra4 001 ra5 001

Posted in రచనలు | Tagged | Leave a comment

తిలాపాపం తలాపిడికెడు – పుష్కర ప్రమాదం

   తిలాపాపం తలాపిడికెడు

గోదావరి మహా పుష్కరాల ప్రారంభం నాడు నిన్న రాజ మండ్రిలో జరిగిన తొక్కిసలాటలో జనమరణం నివార్యమైనదే కాని అందరి అలసత్వం వలన అనివార్యమైంది .ఇందులో అందరి తప్పూ ఉంది .ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానిది ,ప్రచారం చేసిన పత్రికలది ,చానెల్స్ ది చానెళ్ళలో మాటలు అమ్ముకొంటున్న మతాదిపతులది ,ప్రవచన  సమ్రాట్టులది  చివరికి వారిని నమ్మే అమాయక ప్రజలది .ఈ ప్రజలు నమ్మి బలైపోతారు .మిగిలిన పై వారందరూ ఆకుకు అందకుండా పోకకుకందకుండా జారిపోతారు .అసలే గోదావరి .మహోధృత ప్రవాహం తో రాజమండ్రి నిపరవశింప జేస్తుంది  .కనుక సహజం గా అంత జల సంద్రం లాంటి గోదావరీ స్నానం అందరూ కోరుకోనేదే .అక్కడి రేవులూ అతి పవిత్రమైనవే .గోష్పాద క్షేత్రం లోఏది చేసినా విశేష ఫలితమే .అఖండ గోదావరిని చూసి పులకించటం అందరికి సహజం .పుష్కర ఘాట్లను పకడ్బందీ గా నిర్మించారు కనుక అక్కడ స్నానిస్తే ఇబ్బంది ఉండదని చెప్పటం మామూలే .పుణ్యం మూటకట్టుకోవచ్చునని ఆశి౦చటమూ సహజమే .ఇదేదో పీఠాదిపతుల, ప్రవచన కర్తల తప్పిదం అని తానూ ఆ గొంగట్లోనే తింటున్న గరికపాటి వారు అనటం వారికి తగిన మాట కాదు .కొంచెం సంయమనం అవసరం .అలాగే రాచకీయ మ్మన్యులు తామేదో పవిత్రులమని అవతలివాడికి మట్టి  అంటిందని జబ్బలు చరుచుకోవటమూ ఆక్షేపణీయమే .జరిగిన ప్రమాదం తీవ్రమైనదే .మానవ తప్పిదమే .బాబు ఇంట్లో కూర్చుంటే అన్నీ అవే వాటంతటికి అవి జరి గిపోతాయన్న ‘’రఘుబీరా’’ తానూ ఇంట్లో కూర్చోకండా పార్టీలో ఎవరూ లేకపోయినా జెండా బుజానేసుకొని వీధుల వెంట వీరంగం దేనికి ?ఇంట్లో కూచుంటే పార్టీ వృద్ధి చెందదా”?చిరు పెను కోపం తో ప్రేలాపన సంస్కార రహితం .పవన్ ఇంకా గూడులో౦చి బయటికి రాలేని గుడ్డు .ఓదార్పు వస్తే బాగుండనికలవరించే  ‘’ఫాన్ ఆయనా’’ అవాకులే ఇప్పుడూపేలాడు  .సరే వీళ్ళు రాక్షసీయ రాచకీయగాళ్ళు .పెద్దగా పట్టించుకోవాల్సింది లేదు వదిలేద్దాం .

           నరసింహా వధాని గారు పుష్కరాలలో దేవతలు వచ్చి స్నానం చేస్తున్నట్లు ఎవరికైనా కనిపించారా ?వీడియో తీశారా ?అని ప్రశ్నించారు .ఇవి నమ్మకానికి సంబంధిన విషయం .ఇదే మాట ముస్లిం లను మక్కా వెళ్లి రాళ్ళు వేసి కొట్టద్దని చెప్పగలరా ?క్రైస్తవులు ప్రార్ధన చేసి జబ్బులు నయం చేస్తాని ప్రచారం చేస్తుంటే అడ్డగించాగలరా ఇవన్నీ నమ్మకానికి చెందినా విషయాలు .కాశీలో చనిపోతే మోక్షం వస్తుందని మనవాళ్ళ నమ్మకం .అలా మోక్షానికి వెళ్ళిన వాళ్ళని చూపించండి అని గరికపాటి వారు అడగ గలరా ?ఎవరైనా చూడగలమా ?మక్కా ఎందుకు మన వూళ్ళో మసీదు లో అల్లా లేడాఅని ప్రశ్నించగలమా ?జెరూసలెం ఎందుకు ఊళ్ళో చర్చి లేదా అని అడగగాలమా ?ఎవరిమీదో బహుశా తన ఊరి వారైన ప్రవచన కర్త పైన ఉన్న ద్వేషాన్ని ఇలా వీధుల పాలు చేయరాదు .సాదువుల్లో కొందరు సర్కారీ సాధువు లున్న సంగతిమనకు తెలుసు .జియ్యర్ గారి నోటి వెంట శివ శబ్దం పలికించగలరా వీరు ?చానెళ్ళు దొరికాయి కదానని నమ్ముకొని మాటలు అమ్ముకొంటున్న వారు బేస్ ను మర్చిపోరాదు .మన అమ్మ మనకు ఎవరో చేబితెనేగా తెలిసేది .దాన్నే నమ్ముతున్నాముకదా.శాస్త్రం లో ఉన్న మృత్తిక విషయాన్ని చాగంటివారు చెప్పారు అది ఆయన విద్యుక్త ధర్మం .విని ఆచరిస్తారో లేదో అది ప్రజల కున్న బాధ్యత.దీన్ని అనవసర రాద్దాంత౦  చేయకండి ప్లీజ్ . గంగనీరు తెచ్చి రామేశ్వర లింగానికి అభిషేకం చేస్తున్నామా లేదా ?తద్దినాలు పెట్టట౦  పి౦డప్రదానాలు ,అర్ఘ్యాలు తిలోదాకాలు ఇవ్వటం నమ్మకానికి ,శాస్త్ర్రానికి సంబంధించిన  విషయాలు .మాయాబజార్ లో వంగర చెప్పినట్లు ‘’శాస్రం నిష్కర్ష గా కర్కశం గా నే చెబుతుంది .మనం సౌమ్యం గా సారాంశాన్నే గ్రహించాలి ‘’.

 ప్రమాదాలు ఇంత రద్దీలో జరగటం సహజం .కాని నివారించే వీలుకూడా ఉండాలి .కిందటి కృష్ణా పుష్కరాల్లో మొదటిరోజు తొక్కిస లాటలో జన నష్టం జరగటం మర్చిపోతే ఎలా .కుంభ మేళాలో ,కేదార్ బద్రినాద్ మానస సరోవర  చార్ ధాం  యాత్రలలో ఎంతమంది మరణించటం లేదు .కనుక అక్కడికి వెళ్ళద్దని చెబుతారా ?రోజూ భారత భాగవతాలలోని నీతులను జనాలకు వల్లే వేసి చెప్పేవారు మరింత జాగ్రత్తగా మాట్లాడాలి మీడియాలో .పెర్ఫెక్ట్ గా చేయాలన్న చంద్రబాబు ఆలోచన ఆచరణ సాధ్యం చేయటానికే మానిటరింగ్ చేస్తున్నాడు .అది తప్పుకాదే. హూద్ హూద్ తుఫాన్ లో అహర్నిశం పాటుపడ్డవాడుకాదాఆయన ?

    మహా పుష్కరాలు అన్న మాట తప్పా?కాదని ఆయన రుజువు చేయగలరా ?అసలు పుష్కరం ఎప్పుడు ప్రారంభామైనదీ అనే దానిలోనే అనేక సందేహాలు .ఎవరి లేక్కలువారివి .ఎవరు ఎలానమ్మితే అలా చేశారు .దీనికెవరూ రాద్ధాంతం చేయలేదే ?ఎవరిష్టం వారిది .ఎవరినమ్మకం వారిది అని సరిపుచ్చుకున్నారు .భారతం లో భీష్ముడు చెప్పాడనో విదురుడు చెప్పాడనో కృష్ణుడు చెప్పాడనో నీతులు చెరిగే ఈ పెద్దలు ఆవ్యక్తులున్నారని నమ్మబట్టేనా లేక పుక్కిటి పురాణాలని భావించా ?నీ నమ్మకం ఇంకోడికి నమ్మకం అనిపిస్తుందా .నీనమ్మకం మీద నీ కుండే అధారిటీనే నువ్వు చెప్పేది .అందులో మంచిని గ్రహించటం వినే వారి ప్రారబ్ధం .ఇన్నేళ్ళుగా ఇన్ని ప్రవచనాలు చానళ్ళలో వస్తున్నా మనుషుల తీరు మారింది అని చెప్పటానికి రుజువు ఉందా ? చూపగలరా?దయచేసి జాతిపరువును బాజారుకు ఈడ్చకండి మహా ప్రభో అని బాధతో అంటూ సెలవ్ –

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15 7-15-ఉయ్యూరు 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -64

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -64

28-మానవత్వాన్ని మాత్రమే  చిత్రించిన మహోన్నత చిత్రకారుడు -విన్సెంట్ వాన్ గో(Vincent Van Gogh)

37ఏళ్ళకే తనను తాను  చంపుకొని ,పదేళ్ళుమాత్రమే చిత్రకారుడిగా ఉన్నా తరాలు గుర్తుండిపోయే అతి అరుదైన స్వీయమైన చిత్రాలు గీసి ,జీవితం అంటే భయం ,ప్రేమలో విషాదం అనుభవించి వాటినే కాన్వాస్ పై ప్రతిఫలి౦పజేసిన అరుదైన హాలండ్ చిత్రకారుడు విన్సెంట్ వాన్ గో .అందం ,ఆనందం కోసం కాకుండా బాధ నివృత్తికోసం పెయింటింగ్  వ్రుత్తి చేబట్టాడు .అందం ,అపరిశుభ్రత ,ఔన్నత్యం ,దుఖం లను కలగలిపి నిరాశను ఆశాత్మక సృజనకోసం ప్రయత్నించిన వాడు విన్సెంట్ .I want to paint humanity ,humanity and humanity ‘’అని మానవత్వం కోసం అర్రులు చాచిన చిత్రకారుడు .

30-3-1853నహాలండ్ దేశం లోని బ్రాబాంట్ ప్రాంతం లో గ్రూట్ జండర్ట్ గ్రామం లో విన్సెంట్ జన్మించాడు .సంతానం లో పెద్దవాడు .తండ్రి పాస్టర్ కనుక ఇంట్లో వారందరూ మత పద్ధతులను పాటించాలి .మిగిలిన పాస్టర్ లకంటే ఇతని తండ్రి కడు పేదవాడు .కనుక కొడుకును బిజినెస్ లో పెట్టాలనుకొన్నాడు .ముగ్గురు బాబాయిలు ఆర్ట్ డీలర్స్ .విన్సెంట్ కు పదహారేళ్ళ వయసులో ఒక బాబాయ్ తన గూపిల్ అండ్ కంపెనీలో పెట్టాడు .దీనికి దేశ విదేశాలలో బ్రాంచీలున్నాయి .తండ్రిలోని పిరికితనం తల్లిలోని మూర్ఖత్వం వారసత్వంగా వచ్చి విన్సెంట్  ఆర్ట్ సేల్స్ మన్ గా  విజయం సాధించాడు .అందుకే బాబాయి హేగ్ ఆఫీస్ నుంచి పారిస్ ఆఫీస్ కు,తర్వాత లండన్ కు  మార్చాడు .ఎవరితోనూ స్నేహం చేయలేదు. విన్సెంట్ కు అనుయాయుడు తమ్ముడు థియో మాత్రమే .ధియో కు ఆర్ట్ డీలర్ అవాలనే కోరిక ఉండేది .అన్నదమ్ములిద్దరిమధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఆ తర్వాత ఒక గొప్ప మానవ డాక్యుమెంట్ గా చరిత్రలో నిలిచిపోయింది .

లండన్ లో విన్సెంట్ కు మొట్టమొదటిసారి తిరస్కరణ జరిగింది .తాను ఉంటున్న ఇంటి యజమాని కూతురిపై ప్రేమ ఒలకబోసుకొని ఆమె కూడా తాన అంటే తందానా అంటుందని ఆశపడి ఆమె ఎదురుతిరిగితే అవాక్కయ్యాడు .విన్సెంట్ అందవిహీనుడు .పెద్దతల ఎర్రటి జుట్టు .నీలి కళ్ళు చూసి ఆమె భయపడి పోయింది .అదీకాక అప్పటికే ఆమెకు ఇంకోరితో ఎంగేజ్ మెంట్ జరిగిపోయింది .దీనితో హృదయం తీవ్రంగా గాయపడి కోపం పెరిగి బాబాయి కంపెనీ కస్టమర్ల పై చూపించాడు .వాళ్ళు కోనేదంతా చెత్త అన్నాడు .అవమాని౦చాడుకూడా .మనోడేకదా అని జాలితో పారిస్ బ్రాంచ్ కు మార్చాడు .అక్కడ కూడా తీరు మారలేదు .కంపెనీ ఇతని ప్రవర్తన చూసి నోటీసు ఇచ్చింది

ఇక లాభం లేదని ఉద్యోగంవదిలి ఇంగ్లాండ్ వెళ్లి చిన్న ఊరు రామ్స్ గేట్లో చిన్న స్కూల్ లో లాంగ్వేజెస్ చెప్పి పొట్ట పోషించుకొన్నాడు .తాను ఇంకా మతం లోనే ఉన్నానని గుర్తు చేసుకొని మెథడిస్ట్ పుస్తకాలు ఐసిల్ వర్త్ లో ఉండి చదివాడు.` మినిస్ట్రీ పరీక్షలో పల్తీకోట్టినాఆశ పోలేదు .పాస్టర్ కాలేనని గ్రహించిబెల్జియం లో బోరినేజ్ లో  ప్రీచర్ గా ఉన్నాడు .అది బొగ్గుగని కార్మికులు  ఉండే చోటు .అందరూ అండర్ గ్రౌండ్ మనుషులే  .వాళ్ళతోనే కలిసి వాళ్ళల్లో ఒక్కడుగా పెరిగి వాళ్ళ తిండే తింటూ వాళ్ళ కన్నాలలోనే పడుకొన్నాడు .వాళ్లతోకలిసి బాధలు పంచుకొన్నాడు .వాళ్లకు జబ్బు వస్తే సేవచేశాడు .గాయాలైతే కట్టుకట్టాడు .వాళ్ళ పిల్లలకు చదువు చెప్పాడు .తనకొచ్చే జీతం తన బట్టలు వాళ్లకు పంచిపెట్టేవాడు .తన మంచం మీద వాళ్ళను పడుకో బెట్టుకోనేవాడు .వాళ్ళు జీతనాతాలకోసం సమ్మె చేస్తే వారిని సమర్ది౦చేవాడు .ఇదంతా బ్రసెల్స్ లో ఉండే అధికారులకు నచ్చలేదు .అతని అత్యుత్సాహం, చొరవ ,వైట్ కాలర్ గా ఉండాల్సినవాడు వాళ్ళతో కలిసి ఉండటం వాళ్లకు ఇష్టం లేకుండా పోయింది .ఉద్యోగం కాలపరిమితి అవగానే వారు అతని ఉద్యోగాన్ని పొడిగించలేదు.మత బోధ కూడా చేయద్దని ఆంక్ష విధించారు .

మనసు   దెబ్బ తిన్న విన్సెంట్  తండ్రిని చేరి ఆ వాతావరణం లో ఇమిదడిపోదామనుకొంటే చర్చిగౌరవాన్ని మంటగలిపిన   కొడుకుకు ఇంట్లో స్థానం లేదన్నాడు .కాలినడకనఎన్నోమైళ్ళు నడిచి జూల్స్ బ్రిటన్ అనే పెయింటర్ దగ్గరకు వెళ్లి సలహాకోరుదామనుకొన్నాడు .ఆ దేవేంద్ర భవనం  లాంటి ఇల్లు వాతావరణం చూసి తలుపు కొట్టకుండానే వెనుదిరిగి వెళ్ళిపోయాడు .నిరాశా నిస్పృహా అవమానం ఆవేదన నిండిన మనసుతోఎక్కడ బయల్దేరాడో మళ్ళీ అక్కడికే  బోరినేజ్ చేరాడు .

ఒక మైనర్ ఇంట్లో ఒకభాగం అద్దెకు తీసుకొని విషాదం లో పడిపోయాడు .తమ్ముడు థియో కు లెటర్ రాసి అందులో అయిదేళ్లుగా ఏ పనీ లేకుండా నిరాశతో బతుకుతున్నానని ,తాను చదివిన చదువు దేనికీ పనికి రాకుండా పోయిందని తెలిపాడు .యూని వర్సిటి ఎందుకు మానేశావని అడిగితె తాను సహజ మైన చావును కోరుకొంటున్నానని  వర్సిటీ చావు కాదని రాశాడు .తనలో ప్రేమ పెల్లుబికి వస్తోందని అయితే ఈ ప్రేమ స్వంతప్రేమ కాదని ,అదొక అవగాహనా విషయమైన ప్రేమ అని ,బౌద్ధిక ప్రేమ అని దానితో ఏదో సృష్టించి దాన్ని అందరికి ప్రసారం చేయాలన్నదే తన ధ్యేయం అని విన్సెంట్ రాశాడు .హృదయాన్ని విశాలం చేసుకొని మనసును లోతుగా అధ్యయనం లో ఉంచుకొని నిరంతరం అభివృద్ధి చేసుకొంటూ ,విజ్ఞానాన్ని పెంచుకొంటూ ఉంటే అదే దైవ మార్గం అవుతుంది అని తన మనసులోని భావ పరంపరను కాగితం పై పెట్టి తమ్ముడికి తెలియ జేశాడు .

విన్సెంట్ బైబిల్ చదివాడు .మైకేలేట్ రాసిన ఫ్రెంచ్ విప్లవం చదివాడు .హ్యూగో, జోలా, డికెన్స్ మొదలైన విఖ్యాత రచయితలూ అట్టడుగు వర్గం వారి గురించి అణచబడిన వారి గురించి రాసిన రచనలనుఔపోసన పట్ట్టాడు   .సృజన మీద మళ్ళిన బుద్ధిని తన చుట్టూ బోరినేజ్ గ్రామం లో ఉన్న పరిస్తితులను చిత్రాలుగా గీశాడు.గనికార్మికులే అతని మోడల్స్ .ఇతరులు వేసిన చిత్రాలను ప్రయోగాత్మకం గా కాపీ చేశాడు .పారిస్ లోని చిత్రాల నకళ్లను తనకు పంపమని తమ్ముడిని కోరాడు .కాని తమ్ముడు థియో ఇప్పుడిప్పుడేబిజినెస్ లో ఎదుగుతున్నాడు .అన్నగారు అన్నీ వదిలేసి జీవితం లో ఎదగాలనే కోరిక చూపిస్తున్నందుకు సంతోషపడి నెలకు వంద ఫ్రాంకులు పంపే ఏర్పాటు చేశాడు తమ్ముడు ;బోరినేజ్ లోని ఆచీకటి  ఇరుకు బొక్కవదిలేసి బ్రసెల్స్ లో చిత్రలేఖనం చదవటానికి ఏర్పాటు చేశాడు .

Inline image 1

సశేషం

గోదావరి మహా పుష్కర శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-7-15-ఉయ్యూరు

 

 

.

.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

స్వరరాజు ఏం ఎస్ విశ్వనాధమ్ మరణం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వేళకి తిండి మేనికి నడక -92 ఏళ్ళ సుగుణమణి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పుష్కర ప్రమాదం

 


 
 
 


 



 
 
 
 

గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -63గ

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -63గ

27- అమెరికన్ ఇన్వెంటర్- థామస్ ఆల్వా ఎడిసన్ -4(చివరిభాగం)

ఎలెక్ట్రిక్ రైల్వే రూపకల్పన

ఎడిసన్ అంటే ఎలక్రిక్ బల్బ్ కు పర్యాయ పదం అయింది .ఆ బల్బును మరింత మెరుగు పరచాలని ఆలోచించాడు .మంచి ఫిలమెంట్ కోసం ప్రయోగాలు చేస్తున్నాడు .వెదురు ఫిలమెంట్ ను ప్రయత్నించాడు .ఇందులో ఏ రకమైన వెదురు శ్రేస్టమో అని ప్రయోగాలు చేసి లక్ష డాలర్లు ఖర్చు చేశాడు .యారు వేల స్పెసిమెన్ లు పొందాడు .అందులో మూడు మాత్రమె కరెక్ట్ రిజల్ట్ ఇస్తాయని భావించాడు .కొత్త డైనమో ,కొత్త పరికరాలు తయారు చేశాడు .కొత్త సంస్థను నెలకొల్పాడు .అదే తర్వాత కన్సాలిడేటెడ్ ఎలెక్ట్రిక్ కంపెనీ అయింది .ఎలెక్ట్రిక్ లైట్ ఒక్కటి మాత్రమె అతని ఆశయం కాదు .మాగ్నెటిక్ ఖనిజం ను వేరు చేసే యంత్రం సాధించాడు .ఎలెక్ట్రిక్ రైల్వే రూపకల్పన చేశాడు దీనినే తర్వాత న్యూయార్క్ సిటీ సబ్ వే లో ఉపయోగించారు .

భార్య మరణం

ముప్ఫై ఏడవఏట ఎడిసన్ ఒంటరి వాడయ్యాడు .1884లోటైఫాయిడ్ తో  చనిపోయింది  .ముగ్గురు పిల్లలు అమ్మమ్మగారింటికి వెళ్ళారు .ఎడిసన్ ఎక్కువ కాలం న్యూయార్క్ ఆఫీస్ లో గడిపాడు .పెద్ద ఉత్పత్తి కేంద్రం యూనియన్ కాలేజి నుంచి ప్రారంభించాడు .

కొత్త భార్య

భార్య చనిపోయిన ఎడాదిన్నరకు వ్యవసాయం లో సృజనాత్మక పరిశోధన చేసిన లూయిస్ మిల్లర్ కుమార్తె తో పరిచయమై ఆమెకు మోర్స్ కోడ్ నేర్పి ప్రేమ మెసేజ్ పంపితే ఆమె ఒప్పుకున్నట్లు తిరుగు టపా మేసేజ్ పంపింది .వివాహమైన తర్వాత పిల్లలతో సహా న్యు జెర్సీ లోని ఆరంజ్ మౌన్టేన్స్ లో ఒక వ్యవసాయ క్షేత్రాన్ని కొని కాపురం పెట్టాడు .నలభైలలో అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది  .

మోషన్ పిక్చర్ కెమెరా

ఫోనోగ్రాఫ్ ,ఎలెక్ట్రిక్ లైట్ లతో ప్రసిద్ధి చెందిన ఎడిసన్ వాటిని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చాడు .ఇప్పుడు దృష్టిని మోషన్ పిక్చర్ కేమేరాపై పెట్టి కృషి చేసి సాధించాడు .ఈ మూడు ఎడిసన్ చేసిన వందలాది సృజనలను మరపించేట్లు చేశాయి .

మరిన్ని సృజనలు

చనిపోయే దాకా కొత్త ఆవిష్కణలకోసం  తాపత్రయ పడుతూనే ఉన్నాడు .మొట్టమొదట వచ్చిన టైప్ రైటర్ ను మెరుగు పరచాడు .కొత్త రకమైన మిమియోగ్రాఫ్ మెషీన్ తయారు చేశాడు .పోర్ట్ లాండ్ సిమెంట్ తయారీలో పెద్ద బట్టీని తయారు చేశాడు నిర్దుష్టమైన.ఆల్కలిన్ బాటరీనితయారు చేశాడు .మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో కార్బాలిక్ యాసిడ్ కొరత ఏర్పడితే జర్మనీ నుంచి దిగుమతి చేసుకొనేవారు .దీనికి ప్రత్యామ్నాయ సింథటిక్ యాసిడ్  తయారు చేయటం అసాధ్యం అని అమెరికన్ సైంటిస్టులు అన్నారు .దీన్ని చాలెంజి గా తీసుకొని ఎడిసన్ పద్దెనిమిది రోజుల్లో సింథటిక్ యాసిడ్ తయారు చేసి చూపించాడు .రబ్బర్ కు మూలకం ఏమిటో తెలుసుకోవాలను కొన్నాడు .జీవిత చరమాంకం లో రబ్బర్ ను వల్కనైజింగ్ ను బంగారు కడ్డీ ఆధారం గా చేశాడు .

ఎడిసన్ హాబీ- ‘’పని ‘’

ఎడిసన్ హాబీ ఏమిటి అంటే’’ వర్క్ ‘’మాత్రమె .’’work heals and ennobles ‘’అన్నాడు  ఎడిసన్ తన డెబ్బై  ఏడవ .పుట్టిన రోజు నాడు .అతని జీవిత ఫిలాసఫీ ఏమిటి అని అడిగితె ‘’work brings out the secrets of nature and applies them for the happiness of men ‘’అని తన ఫిలాసఫీ గురించి చెప్పాడు .

గౌరవ పురస్కారాలు

1928లో ‘’కాంగ్రెషనల్ మెడల్  ఆఫ్ ఆనర్ ‘’అంద జేసింది అమెరికా ప్రభుత్వం .ఏడాది తర్వాత అతని ముఖ్య స్నేహితుడు హెన్రి ఫోర్డ్ ఎలెక్ట్రిక్ బల్బ్ ఆవిష్కరణ యాభై వ  వార్షి కొత్సవ౦ మిచిగాన్ లోని డియర్ బారన్ లో .   జరిపించాడు . మెన్లో పార్క్ లోని లాబ్ ను ఇక్కడ పునర్ వ్యవస్తీకరించాడు ఫోర్డ్ .చివరిదాకా హుషారుగా ఉత్సాహంగా పని చేస్తూ ధామస్ ఆల్వా ఎడిసన్ 18-10-1931లో ఎనభై  నాలుగేళ్ళకు చనిపోయాడు .ప్రపంచానికి ఎలక్ట్రిక్ కాంతి నందించిన ఎడిసన్ జీవిత కాంతి ఆరిపోయింది .చనిపోవటానికి ముందు అమెరికా ప్రభుత్వ పేటెంట్ ఆఫీస్ 1098విడి విడి  పేటెంట్ లను ఎడిసన్ కు పంపించింది .

మానవ సంక్షేమం కోసం ఎడిసన్ తాపత్రయ పడ్డాడు .కనిపెట్టినడానికి ఆర్ధిక సౌష్టవం కలిపించటమే తన ధ్యేయం అన్నాడు .అంతమాత్రం చేత డబ్బు సంపాదించే మెషీన్ అను కొంటె పెద్ద పొరబాటే .షేక్స్పియర్ ను టాం పైన్ ను  ఇష్టపడి చదివేవాడు .విపరీతంగా పుస్తకాలు చదివేవాడు .వయోలిన్ అద్భుతంగా వాయించేవాడు .ఎడిసన్ ‘’కొత్తగా కనిపెట్టిందిఏదీ లేదు .ఉన్నదాన్ని బాగు చేశాడు ‘’అని అతన్ని విమర్శించారు దానికి సమాధానం గా ‘’through all the years of experimenting and research ,I never once made  a discovery .I start where the last man left off .Al l  my work is deductive and the results I achieved were those of invention pure as simple ‘’అని నిర్మొహమాటం గా చెప్పాడు .

Inline image 1Image result for thomas edison research paperImage result for thomas edison research paper

మరోప్రముఖునితో కలుద్దాం

సశేషం

గోదావరి మహా పుష్కర శుభా కాంక్షలతో

మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -14-7-15 ఉయ్యూరు

 

.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -62

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -62

27- అమెరికన్ ఇన్వెంటర్- థామస్ ఆల్వా ఎడిసన్ -3

సౌండ్ రికార్డింగ్ అండ్ రీప్రోడ్యూసింగ్ యంత్రం- ఫోనోగ్రాఫ్

ఎడిసన్ చెవుడు మాట దేవుడెరుగు కాని మనిషి మాట్లాడిన మాటను రికార్డ్ చేయటం పై దృష్టిసారించాడు ముప్ఫై ఏళ్ళ వయసు లోపలే .టెలిఫోన్ ట్రాన్స్ మీటర్ కనిపెట్టిన తర్వాతఒక రోజు అకస్మాత్తుగ గాలితరంగాలను రికార్డ్ చేయచ్చునని వాటిని మళ్ళీ వినిపించవచ్చునని ఐడియా వచ్చింది .ఒక ఎలక్ట్రో మేగ్నెటిక్ పికప్ ను రివాల్వింగ్ టేబుల్ కు అమర్చి దానిద్వారా పారఫిన్ మైనం రాసిన ఒక సన్నని కాగితాన్ని దూర్చాడు .అద్భుతం అని పించి ‘’వాఃవాః’’అని అరిచాడు ఆశ్చర్యంగా .అ పేపర్ను వెనక్కి నడిపి చూశాడు తాను అరచిన శబ్దం ఏ మాత్రం తేడా లేకుండా తిరిగి వినిపించింది .ఈ విషయాన్ని డైరీలో 18-7-1877తేదీతో  సమీప భవిష్యత్తు లో  ఏదోఒక రోజు తాను మానవ శబ్దాలను రికార్డ్ చేసి మళ్ళీస్పష్టంగా వినిపించగలను అనే నమ్మకం కలిగింది అని రాసుకొన్నాడు .ఆ రోజు వెంటనే వచ్చేసింది .

ఒక నెల తర్వాత మెకానిక్ జాన్ క్రేసు  నిపిలిచి 18 డాలర్ల పని అప్పగిస్తున్నాను చేయమన్నాడు .ఒక సాధారణ బొమ్మ మోడల్ గీసి దానిప్రకారం ఒక పరికరం తయారు చేయమన్నాడు .ఒక టిన్ ఫాయిల్ తీసుకొనిఒక సిలిండర్ చుట్టూ  మిఠాయి పొట్లం లాగా చుట్టి దానికి ఒక పిన్ను అమర్చాడు ‘క్రాంక్ వీల్ ఆధారం గా సిలిండర్ ను తిప్పాడు .చిన్నప్పటి నర్సరీ రైం లను మౌత్ పీస్ లో  పాడాడు . పాట అవగానే పిన్నును రి ప్రోడ్యూసింగ్ డయాఫ్రం కు ఆనేట్లు  సరిచేశాడు .సిలిండర్ ను మళ్ళీ తిప్పగానే అతను చెప్పిన ‘’మేరీ హాడ్ ఏ లిటిల్ లాంబ్ –ఇట్స్ ఫ్లీస్ వజ్ వైట్ యాజ్ స్నో’’అని స్పష్టంగా వినిపించింది .ఎడిసన్ అనుభూతిని అణచుకొన్నాడు కాని మెకానిక్ క్రేసు ‘’గాడ్ ఇన్ హెవెన్ ‘’అని బోల్డు ఆశ్చర్యపడ్డాడు .ఇలా ధ్వని రికార్డింగ్ అండ్ రిప్రోడ్యూసింగ్ చేశాడు .ఇదే ఫోనోగ్రాఫ్ . .

ఎడిసన్ పధ్ధతి చాలా నిదానం గా పెర్ఫెక్ట్ గా ఉంటుంది .అవసరం లేనివాటిని తొలగించి బాగా ఉపయోగపదేవాటినే ఉంచి ఎన్నో ప్రయోగాలు చేసి విజయం సాధించాడు .ఫోనోగ్రాఫ్ నిర్మాణం తో ఎడిసన్ కీర్తి దేశ విదేశాలలో మారు మోగింది .ఎడిసన్ బయాగ్రాఫర్ ఫ్రాన్సిస్ ట్రవలేన్ మిల్లర్ ‘’నేను ఏది వచ్చినా బెదిరలేదు వెనక్కి తగ్గలేదు .ప్రయోగం మొదటిసారే విజయవంతమైతే భయమేసేది .’’అని ఎడిసన్ డైరీలో రాసుకోన్నాడని తెలియ జేశాడు .తన సృజనలలో ఫోనోగ్రాఫ్ అద్భుత విజయం గా భావించాడు ..తనకున్న చెవుడు నష్టం కలిగించక పోగా పైపెచ్చు లాభమే కలిగించిందన్నాడు .దానివలన కేంద్రీకరణ పెరిగి అందరికి వినిపించని ధ్వనులు ఆయనకు వినిపించేవి ‘’.స్టెనో గ్రాఫర్ సహాయం లేకుండా లెటర్ రైటింగ్ ‘’పేరుతొ పేటెంట్ పొందాడు .గుడ్డివారి కోసం ‘’ఫోనోగ్రాఫ్ బుక్స్ ‘’రాశాడు .అవి వారిపాలిటి  కల్పతరువులే అయ్యాయి .వారి ప్రయత్నం లేకుండానే గుడ్డివారి తో అవి మాట్లాడి జ్ఞాన వంతుల్ని  చేశాయి .దీన్ని స్పెక్టాక్యులర్ వండర్ అన్నారు . వక్త్రుత్వాన్ని నేర్పేవిగా,సంగీతాన్ని పునః సృష్టి చేసేవానిగా ఫోనోగ్రాఫ్ నాలుగు రకాల సేవలు అందించింది .

ఎలెక్ట్రిక్ బల్బ్ నిర్మాత  –మెన్లో పార్క్ మాంత్రికుడు

ఫోనోగ్రాఫ్ పని పూర్తీ అయ్యాక ఎలెక్ట్రిక్ లైట్  పని మీద ఉన్నాడు .అప్పటిదాకా విద్యుత్తు వలన కాంతి వస్తుందని ఎవరికీ తెలియదు .కాంతి గురించి అనేక పుస్తకాలు చదివి అర్ధం చేసుకొన్నాడు ఎడిసన్ .రెండు వందల పెద్ద పెద్ద బైండ్ పుస్తకాలలో తాను  చదివిన వాటి సారాంశాన్నినలభై వేల పేజీలలో రాసుకొన్నాడు .అవసరమైన చిత్రాలు కూడా గీశాడు .కరెంట్ కు నిరోధాన్ని తగ్గించటానికి బదులు నిరోధం పెంచుతూ ప్రయోగాలు చేశాడు .ఫిలమెంట్ కోసం అనేక పదార్ధాలను ఉపయోగించి చివరికివాక్యూం బల్బ్ లో  కార్బన్ ఫిలమెంట్ వాడి కావాల్సిన ఫలితం సాధించాడు  . 1879డిసెంబర్ 31అంటే కొత్త సంవత్సరానికి ముందురోజు సాయంత్రం వందలాది జనం సమక్షం లో ఎలెక్ట్రిక్ బల్బ్  వెలగటాన్నిప్రదర్శించి చూపి అప్రతిభులను చేశాడు .ఇదే ప్రజాసమక్షం లో నిర్వహించిన తొలి ప్రయోగం .గ్రాండ్ సక్సెస్ .బల్బ్ కాంతి తగ్గకుండా చాలాసేపు వెలిగింది .దీనితో ఎడిసన్ ను ‘’మెన్లోపార్క్ మాంత్రికుడు ‘’అన్నారు సరదాగా .ముప్ఫై రెండేళ్లకే జాతీయ గౌరవం ,గుర్తింపు అందుకొన్నాడు ఎలక్ట్రిక్ బల్బ్ నిర్మాత ధామస్ ఆల్వా ఎడిసన్ .అప్పటి నుంచి ఎడిసన్ అంటే ఎలక్ట్రిక్ బల్బ్ అనే పేరు  వచ్చింది .

Image result for edison's bulb  Image result for edison's bulbImage result for edison's bulb

సశేషం

గోదారి మహా పుష్కర శుభా కాంక్షలతో

మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -14-7-15 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -61

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -61

27- అమెరికన్ ఇన్వెంటర్- థామస్ ఆల్వా ఎడిసన్ -2

సంచార ఉద్యోగ జీవితం

బుర్రనిండా సంపాదనా పరమైన ఆలోచనలే ఎడిసన్ కు. పదహారవ ఏటనే బాగా పరిణతి చెందాడు .స్వతంత్రం గా ఆలోచించటం లో దిట్ట అనిపించాడు .టెలిగ్రాఫ్ ఆపరేటర్ గా విజయాన్ని సాధించి కెనడాలో మొదటిసారిగా ఉద్యోగం లో చేరాడు .కస్టపడి పని చేసేవాడు .తీరిక లేకుండా వ్యాపకం లో ఉండేవాడు .తరువాత అయిదేళ్ళు సంచార జీవితమే .ఏదో ఒక ప్రదేశానికే పరిమితమై పని చేయటం నచ్చక చాలా ఉద్యోగాలు కోల్పోయాడు .ఎక్కడ ఏపనిలో ఉన్నా సైంటిఫిక్ పరిశోధనలు మాత్రం మానలేదు .అతని ఉద్యోగేతర వ్యాపకాల వలన అర్ధ రాత్రి దాకా మేల్కొని పని చేసేవాడు .మనుషులు నిద్రతోనే ఎక్కువ కాలం గడుపుతున్నారని కామెంట్ చేసేవాడు .

నైట్ షిఫ్ట్ ఉద్యోగం

వయసు ఇరవై ఒకటి వచ్చింది .తిరిగింది ఇక చాలులే అనుకొన్నాడు .జీవితాన్ని మలుపు తిప్పుకోవాలని నిర్ణయించుకొన్నాడు .బోస్టన్ చేరి అక్కడే ఎక్కువ కాలం ఉన్నాడు .వేస్త్రెన్ యూనియన్ టెలిగ్రాఫ్ ఆఫీస్ లో నైట్ షిఫ్ట్ డ్యూటీలో చేరాడు .పగలంతా ఒక అద్దె గదిలో లాబ్ ఏర్పాటు చేసుకొని పరిశోధనలు చేశాడు .కాసేపు ఖాళీ దొరికితే కునుకు తీసేవాడు .ఆ రోజుల్లో రోజుకు నాలుగు గంటలే ఎడిసన్ నిద్ర పోయేవాడు .టెలిగ్రాఫ్ పరికరాలను ఎన్నిటినో తయారు చేశాడు .కాని ఇది ఎవరికీ పట్టేది కాదు .

వోట్ రికార్డింగ్ మెషిన్

ఇది కాదనుకొని వోట్ లను రికార్డ్ చేసే యంత్రాన్ని స్వయం గా కనిపెట్టాడు .1868లో మొదటిసారిగా దీనికి పేటెంట్ హక్కు పొందాడు .అమెరికన్ కాంగ్రెస్ దీన్ని కొంటుందేదేమో అనే ఆశతో వాషింగ్టన్ వెళ్లి కమిటీ ముందు  దాన్ని ప్రదర్శించి చూపించాడు .దాని అవసరం తమకు లేదని వాళ్ళు తేల్చి చెప్పారు .అధికారులకు పని కొచ్చే వి చేసేదానికంటే ప్రజలకు బాగా ఉపయోగపడేవి తయారు చేయాలని నిశ్చయించుకొన్నాడు.న్యూయార్క్ వెళ్ళాడు .

న్యూయార్క్ లో ఫోర్ మన్ జీవితం

న్యూయార్క్ లో ఎడిసన్ కాలు పెట్టేసరికి జేబులో పెన్నీ కూడా లేదు .అతని టెలిగ్రాఫ్ మిత్రులు ఒక డాలరు అప్పు ఇచ్చారు .దానితో గోల్డ్ ఇండికేటర్ కంపెనీ లో బాటరీ రూమ్ లో ఉన్నాడు .ఈ కంపెనీ గోల్డ్ మార్కెటింగ్ చేసేది .ఎప్పటికప్పుడు గోల్డ్ రేట్ నుస్టాక్ బ్రోకర్లకు కోట్ చేసే  కీబోర్డ్ ను వైర్ సిస్టం తో పని చేయించేవారు .ఒక సారి టాం గోల్డ్ ఇండికేటర్ ఆఫీసు లో ఉన్నాడు .అనుకోకుండా ఆ మెషిన్ పని చేయటం ఆగిపోయింది .ఎక్కడ లోపం ఉందొ ఎవరూ కనిపెట్ట లేక పోయారు .ఎడిసన్ ఆ కంపెనీ ప్రెసిడెంట్ దగ్గరకు వెళ్లి మెషీన్ లో లోపం ఎక్కడ ఉందో తాను   కనిపెట్ట గలనని చెప్పాడు .’’అయితే ఏడు వెంటనే ‘’అన్నాడు కట్ అండ్ డ్రైగా .కంపెనీ ఇంజినీర్ల బుర్రలకు ,కళ్ళకు కనిపించని లోపం టాం కు కనిపించింది. అందులో రెండు గేర్ వీల్స్ ను కలిపే ఒక స్ప్రింగ్ విరిగి పడిపోయిందని తెలుసుకొన్నాడు.దాన్ని మార్చి మెషీన్ పని చేసేట్లు చేసి టికర్ లు  మళ్ళీ పని చేసేట్లు చేశాడు .అంతే ఎడిసన్ ను ఆ కంపెనీ ఫోర్ మన్ గా వెంటనే నియమించాడు  ప్రెసిడెంట్  .నెలకు మూడు వందల డాలర్లు జీతం .

అవాక్కు చేసిన యంత్రం ధర

ఈ జీతం తో వర్క్ షాప్, దానికి కావాల్సిన పరికరాలకు ఖర్చు చేశాడు . అతని ఉద్దేశ్యం ఈమొత్తం టికరింగ్  సిస్టం ను సమూలంగా మార్చాలని ఉండేది .ఉద్యోగానికి గుడ్ బై చెప్పి స్వంతం గా ఈ యంత్ర నిర్మాణం పై ద్రుష్టి పెట్టాడు . వాల్ స్ట్రీట్ పత్రిక కొద్దిమార్పులతో ఇదే యంత్రాన్ని వాడింది .టాం తాను  తయారు చేసిన యంత్రాన్ని పాత యజమానికి అమ్మాలని వెళ్ళాడు .ధర ఏంతో చెప్పమని అడిగితే మనవాడు నత్తురు నత్తురు మన్నాడు  .అయిదు వేలా లేక మూడు వేలు చెప్పాలా అని సందేహిస్తూ ఉంటే కంపెనీ యజమాని ‘’నలభై వేల డాలర్లు ఇస్తాను నీకు సంత్రుప్తేనా ?’’అన్నాడు   .అవాక్కైన ఎడిసన్ నోట మాట పెగల్లేదు .అప్పటికి ఈకుర్ర సైంటిస్ట్ వయసు ఇరవై  రెండు మాత్రమే.

పరిశోధనా పరమేశ్వరుడు –     122 పేటెంట్ హక్కులు

ఈ డబ్బుతో ఒక ప్లాంట్ ను నిర్మించి స్టాక్ టికరింగ్  యంత్రాల ఉత్పత్తి ప్రారంభించాడు .ఈ యంత్రం పై క్రేజ్ పెరిగి విపరీతంగా ఆర్డర్లు  వచ్చాయి .అన్ని యంత్రాలు తయారు చేయటానికి తగిన స్టాఫ్ ను పెట్టుకొని పగలు రాత్రి షిఫ్ట్ లు పని చేయించి అందజేశాడు .అతను ఎంతకస్టపడినాడో ,ఎన్ని గంటలు నిద్రపోయాడో తెలియదుకాని అతని సృజనలు తామర తంపరగా రాసాగాయి .1876కు ఎడిసన్ ఏకంగా 122 పరికరాలకు పేటెంట్ హక్కులు పొంది అందర్నీ ఆశ్చర్య పరచాడు .ఇతని జీవిత  చరిత్ర రాసిన గార్డెన్ గార్బెడియన్స్ చెప్పినదాని   ప్రకారం ఒకే సమయం లో ఎడిసన్ 45 వేర్వేరు సృజనల మీద ద్రుష్టి పెట్టి పనిచేశాడు .ఇది సామాన్య మానవులకు అందుబాటు లో ఉండేవిషయం కాదు. దటీజ్ ఎడిసన్ .పరిశోధనా పరమేశ్వరుడు అనిపించాడు .టేలిగ్రఫీ  పని విధానం లో కూడా అనేక పరిశోధనలు చేశాడు .

లక్ష డాలర్లు –   టెలిఫోన్ యుద్ధం

ఇరవై నాలుగవ ఏట ఎడిసన్ మేరీ స్టిల్ వెల్ అనే లాబ్ అసిస్టంట్ ను పెళ్లి చేసుకొన్నాడు .ఎన్నో ఇన్వెన్షన్లు చేసిరికార్డ్ సృష్టించిన  ఎడిసన్  ముగ్గురు పిల్లల్ని కన్నాడు .ఒకమ్మాయి ఇద్దరబ్బాయిలు .పిల్లలు పుట్టాక కుటుంబాన్ని న్యు జెర్సీ లోని మెన్లో పార్క్ కు మార్చాడు .ఇంటిదగ్గరే వర్క్ షాప్ పెట్టాడు .టెలిగ్రాఫిక్ కోడ్ ద్వారా పంపే విధానానికి స్వస్తిపలికి మనిషి చేసే శబ్దం నే పంపే ఏర్పాటు చేశాడు.అలేక్సాండర్ గ్రాహం బెల్. .పేటెంట్ కూడా పొందాడు .బెల్ టెలిఫోన్ అని పిలువ బడే ఈ పరికరం దీరీ లో బాగానే ఉంది ప్రాక్టికల్ గా ఫెయిల్ అయింది .దీన్ని పరి పుష్టిచేయాలి అని పించిన ఎడిసన్ కార్బన్ ట్రాన్స్ మీటర్ ను తయారు చేసి వాడాడు .స్పష్టమైన శబ్దం వచ్చింది .దీనికి గాను వేస్త్రెన్ యూనియన్ ఎడిసన్ కు లక్ష డాలర్లు ఇచ్చారు .ఇంతడబ్బు వస్తే మళ్ళీ దాన్ని ప్రయోగాలకోసం ,లాబ్ కోసం ఖర్చు చేస్తానేమో ననే సందేహం తో ఆ కంపెనీని ఏడాదికి ఆరు వేల డాలర్లను పదిహేడేళ్ళు ఇవ్వమని కోరాడు .లోపేటెంట్ విషయం లో బెల్  వాళ్లకు   వేస్త్రెన్ వాళ్లకు గొడవలు వచ్చాయి   .అంతులేనికధలా సాగింది యవ్వారం .చివరికి వేస్త్రెన్ వాళ్ళు ఎడిసన్ ఇన్వెన్షన్ ను బెల్ వాళ్ళకే  తమ వ్యాపారం తో సహా ఇచ్చేసి ఇరవై శాతం రాయల్టి ని బెల్ సిస్టం కు అందజేశారు .

Thomas Edison2.jpgThomas Alva Edison Signature.svg

సశేషం

గోదావరి మహా పుష్కరాల అభినందనలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-7-15 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -60 27- అమెరికన్ ఇన్వెంటర్- థామస్ ఆల్వా ఎడిసన్

 ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -60

27- అమెరికన్ ఇన్వెంటర్- థామస్ ఆల్వా ఎడిసన్

ఇన్వెంటర్ బిజినేస్మన్

తనకాలపు మేదావులకన్నా గొప్పవాడు కాకపోయినా కాలంతో చక్కగా శ్రుతికలిపిన శాస్త్రవేత్త ,పరిశోధకుడు ,పక్కా వ్యాపారి థామస్ ఆల్వా ఎడిసన్ .అతని పరిశోధనా ఫలాలు నూతన పారిశ్రామికాభివృద్ధికి అనేక క్షేత్రాలలో ప్రతిఫలించాయి .కాంతికే వెలుగునిచ్చి ఎలక్ట్రిక్ బల్బ్ ను కనుక్కొని ధ్వని రికార్డింగ్ యంత్రాన్ని తయారు చేసి కొత్త పుంతలు తొక్కాడు .ఫలితాలను స్వర్గం లో ఉండిచూసుకోకుండా భూమిపై జీవించి ఉండగానే చూసుకొని ఆనందించిన అరుదైన శాస్త్రజ్ఞుడు .చనిపోయే నాటికి అయన కనిపెట్టిన అనేకానేక పరిశోధనల వలన పొందిన దనం లెక్క వేస్తె కళ్ళు మిరుమిట్లు గొలిపే 25.683,544.343డాలర్లు అని తెలిస్తే గుండె ఆగిపోతుంది .సైన్స్ తో  అంత గొప్పగా వ్యాపారం చేయగల సమర్ధుడు అని ఆశ్చర్య పోతాం .ఎడిసన్ మెదడు సాధించిన చారిత్రాత్మక ఘన ధన విజయం ఇది .అనితర సాధ్యం చేశాడు .

కుటుంబ నేపధ్యం

ఎడిసన్ కుటుంబం వారు అమెరికన్ రివల్యూషన్ ముందు నుంచే అమెరికాలో ఉన్నారు .సామ్యుల్ ఎడిసన్ డచ్ వాడు ,అతని పూర్వీకులు కాలనీ రాష్ట్రాలకు చెందిన హాలండ్ దేశీయులు .ముందుగా కెనడా చేరారు .ఈరీ సరస్సు ఉత్తరభాగం లోని వియన్నా లో సామ్యుల్ ఉండేవాడు .అప్పుడే స్కాటిష్ జాతికి చెందిన నాన్సీ ఇలియట్ ను పెళ్లి చేసుకొని హోటల్ కీపర్ గా ఉన్నాడు .ప్రజా సంబంధాలు బాగా ఉన్న వ్యక్తీ .కనుక రాజకీయాలలోకి లాక్కు రాబడ్డాడు .తీవ్రవాది అవటం వలన రాడికల్ రిఫార్మ్ కోసం ప్రయత్నించాడు .ఇది కెనడా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది .తీవ్రవాదులను కట్టడి చేసే ప్రయత్నం చేస్తుండగా నెమ్మదిగా ఎవరికీ తెలియ కుండా సరిహద్దు  దాటి 1842లోఅమెరికాలోని  ఒహాయోలోని మిలన్  సిటీలో స్తిరపడ్డాడు .చిన్నా చితకా వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించి కెనడాలో  ఉన్న  భార్యకు పంపేవాడు .

ఎడిసన్ బాల్యం

ఎడిసన్ కుటుంబం లో చివరివాడుగా ఆల్వా ఎడిసన్ మిలన్ లో 11-2-1847జన్మించాడు .రివల్యూషనరీ వార్ లో పని చేసిన ముత్తాత పేరైన థామస్ ను ఇతనికి పెట్టారు .అతని తల్లిని కెనడా నుంచి ఒహాయో చేర్చిన కెప్టెన్ ఆల్వా బ్రాడ్లీ  కి కృతజ్ఞతగా ఆల్వా పేరునూ చేర్చారు .ఎడిసన్ పుట్టేనాటికి తండ్రికి నలభై మూడు తల్లికిముప్ఫై ఏడు వయసు ఉంది .మంచి కుటుంబ వాతావరణం లో పెరిగాడు తల్లి ఈ చిన్ని కొడుకు అవసరాలు బాగా తీర్చేది .ఇతని ఏడవ ఏట కుటుంబం మిచిగాన్ లోని పోర్ట్ హర్టన్ చేరింది .అక్కడ లంబర్ బిజినెస్ బాగా కలిసి వచ్చింది .కొత్త విశాలమైన భవంతి తీసుకొని ఉన్నారు .కొడుకును స్కూల్ కు పంపారు .అందరికంటే కొడుకు బాగా చదివి వృద్ధిలోకి రావాలని ఆశించారు తల్లి తండ్రి .స్కూల్ లో మనవాడు ‘’కలల బేహారి ‘’గా కనిపిస్తే చదువు మీద శ్రద్ధ లేదనుకొన్నాడు టీచర్ .

ప్రధమ గురువు తల్లి

వెంటనే స్కూల్ మాన్పించేసింది తల్లి .కొడుకును దగ్గరే పెట్టుకొని అతనికి కావలసిన చదువు తానె నేర్పింది ఇష్టపడి అతనూ నేర్చుకొన్నాడు ఆమె నేర్పిన దాని ప్రభావం వల్ల టాం పన్నెండో ఏటికే గిబ్బన్ రాసిన ‘’డిక్లైన్ అండ్  ఫాల్ ఆఫ్ రోమన్ ఎంపైర్ ‘’,బర్టన్ రచన’ ’అనాటమీ ఆఫ్ మేలాన్కలి ‘’చదివి జీర్ణం చేసుకొన్నాడు .’’డిక్షనరీ ఆఫ్ సైన్సెస్ ‘’చదివి ప్రయోగాలు చేసేవాడు .బాగానేకాకుండా వేగంగా చదవటం ఆల్వా అలవాటు చేసుకొన్నాడు .సాధారనాంగా అందరూ ఒక లైన్ చదివి అర్ధం చేసుకొంటే అదే సమయం లో పేజీలోని పదార్ధ సారాన్ని జీర్ణించుకొన్న మేధావి .చదివింది ఏదీ మర్చిపోయే వాడుకాదు .ఎప్పుడు ఏది కావాలన్నా వెంటనే  స్పురణకు తెచ్చుకోగల అపూర్వ జ్ఞాపక శక్తి ఎడిసన్ కు అలవడింది .

సేల్లారే పరిశోధన శాల  –మోడల్ యంగ్ హీరో

చదువుతో బాటు ప్రయోగాలూ సాగించి  వాటి ఫలితాలూ వెంటనే పొందేవాడు .ఒకసారి స్నేహితుడికి గాలిలో ఎగరటం కోసం అధిక డోసులో ‘’సీడ్లిత్జ్ పౌడర్ ‘’ఇచ్చాడు .అది గాస్ ను సృష్టించి గాలిలో ఎగరటానికి తోడ్పడుతుందని నమ్మాడు .టీన్ ఏజ్ లోనే సెల్లార్ లో షెల్ఫ్ లో గ్లాసులు ,సీసాలు,డబ్బాలు వగైరా  పెట్టి అదే తన లాబ్ అని చెప్పేవాడు .అక్కడే ప్రయోగాలు పరీక్షలు చేసేవాడు పరిశోధన అని చెప్పేవాడు .ఇదే తర్వాత ఊహించని శాస్త్ర బిజినెస్ కు రాచ బాట వేసింది .ఇంకా బోలెడు పుస్తకాలు ,సామాన్లు అవసరమని పించాయి .దీనికి డబ్బుకావాలి కనుక తాను  బిజినెస్ ప్రారంభిస్తున్నానని  తలి దండ్రులకు చెప్పాడు .వాళ్ళు ఇచ్చిన డబ్బుతో డబ్బు రా బట్టే పనులు ప్రారంభించాడు .పదమూడవ ఏట పేపర్లు వేసే కుర్రాడిగా ,కాండీ బుచర్ గాపని చేశాడు  ,పోర్ట్ హర్ట న్ నుంచి  డెట్రాయిట్ దాకా  రైల్లో పిప్పరమెంట్లు అమ్మాడు .సెకండ్ హాండ్  ప్రింటింగ్ ప్రెస్ కొని వార్తలు సేకరించి అచ్చువేసి అమ్మాడు .పోర్ట్ హర్టన్ లో ట్రక్  గార్డెన్ పెట్టి తనకింద కొంత మంది కుర్రాళ్ళను నియమించుకొని బిజినెస్ చేశాడు .ఇప్పటికే అతడు ‘’విజేత ‘’అనిపించుకొన్నాడు .హొరాషియో ఆల్గేర్ కు ఎడిసన్ ‘’మోడల్ యంగ్ హీరో ‘’గా అనిపించాడు .

కుర్ర బిజినెస్ మాన్ – సాహసమే ఊపిరి

ఎడిసన్ ‘’డబ్బు ను మంచి జాగ్రత్త అయిన ఆలోచన చేసి సంపాదించవచ్చు ‘’అని చెప్పాడు అమెరికన్ సివిల్ వార్ లో వార్తాపతికల హాట్ హాట్ కధనాలకు గిరాకీ పెరిగింది. డెట్రాయిట్ ఫ్రీప్రేస్ ‘’కు వెళ్లి తనకు వెయ్యికాపీలు కావాలని కోరాడు .వాళ్ళు ముక్కున వేలేసుకొన్నారు ..ఒప్పుకొని ఇచ్చ్చారు .తన టెలిగ్రాఫ్ మిత్రులకు ముందే సందేశాలు పంపి రైల్వే స్టేషన్ లలో నోటీసులు  అంటించ మన్నాడు .యుద్ధం మొదటి రోజు వార్తలను కవర్ చేసిన పేపర్లను ట్రెయిన్ లో  తెచ్చి అన్ని స్టేషన్ల లోను జనాలకు అందజేశాడు .జనం విరగబడి స్టేషన్లకు చేరారు .ఒక నికెల్ ఉన్న రేటును పది సెంట్లు చేసి పేపర్లు అమ్మాడు .డిమాండ్ ను బట్టి పదిహేను సెంట్లు తర్వాత పాతిక సెంట్లకు అమ్మాడు .చివరికి ముప్ఫై అయిదు సెంట్లకు అమ్మాడు .ఒక్కరోజులోనే వందడాలర్ల లాభం సాధించాడుపదిహేనేళ్ళ కుర్ర బిజినేస్ మాన్  ఎడిసన్ .

రైలు పెట్టే ప్రయోగ శాల

టెలిగ్రఫీ నేర్చినందుకు ఈ బిజినెస్ గొప్పగా చేయగలిగానని చెప్పాడు ఎడిసన్ .ఇతని సాహస గాధలు కధలు కధలుగా చెప్పుకొన్నారు .ఒకసారి మౌంట్ క్లిమేన్స్ స్త్రేషన్  లో ఉండి స్టేషన్ మాస్టర్ తోనూ టెలిగ్రాఫర్ తోను మాట్లాడుతున్నాడు ఎడిసన్ .ఇంతలో టెలిగ్రాఫర్ మెకంజీ కొడుకు ట్రాక్ కు అడ్డంపడి వస్తున్నాడు అప్పుడే ఒక బాక్స్ కార్ వస్తోంది ట్రాక్ మీద .అకస్మాత్తుగా ప్లాట్ ఫాం నుంచి కిందికి దూకి ఆ కుర్రాడిని ఎత్తుకొని పరిగెత్తుకొచ్చి ప్లాట్ ఫాంపైకి చేర్చాడు .కాని ఆ కారు  ఎడిసన్ బుజాలు ఒరుసుకుకుంటూ పోయింది మెకంజీ కృతజ్ఞత చెప్పి తనకు టెలిగ్రాఫ్ ఆపరేషన్ పూర్తిగా రాదనీ ఒప్పుకొని నేర్పమని బ్రతిమిలాడాడు. దీనికి ముందు మరో సంఘటన జరిగింది .రోజూ జర్నీ చేసి ట్రెయిన్ లో రాత్రికిపోర్ట్ హర్ట న్ లోని  ఇంటికిచేరుకోనేవాడు .ట్రెయిన్ అతని రెండవ ఇల్లు అయింది .ఒక సంచిలో ప్రయోగ సామగ్రి పెట్టుకొని ట్రెయిన్ ఎక్కేవాడు .ఎక్కడ ఒక అరగంట ఖాళీ దొరికితే అక్కడే టెస్ట్ ట్యూ బులతో  ప్రయోగాలు చేసేవాడు .ఒకసారి ఆసిడ్స్ తో ప్రయోగం చేస్తే మ౦టవచ్చి ప్రయాణించే కార్ తగలబడింది  కండక్టర్ తంటాలుపడి నిప్పునార్పి చెవులు పిండి బుద్ధి చెప్పాడు .ఇదే మొదటి చెవి గాయం జీవితం లో .ఇంకోసారికూడా రైల్ ప్రయాణం లోనే జరిగింది .ఒకసారి ఒక స్టేషన్ లో దిగి పేపర్లు అమ్ముతుండగా రైలు బయల్దేరే  విజిల్ వేశారు .బండి కదిలింది  పరిగెత్తి ఎక్కబోయాడు .ఒక బాగర్ కార్  అటెం డెంట్ ఎడిసన్ చెవులు పట్టుకొని రైలు ఎక్కించాడు .చెవులకు పెద్దాగయమే అయింది .నయమైనా వినికిడి తగ్గినట్లని పించింది క్రమంగా చెవిటి వాడయ్యాడు

.Inline image 1  .Image result for thomas alva edison

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-7-15 –ఉయ్యూరు   .


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అంతర్వాణి- జులై 2015 సంచికలో ప్రచురించబడిన నా కవిత – మనోనేత్రం – బందా

అంతర్వాణి- జులై 2015 సంచికలో ప్రచురించబడిన నా కవిత – మనోనేత్రం – బందాimg157

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అవి ణా పంచ ప్రాణాలు – తనికెళ్ళ భరణి

అవి ణా పంచ ప్రాణాలు – తనికెళ్ళ భరణి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహిత్యానికి దార్శనికత ఉండాలి -కొండ్రెడ్డి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పుష్కరగోదారి

పుష్కరగోదారిpg1 001 pg2 001 pg3 001 pg4 001 pg5 001 pg7 001 pg8 001 pg9 001 pg10 001 pg11 001 pg12 001 pg14 001 pg15 001 pg16 001 pg17 001

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక సాహిత్యం లో గోదారి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గౌతముని తపః ఫలం గోదావరి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంస్కృతాన్ని ద్వేషిస్తే తెలుగు అభి వృద్ధి చెండుతుందా ?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బుల్లితెరపై అక్షరానికి చోటులేదా?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బీహార్ మండలి ఎన్నికలు బి జె ఫై బూస్ట్ అంటున్న అమిత్ షా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముళ్ళపూడి ”కానుక ”

 

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -59–ఫ్రీడ్రిక్ నీషె (Friedrich Nietzsche)

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -59–ఫ్రీడ్రిక్ నీషె (Friedrich Nietzsche)

26- సాంస్కృతిక విమర్శక శిఖామణి

 

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -59–ఫ్రీడ్రిక్ నీషె (Friedrich Nietzsche)

ఫిలాసఫర్ అని అందరూ ఆయన్ను అన్నా,నీషే విశ్వవ్యాప్త దార్శనికుడు .సామాన్య మానవుని అంతం దగ్గరపడిందని చెప్పినవాడు .సూపర్మాన్ ఆవిర్భావం తప్పదన్న వాడు ,పెద్ద  అరిస్టాక్రాటిక్ గా ప్రపంచాన్ని యేలినవాడు .జీవితం అంటే అంతా చెడ్డదే అని విషాదా౦తమని నమ్మినవాడు.ఏక్షణానికి ఆక్షణం  మనిషి  హీరోగా పాత్రపోషించాలనేవాడు

జర్మనీ దేశం లో ఫ్రీడ్రిక్ వీల్ హెల్మ్ నీషే .సంప్రదాయ మతాను సరణ మధ్య తరగతికుటుంబం లోరాకేన్ లో 15-10-1844 న రాజుగారి పుట్టిన రోజు న జన్మించాడు  ఇది పర్ష్యన్ భాగం లోని సాక్సనీలో ఉంది .తండ్రి లూధరన్ పాస్టర్ కు పెద్దకొడుకు .తండ్రి రాజుగారిపేరు ఫ్రీడ్రిక్ వీల్ హెల్మ్ ను కొడుక్కి పెట్టి ఆ రోజున పెద్ద ఉపన్యాసమిచ్చాడు .ఇతని చెల్లెలే నీషే జీవిత చరిత్ర రాసిన ఎలిసబెత్ .

పుట్టిన  అయిదేళ్లకే తండ్రి చనిపోగా  కుటుంబం నామ్బర్గ్ చేరింది .ఇక్కడ అతనిజీవితం  మంచి పవిత్రులైన తల్లి అమ్మమ్మ చెల్లెలు ఇద్దరు మైడేన్లు స్త్రీల మధ్య గడిచింది.ఇతనిపూర్వీకులు సాధారణ జీవితం గడిపినవారే .కాని తాను పోలిష్ నీషా అరిస్టాక్రాటిక్  వంశానికి చెందిన వాడిని అని చెప్పుకోనేవాడు .జర్మనీ తన మాత్రుదేశామని కారణం అందులో పోలిష్ రక్తం కలిసి ఉందని చెప్పేవాడు .మధ్యవయసులో పోలుల తో పోల్చుకోనేవాడు .వీరు కేధలిక్ దేశం లో ప్రోటేస్టంట్ లుగా   జీవించారని గర్వి౦చేవాడు .

బాలమేధావి అయిన నీషే నాలుగేళ్ళకే చదవటం ,అయిదుకు రాయటం ,ఆరేళ్ళకు బీతొవెన్ స్వరాలు పాడటం చేశాడు .పదేళ్లలోపే మత కవిత్వం రాశాడు .పియానోలతో సంగీత స్వరాలు కట్టాడు .వీధిబడిలో చదవ టానికి వెళ్ళినప్పుడు నీషెను తోటిపిల్లలు ‘’లిటిల్ పాస్టర్’’అనేవారు .బైబిల్ లోని కొన్ని అధ్యాలపై చర్చ చేసేటప్పుడు అక్కడి టీచర్లకు పన్నెండేళ్ళ జీసస్ లాగా అనిపించేవాడు .తోతటిపిల్లలు శుద్ద్ధ శుంఠలని తనకు సరిజోడు కాదని భావించి స్నేహం చేసేవాడుకాదు .అతని ప్రవర్తన అందరికి ఆశ్చర్యం వింత గొలిపాయి..పద్నాలుగేళ్ళ వయసులో ఫార్టా బోర్డింగ్ స్కూల్ లో చేరి ఫైలాలజి ,వాగ్నేర్ మ్యూజుక్ లమీద  ద్రుష్టి పెట్టాడు .ఈ రండు తనని అమితంగా ప్రభావితం చేశాయి .మత గ్రంధ రచానపై ఆసక్తి పెంచుకొన్నాడు .ఆరేళ్ళ తర్వాతా బాన్ యూనివర్సిటిలో చేరి కొద్దికాలం చదివి అక్కడి కుర్రకారు విలాస జీవితాన్ని చూసి దూరంగా ఉన్నాడు .తాగుడు సిగరెట్ లకు అలవాటుపడ్డాడు .ప్రేమలో పడ్డాడు వలచాడు వలపించాడు .వ్యభిచార గృహాలను పావనం చేశాడు .తిరుగుబోతు తాగుబోతు అనిపించుకొన్నాడు .ఒక వేశ్యా గృహానికి వెళ్ళినప్పుడు అతనికి శారీరక మానసిక వికాసం కలిగింది .ఇరవై అయిదు వయసులో సుఖ వ్యాధి అంటుకొని బాగ ఏడిపించింది .త్వరలోనే దీనినుండి విముక్తి పొందాడు .

మొదటినుంచి కంటి చూపు సరిగ్గా ఉండేదికాదు .కాంతి పదేదికాదు కళ్ళకు.సూర్యకాంతిలో మసకగా తలదిమ్ముగా ఉండేది .లేత చీకటిలో బాగా పని చేయగలిగే వాడు .ఏది చేసినా కళ్ళకు శ్రమ అనిపించేది .కనుక ఒక రుషి జీవితం అలవాటు చేసుకొన్నాడు .తాగుడు స్మోకింగ్ పూర్తిగా వదిలేశాడు .పుస్తకాల లో మునిగి తేలేవాడు .ఇది తలనెప్పి తెచ్చేది .ఇరవై ఒకటవ సంవత్సరం లో లీప్జిగ్ యూని వర్సిటి కి బదిలీ అయ్యాడు .కోపెన్ హార్ ను ఆవిష్కరించాడు ..’’ది వరల్డ్ యాజ్   ఐ విల్ అండ్ ఐడియా ‘’చదివాకపూర్తిగా మారిపోయాడు .దాన్ని పదే పడదే చదివాడు .జీర్ణించుకొన్నాడు .కోపెంహార్ తనకోసమే రాసినట్లు తనతో మాట్లాడుతూ చెప్పినట్లు అనిపించింది .అతన్ని స్వయం గా దర్శించిన అనుభూతి పొందాడు .జీవితం లో మొదటి స్వానుభవం అనేక భావాలకు దారితీస్తుంది అనుకొన్నాడు .పుస్తకం చదివి ఆనందం పట్టాలేక అరిచాడు కేకలు పెట్టాడు .మనసు మనిషిని ఉత్తానానికి తీసుకు వెడుతుంది .

ఇరవై నాలుగవ ఏట వాగ్నర్ ను కలుసుకొన్నాడు .అతనిలో కోపెంహార్ ను దర్శించాడు .అతనికలల ప్రతిరూపమే వాగ్నర్ అనిపించింది .అప్పటికే ముసలివాడైన వాగ్నర్ కు శిష్యుడైనాడు .ఇద్దరూకలిసి స్విట్జెర్లాండ్ లో తిరిగారు .1867లో బెసేల్ యూని వర్సిటి లో క్లాసికల్ భాషల కు అధిపతి అయ్యాడు .నీషే రాసిన మొదటి పుస్తకాన్ని గురువు వాగ్నర్ కు అంకితమిచ్చాడు .దీనిపేరు ‘’ది బర్త్ ఆఫ్ ట్రాజేడి ఫ్రం ది స్పిరిట్ ఆఫ్ మ్యూజిక్ ‘’.నీషే వేదాంతం బాగా ప్రాచుర్యం పొందాక దీనికి ‘’హేలినిజం అండ్ పెసిమిజం ‘’అని పేరు మార్చాడు .

కోపెంహార్ సిద్ధాంతాన్ని తన సిద్ధాంతం లో పోదివాడు .’’the more knowledge the more virtue ‘’అన్నది ఆయన సిద్ధాంతం .వాగ్నర్ సంగీత రూపకాలలో పురాతన గ్రీకు ట్రాజేడీలను చూశాడు .గ్రీకు దయోనేషియాస్ సింబాలిజం కంటే గొప్ప సింబాలిజం లేదన్నాడు .క్రిష్టి యానిటి  వలన నైతిక పతనం వచ్చింది అంటాడు .ఈ భావనలతో క్రైస్తవ పెద్దలు ఎదురు తిరిగి అతని ప్రొఫెసర్ పదవి మంగళం పాడించారు .ముప్ఫై వ ఏట నీషే వ్యక్తిగా గొప్ప మార్పు చెందాడు .మనిషిలోను మార్పు వచ్చింది .అతఃను ఏ విషయం పైనా చెప్పిన మాట చివరిది అంతిమ నిర్ణయమే అయి గౌరవం పొందింది 1970ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం లో నీషే ఆరోగ్యంబాగా దెబ్బతిన్నది .ఆమ్బులన్స్ డ్యూటీ చేసేవాడు .న్యుమోనియా వచ్చింది .మత్తుమందుకు బానిసయ్యాడు .సిఫిలిస్ తగ్గిన తర్వాత ఏదో ఒక జబ్బు వెంటాడింది ‘

యూని వర్సిటి నుంచి కొద్ది పెన్షన్ వచ్చేది .దానితోనే గడిపాడు ;తిరిగాడు రాశాడు .ఒక రష్యన్ ఫిన్నిష్ అమ్మాయి తో ప్రేమలో పడ్డాడు పెళ్లి చేసుకొందామనుకొన్నాడు కాని ఆమె కాదని అంది ‘కలిసిఉందాం అన్నాడు .తనను కాదన్న వారంటే అతనికి కోపం. భరించలేక పారి పోయిన్దామే .అలాగే వాగ్నర్ తో సంబంధమూ బెడిసింది .అతను చేసిన ‘’ది రింగ్ ఆఫ్ ది నీబెలా౦గ్ ‘’గొప్ప విజయం సాధించింది .వాగ్నర్ కొత్త సిద్ధాంతం ప్రతిపాదిస్తున్నాడను కొన్నాడు .అతనిపై ద్వేషం పెరిగింది .దీన్ని ‘’ది కేస్ ఆఫ్ వాగ్నర్ ‘’,ది త్విలైట్ ఆఫ్ ది  గాడ్స్ ‘’నీషె కాంట్రా వాగ్నర్ ‘’రచనల్లో వెళ్ళ గ్రక్కాడు .

నలభై వ ఏట ‘’అన్ టైమిలీ థాట్స్’’,హ్యూమన్ ఆల్ టూహ్యూమన్ ‘’ది డాన్ ఆఫ్ ది డే’’,ది జాయ్ ఫుల్ సైన్స్ ‘’,దస్ స్పోక్  జొరాస్ట్ర’’గ్రంధాలు రాసి ప్రచురించాడు .ఇవిబాగా ప్రసిద్ధి చెందాయి .తర్వాత ‘’బియాండ్ గుడ్ అండ్ ఈవిల్ ‘’.’’ది జీనాలజి ఆఫ్ మోరల్స్ ‘’స్వీయ చరిత్రగా ‘ఈకే హోమో ‘’రాశాడు .చనిపోయాక ప్రచురితమైన గ్రంధం ‘’ది యాంటి క్రైస్ట్అండ్  ది విల్ టు పవర్’’. దీనికి ‘’హౌ టు ఫిలాసఫైజ్ విత్ హామర్’’  అని టాగ్ తగిలించాడు .వచ్చే రెండు శతాబ్దాల చరిత్ర రాయాలను కొన్నాడు .

నీషే కి నలభై అయిదవ ఏట అకస్మాత్తుగా జబ్బు వచ్చింది .వీధిలో కూలిపోయాడు .బెసేల్ హాస్పిటల్ లో చేర్చాడు .తర్వాత జేనాలో శరణాలయం లో చేర్చారు .మెదడు దెబ్బతిన్నా ఒక ఏడాది జీవించాడు .తల్లి చెల్లి వచ్చి కనిపెట్టుకొని ఉన్నారు .వాళ్ళ ముఖాలలో విచారం  చూసి ఏడవటం దేనికి సుఖంగా లేమా అని అడిగాడు .25-8-1900లో యాభై ఆరవ ఏట నీషే మరణించాడు .నీషే చెప్పిన విల్ టు పవర్ కు ప్రేరణ పొంది  హిట్లర్ రేడవ ప్రపంచ యుద్ధం ప్రారంభించాడు .ఈ యుద్ధంవస్తుంది అని నీషే ముందే ఊహించి చెప్పాడు .’’within fifty years the governments will clash in a gigantic war for the markets of the world .”’the blond beasts ,the race of conquerors and masters ,shall rise again from the ashes of men –they shall rise in mightier  more deadly form ‘’అని చెప్పిన దార్శనికుడు నీషే ‘

రచయితగా జర్మనీ లో ఉత్తమ సృజన కర్త న్నారు .కొందరు బ్రూటల్    గా పొగరుబోతు తనంగా రాశాడు అన్నారు ‘జొరాస్ట్ర పుస్తకానికి ‘’ఏ బుక్ ఫర్ ఎవిరి వాన్ అండ్ నో వన్’’అని ఉప శీర్షిక పెట్టాడు .జీవిత చివరిభాగం లో నీషే అదృష్టం వక్రించింది .కాని చనిపోయాక మళ్ళీ ప్రాభవం పొందాడు .క్రిస్టియానిటి లోని బానిస నైతికతను ఎదిరించాడు.’’blood is the spirit of man .Of all that is written ,I love only that which is written in blood ‘’అన్నాడు నీషే .ఆధునిక యాంత్రికత మనిషిని పశువును చేస్తుందని దానిపై నియంత్రణ ఉండదని కనుక తస్మాత్ జాగ్రత అని ముందే చెప్పాడు నీషే .

స్లేవ్ మొరాలిటి శూన్యవాదానికి దారితీస్తున్దన్నాడు నీషే.బానిసపై యజమాని పెత్తనాన్ని సమర్ధించాడు  .అతని గాడ్ ఈజ్ డేడ్ లో నిరీశ్వర వాదం ఉంది .పాసివ్ నిహిలిజం ను సమర్ధించాడు A nihilist is a man who judges that the real world ought not to be, and that the world as it ought to be does not exist. According to this view, our existence (action,suffering, willing, feeling) has no meaning: this ‘in vain’ is the nihilists’ pathos—an inconsistency on the part of the nihilists.

—Friedrich Nietzsche, KSA 12:9 [60], taken from The Will to Power, section 585, translated by Walter Kaufmann

For it was Nietzsche’s historic achievement to understand more clearly than any other philosopher…not only that what purported to be appeals of objectivity were in fact expressions of suCritique of mass culture[edit]

Friedrich Nietzsche held a pessimistic view on modern society and culture. His views stand against the concept of popular culture. He believed the press and mass culture led to conformity and brought about mediocrity. Nietzsche saw a lack of progression, leading to the decline of the human species. According to Nietzsche, individuals needed to overcome this form of mass culture. He believed some people were able to become superior individuals through the use of will power. By rising above mass culture, society would produce higher and healthier human beings.

bjective will, but also the nature of the problems that this posed for philosophy.[1

 Nietzsche187a.jpg   Image result for nietzscheFriedrich Nietzsche Signature.svg

 దాదాపు ఇరవై గ్రంధాలు రాశాడు నీషే . 

 

మరో ప్రముఖునితో కలుద్దాం

       సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-7-15 ఉయ్యూరు 

Image result for nietzsche

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

టెన్నిస్ మహారాణికి మరోహారం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విది రాసిన స్క్రీన్ ప్లే నాది -సురేష్ కృష్ణ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాబుకు ఇంటి పోరు -హాలీవుడ్ ఉమర్ షరీఫ్ విప్లవ మార్గ దర్శి డి వి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోదారికి శ్రీనాధుని పద్యాంజలి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment