రేవంత్రెడ్డి ని బుక్ చేశారు .నాకె పాపం తెలియదన్న రేవంత్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చస్తూ ప్రతీకారం తీర్చుకున్న సొరచేప

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాజిక్ రియలిజం కు ఆద్యుడు -గుంటర్ గ్రాస్ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి శత జయంతి -కధల్లో లైంగిక శ్రమ విభజన

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇంత ”వడ” చరిత్రలో అయిదవ సారి-

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా ఇంటి పురోహితులు శ్రీ వంగల సుబ్బయ్య గారి మునిమనవడు ఉపనయన వేడుక

మా ఇంటి పురోహితులు శ్రీ వంగల సుబ్బయ్య గారి మునిమనవడు(కుమార్తె శ్రీమతి మనోహరి మనుమడు -రమేష్ కుమారుడు )ఛి శరశ్చంద్ర లోచన్ ఉపనయన వేడుకల ఫోటోలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

భాషకి ప్రాణం వ్యాకరణం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏడుకొండలపై ”బొయనాయుడు ”

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రెండు వేల ఏళ్ళ నాటి గాజు పరిశ్రమ -భువన గిరి వద్ద లభించిన ఆధారాలు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జపమహిమ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హిందువులు అంటే ఎవరు ?డా అరవిందరావు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

2014 నంది నాటక అవార్డులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సూట్ కేసు కన్నా సూటూ బూటూ మిన్న -మోడీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హాట్ హాట్ ధిల్లీ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాలుష్యతాపం!

కాలుష్యతాపం!

  • 30/05/2015
TAGS:

ఆకుపచ్చదనానికీ ఎండవేడిమికీ మధ్యగల విలోమ సంబంధం గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కాలుష్యానికి వేసవి అగ్నికీలలకూ మధ్యగల అనులోమ అనుపాతం గురించి శాస్తవ్రేత్తలు చర్చిస్తున్నారు, సలహాలిస్తున్నారు. పచ్చని చెట్లు ఆకుపచ్చని పొలాలు పెరిగితే ఎండవేడిమి తగ్గిపోతుందన్నది విలోమ అనుపాతం- యాడ్వర్స్ రేషియో- పరిసరాలలో కాలుష్యం పెరిగినట్లయితే ఉష్ణోగ్రత కూడ పెరిగిపోవడం అనులోమ అనుబంధం-డైరెక్ట్ రేషియో- ఉభయ తెలుగు రాష్ట్రాలు పదిరోజులకు పైగా నిప్పుల కుంపట్లుగా మారడం ఈ చర్చలకు నేపథ్యం, గ్రీష్మతాప శరాఘాతాలకు ఉభయ రాష్ట్రాలలో తొమ్మిది వందలమంది ఆహుతైపోవడం అభూతపూర్వ విషాదం…ఉభయ రాష్ట్రాలలోను ఆకుపచ్చని స్థలాలు నానాటికీ సన్నగిల్లిపోతుండడం వల్ల రానున్న వేసవి ఋతువుల్లో ఉష్ణోగ్రత యాభయి డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గరకు చేరే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోందట. ప్రధాని నరేంద్రమోదీ నియమించిన వాతావరణ అధ్యయన మండలి సభ్యులు ‘పచ్చదనం పెంచడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని’ సూచించారట. ఈ ఏడాది సగటున రాష్ట్రంలో నలబయి నాలుగు డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఇంతమంది ప్రాణాలు ఎండ మంటలలో మాడిపోయాయి. కొన్ని చోట్ల నలబయి ఆరు డిగ్రీలకు ప్రస్తుతం ఉష్ణోగ్రత పెరిగింది. అందువల్ల రానున్న సంవత్సరాలలో యాబయి డిగ్రీల సెంటీగ్రేట్-నూట ఇరవై రెండు ఫారెన్‌హీట్- డిగ్రీలకు వేసవిలో ఉష్ణోగ్రత పెరిగినట్టయితే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందన్నది ఊహించుకోవచ్చు. అటవీ విధ్వంసం వల్ల, రసాయన రసాయనేతర విష కాలుష్యం వల్ల ప్రపంచం మొత్తం మీద ప్రతి ఏటా ఉష్ణోగ్రత పెరిగిపోతోందని దశాబ్దులుగా ఆందోళన వక్తం అవుతూనే ఉంది. అయితే మనదేశంలోను పరిసరాలలోను ప్రపంచస్థాయిని మించి ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఇందుకు కారణం పచ్చదనం క్రమంగా అడుగంటి పోతుండడం. మూడువందల ఇరవై కోట్ల మొక్కలను పెంచడం ద్వారా ప్రకృతి ప్రాంగణంలో ఆకుపచ్చని అందాల సభలు తీర్చాలన్న తెలంగాణ ప్రభుత్వం వారి సంకల్పం అభినందనీయం…ఈ మొక్కలన్నీ పెరిగి పెద్దవై వృక్షాలుగా విలసిల్లినట్లయితే వేసవి అగ్నిని ప్రతిఘటించగల చల్లదనం విస్తరిస్తుంది. కానీ ఈ మొక్కలు నాటడానికే అనేక ఏళ్లు పడుతోంది. అవి అవినీతి మచ్చనిచ్చే చెట్లుగా మారడానికి ఎంతకాలం పడుతుందో? సమాంతరంగా పారిశ్రామిక వాణిజ్య వాటికలకోసం ఎంత విస్తీర్ణంలో అడవులు, పొలాలు అంతరించిపోతాయి? ప్రపంచీకరణ ప్రకృతి పచ్చని పటానికి కన్నాలు వేస్తుండడం నడుస్తున్న వైపరీత్యం.
కాలుష్యం వల్ల వేడి పుట్టడం కాలుష్యం పెరిగిన కొద్దీ వేడి పెరగడం విశ్వ వ్యవస్థలోని సహజ పరిణామక్రమం. కాలుష్యాన్ని నిర్మూలించకపోయినట్టయితే కాలుష్యం క్రమంగా భూమిని కబళిస్తుంది. కృతయుగంలో క్షీరసాగర మథనంలో పుట్టిన కాలుష్యం-హాలాహలం- భయంకరమైన వేడిని వ్యాపింపజేయడం చరిత్ర…ఆ విషాన్ని పరమశివుడు మిం గడం వల్ల బయట వేడి తగ్గినప్పటికీ లోపలి వేడి పెరిగింది. ఆ వేడిని చల్లార్చడం కోసమే ఆకాశంలోని గంగ భువికి దిగింది. గంగ నీటికి ప్రతీక. నీరు కాలుష్యాన్ని కడిగివేస్తుంది. కడిగివేయాలన్నదే భారతీయుల తరతరాల ఆకాంక్ష. ‘ఆపఃపునస్తు పృథివీ, పృథివీ పూతాపునాతుమామ్’’- నీరు భూమిని శుభ్రం చేయుగాక, శుభ్ర పడిన భూమి మమ్ములను పరిశుభ్రం చేయుగాక- అన్నది మన జాతీయ సమష్టి జీవన సంప్రదాయం. నీరు పరిశుభ్రంగా విస్తరించిన కొద్దీ మొక్కలు తీగెలు చెట్లు వనాలు బతికి పచ్చదనాన్ని పంచుతాయి. మనదేశం అంతటా బావులు చెరువులు, గుడులు, మడుగులు, కోనేళ్లు, కొండవాగులు, బుగ్గలు, విస్తరించడం పచ్చదనపు చరిత్ర…బ్రిటిష్ వారు మనదేశంలోకి చొరబడిన తరువాతనే అటవీ సంపద హరించుకొని పోయింది. ప్రతి దేశంలోను మొత్తం భూమిలో కనీసం ముప్పయిమూడు శాతం అటవీ ప్రాంతం ఉండాలన్నది ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం వారు 1950వ దశకం నుండి చెబుతున్న మాట. మొదట ప్రపంచ యుద్ధానికి పూర్వం మనదేశం యాబయిశాతానికి పైగా భూభాగంలో అడవులు ఉండేవి. ఆవులు, పశువులు, మేయడానికి వీలైన పచ్చిక బయళ్లు ఉండేవి. కాని ఇప్పుడు మన అటవీ ప్రాంతం పరిమాణం ఇరవై నాలుగు శాతం కంటె తక్కువ.
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలోను, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోను బ్రిటిష్ వారు భారీగా మన అడవులను నరికి కలపను తమ దేశానికి, ఇతర దేశాలకు తరలించారు. చల్లని నీడను కొల్లగొట్టడానికి అది ఆరంభం. మొక్కలు, చెట్లు తగ్గిపోతున్న కొద్దీ వేసవి అగ్నిగుండంగా విస్తరించడం ఆరంభమైంది. ఈ వాస్తవ ధ్యాస ఉన్నప్పటికీ 1947నుండీ కూడ మన ప్రభుత్వాలు అటవీ విధ్వంసాన్ని ఆపకపోవడం మొదటి వైపరీత్యం. 1990వ దశకంలో ప్రపంచీకరణ వ్యవస్థీకృతం కావడంతో పచ్చదనపు వాటికలు పాడుబడి సిమెంటు రహదారులు విస్తరించడం మొదలైంది. ఇది రెండవ వైపరీత్యం. ప్రపంచీకరణలో భాగం గా బహుళజాతీయ వాణిజ్య సంస్థలు చొరబడిపోయాయి. దేశమంతటా వెలసిన ప్రత్యేక ఆర్థిక మండలాలు లక్షలాది ఎకరాల అటవీ వ్యవసాయ భూమిని దిగమింగుతుండడం గ్రీష్మతాపం భయంకరంగా పెరుగుతుండడానికి దోహదం చేసింది. బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు పారిశ్రామిక ప్రగతిలో భాగంగా కొండలను ఇసుక పర్రలను తవ్వేశాయి. ఫలితంగా కొండవాగులు ఎండిపోయాయి. భూగర్భ జలాలు ఇంకిపోయాయి. చెట్లు ఎలా పెరుగుతాయి? సతతహరిత ప్రాంతాలయిన పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు మోడు వారడం ఉష్ణోగ్రత పెరగడానికి ప్రధాన కారణం. అటవీ ప్రాంతం కనీసం ముప్పయిశాతానికి చేరేవరకు ఒక్క ఎకరం భూమిని కూడ పరిశ్రమలకు కేటాయించరాదన్న ధ్యాస ప్రభుత్వాలకు కలిగే వరకు ప్రతి ఏడాది మరింతగా ఉష్ణోగ్రత పెరుగుతూనే ఉంటుంది. వేసవి మరణాల సంఖ్య మరింత పెరగకుండా నిరోధించడానికి ఈ ధ్యాస అనివార్యం…
కానీ పచ్చదనం పాలిట కరకు కసాయి గొడ్డలిలా తయారైన ప్రపంచీకరణ మరింత బలపడుతోంది. పచ్చదనాన్ని పరిరక్షించాలన్న పట్టుదల వల్ల పారిశ్రామిక ప్రగతి కుంటుపడుతుందన్నది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2011 ఫిబ్రవరి మూడవ తేదీన ఢిల్లీలో చేసిన చారిత్రక ప్రకటన. అంటే అడవులను పచ్చదనాన్ని కాపాడడం కంటె కృత్రిమమైన పారిశ్రామిక కాలుష్య వాటికలు ఏర్పడడం ప్రధానమన్నమాట. ఈ కాలుష్య వాటికలు ప్రత్యేక అర్థిక మండలులు..ఉష్ణోగ్రత పెరగకుండా ఎలా నిరోధించగలరు. ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా పచ్చదనానికి విఘాతకరమైన పారిశ్రామిక విధానాన్ని కొనసాగిస్తోంది. భూమి సేకరణ సవరణ ఇందుకు సరికొత్త సాక్ష్యం…‘దీపం తేరా దిగనేతాము..’ అన్న చందంగా ఒకవైపున గంగ ప్రక్షాళన జరుగుతోంది..మరోవైపున ప్రపంచీకరణ విస్తరించిపోతోంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కల్పవృక్షం కనుమరుగు? -వేంపల్లి గంగాధర్.

కల్పవృక్షం కనుమరుగు?

  • 31/05/2015
  • -వేంపల్లి గంగాధర్.. 9440074893

రక్తచందనం.. ఈ మాట ఇప్పుడు దశదిశలా విన్పిస్తోంది. కొందరు భయంతోను, కొందరు ఆశతోను, కొందరు ఆశ్చర్యంతోనూ ఈ మాటను వింటున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎర్ర దొంగలపై కనె్నర్ర చేయడంతో శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌తో ఇప్పుడు ‘ఎర్రచందనం’ గురించి అన్నీ సంచలన వార్తలే వినిపిస్తున్నాయి. తిరుమల వెంకన్న సమక్షంలో నిశ్చింతగా, ఏపుగా ఎదుగుతున్న ఎర్రచందనం వృక్షాలను నిట్టనిలువునా నరికేసి అక్రమంగా తరలించి విదేశాల్లో తెగనమ్ముతున్నారు. వాయు, జల, భూ మార్గాల్లో దేనినీ వదలకుండా రక్తచందనం దుంగల్ని తరలించేస్తున్నారు. ఈ అక్రమాలలో అంతర్జాతీయ స్మగ్లర్లు, అధికారులు, రాజకీయ నేతలు, పోలీసులు, సినీనటులు, సాధారణ పౌరులు, కూలీలు మమేకమైపోయారు. ఏ ఎదురూ బెదురూ లేని మాఫియా కనుసన్నల్లో శేషాచలం అడవులు చిన్నబోవడం ఇప్పటి తంతుకాదు. అయితే ఇపుడు స్మగ్లర్ల ఆటకట్టించేందుకు ప్రభుత్వం ఉచ్చు బిగించడంతో నివ్వెరపరిచే నిజాలు బయటపడుతున్నాయి. ఎందుకంత విలువ? ఈ భూగోళంలో రక్తచందనం మొక్కలు పెరిగే వాతావరణం ఒక్క శేషాచలం అడవుల్లోనే ఉంది. చిత్తూరు, కడప ప్రాంతాల్లో విస్తారంగాను, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో అక్కడక్కడ రక్తచందనం చెట్లు పెరుగుతాయి. తమిళనాడు, కర్నాటకల్లో ఒకటీ అరా ప్రాంతాల్లో పెరిగినా ఇక్కడ మొక్కల నాణ్యత అక్కడ లేదు. ఆయుర్వేద ఔషధాల తయారీలో, సంప్రదాయ వస్తువులు, పరికరాల తయారీకి దీనిని విస్తృతంగా వాడతారు. ఈ కలపతో చేసే వస్తువులు ఇంట్లో ఉంటే శుభం జరుగుతుందని చాలామంది విశ్వాసం. చైనా, జపాన్ సహా ఆరు దేశాలకు మనదేశంలోని ఎర్రచందనం కావాల్సి వస్తోంది. చైనా, జపాన్‌లకైతే ఏటా 3వేల టన్నులకు పైగానే ఎర్రచందనం అవసరం ఉంది. 2000 సంవత్సరం నుండి మనదేశంలో ఎర్రచందనం ఎగుమతిపై నిషేధం ఉండటంతో అక్రమ మార్గాలకు ద్వారాలు తెరుచుకున్నాయి. ప్రపంచ మార్కెట్‌లో టన్నుకు సరాసరి 1.5 కోట్ల ధర పలకడంతో ఈ చెట్లు స్మగ్లర్లకు కల్పవృక్షాలుగా మారిపోయాయి. ఈ చెట్లకు ఉండే అరుదైన లక్షణం అణు ధార్మికతను తట్టుకోగలగడం. దీనివల్ల కూడా చైనా, జపాన్‌లు దీని కోసం తహతహలాడుతున్నాయి. ఇప్పటి పరిస్థితి శేషాచలం అడవుల్లో 5,200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 5 లక్షల ఎకరాల్లో ఎర్రచందనం చెట్లు ఉన్నాయని అంచనా. వీటిలో 40 శాతం వృక్షాలు ఇప్పటికే స్మగ్లర్ల చేతుల్లో నేలకూలి, విదేశాలకు తరలిపోయాయి. మిగిలిన వాటిని రక్షించుకునేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. రాజకీయ, ఇతర కారణాలు పక్కనపెడితే రాష్ట్ర ఆర్థిక అవసరాలు కూడా ఎర్రచందనం వృక్షాలను కాపాడుకునే విషయంలో ప్రభుత్వం కరకుగా వ్యవహరించడానికి కారణమవుతున్నాయి. ఆధునిక ప్రపంచంలో చాలామందికి డబ్బే ప్రధానం. అన్నింటినీ వ్యాపార దృష్టితో చూసేవారికి మంచీ చెడుతో పనిలేదు. మనం బాగుంటే చాలనుకుని, మన తరువాతి తరాల భవిష్యత్ గురించి ఏమాత్రం బెంగలేదనుకునే తత్వం ఉన్నవాళ్లకు పచ్చని చెట్లను నరికేసి, నాలుగురాళ్లు వెనకేసుకోవడం పెద్దకష్టం కాదు. కష్టమైనా వదిలిపెట్టే రకం కాదు వాళ్లు. తమ పనిలో అడ్డొచ్చే చట్టమైనా, చెట్టైనా, అధికారులైనా వారికి ఒక్కటే. ఆ భావనే శేషాచలం అడవుల్లో రక్తచరిత్రకు కారణమవుతోంది. * * * శేషాచలం అడవుల్లో ఇటీవల ఎన్‌కౌంటర్ ఎర్రచందనం చెట్ల దుంగలను తరలిస్తున్నవారు పెద్దసంఖ్యలో మరణించడం దేశంలో సంచలనానికి కారణమైంది. నిజానికి అంతకుముందు చాలాసార్లు ఎదురుకాల్పులు, స్మగ్లర్ల ఎదురుదాడులు, అటవీశాఖ సిబ్బందిని హతమార్చడం వంటి సంఘటనలు జరిగినా ఏమాత్రం స్పందించని సమాజం ఈసారి ఎన్‌కౌంటర్‌తో అతిగానే స్పందించింది. అధునాతన ఆయుధాలు సమకూర్చుకున్న అటవీశాఖ, శేషాచలం అడవుల్లో చాలాచోట్ల నిఘాకెమెరాలు అమర్చి స్మగ్లర్ల కదలికలపై నిఘాపెట్టింది. చాలాకాలంగా స్మగ్లర్లదే పైచేయిగా వస్తున్న వ్యవహారంలో ఇప్పుడు అటవీశాఖ అధికారుల కఠినవైఖరి కారణంగా కథ అడ్డం తిరిగింది. ఎన్‌కౌంటర్‌పై ఎన్ని యాగీలు జరిగినా, ఈ సంఘటనతో ప్రపంచం దృష్టి ఎర్రచందనం, శేషాచలం అడవుల ప్రాశస్త్యంపై పడింది. అలాగే, ఈ ఎర్రచందనం మాఫియా ఎత్తులు, జిత్తులు, ఆ చెట్ల విలువ ప్రపంచానికి తెలిసొచ్చాయి. భయపడని మాఫియా ఈ ఎన్‌కౌంటర్ జరిగిన పనె్నండు రోజులకే కడప సబ్ డివిజన్ పరిధిలో వంద గొడ్డళ్లు, ఎర్రచందనం దుంగలు చిక్కాయి. రైల్వేకోడూరులోని వాగేటికోన రిజర్వాయర్ సమీపంలో ఎర్రచందనం దుంగలు, కూలీలు పట్టుబడ్డారు. ఎన్‌కౌంటర్ ‘చూసిన’ తర్వాత కూడా స్మగ్లర్లు, తమిళ కూలీలు వెనుకడుగు వేయడం లేదంటే, ప్రాణాలకు తెగించి వస్తున్నారంటే వారికి ప్రాణంకన్నా విలువైనదేదో లభిస్తోందని కదా అర్థం. నిజానికి వీరి ప్రాణాలను ఫణంగా పెట్టి దళారుల దండుకుంటున్నదే ఎక్కువ. ఇదీ అక్రమ మార్గం ఎర్రచందనం చెట్లను నరికి, ‘డ్రస్సింగ్’ చేసి, ఆ దుంగలను దిల్లీ, కోల్‌కతా, ముంబయి, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు తరలిస్తున్నారు. అక్కడ చిన్నచిన్న ముక్కలుగా చేసి సుమారు ముప్పై కిలోల చొప్పున విద్యార్థుల బ్యాగుల్లో సర్ది వారికి విమాన టిక్కెట్లు ఇచ్చి విదేశాలకు ఎగుమతి చేయడం ఒక పద్ధతిగా వెలుగులోకి వచ్చింది. ఇదే కోణంలో నుంచే హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎర్రచందనం కొయ్యలను పొడి రూపంలోకి మార్చి దుబాయ్ మీదుగా చైనాకు తరలిస్తున్న వైనమూ బయటపడింది. రెండు, మూడు నెలల వ్యవధిలోనే సుమారు వంద కిలోల ఎర్రచందనం పౌడర్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడమే దీనికి ఉదాహరణ. ఎర్రచందనం అక్రమ రవాణాలో తమిళనాడు కీలక కేంద్రంగా ఉంటోంది. రోడ్డు మార్గాన చెన్నైకి చేర్చుకొని ఆపై సముద్ర మార్గాన చైనాకు యథేచ్ఛగా తరలిస్తున్న ‘బడా స్మగ్లర్లు’ కోట్లకు పడగలెత్తారు. వేరశనగ పప్పు, ఉప్పు, వంట సామాగ్రి పేరుతో ఎర్రచందనం దుంగలు నింపి సింగపూర్‌కు తరలించేందుకు సిద్ధమైన కంటైనర్‌ను గతంలో చెన్నై పోర్టు అధికారులు తనిఖీచేసి 18 టన్నుల ఎర్రదుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే అనుమానంతో సింగపూర్‌కు బయలుదేరిన మరొక కంటైనర్‌ను వెనక్కి రప్పించగా అందులో పద్దెనిమిది టన్నుల ఎర్రచందనాన్ని పట్టుకోగలిగారు. తప్పుడు లేబుల్స్, సర్ట్ఫికెట్లు సృష్టించి ఎగుమతి చేస్తున్నారు. మయన్మార్ నెట్‌వర్క్… కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని సరిహద్దు గ్రామాల నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఎర్రచందనం చేరుతోంది. ఓడరేవులకు చేరిన తర్వాత అక్కడి కంటైనర్లలో సరకుల కింది భాగంలో దుంగలను చేర్చి తరలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చూసీ చూడనట్లు వదిలేయడానికి వీలుగా కస్టమ్స్ అధికారులకు ‘ఖరీదైన బహుమతులు’ ఇచ్చి స్మగ్లర్లు ప్రలోభపెడుతున్నారు. ముందుగా రోడ్డు మార్గాల ద్వారా పశ్చిమబెంగాల్, బీహార్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, మిజోరం, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం వంటి ఈశాన్య రాష్ట్రాలకు చేర్చుకొని అక్కడి నుంచి బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, భూటాన్, చైనాలకు తరలించేస్తున్నారు. ప్రతి ప్రాంతంలో అక్కడి నిరుద్యోగ యువత, కూలీలతో కొరియర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని అత్యంత రహస్యంగా సరిహద్దులు దాటిస్తున్నారు. తమ దేశానికి ఎర్రచందనం తరలించగలిగితే ప్రపంచంలో ఎక్కడికైనా స్మగ్లింగ్ చేయగలిగిన సత్తా తమకుందని ‘మయన్మార్ నెట్‌వర్క్’ నిరూపిస్తోంది. బర్మా నుంచి శరణార్థులుగా భారత్‌కు వచ్చిన వారు ఇందులో ప్రధాన భూమిక పోషిస్తుంటారు. మరో దారిలో గుజరాత్‌లోని కాండ్లా నౌకాశ్రయానికి, అక్కడి నుంచి నౌకల్లో దుబాయ్‌కి ఎర్రచందనం దుంగలు తరలిపోతున్నాయి. పశ్చిమబెంగాల్ నుంచి అగర్తలాకు తరలించి అక్కడి నుంచి చైనా, జపాన్‌లకు పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించగలిగారు. చెన్నై – కోల్‌కతా జాతీయ రహదారి ద్వారా ఒరిస్సా, పశ్చిమబెంగాల్ మీదుగా దుంగలను అగర్తలాకు పంపుతున్నారు. తమిళనాడు నుంచి… తమిళనాడులోని వేలూరు, తిరువన్నామలై, చెంగల్‌పట్టు జిల్లాల నుంచి పెద్దఎత్తున కూలీలు ‘ఎర్రచందనం’ కొయ్యలను కొట్టడానికి ఆంధ్రా అడవుల్లోకి వస్తున్నారు. చిత్తూరు జిల్లాకు యాభై కిలోమీటర్ల దూరంలోంచే సరిహద్దు మొదలవుతోంది. జవాది కొండల్లోని కావలూర్, పల్లంబట్టు, కోమటేరు, వీరప్పనూర్, కోయలూర్, దానమత్తూర్, జమునామరత్తూర్ ప్రాంతాల్లోని కూలీలను ఎంపిక చేసుకొని వృక్షాలను కొట్టడానికి ఏజెంట్లు పిలిపిస్తున్నారు. కూలీలను బృందాలుగా విడదీసి ఎవరు ఎక్కడికి వెళ్లి చెట్లు నరకాలో ముందే చెబుతారు. ఒక కూలీ సుమారు నెల నుండి రెండు నెలల వరకూ అడవిలోనే ఉండవలసి ఉంటుంది. దుంగలు నరకడం, వాటిని మోసుకొని ఒక చోటికి చేర్చడం, అక్కడ్నుంచి వాహనాల్లోకి ఎక్కించడం వంటి పనులన్నీ వారే చేయాల్సి ఉంటుంది. స్మగ్లర్లు కూలీలకు కన్పించకుండా ఏజెంట్ల ద్వారా అన్ని పనులూ చేయిస్తుంటారు. పది రోజుల పనికి ఒక్కొక్క కూలీకి 75 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. కూలీల ప్రత్యేకత ఇదీ.. అడవుల్లో ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల వరకు దుంగల్ని భుజాలపై మోసుకొని రాగల శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం తిరువణ్ణామలై, సేలం, విల్లుపురం జిల్లాలకు చెందిన మలయాళీ గిరిజనుల ప్రత్యేకత. మిగతా చెట్లతో పోలిస్తే ధృడంగా, బరువుగా ఉండే ఈ చెట్లను నరకడమే చాలాకష్టం. వీటిని నరికి, తరలించే పని కష్టంతోను, ప్రమాదంతోనూ కూడుకున్నది కావడంతో వారికి భారీ ఎత్తున నగదు ఆశచూపి ఈ రొంపిలోకి ఈడుస్తున్నారు. ఏ పనుల్లేని పేదలు దీనికి ఒప్పుకుంటున్నారు. తమిళనాడు నుంచి దాదాపు ఐదు వేల మంది కూలీలు ఈ పనిపైనే ఆధారపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జైళ్లలో ఇప్పటికే రెండు వేల మందికిపైగా తమిళ కూలీలు శిక్ష అనుభవిస్తున్నారు. తిరుపతి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్లో చనిపోయిన ఇరవై మంది ఎర్ర కూలీల్లో ఎక్కువమంది జవ్వాదిమలై ప్రాంతానికి చెందినవారే. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూడా జవ్వాదిమలై ప్రాంతానికి చెందినవాడే. వీరప్పన్ హతమయ్యాక అతడి అనుచరులు ఎర్ర చందనంపై దృష్టి పెట్టారు. గత పదేళ్లలో సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించారు. సరిహద్దులు దాటిపోయిన ఎర్రచందనం విలువ అక్షరాలా నలభై వేల కోట్లు! సోమశిల జలాల్లో.. సోమశిల వెనుక ఉన్న జలాల్లోనూ, జలాశయంలోనూ ఎర్రచందనం దుంగలు పలుసార్లు బయటపడుతూ వచ్చాయి. కడప-నెల్లూరు సరిహద్దుల్లోని సోమశిల జలాశయం సమీపాన వెలిగొండ అడవుల్లోంచి ఎర్రచందనం దుంగలను నీళ్లలో డంప్ చేసుకుంటూ తరలించుకుపోయారు. రాపూరు, రాజంపేట, ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాల మీదుగా వీటిని చెన్నైకి తరలించుకుపోతూ వచ్చారు. జలాశయం వద్ద మత్స్యకారుల్లా, తిరుమలకు భక్తుల రూపంలో వందల సంఖ్యలో తమిళ కూలీలు శేషాచలానికి చేరుకుంటున్నారు. ఏడాదికి పది నుంచి ఇరవై టన్నుల ఎర్రచందనం దుంగలు సోమశిల జలాశయంలో అటవీ అధికారులు స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. సోమశిల ‘బ్యాక్ వాటర్’ ప్రాంతమైన కడప జిల్లా ఒంటిమిట్ట మండలం బండారుపల్లి, అట్లూరు, కుడమలూరు, బద్వేలు, నందలూరు ప్రాంతాల్లోని కోనాపురం, కొమ్మూరు ప్రాంతాల్లో చేపల వేట ముసుగులో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోంది. దీన్ని అడ్డుకోవడానికి అటవీశాఖ ‘ఎకో టూరిజం’ పథకాన్ని తీసుకొచ్చినా ప్రయోజనం లేకపోయింది. దాడులు.. ప్రతిదాడులు మామూలే శేషాచలం అడవుల్లో ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల సంచలనం, వివాదానికి కారణమైనా ఇక్కడ కాల్పులు, ఎదురుకాల్పులు, భయంకర దాడులు, హత్యలు సర్వసాధారణం. గతంలో ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగినా ఇప్పుడు జరిగింత ప్రచారం కాలేదు. 2011 నవంబర్‌లో శ్రీవారిమెట్టు అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగలను శ్రీనివాస మంగాపురం సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద దాచిన కూలీలు, తమను వెంటపడిన అధికారులపై రాళ్లతో దాడిచేయడం, పోలీసులు కాల్పులు జరపడం తెలిసిందే. అదేఏడు నవంబర్‌లో చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె టేకువనం వద్ద అటవీ అధికారులకు, తమిళ కూలీల మధ్య రాళ్లదాడి, ప్రతిగా పోలీసుల కాల్పులు జరపగా స్మగర్లు పరారైనారు. ఆ తరువాతకూడా 2012 డిసెంబర్‌లో మరోసారి చిత్తూరు జిల్లా భాకరాపేటకు సమీపంలో రంగంపేట బేస్ క్యాంపు వద్ద రాత్రి ఎర్రచందనం స్మగ్లర్లకు స్పెషల్ టాస్క్ఫోర్స్‌కు మధ్య కాల్పులు జరిగాయి. కరేపాకుకోన వద్ద స్మగ్లర్లు తిరగబడి రాళ్లు, గొడ్డళ్లతో అటవీ సిబ్బందిపై దాడి చేశారు. రైల్వే కోడూరు మండలం శెట్టిగుట్ట సమీపంలో రాత్రిపూట గస్తీలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న ఇన్‌ఛార్జి ఎఫ్‌బీవో జగ్జీవన్‌రావు, శ్రీనివాసరావులపై స్మగ్లర్లు రాళ్ల దాడి చేసి వారి ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్‌తో కాల్చి వేసిన సంఘటన 2013లో జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగడం ఇక్కడ అతిసాధారణం. కర్కోటకులు.. స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో స్మగ్లర్ల ఘాతుకాలకు పరాకాష్ఠ – అటవీ శాఖ అధికారులు శ్రీ్ధర్, డేవిడ్ కరుణాకర్‌ల్ని బలి తీసుకున్న ఘటన. పెద్దబండ చేను వద్ద స్మగ్లర్లు దుంగలను తరలిస్తున్నారనే సమాచారం అందడంతో డిప్యూటీ ఫారెస్టు రేంజ్ అధికారి శ్రీ్ధర్ మరో ఆరుగురు సిబ్బందిని వెంటపెట్టుకొని వాహనాల్లో బయలుదేరారు. అడవి మధ్యలో దుంగల్ని మోసుకెళ్తున్న కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. మరి కొందరిని పట్టుకోవాలనే వ్యూహంలో వుండగానే – అదుపులో వున్న స్మగ్లర్లు, దూరాన ఉన్న వారు కూడా రాళ్లదాడికి పూనుకున్నారు. దూరంగా నుంచి ముందుగా స్మగ్లర్లు రాళ్ల దాడి చేశారు. స్మగ్లర్లు శ్రీ్ధర్ తలపై రాళ్లతో మోది ప్రాణాలు తీశారు. అతడి బట్టలు ఊడదీసి చిత్రహింసలు పెట్టి తమ కక్ష చల్లార్చుకున్నారు. గొడ్డలితో దేహంలోని భాగాలను విచక్షణా రహితంగా నరికివేశారు. ఇదే సంఘటనలో మరో అటవీ అధికారి డేవిడ్ కరుణాకర్ కూడా స్మగ్లర్ల చేతిలో క్రూరంగా హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన 2013 డిసెంబర్ 15వ తేదీ జరిగింది. అక్కడితో ప్రభుత్వ వైఖరిలో మార్పు మొదలైంది. స్మగర్ల అంతుచూడాలన్న కసి పెరిగింది. కాల్పుల కలకలం శేషాచలం ప్రాంతంలోని వైకోట, గాదెల అడవుల్లోనూ ఎర్రచందనం స్మగ్లర్లు 2014 జూన్ 8వ తేదీన గాలింపు చేస్తున్న సాయుధ బలగాలపై దాడులకు తెగబడ్డారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినా కూలీలు వెనక్కి తగ్గకపోవడంతో నేరుగా గురిపెట్టి కాల్పులు జరపడంతో ఒక కూలీ మరణించాడు. అయినా వారు బెదిరిపోలేదు. 2014 జూన్ 21వ తేదీన ఈ సంఘటన జరగగా, ఆగస్టులో కడప సరిహద్దుల్లో మళ్లీ వారు దాడులు చేశారు. అదేనెలలో మరోసారి యర్రావారిపాలెం మండలం చింతగుంట సమీపంలో గాదెలబీట్ నీసువంకలో పోలీసుల పైకి స్మగ్లర్లు రాళ్లతో దాడిచేస్తే పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు కలప కూలీలు మృతి చెందారు. మొన్నటికి మొన్న… ఏప్రిల్ 7, 2015న శేషాచలం కొండల్లో జరిగిన ఎన్‌కౌంటర్ ఒక సంచలనం. ఆ రోజు తెల్లవారుజామున సచ్చినోడిబండ దగ్గర 11 మంది, చీకటీగలకోన వద్ద 9 మంది తమిళ కూలీలు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. రాళ్లు, గొడ్డళ్లతో వాళ్లు దాడికి దిగడంతో ఎదురుకాల్పులు చేయాల్సి వచ్చిందని అధికారులు ప్రకటించారు. వారిని సజీవంగా పట్టుకుని, ఆ తరువాత ఎన్‌కౌంటర్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. వివాదం రేగింది. ఈ వివాదం కోర్టుకెక్కింది. మానవహక్కులు సంఘాలు రంగంలోకి దిగాయి. ప్రత్యేక టాస్క్ఫోర్స్, సిట్ ఏర్పాటయ్యాయి. ఆ తరువాత తీగలాగితే డొంక కదిలిన చందాన ఎర్రచందనంలో అసలు సూత్రధారులు ఒక్కొక్కరూ బయటికొస్తున్నారు. ఓ నీతూఅగర్వాల్, ఓ మస్తాన్‌వలీ, ఓ బదానీ ఇలా. చివరకు చైనాకు చెందిన స్మగ్లర్లు, వారి మధ్యవర్తులు పట్టుబడ్డారు. దేశంలోని విభిన్న ప్రాంతాల్లో రహస్యంగా ఉంచిన ఎర్రదుంగల ఆచూసీ లభిస్తోంది. మున్ముందు మరిన్ని సంచలన వివరాలు బయటపడొచ్చు. ఆర్టీసీ బస్సుల్లోనూ… ఎర్రచందనం తరలింపు పకడ్బందీగా, ఎవరికీ అనుమానం రాకుండా జరిగిపోయేది. అంబులెన్సులు, ఆర్టీసి బస్సులు, స్కూలు బస్సులు, పప్పుదినుసుల బస్తాలు, అవీఇవీ అని కావు ఎలా రహస్యంగా పంపేయాలో స్మగ్లర్లకు తెలిసిన మార్గాలు ఊహించడానికి కూడా అందవు. తెలిసిన అధికారులకు నోరువెళ్లబెట్టే స్థాయిలో డబ్బిచ్చి, లేదా వారికి కావలసిన కోరికలు తీర్చి నోరుమూయించడం వారికి వెన్నతోపెట్టిన విద్య. ఇందులో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర ఒకప్పుడు కీలకమైంది. తమిళ కూలీలను చెన్నై నుంచి రాజంపేటకు తరలిస్తున్న నలభై రెండు మంది ఆర్టీసీ డ్రైవర్లు 2014 డిసెంబర్ 2వ తేదీన అరెస్ట్ అయ్యారు. చెన్నైలోని కోయంబేడు బస్టాండులో ప్రయాణీకులను ఎవ్వరినీ ఎక్కించుకోకుండా సీట్లు రిజర్వు అయ్యాయని కొద్ది దూరం వచ్చి మార్గమధ్యంలో తమిళ కూలీలను వీరు ఎక్కించుకునేవారు. మధ్యలో ఎక్కడా బస్సును ఆపేవారు కాదు. బైపాస్ రోడ్డు మార్గాన కుక్కలదొడ్డి, రైల్వేకోడూరు, రాజంపేట పరిసర ప్రాంతాల్లో కొంతమందిని దించుకుంటూ కడపకు చేరుకునేవారు. రాజంపేట – రోళ్లమడుగు రహదారి దగ్గర అడవిలోంచి ఎర్రచందనం దుంగలు తీసుకొస్తున్న తమిళ కూలీలను పట్టుకొని పోలీసులు విచారించినప్పుడు ఇది బయటపడింది. కొంతమంది డ్రైవర్లు దీనికోసం అదే పనిగా డ్యూటీలు వేయించుకొని, ఎక్కువ సార్లు చెన్నై రూట్లో వెళ్లేవారు. ఒక్కొక్క తమిళ కూలీ నుంచి రెండు వేలు నుంచి మూడు వేల వరకు తీసుకునేవారు. ప్రైవేటు బస్సుల్లో ఎవరికీ అనుమానం రాకుండా లగేజీ తరహాలో దుంగలను ప్యాక్ చేసి తరలించేవారు. అధికారుల అక్రమాలు… చిత్తూరు జిల్లా కె.వి.పల్లి మండలం, యర్రవారిపల్లె మండలాల పరిధిలోని స్మగ్లర్ల గురించి స్థానికులు ఎప్పుడో బయటపెట్టారు. శేషాచలం కొండల్లోని తుమ్మలబీటు బంగళా, చాకిరేవు బండ, సానిపాయ రోడ్డు వంటి ప్రాంతాలు ఎర్రచందనం తరలింపులో కీలకంగా వుండేవి. ఇక్కడ పనిచేసే అధికారులు వారికి అండగా నిలిచేవారు. అయితే మామూళ్ల పంపకంలో విభేదాల వల్ల వారి రహస్యాలను వారే బయటపెట్టుకునేవారు. స్మగర్లకు సహకరిస్తున్న అధికారులు 2013 ప్రాంతంలో సుండుపల్లెలో పట్టుబడ్డారు. ఇక స్వాధీనం చేసుకున్న ఎర్రదుంగలు పోలీసుస్టేషన్లలో భద్రపరిచినా మాయమవడం అతిసాధారణమైపోయింది. ఇలా మాయమైనప్పుడు అధికారుల సస్పెన్షన్ మామూలే. ప్రొద్దుటూరు అటవీ డివిజన్‌లోని పోరుమామిళ్ల రేంజ్‌లోని వివిధ బీట్ల పరిధిలోని నలుగురు గార్డులు, ముగ్గురు సెక్షన్ అధికారులను 2013 సెప్టెంబర్ మొదటి వారంలో సస్పెండ్ చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సీసీ కెమెరాలు, వైర్‌లెస్ నెట్‌వర్క్‌లను అటవీశాఖ ఏర్పాటు చేసింది. కానీ భాకరాపేట నుంచి వస్తున్న లారీలో 2014 డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి తొంభై నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ రోజు చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వర్తించాల్సిన ఇద్దరు ఫారెస్ట్ బీటు అధికారులు సీసీ కెమెరాలను పని చేయకుండా చేశారనే కారణంతో సస్పెండ్ చేశారు. 2015 మార్చిలో ప్రభుత్వం ఎర్రచందనం వేలం వేయాలని భావించి గోడౌన్లలోని కొయ్యల వివరాలు సేకరించినప్పుడు అటవీ శాఖ అధికారిక గోడౌన్లలో వందల సంఖ్యలో కన్పించకుండా పోయిన వాస్తవాలు బట్టబయలైనాయి. ఐఎఫ్‌ఎస్ అధికారి రాజేష్ మిత్తల్ ఎర్రచందనం ఎగుమతి, అనుమతులు పొందడంలో సక్రమంగా వ్యవహరించనందు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2008లో ఎర్రచందనం వేలంకు సంబంధించిన కీలక పత్రాలు, అటవీ శాఖ అధికారులు సాగించిన ప్రత్యుత్తరాలు వంటి పత్రాలు ఏవీ కనిపించక పోవడం మరో విశేషం. శేషాచలంలో అరుదుగా, అందంగా పెరిగే ఎర్రచందనం సురక్షితంగా ఉండాలంటే ముందు అందరిలో మార్పు రావాలి. వాటిని కాపాడుకోవాలన్న కోరిక కలగాలి. అధికారులు, సామాన్యులు, నాయకులు పరస్పర సహకారంతో, చిత్తశుద్ధితో, ఒక లక్ష్యంతో పనిచేస్తే తప్ప అది సాధ్యంకాదు. శేషాచలం అడవులు ఎర్రచందనం అవశేషంగా మిగలకుండా, అశేషాచలంగా పరిఢవిల్లాలన్నదే సగటు తెలుగువాడి కోరిక. *

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒకప్పటి మిస్ ఇండియా ఫైనల్ -ఇప్పుడు బౌద్ధ సన్యాసిని

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాన్న డ్రీం నేర వేరింది -నటుడు నారా రోహిత్

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

భూతాపం నిజమేనా?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రెండు రాష్ట్రాలు -ఒక ఏడాది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒకవైపు వాన మరొకవైపు ఎండ

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -37

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -37

16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -3

శాన్ ఫ్రాన్సిస్కో  జీవితం-జాతీయ రచయితగా గుర్తింపు

ఇరవై తొమ్మిదో ఏట ట్వేన్ ఎంటర్ ప్రైజెస్ అన్నీ వదిలేసి ‘’మార్నింగ్ కాల్ ‘’ పత్రికలో ఉద్యోగం పొంది శాన్ ఫ్రాన్సిస్కో చేరాడు అక్కడ హార్టే ,చార్లెస్ వారెన్  ,మొదలైన పడమటి తీర మేధావుల పరిచయమేర్పరచుకొన్నాడు .ఇదే మొట్టమొదటిసారిగా సాహిత్య జీవులతో మాత్రమె పొందిన అరుదైన పరిచయం .అనేక కాలిఫోర్నియా పత్రికలకు హాస్య వ్యంగ్య రచనలు చేస్తూ  ఆర్టిమస్ వార్డ్ సలహా పై కొన్ని రచనలను తూర్పు తీరపత్రికలకు కూడా పంపేవాడు .’’జిం స్మైలీ అండ్ హిస్ జంపింగ్ ఫ్రాగ్ ‘’న్యు యార్క్ సాటర్ డే ప్రెస్ లో అచ్చయింది. ఇదే తరవాత ప్రసిద్ధ మైన ‘’జంపింగ్ ఫ్రాగ్ ఆఫ్ కలేవరస్ కౌంటి ‘’గా 1865లో ముద్రణ పొంది బాగా ప్రాచుర్యం పొందింది .ఒక్కసారిగా సెన్సేషన్ సృష్టించి దేశ వ్యాపితంగా మార్క్ ట్వేన్ అంటే ఏమిటో తెలిసింది .అకస్మాత్తుగా అందరూ ఉదాహరించే గొప్పగా చెప్పుకొనే రచయిత అయిపోయాడు .అమెరికా జాతీయ రచయిత గా ఎదిగిపోయాడు .ఆనాడు సాంద్ విచ్ ఐలాండ్స్ అని పిలువబడిన నేటి హవాయి ద్వీపానికి న్యూస్ పేపర్  కరస్పాండెంట్ గా  మార్క్ ట్వేన్ ను పంపారు .యూరప్ పర్యటన చేసి మెడిటరేనియన్ ,పాలస్తినాలు తిరిగి  తన అనుభవాలను ‘’హిలేరియస్ ఇన్నోసేన్త్స్ అబ్రాడ్ ‘’పేరుతొ రాశాడు .ఇవి అచ్చు అయ్యేనాటికి ట్వేన్ వయసు 34 మాత్రమే .

రాతో రాత

రచయితగా విజయాలు సాధించి స్థిరపడ్డాడు .అభిమానులు గణనీయంగా పెరిగిపోయారు .ఉపన్యాస చక్ర వర్తిగా అవతారం ఎత్తి ఇందులోనూ తనకు సాటి లేరనిపించుకొన్నాడు .ఆల్వియా  లాంగ్ డన్అనే న్యు యార్క్ లోని ఎల్మైరా పౌరుడైన ధనిక ప్రముఖుని అమ్మాయి ఫోటోను చూసి పీకల్లోతు ప్రేమలో పడి   వెంటనే ఆమెను కలిసి ఆ వెనువెంటనే పెళ్లి చేసేసుకొన్నాడు .అప్పుడు నివాసాన్ని ఈస్ట్ కు మార్చాడు .’’బఫెలో ఎక్స్ ప్రెస్ ‘’పత్రికకు సగం యజమాని గా ఉండినిర్వహించి ,37 వ ఏట కనెక్టికట్ లోని హార్ట్ ఫోర్డ్ కు చేరాడు .ఇక్కడ ఉండి రాసిన పుస్తకాలలో సెంటిమెంటల్ రచనలతో బాటు నిర్లక్ష్యంగా,సందర్భ శుద్ధి లేకుండా  రాసినవీ ఉన్నాయి  .వయసు మీదపడిన కొద్దీ కోపం ,ప్రపంచ ద్వేషం పెరిగిపోయాయి .కాని ఏదిరాసినా వాస్తవానికి అతి సన్నిహితంగా నేటివ్ స్పిరిట్ తో నిజాయితీగా ,పాత్రల స్వభావాలను పూర్తిగా తీర్చి దిద్ది రాశాడని అనిపించాడు .

అన్నిట్లో వేలు

ఎక్కడో పల్లెటూరి కుర్రాడు ఇప్పుడు జాతీయ హీరో అయ్యాడు .విజయాలు కూడా ఒకదాని తర్వాత మరొకటి వెంటపడి వచ్చాయి .అమెరికా దేశం లోనే ‘’గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేట్ ‘’అని పించుకొని ,దేశ మేధావుల సరస న చేరిపోయాడు .స్పెక్యులేషన్ బుద్ధి మాత్రం ఆయన్ను వదలలేదు అదృష్టాన్ని పుస్తక ప్రచురణ లో పరీక్షించుకొందామని పబ్లిషర్ అయ్యాడు .తాను రాసిన పుస్తకాలేకాకుండా ,’’మేమాయిర్స్ ఆఫ్ యు ఎస్ గ్రాంట్ ‘’అనే ఆనాటి ప్రసిద్ధ  గ్రంధాన్ని కూడా  ముద్రించాడు .కొంతలాభం కనిపించే సరికి మెకానికల్ టైప్ సెట్టర్ పై ఉన్న డబ్బు అంతా ఖర్చు చేసేశాడు .అదృష్టం కలిసి వస్తే కోట్లాది డాలర్లు సంపాదించి ఉండేవాడు .కాని అది పని చేయక మొండి చేయి చూపే సరికి  నష్టాల్లో కూరుకుపోయి దివాలా తీశాడు .దీనికి తగ్గట్టు కుటుంబం లో కూడా దురదృష్ట సంఘటనలు తోడైనాయి  .

వరల్డ్ లెక్చర్ టూర్ –ఆశనిపాత వార్తలు

పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోయి అందులో నుంచి బయట పడటానికి అరవై వ ఏట

ప్రపంచ లెక్చర్ టూర్  ప్రారంభించాడు .ఇది మాత్రం అనుకోని విజయాలను సమకూర్చి ఆర్ధికం గా బాగా లాభించింది .నిరంతరం తిరుగుతూ ఉండటం తో డబ్బు వచ్చింది కాని ఆరోగ్యం దెబ్బ తిన్నది .కొడుకు పసిప్రాయం లోనే చనిపోయి మనోబాద మిగిల్చాడు .ఇతర దేశ పర్యటనలో ఉన్నప్పుడే బాగా అభివృద్ధిలో ఉన్న పెద్ద కూతురు సూసీ కూడా అకస్మాత్తుగా చనిపోవటం తో చాలా కు౦గి పోయాడు .వియన్నాలో ఉండగా అన్నగారు ఓరియన్ చనిపోయినట్లు తెలిసింది .అదృష్టం ఎలా వెంటపడిందో ఇప్పుడు దురదృష్టం కూడా అలానే వెంటపడి తరిమిందిపాపం .ప్రజలు బ్రహ్మ రధం పట్టి కనక వర్షం కురిపిస్తున్నారు .కాని కుటుంబం లో ఆశినిపాతం లాంటి విషాద వార్తలకు తట్టుకోలేక పోయాడు .అనేక మైన గౌరవ డాక్టరేట్లు బిరుదులూ వస్తూనే ఉన్నాయి .ఎన్నోకాలేజేలు యూని వర్సిటీలు సన్మానించి గౌరవిస్తున్నాయి డి.లిట్ ఇచ్చి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటి సన్మానించింది .కాని తరువాతి జీవితం చీకటిగా అసంతృప్తిగా దుఃఖ భాజకం గా గడిచిపోయింది ఆ మహా రచయితకు .ఆయనకు అరవై తొమ్మిదో ఏట భార్య కూడా మరణించి మానసిక దుఖాన్ని మరింత పెంచింది .ఆ తర్వాత కొన్నేళ్ళకే ఇంకొక కూతురు జీన్ ‘’ఎపిలేప్సి’’ వ్యాధితో చనిపోయింది .ఇలా దెబ్బ మీద దెబ్బ తగిలింది మార్క్ ట్వేన్ కు . ఎలా తట్టుకోన్నాడో ఆ మహాను భావుడు ?

సశేషం

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తాపోపశమనం

తాపోపశమనం

రోహిణి ముందే రాళ్ళను పగలకొట్టి ,మంట ఎత్తించి రికార్డ్ సృష్టించిన ఎండలు రోహిణి రాకతో తోక ముడిచి చల్లబడి కొంత రిలీఫ్ ఇచ్చాయి  .ఆ ఎండల్లో అడ్రస్ కు కూడా చిక్కని మా బామ్మర్ది బ్రహ్మి  కాస్త చల్లబడ్డాక ఓకే సాయంత్రం మా ఇంటి గృహ ప్రవేశం చేశాడు రోప్పుకొంటు రోజుకొంటూ .’’ఎమయ్యావురా ?కనీసం ఫోన్ కూడా లేదు ?’’అన్నా పలకరింపుగా .’’నీకేం బావా నీడపట్టున కూర్చుని ఎన్నైనా కబుర్లు చెబుతావు .ఎండలో మాడే మా సంగతి నీకేం పట్టింది .బై ది బై ఎలా ఉన్నారు బావా ?అన్నాడు .’’ఏదోరా నీదయవల్ల ఇలా ఏడ్చాం .మీఅక్క నన్ను గది గుమ్మం దాటద్దని ని పక్కాగా ఆర్డర్ జారీ చేసి కర్ర పుచ్చుకొని గుమ్మం దగ్గర కావలి ఉంటోంది .ఇంకెక్కడికీ కదిలే పనే లేకుండా చేసిందిగదిలోనే మగ్గి పోతున్నా . ‘’అన్నా .’’అయినా  ఎండలు తగ్గాక నీకు ఈ రోప్పేమిట్రా?’’అడిగా .ఒకటో ఆరో డిగ్రీలు తగ్గినంతమాత్రాన ఎనడలు వెనక్కి పోయాయా ?’’వాడి ప్రశ్న .’’సరే పిల్లా జెల్లా ఎల్లా ఉన్నారు ?’’నా ప్రశ్న .’’బానే ఉన్నారు బా ‘’వాడి సమాధానం  ‘’ఇంతకీ నురుగులు కక్కుకుంటూ వచ్చావ్ ఏమిటి విశేషం ?’’అడిగా .’’నాకు సందేహాలోస్తే తీర్చినా నువ్వే కసిరి కొట్టినా నువ్వే తిట్టినా నువ్వేకదా బా !’’అన్నాడు బ్రాహ్మి .’’ఏమిటి నీ దేహానికోచ్చిన  సందేహం ‘’?ప్రశ్నించా .’’వస్తానుండు బావా ‘’అని వంటింట్లోకి పరిగెత్తి వాళ్ళక్కయ్య ఇచ్చిన చల్లని చెంబేడు ‘’తక్రం ‘’(మజ్జిగ )తాగి మూతి తుడుచుకొంటూ కుర్చీలో చేరగిలపడ్డాడు  . ‘’బావా ! నిన్నా మొన్నా పేపర్లలో తాపోప శమనం ‘’అంటూ తెగ రాస్తున్నారు .అర్ధమేమిటి ?’’అడిగాడు .’’వారి బడుద్దాయ్ ! వేడెక్కిన శరీరానికి కాస్త ఊరట కల్గించటం చల్లబరచటం అన్నమాట ‘’అన్నాను .’’బావా ! నువ్వు అనే ప్రతిమాట వెనకా ఒక ఫ్లాష్ బాక్ ఉంటుందని నా గట్టి నమ్మకం .ఇందులో కూడా ఏదైనా తిరకాసు ఉంటె విప్పు ‘’బ్రాహ్మి బతిమాలుడు .’’నువ్వు మొత్తం మీద కాలికేస్తే వేలికి ,వేలికేస్తే కాలికి లంకె పెడతావ్ .భలే వాడివే .సరే విను ‘’అన్నా .

‘’నిన్నా ఇవాళ పేపర్లలో’’ బొత్స ‘’జగన్ లో దూరుతున్నాడనే వార్తలు వస్తున్నాయి కదురా .అదొక ఉదాహరణ తాపోశామనానికి .రాహుల్ ఈ ‘’మే ఎండలా రెచ్చిపోయి’’ రోడ్లమీదికొచ్చి నడిచి ,పరుగులు పెట్టి యాత్రలు చేసి నాయకుల్ని ,జెండా మోసేవారిని పరిగెత్తించి చెమటలు పట్టిస్తుంటే ,కక్కాలేక మిన్గాలేక ,ఇక్కడ రాష్ట్రం లో ఏ మాత్రం లాభం లేదని తెలుసుకొన్న బొత్స జగన్ దగ్గరకు వెడితే ‘’కావలించుకొని తాపోపశమ నం కలిగిస్తాడని ఆశ కలిగింది .’’దానం ‘’వచ్చి  గడ్డం కింద చెయ్యి పెట్టి బతిమాలినా ‘’గులాం నబీ’’ వచ్చి గులాబి సెంటు చల్లినా’’ జైపాల్ ‘’ వచ్చి ఆపాలని ప్రయత్నించినా పచ్చ జెండా ఊపి ‘’ఫాన్ ‘’గాలికోసం ఆరాటపడి కాన్గీకి హాండ్ ఇచ్చేస్తున్నాడు .బహుశా జగన్ ఉత్తరాంధ్ర పరగణా అంతా రాసిస్తాడని ఆశ ఏమో ?’’అన్నాను .’’బావోయ్ ! మర్రిగింజ లాంటి ప్రశ్న నేనడిగితే మర్రి చెట్టే మోలిపించేశావ్ అందులోంచి .నువ్వు గ్రేట్ బా ‘’అన్నాడు మురుస్తూ .

‘’మరి జయమ్మ మాటో?’’ అడిగాడు సందేహాస్పదంగా –‘’నిస్సందేహం గ అదీ తాపోపశామనమే .కోర్టు నిర్దోషి అని తీర్పిచ్చి ఆమె పై ఉన్న వేడి వాడి అవినీతి విమర్శలకు నీళ్ళు జల్లి తాపోపశమానం కలిగించింది .జైల్లోనే ఉండిపోతుందేమో నని సంబరాలు చేసుకొందామనుకొన్న నల్లకల్లద్దాలాయన వేడి వేడి ఆశలపై తీర్పు నీళ్ళు జల్లినది .మళ్ళీ పట్టాభిషేకం జరిగి పన్నీరు సెల్వం స్వాగతిస్తూ పన్నీరు చల్లి శాంతింప జేశాడు .ఇక ప్రజల్లో కాక రగిల్చి ఓట్లు రాల్చు కొనే ఏర్పాట్లు చేసుకొంటోంది ,కరుణ కంట్లో కారం కొట్టి మండిస్తోంది  ఇప్పుడు ఆయనకు కావాల్సోస్తోంది తాపోపశమనం .’’అన్నాను .’’బావా ! నువ్వు భలే ముదురు .ఎక్కడో మొదలెట్టి ఎక్కడికో తేలుస్తావు ‘’అన్నాడు .

‘’మోత్కు పల్లి నరసింహం సంగతో ?’’బామ్మర్ది ప్రశ్న సంధానం .’’మాడ్చే ఎండల్లో మహా నాడు జరిపి నూజివీడు రసాలంత తీపిని పంచి అందరిని మెప్పించి ,అన్నగారికి భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేయించి తెలుగు దేశం పార్టీని జాతీయ పార్టీ గా తీర్చి దిద్దుతున్న చంద్రబాబు కు గొప్ప అభిమాని ,కార్య కర్త ,వక్త మోత్కు పల్లి నరసింహులు .తెలంగాణలో కే సి ఆర్ కు సింహ స్వప్నం .అసెంబ్లీ లో ఉన్నా బయట ఉన్నా అతనిమ మాటకు చేతకు విలువ ఉంది .అలాంటిప్రజా నాయకుడు ప్రజా జీవితం లో పగలనక రాత్రనక పార్టీకి సేవలన్దిస్తుంటే ,ఆ  వేడికి ఉపశమనం కల్గిస్తే బాగుంటుందని బాబు భావించి గవర్నర్ పదవి ఇప్పించాలనుకోవటం తప్పేమీకాదు .చేసిన సేవలకు కాస్త ఉపశమనం గా గవర్నర్ గిరీ అయితే హుందాగా గౌరవ ప్రదంగా ఉండి ,చల్లగా ఉంచ వచ్చుకదా అన్న ఆలోచన ఇది .కార్య రూపం త్వరలో దాల్చాలని కోరుకొందాం .అతని తాహతుకు సరి అయిన  యైన పదవి .దానికి హుందా గౌరవం తెచ్చే లక్షణాలు అతనిలో ఉన్నాయి .రోశయ్యగారు హాయిగా కడుపులో చల్లకదలకుండా గవర్నర్ గిరీ చేలా ఇస్తూ అజాత శత్రువుగా ఉన్నారు .అలానే నరసిమ్హులుకూడా అయ్యే అవకాశాలున్నాయి .’’అన్నాను .’’బావా ! ఎంత ఆశావాదివి బావా ?బాగు బాగు  భలే బావ మా భలే బావ ‘’అని కాస్త ఎక్కువగా ధూపం వేశాడు .’’ఇక చాలించు ‘’అన్నాను .

‘’మరి బాబు గారికి ?’’అడిగాడు నసుగుతూ .’’ఒరే బ్రాహ్మీ !ఏడాదికాలం లో తిరిగిన చోట తిరగ కుండా తిన్న చోట తిరగకుండా బాబు తెగ కస్టపడి కొత్త రాష్ట్రానికి ఒక గొప్ప ఇమేజ్ తెచ్చాడు .ఆయనకు తాపమే కాని ఉపశమనం ఉండడుబాబూ ! అమరావతి కట్టే దాకా ఆయన నిద్ర పోడు పోనివ్వడు .కనుక ఆయనకు తాపోప శమనం ప్రశ్నే లేదు .తాపం పెంచేవాడేకాని ఉపశమనాన్ని ఇచ్చేవాడుకాడు, పొందేవాడూ కాదు ‘’అన్నాను  .’’బావా ! నా బ్రెయిన్ వాష్ చేసి భలే ఫ్రెష్ గా చేశావ్ బావా .ఇక వస్తా .వెళ్ళొస్తా ‘’అని అదే పోత పోయాడు బ్రాహ్మి బామ్మర్ది

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-5-15 –ఉయ్యూరు

 

 

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -36

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -36

16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -2

స్టీం బోట్ పైలట్

ఇరవై రెండేళ్ళ వయసులో మార్క్ నావ పైలట్ అయ్యాడు .అందరి స్టీం బోట్ వాళ్ళతో పరిచయం బాగా ఏర్పడింది .జాతి భేదం లేకుండా అందరూ సన్నిహితులయ్యారు ఈ అనుభవాలను వ్యాసాలూ గా రాస్తూ ‘’నేను చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ‘’అని మొదలు పెట్టి’’ఓల్డ్ టైమ్స్ ఆన్ ది మిసిసిపి ‘’ధారావాహికం గా రాశాడు .అది పెరిగిపెరిగి ‘’లైఫ్ ఆన్ ది మిసిసిపి ‘’గ బృహద్రూపం దాల్చింది .మిసిసిపినది పడమటి తీరం లో ఉన్న ఆయన గ్రామస్తులందరికీ దీనితో బోట్ యాత్ర చేయాలనే కోరిక పెరిగింది .ఇంకా చాలా గొంతెమ్మకోరికలు ఉండేవి .కాని అవి సుప్తంగా నే ఉండిపోయాయి .అప్పుడు ఊళ్లోకి ఒక సర్కస్ వచ్చింది అది చూసి సాం ముఠా అంతా అందులో ఉండే బఫూన్(క్లౌన్) లాగా ఉండాలను కొన్నారు .మొదటి నీగ్రో వచ్చి బాధలన్నీ ఏకరువు పెడితే అలాంటి జీవితాన్ని అనుభవించాలని అనుకొన్నారు . చిన్నతనం కనుక ప్రతిదీ మనసు ఆలోచన మీద ప్రభావం చూపేది .తాము మంచిగా జీవిస్తే దేవుడు తమలని సముద్రపు దొంగలుగా (పైరేట్స్ )గా మారుస్తాడనే విశ్వాసమూ కలిగింది .ఇలాంటి ఎన్నో ఆలోచనలు సముద్ర తరంగాలుగా వచ్చి పోతూ ఉండేవి ఆ వయసులో .కాని స్టీం బోట్మన్ అవాలన్న కోరిక మాత్రం స్తిరంగా ఉండిపోయింది .ఈ రకమైన ఆలోచనల వలన మార్క్ ట్వేన్ లో అనేక విషయాలపై ఆసక్తి కలవాడని వాటిలో నైపుణ్యం ఉండేదని కష్టమైన పనుల్ని చేయటానికి ఎప్పుడూ వెనకడుగు వేయలేదని తెలుస్తోంది అని ఆయన జీవిత చరిత్రకారులు  అన్నారు .ఈ ఆలోచనలే అమెరికా దేశపు స్థూల రూపాన్ని ఆవిష్కరించింది .అనేక తరహా మనుషులతో పరిచయాలు కలిగించాయి .మనుషుల అంతరంగాలను పరిశీలించే మహా నేర్పు అలవడింది .రివర్ పైలట్ గా ఉండిపోయేవాడే  .బాగా డబ్బు వచ్చి మీదపదేదే .ధనికుడిగా చెలామణీ అయ్యేవాడే కాని నాలుగేళ్లతర్వాత అమెరికా అంతర్యుద్ధం వచ్చి పైలటింగ్ కు మంగళం పాడింది .

బానిస వ్యతిరేకత

పైలట్ నుండి తొలగింప బడ్డాక ట్వేన్ యుద్ధ సైనికు డయ్యాడు .అనుకోకుండా కాన్ఫడరేట్ సైనికుడయ్యాడు .ఆయన పైలట్ స్నేహితుడు న్యూయార్క్ వాడు .సౌత్ కరోలినా రాష్ట్రం యూనియన్ నుంచి వేరై పోయింది అని తెలిసింది .మిత్రుడు యూనియన్ ను సమర్ధించాడు కనుక తానూ దానినే  సమర్ధిస్తున్నానని  చెప్పాడు .ఈ విషయాన్ని సగం నవ్వు సగం హేళన ధ్వనించేట్లు ‘’the Private History of a Campaign that Failed ‘’అన్నాడు .తానూ యెంత వాదించినా మిత్రుడు వినిపించుకోలేదు .దీనికి కారణమన్ తన తండ్రికి బానిసలున్నారు . తండ్రి ఒకసారి ఈ  కఠోర సత్యాన్ని ఒప్పుకొని బానిసత్వం హేయం అన్నాడని  తన దగ్గరున్న ఒకే ఒక నీగ్రో బానిస ను విడుదల చేస్తానని చట్ట్టం ఒప్పుకొంటే అతనికి ఆస్తికూడా ఇస్తానన్నాడని గుర్తు చేశాడు  .ఇలాంటి తాటాకు మంటలేవీ పని  చేయవు అన్నాడు మిత్రుడు .కొంతకాలానికి దిగువ మిసిసిపి ప్రాంతం విడిపోయే ఆలోచనలోకి పూర్తిగా వచ్చింది .అప్పుడు తానూ ఎదురు తిరిగానని చెప్పాడు .తనతో బాటు మిత్రుడూ చేయి కలిపాడు .ఆతను బిగ్గరగా బానిస వ్యతిరేకతను చాటేవాడు  కాని తనను అలా చేయవద్దని వారి౦చేవాడు .

యుద్ద్ధ సైనికుడు –   యుద్ధ వ్యతిరేకత

సివిల్ యుద్ధపు దారుణాలు మార్క్ ట్వేన్ లో కొత్త ఆలోచనలకు దారి తీశాయి .తుపాకీతో కాలుస్తున్న దృశ్యాలు ఎప్పుడూ వెన్నంటి ఉండేవి .యుద్ధం  అంటే ఒకర్ని ఒకరుకాల్చుకొని  చనిపోవటమే తప్ప అందులో విచక్షణ లేదని పించింది .అవతలివాడిపై శత్రుత్వం లేక పోయినా ,స్వార్ధం కోసం కాకపోయినా కొత్తవారిని కాల్చి చంపటమే అవుతోంది .వాళ్ళు ఆపదలో ఉంటె సాయం చేసే ప్రవ్రుత్తి  మనకు అవసరమైతే వాళ్ళు సహకరించే విధం నశించి మానవత్వం కోల్పోయి చంపుకోవటమే యుద్ధం అని పించింది .

సేక్రేటరికి సెక్రెటరి –స్పెక్యులేషన్ –పత్రికా రచన –మార్క్ ట్వేన్ అవతారం

యుద్ధం నుండి క్లేమేన్స్ ను ‘’ఆశక్తుడు ‘’గా భావించి విడుదల చేశారు .పడమటి తీరం చేరి అన్న ఒరియాన్  నవడా రాష్ట్ర సెక్రెటరి అయ్యాడని తెలిసి , కలిసి అన్నకు సెక్రెటరి అయిపోయాడు.కొన్ని రోజులకు సేక్రేటరికి విధులు నిధులు  పూజ్యం  అని తెలుసుకొన్నాడు .అదృష్టాన్ని పరీక్షించుకోవాలనిపించి గనుల త్రవ్వకం లో కాలు పెట్టాడు . గని లోతుకు మునిగిపోయాడుపాపం .క్వార్త్జ్ మైనింగ్ లో వేలు పెట్టి కలిసిరాక స్పెక్యులేషన్ వదిలేసి ఆకాశ విహారం మానేసి నేల మీద కాలు ఆనించి నడవటం నేర్చుకొన్నాడు .ఇవేవీ అచ్చిరాలేదని పూర్వపు వ్యాసంగం అయిన న్యూస్ పేపర్ మాన్  గా అవతారమెత్తాడు .వర్జీనియా నగరం నుండి వెలువడే ‘’టేరి టోరియల్ ఎంటర్ ప్రైజెస్ ‘’పత్రికలో చేరి హాస్య వ్యంగ్య రచనలనెన్నిటినో  రివర్ పైలట్ గా ఉన్నప్పుడు నచ్చిన మాట ‘’మార్క్ ట్వేన్ ‘’ను కలం పేరుగా పెట్టుకొని రాశాడు .అప్పటినుంచి క్లేమేన్స్ తెరమరుగై మార్క్ ట్వేన్ గా  విజ్రుమ్భించాడు .

19 వశతబ్ది మధ్యలో హాస్య రచయితలెవరూ స్వంత పేరు పెట్టుకొని రాయలేదు .ఆ తర్వాతే రాయటం మొదలెట్టారు   దీనికి కారణం వారు రాసిన హాస్యాన్ని చదివి నవ్వేవారు కరువవ్వటమే .అందుకే సిగ్గుపడి స్వంత పేరుతొ  రాయటానికి జంకేవారు .అదీ రహస్యం .ఒకాయన ‘’పెట్రోలియం వేసూవియాస్ నాస్బి ‘’అనే పెరుపెట్టుకొని  రాసేవాడు .నిజానికి ఈయన సీరియస్ ప్రింటర్ .అసలుపేరు డేవిడ్ రాస్ లాకే .రాబర్ట్ హెచ్ న్యుఎల్ ‘’ఆర్ఫియాస్ సి .కార్ అంటే ఆఫీస్ సీకర్ పేరు పెట్టుకొని రాసేవాడు ఈయన ఒక మేగజైన్ ఎడిటరేకాక వర్ధమాన రాజకీయ నాయకుడు కూడా .హెన్రి వీలర్ షా అనే రైతు ,బొగ్గుగనుల నిర్వహణాధికారి ,రియల్ ఎస్టేట్ వ్యాపారి , వేలంపాట  ఏజెంట్ కూడా ‘’జోష్ బిల్లింగ్స్ ‘’పేరుతొ కామిక్ విషయాలు రాసేవాడు .ఆల్మేనాక్ వార్డ్ ‘’అనే బిరుదూ పొందాడు .

కానీ సాం క్లేమేన్స్ మార్క్ ట్వేన్ అవతారం ఎత్తాక పై వారినెవరినీ అనుకరించలేదు  వార్డ్ తో పరిచయమయ్యాక ట్వేన్ కొన్ని రోజుల్లోనే ఆయన్ను అన్నిటా మించిపోయే కామిక్ రచనలు చేసి మెప్పించాడు .’’సమకాలీన బాక్ వుడ్ హ్యూమర్’’ను పండించాడు .పెద్దకధలు రాశాడు  ముతక హాస్యమూ  మితిమీరి  రాశాడు  వార్డ్ కంటే గొప్ప హాస్యాన్ని సృష్టించానని చెప్పుకొన్నాడు .కాని పత్రికాజనం అంతగా పట్టించుకోలేదు .టాం సాయర్ ,హకిల్ బెర్రిఫిన్ లకు వచ్చినంత ప్రాచుర్యం పై వాటికి రాలేదన్నదినిజం .ఆకాలంలో సమాజం లో ఉన్న వెర్రి మొర్రి విపరీత  ధోరణులుకు అవి అద్దం పట్టాయి .బడా బాబుల బండారం బయట పెట్టాయి .కారికేచర్ మీద ఎక్కువ దృష్టిపెట్టి రాశాడు .పాత విషయాలనే కొత్త మూసలో కొత్త తరహాలో హాస్యం వ్యంగ్యం మేళ వించి రాయటం మార్క్ ట్వేన్ ప్రత్యేకత .మాండలికానికి పెద్ద పీట వేశాడు .వ్యావహారికాన్ని  నెత్తి కెత్తుకొన్నాడు. స్తానికతకు ప్రాదాన్యమిచ్చాడు .ఇవన్నీ కలిసి ‘’హోమ్  స్పన్ ‘’’’స్వదేశే నేత’’ గా గుర్తింపు తెచ్చుకొన్నది , హీరోలు జీరోలు అందరూ తన చుట్టూ ఉన్నవాళ్ళే .పరిసరాలు అవే .అందుకే అంతటి పేరొచ్చింది .సహజత్వాన్ని ఇంత వరకు ఎవరూ కధల్లో నవలలో చొప్పించలేదు .వాల్ట్ విట్మన్ కవి కవిత్వం లో సహజత్వం తెస్తే, హాస్య వ్యంగ్య రచనలో నవలలో కధల్లో మార్క్ ట్వేన్ సహజత్వాన్ని చూపించి ఆధునిక అమెరికన్ నవలా సాహిత్యానికి ఆద్యుడని పించుకొన్నాడు . పత్రిక హాస్య రచయిత కాస్తా సాంఘిక వ్యంగ్య రచయితగా అవతారమెత్తాడు మార్క్ ట్వేన్ –‘’the news paper humorist grew into the social satirist’’.

 

Image result for marktwain

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ – 30-5-15- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సంప్రజ్నా సమాధి మోక్షప్రద0 -స్వామి వివేకానంద

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

40 వసంతాల ”శేషేంద్ర జాలం ”ఆర్ అనంత పద్మనాభ రావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సడలని చైనా ‘పట్టు’

సడలని చైనా ‘పట్టు’

  • 28/05/2015
TAGS:

చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం వారి దురాక్రమణ బుద్ధి మారలేదని మంగళవారంనాడు మరోసారి స్పష్టమైంది. ‘మెక్ మాహన్’ రేఖను తాము అంగీకరించడం లేదని స్పష్టం చేయడం ద్వారా చైనా ప్రభుత్వం దశాబ్దులుగా అరుణాచల్‌పై పెడుతున్న పేచీని మరోసారి గుర్తుచేసింది. ఇలా గుర్తు చేయడానికి మే నెల 14 నుండి 16 వరకు మన ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన పర్యటన నేపథ్యం…సరిహద్దు వివాదం పరిష్కరించడానికి చైనా సిద్ధంగా లేదన్నది మంగళవారం ఆ దేశపు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్‌యింగ్ చేసిన ప్రకటన ఇలా స్పష్టమైంది! ఇరవై ఐదవ తేదీ నాడు అమెరికా ప్రభుత్వం వారి నిఘా విభాగం వారు బయటపెట్టిన మరో విషయం వల్ల చైనావారి భారత వ్యతిరేక ప్రాబల్య విస్తరణ వ్యూహం మరోసారి ధ్రువపడింది. పాకిస్తానీ ప్రభుత్వ గూఢచర్య విభాగం ఐఎస్‌ఐ ప్రతినిధులతో చైనా అధికారులు గతవారం బీజింగ్‌లో రహస్య మంతనాలు జరిపారన్నది అమెరికా బయటపెట్టిన సమాచారం. ఈ మంతనాలు చైనా పాకిస్తాన్‌ల మధ్య మాత్రమే జరిగి ఉండినట్టయితే ఆశ్చర్యపడవలసిన పనిలేదు. ఎందుకంటే చైనా ప్రభుత్వం అనేక ఏళ్లుగా పాకిస్తాన్‌ను చేయి పట్టుకుని నడిపిస్తోంది! అఫ్ఘానిస్తాన్‌కు చెందిన తాలిబన్లు కూడ ఈ రహస్య సమావేశంలో పాల్గొన్నారట! అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులు కూడ ఈ సమావేశంలో పాల్గొన్నారు. నరేంద్ర మోదీ తమ దేశంలో పర్యటించి వెళ్లిన తరువాత వారం రోజులకే చైనా ప్రభుత్వం ఇలా అఫ్ఘానిస్తాన్ పాకిస్తాన్ సమావేశాన్ని అతి రహస్యంగా నిర్వహించడం ప్రాధాన్యత సంతరిం చుకున్న విపరిణామం! ఇలా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అఫ్ఘానిస్తాన్ పౌర ప్రభుత్వాన్ని మన దేశానికి దూరంగా జరపడం చైనా వ్యూహంలో భాగం. అఫ్ఘా నిస్తాన్ పునర్ నిర్మాణ కార్యక్రమంలో మన ప్రభుత్వం క్రియాశీల భూమికను పోషిస్తోంది. 2009 నుంచి అఫ్ఘానిస్తాన్‌కు మన ప్రభుత్వం పనె్నండు వేల కోట్ల రూపాయల ఆర్థిక సహా యం అందచేసింది. ఏడువందల కోట్ల రూపాయల ఖర్చుతో అఫ్ఘానీ పార్లమెంట్ భవనాన్ని మన ప్రభుత్వం నిర్మిస్తోంది. అఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు అషఫ్ ఘనీ ఏప్రిల్ చివరలో మనదేశానికి వచ్చి వెళ్లిన తరువాత ఆ దేశంతో మన సంబంధాలు మరింత పెరిగినట్టు ప్రచారమైంది. నరేంద్ర మోదీ చైనాకు వెళ్లిన రోజుననే తాలిబన్లు అఫ్ఘానిస్తాన్‌లో నలుగురు భారతీయులను హత్య చేశారు. ఇప్పుడు తాలిబన్లకు అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వానికీ మధ్య రాజీ కుదిర్చే గురుతర బాధ్యతను నెత్తికెత్తుకొనడం ద్వారా చైనా ప్రభుత్వం మన ప్రభావాన్ని అఫ్ఘానిస్తాన్‌లో తగ్గించడానికి యత్నిస్తోందని ధ్రువపడింది! పాకిస్తాన్ వారి గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్-ఐఎస్‌ఐ- నిర్వహిస్తున్న ప్రధాన కార్యక్రమం మన దేశానికి వ్యతిరేకమైన బీభత్సకాండ..నరేంద్ర మోదీ తమ దేశంనుండి నిష్క్రమించిన వెంటనే చైనా ప్రభుత్వం నిర్వహించిన ఈ రహస్య సమావేశం చైనా అమిత్ర వైఖరికి సరికొత్త నిదర్శనం…
చైనా విధానం మారలేదు, వ్యూహం మారలేదు. సరిహద్దు వివాదం గురించి, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మన దేశానికి శాశ్వత సభ్యత్వం ఇప్పించడం గురించి నరేంద్ర మోదీ బీజింగ్‌లో ప్రస్తావించినప్పుడు చైనా అధ్యక్షుడు ఝీజింగ్‌పింగ్ కాని ప్రధాని లీకెఖ్వియాంగ్ కాని నోరు మెదపలేదు. ఇలా నోరు మెదపకపోవడం దశాబ్దుల తరబడి చైనా అనుసరిస్తున్న వ్యూహంలో భాగం. గతంలో చైనా ప్రభుత్వ అధినేతలు, ప్రతినిధులు మనదేశానికి వచ్చినప్పుడు మన అధినేతలు ప్రతినిధులు చైనాకు వెళ్లినప్పుడు కూడ పర్యటనలు పూర్తి అయ్యే వరకు ఏ సమస్య గురించి కూడ చైనా నోరు విప్పకపోవడం చరిత్ర. చైనా ఈ వ్యూహాత్మక వౌనాన్ని పునరావృత్తం చేసింది! గత పది ఏళ్లలో మన ప్రభుత్వం వారు పర్యటనల సందర్భంగా సరిహద్దు వివాదం గురించి ప్రస్తావించలేదు. ఈ వివాదం పరిష్కారం కోసం ప్రతి ఏటా ఒకసారి ఉభయ దేశాల ప్రత్యేక ప్రతినిధులు సమావేశమై చర్చల లాంఛనాన్ని నిర్వహిస్తున్నారు. అందువల్ల మిగతా సమయాలలో సరిహద్దును ప్రస్తావించి చైనా నాయకుల మనోభావాలను గాయపరచరాదన్న విధానాన్ని 2004వ 2014వ సంవత్సరాల మధ్య ప్రధాని మనమోహన్‌సింగ్ ప్రభుత్వ విధానమైంది. దీనికి భిన్నంగా నరేంద్ర మోదీ సరిహద్దు వివాదాన్ని చైనా పర్యటన సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు! చైనా నాయకులు గతంలో వలెనే మోదీ పర్యటన సందర్భంగా కూడ వౌనం వహించడం మారని వారి తీరునకు దర్పణం…
అలా మోదీ పర్యటన ముగిసే వరకు వౌనం వహించిన చైనా మెక్‌మాహన్ రేఖ గురించి ఇప్పుడు ప్రస్తావించింది! చైనా భారత సరిహద్దు తూర్పు విభాగం గురించి తమ ప్రభుత్వం స్పష్టమైన, ఒకే విధమైన విధానాన్ని అనుసరిస్తోందన్నది బీజింగ్‌లో హువాచున్‌యింగ్ చెప్పిన మాట! నిజానికి తూర్పు సరిహద్దు విభాగం క్రీస్తు శకం 1914లోనే నిర్ధారితమైంది! అయితే అప్పుడు అది భారత టిబెట్ సరిహద్దు. భూటాన్ నుండి బర్మా వరకు గల భారత టిబెట్ సరిహద్దు మెక్‌మోహన్ రేఖగా ప్రసిద్ధికెక్కింది. ఇది భారత టిబెట్ సరిహద్దులోని తూర్పు విభాగం మధ్య విభాగం, సిక్కిం ఉత్తర ఖండ్ రాష్ట్రాలకు ఉత్తరంగా ఉన్న భారత టిబెట్ సరిహద్దు. పశ్చిమ విభాగం మన హిమాచల్ ప్రదేశ్, లడక్ ప్రాంతాలకు తూర్పుగాను కశ్మీర్‌కు ఉత్తరంగాను ఉన్న సరిహద్దు! 1914 నాటికి కశ్మీరకు ఉత్తరంగా ఉన్న కొన్ని వందల కిలోమీటర్లు మాత్రమే భారత చైనా సరిహద్దు. మిగిలినదంతా భారత్-టిబెట్ సరిహద్దు! 1914లో మన దేశానికి-బ్రిటిష్ వారు పాలించిన కాలంలో-స్వతంత్ర టిబెట్ దేశానికీ మధ్య సిమ్లాలో కుదిరిన ఒప్పందం మేరకు మెక్‌మాహన్ రేఖ ఏర్పడింది. భారత్ తరఫున చర్చలలో పాల్గొన్న బ్రిటిష్ అధికారి మెక్‌మాహన్ పేరుతో ఈ తూర్పు విభాగం సరిహద్దు ఏర్పడింది. ఈ రేఖకు ఈ వైపున మనదేశంలోని అరుణాచల్ అనాదిగా నెలకొని ఉండిన భౌగోళిక సత్యాన్ని 1914లో స్వతంత్ర టిబెట్ ప్రభుత్వం అంగీకరించింది! 1959లో చైనా టిబెట్టును పూర్తిగా దిగమింగే వరకు ఈ భౌగోళిక చారిత్రిక వాస్తవం వివాదగ్రస్తం కాలేదు. చైనాకు ఈ సరిహద్దుతో సంబంధమే లేదు. అది భారత టిబెట్ సరిహద్దు మాత్రమే!
అలా స్వతంత్ర టిబెట్ అంగీకరించిన మెక్‌మాహన్ రేఖను చైనా అంగీకరించకపోవడానికి కారణం అరుణాచల్ ప్రదేశ్‌ను కబళించాలన్న దుర్మార్గపు ఆలోచన! మెక్‌మాహన్ రేఖను టిబెట్ ప్రభుత్వం వలె చైనా కూడ అంగీకరిస్తే అరుణాచల్ ప్రదేశ్ మన దేశంలో అంతర్భాగమన్న అనాది వాస్తవాన్ని చైనా కూడ అంగీకరించినట్టు కాగలదు. మెక్‌మాహన్ రేఖ అక్రమమైనదని హువాచున్ యింగ్ చెప్పడానికి ఇదంతా నేపథ్యం! అరుణాచల్ దక్షిణ టిబెట్‌లో భాగమన్న చైనావారి దశాబ్దుల అబద్ధాన్ని ఆమె మంగళవారం పునరుద్ఘాటించిందంతే! నరేంద్ర మోదీ బీజింగలో మెక్‌మాహన్ రేఖ కంటె ఎక్కువగా పశ్చిమ విభాగంలోని వాస్తవ అధీన రేఖ-లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్-ఎల్‌ఏసి-గురించి ప్రస్తావించారు! 1962 నాటి దురాక్రమణ తరువాత తానే ఏకపక్షంగా నిర్ధారించిన ఎల్‌ఏసిని చైనా నిరంతరం ఉల్లంఘిస్తోంది. మన దేశం వైపునకు మరింత జరుపుతూ దురాక్రమణ సాగిస్తునే ఉంది. ఈ విషయం గురించి మాత్రం చైనా మంగళవారం వౌనం వహించింది…


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
  8520805566
Land Line : 08676-232797

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అదేనా అమరావతి?

అదేనా అమరావతి?

  • 27/05/2015
TAGS:

అవశేష ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం జరిగిపోతున్న ఆర్భాటం సామాన్య జనాలకు అంతుపట్టడం లేదు. వేధావులకు, ప్రభుత్వ ఉన్నత అధికారులకు, మంత్రులకు సైతం ఈ రాజధాని అమరావతి స్వరూప స్వభావాలు అంతుపట్టిన దాఖలా లేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు, నిర్మాణ యోజనలో అయనకు కుడి ఎడమ భుజాలుగా పనిచేస్తున్న ఒకరిద్దరు మంత్రులకు అధికారులకు ఈ బృహత్ ప్రణాళిక అర్థమయివుండవచ్చు. సింగపూరు ప్రభుత్వానికి మరింత బాగా అర్థమయి ఉండచవచ్చు. రాజధాని ప్రాంత విస్తీర్ణం ముప్పయిమూడు వేల ఎకరాలన్నది గత ఎనిమిది నెలలుగా జరిగిన ప్రచారం. ఇప్పుడు అకస్మాత్తుగా యాబయి ఐదువేల ఎకరాలకు అమరావతి విస్తీర్ణం పెరిగిపోయిన వైనం గురించి సింగపూర్ నిర్మాణ నిపుణులు మాత్రమే వివరించవలసి ఉంది. ఎందుకంటె వారు నిర్ధారిస్తే తప్ప ఇది ‘నీరు, ఇది గడ్డి, ఇది పొలం, ఇది స్థలం’ అన్న మైదాన వాస్తవాలు-గ్రౌండ్ రియాలిటీస్- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అర్థంకాని అయోమయ స్థితి ఏర్పడి ఉంది. జూన్ ఆరవ తేదీన జరుగనున్న భూమిపూజకు ఈ అయోమయత్వం నేపథ్యం… మొత్తం రాజధాని ప్రాంతం దాదాపు ఏడువేల ఐదువందల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుందట. పచ్చని నగరం అన్నది అద్భుతమైన అనుభూతి. పచ్చని చెట్లు మొక్కలు పొలాలు రాజధాని మధ్యలో ఉండడం ప్రాచీన భారత నగర నిర్మాణ పద్ధతి. క్రీస్తుశకం పదునాలుగు పదిహేను పదహారు శతాబ్దుల నాటి హంపీ విజయనగరం ఇలా హరితశోభలతో అలరారుతూ ఉండేదని పాశ్చాత్య చరిత్ర కారులు వ్రాసుకున్నారు. మహానగరం మధ్యంలో మం చినీటి కొలనులు, జలమార్గా లు, అరటి, ద్రాక్ష, మామిడి, నారింజవంటి తోటలు, వరిపొలాలు, వాటిని దునే్న ఎద్దులు నాగళ్లు పట్టిన రైతులు ఉం డడం విజయనగర సామ్రాజ్య రాజధాని స్వరూపం. శాతవాహనుల పాలనలో రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాలకు పూర్వమే అనేక శతాబ్దుల పాటు ఇదివరకే ఒకసారి రాజధానిగా ఉండిన అమరావతి-్ధన్యకటకం-కూడ ఇలాంటి ఆకుపచ్చని శోభల అందాల నగరమే. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం వారు ఈ ప్రాచీన భారతీయ నగర నిర్మాణ రీతులను అధ్యయనం చేయించి ఉండినట్లయితే సింగపూర్‌కు, మలేసియాకు, జపాన్‌కు, చైనాకు పరుగెత్తుకొని వెళ్లిరావలసిన అవసరం ఏర్పడి ఉండేది కాదు. సచివాలయం శాసనసభా భవనాలు నిర్మించగల వాస్తు శిల్పులు, స్థపతులు-ఇంజనీర్లు- కళాకారులు, మేధావులు, మనదేశంలోనే లేరన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నిర్ధారణ. భారతీయతకు జరిగిన ఈ అవమానం అవశేష ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి పునాది. అసలు అయోమయం ఇదీ… నిర్మాణ కార్యక్రమాన్ని సింగపూర్‌కు అప్పగించడం.
పదకొండువేల ఐదువందల-దాదాపు- చదరపు కిలోమీటర్ల రాజధాని ప్రాంతం కృష్ణానదికి ఇరువైపులా చిలకలూరిపేట నుంచి నూజివీడు వరకు, నందిగామ నుంచి పామర్రు వరకు విస్తరించడం బాగుంది. కేంద్ర రాజధాని మాత్రం-కోర్ కాపిటల్- నూట ఇరవై ఐదు చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోని ముప్పయిమూడు వేల ఎకరాలలో విస్తరించి ఉంటుందని ఇన్నాళ్లుగా ప్రచారం జరిగింది. ఈ కోర్ కాపిటల్ మంగళగిరికి బాగా పశ్చిమంగా ఉంటుందన్నది జనానికి బోధపడిన విషయం. ఎందుకంటె ఈ భూమి విస్తరించిన ఇరవై తొమ్మిది గ్రామాలూ మంగళగిరికి పశ్చిమంగా వాయువ్యంగా ఉన్నాయి. అమరావతి క్షేత్రం సమీపం వరకు విస్తరించి ఉన్నాయి. ముప్పయి మూడు వేల ఎకరాల కోర్ కాపిటల్ ఈ ప్రాంతంలో ఉంటుందన్నది ఇంతవరకు ఏర్పడిన అభిప్రాయం. అందువల్ల అమరావతికి దగ్గరగాను, మంగళగిరికి దూరంగాను కోర్ కాపిటల్ నిర్మాణం కావాలి. కానీ సింగపూర్ పథకం ప్రకారం బహిర్గతమైన చిత్రపటాలలో మంగళగిరి, ఇంకా దక్షిణప్రాంతం, విజయవాడ, దానికి ఉత్తర ప్రాంతం కేంద్ర ప్రణాళికా ప్రాంతంలో ఉన్నాయి. ఈ కేంద్ర ప్రాంతానికి చాలా పశ్చిమంగా దూరంగా ప్రాచీన అమరావతి బిక్కుబిక్కుమంటూ ఉంది.
కోర్ కాపిటల్ మద్యలో మరో సీడ్ కాపిటల్ ఉందట…అది ఎక్కడ మొలకెత్తి ఉందో తెలియడం లేదు. కోర్ కాపిటల్, సీడ్ కాపిటల్ ఒకటే అయినా లేక కోర్ కాపిటల్ -రాజధాని కేంద్ర ప్రాంతం-లో ఈ సీడ్ కాపిటల్-రాజధాని వేరు వంటి స్థలం- ఒక భాగమైనా కోర్ కాపిటల్ మాత్రం కృష్ణానదికి రెండు వైపులా మంగళగిరి విజయవాడల మధ్య విస్తరించి ఉంటుందన్నది సింగపూర్ నిర్ధారణ. తుళ్లూరు ప్రాంతం కేంద్రంగా కృష్ణానదికి దక్షిణంగా మాత్రమే రాజధాని కేంద్ర ప్రాంతం నిర్మాణం అవుతుందని ఇన్నాళ్లు జరిగిన ప్రచారం ఏమయినట్టు? జూన్ ఆరున శంకుస్థాపన జరగడం లేదని, భూమి పూజ మాత్రమే జరుగుతుందని ప్రచారం అవుతోంది. కేంద్ర రాజధాని భౌగోళిక స్వరూపం ఇలా మారిపోయిన నేపథ్యంలో భూమిపూజ కృష్ణకు దక్షిణ ప్రాంతంలో జరుగుతుందా? ఉత్తర ప్రాంతంలో జరుగుతుందా? సచివాలయం, శాసనసభా భవనం, గవర్నర్ నివాసం ఎక్కడ నిర్మాణం అవుతాయి? ముప్పయి మూడు వేల ఎకరాల భూమిలోకి కేంద్ర రాజధానిలో ఈశాన్య ప్రాంతం కృష్ణకు దక్షిణంగా నెలకొని ఉంది. కానీ సింగపూర్ చిత్రపటం ప్రకారం కేంద్ర రాజధాని నదికి బాగా ఉత్తరంగా విస్తరించింది. అలాంటప్పుడు ఈశాన్య ప్రాంత బ్రహ్మస్థానం నదికి దక్షిణంగా ఎలా ఉంటుంది? సింగపూర్ చిత్రంలోని విచిత్రం ఇదీ. ఇంత పథకం రూపొందించిన వారు రాష్ట్ర సచివాలయం నిర్మించే ప్రాంతం ఎక్కడ ఉంటుందన్నది మాత్రం తేల్చలేదు.
ముప్పయి మూడు వేల ఎకరాల విస్తీర్ణం ఇప్పుడు యాబయఐదువేల ఎకరాలకు విస్తరించింది. ఇరవై తొమ్మిది గ్రామాలకు చెందిన ముప్పయి మూడు వేల ఎకరాలలో పదిహేను వేల ఎకరాలు ప్రభుత్వం భూమి ఉందా? లేక ఈ పదిహేను వేల ఎకరాల భూమి వేరే ఉందా? ముప్పయిమూడు వేల ఎకరాలకు పదిహేను వేల ఎకరాలు కలిపినప్పటికీ యాబయి ఐదువేల ఎకరాల అంకె రాదు. మరో ‘‘ఏడు కలపండి’’ అని లెక్కల మాస్టారు చెప్పవలసి వస్తుంది. అలా కలపవలసిన ఏడువేల ఎకరాలు గాని, ఇరవై రెండు వేల ఎకరాలను కాని ప్రభుత్వం ఎక్కడ, ఎప్పుడు సేకరించనున్నదో స్పష్టం కాలేదు. కేంద్రం ఇలా నదికి ఉత్తరంగా విస్తరించడం, ముప్పయి మూడు వేల నుండి యాబయి ఐదువేల ఎకరాలకు పరిధి పెరగడం సింగపూర్ వారి పథకంలోని కొత్త విషయాలు. మొదటి ముప్పయి మూడు వేల ఎకరాల సేకరణ ప్రహసనంలోనే, పదమూడు వందల ఎకరాల మూడు గ్రామాల రైతులు తమ భూమిని ఇవ్వబోమని మొండికెత్తి ఉన్నారట. అలాంటప్పుడు పరిధి యాబయి ఐదువేల ఎకరాలకు ఎలా పెరిగింది? ప్రభుత్వం ఆర్భాటం లేకుండా సచివాలయాన్ని, ఇతర రాజ్యాంగ విభాగాలను, నిర్మాణాలను, సొంతంగా చేపట్టి ఉండినట్టయితే రాజధాని సహజంగా వికసించి ఉండేది, విస్తరించి ఉండేది. రహదారులు, రైలు మార్గాల వంటి వౌలిక సదుపాయాలు క్రమంగా ఏర్పడి ఉండేవి. మొత్తం నగరం నిర్మించి ఇళ్లను జనానికి విక్రయించాలని అద్దెలనివ్వాలని ప్రభుత్వం భావిస్తోందా? అందుకేనా సింగపూర్ వారి శృంగార విన్యాసాలు?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మన్మోహన్ మార్గదర్శనం

మన్మోహన్ మార్గదర్శనం

  • 29/05/2015
TAGS:

వీధిలో కొట్లాడి ఇంట్లోకొచ్చి కౌగిలించుకున్నట్టు- అన్న సామెతను ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లు బుధవారం నిజం చేశారు. మనది ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ. అందువల్ల పదవులకు సంబంధించిన విభేదాలు, వైరుధ్యాలు, పరస్పర దూషణ భూషణ తిరస్కారాలు పదవీ నిర్వాహకులకు అంటరాదన్నది సంప్రదాయం. ఏది వ్యక్తిగతం, ఏది సైద్ధాంతికం, ఏది పదవికి సంబంధించినది, ఏది కాదు-అన్న మీమాంసను సమయానుకూలంగా ఎవరికి వారు చేసుకునే స్వేచ్ఛ కూడ మనకుంది. అందువల్ల మన్మోహన్ సింగ్‌ను తమ అధికార నివాసానికి పిలిపించుకొని నరేంద్ర మోదీ చర్చలు జరపడం గొప్ప ప్రజాస్వామ్య సంప్రదాయాల్లో ఒకటి. తమ ప్రభుత్వం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నరేంద్ర మోదీ తనకంటె ముందు ప్రధానమంత్రి పదవిని నిర్వహించిన మన్మోహన్ సింగ్‌ను కలుసుకోవడం వ్యక్తిగత రాజకీయ సంస్థాగత విభేదాలకు అతీతమైన రాజ్యాంగ సంప్రదాయానికి అనుగుణమైన చర్య. అయితే ఈ సమావేశం వార్షికోత్సవం రోజున కానీ, అంతకు ముందు రోజున కానీ జరిగి ఉండినట్టయితే జనం మరింత సంతోషించి ఉండేవారు. ఒక రాజ్యాంగ లాంఛనం సంప్రదాయంగా మారి ఉండేది. అలా జరగలేదు. వార్షికోత్సవం రోజున ప్రధానమంత్రి రాష్టప్రతిని ఉపరాష్టప్రతిని మాత్రమే కలుసుకొని గౌరవం ఘటించారు. వార్షికోత్సవం ముగిసిన మరుసటి రోజున మన్మోహన్ సింగ్ బహిరంగంగా నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం ప్రధాన రాజకీయ పరిణామం. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాందీ పదేళ్లపాటు నిర్వహించిన ‘రాజ్యాంగేతర’ భూమికను గురించి ప్రచారం చేశారు. అధికార భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మరింత ముందుకెళ్లి మన్మోహన్ సింగ్ కీలుబొమ్మ వలె వ్యవహరించిన ప్రధాని అని నిర్ధారించారు. పదేళ్లపాటు ‘బాధ్యతలేని పరమోన్నత అధికారాన్ని’ చెలాయించిన సోనియాగాంధీ చేతిలో 2004వ 2014వ సంవత్సరాల మధ్య ప్రధాని మన్మోహన్ సింగ్ కీలుబొమ్మ అన్నది నరేంద్ర మోదీ,అమిత్ షా బుధవారం కనిపెట్టిన మహావిషయం. ఊరందరికీ తెలిసిన రహస్యాన్ని ఊలప్పగారి చెవిలో ఊదినట్టుగా ప్రభుత్వాధినేత, అధికార పార్టీ అధినేత ఎందుకని ఇప్పుడు మన్మోహన్ సింగ్ కీలుబొమ్మ స్వభావాన్ని సోనియాగాంధీ రాజ్యాంగేతర తత్వాన్ని ఆవిష్కరించినట్టు?
అంతర్జాతీయ సమాజంలో మన జాతీయ ప్రతిష్ఠ పాతాళ పతనం కావడానికి దోహదం చేసిన దూరవాణి తరంగాలు-స్పెక్టరమ్-కేటాయింపు అవినీతి, బొగ్గు కేటాయింపుల అక్రమాలు రూపొందిన సమయంలో మన్మోహన్ సింగ్ ప్రధాని. బొగ్గు మరకలు రాజ్యాంగ చరిత్రకు మసిపూసిన తరుణంలో ఆయన ప్రధాని మాత్రమే కాక స్వయంగా బొగ్గుశాఖను నిర్వహించారు. బొగ్గు అవినీతి అభియోగ విచారణలో భాగంగా ప్రత్యేక న్యాయస్థానం వారు ఆయనను హాజరుకావాలని ఆదేశించారు కూడ. ఈ హాజరును సర్వోన్నత న్యాయస్థానం వారు నిలిపివేయడం వల్ల మన్మోహన్ సింగ్ ప్రత్యేక న్యాయస్థానలో ఉపస్థితుడై సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చిన ప్రమాదం తాత్కాలికంగా తప్పింది. కానీ ప్రత్యేక న్యాయస్థానంలో నిందితులుగా హాజరవుతున్న ఆయన మాజీ మంత్రివర్గ సహచరులు, అధికారులు, ఇతరులు కూడ మన్మోహన్ సింగ్ ఆదేశాల మేరకు మాత్రమే తాము నడచుకున్నట్టు ప్రకటిస్తున్నారు. అంటే మొత్తం అవినీతి కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ ప్రధాన పాత్రధారి అన్నది మాజీలు చెబుతున్న మాట. భారతీయ జనతాపార్టీవారు చేస్తున్న విమర్శల కంటె తమ మాజీ సహచరులు, అధికార్లు సంధిస్తున్న ఆరోపణాస్త్రాలు మన్మోహన్ సింగ్‌ను మరింత బాధిస్తున్నాయి. బొగ్గు అవినీతిలో తాను ఇరుక్కుపోయి, న్యాయస్థానం ముందు నిందితునిగా నిలబడడం తప్పదేమోనన్న భయం మన్మోహన్ సింగ్‌ను వెన్నాడుతోంది. బుధవారం తన నిజాయతీ గురించి, నైతిక నిష్ఠ గురించి మన్మోహన్ సింగ్ సుదీర్ఘ బహిరంగ వివరణ ఇచ్చుకోవడానికి ప్రాతిపదిక ఈ భయం.
సింగ్‌ను తన నివాసానికి రప్పించి చర్చలు జరపడం ద్వారా నరేంద్ర మోదీ ఈ భయాన్ని పోగొట్టినట్టయింది. మన్మోహన్ సింగ్ కీలుబొమ్మ కాబట్టి బొగ్గు అవినీతిలో ఆయన కేవలం పాత్రధారి. సూత్రధారి వేరే ఉన్నారన్నది అతిత్ షా విమర్శలోని ధ్వని.. ఆ సూత్రధారి రాజ్యాంగేతర శక్తి అయిన సోనియాగాంధీ అన్నది నరేంద్ర మోదీ చేసిన నిర్ధారణ. కలసి వెరసి బొగ్గు అవినీతిని మూల కారణం కాంగ్రెస్ అధ్యక్షురాలన్న వాస్తవాన్ని నరేంద్ర మోదీ, అమిత్ షా బుధవారం ఇలా ఉమ్మడిగా ఆవిష్కరించారు. బొగ్గు అవినీతిని మాత్రమే కాదు, కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రగతి కూటమి-యూపీఏ- పదేళ్ల పాలనలోని అనేకానేక అవినీతి కలాపాలకు కూటమిలోని రాజకీయ పక్షాల అధినేతలు మాత్రమే సూత్రధారులన్నది చారిత్రక వాస్తవం…అందువల్ల మన్మోహన్‌ను కీలుబొమ్మగా చిత్రీకరించడం వల్ల ఆయనకు అభియోగ విముక్తి కలిగింది. న్యాయస్థానాలలో మన్మోహన్ సింగ్ నిర్దోషిత్వం, లేదా నేర ప్రవృత్తిని నిగ్గు తేల్చడానికి ఈ కీలుబొమ్మ, రాజ్యాంగేతర శక్తి సిద్ధాంతాలు ఉపకరించవు. కానీ ప్రజల ముందు మన్మోహన్ నిర్దోషిత్వాన్ని కాపాడటానికి దోహదం చేయవచ్చు. ఇలా మోదీ, అమిత్ షా కలిసికట్టుగా మన్మోహన్ సింగ్ హితాన్ని కోరుతున్నారు..
ఇంతవరకు బాగుం ది..కానీ నరేంద్ర మోదీ తన నివాస కార్యాలయంలో మన్మోహన్ సింగ్‌తో ఆర్థిక వ్యవహారాల గురించి, విదేశాంగ విధానం గురించి చర్చలు జరపడమే ఆసక్తికరమైన అంశం. విదేశాంగనీతి విషయంలో మన్మోహనీయ వైపరీత్యానికి సంపూర్ణ విశుద్ధంగా వ్యవహరిస్తున్న నరేద్ర మోదీ ప్రభుత్వానికి ఆర్థిక నీతి విషయంలో మాత్రం ఏడాదిగా మన్మోహన్ సింగ్ పరోక్ష మార్గదర్శనం లభిస్తోంది. వాణిజ్య ప్రపంచీకరణను నెత్తికెత్తడం ద్వారా దేశ ప్రజల ప్రయోజనాలకు విఘాతకరమైన అంతర్జాతీయ అక్రమ ప్రయోజనాలకు పెద్దపీట వేసిన ఘనత మన్మోహన్ సింగ్‌ది! జాతీయ ప్రయోజనాల పరిధిలో ఇమడని అంతర్జాతీయస్థాయి ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్..అంతర్జాతీయ విస్తృత ప్రయోజనమంటే అమెరికా, ఐరోపా, చైనా, దక్షిణ కొరియాల వంటి సంపన్నదేశాల ప్రయోజనమన్నది ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ప్రతిపక్షంలో ఉండగా ఈ ప్రపంచీకరణను వ్యతిరేకించిన భాజపా అధికార స్వీకరణ తరువాత మన్మోహన్ సింగ్ బాటలో నడుస్తుండడం నడుస్తున్న చరిత్ర…బీమా, రైల్వే రంగాలలో విదేశీయ వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించడం, రక్షణోత్పత్తుల రంగాన్ని సైతం బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు కట్టబెట్టడం, వాల్‌మార్ట్, వంటి విదేశీయుల చిల్లర దుకాణాలను దేశమంతటా తెరవడం, తద్వారా స్వదేశీయుల దుకాణాలు మూతపడడానకి రంగం సిద్ధం చేయడం.. ఇలాంటివి మరికొన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి లభిస్తున్న మన్మోహన్ సింగ్ మార్గదర్శనానికి నిదర్శనాలు. భూమి సేకరణ బిల్లు పరాకాష్ఠ…అందువల్ల కొత్తగా విదేశాంగ విధానం విషయంలో కూడ నరేంద్ర మోదీ మన్మోహన్ సింగ్ మార్గదర్శనాన్ని కోరుతున్నారా? అన్నది సమాధానం లభించవలసిన ప్రశ్న…

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పదకొండేళ్లకే 3 డిగ్రీ పట్టాలు…

పదకొండేళ్లకే 3 డిగ్రీ పట్టాలు…

చిన్న పిల్లలు ఏం చేస్తారు..? ఆటలాడుతారు.. అల్లరి చేస్తారు.. గెంతుతారు.. పోట్లాడుతారు.. నానా హంగామా చేస్తారు. భారత సంతతికి చెందిన తనిష్క్‌ అబ్రహం మాత్రం 11 ఏళ్ల వయసులోనే మూడు డిగ్రీ పట్టాలు సాధించాడు.. అంతేనా..? తొమ్మిదేళ్ల వయసులో టెడ్‌ టాక్స్‌లో అనర్గళంగా మాట్లాడాడు, నాసా (నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ర్టేషన్‌)లో ప్రసంగం ఇచ్చాడు.. భవిష్యత్తులో అమెరికా అధ్యక్షుడు అవుతాననే చెప్పే అబ్రహం గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం.. 

తనిష్క్‌ అబ్రహం కాలిఫోర్నియాలో జన్మించాడు. తనిష్క్‌ వాళ్ల నాన్న పేరు బిజౌ అబ్రహం, ఈయన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అమ్మ పేరు తజి అబ్రహం, ఆమె వెటర్నిటీ వైద్యురాలు. అబ్రహం తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు తరలి వెళ్లారు. అమెరికన్‌ రివర్‌ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పట్టా పొంది అందరినీ అశ్యర్యపరిచాడు. ఈ కళాశాల నుంచి గణితం, సైన్స్‌, విదేశీ భాషా అధ్యయనం విభాగాల్లో మూడు డిగ్రీలు సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ప్రత్యేకత పొందాడు. డిగ్రీ ఫలితాల్లో ఈ బుడ్డోడి జీపీఏ (గ్రేడ్‌ పాయింట్‌ ఏవరేజ్‌) 4.0. అంతేకాదు రివర్‌ కళాశాల 60 ఏళ్ల చరిత్రలోనే ఇంత చిన్న వయసులో డిగ్రీ పట్టా ఇప్పటివరకు ఎవరూ పొందలేదు. నాలుగేళ్లప్పుడే మెన్సాలో సభ్యుడయ్యాడు. మెన్సాలో మనుషుల ఐక్యు (హై ఇంటెలిజెంట్‌ కోషంట్‌) లెవల్‌ని టెస్ట్‌ చేస్తారు. దీనికోసం మెన్సా స్టాండర్డైజ్‌డ్‌ ఐక్యూ టెస్ట్‌ని నిర్వహిస్తుంది. ఇందులో కనీసం 98 మార్కులు రావాలి. తని్‌ష్కకు 99.9 మార్కులు వచ్చాయి. ఇతని చెల్లెలు కూడా ఇందులో ఒక మెంబరే. మెన్సాలో అత్యంత పిన్న వయస్కులు వీరు. ఏడేళ్ల వయసు నుంచి పాఠశాలకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండి చదువుతున్న బాల మేధావి తనిష్క్‌ గురించి మరిన్ని అంశాలు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”600 కోట్ల”రామానుజాచార్య -,నవీన గోగ్రహణం -డా అరవిందరావు వగైరా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సేవకుని అహంకారం

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

”గోష్పదీకృత వారాసిం ”శ్లోకానికి శ్రీ రామడుగు వారి తెలుగు సేత

”గోష్పదీకృత వారాసిం ”శ్లోకానికి శ్రీ రామడుగు వారి తెలుగు సేత

ramadugu letter 001

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సహృదయ స్పందన

vedula letter 001 (1)

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -35 16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -1-

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -35

16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -1

Mark Twain, Brady-Handy photo portrait, Feb 7, 1871, cropped.jpg

అమెరికా సాంప్రదాయ సాహిత్యం (క్లాసిక్ లిటరేచర్ )ఎమర్సన్ ,లాంగ్ ఫెలో ,తోరో , హతారన్ వలన  19 వ శతాబ్దపు మధ్యభాగం లో బాగా స్థిరపడింది .అమెరికా సివిల్ వార్ తర్వాత న్యు ఇంగ్లాండ్ అంటే మాస చూసేట్స్  రాష్ట్ర సంస్కృతిని,పెద్దరికాన్ని చాలెంజ్ చేసే ఇద్దరు మహా రచయితలు  వచ్చారు .అందులో న్యు యార్క్ నివాసి పెద్ద గొంతుకతో తిరస్కార గర్జనలు చేసి అసలైన అమెరికా కవిత్వానికి ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్ ‘’తో ఆద్యుడై నిలిచినవాడు’’ వాల్ట్ విట్మన్’’ కవి .రెండవ వాడు మిస్సోరీ రాష్ట్రానికి చెందిన స్థానిక భాషా సంప్రదాయాలకు పట్టం కట్టిన మార్క్ ట్వేన్ అని అందరు పిలిచే’’ సామ్యుల్  లాంగ్ హార్న్ క్లేమేన్స్’’ ఈ  ఇద్దరితో అసలైన అమెరికా కవిత్వం ,నవల ,సాహిత్యం లో ప్రవేశించాయి .వారిద్దరూ అమెరికా జాతీయ కవిగా జాతీయ నవలా రచయితగా గుర్తింపుపొంది తరతరాలుగా   అమెరికా సాహిత్యాన్ని ప్రభావితం చేస్తున్నారు .అచ్చమైన అమెరికా దేశీయ సాహిత్యం వీరిద్దరి తోనే ప్రారంభమైంది .

బాల్యం – తండ్రి సంచార జీవితం

శామ్యూల్ క్లేమేన్స్ అనే మార్క్ ట్వేన్ వర్జీనియాకు చెందిన  – జాన్ మార్షల్ క్లేమేన్స్  ,కెంటకి కి చెందిన జెన్ లాంటన్ క్లేమేన్స్ దంపతుల   సంతానం లో ఆరవ వాడు . 30-11-1835 న మిస్సోరీకి సరిహద్దులో ఉన్న ఫ్లారిడా లో జన్మించాడు .ఆనాడు ఆ గ్రామ జనాభా వందమంది మాత్రమె .ట్వేన్ తండ్రి చాలా సూటిగా నిజాయితీగల లాయర్ మాత్రమె కాక  వ్యాపారి కూడా .దేనిలో చేయ్యిపెట్టినా ఉప్పు నిప్పు అయ్యేది .అన్నిరకాల వ్యాపారాలలో చేతులు కాల్చుకొన్న ఘటం .ముక్కు సూటి మనిషి ఈ లక్షణాలే మార్క్ ట్వేన్ కూ సంక్రమించాయి .వీరి కుటుంబం బ్రిటిష్, ఐరిష్ రక్తం తో కలిసిపోయింది .వీరి పూర్వీకులు అరిస్టో క్రట్స్ .అని తెలుస్తోంది .స్థిమితంగా స్తిరంగా  ఒక చోట ఉండలేదువారు .జీవితం ఎప్పుడూ అభద్రతా భావం తోనే వారికి గడిచింది .క్వేకర్ సంప్రదాయం లో పెరిగిన వంశాలు వారివి .

మార్క్ ట్వేన్ కూ ఈ అస్తిరత తప్పలేదు .ట్వేన్ పుట్టటానికి కొన్ని నెలల ముందే తండ్రి వీరి కుటుంబాన్ని టేన్నేసే నుండి ఫ్లారిడాకు మార్చాడు .లాగ్ కేబిన్ లలో  క్లాప్ బోర్డ్ ఇళ్ళల్లో ఉన్నాడు .తండ్రి ఆదాయం ఏమంత పెద్దగా ఉండేదికాదు .అందుకని మళ్ళీ కుటుంబాన్ని మిస్సోరి లోని ‘’హానిబాల్’’ కు క్లేమేన్స్ నాలుగో ఏట మార్చాడు .ఇక్కడే మార్క్ 18 ఏళ్ళు వచ్చేదాకా ఉన్నజ్ఞాపకం .కాని జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలనుకొన్నాడు .

కళ్ళముందు చరిత్రనే నవలగా మార్చిన ఘనుడు

హానిబాల్ జనాభా 500..ఇదే తాను పుట్టిన ఊరుగా ఆయన భావించేవాడు .ఆ గ్రామ పద్ధతులను ,వాతావరణాన్ని ,ప్రజలని మనసులో బలంగా నిలుపుకొన్నాడు .ఆ విషయాలలో ఏ రకమైన మార్పులూ రాలేదని ఆయన రాసిన నవలలో మనకు కనిపిస్తుంది  .’’టాం  బ్లా౦ కెన్ షిప్ ‘’అనే తిరుగుబోతు కుర్రాడు ఎప్పుడూ నదిలో కాలక్షేపం చేసేవాడు ,ఆ ఊరి పెద్ద తాగుబోతు కొడుకు అమెరికా దేశపు నవలా చరిత్రలో ‘’హకిల్ బెర్రిఫిన్ ‘’ గా మార్క్ ట్వేన్ చేత అవతారం దాల్చాడు .ఆకుర్రాడు నాగరిక లక్షణాలు తనకు వద్దనే తత్త్వం వాడు .అలాగే శామ్యూల్ తల్ల్ల్లి ఆ నవలలో ‘’ఆంట్ పోలీ’’ అయింది .తమ్ముడు హెన్రి ఆదర్శవంతామైన సిడ్అయ్యాడు .ఎంతోకాలంగా బానిస బతుకు హీనంగా బతుకుతూ బానిస క్వార్టర్ లలో ఉంటున్న నీగ్రో –ఈ నవలలో ‘’జిం ‘’అయ్యాడు . సగం మొరటుతనం  సగం నాగరికత ఉన్న వితంతువు  హక్   అనుచరి ‘’మిసెస్ హాలిడే ‘’కాస్తా నవలలో’’విడో డగ్లాస్ ‘’అయి కూర్చుంది .ట్వేన్ తో ఆడి పాడి తిరిగిన స్నేహిత బృందం కూడా డ్యూక్ ,డాఫిన్ వగైరా  వేర్వేరు పాత్రలద్వారా నవలలో స్థానం సంపాదించుకొన్నారు .వేసవికాలాలు  గడిపిన ఫారం హౌస్ ఆయన అ రాసిన అనేక నవలలో సజీవమై శాశ్వతంగా నిలిచిపోయింది .ఇవన్నీ నవలా పుటలలో చేరిపోయాయి .దీనికి కారణం అది అంత పెద్ద విశాలమైన ఫారం హౌస్ కాకపోవటమే అన్నాడు మార్క్ ట్వేన్ .ఇదీ ట్వేన్ మార్క్ నవల .అదే అమెఇకా అసలైన సాహిత్యమై చరితార్ధమయింది. కాదు అలా చేశాడు మార్క్ ట్వేన్ .నేటివిటికి పట్టం కట్టాడు .ఎక్కడో ఇంగ్లాండ్ లోనో ఫ్రాన్స్ లోనో లేక ఏ ఇతర వలసవాదుల కధలనుకాక తాను పుట్టి పెరిగిన తన తోటి జీవించిన వ్యక్తుల ,పరిసరాలను సాహిత్యం లోకి ఎక్కించి ఇదీ అసలైన అమెరికా జనజీవితం అని చూపించిన ఘనత సాధించాడు మార్క్ ట్వేన్ .

తండ్రి మరణం –కుటుంబ బాధ్యత

ట్వేన్ కు 12 ఏళ్ళు రాగానే తండ్రి చనిపోయాడు .అప్పటికి కుటుంబ ఆర్ధిక పరిస్థితి పరమ దయనీయం గా ఉంది .చేతిలో చిల్లిగవ్వ నిలవ చేయకుండా తండ్రి చనిపోయాడు .అప్పటికి ఎలిమెంటరి స్కూల్ లో మాత్రమె చదివిన ట్వేన్ అర్ధాంతరంగా చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది .చేసేది లేక పెద్దన్న ఓరియన్ దగ్గర ‘’ప్రింటర్స్ డెవిల్ ‘’గా  అప్రెంటిస్ చేశాడు  అంటే .అచ్చు అక్షరాలూ కూర్చటం ,అచ్చు అయినదానిలో తప్పులు సరిచేయటం అంటే ప్రూఫ్ రీడింగ్ ,చేస్తూ ఉండే వాడన్నమాట . అందుబాటులో ఉన్న ప్రతిపుస్తకాన్ని చదివేవాడు .ఇరవైవ ఏడు వచ్చేసరికి ఇంగ్లీష్ క్లాసిక్ సాహిత్యమంతా చదివేశాడు . నైపుణ్యం గల .ప్రింటర్ గా యాత్రీకుడిగా మంచిపేరు పొందాడు .తూర్పు వైపున్న న్యు యార్క్, ఫిలడెల్ఫియా వగైరా ప్రాంతాలన్నీ తిరిగి చూశాడు .మళ్ళీ అన్న ఓరియన్ పనిలో చేరాడు .అప్పుడు అన్న అయోవాలో ‘’కియోకుక్ ‘’లో ఒక పత్రికను నడుపుతున్నాడు. జర్నలిజం అంటే ఇష్టమే ఉన్నా పెద్దగా ఆసక్తి లేదు అన్నదమ్ములిద్దరికి .కాని అదే వారిద్దరినీ విద్యా వంతులకంటే ఎక్కవ చదువు వచ్చేట్లు చేసింది అనటం  లో అతిశయోక్తి లేదు .తనగురించి రాసుకొంటూ ‘’నేను న్యూస్ పేపర్ రిపోర్టర్ గా నాలుగేళ్ళు నగరాలలో పని చేశాను .అప్పుడు  ప్రతి విషయం లోను ఉన్న లోపలి విషయాలను క్షుణ్ణంగా పరిశేలి౦చ గలిగానూ .శాసనసభకు రిపోర్టర్ గా రెండు  సమావేశాలకు పని చేశాను .అప్పుడు నేను ‘’చిన్న బుర్రల పెద్ద మనుషుల్ని’’ ముగ్గుర్ని చూశాను .వారిలో ఉన్న అతి స్వార్ధ బుద్ధి ,పిరికితనం జీర్ణించుకుపోయిన మనసులు ,తో ఉన్న  ‘’దేవుడు చేసిన మనుషుల’’ను చూశాను .’’అని యాభై ఏళ్ళ వయసులో మార్క్ ట్వేన్ ఒక కరే స్పాం డెంట్ కురాసిన ఉత్తరం లో పేర్కొన్నాడు .ఇలాంటి వారి  దుష్ప్రవర్తన ప్రభావం వలనకాని లేక ఏదో సాహసం చేయాలన్న తల౦పు తోకాని దక్షిణ అమెరికా వెళ్లి సంపద సాధించాలనన్నకొ రికతోగాని  ఉండేవాడు .కానీ ఇవన్నీ  ఊహా ప్రపంచపు గాలి సౌదాలేనని తెలుసుకొని వాటి జోలికి పోకుండా ఒక మిసిసిపి పైలట్ దగ్గర అప్రేన్ టిస్ గా చేరాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-5-15 ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -34 15- కవిత్వమే ఉపశమనం గా జీవించిన ఎమిలి డికిన్సన్-2 (చివరిభాగం

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -34

15- కవిత్వమే ఉపశమనం గా జీవించిన ఎమిలి డికిన్సన్-2 (చివరిభాగం )

మూడో ప్రేమా మొగ్గలోనే వాడిపోయింది

రెండవ సారి జరిగిన సంఘటన తో ఎమిలీ డికిన్సన్ మరీ కుంగిపోయింది .తండ్రితో కలిసి ఫిలడెల్ఫియా వెళ్ళింది. అక్కడ రివరెండ్ చార్లెస్ వాడ్స్ వర్త్ గారి బోధన విన్నది .ఆయన అంటే అభిమానం ,ప్రేమ ఆరాధనాకలిగాయి . ఆయన బోధనలుబాగా నచ్చి  ప్రేమలోపడింది .అప్పటికే అతనికి పెళ్లి అయి నలభై ఏళ్ళ వయసులో ఉన్నాడు .ఆమె వయసు ఇరవై మూడో ఇరవై నాలుగో ఉంటుంది అప్పుడు . అతను ఆర్చ్ స్ట్రీట్ ప్రెస్ బిటేరియన్ చర్చి  కి పాస్టర్ గా ఉన్నాడు .చాలా అంకితభావంతో పనిచేస్తున్నాడు .తాను తన బోధనకు ఆకర్షితురాలైన ఎమిలీ గుండెల్లో ప్రేమ జ్వాల రగిలి౦చి నట్లు ఆయనకు తెలియనే తెలియదు . అం హీర్స్ట్  తిరిగి వచ్చేసింది  కాని ఆ మధుర భావనలు ఆమెను వదిలిపెట్టలేదు .అపస్మారకం గా ఆ పాస్టర్ ఆమె మనసులో ఉండిపోయాడు .ఆ తర్వాత ఒకటి రెండు సార్లు ఫిలడేల్ఫియాకు వెళ్ళింది .కాని అంగుళం కూడా ప్రేమ రధం ముందుకు సాగలేదు .అతనిమనసు మార్చలేకపోయింది .అతనితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేదని ఆ గ్రామప్రజలు చెప్పుకొనేవారు. ప్రేమ కవాటం మూసుకు పోయింది . చేసేదిలేక ఈ సంఘటనలను నాటకీయంగా కవితలలో చొప్పించింది .కలలో ఆతనితో సాంగత్యం జరిగినట్లు కవితలు రాసింది .ఇంత చేసినా చివరికి ఎమిలీకి నిరాశే మిగిలింది ‘’అంతా భ్రాంతి యేనా జీవితానా నిరాసేనా “‘’అని దేవదాసులో పార్వతి లాగా పాడుకోవటమే మిగిలింది .తన దుఃఖాన్ని విరహాన్ని చాలా హై పిచ్ లో వ్యక్తం చేసుకొన్నది .అది వాస్తవం కాకపోయినా కలల సౌధం లో విహరించి ఆత్మ తృప్తి పడింది .అందుకోసమే అంటే ఆత్మోపశమానం కోసమే కవిత్వం రాసింది ఎమిలీ డికిన్సన్ .తనను తానూ ఆయనకు అంకితమై పోయినట్లు ,దేవుడు అందరికి అన్నీ  ఇచ్చి తనను నిర్లక్షం చేశాడని బాధ భరించలేనిదని కవితలలో వాపోయింది .

ఎమిలీ మాటలలోనే ఆమె దుఖాన్ని బాధను ప్రేమారాదనను తెలుసుకొందాం –‘’I gave my self to him ‘’,’’mine by the right of the white election ‘’,’’God gave a loaf to every bird ,just a crumb to me ‘’,’’the heart asks pleasure first ‘’,’’I can not live with you ‘’,pain has an element of blank ‘’,the element of blank grew wider ‘’, ఎమిలి ‘’the fugitive whom to know was life ‘’అని భావించిన వాడ్స్ వర్త్ ను 20 ఏళ్ళు చూడనే లేక పోయింది .1880 వేసవి లో ఒకసారి అతను వచ్చాడు .ఆ తర్వాత రెండేళ్లకే అతను చనిపోయాడు .అతని చిత్రం అతను బోధించిన సెర్మన్ ల గ్రంధం ఎమిలీ డికిన్సన్ పదిలంగా గుప్తంగా దాచుకొని  భద్ర పరచిన దాచుకొన్న వాటిలో దొరికాయి .

25 ఏళ్ళు   తనకోసమే తాను జీవించిన ఎమిలి

ఇరవై అయిదేళ్ళు ఎమిలి డికిన్సన్ తనకోసమే తాను జీవించింది .సంగీతం అంటే ఆమెకు అభిమానం .కాని ఇతరులతో కలిసిపాడటానికి ఒప్పుకోనేదికాదు .వాళ్ళు అక్కడమ్యూజిక్ రూమ్ లో  సమూహంగా గానం చేస్తుంటే బయట హాల్ లో ఒంటరిగా కూర్చు౦డిపోయేది .ఇంటి ప్రక్కల ఉన్నవారికి చిన్న చిన్న కవితలు పూలు పంపేది కాని వాళ్ళ ఇళ్ళకు ఎన్నడూ  వెళ్లేదికాదు .ప్రేమికుడు వడ్స్ వర్త్ మరణించిన తర్వాత మరీ ఒంటరిదై పోయింది .అతడు మరణించాడని ఆమె అనుకోలేదు తనలో శ్వాసిస్తున్నాడని భావించేది .తమకు ఎడబాటు అనేది లేదనుకోనేది .’’I do not yet fathom that he had died and hope I may not till he assist me in another world ‘’అని రాసుకొన్నది .ఎనిమిది నెలల తర్వాత ఆమెకు నెర్వస్ బ్రేక్ డౌన్ వచ్చింది .చివరి రోజులలలో తండ్రికి స్నేహితుడైన ‘’జడ్జ్ లార్డ్ ‘’తో సన్నిహితం గా ఉండేది .ఆయన కూడా ఎమిలీకంటే ముందే చనిపోయాడు .బ్రైట్స్ డిసీజ్ అనే వ్యాధి 55 వ ఏట సోకింది ఎమిలీకి .15-5-1886 న ఎమిలీ డికిన్సన్ మరణించింది .

మరణానంతర౦  కవితా సేకరణ ముద్రణ

జీవించి ఉండగా ఏ పుస్తకాన్నీ అచ్చు వేయటానికి ఎమిలీ ఒప్పుకోలేదు .ఆమె మరణం తర్వాతే వాటిని ముద్రించటం జరిగింది .ఇది చాల కష్ట సాధ్యమైన పని అయింది .ఆమె రాసిన వెయ్యి కవితలు వేర్వేరు ప్రదేశాలలో లభించాయి .అవి చిందర వందరగా  గజిబిజిగా రసీదుల వెనకా బ్రౌన్ పేపర్ ల మీదా రాయ బడి ఉన్నాయి .ఒకే పాదానికి అనేక రూపాలూ ఉండేవి .ఒకే పదానికి వేర్వేరు మాటలుకూడా రాయబడి అందులో దేన్నీ స్వీకరించాలో తెలియని సందిగ్ధత కూడా ఏర్పడింది .ఎమిలీ చివరి సంవత్సరాలలో సన్నిహితం గా ఉన్న ప్రక్కింటి యజమాని మేబెల్ లూమిస్ టాడ్  తో ఎమిలీ అన్న కూతురు లవినియ డికిన్సన్ కలిసి ఎలాగో అలాగా కొంత పరిష్కరించి మొదటి భాగం గా 115 కవితలతో ‘’Poems of Emily Dickinson ‘’ పేరుతొ 1890 లో ముద్రించింది .అప్పుడే చిన్న డిక్షనరీ ‘’DICKINSONIANA’’ ప్రచురణ జరిగింది . తర్వాతా ఆమె పూర్తీ కవితలన్నీ ముద్రణకు వచ్చాయి .ఎమిలీ రాసిన ఉత్తరాలు అచ్చు అయ్యాయి .ఆమెపై అనేక జీవిత చరిత్రలు వచ్చాయి .1950లో ఎమిలీ మొత్తం కవితలు ఉత్తరాల వ్రాత ప్రతులన్నీకొని  సేకరించి హార్వర్డ్ యూని వర్సిటి కి అందజేశారు .వీటిని పుస్తకాలుగా ప్రచురించినా ,సాహిత్యాభిమానులకు సంత్రుప్తికలుగలేదు .ఇంకా నాణ్యమైన అధీకృత ప్రచురణలు రావాలని డిమాండ్ చేశారు .చివరికి ఈ బాధ్యతను ప్రముఖ విద్యా వేత్త అమెరికా దేశపు మొట్ట మొదటి ముఖ్య కవి ఎడ్వర్డ్ టేలర్ కవితలను ప్రచురించిన  థామస్ హెచ్ జాన్సన్ కు అప్పగించారు .ఆయన జాగ్రత్తగా ఎడిట్ చేసి  ఎమిలీ కవితలను 1939లో ప్రచురించాడు .

ఏది నిజం ఏది కల్పన

ఎమిలీ కవితలలో నిజం ఎంత?కల్పనా ఎంత అని ఇంతవరకు ఎవరూ విడమర్చి చెప్పలేక పోతున్నారు .విలియం స్టాన్లీ ‘’Emily was a spirit that emerged independent of the material event ‘’అన్నాడు .సంఘటనను అనుభవాన్ని జోడించి అత్యద్భుతంగా రాసిన కవిగా మరో విమర్శకుడు చెప్పాడు .ఆమెలో శైలీ భేదాలు చాలాఉన్నాయన్నారు .ఆమె ఒక సృజన శీల కవి అన్నారుకొందరు .న్యు ఇంగ్లాండ్ అంటే మాసా చూసేట్స్ కు చెందిన హైమ్స్ ను కొత్త తరహాలో కొత్త ధ్వనులతో అమెరికన్ కవిత్వం లో ప్రవేశ పెట్టి కొత్త వొరవడి సృష్టించింది .సమకాలీన కవులకు  దిగ్భ్రమ కల్గించి ,అభిమానులకు ప్రేరణకలిగించి రెండు తరాల తర్వాత కవిత్వ పటుత్వం తో మెప్పించింది .సస్పెండేడ్ రైమ్స్ ,స్లాంట్ రైమ్స్ హాఫ్ రైమ్స్ కు ఆద్యురాలైంది .కొత్త కవిత్వ పరిభాషను సృష్టించింది .ఎన్నో భావచిత్రాలను సృష్టించింది .’’No other poet has accomplished  more dazzling comprehensions –emotional tension is tightened in ‘’death’s  ‘’stiff stare ‘’in the word zero to describe the feeling of horror upon encountering a snake ‘’zero at the bone ‘’అని ఆమె ప్రత్యేకతను కీర్తించారు

శోక తప్త వనితగా ను, ఆనందం తో చిందులు వేసే   చిన్నపిల్లగాను  రెండు విధాలా కవిత్వం రాసింది .అప్పుడప్పుడు ఆమె ‘’స్పాయిల్ద్ చైల్డ్ ‘’అన్న భావనా చదివే వారికి కలిగిస్తుంది .చివరగా ఒక మిస్టరి మిగిలిపోయింది అంటారు రచయిత లూయీ అంటర్ మేయర్ ‘’The mystery of Emily Dickinson is not the way she lived, but the way she wrote ,a mystery which enabled a New England recluse(lonely) to charge the literature of her country with poems she never cared to publish ‘’.

Inline image 1  Inline image 2

Inline image 3

A solemn thing – it was – I said –
A Woman – White – to be –
And wear – if God should count me fit –
Her blameless mystery –
Emily Dickinson, c. 1861[83]
They shut me up in Prose –
As when a little Girl
They put me in the Closet –
Because they liked me “still” –

Still! Could themself have peeped –
And seen my Brain – go round –
They might as wise have lodged a Bird
For Treason – in the Pound –

Emily Dickinson, c. 1862[19]

 

A solemn thing – it was – I said –
A Woman – White – to be –
And wear – if God should count me fit –
Her blameless mystery –
Emily Dickinson, c. 1861[83]
They shut me up in Prose –
As when a little Girl
They put me in the Closet –
Because they liked me “still” –

Still! Could themself have peeped –
And seen my Brain – go round –
They might as wise have lodged a Bird
For Treason – in the Pound –

Emily Dickinson, c. 1862[19]

 

ఎమిలీ సంపూర్తి

మరో ప్రసిద్దునితో మళ్ళీ కలుద్దాం

మీ –దుర్గాప్రసాద్ -28-5-15 ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సిఫా లో భారీ కుంభకోణం

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

పెద్దలు శ్రీ నోరి రామకృష్ణయ్య (చెన్నై )గారి స్పందన

పెద్దలు శ్రీ నోరి రామకృష్ణయ్య (చెన్నై )గారి స్పందనnoriletter 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సురవరం ప్రతాప రెడ్డిగారు –

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Leave a comment

కోట శ్రీనివాసరావుకు నవరస నటనాచక్రవర్తి బిరుదు ప్రదా

కోట శ్రీనివాసరావుకు నవరస నటనాచక్రవర్తి బిరుదు ప్రదానం

  • 28/05/2015
TAGS:

కాచిగూడ, మే 27: పద్మశ్రీ డా.నందమూరి తారకరామారావు 93వ జయంతి సందర్భంగా ప్రముఖ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత కోట శ్రీనివాసరావుకు నవరస నటనాచక్రవర్తి బిరుదు ప్రదానోత్సవ కార్యక్రమం వంశీ ఆర్ట్ థియేటర్ ఇంటర్నేషనల్, జిపి ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరావు హాజరై కోట శ్రీనివాసరావుకు నవరస నటనాచక్రవర్తి బిరుదుతో పాటు ఎన్‌టిఆర్-జిపిఆర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఎన్‌టిఆర్ పేరుతో బిరుదును ప్రదానం చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. కోట శ్రీనివాసరావు తన నటనతో ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. నందమూరి లక్ష్మీపార్వతి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, వంశీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీరామరాజు, ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు, బిజెపి మహిళా మోర్చా సభ్యురాలు కె.మధుబాల, సామాజిక కార్యకర్త అంజనారెడ్డి, కళాపత్రిక సంపాదకులు మహ్మద్ రఫీ, గానసభ అధ్యక్షుడు డా. కళావేంకట దీక్షితులు పాల్గొన్నారు. సభకు ముందు గాయనీ, గాయకులు అలపించిన సంగీత విభావరి అందరినీ అలరించింది.

సేవా రత్న పురస్కారాల ప్రదానం
కాచిగూడ, మే 27: గోల్డెన్ స్టార్ యూత్ కల్చరల్ ఆర్గనైజేషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో సాహితీవేత్త గిరిరాజు విజయలక్ష్మీ సేవారత్న పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మభూషణ్ డా.సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ గిరిరాజు విజయలక్ష్మీ పేరుతో సేవా పురస్కారాలు ప్రదానం చేయడం ఎంతో అభినందనీయమన్నారు. సెంట్రల్ సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు, సాహితీవేత్త డా.శరత్ జ్యోత్నారాణి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో డా.లక్కరాజు నిర్మల, మంగళగిరి ప్రమీలాదేవి, గానసభ అధ్యక్షుడు డా.కళావేంకటదీక్షితులు పాల్గొన్నారు.

మనస్విని నృత్య మందారం
రవీంద్రభారతి, మే 27: చిదంబరంలో శివుడు ఎడమ కాలు పైకెత్తి ఒంటి కాలుతో నాట్యం చేస్తున్నట్లు నటరాజ స్వామిగా సాక్షాత్కరిస్తాడు.. ఈ భంగిమ ఆధారంగా హిందోళ రాగంలో రూపకల్పన చేసిన తిల్లాన అంశాన్ని చిన్నారి మనస్విని ముచ్చటగా రమ్యంగా నర్తించింది. 9వ తరగతిలో అడుగుపెడుతున్న ఈ చిన్నారి బుధవారం సాయంత్రం రవీంద్రభారతిలో భరటనాట్య సంప్రదాయంలో అరంగేట్రం ప్రదర్శించింది. ‘్ధరసమేరా యమునా తీరానా..’ జయదేవుని అష్టపధిని యమన్ కళ్యాణి రాగంలో మంతా శ్రీనివాస్ ఆలపించగా నాట్యాచారిణి మీనాక్షి రవీందర్ నట్టువాంగానికి అనువుగా మనస్విని హృద్యంగా నర్తనచేసి ప్రేక్షకులను అలరించింది. కార్యక్రమంలో ప్రధాన అంశం వర్ణం ‘దానికే తగు జానరా…’ తోడి రాగం, రూపక తాళంలో ఆలపించగా చిన్నారి అభినయానికి ప్రేక్షకులు హర్షధ్వనాలు ప్రకటించారు. ఈ అంశంలో పార్వతీదేవి చెలికత్తె శివుని గురించి కొనియాడుతూ పార్వతీ పరమేశ్వరుల ఆనంద తాండవాన్ని వర్ణించడంను తన అభినయంలో ముచ్చటగా ప్రదర్శించింది. నృత్య కార్యక్రమం పుష్పాంజలితో ప్రారంభమైంది. ఆది గురువు మాతృమూర్తికి, నటరాజస్వామికి, ముక్కోటి దేవతలను ప్రార్థిస్తూ ప్రేక్షక దేవుళ్లకు నమస్కరించి నృత్య కార్యక్రమం శుభ ప్రదం అవ్వాలని ప్రార్థించి రాగమాళికా రాగంలో శ్లోకాలను అభినయించింది. కర్ణాటక దేవగాంధారీ రాగంలో పంచాక్షరీ దేవి కీర్తనను నృత్యం చేస్తూ సృష్టి స్వరూపిణి జగన్మాతను వివిధ అవతారాలతో కొనియాడుతూ అభినయంలో చిన్నారి ప్రార్థించింది. సావేరి రాగంలో జతిస్వరంను కూడా ప్రదర్శించి చివరగా మంగళంతో అనిల్‌కుమార్ వయొలెన్‌తోను, సుధాకర్ వీణా వాయిద్యంతోనూ, నాగేశ్వరరావు మృదంగంతో సహకరించగా నృత్య కార్యక్రమం ముగిసింది. సి.శివశంకర్‌రెడ్డి, సీతాలక్ష్మి మనవరాలు చిన్నారి సి.మనస్విని పుష్పాలతో నాట్యగురువు మీనాక్షి రవీంద్రకుమార్‌కు పాదాలకు నమస్కరించి గురుసత్కారం చేసింది. మనస్విని ఇస్కాన్ ప్రతినిధి రామచంద్రకృపాదాస్, గైనకాలజిస్ట్ డా. మీనా ఉగేల్, గీతాంజలి సంస్థ ప్రిన్సిపల్ మాధవీ చంద్రా, సి.రాజశేఖర్‌రెడ్డి, శారద, నిశ్చల్‌రెడ్డి ఆశీర్వాదించారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

కలిసిసాగుదామని కె సి ఆర్ కు బాబు పిలుపు

Inline image 1
Inline image 2

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -33

.  ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -33

15- కవిత్వమే ఉపశమనం గా జీవించిన ఎమిలి డికిన్సన్

అమెరికన్ కవయిత్రి  ఎమిలీ డికిన్సన్ రాసినవి ఎనిమిది వందల కవితలైనా జీవితకాలం లో ప్రచురింపబడిన కవితలు ఏడు మాత్రమే.దీనికి ఆమె చుట్టూ వ్యాపించిన అంతుతెలియని మిస్టరీ యే కారణం  .యదార్ధం కాని అనేక జీవిత చరిత్రలు ఆమె చుట్టూ అల్లేశారు .అందులో ఊహాగానాలే ఎక్కువై అసలు నిజం మరుగున పడి పోయింది .అయినా శతాబ్దాల కాలం ఆమె అజ్ఞాత వ్యక్తిగా జనం వెంట బడి వదలలేదు .బాలికగా ఉండగానే అద్భుత సౌందర్య వతి అని పించుకోంది.అబ్బాయిల గుండెల్లో గాలమై గుచ్చుకొన్నది .మొదటరాసిన కవిత్వం లో శృంగారమే ఎక్కువ .కాని ముఖం లో ఏభావమూ జ్యోతకంయ్యేదికాదు.ఆకర్షణ తక్కువైనా మనిషి కొట్టొచ్చినట్లు కనిపించటం ఆమె ప్రత్యేకత .నల్ల కంచు రంగు కళ్ళు ,తెల్లటి శరీరం తో టైటాన్ లాగా అగుపించేది .ఫోటో తీయటానికి ఒప్పుకోని ఎమిలీ తానె స్వంతంగా తన చిత్రాన్ని మధురజ్ఞాపికగా చిత్రి౦చు కొన్నది .’’’నా ఫోటోలు ఏవీలేవు .నేను’రేన్ అంటే ముక్కు వంకరగా పొట్టి రెక్కలతో గుండ్రని కురచ తోక తో సన్నని కాళ్ళతో కొంచెం మాత్రమె పొడవుగా ఉన్న ‘’జీవ రాయి పిట్ట ‘’(కంప చిట్ట పిట్ట )లాంటి చిన్నదాన్ని .’’అని చెప్పుకొన్నది .ఇలా తన గురించి చెప్పుకొన్న విషయాలు చాలా అరుదుగా మాత్రమే ఉన్నాయి .

ఒంటరి జీవితం

ఎమిలి డికిన్సన్ అమెరికాలో మాసా చూసేట్స్ రాష్ట్రం లో ఆమ్ హీర్స్ట్ లో 1830 లో డిసెంబర్ 10 న జన్మించింది .ఏ ఇంటిలో పుట్టిందో ఆ ఇంటిలోనే జీవించి ఆ ఇంట్లోనే మరణించింది .ఎప్పుడైనా కొద్దికాలం బయటిప్రదేశాలకు వెళ్ళినా ఆమె అక్కడే ఉండేది ఎప్పుడూ .బాల్యం ఆనందంగా గడిచింది .అన్న విలియం ఆస్టిన్ ,చెల్లెలు లవీనియా ఉండేవారు .ఇరవై ఏళ్ళు వచ్చాక ఒంటరి జీవితానికే అలవాటు పది పోయింది .కాలక్షేపంగా యెడ తెగకుండా లెక్కలేనన్ని కవితలు రాసేది . కాని వాటిని ప్రచురించటానికి ఒప్పుకోనేదికాదు .బయటి ప్రపంచం తో సంబంధమే ఉండేదికాదు ఆమెకు .బయటి ప్రజల పై ఏవగింపు కవితలలో కనిపించేది .తానెవ్వరికి చెందని దానినని బయటివారూ అలాంటివారే అయితే వారితో జతకట్టగలనని ఇది బయటికి చెప్పద్దని చెబితే ఇద్దర్నీ వెలి వేస్తారని  రాసుకొన్నది .ఆకవితలు చూద్దాం –

‘’I am no body !Who are you ?-Are you nobody ,too –Then there is a pair of us –don’t tell !-They would banish us ,you know ‘’

‘’How dearly to be somebody !How public ,like a frog –To tell your name the livelong day –To an admiring bog ‘’

కుటుంబ నేపధ్యం

ఎమిలీ తండ్రి కౌంటీలాయర్ ,శాసన సభ్యుడు ,గవర్నర్ కౌన్సిల్ మెంబర్ .పిల్లలు విద్యలో ఉన్నతి సాధించారు .ఎమిలి మాత్రం ఆటగోలు తనం తో ,ఏదీ పట్టని దానిలాగా ఉండేది .దేవుని గూర్చి తండ్రి గురించి చెప్పేది .ఆమె చెప్పిన దాన్ని బట్టి చూస్తె తండ్రి ఎడ్వర్డ్ డికిన్సన్ అచ్చంగా బ్రౌనింగ్ కవి భార్య అయిన ఎలిజబెత్ బార్రేట్ తండ్రి మౌల్టన్ బారేట్ లాగా ఉండేవాడని పిస్తుంది .కాని కవయిత్రి ఎలిజబెత్ లా కాకుండా.ఎమిలి బాల్యం నుండి తిరుగుబాటు ధోరణి తో ఉండేది .ఎమిలీ ఆమ్ హీర్స్ట్ అకాడెమీ లోను ,మౌంట్ హోలీ యెక్ ఫిమల్ సేమినరి లోను చదివింది .శ్రద్ధగా చదివినట్లు కనిపించేదికాదు .ఏదీ పట్టనట్లే ప్రవర్తించేది .లెక్కలు ,జామెట్రీ ,కేమిస్త్రి ,ఆస్ట్రానమి లలో బాగా అభి వృద్ధి కనపరచినా ఆమెకు చర్చి కట్టుబాట్ల విషయం లో ఇష్టం ఉండేదికాదు ..ఆటగోలు తనం ,ఉండేదని క్రిస్టియన్ గా ఉండటానికి అభ్యంతరం చెప్పేదికాదని ,ఆత్మ న్యూనతా భావం ఉండేదని ఆమె స్నేహితులు చెప్పేవారు ..ఈ మాటే తండ్రితో ‘’నేను చెడ్డ దాన్నే నాన్నా !’’అని చెప్పి ఒక్క ఏడాదిలోనే హోలీ యోక్ కు గుడ్ బై చెప్పేసింది .

ఇరవైలలో ఏదో జరిగి ఉంటుంది

ఎమిలీకి ముప్ఫై ఏళ్ళు వచ్చాక అన్నిటినీ పూర్తిగా విసర్జిన్చేసింది .కాని ఆమె జీవితం లో ఇరవై ముప్ఫై ఎల్లమధ్య ఏదో సం థింగ్ జరిగి ఉంటుందని చరిత్రకారుల నమ్మకం .అందుకే ప్రపంచానికి దూరంగా బతకటం అలవాటు చేసుకొన్నది అని భావన .కనుక శారీరక మానసిక ఉపశమనం కోసం ఏకైక విధానంగా కవిత్వం రాయటం ప్రారంభించి కడదాకా కొన సాగించింది .ఆమె భద్రంగా రహస్యం గా రాసుకొని దాచుకొన్న డైరీ వలన ఈ విషయాలన్నీ వెలుగు లోకి వచ్చాయి .ఆమె జీవితం లో ఓడిపోయిందని అర్ధమవుతుంది .దాన్ని ఆమె ‘’ప్రపంచానికి లేఖ ‘’అని పేరుపెట్టింది .ఇంకేముంది ఊహలు చేసే వారికి చేతినిండా పని దొరికింది .అనేక పుక్కిటి పురాణాలు ఆమె చుట్టూ అల్లారు .అందులో నిజమెంతో కల్పనా ఎంతో తెలియనంత జటిలమైపోయింది ఆమె యదార్ధ జీవితం .1930లో ‘’the life and mind of Emily Dickinson ‘’ అనే పుస్తకాన్ని జేనేవీవ్ టగ్గార్డ్ అనే రచయిత రాసి ప్రచురించాడు .ఎమిలీ జీవితం లో ఇద్దరు ప్రేమికులు ఉన్నారని వారి వలననే ఆమెలోని  శృంగారాభావం తెగిపోయిందని తెలియ జేశాడు .అందులో ఒకడు లియోనార్డ్ హంఫ్రీ అనే అతను ఆమెకు ఇరవై ఏళ్ళు రాకముందే చనిపోయాడు .రెండవ వాడు జార్జి గౌల్డ్ .ఇతను ఆమె తండ్రికి భయపడి దూరమై ఆమెను ఒంటరిదాన్ని చేసి ఇంటి గార్డెన్ కే పరిమితమయ్యేట్లు చేశాడని .కాని ఎమిలీకి అతను అంటే గుండె నిండా ప్రేమ ఉండేదని ,కాని బహిర్గతం కాకుండా అణచు కొన్నదని రాశాడు .కనుక బయటి ప్రపంచం తో సంబంధం లేకుండా ‘’Nun of Amherst ‘’గా మిగిలిపోయిందని చెప్పాడు .

అదే ఏడాది జోసేఫిన్ పోలేట్ అనే ఆతను ‘ఎమిలీ  దికేంసన్  –ది హ్యూమన్ బాగ్రౌండ్ ‘’పేర ఒక పుస్తకం రాసి మూడో వ్యక్తిని చెప్పి అతని వలననే ఆమె ప్రేమ జీవితం భగ్నమైపోయిన్దన్నాడు. ఆ భావాలే ఆమె కవిత్వం లో చోటు చేసుకొన్నాయని తేల్చాడు .యితడు ఎమిలీ కుటుంబానికి అతి సన్నిహితురాలన హెలెన్ హంట్ భర్త ఎడ్వర్డ్ హంట్ .రెండేళ్ళ తర్వాత ‘’ఎమిలి దికేంసన్ ఫేస్ టు ఫేస్ ‘’పుస్తకం రాసిన మార్తా డికేంసన్ బియాంచి అంటే ఎమిలీ మేనకోడలు ఎమిలి కి పెళ్లి అయిన ఒకబ్బాయితో ఎఫైర్ ఉండేదని అతనిభార్యకు అన్యాయం చేయలేక ఎమిలి కుమిలిపోయి ,ఇంటికీ , ఏకాంతానికి  అంకితమై పోయిందని వివరించింది .1938లో మరొక పుస్తకం ‘’దిస్ వజ్ ఏ పోయేట్ ‘’రాసిన జార్జ్ ఫ్రిస్బీ విచేర్ ఈ గాసిప్ లకు స్వస్తిపలికాడు .సూటిగా విషయ పరంగా పరిశోధన చేసి ఆమె జీవితాన్ని ఆవిష్కరించాడు . ఇందులో ఎమిలి కి ఇరవై –ముప్ఫై ఏళ్ళ మధ్యకాలం లో రెండు పెద్ద నష్టాలు జరిగాయని .మొదట గా ఆమె చేత ‘’డియర్ ఫ్రెండ్ అండ్ టీచర్ ‘’అని పించుకొన్న బెంజమిన్ ఫ్రాన్క్లిన్  న్యూటన్  అనే గొప్ప సారస్వతారాధకుడు ,కాలానికంటే ముందు ఆలోచించే బుద్ధి జీవి .ఆమె ఇతని ప్రభావం లో పడేనాటికి అతని వయసు ఇరవై ఏడు –ఆమెకు పద్దెనిమిది .కాని మూడేళ్ళ తర్వాత న్యూటన్  తనకంటే పన్నెండేళ్ళు పెద్దదైన మరో అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .దురదృష్ట వశాత్తు న్యూటన్ రెండేళ్ళ తర్వాత క్షయ వచ్చి చనిపోయాడు ఈ విషయాన్ని థామస్ వెంట్ వర్త్ విద్డింగ్గ్ట న్   అనే ఒక విద్వాంసుడికి ఉత్తరం రాస్తూ ఎమిలీ ‘’నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు .అతను నాకు అమరత్వం (ఇమ్మోర్టాలిటి )బోధించాడు .దానికి దగ్గరవుతున్నసమయం లో అతను మళ్ళీ తిరిగి రాలేదు .తర్వాతా నా గురువు మరణించాడని తెలిసింది ,అప్పటినుంచి నాకు అక్షరమే నా మిత్రమైంది .మరొకాయన నాజీవితం లో ప్రవేశించాడు .కాని ఆయనే నన్ను గురువుగా అనుకోని సంతృప్తిపడక ఈ దేశం వదిలి వెళ్ళిపోయాడు . ఈ రెండు నష్టాలు ఆమె కవిత్వాన్ని భర్తీ చేశాయి .తరచుగా ఆమె రాసిన లైన్లు ‘’ I never lost as much but twice ‘’ఈ విషయాన్ని ద్రువీకరిస్తాయి .కాని ఆ రెండుకవితలు బాగా ప్రాచుర్యం పొందాయి .

1-‘’My life closed twice before its close –It yet remains to see –If immortality unveil –A third event tome ‘’

‘’2-‘’So huge so hopeless to conceive –As these that twice befell -.Parting is all we know of heaven –And all we need of hell ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-5-15 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు

ఆత్మీయ మిత్రులు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి,

       నమస్కారములు !  మీరు ఎంతో భక్తి శ్రద్దలతో రచించి, సంకలనం చేసిన పై గ్రంథం అంది నా డెందమానందమయమైనది. . పరమ పావనుదైన, లోకం లోని భక్తులందరికీ ఆదర్శప్రాయుడైన, రామ భక్తికి మారుపేరైన, శ్రీ ఆంజనేయ స్వామికి భారతదేశంలోనే కాక, విదేశాలలో కూడా నెలకొని ఉన్న ఆయన దేవాలయాల గురించిన  విశేషాలను, అన్నీ స్వయంగా చూడలేని వారికి, కనుల ముందుకు తెచ్చి ఎంతో పుణ్యం కట్టుకున్నారు మీరు.      రాముడంటే హనుమంతుని భక్తి ఎంత పరిపూర్ణమైనదో  ఒక సందర్భంలో నిదర్శనమైనదని పెద్దలు చెప్తారు.
        శ్రీ రామ పట్టాభిషేక సందర్భంలో, శ్రీ రాముడు వానార వీరులన్దరినీ పిలిచి యథోచితంగా బహుమతులిస్తూ సత్కారిస్తాడట. చివరికి, హనుమను పిలిచి, సీతమ్మ వైపు చూస్తాడట. ఆ తల్లి, ఎంతో ప్రేమతో తన కంఠహారాన్ని తీసి బహుమతిగా హనుమకు ఇస్తుందట. హనుమ, ఆ హారాన్ని నిశితంగా పరిశీలిస్తూ, ఆ హారంలోని ముత్యాలను ఒక్కొక్కదానిని కొరికి, చూసి, పెదవి విరిచి పారవేస్తాదట. అది చూసి, సీతమ్మ కినుక వహిస్తూ రామునివైపు, ‘అదేమిటి ? ఇలా ప్రవర్తిస్తున్నాడు ?‘ అని ప్రశ్నార్థకంగా చూస్తుందట. రామచంద్రుడు నవ్వి, హనుమ వైపు చూసి అంటాడట:” హనుమా, సీత ఎంతో ప్రేమతో తన కంఠ హారాన్ని తీసి నీకు ప్రత్యేకంగా ఇస్తే, నువ్వలా కొరికి పారవేస్తావేమిటీ ?  ఆమెకు కోప వచ్చింది  !”.
      దానికి హనుమ వినయ వినమిత గాత్రంతో, ‘స్వామీ ! ఏమని చెప్పేది ?  నాకు లోపలా బయటా, అంతటా నా  రాముడే కనపడతాడు !  మరి ఈ హారంలో ఏ కోశాన అయినా, ‘నా రాముడు కనబడతాదేమోనని, వెతుకుతున్నాను. అలా కనపడక పోయేటప్పటికి, ‘నా రాముడు లేని ఈ ముత్యాలు నాకెందుకూ’ అని పారవేస్తున్నాను. అంతే  !’ అంటాడట. పుత్ర సమానుడైన, ఆ భక్త పరాయణుడి రామ భక్తికి, ఎంతో మెచ్చుకుని సీతమ్మ కూడా సంతృప్తి చెందుతుందట. తనకు తెలుసు కాబట్టి, రామ చంద్రుడు చిరునవ్వుతో హనుమను ఆశీర్వదిస్తాడట’
         ఈ ఘట్టాన్ని గురించి,  ఎక్కడో కొన్ని సంవత్సరాల  క్రితం ఒక ఉపన్యాసంలో విన్నాను. ఎవరి భక్తి  ఐనా, అలా  అంకిత భావంతో, ‘ఆత్మార్పణ’ భావంతో, నిర్మలంగా ఉండాలని చెప్పటానికి ఈ ఘట్టం నిదర్శనంగా చెప్తారు.
         అటువంటి, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాలను మీరు పరిచయంచేసి ధన్యులయారు. గ్రంథం ఆత్మీయతతో పంపినందుకు, శతాధిక ధన్యవాదాలు. ఈరకంగా, మీరు ఈ వయసులో కూడా  సాహిత్య, వేదాంత సేవ చేస్తూ తరిస్తున్నారని నా భావన. ఇలాగే, మీ నిస్వార్ధ సేవ కొనసాగాలనీ, అందుకు ఆ పరమేశ్వరుడు మీకు నిండు ఆయురారోగ్యాలను ప్రసాడించాలనీ, ప్రార్థిస్తూ, సెలవు.
మీ గీతాంజలి మూర్తి 


మీ గీతాంజలి మూర్తి 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కేజ్రి బ్రహ్మాస్త్రం -చేత తక్కువ మోత ఎక్కువ -ఇండియా గే ట్ కృష్ణారావు

Inline image 1


 
 
Inline image 2

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

రాజధాని మాస్టర్ ప్లాన్ – ఇదే

unname6

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment